అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి | 4 Died In Car And Vehicle Road Accident At Annamayya District, More Details Inside | Sakshi
Sakshi News home page

అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

Published Sat, Jul 6 2024 7:39 AM | Last Updated on Sat, Jul 6 2024 9:59 AM

Car And Vehicle Road Accident At Annamayya District

సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం కారును ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. దీంతో, స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

వివరాల ప్రకారం.. రామాపురం మండలం కొండవాండ్లపల్లి సమీపంలో గుర్తు తెలియని వాహనం కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతిచెందారు. గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టినట్టు తెలిపారు. అయితే, సదరు కారు కడప నుంచి రాయచోటికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement