వంశీపై కూటమి కుట్రలు.. మరో కేసు నమోదు | AP Police Filed Another Case On Vallabhaneni Vamshi, Watch News Video For Details | Sakshi
Sakshi News home page

వంశీపై కూటమి కుట్రలు.. మరో కేసు నమోదు

May 16 2025 12:13 PM | Updated on May 16 2025 1:46 PM

AP Police Case Filed On Vallabhaneni Vamshi

సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వంశీపై తాజాగా మరో కేసు నమోదు చేశారు పోలీసులు. గన్నవరంలో మైనింగ్ అక్రమాలపై ఏడీ ఫిర్యాదుతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

ఇప్పటికే వంశీకి ఐదు కేసుల్లో బెయిల్‌ మంజూరు అయినప్పటికీ కూటమి సర్కార్‌ మాత్రం తప్పుడు కేసులతో వంశీ​కి బెయిల్‌ రాకుండా అడ్డుకుంటోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్‌పై నేడు కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇంతలో నిన్న నూజివీడు పోలీసులు.. వంశీపై పీటీ వారెంట్‌ దాఖలు చేశారు. ఈరోజు మరో కేసు నమోదు చేశారు. గన్నవరంలో జరిగిన మైనింగ్‌పై 58 పేజీలతో గనుల శాఖ ఏడీ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, క్రైమ్ నెం.142/2025తో గన్నవరం పీఎస్‍లో వంశీపై కేసు నమోదైంది. ఇలా.. వంశీపై ఏదో ఒక కేసు పెడుతూ వంశీకి బెయిల్ రాకుండా  కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. సర్కార్‌ తీరు కారణంగా వంశీ.. 90 రోజులుగా విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement