సీఎం జగన్‌ను కలిసిన ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌ | AP Government Employees Federation Meet CM YS Jagan | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌

Published Thu, Jul 29 2021 7:26 PM | Last Updated on Thu, Jul 29 2021 7:37 PM

AP Government Employees Federation Meet CM YS Jagan - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ సభ్యులు కలిశారు. వీఆర్‌వోలను సీనియర్‌ అసిస్టెంట్‌లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం తన క్యాంప్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ సభ్యులు కలిశారు. వీఆర్‌వోలను సీనియర్‌ అసిస్టెంట్‌లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ను ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌ ఛైర్మన్ కే.వెంకట్రామిరెడ్డి, సెక్రటరీ అరవపాల్‌, వీఆర్‌వో సంఘం ప్రతినిధులు రవీంద్రరాజు, రాజశేఖర్‌, లక్ష్మీనారాయణ, అనిల్‌ సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement