
తిరుపతి సిటీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డాక్టర్ డీవై చంద్రచూడ్ మంగళవారం తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ న్యాయశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో వర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరగనున్న బీఏ ఎల్ఎల్బీ ఇంటిగ్రేటెడ్ కోర్సు పదవ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఉపన్యసించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు, వర్సిటీ అధికారులు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.