అది నేనే.. ఇది నేనే..! | Chandrababu Naidu Fake Promises In Naravaripalle Tour, Check Out What He Said To Public | Sakshi
Sakshi News home page

అది నేనే.. ఇది నేనే..!

Jan 16 2025 8:54 AM | Updated on Jan 16 2025 11:52 AM

Chandrababu Fake Promises in Naravaripalle

 ప్రకృతి వ్యవసాయం నేనే ప్రారంభించా 

 ప్రతి ఇంట్లో విద్యుత్‌ ఉత్పత్తి చేయిస్తా 

 నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు 

తిరుపతి రూరల్‌/చంద్రగిరి: దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రకృతి వ్యవసాయాన్ని తానే ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంగళవారం నారావారిపల్లె పర్యటనలో భాగంగా గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. స్వర్ణ నారావారిపల్లె విజన్‌ తీసుకువస్తున్నామని వెల్లడించారు. అన్నీ నేనే చేశా.. అన్నీ నేనే చేస్తానంటూ హామీలు గుప్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..

ప్రకృతి సేద్యం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. అప్పట్లోనే కుప్పంలో నేనే ప్రారంభించా.

నారావారిపల్లె పరిధిలోని ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రణాళికలు తయారు చేయాల ని కలెక్టర్‌కు సూచించా.

శ్రీసిటీ సౌజన్యంతో రంగంపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పలు సౌకర్యాలు, ఏఐ టెక్నాల జీ ల్యాబ్‌ ఏర్పాటు చేస్తాం.

ఫిబ్రవరి లోపు వందశాతం మరుగుదొడ్లు నిర్మిస్తాం.

జల్‌ జీవన్‌ మిషన్‌ కింద రక్షిత మంచినీరు నిరంతరం అందిస్తాం.

ప్రతి ఇంటికీ సోలార్‌ విద్యుత్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయిస్తాం.

రంగంపేట నుంచి భీమవరం, మంగళం పేట వరకు రూ.8కోట్లతో రోడ్లు నిర్మిస్తాం.

ప్రతి వీధికీ సీసీ రోడ్డు ఉండేలా చర్యలు చేపడతాం.

విద్యార్థులు, గృహిణులు చదువుకునేందుకు, పనిచేసేందుకు ఐటీ టవర్‌ నిర్మిస్తాం.

కల్యాణీ డ్యామ్‌ను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేస్తామని సీఎం వెల్లడించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు.

పుణ్యక్షేత్రంలో పాపాల భైరవులు ఎవరు?


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement