DY Chandrachud
-
న్యాయ వ్యవస్థపై ఒత్తిళ్లు లేవు
న్యూఢిల్లీ: భారతదేశం ఏకైక రాజకీయ పార్టీ ఆధిపత్యం చెలాయించే దేశంగా మారిపోతోందన్న వాదనను సుప్రీంకోర్టు(Supreme Court) మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్( DY Chandrachud) తిరస్కరించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు సైతం బలంగా ఉన్నాయని చెప్పారు. తాను సీజేఐగా పనిచేసినప్పుడు రాజకీయ పార్టీల నుంచి, ప్రభుత్వ వర్గాల నుంచి తనపై ఎలాంటి ఒత్తిళ్లు రాలేదని స్పష్టంచేశారు. ఇండియాలో న్యాయ వ్యవస్థ చట్టపరిధిలోనే పనిచేస్తోందని ఉద్ఘాటించారు. న్యాయ వ్యవస్థపై ఒత్తిళ్లు ఉన్నట్లు తాను భావించడం లేదన్నారు. తాజాగా బీబీసీ ‘హర్డ్టాక్’ఇంటర్వ్యూ(BBC Hard Talk interview)లో జర్నలిస్టు స్టీఫెన్ సకర్ అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. పలు అంశాలను ప్రస్తావించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ ఆధిపత్యం కింద ఇండియా ఏక పార్టీ రాజ్యంగా మారుతోందన్న వాదనను తాను అంగీకరించలేనని పేర్కొన్నారు. ఈ మేరకు 2024 లోక్సభ ఎన్నికలకు ముందు న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వెలువడిన సంపాదకీయాన్ని ఖండించారు.అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ప్రాంతీయ పార్టీలతోపాటు రాష్ట్రస్థాయిలో రాజకీయాలకు ప్రాధాన్యం పెరుగుతోందని చెప్పడానికి 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయని, దేశంలో ప్రాంతీయ ఆకాంక్షలు, గుర్తింపునకు ప్రాధాన్యం నానాటికీ పెరుగుతోందని వివరించారు. సుప్రీంకోర్టు పట్ల ప్రజల విశ్వాసంసొంత పార్టీ నాయకులను రక్షించుకోవడానికి, రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి న్యాయ వ్యవస్థపై అధికార పార్టీ ఒత్తిడి పెంచుతోందని ఆరోపించడం సరైంది కాదని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. అలాంటి ఒత్తిళ్లేవీ తనకు ఎదురు కాలేదన్నారు. పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ అనర్హతకు గురయ్యారని, ఆ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించిందని గుర్తుచేశారు.ఆయన పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగే అవకాశం కల్పించిందని అన్నారు. పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఇండియా కోర్టులు స్థిరంగా పరిరక్షిస్తున్నాయని చెప్పారు. ఎన్నో కేసుల్లో నిందితులకు బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడేందుకే కోర్టులు ఉన్నాయని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు స్పష్టం చేసిందని వివరించారు. కొన్ని కేసుల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చని, అయినప్పటికీ పౌరుల స్వాతం్రత్యాన్ని కాపాడే విషయంలో సుప్రీంకోర్టు ముందు వరుసలో ఉంటోందని పేర్కొన్నారు. అందుకే ప్రజలు సుప్రీంకోర్టు పట్ల సంపూర్ణ విశ్వాసం చూపుతున్నారని వెల్లడించారు.లింగ వివక్ష, వారసత్వ జాడ్యం లేదుభారత న్యాయ వ్యవస్థపై ఆగ్రవర్ణ హిందూ పురుషులు పెత్తనం చెలాయిస్తున్నారని, ఇక్కడ కూడా వారసత్వ జాడ్యం కనిపిస్తోందన్న అభిప్రాయాన్ని జస్టిస్ చంద్రచూడ్ ఖండించారు. న్యాయ వ్యవస్థలో లింగ వివక్ష భారీగా తగ్గిపోయిందని అన్నారు. దేశవ్యాప్తంగా జిల్లా కోర్టుల్లో కొత్తగా చేరుతున్న వారిలో 50 శాతానికిపైగా మహిళలే ఉంటున్నారని గుర్తుచేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ సంఖ్య 60 నుంచి 70 శాతం ఉందన్నారు. న్యాయ విద్య మహిళలకు చేరువవుతోందని తెలిపారు. లా స్కూళ్లలో మహిళల ప్రవేశాలు పెరుగుతున్నాయని, వారు ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారని చెప్పారు.న్యాయవాదులు, న్యాయమూర్తులు వారసత్వంగా కోర్టుల్లో చేరుతున్నట్లు తాను అనుకోవడం లేదన్నారు. తన తండ్రి వై.వి.చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారని గుర్తుచేశారు. సీజేఐగా ఉన్నంత కాలం కోర్టులో అడుగుపెట్టొద్దంటూ తన తండ్రి తనకు చెప్పారన్నారు. దీంతో హార్వర్డ్ లా స్కూల్లో మూడేళ్లు చదివానని, తన తండ్రి రిటైర్ అయిన తర్వాతే మొదటిసారి కోర్టులో అడుగుపెట్టానని వెల్లడించారు.ఇండియాలో చాలామంది లాయర్లు, జడ్జిలకు ఎలాంటి న్యాయ నేపథ్యం లేదన్నారు. అయోధ్య రామమందిరం, ఆర్టీకల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వంటి కీలక అంశాలపై నిబంధనల ప్రకారమే తీర్పులు ఇచ్చినట్లు జస్టిస్ చంద్రచూడ్ స్పష్టంచేశారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, రాజకీయ వాస్తవికతల మధ్య చక్కటి సమతుల్యత పాటిస్తూ నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. అది మర్యాదపూర్వక కలయిక గత ఏడాది వినాయక చవితి సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ నివాసంలో నిర్వహించిన వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హాజరైన సంగతి తెలిసిందే. సీజేఐ ఇంటికి ప్రధానమంత్రి రావడం అత్యంత అరుదు. ఈ ఉదంతం అప్పట్లో తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. సీజేఐని ప్రభావితం చేసేందుకు మోదీ ప్రయత్నిచారని మండిపడ్డాయి. ఈ అంశంపై జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు.ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగానే తన నివాసానికి వచ్చారని చెప్పారు. దీనిపై అతి విశ్లేషణ అవసరం లేదని అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లోని వ్యక్తుల మధ్య ఉండే కనీస మర్యాదలను అర్థం చేసుకొనేటంత పరిపక్వత మన వ్యవస్థకు ఉందని వ్యాఖ్యానించారు. ఇలాంటి మర్యాదపూర్వకమైన కలయికల ప్రభావం కేసుల విచారణపై ఎంతమాత్రం ఉండదన్నారు.ప్రధాని మోదీ తన నివాసానికి రాక ముందు, వచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఎన్నో తీర్పులు వెలువరించిందని, ఇందులో ప్రభుత్వానికి ప్రతికూలంగా వచ్చిన తీర్పులు సైతం ఉన్నాయని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ న్యాయ వ్యవస్థ పాత్ర పార్లమెంట్లో ప్రతిపక్షం పోషించే పాత్రలాంటిది కాదని జస్టిస్ చంద్రచూడ్ వివరించారు. కేసులను విచారించడం, చట్టబద్ధమైన పాలన కొనసాగేలా చూడడం మాత్రమే న్యాయ వ్యవస్థ బాధ్యత అని తేల్చిచెప్పారు. -
‘స్వలింగ వివాహాల’పై తీర్పు సరైనదే: సుప్రీం
న్యూఢిల్లీ: దేశంలో స్వలింగ వివాహాల విషయంలో సుప్రీంకోర్టు తన వైఖరిని మరోసారి కుండబద్ధలు కొట్టినట్లు తేల్చేసింది. స్వలింగ వివాహాలకు చట్టపరంగా ఎలాంటి గుర్తింపు ఇవ్వలేమంటూ గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు నిరాకరించింది. ఈ తీర్పును మళ్లీ క్షుణ్నంగా పరిశీలిచాలంటూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. స్వలింగ వివాహాలకు చట్టపరంగా గుర్తింపు ఇవ్వడానికి రాజ్యాంగబద్ధంగా ఎలాంటి ఆధారం లేదని 2023 అక్టోబర్లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు సామాజిక కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, ఇంటర్సెక్స్ తదితర వర్గాలు ఆందోళనకు దిగాయి. స్వలింగ వివాహాలపై అప్పట్లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం ఆయా పిటిషన్లను పరిశీలించింది. 2023 నాటి తీర్పులో ఎలాంటి పొరపాటు లేదని తేల్చిచెప్పింది. అప్పటి తీర్పులో వెల్లడించిన అభిప్రాయాలు చట్టానికి అనుగుణంగానే ఉన్నాయని వివరించింది. ఆ తీర్పులో కలుగజేసుకోవాల్సిన అవసరం లేదని ఉద్ఘాటించింది. రివ్యూ పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టంచేసింది. -
మాజీ సీజేఐపై ఆరోపణలు.. పిటిషన్ను కొట్టేసిన లోక్పాల్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్పై అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసును లోక్పాల్ కొట్టివేసింది. తన న్యాయ పరిధికి మించిన అంశమని ఒక ఉత్తర్వులో పేర్కొంది. ఓ రాజకీయ పార్టీని, ఓ రాజకీయ నేతను కాపాడేందుకు తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ గతేడాది అక్టోబర్ 18వ తేదీన అప్పటి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్పై ఫిర్యాదు అందింది. గతేడాది నవంబర్ 10వ తేదీన పదవి నుంచి ఆయన రిటైరయ్యారు. లోక్పాల్, లోకాయుక్త చట్టంలోని సెక్షన్–14 ప్రకారం సిట్టింగ్ సీజేఐ, సుప్రీంకోర్టు జడ్జీలు తమ న్యాయపరిధిలోకి రారని, ఈ అంశాన్ని పరిశీలించరాదని నిర్ణయించుకున్నామని లోకా యుక్త ఈ నెల 3న జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. చట్ట ప్రకారం ఇతర మార్గాలను అనుసరించే స్వేచ్ఛ పిటిషనర్కు ఉందని తెలిపింది. -
జస్టిస్ చంద్రచూడ్పై మొయిత్రా విమర్శలు
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ను లక్ష్యంగా చేసుకుని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా శుక్రవారం లోక్సభలో చేసిన విమర్శలు తీవ్ర కలకలం రేపాయి. అంతేగాక విమర్శించే గొంతుకలన్నింటినీ నొక్కేయడమే లక్ష్యంగా దేశంలో సర్వ వ్యవస్థలనూ మోదీ సర్కారు చెరబడుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసే క్రమంలో ప్రత్యేక కోర్టు జడ్జి బి.హెచ్.లోయా మృతి అంశాన్ని ఆమె ప్రస్తావించడంతో సభలో దుమారం రేగింది. లోయాది అత్యంత అకాల మరణమన్న మొయిత్రా వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘అత్యంత తీవ్ర ఆరోపణలివి. దీనిపై కచ్చితంగా తగిన రీతిలో పార్లమెంటరీ చర్యలుంటాయి. మొయిత్రా తప్పించుకోలేరు’’ అన్నారు. మొయిత్రా ప్రసంగ రికార్డులను స్పీకర్ ఓం బిర్లా పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. ఆమెపై మరోసారి అనర్హత వేటు తప్పదంటున్నారు. నోటుకు ప్రశ్నల ఆరోపణలపై గత లోక్సభలో మొయిత్రా సభ్యత్వం రద్దవడం తెలిసిందే. లోయా 2014లో రాజకీయంగా సొహ్రాబుద్దీన్ షేక్ హత్య కేసును విచారిస్తుండగా వివాదాస్పద రీతిలో మృతి చెందారు. దాని వెనక బీజేపీ హస్తముందనేలా విపక్షాలు ఆరోపించాయి. ఆయనది సహజ మరణమేనని సుప్రీంకోర్టు నిర్ధారించింది.సీజేఐలపై తీవ్ర వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని హత్య చేసేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయతి్నస్తోందంటూ మొయిత్రా తన ప్రసంగంలో విరుచుకుపడ్డారు. మోదీ సర్కారు చేతిలో వెయ్యి కత్తి పోట్లతో రాజ్యాంగం నిలువెల్లా రక్తమోడుతోందన్నారు. ఈడీ, సీబీఐ వంటివాటిని చివరికి వసూళ్ల సంస్థలుగా, ఈసీ వంటివాటిని జేబు సంస్థలుగా మార్చుకుందని ఆక్షేపించారు. ఆ క్రమంలో జస్టిస్ చంద్రచూడ్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానాల్లో కొందరు దేశ అత్యున్నత న్యాయస్థానాల సమగ్రతను, స్వతంత్ర ప్రతిపత్తిని పణంగా పెట్టేందుకు ప్రయతి్నంచారు! తాజా మాజీ సీజేఐ హయాంలో కొందరికే బెయిళ్లు మంజూరయ్యాయి. ఒక వర్గం వారికి మొండిచెయ్యి చూపారు. వారికి ఆయన అక్షరమాలలో స్థానమే లేకుండా పోయింది. ఆ మాజీ సీజేఐ ప్రవర్తన చివరికి సుప్రీంకోర్టు రాజకీయ ప్రతిపక్షంలా వ్యవహరించరాదనే వ్యాఖ్యలకూ కారణమైంది. విపక్ష పాత్ర పోషించేందుకు మేమున్నాం. అందుకు సుప్రీంకోర్టు అవసరమేమీ లేదు’’ అన్నారు. జస్టిస్ చంద్రచూడ్ తన నివాసంలో గణేశ్ చతుర్థి వేడుకలకు ప్రధాని మోదీని ఆహా్వనించడాన్ని మొయిత్రా తీవ్రంగా తప్పుబట్టారు. మోదీని దేవునితో పోలుస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘న్యాయమూర్తులు తీర్పులు రాసేందుకు తర్కం, చట్టం, రాజ్యాంగానికి బదులు ఇలా దేవునితో ప్రైవేట్ సంభాషణలపై ఆధారపడే పరిస్థితిని బహుశా మన రాజ్యాంగ నిర్మాతలు ఎన్నడూ ఊహించి కూడా ఉండరు. మాజీ, ప్రస్తుత సీజేఐలందరికీ నాదో సలహా. ఇలా దేవుడి నుంచి సూచనలు అందుకోవడం మానేయండి. వ్యక్తిగత వేడుకలకు రాజకీయ పెద్దలను అతిథులుగా పిలిచి వాటిని టీవీ సర్కస్లుగా మార్చకండి. మీ ఏకైక అతిథి రాజ్యాంగమే. అది మాత్రమే మీ ఇంట్లో కొలువుదీరే దేవుడు కావాలి. మీరు మిగల్చబోయే వ్యక్తిగత వారసత్వం గురించి ఆందోళన పడటం ఆపేయండి. ఎందుకంటే అలా వ్యక్తిగత గుర్తింపు కోరుకునే వాళ్లు ఎలాంటి వారసత్వమూ మిగల్చలేరు. మౌలిక హక్కులను పరిరక్షించేవారు మాత్రమే గుర్తుండిపోతారు’’ అన్నారు. -
న్యాయవ్యవస్థ ప్రతిపక్ష పాత్రేం పోషించదు: డీవై చంద్రచూడ్
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ ఉన్నది ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కాదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ పార్లమెంట్లో, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షాల పాత్రను పోషించాలని ప్రజలు భావించకూడదని అన్నారు. చట్టాలను సమీక్షించడానికి, పరిరక్షించడానికే న్యాయవ్యవస్థ ఉందని అన్నారాయన. మీడియా, దర్యాప్తు సంస్థలు, న్యాయవ్యవస్థల పాత్ర కూడా తామే పోషించాల్సి వస్తోందని ఇటీవల లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ వ్యాఖ్యానించారు. తాజాగా ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. రాహుల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షానికి ప్రత్యేక స్థానం ఉందని నొక్కి చెప్పారు.ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై మాట్లాడటం తనకు ఇష్టం లేదని చెప్పిన జస్టిస్ చంద్రచూడ్.. తాను ఇక్కడికి వచ్చింది ఆ విషయంపై మాట్లాడడానికి కాదన్నారు. ‘ఈ వివాదంలో ప్రతిపక్ష నేతలతో నేను స్వరం కలపాలనుకోవడం లేదు. ఎందుకంటే ఆ విషయం మాట్లాడేందుకు నేను ఇక్కడికి రాలేదు. కానీ ఒక్క విషయం చెప్పదల్చుకొన్నాను. పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్షాల పాత్రను న్యాయవ్యవస్థ పోషించాలని ప్రజలు అనుకోకూడదు. న్యాయవ్యవస్థ చట్టసభలలో ప్రతిపక్షంలా ఉండాలనేదే తప్పుడు భావన. అది నిజం కాదు. .. మేమున్నది చట్టాలను పరిశీలించడానికి. కార్యనిర్వాహక వర్గం చర్యలు చట్టాలకు లోబడి ఉన్నాయో, లేదో సమీక్షించే బాధ్యత మాపై ఉంది. రాజకీయ ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్యంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. కానీ ప్రజలు న్యాయ వ్యవస్థలను వాడుకొంటున్నారు. దాని భుజాల మీద నుంచి తుపాకీ కాలుస్తున్నారు. కోర్టులను రాజకీయ ప్రతిపక్షాల కేంద్రంగా మారుస్తున్నారు’ అని చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.ఇటీవల ఓ సందర్భంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మీడియా, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థల తరపున కూడా తాము ఒంటరిగానే పనిచేస్తున్నామని, భారతదేశ వాస్తవికత ఇదేనని విమర్శించారు. -
సోషల్ మీడియా దన్నుతో... తీర్పులను ప్రభావితం చేసే యత్నాలు
న్యూఢిల్లీ: కోర్టుల తీర్పులను ప్రభావితం చేయడానికి కొన్ని ఒత్తిడి గ్రూప్లు ప్రయత్నిస్తున్నాయని, అందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. తీర్పులను ప్రభావితం చేయడం ద్వారా సొంత ప్రయోజనాలు సాధించుకోవాలని ఆశిస్తున్న ఇలాంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని న్యాయమూర్తులకు సూచించారు. ‘‘యూట్యూబ్లో 20 సెకండ్ల వీడియో చూసి ప్రజలు అభిప్రాయం ఏర్పర్చుకుంటున్న పరిస్థితి! వారిపై సోషల్ మీడియా విపరీతమైన ప్రభావం చూపుతోంది. అభిప్రాయాలను నిర్దేశిస్తోంది. ఇది ప్రమాదకర పరిణామం’’ అన్నారు. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు, తీసుకున్న నిర్ణయాలకు ఆధారం ఏమిటన్నది తెలుసుకొనే అవకాశం, దానిపై అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ప్రజలకు ఉన్నప్పటికీ అది జడ్జిలను టార్గెట్ చేసేలా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ప్రత్యేకంగా కొందరు జడ్జిలను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు నిజంగా భావవ్యవస్థీకరణ స్వేచ్ఛ అంటే ఇదేనా? అనే ప్రశ్న తలెత్తుతుందని పేర్కొన్నారు. ఆదివారం ఎన్డీటీవీ ఆధ్వర్యంలో జరిగిన సంవిధాన్–75 సదస్సులో జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగించారు. ఎలాంటి ఆంక్షలు, నిరోధకాలు, బాధ్యతలు లేకుండా ఇలా ప్రైవేట్ పౌరుడిగా ఉండడం చాలా అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ నెల 10న పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థను జస్టిస్ చంద్రచూడ్ సమరి్థంచారు. న్యాయమూర్తులు సైతం నిరభ్యంతరంగా రాజకీయాల్లో చేరవచ్చని, రాజ్యాంగం అందుకు ఎలాంటి అడ్డుకట్టలు వేయడం లేదని పేర్కొన్నారు. క్రికెట్ తనకు చాలా ఇష్టమైన క్రీడ అని చెప్పారు. జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ తన అభిమాన క్రికెటర్లు అని వ్యాఖ్యానించారు. ఒకప్పటి క్రికెటర్లలో రాహుల్ ద్రవిడ్ను అభిమానిస్తానని తెలిపారు. -
నూతన సీజేఐ జస్టిస్ ఖన్నా ప్రమాణ స్వీకారం నేడు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నా రు. రాష్ట్రపతి భవన్లో ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జస్టిస్ ఖన్నా ఆరు నెలలపాటు సీజేఐగా కొనసాగుతారు. ఆయన పదవీ కాలం వచ్చే ఏడాది మే 13వ తేదీన ముగియనుంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆదివారం పదవీ విరమణ చేశారు. ఆయన సిఫార్సు మేరకు నూతన సీజేఐగా జస్టిస్ ఖన్నాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 24న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. న్యాయ వ్యవస్థతో సుదీర్ఘ అనుబంధం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జస్టిస్ సంజీవ్ ఖన్నాకు న్యాయ వ్యవస్థతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన 1960 మే 14న జని్మంచారు. ఆయన తండ్రి జస్టిస్ దేవ్రాజ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్ ఖన్నా ఢిల్లీలోని మోడ్రన్ స్కూల్లో చదువుకున్నారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ అనంతరం ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన క్యాంపస్ లా సెంటర్లో న్యాయ విద్య అభ్యసించారు. 1983లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో అడ్వొకేట్గా చేరారు. తొలుత తీస్హజారీ కాంప్లెక్స్లోని జిల్లా కోర్టుల్లో, తర్వాత ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆదాయపు పన్ను విభాగంలో సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా పని చేశారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సేవలందించారు. ఢిల్లీ హైకోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, అమికస్ క్యూరీగా ఎన్నో క్రిమినల్ కేసుల్లో సమర్థంగా వాదించి పేరు తెచ్చుకున్నారు. 2005 జూన్ 24న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఏడాది తిరగకుండానే శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. హైకోర్టు న్యాయమూర్తుల్లో ఆయన కంటే 32 మంది సీనియర్లున్నా వారిని కాదని జస్టిస్ ఖన్నాకు పదోన్నతి దక్కడం వివాదాస్పదంగా మారింది. అయినా ఆయన నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పలు కీలక తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనాల్లో జస్టిస్ ఖన్నా సభ్యుడిగా ఉన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేసిన ధర్మాసనంలో ఆయన సభ్యుడు. ఆరి్టకల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేశారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వాడకాన్ని సమర్థించారు. బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రత్యేక శ్రద్ధ చూపుతారని పేరుంది. అనవసరమైన వాయిదాలకు తావు లేకుండా వేగంగా న్యాయం చేకూర్చడంలో ఆయన దిట్ట అని న్యాయవాద వర్గాలు చెబుతాయి. ఇక ఇంట్లోనే మార్నింగ్ వాక్ తెల్లవారుజామునే ట్రాక్ ప్యాంట్, ఆఫ్ హ్యాండ్స్ టీ షర్ట్తో ఢిల్లీ వీధుల్లో వాకింగ్ చేయడం జస్టిస్ ఖన్నాకు చాలా ఇష్టం. అనేక సందర్భాల్లో ఆయన మార్నింగ్ వాక్ గురించి ప్రస్తావించారు. ‘‘ఉదయాన్నే వాకింగ్ చేస్తే రోజంతా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి ఆలోచనలు వస్తాయి’’ అంటారాయన. సీజేఐగా బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఇకపై మార్నింగ్ వాక్కు ఆయన స్వస్తి పలకనున్నట్లు తెలిసింది. వాకింగ్తో పాటు జిమ్ వంటి కసరత్తులన్నీ ఇంట్లోనే చేయనున్నారు. -
రేపు సీజేఐగా సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం
ఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీకాలం ఇవాళ్టి(ఆదివారం)తో ముగిసింది. దీంతో సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ సంజీవ్ ఖన్నా.. 51వ భారత ప్రధాన న్యాయమూర్తిగా రేపు(సోమవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక.. ఆయన వచ్చే ఏడాది మే 13 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. ఇవాళ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ విరమణ చేశారు.జస్టిస్ ఖన్నా 1960 మే 14న జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసించారు. 1983లో న్యాయవాద వృత్తిలో అడుగుపెట్టారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో అడ్వొకేట్గా నమోదయ్యారు. వేర్వేరు కోర్టుల్లో పనిచేశారు. తీస్ హజారీ జిల్లా కోర్టు, ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా వ్యవహరించారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2006లో అదే కోర్టులో శాశ్వత జడ్జిగా చేరారు. ఢిల్లీ జ్యుడీషియల్ అకాడమీ, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ చైర్మన్గా సేవలందించారు. వృత్తిలో అంచెలంచెలుగా ఎదుగుతూ 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా, భోపాల్లోని నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ గవరి్నంగ్ కౌన్సిల్ సభ్యుడిగానూ పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఖన్నా పలు కీలక తీర్పులు వెలువరించారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలకు(ఈవీఎంలు) సంబంధించి వీవీప్యాట్లలోని 100 శాతం ఓట్లను లెక్కించాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ దాఖలు చేసిన పిటిషన్ను 2024లో కొట్టివేసిన డివిజన్ బెంచ్కు ఆయన నేతృత్వం వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని 2024లో చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఆరి్టకల్ 370ని రద్దు చేయడాన్ని సమర్థిస్తూ 2023లో తీర్పు ఇచ్చిన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా సభ్యుడిగా ఉన్నారు. వివాహ బంధం పూర్తిగా విఫలమైన సందర్భాల్లో దంపతులకు నేరుగా విడాకులు మంజూరు చేసే అధికారం ఆరి్టకల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉందని 2023లో స్పష్టంచేశారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి సుప్రీంకోర్టు కార్యాలయం వస్తుందంటూ 2019లో మరో కీలక తీర్పు వెలువరించారు. -
‘మైనార్టీ హోదా’పై కొత్త బెంచ్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ)కి మైనార్టీ విద్యాసంస్థ హోదా ఉందో లేదో తేల్చే అంశంపై ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారాన్ని నూతన ధర్మాసనానికి(బెంచ్)కు అప్పగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం 4–3 మెజార్టీతో శుక్రవారం 118 పేజీల తీర్పు ఇచ్చింది. విద్యా సంస్థ నియంత్రణ, పరిపాలన విషయంలో పార్లమెంట్లో చట్టం చేసినప్పటికీ ఆ సంస్థకు ఉన్న మైనార్టీ హోదాను రద్దు చేయరని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ చట్ట ప్రకారం అలీగఢ్ ముస్లిం వర్సిటీని మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేమంటూ 1967లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. పరిపాలనా విభాగంలో మైనార్టీలు లేనంత మాత్రాన మైనార్టీ విద్యాసంస్థ కాకుండాపోదని తేల్చిచెప్పింది. మతపరంగా లేదా భాషపరంగా మైనార్టీలైన వ్యక్తులు విద్యాసంస్థలు స్థాపించడం లేదా నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ, వివక్ష చూపుతూ తీసుకొచ్చిన చట్టం లేదా కార్యనిర్వాహక చర్య రాజ్యాంగంలోని ఆర్టికల్ 30(1)కు విరుద్ధమని తేల్చిచెప్పింది. ఈ ఆర్టికల్ ప్రకారం విద్యాసంస్థలను స్థాపించే, నిర్వహించే హక్కు మత, భాషాపరమైన మైనార్టీలకు ఉంది. ‘‘ఏఎంయూను మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేం.. అది సెంట్రల్ యూనివర్సిటీ అంటూ ఎస్.అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1967లోఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును తోసిపుచ్చుతున్నాం. తాము స్థాపించిన విద్యా సంస్థ మైనార్టీల ప్రయోజనాల కోసమేనని దానిని ఏర్పాటు చేసినవారు నిరూపించుకోవాలి. రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఏర్పాటైన యూనివర్సిటీలకు సైతం ఆర్టికల్ 30(1) కింద ఇచ్చిన హక్కు వర్తిస్తుంది’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. అయితే, ఇదే ధర్మాసనంలోని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్చంద్ర శర్మ మూడు వేర్వేరు భిన్నమైన తీర్పులు ఇచ్చారు. ఏఎంయూ మైనార్టీ విద్యాసంస్థ కాదని జస్టిస్ దీపాంకర్ దత్తా తన తీర్పులో స్పష్టంచేశారు. ఏమిటీ కేసు? స్వాతంత్య్రానికి పూర్వమే 1875లో మహ్మదన్ ఆంగ్లో ఓరియంటల్గా కాలేజీగా ప్రారంభమైన ఈ విద్యాసంస్థను 1920లో యూనివర్సిటీగా మార్చారు. ఏఎంయూ అనేది కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్న సెంట్రల్ యూనివర్సిటీ అని, దాన్ని మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేమని 1967లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో 1981లో పార్లమెంట్లో ఏఎంయూ(సవరణ) చట్టాన్ని తీసుకురావడంతో ఏఎంయూకు మళ్లీ మైనార్టీ విద్యాసంస్థ హోదా లభించింది. ఈ చట్ట సవరణను సవాలు చేస్తూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దాంతో ఏఎంయూ(సవరణ) చట్టం–1981ను కొట్టివేస్తూ హైకోర్టు 2006లో తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2006లో అప్పటి యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. మరికొందరు సైతం పిటిషన్లు దాఖలుచేశారు. యూపీఏ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ను ఉపసంహరించుకుంటున్నట్లు 2016లో ఎన్డీయే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. మిగిలిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ఈ అంశాన్ని 2019 ఫిబ్రవరి 12న ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. పిటిషన్లపై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఏఎంయూకు మైనార్టీ సంస్థ హోదా ఉందో లేదో నూతన బెంచ్ నిర్ణయిస్తుందని తేల్చిచెప్పింది. -
సుదీర్ఘ తగువుకు పాక్షిక ఊరట!
షష్టిపూర్తికి చేరువలో ఉన్న ఒక వివాదాస్పద కేసుకు సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం పాక్షికంగా ముగింపు పలికింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవి నుంచి వైదొలగుతున్న చివరి రోజున ఆయన ఆధ్వర్యంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన మెజారిటీ తీర్పు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)కు మైనారిటీ ప్రతిపత్తి అర్హతలేదన్న 1967 నాటి నిర్ణయాన్ని కొట్టేస్తూనే వేరే ధర్మాసనం దాన్ని నిర్ధారించాలని తెలిపింది. గత తీర్పుకు అనుసరించిన విధానం సరికాదని తేల్చింది. బెంచ్లోని ముగ్గురు సభ్యులు అసమ్మతి తీర్పునిచ్చారు. ఒక వివాదాన్ని ఏళ్ల తరబడి అనిశ్చితిలో పడేస్తే నష్టపోయే వర్గాలుంటాయి. ఏళ్లు గడిచేకొద్దీ సమస్య జటిలమవుతుంది కూడా. జేఎన్యూ మాదిరే ఏఎంయూ కూడా వివాదాల్లో నానుతూ ఉంటుంది. 2014లో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ఇవి మరింత పెరిగాయి. చిత్రమేమంటే ఈ రెండు యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైనవారిలో చాలామంది సివిల్ సర్వీసులకూ, ఇతర ఉన్నత స్థాయి ఉద్యోగాలకూ ఎంపికవుతుంటారు. పార్టీల్లో, ప్రభుత్వాల్లో, బహుళజాతి సంస్థల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుంటారు. ఏఎంయూది ఒక విషాద చరిత్ర. సమస్యలు కూడా భిన్నమైనవి. సర్ సయ్యద్ మహ్మద్ ఖాన్ అనే విద్యావంతుడు మదర్సాల్లో కేవలం ఇస్లామిక్ విలువల విద్య మాత్రమే లభించటంవల్ల ఆ మతస్తులు అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారని భావించి వాటితోపాటు ఆధునిక విద్యాబోధన ఉండేలా 1877లో స్థాపించిన ఓరియంటల్ కళాశాల ఆరంభంలో ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. మౌల్వీలనుంచీ, మదర్సాలనుంచీ సర్ సయ్యద్కు ప్రతిఘటన తప్పలేదు. ఆధునిక విద్యనందిస్తే పిల్లల మనసులు కలుషితమవుతాయన్న హెచ్చరిక లొచ్చాయి. అన్నిటినీ దృఢచిత్తంతో ఎదుర్కొని ఆధునిక దృక్పథంతో ఏర్పాటు చేసిన ఈ ఉన్నత విద్యాసంస్థపై 147 ఏళ్లు గడిచాక మత ముద్ర పడటం, దాన్నొక సాధారణ వర్సిటీగా పరిగణించా లన్న డిమాండు రావటం ఒక వైచిత్రి. చరిత్ర ఎప్పుడూ వర్తమాన అవసరాలకు అనుగుణంగా కొత్త రూపు తీసుకుంటుంది. అందు వల్లే కావొచ్చు... ఏఎంయూ చుట్టూ ఇన్ని వివాదాలు! 1920లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఓరియంటల్ కళాశాలనూ, ఆ ప్రాంతంలోనే ఉన్న ముస్లిం యూనివర్సిటీ అసోసియేషన్ సంస్థనూ విలీనం చేసి 1920లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని ఏర్పాటుచేసింది. ఆ చట్టంలోని 23వ నిబంధన యూనివర్సిటీ పాలకమండలిలో కేవలం ముస్లింలకు మాత్రమే చోటీయాలని నిర్దేశిస్తోంది. అయితే ముస్లిం విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాలన్న నిబంధన లేదు. స్వాతంత్య్రానంతరం 1951లో ఆ చట్టానికి తెచ్చిన రెండు సవరణలు మతపరమైన బోధననూ, పాలకమండలిలో ముస్లింలు మాత్రమే ఉండాలన్న నిబంధననూ రద్దుచేశాయి. ఈ చర్య రాజ్యాంగంలోని 30వ అధికరణతోపాటు మత, సాంస్కృతిక, ఆస్తి అంశాల్లో పూచీపడుతున్న ప్రాథమిక హక్కులను ఉల్లంఘించటమేనంటూ పిటి షన్ దాఖలైంది. అయితే ఆ సవరణలు చెల్లుతాయని 1967లో సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల బెంచ్ వెలువరించిన తీర్పే ప్రస్తుత వివాదానికి మూలం. వర్సిటీ స్థాపించిందీ, దాన్ని నిర్వహిస్తు న్నదీ ముస్లింలు కాదని ఆ తీర్పు అభిప్రాయపడింది. అయితే అలా మారటం వెనక ముస్లిం పెద్దల కృషి ఉన్నదని అంగీకరించింది. ప్రభుత్వం స్థాపించిన వర్సిటీకి మైనారిటీ ప్రతిపత్తి ఎలా వస్తుందని ప్రశ్నించింది. ఈ తీర్పును వమ్ముచేస్తూ 1981లో ప్రభుత్వం ఏఎంయూ చట్టానికి సవరణలు తెచ్చింది. తిరిగి మైనారిటీ ప్రతిపత్తినిచ్చింది. దాంతో మెడికల్ పీజీలో 50 శాతం సీట్లను ముస్లింలకు కేటాయించాలని పాలకమండలి 2005లో నిర్ణయించింది. దాన్ని అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. నాటి యూపీఏ సర్కారు, పాలకమండలి 2006లో దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీంకోర్టు స్వీకరించినా రిజర్వేషన్ల విధానంపై స్టే విధించింది. ఆనాటినుంచీ అనాథగా పడివున్న ఆ కేసు నిరుడు అక్టో బర్లో జస్టిస్ చంద్రచూడ్ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయటంతో ముందుకు కదిలింది. అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 30వ అధికరణను పరిమితార్థంలో చూసిందనీ, యాంత్రికంగా అన్వయించిందనీ తాజా మెజారిటీ తీర్పు అభిప్రాయపడింది. ఏఎంయూ స్థాపన నేపథ్యం, పరిస్థితులు పరిగణనలోకి తీసుకోవాలి తప్ప తర్వాతకాలంలో వచ్చిన చట్టాన్ని కాదని తెలిపింది. ఈ తీర్పుతో విభేదించిన ముగ్గురు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలు కూడా ప్రాధాన్యత గలవే. ఇద్దరు సభ్యుల డివిజన్ బెంచ్ అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పుపై మరో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు ఎలా సిఫార్సు చేస్తుందని వారి ప్రశ్న. కేశవానంద భారతి కేసులో 1973 నాటి ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ తీర్పుపై 15 మందితో ధర్మాసనం ఏర్పాటు చేయమని రేపన్నరోజు మరో బెంచ్ ఆదేశిస్తే పరిస్థితేమిటని నిలదీశారు. ఏదేమైనా ఆలస్యమైనకొద్దీ సమస్య ఎంత జటిలమవుతుందో చెప్పటానికి ఏఎంయూ కేసే ఉదాహరణ. ఈ వర్సిటీ స్థలదాత జాట్ రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ అని హిందూ సంస్థలూ... ఆయన నెలకు రూ. 2కు 1929లో లీజుకు మాత్రమే ఇచ్చారని ముస్లింలూ రోడ్డుకెక్కారు. హిందువు ఇచ్చిన స్థలమై నప్పుడు దానికి మైనారిటీ ప్రతిపత్తేమిటన్న ప్రశ్న తలెత్తింది. మైనారిటీ సంస్థలో చదువుకుని ఎదిగి నందుకు కృతజ్ఞతగా లీజుకిచ్చారని, అలా ఇచ్చిన వందమందిలో ఆయనొకరని అవతలి పక్షం వాదించింది. మొత్తానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వల్ల మహేంద్ర పేరిట అక్కడే మరో వర్సిటీ ఏర్పాటైంది. రాజ్యాంగ ధర్మాసనం సూచించిన విధంగా ఏఎంయూ ప్రతిపత్తిపై మరో బెంచ్ ఏర్పాటై తీర్పు వస్తే ప్రస్తుత అనిశ్చితికి తెరపడుతుంది. -
సీజేఐగా తండ్రి తీర్పులనే తిప్పికొట్టి.. డీవై చంద్రచూడ్ వెల్లడించిన టాప్ 10 తీర్పులివే
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ధనుంజయ యశ్వంత్(డీవై) చంద్రచూడ్కు శుక్రవారం లాస్ట్ వర్కింగ్ డే. ఆదివారం( నవంబర్ 10) ఆయన సీజేఐగా పదవీ విరమణ చేయనున్నారు. వృత్తిపరంగా తాను చాలా సంతృప్తి చెందానని, తన వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమించాలని కోరారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్నికైనప్పటి నుంచి ఎన్నో కేసుల పరిష్కారాల్లో డీవై చంద్రచూడ్ తనదైన ముద్ర వేశారు. అనేక మైలురాయి తీర్పులు వెల్లడించారు. అంతేగాక చంద్రచూడ్..భారతదేశ చరిత్రలో ఎక్కువ కాలం సీజేఐగా పనిచేసిన యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ తనయుడు కూడా. తండ్రికి తగ్గ తనయుడిగానే కాదు.. చీఫ్ జస్టిస్గా తండ్రి ఇచ్చిన తీర్పులనే తిరగరాశారు డీవై చంద్రచూడ్. వైవీ చంద్రచూడ్ 2017-18లో తీసుకున్న అడల్టరీ చట్టం, శివకాంత్ శుక్లా వర్సెస్ ఏడీఎం జబల్పూర్ కేసుల్లో తీసుకున్న నిర్ణయాలను కుమారుడు డీవై చంద్రచూడ్ తోసిపుచ్చారు. 👉1985లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్ ధర్మాసనం.. సౌమిత్ర విష్ణు కేసులో ఐపీసీ సెక్షన్ 497ను సమర్థించింది. సంబంధం కలిగి ఉండటానికి ప్రలోభాలకు లోనయ్యే వ్యక్తి పురుషుడే కానీ, స్త్రీ కాదని సాధారణంగా అంగీకరించబడింది అని ధర్మాసనం తన తీర్పులో రాసింది. ఈ నిర్ణయాన్ని 2018 లో జస్టిస్ డీవై చంద్రచూడ్తో కూడిన ధర్మాసనం రద్దు చేసింది. ‘వ్యభిచార చట్టం అనేది పితృస్వామ్య నియమం. లైంగిక స్వయంప్రతిపత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని ధర్మాసనం చెప్పింది. 👉 1976 లో శివకాంత్ శుక్లా వర్సెస్ ఏడీఎం జబల్పూర్ కేసులో, గోప్యతను ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు పరిగణించలేమని పేర్కొన్నది. ఈ బెంచ్లో అప్పటి సీజేఐ వైవీ చంద్రచూడ్ ఉన్నారు. కాగా, 2017 లో గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించింది. ఈ బెంచ్లో డీవై చంద్రచూడ్ ఉన్నారు. ‘ఏడీఎం జబల్పూర్ కేసులో మెజారిటీ నిర్ణయంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయి. రాజ్యాంగాన్ని అంగీకరించడం ద్వారా భారతదేశ ప్రజలు తమ జీవితాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభుత్వానికి అప్పగించలేదు’ అని డీవై చంద్రచూడ్ తన నిర్ణయాన్ని రాశారు. కాగా 2022 నవంబర్ 9న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రచూడ్.. ఆయన పదవీకాలంలో ఎన్నో చారిత్రక తీర్పులు వెల్లడించారు. ఆర్టికల్ 370, స్వలింగ సంపర్కుల వివాహం, రామ మందిరం, డ్రైవింగ్ లైసెన్స్, బుల్డోజర్ చర్య, ఉమర్ ఖలీద్, స్టాన్ స్వామి, జీఎన్ సాయిబాబా బెయిల్కు సంబంధించి తన తీర్పును ఇచ్చారు. నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత కేసు, కేరళకు చెందిన హదియా కేసు, అవివాహితల అబార్షన్ హక్కు కేసుల్లో.. తండ్రికి తగ్గ తనయుడిగా ఎంతో పరిణతి చెందిన తీర్పులను వెలువరించారు. వాటిని ఓసారి పరిశీలిస్తే.. ఎలక్టోరల్ బాండ్స్ కేసురాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల వివాదంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. 2018 నుంచి అమలులో ఉన్న ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని కేంద్రం రద్దు చేసింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్దమని, ఏకపక్షమని వాదించింది. రాజకీయ పార్టీలు, దాతల మధ్య క్విడ్ ప్రోకో ఏర్పాటుకు దారితీయవచ్చని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ మేరకు జస్టిస్ బిఆర్ గవాయ్, సంజీవ్ ఖన్నా, జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం.. ఎలక్టోరల్ బాండ్ల జారీని తక్షణమే నిలిపివేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. అలాగే ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా రాజకీయ పార్టీలు పొందిన విరాళాల వివరాలను ప్రచురించాలని భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.ప్రైవేట్ ఆస్తి వివాదం..ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకొనే విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యంలోని ఆస్తులన్నీ సమాజ ఉమ్మడి వనరులు కావని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. ప్రజల ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు వాటిని ఏకపక్షంగా పంపిణీ చేయలేవని స్పష్టం చేసింది. అయితే, కొన్నింటిలో మాత్రం మినహాయింపు ఉంటుందని 7:2 మెజారిటీతో వెలువడిన తీర్పులో పేర్కొంది. సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని 9 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు భిన్నాభిప్రాయంతో కూడిన తీర్పును వెలువరించింది.ఆర్టికల్ 3702023 డిసెంబర్లో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జమ్ముకశ్మీర్కు ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని.. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఆర్టికల్ 370 యుద్ధ నేపథ్యంలో కుదుర్చుకున్న తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, జమ్మూ కశ్మీర్ కు సార్వభౌమాధికారం లేదని, భారత రాజ్యాంగమే ఫైనల్ అని స్పష్టం చేసింది.జమ్మూకశ్మీర్ నుంచి లద్దాఖ్ను పూర్తిగా విభజించి, దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతున్న జమ్మూకశ్మీర్కు రాష్ట్రహోదాను త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. జమ్మూకశ్మీర్లో 2024 సెప్టెంబరు 30వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.స్వలింగ వివాహం2023 అక్టోబర్లో స్వలింగ వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వలేమని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది, స్వలింగ సంపర్కాలపై భిన్నాభిప్రాయాలున్నాయని, స్వలింగ వివాహనికి చట్టబద్దత కల్పించలేమని తెలిపింది స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని సీజేఐ పేర్కొన్నారు. వివాహం చేసుకోవడం ప్రాధమిక హక్కు కాదని, ఈ కేసుపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. అది న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ మేరకు 3:2 మెజారిటీతో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.సెక్షన్ 6Aగత నెల అక్టోబర్లో అస్సాం వలసలకు సంబంధించి ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పును వెలువరించించింది. భారత పౌరసత్వ చట్టం-1955లోని సెక్షన్ 6(ఎ)కు రాజ్యాంగబద్ధత ఉందని స్పష్టం చేసింది. 1996-71 మధ్య అస్సాంలోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్తాన్) శరణార్థులను భారత పౌరసత్వం పొందేందుకు 1985లో తీసుకొచ్చిన రాజ్యంగ సవరణ రాజ్యాంగ బద్దమేనని 4:1 తీర్పులో వెల్లడించింది. ఇది కేవలం అస్సాం రాష్ట్రానికి మాత్రమే వర్తించేలా చేసిన ఈ సవరణ రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగ పీఠికలోని సౌభ్రాతృత్వ భావనకు వ్యతిరేకమని పేర్కొంటూ దాఖలైన పిటిషన్ను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ మనోజ్ మిశ్రల ధర్మాసనం తిరస్కరించింది.జైళ్లలో కుల ఆధారిత వివక్షకుల ఆధారంగా జైల్లోని ఖైదీలపై వివక్ష చూపడడం తగదని సుప్రీంకోర్టు పేర్కొంది. జైలు మాన్యువల్స్లో క్యాస్ట్ కాలమ్ను తొలగించాలని కేంద్రం, రాష్ట్రాలను ఆదేశించింది. చిన్న కులాల ఖైదీలతో మరుగుదొడ్లు కడిగించడం వంటి స్కావెంజింగ్ పనులు, అగ్ర కులాల వారికి వంట పనుల కేటాయింపు వివక్షే అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల్లోని కారాగారాల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, కులం ఆధారంగా ఖైదీలపై వివక్ష చూపుతున్నారని పేర్కొంటూ మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతానికి చెందిన జర్నలిస్టు సుకన్య శాంత సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిట్) దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఖైదీలను కులం ఆధారంగా విభజిస్తున్న మాన్యువల్లోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. మూడు నెలల్లోగా నిబంధనల్లో సవరణలు చేయాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.యూపీ మదరసా చట్టంఉత్తరప్రదేశ్ బోర్డు ఆఫ్ మదర్సా- 2004 ఎడ్యుకేషన్ చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, బోర్డు లౌకిక న్యాయ సూత్రాలను ఉల్లంఘించిందంటూ దానిని రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. ఈ చట్టం లౌకిక వాద సూత్రాన్ని ఉల్లంఘించిందని హైకోర్టు తప్పుగా అభిప్రాయపడిందని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.నీట్ వివాదందేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నీట్ యూజీ పరీక్షను మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ప్రశ్నాపత్రం లీకైందని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. పాట్నా, హజారీబాగ్లలో మాత్రమే పేపర్ లీక్ అయిందని పేర్కొన్నది. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశిస్తే, గతంలో పరీక్ష రాసిన దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులపై ప్రభావం చూపుతుందని పేర్కొంది.ఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసుఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. చట్ట సభల్లో లంచం తీసుకుంటే రాజ్యాంగ రక్షణ కల్పించలేమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. చట్టసభల్లో డబ్బులు తీసుకొని ఓటు వేసే ఎంపీ, ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ ఉండాలా ? లేదా అన్న దానిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. శాసనసభ్యులు, ఎంపీలు లంచం తీసుకోవడమనేది భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తోందని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు.బాల్య వివాహంబాల్య వివాహాల నిషేద చట్టం-2006ను సమర్థవంతంగా అమలు చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలను జారీ చేసింది. పర్సనల్ లాతో సంబంధం లేకుండా బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని అమలుచేయాలని సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని పర్సనల్ లాతో తగ్గించవద్దని వెల్లడించింది. అలాగే ఇలాంటి వివాహాలతో మైనర్లకు వారి జీవితాన్ని ఎంచుకొనే స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. బాల్యవివాహాల నిరోధం, మైనర్ల రక్షణపై అధికారులు దృష్టిసారించాలని, చివరి ప్రయత్నంగా నిందితులకు జరిమానా విధించాలని తెలిపింది.తన పదవీకాలం చివరి రోజు సైతం. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి మైనారిటీ హోదాపై కీలక తీర్పును వెలువరించింది. దీనిని మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేమంటూ 1967లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని బెంచ్ నిర్ణయించింది. అయితే, దీనికి మైనార్టీ హోదా ఉండాలా? వద్దా? అన్న అంశాన్ని తేల్చేందుకు ఈ పిటిషన్లను కొత్త బెంచ్కు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈమేరకు 4:3 మెజార్టీతో తీర్పు వెలువరించింది. -
ఇక నుంచి నేను ఇలా న్యాయం చేయలేను: సీజేఐ చంద్రచూడ్ భావోద్వేగం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ పదవీ కాలం ముగిసింది. శుక్రవారమే చివరిరోజు. ఆనవాయితీ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన హాల్లో నలుగురు సభ్యులతో కూడిన సెర్మోనియల్ బెంచ్ ఆయనకు వీడ్కోలు పలికింది. జస్టిస్ చంద్రచూడ్తోపాటు కాబోయే సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఈ బెంచ్లో ఉన్నారు. తన వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్ చంద్రచూడ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. కొద్దిసేపు అందరినీ నవి్వంచారు. జైన పదం ‘మీచా మి దుఖఃదాం’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘రేపటి నుంచి నేను ఇలా న్యాయం చేయలేను, కోర్టులో ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి’’ అని కోరారు. ఇతరులను నొప్పించాలన్న ఉద్దేశం తనకు ఏనాడూ లేదన్నారు. న్యాయవాద వృత్తితో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని ప్రస్తావించారు. రూపురేఖలను బట్టి తనను చాలామంది యువకుడిగానే భావించేవారని చెప్పారు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు కొందరు తన వద్దకు వచ్చి ‘మీ వయసు ఎంత’ అని అడిగారని గుర్తుచేశారు. న్యాయవాద వృత్తి తనకు ఎన్నో గొప్ప విషయాలు నేరి్పంచిందని అన్నారు. యువ లాయర్గా కోర్టుల్లో ఎన్నో వాదనలు విన్నానని, న్యాయవాదుల్లో నైపుణ్యాలు గమనించానని, విలువైన కోర్టురూమ్ టెక్నిక్లు నేర్చుకున్నానని తెలిపారు. కోర్టుల్లో పనిచేసే మనమంతా వచ్చి వెళ్లిపోయే యాత్రికులమేనని ఉద్ఘాటించారు. సుప్రీంకోర్టులో ఎంతోమంది గొప్ప న్యాయమూర్తులుగా రాణించారని, వారసత్వాన్ని మరొకరికి అప్పగించి వెళ్లారని పేర్కొన్నారు. తాను వెళ్లిపోయినా పెద్ద తేడా ఏమీ ఉండదని, తన తర్వాత మరొకరు ఈ పదవిలోకి వస్తారని చెప్పారు. సమర్థుడైన జస్టిస్ సంజీవ్ ఖన్నా నూతన సీజేఐగా బాధ్యతలు చేపట్టబోతున్నారని, సుప్రీంకోర్టు ప్రతిష్టను ఆయన మరింత ఇనుమడింపజేస్తారన్న విశ్వాసం తనకు ఉందని వివరించారు. న్యాయమూర్తి అనే పదవి తనను ఇన్నాళ్లూ ఉత్సాహంగా ముందుకు నడిపించిందని పేర్కొన్నారు. చట్టం, న్యాయం, జీవితం గురించి సుప్రీంకోర్టులోని ప్రతి ఒక్కరూ తనకు ఎన్నో విషయాలు నేర్పించారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. సీజేఐగా తాను విచారించిన 45 కేసులు సైతం తనకు జీవితం గురించి ఎన్నో కొత్త సంగతులు నేరి్పంచాయని చెప్పారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ.. అణగారిన యువత, నిరుపేదల బాగు కోసం జస్టిస్ చంద్రచూడ్ ఎంతగానో శ్రమించారని ప్రశంసించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నో కేసుల్లో విజయం సాధించిందని, కొన్ని ఓడిపోయిందని, తమ అభిప్రాయాలను జస్టిస్ చంద్రచూడ్ ఓపిగ్గా విన్నారన్న సంతృప్తి తమకు ఉందని చెప్పారు. అనంతరం సుప్రీంకోర్టు బార్ అసోసియేసన్ ఆధ్వర్యంలో జస్టిస్ చంద్రచూడ్ను న్యాయమూర్తులు, న్యాయవాదులు, అసోసియేషన్ సభ్యులు, ఉద్యోగులు సత్కరించారు. ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఆయన ఏం చెప్పారంటే... అంతకంటే గొప్ప అనుభూతి ఉండదు ‘‘అవసరాల్లో ఉన్న ప్రజలకు సేవ చేయగల శక్తి కలిగి ఉండడం కంటే గొప్ప అనుభూతి మరొకటి ఉండదు. మనకు తెలియని, మనం ఎప్పుడూ కలవని వ్యక్తులకు సేవ చేయడం, వారి జీవితాలను ప్రభావితం చేయడం అదృష్టమే. వృత్తిలో విజయాలు సాధించడంతోపాటు దేశానికి సేవ చేసే అవకాశం లభించినందుకు పూర్తిగా సంతృప్తిగా ఉన్నాను. సుప్రీంకోర్టులో ఉన్నంతకాలం కొత్త విషయాలు నేర్చుకోలేదు అని భావించిన రోజు ఒక్కటి కూడా లేదు. న్యాయ విద్యారి్థగా కోర్టులో చివరి వరుసలో కూర్చున్న రోజుల నుంచి సుప్రీంకోర్టు కారిడార్ల దాకా నా ప్రస్థానం సాగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా దేశానికి నా వంతు సేవ చేసే అవకాశం రావడం గర్వకారణంగా భావిస్తున్నా. దాదాపు రెండేళ్లపాటు సీజేఐగా న్యాయ వ్యవస్థలో సంస్కరణలు, పారదర్శకత తీసుకొచ్చేందుకు కృషి చేశా. ఈ విషయంలో తరుచుగా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో నాకు వ్యతిరేకంగా ఎన్నో పోస్టులు పెట్టారు. దూషించారు. నన్ను తప్పుపట్టారు. వాటిని మర్చిపోలేను. నేను ఇక పదవీ విరమణ చేస్తున్నా. ట్రోలర్స్కు, విమర్శకులకు సోమవారం నుంచి పని ఉండదు. వారంతా నిరుద్యోగులైపోతారు. ప్రతి రోజూ ప్రతి అన్యాయాన్నీ ఎదిరించలేం మా తండ్రి పుణేలో ఒక ఫ్లాట్ కొన్నారు. న్యాయమూర్తిగా చివరి రోజు దాకా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని నాకు చెప్పారు. నిజాయతీ, సమగ్రత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. ఆయన చెప్పిందే ఆచరించాను. న్యాయమూర్తిగా మారిన తర్వాత మొదట ఎదుర్కోవాల్సింది మనలోని భయాన్నే. మన పరిమితులు మనం తెలుసుకోవాలి. న్యాయవాద వృత్తి గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. న్యాయ వ్యవస్థ అధికార పరిధిని కూడా గుర్తుంచుకోవాలి. న్యాయమూర్తిగా ప్రతి రోజూ ప్రతి అన్యాయాన్నీ ఎదిరించలేమని కోర్టులో ఉన్నప్పుడు మీరు గ్రహిస్తారు. కొన్నిసార్లు చట్టబద్ధమైన పాలనలోనే అన్యాయాలు జరుగుతూ ఉండొచ్చు. చట్టబద్ధ పాలనకు అవతల జరిగే అన్యాయాలను మనం సరిదిద్దవచ్చు. బాధితులకు ఉపశమనం కలిగించడం అనేది ఓదార్పు ఇచ్చే మన సామర్థ్యంపై ఆధారపడి ఉండదు. వారి కష్టాలను, సమస్యలను ఓపికతో వినగలిగే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఎన్నో ఇన్ఫెక్షన్లు తొలగించే శక్తి సూర్యకాంతికి ఉంది. నా జీవితం తెరిచిన పుస్తకం. నా వ్యక్తిగత జీవితం ప్రజలకు తెలుసు. సోషల్ మీడియాలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నా. నా బాహువులు విశాలమైనవి కాబట్టి అన్ని రకాల విమర్శలను వినమ్రంగా స్వీకరించా. బార్ అసోసియేషన్ సభ్యులు, నా సహచరులు నాకు మద్దతుగా నిలిచారు. సుప్రీంకోర్టు అంటే ప్రధాన న్యాయమూర్తి కేంద్రీకృత కోర్టు. అందులో ఎలాంటి మార్పు ఉండదు. పెండింగ్ కేసులు పరిష్కరించా న్యాయ వ్యవస్థను ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి, పారదర్శకత పెంచడానికి కృషి చేశా. పెండింగ్ కేసుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చా. నేను సీజేఐగా బాధ్యతలు తీసుకున్నప్పుడు 1,500 ద్రస్తాలు రిజి్రస్టార్ కప్బోర్డులో పడి ఉన్నాయి. అవి పరిష్కారానికి నోచుకోకపోవడం బాధ కలిగించింది. ఈ పరిస్థితి మార్చాలని సంకల్పించా. సుప్రీంకోర్టులో నమోదయ్యే ప్రతి కేసుకు ఒక నెంబర్ కేటాయించి, వరుసగా పరిష్కరించే విధానం ప్రారంభించా. దీనివల్ల వేలాది కేసులు పరిష్కారమయ్యాయి. బ్యాక్లాగ్ కేసుల సంఖ్య చాలావరకు తగ్గిపోయింది. కేసుల పెండింగ్ విషయంలో మాపై ఎన్నోవిమర్శలు వస్తున్నాయి. పెండింగ్లో ఉన్న 82,000 కేసుల్లో రిజిస్టర్ కాని కేసులు చాలా ఉండేవి. ఆ విషయం చాలామందికి తెలియదు. గత రెండేళ్లలో పెండింగ్ కేసుల సంఖ్య 11,000కు తగ్గిపోయింది’’ అని జస్టిస్ చంద్రచూడ్ ఉద్ఘాటించారు. మానవత్వంతో కూడిన తీర్పులిచ్చారు సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ అందించిన సేవలను పలువురు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు కొనియాడారు. భారత న్యాయ వ్యవస్థపై ఆయన బలమైన ముద్ర వేశారని ప్రశంసించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ హృషికేశ్రాయ్, జస్టిస్ పి.ఎస్.నరసింహ తదితరులు మాట్లాడారు. జస్టిస్ చంద్రచూడ్ వృత్తి నైపుణ్యాలు ప్రదర్శించడంతోపాటు మానవత్వంతో కూడిన తీర్పులు ఇచ్చారని చెప్పారు. ఆయనకు అంతులేని సహనం ఉందని తెలిపారు. ఆరోగ్యకరమైన, చురుకైన జీవన శైలి ఆయన సొంతమని అన్నారు. క్లిష్టమైన తీర్పులు ఇచ్చే సమయంలోనూ ప్రశాంతంగా ఉండేవారని, న్యాయవ్యవస్థలో ఆధునిక సాంకేతిక విధానాలు ప్రవేశపెట్టారని వివరించారు. జస్టిస్ చంద్రచూడ్ నిత్యం యువకుడిలా కనిపిస్తారని, ఆయనను చూసి తాము వృద్ధులమైపోయినట్లు భావిస్తామని అన్నారు. ‘‘జస్టిస్ చంద్రచూడ్ పూర్తిగా శాకాహారి. ఉదయం 4 గంటలకే నిద్రలేస్తారు. ఆయనది క్రమశిక్షణతో కూడిన జీవితం. సమోసాలంటే ఆయనకు ఇష్టం. కానీ, సమావేశాల్లో ఏమీ తీసుకోరు. ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. కోర్టుల్లో టెక్నాలజీ విషయంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. నా పనిని మరింత సులభతరం చేశారు’’ అని జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. ఇదిలా ఉండగా, నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ నెల 11న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ చివరి తీర్పు సుప్రీంకోర్టులో తన చివరి రోజు ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్ చంద్రచూడ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ విద్యాసంస్థ హోదా విషయంలో కీలక తీర్పు వెలువరించారు. -
CJI DY Chandrachud: అర్హతా ప్రమాణాలను మధ్యలో మార్చలేరు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైన తర్వాత మధ్యలో అర్హతా ప్రమాణాలు మార్చడానికి వీల్లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నియామక ప్రక్రియ మధ్యలో అవసరాన్నిబట్టి నిబంధనల్లో మార్పులు చేస్తామని ముందుగా సమాచారం ఇవ్వకుండా నిబంధనలను మార్చకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పింది. గురువారం తేజ్ ప్రకాష్ పాఠక్ వర్సెస్ రాజస్థాన్ హైకోర్టు కేసును జడ్జీలు సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హృషీకేశ్రాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పంకజ్ మిథల్, జస్టిస్ మనోజ్ మిశ్రాల రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. రాజస్థాన్ హైకోర్టు 2007 సెప్టెంబర్ 17వ తేదీన 13 అనువాదకుల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీచేసింది. తొలుత ముందుగా రాత పరీక్ష నిర్వహి స్తామని, అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి వ్యక్తిగత ఇంటర్వ్యూలు చేపట్టడం ద్వారా నియామక ప్రక్రియ ముగుస్తుందని పేర్కొంది. ఆ పరీక్షకు మొత్తం 21 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో మూడు ఉద్యోగా లకు ముగ్గురిని ఎంపిక చేశారు. కనీసం 75 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులనే ఉద్యోగాలకు ఎంపిక చేశామని హైకోర్టు తన ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే నోటిఫికేషన్లో 75 శాతం మార్కులు తప్పనిసరి అనే విషయాన్ని స్పష్టంచేయలేదు. నిబంధనలు సవరించిన తర్వాత ఆ ముగ్గురిని మాత్రమే ఉద్యోగాలకు ఎంపిక చేశారని మిగతా అభ్యర్థులు ఆరోపించారు. తమకు అన్యాయం జరిగిందంటూ బాధిత అభ్యర్థులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 2010 మార్చిలో ఆ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. దీంతో అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు గత ఏడాది జూలై 18వ తేదీన తీర్పును రిజర్వ్చేసి గురువారం వెలువరిచింది. ‘‘ ఏదైనా నియామక ప్రక్రియ అనేది దరఖాస్తుల స్వీకరణకు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ప్రకటనతో మొదలవుతుంది. పోస్టుల భర్తీతో ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో నియమాలను మార్చడానికి వీల్లేదు. ఒకవేళ మార్చాల్సి వస్తే నోటిఫికేషన్ వెలువ డటానికి ముందే మార్చాలి. లేదంటే మధ్యలో మార్చాల్సి రావొచ్చేమో అని విషయాన్ని నోటిఫికేషన్లోనే ప్రస్తావించాలి. అలాంటివేవీ చెప్పకుండా హఠాత్తుగా అభ్యర్థులను హుతాశులను చేసేలా ఆట నియమాలను మార్చొద్దు. ఒకవేళ మారిస్తే అవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను, వివాదాలను తట్టుకుని నిలబడగలగాలి’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా 2008లో సుప్రీంకోర్టు ఇచ్చిన పాత ‘‘ కె మంజుశ్రీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు’ తీర్పును కోర్టు సమర్థించింది. దీంతోపాటు సుభాష్చంద్ మార్వా కేసునూ కోర్టు ప్రస్తావించింది. ‘‘ సెలక్ట్ జాబితా నుంచి ఉద్యోగుల ఎంపికను మార్వా కేసు స్పష్టంచేస్తే, సెలక్ట్ జాబితాలోకి ఎలా చేర్చాలనే అంశాలను మంజుశ్రీ కేసు వివరిస్తోంది’’ అని పేర్కొంది. -
సీజేఐ చంద్రచూడ్ను ‘సర్ప్రైజ్’ చేసిన A.I. లాయర్
ఢిల్లీ: నేషనల్ జ్యుడీషియల్ మ్యూజియం అండ్ ఆర్కైవ్(ఎన్జేఎంఏ)ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై చంద్రచూడ్ ప్రారంభించారు. గురువారం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏర్పాటు చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) న్యాయవాదితో సీఎం మాట్లాడ్లారు. ఈ సందర్భంగా సీజేఐ చంద్రబూడ్.. ఏఐ లాయర్కు ఉన్న న్యాయపరమైన పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు ఓ ఆసక్తిరమైన ప్రశ్నను సంధించారు. అయితే, అంతే అలవోకగా ఏఐ న్యాయవాది.. సమాధానం చెప్పి సీజేసీ ఆశ్చర్యపరిచారు. ‘భారతదేశంలో మరణశిక్ష రాజ్యాంగబద్ధమా?’ అని సీజేఐ.. ఏఐ లాయర్ను అడిగారు. అడ్వకేట్ బో టై , కోటు ధరించిన కళ్లద్దాలతో ఉన్న ఏఐ లయర్.. అ సీజేఐ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘‘అవును.. మరణశిక్ష భారతదేశంలో రాజ్యాంగబద్ధం. నేరం నిరూపించబడిన చాలా అరుదైన కేసుల్లో దోషుకులకు మరణ విధిస్తారు. అయితే.. హేయమైన కేసుల్లో అటువంటి శిక్షకు రాజ్యాంగబద్ధత ఉంది’’ అని చెప్పారు. ఏఐ లాయర్ స్పందనతో.. ప్రధాన న్యాయమూర్తి ముగ్ధులయ్యారు. సీజేఐతో పాటు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.AI भारत सहित दुनिया को बदल रहा है।सुनिए जब AI जज से CJI ने भारत में डेथ पैनालिटी के बारे में पूछा।जवाब सुनकर सीजेआई भी हैरान रह गए pic.twitter.com/7w9aNZYZtO— Sandeep Tevatia (@Adsandeept) November 7, 2024 ఇక.. ప్రారంభోత్సవం అనంతరం.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడారు. ‘‘ కొత్త మ్యూజియం సుప్రీంకోర్టు ధర్మాన్ని, దేశానికి ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. ఈ మ్యూజియం యువ తరానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నా. పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులను న్యాయవాదులు, న్యాయమూర్తులు తప్పనిసరిగా ఇక్కడకు తీసుకువచ్చి న్యాయస్థానం, చట్టబద్ధమైన పాలన ప్రాముఖ్యత ప్రత్యక్ష అనుభవాన్ని అందించాలి’’ అని అన్నారు. -
అన్ని ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి రాష్ట్రాలకు అధికారం లేదు
ఆర్టికల్ 39(బి)లో పేర్కొన్న సామాజిక వనరులు అన్న పదబంధం ప్రైవేటు యాజమాన్యంలోని అన్ని ఆస్తులు, వనరులకు వర్తిస్తుందా అన్నది మా ముందున్న ప్రశ్న. సైద్ధాంతికంగా చూస్తే అవుననే సమాధానమే వస్తుంది. కానీ ఆ మేరకు జస్టిస్ కృష్ణయ్యర్ ఇచ్చిన తీర్పు, దాని ఆధారంగా సంజీవ్ కోక్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించలేకపోతున్నాం. కేవలం భౌతిక అవసరాల నిర్వచన పరిధిలోకి వచ్చినంత మాత్రాన ప్రతి ప్రైవేట్ ఆస్తినీ సామాజిక వనరుగా పరిగణించడం కుదరదు.– సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ న్యూఢిల్లీ: ప్రైవేట్ ఆస్తులపై ప్రభుత్వాల అధికార పరిధికి సంబంధించిన అతి కీలకమైన అంశంపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. అన్ని ప్రైవేట్ ఆస్తులూ సామాజిక వనరుల నిర్వచన పరిధిలోకి రావని స్పష్టం చేసింది. ‘‘కనుక రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని ప్రైవేట్ ఆస్తుల మీదా హక్కులు ఉండబోవు. సమాజ హితం, ఉమ్మడి ప్రయోజనాలు, సామాజిక పంపకం నిమిత్తం ఏ ప్రైవేట్ ఆస్తినైనా స్వాదీనం చేసుకునేందుకు వాటికి అధికారం లేదు’’ అని తేల్చి చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ మేరకు 7–2 మెజారిటీతో చరిత్రాత్మక తీర్పు వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(బి) ఆధారంగా ప్రైవేట్ యాజమాన్యంలోని అన్ని వనరులను స్వా«దీనం చేసుకునే హక్కు రాష్ట్రాలకు లేదని పేర్కొంది. వాటికి ఆ అధికారం ఉందంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డి తదితరులు ఇచ్చిన గత తీర్పులతో విభేదించింది. వాటిలో వెలిబుచ్చిన అభిప్రాయాలను లోపభూయిష్టమైనవిగా, కాలదోషం పట్టినవిగా పేర్కొంది. ఆ తీర్పులను కొట్టేసింది. ఆర్థిక ప్రజాస్వామ్యానికి కూడా రాజ్యాంగం అనుమతిస్తోందంటూ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే, ‘‘కొన్ని ప్రైవేట్ ఆస్తులు మాత్రం ఆర్టికల్ 39(బి)లో పేర్కొన్న ‘సామాజిక వనరులు, సమాజ హితం’ పరిధిలోకి వస్తాయి. ఆ నిర్దిష్ట అవసరాల నిమిత్తం వాటిని ప్రభుత్వాలు స్వాదీనం చేసుకోవచ్చు’’ అని స్పష్టం చేసింది. సీజేఐతో పాటు జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీ ఈ మేరకు మెజారిటీ తీర్పు వెలువరించారు. వారి తరఫున సీజేఐ 193 పేజీల తీర్పును రాశారు. ఈ తీర్పుతో జస్టిస్ బి.వి.నాగరత్న పాక్షికంగా, జస్టిస్ సుధాన్షు ధూలియా పూర్తిగా విభేదించారు. కాలానుగుణంగా మారాలి: సీజేఐ ఆర్టికల్ 39(బి) కింద కేవలం ప్రైవేట్ ఆస్తులను కూడా సామాజిక వనరులుగా భావించవచ్చా అన్న అంశం 1992 నుంచి న్యాయస్థానాల్లో నలుగుతోంది. దీనికి సంబంధించి 16 పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. దీన్ని 2002లో తొమ్మిది మంది సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించారు. 2024లో సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం దీన్ని విచారణకు చేపట్టింది. ప్రైవేట్ ఆస్తులన్నింటినీ సామాజిక వనరులుగా భావించడానికి వీల్లేదని సీజేఐ తన తీర్పులో స్పష్టం చేశారు. అలా భావించవచ్చని, వాటిని సమాజ హితం కోసం స్వాదీనం చేసుకోవచ్చని పేర్కొన్న గత తీర్పులు సామ్యవాద ధోరణితో కూడినవని అభిప్రాయపడ్డారు. ‘‘ఆర్టికల్ 39(బి)లో పేర్కొన్న సామాజిక వనరులు అన్న పదబంధం ప్రైవేటు యాజమాన్యంలోని అన్ని ఆస్తులు, వనరులకు వర్తిస్తుందా అన్నది మా ముందున్న ప్రశ్న. సైద్ధాంతికంగా చూస్తే అవుననే సమాధానమే వస్తుంది. కానీ ఆ మేరకు జస్టిస్ కృష్ణయ్యర్ ఇచ్చిన తీర్పు, దాని ఆధారంగా సంజీవ్ కోక్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించలేకపోతున్నాం. కేవలం భౌతిక అవసరాల నిర్వచన పరిధిలోకి వచ్చినంత మాత్రాన ప్రతి ప్రైవేట్ ఆస్తినీ సామాజిక వనరుగా పరిగణించడం కుదరదు. సదరు ఆస్తి తాలూకు స్వభావం, సమాజ శ్రేయస్సుపై దాని ప్రభావం, వనరుల అలభ్యత, అది ప్రైవేటు చేతుల్లో ఉంటే తలెత్తే పరిణామాలు తదితరాలన్నింటినీ బేరీజు వేసిన మీదట మాత్రమే అది సామాజిక వనరో, కాదో తేల్చాలి. ప్రజా విశ్వాస సిద్ధాంతాన్ని కూడా దీనికి వర్తింపజేయాల్సి ఉంటుంది. అడవులు, చెరువులు, చిత్తడి నేలలు, సహజ వనరులతో కూడిన భూముల వంటివి ప్రైవేట్ స్వాదీనంలో ఉంటే ఆర్టికల్ 39(బి) కింద వాటిని సమాజ అవసరాల నిమిత్తం ప్రభుత్వాలు సేకరించవచ్చు. అదే సమయంలో స్పెక్ట్రం, ఎయిర్వేవ్స్, సహజ వాయువు, గనులు, ఖనిజాల వంటి కొరతతో కూడిన పరిమిత వనరులు కొన్నిసార్లు ప్రైవేట్ అజమాయిషీలో ఉండేందుకు ఆస్కారముంది. కనుక పంపకం అనే మాటకున్న అర్థం విస్తృతమైనది’’ అని సీజేఐ పేర్కొన్నారు. ‘‘గత తీర్పుల్లో జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డి నిర్దిష్ట ఆర్థిక సిద్ధాంతాల ప్రాతిపదికన అభిప్రాయాలు వెలిబుచ్చారు. కానీ స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో సంక్షేమ ఆధారిత విధానాలున్నాయి. తర్వాత మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, జాతీయీకరణ వంటివాటి కాలం నడిచింది. ఇది పెట్టుబడుల ఉపసంహరణల యుగం. ప్రైవేట్ పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. కనుక గత పరిస్థితులను ఇప్పుడు ప్రాతిపదికగా తీసుకోరాదు. ప్రస్తుత, భావి అవసరాలను తగ్గట్టుగా తీర్పులుండాలి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం కూడా ఫలానా ఆర్థిక విధానాన్నే పాటించాలని సూచించలేదన్నారు. ఇద్దరు న్యాయమూర్తులు ఏమన్నారంటే... ఏ ప్రైవేట్ ఆస్తులనైనా సమాజ హితానికి స్వా«దీనం చేసుకునే అధికారం ప్రభుత్వాలకు ఉందన్న జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డి తదితర తీర్పులకు నేటికీ కాలదోషం పట్టలేదని జస్టిస్ ధూలియా అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ఆర్టికల్ 38, 39ల్లో పేర్కొన్న సూత్రాలను పక్కన పెట్టడం సబబు కాదన్నారు. అలా చేయడం ప్రభుత్వాల చేతులను కట్టేయడమే అవుతుందని 97 పేజీల తీర్పులో స్పష్టం చేశారు. ‘‘ఎందుకంటే అంబేడ్కర్ హెచ్చరించిన సామాజిక, ఆర్థిక అసమానతలు మన దేశంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పేద, సంపన్న వర్గాల మధ్య ఆదాయ, సంపదపరమైన భారీ అసమానతలు నానాటికీ మరింతగా పెరుగుతున్నాయి’’ అన్నారు. జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డి తీర్పులకు పూర్తిగా కాలదోషం పట్టలేదని జస్టిస్ నాగరత్న కూడా అభిప్రాయపడ్డారు. అయితే, ‘‘భౌతిక వనరులను ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యంలోవిగా విభజించవచ్చు. పూర్తిగా వ్యక్తిగత అవసరాలను తీర్చేవాటిని మినహాయించి ఇతర ప్రైవేటు ఆస్తులను సమాజ హితం కోసం ప్రభుత్వం సేకరించవచ్చు. ఆ మీదట సమాజ హితం కోసం అర్హులకు వాటిని చట్టపరమైన మార్గాల్లో తాత్కాలిక/శాశ్వత ప్రాతిపదికన బేషరతుగానో, షరతులతోనో పంపకం చేయవచ్చు’’ అని ఆమె పేర్కొన్నారు. అయితే జస్టిస్ కృష్ణయ్యర్ తీర్పుపై సీజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యలను ‘పరుషమైనవి, అనవసరమైనవి’గా జస్టిస్ ధూలియా, జస్టిస్ నాగరత్న అభివర్ణించడం విశేషం. వాటితో తాము గట్టిగా విభేదిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. కృష్ణయ్యర్, చిన్నపురెడ్డి తీర్పులు... సమాజహితం కోసం ప్రైవేట్ ఆస్తులను సేకరించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుందని 1977లో కర్నాటక ప్రభుత్వం వర్సెస్ రంగనాథరెడ్డి కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణయ్యర్ పేర్కొన్నారు. ప్రైవేట్ యాజమాన్యంలోని ఆస్తులు సామాజిక వనరుల నిర్వచనంలోకి రావంటూ ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన మెజారిటీతో తీర్పును వ్యతిరేకించారు. ప్రైవేట్ ఆస్తులు కూడా ఆ నిర్వచనం పరిధిలోకి వస్తాయంటూ ఆయన మైనారిటీ తీర్పు వెలువరించారు. ఆస్తులపై భూస్వాములు, పెట్టుబడిదారుల ఆస్తుల కోటలను బద్దలు కొట్టడానికి ఆర్టికల్ 39(బి)ని రాజ్యాంగంలో ఉద్దేశపూర్వకంగానే చేర్చారని అభిప్రాయపడ్డారు. 1983లో సంజీవ్ చోక్ కేసులో సీజేఐ చిన్నపరెడ్డి కూడా జస్టిస్ కృష్ణయ్యర్ మైనారిటీ తీర్పును పూర్తిగా సమర్థించారు. సామ్యవాద సిద్ధాంతకర్తల ఆదర్శాలే ఆర్టికల్ 39(బి)లో ప్రతిఫలించాయని ఆయన పేర్కొన్నారు. ఆర్టికల్ 39(బి) ఏం చెబుతోందంటే... ‘‘సామాజిక వనరులు సమాజ విశాల హితం కోసం పంపిణీ అయేలా చూడటం ప్రభుత్వ బాధ్యత. ఇందుకు వీలుగా సదరు వనరులపై యాజమాన్యం, నియంత్రణకు అవసరమైన విధానాలను రూపొందించాలి’’. -
ప్రధాని మా ఇంటికి వస్తే తప్పేముంది: సీజేఐ చంద్రచూడ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గణపతి పూజ కోసం తన నివాసానికి రావడంలో తప్పేముందని భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ ప్రశ్నించారు. ప్రధాని రాకలో తప్పేమీ లేదన్నారు. ఇలాంటి అంశాల్లో రాజకీయవర్గాలు పరిణితిని కనబర్చాలని పేర్కొన్నారు. సీజేఐ నివాసానికి ప్రధాని వెళ్లడం తప్పుడు సంకేతాలు వెళ్లడానికి ఆస్కారం కలిగిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆక్షేపించిన విషయం తెలిసిందే. ‘గణపతి పూజ నిమిత్తం ప్రధాని మోదీ నా నివాసానికి వచ్చారు. ఇందులో ఏమాత్రం తప్పు లేదు. కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థల మధ్య జరిగే సమావేశాల్లో ఇదో భాగమే. రాష్ట్రపతి భవన్లోనూ, గణతంత్ర దినోత్సవం.. ఇలా పలు సందర్భాల్లో కలుస్తుంటాం. ప్రధాని, మంత్రులతో మాట్లాడతాం. మా మధ్య సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న కేసుల ప్రస్తావన రాదు. సామాజిక స్థితిగతులు, ప్రజల జీవితాలపై చర్చ జరగుతుంది’అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూపు నిర్వహించిన సదస్సులో సోమవారం ఆయన మాట్లాడారు. రెండు ప్రధాన వ్యవస్థల మధ్య సుహుృద్భావ చర్చలుగా తమ భేటీలను చూడాలని పేర్కొన్నారు. -
సీజేఐ ఇంట్లో గణపతి పూజకు మోదీ హాజరు.. చంద్రచూడ్ రియాక్షన్
న్యూఢిల్లీ: గత నెలలో తన నివాసంలో జరిగిన గణపతి పూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకావడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ స్పందించారు. నాడు గణపతి పూజకు మోదీ రావడంపై చెలరేగిన వివాదాన్ని ఆయన ప్రస్తావించారు. అలాంటి సమావేశాలలో న్యాయపరమైన విషయాలేవీ చర్చించలేదని పేర్కొన్నారు. ఈ మేరకు ముంబైలో లోక్సత్తా లెక్చర్ సిరీస్లో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించడం సర్వసాధారణమని తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో న్యాయవ్యవస్థకు పాలనాపరమైన సంబంధాలు ఉంటాయని, వీటిపై మాట్లాడుకునేందుకు ప్రభుత్వ పెద్దలతో సీజేఐ, హైకోర్టు చీఫ్ జస్టిస్లు సమావేశమవుతారని తెలిపారు. ప్రభుత్వ పెద్దలను కలిస్తే.. ఇద్దరి మధ్యా ఏదో డీల్ కుదిరినట్టు భావించరాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలో మా విధులు మాకు తెలుసు, రాజకీయ నాయకులకు కూడా వారి విధులు తెలుసని తెలిపారు. ఏ న్యాయమూర్తులు కూడా (భారత ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తులు) ఏ ముప్పును కోరి తెచ్చుకోరని మనదేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నదని ఆయన స్పష్టం చేశారు.‘‘ఈ సమావేశాలు ఎందుకు అని ప్రజలు అనుకుంటున్నారు. రాజకీయ వర్గాల్లో కూడా న్యాయవ్యవస్థ పట్ల ఎంతో గౌరవం ఉండడంలోనే మన రాజకీయ వ్యవస్థ పరిపక్వత దాగి ఉంది.. ఇది తెలిసిందే. న్యాయవ్యవస్థకు కావాల్సిన నిధులను (బడ్జెట్) ప్రభుత్వాలు విడుదల చేస్తాయి. కాబట్టే సీఎంలతో సమావేశాలు తప్పనిసరి. ఈ బడ్జెట్ న్యాయమూర్తుల కోసం కాదు. కొత్త కోర్టు భవనాలు, జిల్లా న్యాయమూర్తులకు కొత్త నివాసాలు అవసరం. దీనికి ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి సమావేశాలు అవసరం. ఇలాంటి సమావేశాలు న్యాయ నిర్ణయాలపై కాకుండా న్యాయవ్యవస్థకు సంబంధించిన మౌలిక సదుపాయాల సమస్యలపై మాత్రమే దృష్టి సారిస్తాయి.తాను గతంలో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశానని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ‘ప్రధాన న్యాయమూర్తిని నియమించినప్పుడు వారు ముఖ్యమంత్రి ఇంటికి వెళతారు. అప్పుడు, ముఖ్యమంత్రి చీఫ్ జస్టిస్ ఇంటికి వస్తారు, ఈ సమావేశాలు ఎజెండాను నిర్ణయిస్తాయి. జడ్జిలతో జరిగిన సమావేశంలో ఏ సీఎం కూడా పెండింగ్ కేసుల ప్రస్తావన తేలేదు. జడ్జీలతో జరిగే మీటింగ్స్లో రాజకీయ వ్యవస్థ చాలా పరిపక్వతతో వ్యవహరించింది. దీని కోసం మీరు కలవాల్సిన అవసరం లేదా? కేవలం లేఖలు పంపి ఊరుకుంటే పనులు కావు. న్యాయమూర్తులు నేరుగా మాట్లాడాల్సి ఉంటుంది.’ అని తెలిపారు. -
CJI DY Chandrachud: జూనియర్లకు సరైన వేతనాలివ్వండి
న్యూఢిల్లీ: ‘‘న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి, నైపుణ్యాలు పెంచుకోవడానికి మీ వద్ద పనిచేసే యువతకు సరైన వేతనాలు, పారితోషికాలు చెల్లించడం మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి’’ అని న్యాయవాదులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సూచించారు. న్యాయవాద వృత్తి చాలా సంక్లిష్టమైందని చెప్పారు. ప్రాథమిక స్థాయిలో నేర్చుకున్న నైపుణ్యాలే యువ న్యాయవాదులను ముందుకు నడిపిస్తాయని, అవి వారికి జీవితాంతం తోడ్పడుతాయని తెలిపారు. పునాది బలంగా ఉండాలని పేర్కొన్నారు. తాజాగా ఆలిండియా రేడియో ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రచూడ్ పలు విషయాలు వెల్లడించారు. ఈ వృత్తిలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు ఉంటాయని, ప్రారంభంలో వేతనాలు ఎక్కువగా ఉండకపోవచ్చని వెల్లడించారు. న్యాయవాద వృత్తిలోకి వచ్చేవారు కష్టపడి పనిచేయాలని, నిజాయతీగా ఉండాలని పేర్కొన్నారు. యువ లాయర్లను ప్రోత్సహించడం చాలా ముఖ్యమని స్పష్టంచేశారు. జూనియర్లకు సీనియర్ లాయర్లు గురువులుగా కొత్త విషయాలు నేరి్పస్తూనే సంతృప్తికరమైన వేతనాలు చెల్లించడం తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. తాను కాలేజీలో చదువుకొనే రోజుల్లో ఆలిండియా రేడియోలో ప్రయోక్తగా పనిచేశానని జస్టిస్ చంద్రచూడ్ గుర్తుచేసుకున్నారు. శాస్త్రీయ సంగీత కళాకారిణి అయిన తన తల్లి తనను ముంబైలోని ఆలిండియా రేడియో స్టూడియోకు తీసుకెళ్తూ ఉండేవారని చెప్పారు. 1975లో ఢిల్లీకి వచ్చాక ఆకాశవాణిలో హిందీ, ఇంగ్లిష్ కార్యక్రమాలు నిర్వహించానని వివరించారు. చిన్నప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి రేడియోలో హిందీ, ఇంగ్లి‹Ù, సంస్కృత కార్యక్రమాలు విన్నానని తెలిపారు. దేవకి నందన్ పాండే, పమేలా సింగ్, లోతికా రత్నం గొంతులకు తాను అభిమానినని చెప్పారు. -
సమాజం పట్ల కరుణతోనే న్యాయమూర్తిగా నిలదొక్కుకున్నా..
ముంబై: న్యాయస్థానాలు, న్యాయమూర్తులు సైతం సూక్ష్మ పరిశీలనకు గురి కావాల్సిందేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. న్యాయమూర్తుల పనితీరును చుట్టూ ఉన్న సమాజం పరిశీలిస్తూనే ఉంటుందని అన్నారు. అయితే, సమాజం పట్ల ఉన్న దయ, కరుణ, జాలి, అనురాగం వల్లే తాను అన్ని రకాల పరిశీలనలు, పరీక్షలకు నిలిచి, న్యాయమూర్తిగా నిలదొక్కుకున్నానని తెలిపారు. సమాజం పట్ల తమ ప్రేమానురాగాలు తమ తీర్పుల ద్వారా వెల్లడవుతాయని వివరించారు. జస్టిస్ చంద్రచూడ్ వచ్చే నెల 10వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ముంబైలో ఆయనను ఘనంగా సత్కరించారు. జస్టిస్ చంద్రచూడ్ అందించిన సేవలను న్యాయవాదులు ప్రశంసించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ తాను ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. ‘‘ఐఐటీ–ధన్బాద్లో చేరేందుకు సకాలంలో అడ్మిషన్ ఫీజు రూ.17,500 చెల్లించలేకపోయిన దళిత విద్యార్థికి మా ఆదేశాలతో ప్రవేశం లభించింది. ఇలాంటి తీర్పులు తనకెంతో సంతృప్తిని ఇచ్చాయి’’ అని తెలిపారు. -
సుప్రీంకోర్టు రిపోర్టర్కు లా డిగ్రీ అక్కర్లేదు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో అక్రిడేషన్కు దరఖాస్తు చేసుకొనే రిపోర్టర్లు తప్పనిసరిగా న్యాయవిద్యను అభ్యసించి ఉండాలనే నిబంధనను ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఎత్తివేశారు. ‘సుప్రీంకోర్టు వార్తలను కవర్ చేసే రిపోర్టర్లకు లా డిగ్రీ ఉండాలనే నిబంధన ఎందుకు పెట్టారో తెలియదు. దాన్ని ఎత్తివేస్తూ ఫైల్పై సంతకం చేశాను. ఇక మరింత మంది సుప్రీంకోర్టు అక్రిడేషన్ పొందొచ్చు’ అని సీజేఐ చంద్రచూడ్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. నవంబరు 10వ తేదీన పదవీ విరమణ చేయనున్న జస్టిస్ చంద్రచూడ్ తన హయాంలో పలు సంస్కరణలు తెచ్చారు. ఈ–ఫైలింగ్ను ప్రవేశపె ట్టారు. హైబ్రిడ్ విచారణ పద్ధతి (ప్రత్యక్ష విచా రణ, ఆన్లైన్ విచారణలను కలగలిపి) తెచ్చారు. వాయు కాలుష్యానికి మార్నింగ్ వాక్ ఆపేశాదేశ రాజధానిలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మార్నింగ్ వాక్ను ఆపేశానని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. శ్వాసకోస సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే ఇంటికే పరిమితం కావాలని డాక్టర్ తనకు సూచించారని వెల్లడించారు. ‘ఈ రోజు నుంచే మార్నింగ్ వాక్ ఆపేశా. సాధారణంగా ఉదయం 4–4.15కు మార్నింగ్ వాక్కు వెళతా’ అని తెలిపారు. -
వైవాహిక అత్యాచారం కేసుల విచారణ వాయిదా
న్యూఢిల్లీ: వైవాహిక అత్యాచారం ఘటనల్లో భర్తపై నేరం మోపకుండా చట్టం కల్పిస్తున్న రక్షణలపై నమోదైన కేసుల విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నాలుగు వారాలు వాయిదావేసింది. నవంబర్ పదో తేదీన సీజేఐ చంద్రచూడ్ పదవీవిరమణ నేపథ్యంలో ఇక ఈ కేసులను ఆయన విచారించబోరని తెలుస్తోంది. కోర్టుకు దీపావళి సెలవు దినాలు మొదలుకానున్న నేపథ్యంలో ఈ కేసుల వాదోపవాదనలను ముగించలేకపోతున్నానని ఆయన చెప్పారు. కేసులో తగిన పత్రాల దాఖలుకు సంబంధిత న్యాయవాదులకు తగు గడువు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం కాకుండా ఈ కేసుల తదుపరి విచారణను మరో ధర్మాసనం ఆలకించే వీలుంది. మైనర్కాని భార్యతో బలవంతంగా శృంగారం చేసిన భర్తకు భారతీయ శిక్షా స్మృతి, భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) చట్టాలు విచారణ నుంచి రక్షణ కల్పిస్తున్న విషయం తెల్సిందే. ఈ కేసుల విచారణ అక్టోబర్ 17న మొదలైంది. ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం 18ఏళ్లు దాటిన భార్యతో బలవంతగా భర్త సంభోగించినా అది రేప్గా పరిగణించబోరు. అలాగే బీఎన్ఎస్లోని సెక్షన్ 63(రేప్)(2) ప్రకారం చూసినా ఈ చర్యను అత్యాచారంగా పరిగణించరు. మారుతున్న సామా జిక పోకలు, ఆధునిక సమాజంలో భర్త సాన్నిహిత్య పరిస్థితుల్లో భార్య సమ్మతి ఉంది లేదు అనే అంశాన్ని నిరూపించడం అసంభవమని కేంద్రం గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది. చట్టాలను దుర్విని యోగం చేస్తూ ఈ మినహాయింపు రక్షణ నుంచి భర్తను పక్కకు జరిపితే భారతీయ సామాజిక, కుటుంబ వ్యవస్థలో కొత్త సమస్యలు ఉత్పన్నమ య్యే ప్రమాదముందని కేంద్రం పేర్కొంది. -
బైజూస్కు మరో ఎదురుదెబ్బ..
న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ బైజూస్(థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థపై దివాలా చర్యలు చేపట్టకుండా నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్క్లాట్) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. సెటిల్మెంట్ నగదు రూ.158.9 కోట్లను కమిటీ ఆఫ్ క్రెడిటర్(సీఓసీ) వద్ద డిపాజిట్ చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బీసీసీఐని ఆదేశించింది. ఎన్క్లాట్ తీర్పును వ్యతిరేకిస్తూ అమెరికా సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. 61 పేజీల తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో బైజూస్పై ఆ కంపెనీ వ్యవస్థాపకులైన బైజూ రవీంద్రన్, ఆయన సోదరుడు రిజూ రవీంద్రన్ మరోసారి నియంత్రణ కోల్పోనున్నారు. బీసీసీఐతో రూ.158.9 కోట్ల వ్యవహారాన్ని సెటిల్మెంట్ చేసుకోవడానికి బైజూస్ అంగీకరించడంతో ఆ సంస్థపై దివాలా చర్యలు చేపట్టకుండా ఆగస్టు 2న ఎన్క్లాట్ తీర్పు ఇచ్చింది. -
జస్టిస్ పేరు తప్పుగా పలికిన న్యాయవాది.. సీజేఐ ఏమన్నారంటే..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కేసుల విచారణ, జైలు శిక్షలు, బెయిల్ మంజూరు, కస్టడీ పొడగింపులు ఇవే గుర్తొస్తాయి. కానీ సర్వోన్నత న్యాయస్థానంలో కొన్నిసార్లు ఆసక్తికరమైన, ఫన్నీ, సీరియస్ సంభాషణలు కూడా జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఓ సన్నివేశం సీజేఐ, న్యాయవాదికి మధ్య జరిగింది. కేసులో విచారణలో భాగంగా ఓ న్యాయవాది జస్టిస్ హృషికేష్ రాయ్ను ‘జస్టిస్ హృషికేశ్ ముఖర్జీ’గా సంబోధించాడు. గతంలో సుప్రీంకోర్టు విచారించిన ఓ పిటిషన్ను ప్రస్తావిస్తూ..‘ఈ కేసు జస్టిస్ మృషికేష్ ముఖర్జీ ముందు ఉంది’ అని పేర్కొన్నారు.దీంతో వెంటనే స్పందించిన సీజేఐ డీవీ చంద్రచూడ్... న్యాయవాది వ్యాఖ్యలను సరిచేశారు. హృషికేష్ ముఖర్జీనా లేఖ హృషికేశ్ రాయ్? అని ప్రశ్నించారు. రాయ్ను ముఖర్జీగా చేశారని అన్నారు. న్యాయవాదులు తప్పనిసరిగా న్యాయమూర్తుల పేర్లు క్షుణ్ణంగా తెలుసుకొని ఉండాలని సూచించారు. ఇదే చివరి అవకాశమని, వెళ్లి వెబ్సైట్ను తనిఖీ చేయాలని పేర్కొన్నారు. కాగా జస్టిస్ హృషికేష్ రాయ్ సెప్టెంబరు 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, గౌహతి హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. న్యాయమూర్తి కాకముందు సీనియర్ న్యాయవాదిగా కూడా పనిచేశారు. ఇదిలా ఉండగా హృషికేష్ ముఖర్జీ భారతీయ సినీ దర్శకుడు, ఎడిటర్, రచయిత. -
CJI Chandrachud: అయోధ్య సమస్య పరిష్కారం కోసం దేవుడిని ప్రార్థించా
పుణే: రామ జన్మ భూ మి–బాబ్రీ మసీదు వి వాదం పరిష్కారం కోసం భగవంతుడిని ప్రార్థించానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. భగవంతుడి పట్ల విశ్వాసం ఉంటే ఆయన కచ్చితంగా పరిష్కార మార్గం చూపిస్తాడని అన్నారు. జస్టిస్ చంద్రచూడ్ వచ్చే నెలలో పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన స్వస్థలం మహారాష్ట్రలోని ఖేడ్ తాలూకా కన్హేర్సార్. ఈ గ్రామ ప్రజలు ఆదివారం ఆయనను సత్కరించారు. కేసుల విచారణ సమయంలో న్యాయమూర్తులకు కొన్నిసార్లు పరిష్కార మార్గాలు కనిపించవని ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. అయోధ్య వ్యవహారంపై విచారణ జరుగుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితి తనకు ఎదురైందన్నారు. అప్పుడు భగవంతుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థించానని, సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకున్నానని తెలిపారు. తాను తరచుగా దేవుడిని ప్రార్థిస్తుంటానని పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా 2019 నవంబర్ 9న అప్పటి సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ధర్మాసనంలో జస్టిస్ చంద్రచూడ్ కూడా ఒక సభ్యుడే. -
ప్రజా న్యాయస్థానం సుప్రీంకోర్టు
పనాజీ: పార్లమెంట్లో ప్రతిపక్షాలు పోషించే పాత్రను సుప్రీంకోర్టు పోషించకూడదని అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. ప్రజల కోర్టుగా సుప్రీంకోర్టు పాత్రను ఎప్పటికీ పరిరక్షించాలని చెప్పారు. భవిష్యత్తులోనూ ప్రజల న్యాయస్థానంగానే పని చేయాలని పేర్కొన్నారు. ప్రజల కోర్టు అంటే దాని అర్థం పార్లమెంట్లో ప్రతిపక్షాలు పోషించే పాత్ర కాదని ఉద్ఘాటించారు. గోవాలో శనివారం సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్(ఎస్సీఏఓఆర్ఏ) సదస్సులో జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగించారు. సుప్రీంకోర్టు నుంచి న్యాయం పొందే విషయంలో గత 75 ఏళ్లలో ఒక స్పష్టమైన విధానం అభివృద్ధి చేసుకున్నామని, అది దారితప్పకుండా జాగ్రత్తపడాలని చెప్పారు. సమాజంలో సంపద పెరుగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో ధనవంతులకే న్యాయం దక్కుతుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని పేర్కొన్నారు. అందులో ఎలాంటి నిజం లేదని, సుప్రీంకోర్టు అంటే ముమ్మాటికీ ప్రజల కోర్టు అని స్పష్టంచేశారు. సుప్రీంకోర్టును చూసే దృక్కోణం విషయంలో జనం మధ్య విభజన కనిపిస్తోందన్నారు. అనుకూలమైన తీర్పు వస్తే సుప్రీంకోర్టు చాలా గొప్పదని ప్రశంసించడం ప్రతికూలమైన తీర్పు వస్తే దూషించడం పరిపాటిగా మారిందన్నారు. కేవలం తీర్పుల ఆధారంగా సుప్రీంకోర్టు పనితీరు, అది పోషించే పాత్రను నిర్ణయించడం సరికాదన్నారు. కేసులో మెరిట్ను బట్టే న్యాయమూర్తులు తీర్పు ఇస్తుంటారని, ఇందులో వారి సొంత అభిప్రాయానికి స్థానం ఉండదని గుర్తుచేశారు. జడ్జిలు స్వతంత్రంగా వ్యవహరిస్తుంటారని చెప్పారు. ప్రజల ఇళ్లలోకి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలోఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు కేసుల ఈ–ఫైలింగ్, కేసు రికార్డుల డిజిటలైజేషన్, కోర్టు వ్యవహారం ప్రత్యక్ష ప్రసారం వంటివి తీసుకొచ్చామని గుర్తుచేశారు. ప్రత్యక్ష ప్రసారం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు అని తెలిపారు. ఇప్పుడు కోర్టురూమ్ అనేది కొందరు లాయర్లు, జడ్జిలకు మాత్రమే పరిమితం కాదని, అది ప్రజలకు ఒక్క క్లిక్తో అందుబాటులోకి వచి్చందని హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నేరుగా ప్రజల ఇళ్లల్లోకి చేరిందన్నారు. కోర్టుల్లో గౌరవప్రదమైన భాష వాడుదాం మనుషులను కించపర్చే భాషకు కోర్టు ప్రాంగణాల్లో స్థానం లేదని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. ప్రధానంగా మహిళల పట్ల అభ్యంతర వ్యాఖ్యలు, దిగజారుడు భాషను సహించే ప్రసక్తే లేదని అన్నారు. మహిళలతోపాటు సమాజంలోని అణగారిన వర్గాలపై ఇష్టానుసారంగా నోరుపారేసుకోవడం కొందరికి అలవాటని చెప్పారు. అభ్యంతరకర భాష పట్ల మహిళా న్యాయవాదుల నుంచి తమకు ఫిర్యాదులు వస్తుంటాయని తెలిపారు. న్యాయ వ్యవస్థలోనూ ఇలాంటి జాడ్యం ఉందని, ఈ పరిస్థితి మారాలని తేలి్చచెప్పారు. న్యాయస్థానాల్లో ఉపయోగించే భాష పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతవాతావరణ మార్పుల దుష్పరిణామాల పట్ల జస్టిస్ చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పుల కారణంగా సమాజంలో అట్టడుగు వర్గాలే ఎక్కువగా నష్టపోతున్నాయని చెప్పారు. రైతులు, మత్స్యకారులు, పేదలకు తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. గోవా గవర్నర్ పి.ఎస్.శ్రీధరన్ పిళ్లై రాసిన ‘భారతదేశ సంప్రదాయ వృక్షాలు’ అనే పుస్తకాన్ని జస్టిస్ చంద్రచూడ్ శనివారం ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని స్పష్టంచేశారు. -
కేసుల పరిష్కారానికి గడువు పెట్టలేం
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని కోర్టుల్లో కేసులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేలా ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఇది అమెరికా సుప్రీంకోర్టు కాదని వ్యాఖ్యానించింది. అలా గడువు పెట్టలేమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టుతో సహా దేశంలోని అన్ని కోర్టుల్లో దాఖలయ్యే కేసులను 12 నుంచి 36 నెలల్లోగా పరిష్కరించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ కోరారు. విదేశాల్లో కేసుల పరిష్కారానికి నిర్దిష్ట గడువు ఉన్న విషయాన్ని పిటిషనర్ ఎత్తిచూపగా.. ‘మాది అమెరికా సుప్రీంకోర్టు కాదు’ అని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టులో అన్ని కేసుల్లోనూ 12 నెలల్లో విచారణా పూర్తికావాలని కోరుకుంటున్నారా? అని పిటిషనర్ను ప్రశ్నించింది. ఇది అత్యంత అభిలషణీయమైనా.. ఆచరణసాధ్యం కాదని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, జడ్జిల సంఖ్య పెంచడం.. లాంటివెన్నో అవసరమవుతాయన్నారు. అమెరికా, ఇతర పాశ్చాత్యదేశాల్లో ఒక ఏడాదిలో సుప్రీంకోర్టులు ఎన్ని కేసులు పరిష్కరిస్తాయో మీకు తెలుసా? అని పిటిషనర్ను అడిగారు. కొన్ని పాశ్చాత్యదేశాల సుప్రీంకోర్టులు ఏడాది మొత్తం పరిష్కరించే కేసుల కంటే భారత సుప్రీంకోర్టు ఒక్కరోజు వినే కేసులే ఎక్కువన్నారు. భారత్లో అందరికీ న్యాయం పొందే అవకాశాన్ని మన వ్యవస్థ కల్పిస్తోందని, ఎవరినీ అడ్డుకోలేమని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. -
తూచా తప్పకుండా అమలవాల్సిందే
న్యూఢిల్లీ: బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు పేర్కొంది. దాని అమలులో వ్యక్తిగత వివాహ చట్టాలతో పాటు మరే ఇతర చట్టాలూ అడ్డంకి కాజాలవని స్పష్టం చేసింది. వాటిలో ఏది ముందనే ప్రశ్న తలెత్తే సందర్భంలో బాల్య వివాహాల నిషేధ చట్టమే అమలవుతుందని పేర్కొంది. సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు 141 పేజీల తీర్పు వెలువరించింది. బాల్య వివాహాల కట్టడికి మరింత సమర్థమైన విధానాలను అమలు చేయాలంటూ దాఖలైన పిల్పై ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘బాల్య వివాహాలు ఒక సామాజిక రుగ్మత. బాలలకు, ముఖ్యంగా బాలికలకు ఆరోగ్యం, విద్య, ఉపాధితో పాటు జీవించే అవకాశాలనే ప్రశ్నార్థకం చేస్తుంది. కానీ భారత్లో బాల్య వివాహాలు ఇంకా ప్రబలంగా ఉండటం దురదృష్టకరం’’ అంటూ ఆవేదన వెలిబుచ్చింది. వాటి కట్టడికి జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా బాల్య వివాహాల నిషేధ అధికారులను నియమించాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. చట్టం అమలు తీరుతెన్నులపై మహిళా, శిశు సంక్షేమ, హోం శాఖలు మూడు నెలలకు ఓసారి సమీక్ష జరపాలని సూచించింది. బాల్య వివాహాలు తప్పని, వాటికి కఠిన శిక్షలు తప్పవని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ‘‘వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలపై ఉంటుంది. ఇందుకోసం పోలీసు శాఖలో జువనైల్ విభాగాన్ని ఏర్పాటు చేయాలి’’ అని పేర్కొంది. -
Supreme Court: రాజ్యాంగబద్ధతను తేలుస్తాం
న్యూఢిల్లీ: మారిటల్ రేప్ నుంచి భర్తలకు రక్షణ కల్పిస్తున్న ఐపీసీ, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని మినహాయింపు నిబంధనల రాజ్యాంగబద్ధతను తేలుస్తామని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. భార్య సమ్మతి లేకుండా ఆమెతో భర్త బలవంతంగా సంభోగం జరపడాన్ని మారిటల్ రేప్గా పరిగణిస్తారు. పాశ్చాత్య దేశాల్లో ఇది క్రిమినల్ నేరం. భారత్లో చట్టాలు దీనికి మినయింపునిస్తున్నాయి. మారిటల్ రేప్ నేరం కాదని భర్తలకు రక్షణ కల్పిస్తున్నాయి. భార్య 18 ఏళ్ల లోపు మైనర్ కాకుంటే మారిటల్ రేప్ నేరం కాదని పేర్కొంటున్నాయి. దీన్ని పలువురు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ పిటిషన్పై గురువారం విచారణ జరిపిన సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్పై పిటిషనర్ల ప్రతిస్పందన కోరింది. మారిటల్ రేప్ను నేరంగా చేస్తే దాంపత్య బంధంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని, వివాహ వ్యవస్థ ఒడిదుడుకులకు లోనవుతుందని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఇదే విషయాన్ని తాజా అఫిడవిట్లో సుప్రీంకోర్టు ముందుంచింది. ‘ఇది రాజ్యాంగబద్ధతకు సంబంధించిన అంశం. ఈ అంశంలో రెండు గత తీర్పులున్నాయి. మినహాయింపును ఇస్తున్న నిబంధనల రాజ్యాంగబద్ధతను తేల్చడమే ముఖ్యం’ అని సీజేఐ చంద్రచూడ్ విచారణ సందర్భంగా అన్నారు. భార్య వయసు 18 ఏళ్ల లోపు కానంతవరకు భర్త ఆమెను బలవంతంగా అనుభవించినా అది నేరం కాదు.. అని బీఎన్ఎస్లో సెక్షన్ 63 (రేప్) మినహాయింపు–2 చెబుతోంది. రాజ్యాంగ విరుద్ధమైన ఈ నిబంధనను కొట్టివేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కరుణా నంది కోరారు. ‘మారిటల్ రేప్కు మినయింపు నిబంధన.. ఆర్టికల్ 14 (సమానత్వపు హక్కు), ఆర్టికల్ 19, ఆరి్టకల్ 21 (జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛ)కు భంగకరమని మీరు అంటున్నారు. 18 ఏళ్లు పైబడిన భార్యతో భర్త బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడ్డా అది రేప్ కాదని మినహాయింపును ఇచి్చనపుడు పార్లమెంటు భావించింది. భర్తలకు రక్షణ కల్పిస్తున్న మినహాయింపును కొట్టివేస్తే అప్పుడా లైంగిక చర్య రేప్ నిర్వచనం కిందకు వస్తుంది. అలాంటపుడు దీన్ని ప్రత్యేక నేరంగా చూడాలా? మినహాయింపు చట్టబద్ధతను తేల్చాలా? అనే సమస్య కోర్టులకు ఉత్పన్నమవుతుంది’అని ధర్మాసనం పేర్కొంది. ‘భర్త డిమాండ్ చేస్తాడు. భార్య నిరాకరిస్తుంది. ఈ సందర్భంలో భర్త ఆమెను నిర్భందిస్తే అది చట్టవిరుద్ధమవుతుంది. ఆమెను గాయపరిస్తే నేరపూరిత బెదిరింపు అవుతుంది. చివరికి భార్య లొంగిపోతే అప్పుడా సంభోగం నేరం కాదు. మిగతావన్నీ నేరాలైనపుడు చివరికి ఎందుకు కాదనేగా మీ ప్రశ్న’ అని జస్టిస్ పారి్థవాలా అన్నారు. ‘కాదంటే కాదనే అర్థం. ఒక మహిళ వద్దు అదంటే వద్దనే అర్థం. వైవాహిక బంధంలో బలవంతంగా సంభోగం జరిపినా అది రేప్ అవుతుంది. కేసు నమోదు చేయాల్సిందే’ అని పిటిషనర్ తరఫున వాదించిన కోలిన్ గొంజాల్వెజ్ అన్నారు. వాదనల తర్వాత కేసు ఈనెల 22వ తేదీకి వాయిదా పడింది. -
తదుపరి సీజేఐ జస్టిస్ ఖన్నా
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియ మొదలైంది. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం ఇందుకు శ్రీకారం చుట్టారు. తన వారసునిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును సిఫార్సు చేస్తూ కేంద్ర న్యాయ శాఖకు లేఖ రాశారు. కేంద్రం లాంఛనంగా ఆమోదం తెలిపిన అనంతరం జస్టిస్ ఖన్నా సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి అవుతారు. నవంబర్ 10న జస్టిస్ చంద్రచూడ్ రిటైరవనున్నారు. అనంతరం 11న జస్టిస్ ఖన్నా సీజేఐగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆరు నెలలకు పైగా సేవలందించి 2025 మే 13న రిటైరవుతారు. జస్టిస్ చంద్రచూడ్ తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి ఖన్నాయే. సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగా ఉన్నవారే తదుపరి సీజేఐ కావడం పరిపాటి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లు. జస్టిస్ చంద్రచూడ్ దాదాపు రెండేళ్లుగా సీజేఐగా సేవలందిస్తుండటం తెలిసిందే. తదుపరి సీజేఐ పేరును సూచించాల్సిందిగా కేంద్ర న్యాయ శాఖ గత శుక్రవారం ఆయన్ను అభ్యరి్థంచింది. చరిత్రాత్మక తీర్పులు జస్టిస్ సంజీవ్ ఖన్నా న్యాయ కోవిదునిగా పేరొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు. ఈవీఎంలు సురక్షితమైనవని, బూత్ల ఆక్రమణ, బోగస్ ఓటింగ్లకు చెక్ పెడతాయని స్పష్టం చేయడమే గాక ఎన్నికల్లో వాడకాన్ని సమరి్థస్తూ తీర్పు ఇచ్చారు. వీవీప్యాట్ల ద్వారా ఈవీఎం ఓట్లను నూరు శాతం వెరిఫై చేయాలంటూ దాఖలైన కేసును కొట్టేసిన ఆ ధర్మాసనానికి ఆయనే సారథి. ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమైనదంటూ తీర్పు వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా సభ్యులు. జమ్మూ కశీ్మర్కు ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తున్న ఆరి్టకల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమరి్థంచిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా ఆయన ఉన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైలుపాలైన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీస్అథారిటీ (ఎన్ఏఎల్ఎస్ఏ) ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా కూడా సేవలందిస్తున్నారు.హైకోర్టు సీజే కాకుండానే... జస్టిస్ ఖన్నా 1960 మే 14న జని్మంచారు. ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లా సెంటర్లో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్ సభ్యునిగా నమోదు చేసుకున్నారు. తీస్హజారీ జిల్లా కోర్టుల్లో న్యాయవాదిగా కెరీర్ మొదలు పెట్టారు. అనంతరం ఢిల్లీ హైకోర్టుతోపాటు పలు ట్రిబ్యునళ్లలో న్యాయవాదిగా పలు ప్రతిష్టాత్మక కేసులను వాదించి సమర్థునిగా పేరు తెచ్చుకున్నారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, ఏడాది అనంతరం శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఏ హైకోర్టుకూ ప్రధాన న్యాయమూర్తిగా పని చేయకుండానే నేరుగా ఈ ఘనత సాధించిన అతి కొద్దిమందిలో ఒకరిగా నిలిచారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఆర్ ఖన్నాకు ఆయన మేనల్లుడు. 1973లో కేశవానంద భారతి కేసులో మౌలిక నిర్మాణ సిద్ధాంతానికి సంబంధించి చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా సభ్యుడు. ఎమర్జెన్సీ వేళ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కు వంటి ప్రాథమిక హక్కులను కూడా సస్పెండ్ చేయవచ్చంటూ 1976లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పుతో విభేదించిన ఏకైక సభ్యునిగా ఆయన సుప్రసిద్ధులు. ఈ కారణంగా తనను కాదని జూనియర్ను సీజేఐగా నియమించడంతో న్యాయమూర్తి పదవికి రాజీనామా చేశారు. చదవండి: పంట వ్యర్థాల దహనంపై సుప్రీం కన్నెర్ర -
కళ్లారా చూస్తూ సమన్యాయం
న్యూఢిల్లీ: బ్రిటిష్ వలసపాలన నాటి కాలంచెల్లిన చట్టాలకు చరమగీతం పాడిన ప్రస్తుత తరుణంలో న్యాయదేవతకు సర్వోన్నత న్యాయస్థానం సరికొత్త రూపునిచ్చింది. ఖడ్గధారి అయిన న్యాయదేవత ఎడమ చేతిలో ఇకపై భారత రాజ్యాంగ ప్రతికి స్థానం కల్పించారు. చట్టానికి కళ్లు లేవు అనే పాత సిద్ధాంతాన్ని పక్కనబెట్టి న్యాయదేవతకు ఉన్న గంతలనూ తీసేశారు. కళ్లారా చూస్తూ సమన్యాయం అందించే న్యాయదేవతను సుప్రీంకోర్టు న్యాయమూర్తుల గ్రంథాలయంలో కొలువుతీర్చారు. సీజేఏ డీవై చంద్రచూడ్ ఆదేశానుసారం న్యాయదేవత శిల్పంలో మార్పులు తీసుకొచ్చారు. చట్టం కళ్లులేని కబోదికాదని, బ్రిటిష్ వలస వాసనలను వదిలించుకుని భారత న్యాయవ్యవస్థ ఆధునికతను సంతరించుకోవాలని.. రాజులకాలంనాటి ఖడ్గంతో తీర్పు చెప్పడానికి బదులు భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ తీర్పు చెప్పినట్లు విగ్రహం ఉండాలని సీజేఐ చేసిన సూచనల మేరకు ఈ మార్పులు జరిగాయి. విదేశీవనిత వేషధారణలోకాకుండా గాజులు, నగలు, నిండైన చీరకట్టుతో అచ్చమైన భారతీయ వనితలా స్వచ్ఛతను స్ఫురణకు తెస్తూ శ్వేతవర్ణ న్యాయదేవతకు తుదిరూపునిచ్చారు. -
న్యాయం మరింత బలోపేతం: చంద్రచూడ్
సుప్రీంకోర్టు భవన సముదాయాన్ని విస్తరించడమంటే.. న్యాయాన్ని మరింత బలోపేతం చేయడమేనని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. భవిష్యత్తు న్యాయవ్యవస్థకు పునాదిరాయి వేయడమేనని పేర్కొన్నారు. సోమవారం రూ.800 కోట్లతో సుప్రీంకోర్టు విస్తరణ పనులకు సీజేఐ చంద్రచూడ్ భూమిపూజ చేసి కొబ్బరికాయ కొట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్, జస్టిస్ బి.వి.నాగరత్న పాల్గొన్నారు. -
DY Chandrachud: న్యాయ వ్యవస్థకు ప్రజా విశ్వాసమే కీలకం
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థకు, న్యాయమూర్తులకు ప్రజా విశ్వాసమే అత్యంత కీలకమని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. ప్రజల నమ్మకం చూరగొనేలా పని చేయాలని న్యాయమూర్తులకు సూచించారు. ప్రజలు నేరుగా ఎన్నుకోనప్పటికీ, ప్రజా తీర్పునకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ న్యాయమూర్తులపై గురుతర బాధ్యత ఉందని చెప్పారు. జడ్జిగా విశ్వసనీయత, తగిన గుర్తింపు పొందాలంటే ప్రజల ఆమోదం, నమ్మకం చాలా ముఖ్యమని అన్నారు. భూటాన్లోని ‘జేఎస్డబ్ల్యూ స్కూల్ ఆఫ్ లా’లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగించారు. ప్రజలకు నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా కోర్టులు పరిష్కరిస్తుంటాయని పేర్కొన్నారు. అందుకే వారి విశ్వాసం పొందడం చాలా ముఖ్యమని స్పష్టంచేశారు. ఏ దేశంలోనైనా ప్రజల మద్దతుతో న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే అక్కడ రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన పాలన సజావుగా సాగుతుందని వివరించారు. ప్రజాభిప్రాయం అనేది న్యాయ వ్యవస్థలో అంతర్గత తనిఖీగా తోడ్పడుతుందని సూచించారు. న్యాయ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేవలం న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్లు ప్రజలకు కనిపించాలని స్పష్టంచేరు. భారత్లోని కోర్టుల్లో ప్రవేశపెట్టిన సాంకేతిక విధానాలను జస్టిస్ చంద్రచూడ్ ప్రస్తావించారు. వర్చువల్ విచారణ, కోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం, కేసుల ఈ–ఫైలింగ్, ఆన్లైన్ కేసు సమాచార వ్యవస్థ, కృత్రిమ మేధ(ఏఐ)తో కోర్టు తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించడం వంటి విధానాలు తీసుకొచ్చామని వెల్లడించారు. ఇవి సత్ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. సామాన్య ప్రజల కోసం సుప్రీంకోర్టు ప్రక్రియలను మరింత సులభతరం చేశామని చెప్పారు. -
DY Chandrachud: చరిత్ర ఎలా గుర్తుపెట్టుకుంటుందో?!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పూర్తి అంకితభావంతో దేశానికి సేవలందించానని జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. తన పదవీ కాలాన్ని చరిత్ర ఎలా గుర్తు పెట్టుకుంటుందో అనే భయం, ఉత్కంఠ తనలో ఉన్నాయని తెలిపారు. భారతదేశ సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ చంద్రచూడ్ పదవీ కాలం నవంబర్ 10వ తేదీన ముగియనుంది. మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్నారు. బుధవారం భూటాన్లోని ‘జిగ్మే సింగ్యే వాంగ్చుక్ స్కూల్ ఆఫ్ లా’ మూడో స్నాతకోత్సవంలో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడారు. ‘‘నా పదవీ కాలం ముగింపునకు వచి్చంది. భవిష్యత్తు, గతానికి సంబంధించి భయాలు, ఆందోళనలు నా మనసులో నిండిపోయాయి. ఎన్నో ప్రశ్నలు నాలో తలెత్తుతున్నాయి. నేను సాధించాల్సినవన్నీ సాధించానా? ప్రధాన న్యాయమూర్తిగా నా పదవీ కాలాన్ని చరిత్ర ఏ విధంగా నిర్ణయిస్తుంది? ఎలా గుర్తుపెట్టుకుంటుంది? చేయాల్సిన పనులు భిన్నంగా చేశానా? లేదా? భవిష్యత్తు తరాల న్యాయమూర్తులకు, న్యాయ నిపుణులకు, న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి ఎలాంటి వారసత్వాన్ని అందించబోతున్నాను? ఈ ప్రశ్నల్లో చాలావాటికి సమాధానాలు నా నియంత్రణలో లేవు. బహుశా కొన్ని ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానాలు కనిపెట్టలేనేమో! గత రెండేళ్లుగా అంకితభావంతో పనిచేశా. పదవికి పూర్తి న్యాయం చేయాలని ప్రతినిత్యం ఉదయం నిద్రలేవగానే నిర్ణయించుకునేవాడిని. రాత్రి సంతృప్తితో నిద్రకు ఉపక్రమించేవాడిని. న్యాయవాద వృత్తి అనే ప్రయాణంలో ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి. అలాంటప్పుడు ఒక అడుగు వెనక్కి వేయడానికి, మనల్ని మనం పునఃసమీక్షించుకోవడానికి సంకోచించాల్సిన పనిలేదు. లక్ష్యం వైపు ప్రయాణిస్తున్నానా? లేక నా వైపు నేను ప్రయాణిస్తున్నానా? అని న్యాయవాదులు, న్యాయమూర్తులు ప్రశ్నించుకోవాలి. భయాలు, సందేహాలు విడిచిపెట్టాలి. లక్ష్యం వైపు సాగే ప్రయాణాన్ని ఆస్వాదించాలి. భయాలను ఎదిరించడంలోనే మన అభివృద్ధి దాగి ఉంటుంది’’ అని జస్టిస్ చంద్రచూడ్ ఉద్బోధించారు. ఆయన 2022 నవంబర్ 9న సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నో కీలకమైన తీర్పులు వెలువరించారు. న్యాయ వ్యవస్థలో పారదర్శకతకు పెద్దపీట వేశారు. -
CJI DY Chandrachud: ఇది కాఫీ షాప్ కాదు..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట కాస్తంత మర్యాద తగ్గించి మాట్లాడిన పిటిషనర్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషనర్ ధోరణిని తీవ్రంగా తప్పుబట్టారు. సోమవారం విచారణ సందర్భంగా ‘ఎస్’ అనడానికి బదులుగా ‘యా’ అని సమాధానమిచ్చిన పిటిషనర్పై సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. ‘‘యా. యా. యా’ అని అనకండి. ‘ఎస్’ అని మాట్లాడండి. యా అంటూ పిచ్చాపాటీగా మాట్లాడటానికి ఇది కాఫీ షాప్ కాదు. సుప్రీంకోర్టు. ‘యా’ అని పలికే వ్యక్తులంటే నాకు కొంచెం పడదు. మీ నుంచి ఇలాంటి మాటలను కోర్టు అనుమతించబోదు’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. దీంతో పిటిషనర్ వెంటనే తన భాషను సరిదిద్దుకున్నారు. మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తనను చట్టవిరుద్ధంగా విధుల నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టేయడాన్ని పిటిషనర్ మళ్లీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ రిట్ పిటిషన్ను సోమవారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. గొగోయ్పై విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. గొగోయ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న విషయం తెలిసిందే. ‘‘ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలపై సుప్రీంకోర్టుకు నేరుగా అప్పీళ్లను అనుమతించే ఆర్టికల్ 32 కింద ఈ అప్పీల్ చేయొచ్చా? ఈ అప్పీల్ను ఆ ఆర్టికల్ కింద పరిగణనలోకి తీసుకోవచ్చా? అనే ప్రశ్నలను కోర్టు లేవనెత్తింది. న్యాయమూర్తిని ప్రతివాదిగా చేర్చి పిల్ను ఎలా దాఖలు చేశారు?’’ అని సీజేఐ ప్రశ్నించారు. దీంతో పిటిషనర్ స్పందిస్తూ.. ‘‘యా. యా. అప్పటి సీజేఐ రంజన్ గొగోయ్. క్యూరేటివ్ దాఖలు చేయమని నాకు సూచించారు’’ అంటూ యథాలాపంగా సాధారణ భాషలో మాట్లాడారు. దీంతో సీజేఐ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘జస్టిస్ గొగోయ్ ఈ కోర్టు మాజీ న్యాయమూర్తి. ఒక న్యాయమూర్తిపై ఇలాంటి పిటిషన్ దాఖలు చేసి అంతర్గత విచారణ కోరలేరు. ఎందుకంటే గతంలోనే ఇదే విషయంలో మీరు కేసు ఓడిపోయారు’’ అని సీజేఐ అన్నారు. అప్పుడు పిటిషనర్ స్పందిస్తూ, ‘‘కానీ జస్టిస్ గొగోయ్ నేను సవాలు చేసిన ప్రకటనను బట్టి నా పిటిషన్ను తిరస్కరించారు. నా తప్పేమీ లేదు. కార్మిక చట్టాలపై అవగాహన ఉన్న ధర్మాసనం ముందు నా రివ్యూ పిటిషన్ను పరిశీలించాలని నాటి సీజేఐ ఠాకూర్ను కోరా. కానీ నా అభ్యర్థనను తోసిపుచ్చారు’’ అంటూ కేసు నేపథ్యాన్ని వివరించారు. సీజేఐ, పిటిషనర్ కొద్దిసేపు మరాఠీలో మాట్లాడుకున్నారు. తర్వాత ‘‘జస్టిస్ గొగోయ్ పేరును పిటిషన్ నుంచి తొలగించండి. అప్పుడు ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పరిశీలిస్తుంది’’ అని సీజేఐ సూచించారు. -
Supreme Court: ఆ విద్యార్థికి ఐఐటీ సీటివ్వండి
న్యూఢిల్లీ: నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివినా సమయానికి ప్రవేశరుసుం కట్టలేక ప్రతిష్టాత్మక ఐఐటీ ధన్బాద్లో సీటు కోల్పోయిన దళిత విద్యార్థికి సర్వోన్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. వెంటనే ఆ విద్యార్థి అతుల్ కుమార్కు సీటు ఇవ్వాలని ఐఐటీ ధన్బాద్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం సోమవారం ఆదేశించింది. జూన్ 24వ తేదీ సాయంత్రం ఐదింటిలోపు అడ్మిషన్ ఫీజు రూ.17,500 కట్టలేకపోవడంతో బీటెక్ సీటు కోల్పోయిన తనకు న్యాయం చేయాలంటూ విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే. ‘‘ విద్యార్థి ఆరోజు ఆన్లైన్లో ఫీజు చెల్లింపు కోసం మధ్యాహ్నం మూడు గంటలకే లాగిన్ అయ్యాడు. తర్వాత పదేపదే ఎస్ఎంఎస్లు, వాట్సాప్లో రిమైండ్లతో గడువును గుర్తుచేశాం’’ అని ఐఐటీ సీట్ల కేటాయింపు విభాగం వాదించింది. దీంతో సీజేఐ కలగజేసుకుని ‘‘మీరెందుకంతగా వ్యతిరేకిస్తున్నారు?. ఈ పిల్లాడికి ఏమైనా చేయగలవేమో చూడండి. ఆ డబ్బులే ఉంటే కట్టకుండా ఎందుకుంటాడు? అణగారిన వర్గాలకు చెందిన రోజువారీ కూలీ కుమారుడు. పైగా అతనిదిదారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబం. ఐఐటీలో సీటు కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు. ప్రతిభగల ఇలాంటి విద్యార్థిని మనం ఊరకనే వదిలేయలేం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా సుప్రీంకోర్టుకు సంక్రమించిన అసాధారణ అధికారంతో మిమ్మల్ని ఆదేశిస్తున్నాం. ఇదే ఏడాది అదే బ్యాచ్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ కోర్సులో విద్యార్థికి సీటివ్వండి. హాస్టల్ వసతి సహా అర్హతగల అన్ని ప్రయోజనాలు అతనికి అందేలా చూడండి’’ అని ఐఐటీ కాలేజీ విభాగాన్ని కోర్టు ఆదేశించింది. కిక్కిరిసిన కోర్టు హాలులో అంతసేపూ చేతులు కట్టుకుని నిలబడిన విద్యార్థితో ‘‘ ఆల్ ది బెస్ట్. బాగా చదువుకో’’ అని సీజేఐ అన్నారు. బాగా చదువుతూ ఇంజనీరింగ్ చేస్తున్న అతని ఇద్దరు అన్నల బాగోగులు తదితరాల గురించి కూడా ఆయన ఆరాతీశారు.ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్జిల్లా టిటోరా గ్రామానికి చెందిన అతుల్ ఐఐటీ ధన్బాద్లో సీటు వచ్చినా పేదరికం కారణంగా డబ్బులు కట్టలేక నిస్సహాయుడయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు తలో చేయి వేసి నగదు సర్దినా చివరి నిమిషంలో ఆన్లైన్ చెల్లింపు విఫలమై ఫీజు కట్టలేకపోయాడు. జార్ఖండ్ హైకోర్టు లీగ్ సర్వీసెస్ అథారిటీని ఆశ్రయించగా పరీక్షను ఐఐటీ మద్రాస్ నిర్వహించినందున మద్రాస్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ విచారణ నెమ్మదించడంతో ఈసారి నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. -
సమాజాన్ని చూసే తీరును నా కూతుళ్లు మార్చేశారు
న్యూఢిల్లీ: దివ్యాంగుల పట్ల, ముఖ్యంగా దివ్యాంగ బాలల పట్ల సమాజం వ్యవహరించే తీరులో మార్పు రావాల్సిన అవసరముందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. దివ్యాంగ బాలలు లైంగిక హింసకు సులువైన లక్ష్యాలుగా మారుతున్నారంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఈ దారుణాల నుంచి కాపాడుకోవడం, వాటి బారిన పడేవారి పట్ల సహానుభూతితో వ్యవహరించడం మనందరి బాధ్యత అన్నారు. శనివారం ఆయన దివ్యాంగ బాలల హక్కుల పరిరక్షణపై 9వ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. దివ్యాంగుల హక్కులపై సుప్రీంకోర్టు హాండ్బుక్ను విడుదల చేశారు. అనంతరం ప్రారంభోపన్యాసం చేశారు. ‘‘దివ్యాంగ బాలల భద్రత, సంక్షేమానికి నా హృదయంలో ప్రత్యేక స్థానముంది. నేను దివ్యాంగులైన ఇద్దరు ఆడపిల్లల తండ్రిని. సమాజం పట్ల నా దృక్కోణాన్ని నా కూతుళ్లు పూర్తిగా మార్చేశారు’’ అని చెప్పారు. నైపుణ్యం, సామర్థ్యాలతో నిమిత్తం లేకుండా బాలల హక్కులను పరిపూర్ణంగా పరిరక్షించే ఆదర్శ సమాజమే మనందరి లక్ష్యం కావాలని సూచించారు. ఇందుకోసం పలు కీలకాంశాలపై దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. ‘‘దివ్యాంగ బాలల సమస్యలను గుర్తించాలి. లైంగిక దాడుల వంటి హేయమైన నేరాల బారిన పడే దివ్యాంగ బాలికలను అక్కున చేర్చుకుని వారిలో ధైర్యం నింపాలి. పూర్తిగా కోలుకునేందుకు అన్నివిధాలా దన్నుగా నిలవాలి. పోలీస్స్టేషన్ మొదలుకుని కోర్టు దాకా ప్రతి దశలోనూ వారి పట్ల అత్యంత సున్నితంగా, సహానుభూతితో వ్యవహరించాలి. ఇందుకు అవసరమైన మేరకు బాలల న్యాయ వ్యవస్థకు, దివ్యాంగుల హక్కుల చట్టానికి మార్పులు చేయాలి. ఇందుకు అంతర్జాతీయ చట్టాల నుంచి స్ఫూర్తి పొందాలి. వారిపై అకృత్యాలను నివారించడంపై ప్రధానంగా దృష్టి సారించాలి. ఆ బాలలకు నాణ్యతతో కూడిన విద్య, అనంతరం మెరుగైన ఉపాధి తదితర అవకాశాలు కల్పించాలి. తద్వారా అడుగడుగునా అండగా నిలవాలి. ఈ విషయమై వారి తల్లిదండ్రులతో పాటు పోలీసులకు, లాయర్లకు, న్యాయమూర్తులకు కూడా మరింత అవగాహన కల్పించాలి’’ అని సీజేఐ పిలుపునిచ్చారు. -
తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న సీజేఐ
సాక్షి,తిరుపతి:తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డి.వై చంద్రచూడ్ శనివారం(సెప్టెంబర్28) దర్శించుకున్నారు.సతీసమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ డాక్టర్ డీవై చంద్రచూడ్కు టీటీడీ ఈవో శ్యామలరావు స్వాగతం పలికారు.ఆలయ అర్చకులు బాబు స్వామి, మణికంఠ స్వామి, శ్రీనివాస ఆచార్యులు సాంప్రదాయబద్ధంగా సీజేఐకి స్వాగతం పలికారు.అమ్మవారి దర్శనం అనంతరం చీఫ్ జస్టిస్ దంపతులకు వేద పండితులు వేదశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు. -
అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: సీజేఐ
న్యూఢిల్లీ, సాక్షి: దేశంలో న్యాయస్థానాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, న్యాయమూర్తులు పక్షపాత వ్యాఖ్యల జోలికి పోవొద్దని దేశ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. కర్ణాటక న్యాయమూర్తి అభ్యంతరకర వ్యాఖ్యల సుమోటో కేసు విచారణ ముగింపు సందర్భంగా బుధవారం సీజేఐ ఇలా మాట్లాడారు. ‘‘భారత్లోని ఏ ప్రాంతాన్ని పాకిస్థాన్తో పోల్చడం సరికాదు. ఇది దేశ ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధం. పైగా కోర్టులు అప్రమత్తంగా ఉండాలి. న్యాయమూర్తులు కేసుల విచారణ టైంలో ద్వేషపూరితంగా, కేవలం ఒక వర్గాన్ని ఉద్దేశించేలా పక్షపాత వ్యాఖ్యలు చేయొద్దు’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. ఓ భూవ్యవహారానికి సంబంధించిన కేసులో హైకోర్టు జడ్జి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీషానంద విచారణ చేపట్టారు. ఆ ప్రాంతాన్ని పాకిస్థాన్తో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాక, ఓ మహిళా న్యాయవాది పైనా తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారమంతా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. దీంతో సుమోటోగా ఈ వ్యవహారాన్ని తీసుకున్న సీజేఐ బెంచ్.. వేదవ్యాసాచార్ను మందలించారు. ఆ టైంలోనే.. న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన అవసరాన్ని ఆ టైంలో సీజేఐ బెంచ్ వ్యాఖ్యానించింది కూడా. ఇక.. సదరు జడ్జి బహిరంగ క్షమాపణ చెప్పడంతో ఇవాళ సుమోటో ప్రొసీడింగ్స్ను విరమించుకుంది సీజేఐ ధర్మాసనం."Justice Vedavyasachar Srishananda Faces Backlash Over Gender-Insensitive Remark"Karnataka High Court pic.twitter.com/UG2O1gQwMC— ADV Pramod Kumar (@thelawyr) September 20, 2024One month old video of Karnataka High Court, Justice Vedavyasachar Srishananda while Criticizing the cops referred to an area (Gori Palya) in Bengaluru as Pakistan. Gori Palya is an area where a large number of Muslims live. He was referring to auto pooling in that area where… pic.twitter.com/H1FwKKEg7S— Mohammed Zubair (@zoo_bear) September 19, 2024 -
చైల్డ్ పోర్న్ చూసినా, వీడియోలున్నా... తీవ్ర నేరమే!
న్యూఢిల్లీ: చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. లైంగిక వేధింపుల బారి నుంచి బాలలకు భద్రత కలి్పంచే పోక్సో చట్టం ప్రకారం ఆ వీడియోలను వ్యాప్తి చేయడం మాత్రమే నేరమన్న వాదన సరికాదని స్పష్టం చేసింది. ‘‘ఆ వీడియోలను కలిగి ఉండటం, డౌన్లోడ్ చేయడంతో పాటు ఆన్లైన్లో గానీ ఇతరత్రా గానీ వాటిని చూడటం కూడా పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం కచ్చితంగా నేరమే. ఇవి ‘ఆరంభ నేరం’ కిందకే వస్తాయి’’ అని పోక్సో చట్టం సెక్షన్ 15లోని 1, 2, 3 సబ్ సెక్షన్లను, ఐటీ చట్టంలోని సెక్షన్ 67బిని ఉటంకిస్తూ పేర్కొంది. చైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం, డౌన్లోడ్ చేయడం నేరం కాదన్న మద్రాస్ హైకోర్టు తీర్పును ఘోర తప్పిదంగా సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్డీవాలా ధర్మాసనం అభివరి్ణంచింది. తన మొబైల్లో చైల్డ్ పోర్నో వీడియోలున్న ఓ 28 ఏళ్ల వ్యక్తిని నిర్దోíÙగా పేర్కొంటూ జనవరి 11న హైకోర్టు ఇచి్చన తీర్పును కొట్టేస్తున్నట్టు పేర్కొంది. అతనిపై నేరాభియోగాలను పునరుద్ధరించాల్సిందిగా తిరువళ్లువర్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ సెషన్స్ కోర్టును ఆదేశించింది. ‘‘బాలలపై లైంగిక వేధింపులు అత్యంత ఆందోళనకరమైన అంశం. సమాజంలో లోతుల దాకా వేళ్లూనుకుపోయిన ఈ పెను జాఢ్యం ఏ ఒక్క ప్రాంతానికో, దేశానికో పరిమితం కాదు. ప్రపంచవ్యాప్త సమస్య’’ అంటూ ఆవేదన వెలిబుచి్చంది. దీని నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం పలు సూచనలు చేసింది. ‘‘న్యాయపరమైన ఉత్తర్వులు, తీర్పుల్లో ఇకపై చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని వాడొద్దు. దానికి బదులు సదరు నేరాలను మరింత నిర్దుష్టంగా పేర్కొనేలా ‘చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ అబ్యూజ్ మెటీరియల్ (సీఎస్ఈఏఎం)’ అని మాత్రమే వాడాలి’’ అని అన్ని కోర్టులనూ ఆదేశించింది. పోక్సో చట్టానికి ఈ మేరకు సవరణ చేసే అంశాన్ని పరిశీలించాలని పార్లమెంటుకు సూచించింది. ఆలోపుగా కేంద్రం ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేయాలని పేర్కొంది. బాలలపై లైంగిక వేధింపుల సమస్యను రూపుమాపడంలో ప్రపంచ దేశాలన్నింటికీ ఈ తీర్పు మార్గదర్శకం కాగలదంటూ న్యాయ వర్గాలు హర్షం వెలిబుచ్చాయి. తీర్పులో ముఖ్యాంశాలు → చైల్డ్ పోర్నో మెటీరియల్ బాలల భద్రతకు పెను ముప్పు. బాలలను లైంగిక అవసరాలు తీర్చుకునే బొమ్మలుగా అది చిత్రిస్తుంది. ఫలితంగా జరగరానిది జరిగితే బాధితుల లేత మనసులపై అది ఎన్నటికీ చెరిగిపోని గాయం చేస్తుంది. → విద్యార్థులకు సమగ్ర లైంగిక విద్యా బోధన కార్యక్రమాలను అమలు చేయాలి. ఆరోగ్యకరమైన సంబంధాలు, సరైన ప్రవర్తన వంటివాటిలపై అవగాహన కలిగించాలి. → విద్యార్థులు మొదలుకుని సాధారణ ప్రజల దాకా అన్ని స్థాయిల్లోనూ లైంగిక విద్య, అవగాహన కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. → చట్టపరమైన పర్యవసానాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. తద్వారా వాటి వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చు. ఆ నేరాలకు పాల్పడేందుకు వెనకాడేలా చేయవచ్చు. → నేరానికి సంబంధించి బాలల నుంచి సాక్ష్యాల సేకరణ, దర్యాప్తు, విచారణ తదితర ప్రక్రియ వీలైనంత సున్నితంగా జరిగేలా చూడాలి. తద్వారా వారి మనసులు మరింత గాయపడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.లైంగిక విద్య అత్యవసరం బాలలపై లైంగిక నేరాలు తగ్గాలంటే లైంగిక విద్య, లైంగిక ఆరోగ్యం గురించి ప్రజల్లో విస్తృత అవగాహన అవసరమని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. దురదృష్టవశాత్తూ దీనిపై భారత సమాజంలో తీవ్ర అపోహలు నెలకొని ఉన్నాయంటూ జస్టిస్ పార్డీవాలా ఆవేదన వెలిబుచ్చారు. ధర్మాసనం తరఫున 200 పేజీల తీర్పును ఆయనే రాశారు. ‘‘లైంగిక విద్యను పాశ్చాత్య భావనగా, మన సంప్రదాయ విలువలను దిగజార్చేదిగా భారత సమాజం భావిస్తుంది. దాంతో స్కూళ్లలో లైంగిక విద్యపై వ్యతిరేకత నెలకొని ఉంది. దానిపై పలు రాష్ట్రాల్లో నిషేధమే ఉంది!’’ అని పేర్కొన్నారు. ‘‘సెక్స్, సంబంధిత విషయాలను పిల్లలతో చర్చించడాన్ని ఇబ్బందికరంగా మాత్రమే గాక ఘోర అపరాధంగా, అనైతికంగా మనవాళ్లు చూస్తారు. వాటివల్ల ఎదిగే వయసులో విచ్చలవిడి లైంగిక ధోరణులు తలెత్తుతాయన్న అపోహ వ్యాప్తిలో ఉంది. తల్లిదండ్రులు, పెద్దల్లోనే గాక విద్యావేత్తల్లో కూడా ఈ తిరోగమన ధోరణి నెలకొని ఉండటం దారుణం. దీంతో ఎదిగే పిల్లల్లో లైంగికపరమైన అవగాహన లోపిస్తోంది. అందుకే టీనేజర్లు ఇంటర్నెట్లో సులువుగా అందుబాటులో ఉన్న సెక్సువల్ కంటెంట్కు ఇట్టే ఆకర్షితులవుతున్నారు. ఎలాంటి నియంత్రణా, వడపోతా లేని ఆ విచ్చలవిడి కంటెంట్ వారిని తప్పుదోవ పట్టించడమే గాక అనారోగ్యకరమైన లైంగిక ప్రవర్తనకు, లైంగిక నేరా లకు పురిగొల్పుతోంది’’ అంటూ ధర్మాసనం ఆందోళన వెలిబుచ్చింది. ‘‘కను క ఈ విషయమై ముందు పెద్దలను చైతన్యవంతులను చేయడం చాలా ముఖ్యం. సమగ్ర లైంగిక విద్య, అవగాహన బాల లకు ఎంత ముఖ్యమో వారికి అర్థమయ్యేలా చేయాలి. చైల్డ్ పోర్నోగ్రఫీ వీక్షణ, వ్యాప్తి, లైంగిక హింస వంటివాటి చట్టపరమైన పరిణామాలను కూడా అర్థం చేసుకుంటారు. కనుక వాటికి దూరంగా ఉంటారు. పరిశోధనల్లో రుజువైన వాస్తవాలివి. మన దేశంలో సమగ్ర లైంగిక విద్య అవసరం చాలా ఉందని అవి తేల్చాయి’’ అని పేర్కొంది. -
చైల్డ్పోర్నోగ్రఫీ వీక్షణ ముమ్మాటికీ నేరమే: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: చైల్డ్ పోర్నోగ్రఫీ వీక్షణ నేరమా? కాదా? అనే అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. అదేం నేరం కాదని గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ.. ముమ్మాటికీ నేరమేనంటూ సీజేఐ ధర్మాసనం సోమవారం తుది తీర్పు వెల్లడించింది. పోక్సో చట్టం సెక్షన్ 15 ప్రకారం.. చైల్డ్ పోర్నోగ్రఫీ మెటీరియల్ను(ఫొటోలు, వీడియోలు) వీక్షించడం మాత్రమే కాదు నిల్వ చేసుకోవడం కూడా నేరమే అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో గతంలో మద్రాస్ హైకోర్టు తీర్పును తీవ్ర తప్పిదంగా పేర్కొంటూ.. దాన్ని పక్కన పెట్టేసింది. అలాగే ఈ కేసులో నిందితుడికి ఇచ్చిన ఊరటను ఎత్తేస్తూ.. క్రిమినల్ ప్రాసిక్యూషన్ కొనసాగించాలని స్పష్టం చేసింది. పనిలో పనిగా.. కోర్టులు కూడా చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని ఉపయోగించొద్దు అని సుప్రీం కోర్టు సూచించింది. కేసు ఏంటంటే..తమిళనాడుకు చెందిన 28ఏళ్ల యువకుడు ఛైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను డౌన్లోడ్ చేసుకుని వీక్షించాడన్న అభియోగాలపై క్రిమినల్ చర్యలను నిలిపివేస్తూ మద్రాస్ హైకోర్టు ఈ ఏడాది జనవరి 11వ తేదీన సంచలన తీర్పు వెల్లడించింది. అతను కేవలం వీడియోలు కేవలం చూసాడని,ఇతరులకు పంపలేదని పేర్కొంది. ఐటీ యాక్ట్ సెక్షన్ 67బీ కింద అతని చర్య నేరం కాదని స్పష్టం చేసింది. అలాగే.. పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం.. ఛైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం తప్పేమీ కాదంటూ జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో.. ఇలాంటి కేసుల్లో శిక్షించే బదులు, వారికి సరైన మార్గం చూపడం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే.. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఫరీబాద్కు చెందిన జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయెన్, ఢిల్లీకి చెందిన బచ్పన్ బచావో ఆందోళన్ అనే ఎన్జీవోలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా,జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఏప్రిల్లో వాదనలు ముగించి.. తీర్పును రిజర్వ్ చేసింది. అయితే విచారణ సందర్భంలోనే.. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా తప్పుబట్టింది. పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ నేరమేనని గతంలో పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. ఈ ఏడాది జులైలో కర్ణాటక హైకోర్టు సైతం చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం ఐటీ యాక్ట్ కింద నేరం కాదని తెలిపింది. అయితే రెండు వారాలు తిరగకముందే ఆ తీర్పును రీకాల్ చేస్తూ మరో తీర్పు ఇచ్చింది.ఇదీ చదవండి: జడ్జిల్లారా.. జాగ్రత్త! అన్ని కళ్లు మన మీదే!! -
దయాగుణం కలిగి ఉండండి
బెంగళూరు: గొప్ప తెలివితేటలే కాదు, తోటివారి పట్ల దయాగుణం కలిగి ఉండటం ఎంతో అవసరమని యువ పట్టభద్రులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉద్బోధించారు. ఆదివారం ఆయన బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ(ఎన్ఎల్ఎస్ఐయూ)లో జరిగిన 32వ స్నాతకోత్సవంలో ప్రసంగించారు. అకడెమిక్ బ్లాక్ విస్తరణ పనులకు అనంతరం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రసంగించారు. ‘నిజమైన నాయకత్వ ప్రతిభ గలవారు తమ బలాలతోపాటు బలహీనతలను కూడా గుర్తించగలరు. తమకున్న బలంతో ఇతరులకు తోడ్పాటునిస్తూ, తమ బలహీనతలను అధిగమించేందుకు ఇతరుల సాయం తీసుకుంటారు’అని సీజేఐ వివరించారు. అడ్డంకులను అధిగమించే క్రమంలో కుటుంబంతోపాటు స్నేహితుల మద్దతు ఎంతో అవసరమని చెప్పారు. తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎంతో సహనంతో మెలగాలన్నారు. ‘నిర్ణయం తీసుకునే ప్రక్రియ అనిశి్చతితో కూడి ఉంటుంది, అయినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అనిశ్చితి కొనసాగేది కొంతకాలమే. మీరు ఎంచుకునే మార్గం ఏదైనప్పటికీ, భవిష్యత్తులో మీ సొంత నిర్ణయాలు సానుకూల పరిణామాలను కలిగిస్తాయి. ఈ క్రమంలో సహనం, వినయం అనే సద్గుణాలను ఎన్నడూ వీడరాదని కోరుతున్నాను’అని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. ‘వేగంగా మారుతున్న ప్రపంచం, అవసరాలు, వాతావరణ మార్పులు, సోషల్ మీడియా వంటి కొత్త వినోద సాధనాలు, సామాజిక దురాచారాలను మార్చాలనే ఆత్రుత సంక్లిష్ట సమస్యలకు స్వల్పకాలిక ఫలితాలను కోరేలా చేస్తున్నాయి’అంటూ ఆయన ఇలాంటి సమయంలో సహనంతో మెలగాల్సిన అవసరం ఎంతో ఉందని నొక్కిచెప్పారు. ‘హడావుడిగా తీసుకునే నిర్ణయాలకు ఎక్కువ శక్తిని వెచి్చంచాల్సి ఉంటుంది. ఇలాంటివి దీర్ఘకాలంలో మీ మానసిక ఆరోగ్యానికి చేటు కల్గిస్తాయి. దీర్ఘకాలంలో సానుకూల లక్ష్యాలను సాధించడం కూడా కష్టమవుతుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది’అని ఆయన యువ న్యాయవాదులను హెచ్చరించారు. న్యాయమూర్తిగా 24 ఏళ్లపాటు పనిచేశాక నాకో విషయం అర్థమయింది. మనదేశంలోని కోర్టుల్లో మనం మూడో వ్యక్తిగా కాకుండా మొదటి వ్యక్తిగా వాదిస్తాం ఎందుకంటే.. కోర్టుల్లో మనం క్లయింట్ల కోసం వాదించం. మనమే క్లయింట్లుగా వాదనలు సాగిస్తాం. వారికి ప్రతినిధులుగా మాత్రమే కాదు, వారి గొంతుక, వారి లాయర్గా, విజేతలుగా ఉంటాం’అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
న్యాయమూర్తులు హద్దు మీరొద్దు
న్యూఢిల్లీ: కర్ణాటక హైకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానందాపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాలని కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది. ‘‘న్యాయమూర్తులు నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. హద్దు మీరడం తగదు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంది’’ అని హితవు పలికింది. దీన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. 25న విచారణ చేపడతామని వెల్లడించింది.అసలేం జరిగింది? బెంగళూరులో ఓ ఇంటి యజమాని, కిరాయిదారుకు వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది. బెంగళూరులోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాన్ని జస్టిస్ శ్రీశానందా పాకిస్తాన్తో పోల్చారు. అంతేగాక, ‘‘ప్రత్యర్థి వర్గంతో మీకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లున్నాయి. వారి లోదుస్తుల రంగు కూడా మీకు తెలిసే ఉంటుంది’’ అని మహిళా న్యాయవాదిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. కోర్టుల్లో న్యాయమూర్తుల వ్యాఖ్యలపై మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన అవసరం కనిపిస్తోందని సీజేఐ పేర్కొన్నారు. ‘‘కోర్టుల కార్యకలాపాలను గమనించడంలో సోషల్ మీడియా చురుగ్గా ఉంది. కనుక న్యాయమూర్తుల వ్యాఖ్యలు చట్టాలకు లోబడి మర్యాదపూర్వకంగా ఉండాలి’’ అన్నారు. -
కర్ణాటక న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు సుమోటో కేసు
న్యూఢిల్లీ, సాక్షి: వివాదాస్పద వ్యాఖ్యల వీడియోతో సోషల్ మీడియాలో వైరల్ అయిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి వేదవ్యాసాచార్ శీర్షానందపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాల్సిందిగా కర్ణాటక హైకోర్టును ఆదేశించింది.సుప్రీంకోర్టు న్యాయవాదులు ఇందిరా జైసింగ్, సంజయ్ ఘోష్లు.. జస్టిస్ వేదవ్యాసాచార్ శీర్షానంద వ్యాఖ్యలతో కూడిన ‘ఎక్స్’ పోస్టును ప్రస్తావిస్తూ తగిన చర్యలను తీసుకోవాల్సిందిగా సీజేఐను అభ్యర్థించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్తో కూడిన ఐదుగురు సభ్యుల బెంచ్ ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించింది.ఈ సందర్భంగా సీజే మాట్లాడుతూ ‘‘ఇలాంటి అంశాలపై కొన్ని సాధారణ మార్గదర్శకాలను జారీ చేస్తూనే హైకోర్టు నుంచి నివేదిక తెప్పించండి’’ అని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణిని ఆదేశించారు. కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి పరిపాలన పరమైన అనుమతులు పొందిన తరువాత రిజిస్ట్రార్ జనరల్ తమకు నివేదిక అందించాలని స్పష్టం చేశారు. ఈ అంశంపై వచ్చే మంగళవారం మళ్లీ విచారణ చేస్తామని తెలిపారు.‘‘సోషల్ మీడియా విస్తృత వాడకంలో ఉన్న ఈ కాలంలో అందరూ మనల్ని (న్యాయమూర్తులు) చాలా నిశితంగా పరిశీలిస్తూంటారు. ఆ విషయాన్ని మనం గుర్తెరిగి వ్యవహరించాలి’’ అని కూడా సీజేఐ వ్యాఖ్యానించారు.ఇంతకీ కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచార్ శీర్షానంద ఏం మాట్లాడారంటే.. కొన్ని రోజుల క్రితం రెండు వీడియోలో ఎక్స్లో పోస్ట్ అయ్యాయి. అందులో జస్టిస్ వేదవ్యాసాచార్ శీర్షానంద మాట్లాడుతూ బెంగళూరులోని ఒక ప్రాంతాన్ని ‘పాకిస్థాన్’తో పోల్చారు. అక్కడ ఒక్కో ఆటోలో పది మంది ప్రయాణిస్తున్నా పోలీసులు పట్టించుకోరని ఆయన వ్యాఖ్యానించినట్లు వీడియోలో ఉంది. ఇది వాస్తవమని.. ఎంతటి పెద్ద అధికారి అయినా అక్కడ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోరని కూడా జడ్జి కన్నడలో తెలిపారు. ఇక రెండో వీడియోలో ఓ మహిళ న్యాయవాదిని ఉద్దేశించి ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.One month old video of Karnataka High Court, Justice Vedavyasachar Srishananda while Criticizing the cops referred to an area (Gori Palya) in Bengaluru as Pakistan. Gori Palya is an area where a large number of Muslims live. He was referring to auto pooling in that area where… pic.twitter.com/H1FwKKEg7S— Mohammed Zubair (@zoo_bear) September 19, 2024 "Justice Vedavyasachar Srishananda Faces Backlash Over Gender-Insensitive Remark"Karnataka High Court pic.twitter.com/UG2O1gQwMC— ADV Pramod Kumar (@thelawyr) September 20, 2024 -
‘ఉచిత హామీ’లపై విచారణ జరుపుతాం
న్యూఢిల్లీ: రాజకీయ పారీ్టలు ఎన్నికల వేళ ఇస్తున్న ఉచిత హామీలపై తప్పకుండా విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు బుధవా రం స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు ఉచితాలపై హామీలు గుప్పించడం.. అత్యంత ము ఖ్యమైన అంశమని, వాటిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జే.బి.పారి్థవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఉచితాలను సవాల్ చేస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ బుధవారం బిజినెస్ లిస్టులో ఈ పిటిషన్లు ఉన్నాయని, వాటిని విచారణకు స్వీకరించాలని కోరారు. తమ పిల్ బుధవారం విచారణకు వచ్చే అవకాశం లేదని, దీన్ని మరో తేదీన విచారించడానికి వీలుగా జాబితాలో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీజేఐ చంద్రచూడ్ స్పందిస్తూ.. ఇది అత్యంత ముఖ్యమైన అంశం. దీన్ని కాజ్ లిస్టులో నుంచి తొలగించబోం’అని చెప్పారు. -
గణపతి పూజలో పాల్గొన్నా కాంగ్రెస్కు నచ్చట్లేదు
భువనేశ్వర్: సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో గణపతి పూజలో పాల్గొన్నందుకు తనపై విమర్శలు పెంచిన కాంగ్రెస్కు ప్రధాని మోదీ మంగళవారం దీటుగా బదులిచ్చారు. ఒడిశాలోని భువనేశ్వర్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్పై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ గణేశ్ ఉత్సవం దేశంలో కేవలం మత విశ్వాసాలకు సంబంధించిన వేడుక కాదు. దేశ స్వాతం్రత్యోద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉత్సవం. ఆకాలంలో బ్రిటిష్ పాలకులు సైతం గణేశ్ ఉత్సవాలను ద్వేషించాలంటూ భారత్లో విభజించు, పాలించు కుట్రను అమలుచేశారు. ఇప్పుడు కూడా అధికార దాహంతో కొట్టుమిట్టాడుతున్న కొందరు గణపతి పూజలో పాల్గొంటే సమస్యలొస్తాయంటూ సమాజాన్ని విభజించే పనిలో బిజీగా మారారు. గణపతి పూజలో పాల్గొన్న నాపై కాంగ్రెస్, దాని మిత్రపక్షాల్లో పీకలదాకా కోపముంది. కాంగ్రెస్పాలిత కర్ణాటకలో గొడవలు జరుగుతాయంటూ ఏకంగా గణపతి విగ్రహాన్నే కటాకటాల వెనక్కి నెట్టారు. పోలీస్వ్యాన్లో గణపతి విగ్రహం ఫొటో చూసి యావత్భారతావని బాధపడింది. ఇక ఇలాంటి విద్వేష శక్తుల ఆట కట్టించాల్సిందే. దేశాన్ని కుల, మత ప్రాతిపదికన బ్రిటిషర్లు విభజించాలని చూస్తే లోకమాన్య తిలక్ గణేశ్ ఉత్సవాలతో దేశ సమైక్య స్ఫూర్తిని మరింతగా రగిల్చారు. కుల మతాలకతీతంగా ఐక్యంగా ఎలా ఉండాలో గణేష్ ఉత్సవాలు మనకు చాటిచెప్పాయి’’ అని మోదీ అన్నారు. రూ.2,871 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభం తన నాయకత్వంలో మూడోదఫా పాలన మొదలై 100 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా మంగళవారం మోదీ ఒడిశాలో రూ.2,871 కోట్ల విలువైన రైల్వే, జాతీయరహదారులకు సంబంధించిన పలు ప్రాజెక్టుల్లో కొన్నింటికి శంకుస్థాపనలు చేసి కొన్నింటిని ప్రారంభించారు. ఒడిశా బీజేపీ ప్రభుత్వ కీలక పథకం ‘ సుభద్ర యోజన’ను ప్రారంభించారు. భువనేశ్వర్లోని సబర్ సాహీ మురికివాడలో ప్రధానమంత్రి ఆవాస్యోజన(పట్టణ) 20 మంది లబి్ధదారుల ఇళ్లను మోదీ స్వయంగా ప్రారంభించి వారితో మోదీ ముచ్చటించారు. పుట్టినరోజున తమ ఇంటికొచి్చన మోదీకి ఆ గిరిజనులు అంగవస్త్రం ఇచ్చి ఆహా్వనించి నుదుటిన గంధం»ొట్టు పెట్టారు. ప్రేమతో తనకు వారు ఇచి్చన తీపి వంటకం ఖీర్ను మోదీ రుచిచూశారు. -
నైట్ షిఫ్టులు వద్దంటారా?
న్యూఢిల్లీ: మహిళా వైద్యులు నైట్ డ్యూటీలు చేయొద్దన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్దేశాలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అలా చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ‘‘పైలట్లుగా, సైనికులుగా మహిళలు రాత్రి విధులు నిర్వహించడం లేదా? మీ నిర్దేశాలు మహిళా వైద్యుల కెరీర్పై ప్రభావం చూపుతాయి. రాత్రి విధుల్లో సమస్యలు ఎదుర్కోకుండా వారికి అవసరమైన భద్రత కలి్పంచడం ప్రభుత్వ బాధ్యత. అంతే తప్ప వాటిని మానుకోవాలని చెప్పడం సరికాదు’’ అంటూ సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం మందలించింది. దాంతో సదరు నోటిఫికేషన్ను ఉపసంహరించుకుంటామని బెంగాల్ సర్కారు విన్నవించింది. కోల్కతాలో ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రిలో ట్రైనీ వైద్యురాలు రాత్రి విధుల్లో ఉండగా హత్యాచారానికి గురవడం, ఈ ఉదంతం దేశవ్యాప్త ఆందోళనలకు దారితీయడం తెలిసిందే. దాంతో నెల రోజులకు పైగా మమత సర్కారు ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో మహిళా వైద్యుల భద్రత నిమిత్తం సలహాలు, సూచనలతో ‘రాతిరేర్ సాథి’ పేరిట ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. వైద్యురాలి హత్యాచారోదంతంపై విచారణ సందర్భంగా మంగళవారం ఈ అంశం ధర్మాసనం దృష్టికి రావడంతో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆక్షేపించింది. ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది భద్రత నిమిత్తం కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రైవేట్ సెక్యూరిటీని నియమించాలన్న నిర్ణయాన్ని కూడా తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘వైద్యులకు భద్రతే లేని పరిస్థితి నెలకొని ఉంది. కనుక ప్రభుత్వాసుపత్రుల్లో పోలీసు సిబ్బందినైనా నియమించడం రాష్ట్ర ప్రభుత్వ కనీస బాధ్యత. వాటిలో యువ వైద్య విద్యార్థులు, ఇంటర్న్లు పని చేస్తున్నారు’’ అని గుర్తు చేసింది. మా లాయర్లకు బెదిరింపులు: సిబల్ ఈ కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ విజ్ఞప్తి చేశారు. అందుకు ధర్మాసనం నిరాకరించింది. ‘‘ఇది ప్రజాప్రయోజనాలు ముడిపడి ఉన్న కేసు. దీని విచారణ ఎలా జరుగుతోందో దేశ ప్రజలంతా తెలుసుకుని తీరాలి’’ అని స్పష్టం చేసింది. ప్రత్యక్ష ప్రసారం తమ లాయర్ల బృందానికి సమస్యలు సృష్టిస్తోందని సిబల్ వాదించారు. ‘‘ఇది విపరీతమైన భావోద్వేగాలతో కూడిన కేసు. మేం వాదిస్తోంది బాధితురాలి తరఫున కాదు గనుక మా బృందంలోని మహిళా లాయర్లకు యాసిడ్ దాడులు, అత్యాచారాలు చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. పైగా మా క్లయింట్ (బెంగాల్ సర్కారు) గురించి ధర్మాసనం ఎలాంటి వ్యాఖ్యలు చేసినా లాయర్లుగా పేరుప్రఖ్యాతు లన్నీ మట్టిలో కలిసిపోతున్నాయి’’ అంటూ ఆందోళన వెలిబుచ్చారు. లాయర్లకు రక్షణ లభించేలా జోక్యం చేసుకుంటామని ధర్మాసనం హామీ ఇచి్చంది. ప్రత్యక్ష ప్రసారాన్ని మాత్రం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. మమత రాజీనామాకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను ధర్మాసనం కొట్టేసింది. ఇదేమీ రాజకీయ వేదిక కాదంటూ సదరు న్యాయవాదికి తలంటింది.సీరియస్ అంశాలివి! వైద్యురాలి కేసులో దర్యాప్తు ప్రగతిపై సీబీఐ సమరి్పంచిన స్థాయీ నివేదికను సీజేఐ ధర్మాసనం మంగళవారం పరిశీలనకు స్వీకరించింది. అందులోని అంశాలు తమనెంతగానో కలచివేశాయంటూ ఈ సందర్భంగా ఆవేదన వెలిబుచి్చంది. ‘‘నివేదికలో సీబీఐ పేర్కొన్నవి చాలా సీరియస్ అంశాలు. వాటిని చదివిన మీదట మేమెంతో ఆందోళనకు లోనవుతున్నాం. అయితే వాటిని ఈ దశలో వెల్లడించలేం. అది తదుపరి దర్యాప్తుకు విఘాతం కలిగించవచ్చు’’ అని పేర్కొంది. ‘‘జరిగిన దారుణానికి సంబంధించి మృతురాలి తండ్రి కొన్ని విలువైన అంశాలను కోర్టు దృష్టికి తెచ్చారు. వాటిపైనా దర్యాప్తు చేయండి’’ అని సీబీఐకి సూచించింది. ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రి ఆర్థిక అవకతవకల కేసు దర్యాప్తుపైనా స్థాయీ నివేదిక సమరి్పంచ్సాలిందిగా నిర్దేశించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.పేరు, ఫొటో తొలగించండి హతురాలి పేరు, ఫొటో ఇప్పటికీ వికీపీడియాలో కనిపిస్తున్నట్టు సీబీఐ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దాంతో వాటిని తక్షణం తొలగించాలని వికీపీడియాను ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయంలో తామిచి్చన గత ఆదేశాలకు కట్టుబడాలని స్పష్టం చేసింది. సమ్మె, ఆందోళనలు చేస్తున్న జూనియర్ వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలూ చేపట్టబోమని బెంగాల్ ప్రభుత్వం ఈ సందర్భంగా హామీ ఇచి్చంది. వైద్యురాలిపై అఘాయిత్యం జరుగుతుండగా అక్కడ ఎవరెవరున్నదీ జూనియర్ వైద్యులకు తెలుసని వారి తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ సమాచారాన్ని సీబీఐకి సీల్డ్కవర్లో అందజేస్తామన్నారు. తక్షణం విధుల్లో చేరాల్సిందిగా డాక్టర్లకు ధర్మాసనం మరోసారి సూచించింది. -
గణపతి పూజ.. ప్రతిపక్షాల విమర్శలపై ప్రధాని మోదీ
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి పూజలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. తాజాగా ఈ అంశంపై ప్రధాని మోదీ స్పందించారు.ఒడిశాలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. అధికార దాహంతో, విభజన శక్తులు గణపతి పూజను వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. అప్పట్లో దేశాన్ని విభజించు పాలించు అనే విధానాన్ని అనుసరించిన బ్రిటీషర్లు గణపతి ఉత్సవాల్ని వ్యతిరేకించేవారు. నేటికీ సమాజాన్ని విభజించి విచ్ఛిన్నం చేసే పనిలో నిమగ్నమైన కొందరు అదే దారిలో పయనిస్తున్నారు. గణేష్ ఉత్సవం కేవలం మతపరమైన పండుగ కాదని, భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో చారిత్రాత్మకంగా కీలక పాత్ర పోషించిందని పున రుద్ఘాటించారు. బ్రిటీషర్లు భారతీయుల మధ్య చిచ్చుపెట్టి తద్వారా విభజించి పాలించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో గణపతి ఉత్సవాలు ఐక్యతకు చిహ్నంగా నిలిచాయని గుర్తు చేశారు. గణేష్ ఉత్సవాల్ని వ్యతిరేకించాలనుకునే మనస్తత్వాన్ని మోదీ ఖండించారు. అలాంటి వారు సమాజంలో విషాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారిని ఉపేక్షించవద్దని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు.ఇదీ చదవండి : అతిషీ డమ్మీ సీఎం -
ఆర్జీ కర్ కేసు విచారణ లైవ్ స్ట్రీమ్ చేయొద్దు : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
్యూఢిల్లీ: కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రి అత్యాచార ఘటన కేసు విచారణ ప్రత్యక్ష ప్రసారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేసు విచారణను లైవ్ స్ట్రీమ్ చేస్తామని, ఆ విషయంలో తాము వెనక్కి తగ్గబోమని స్పష్టం చేసింది.మంగళవారం సుప్రీం కోర్టు ఆర్జీ కర్ ఆస్పత్రి జూనియర్ వైద్యురాలి ఘటన కేసును విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా .. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదిస్తున్నందుకు తన మహిళా లాయర్లకు బెదిరింపులు వస్తున్నాయని, ఈ సున్నితమైన అంశంలో విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయోద్దని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.కపిల్ సిబల్ విజ్ఞప్తిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ స్పందించారు. కేసు విచారణ ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేయలేమని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేసు విచారణ లైవ్ స్ట్రీమ్ లో కొనసాగుతుందని స్పష్టం చేశారు.‘నా ఛాంబర్లోని మహిళా న్యాయవాదులకు బెదిరింపులు వస్తున్నాయి. వారిపై యాసిడ్ దాడులు చేస్తామని, హత్యాచారం చేస్తామని చెదిరిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారని అన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి బదులిస్తూ.. మహిళ న్యాయవాదుల భద్రతకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
President Droupadi Murmu: మహిళా సాధికారతే దేశానికి బలం
న్యూఢిల్లీ: దేశంలో మహిళల సాధికారతే ఆ దేశానికి నిజమైన బలమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఏ ప్రాంతంలో అయినా, ఎలాంటి సమయంలోనైనా మహిళలు అభద్రతకు లోనవకుండా, వారి పట్ల గౌరవం చూపేలా ప్రజలకు అవగాహన కలి్పంచాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మన దేశంలో మహిళల గౌరవాన్ని, గౌరవాన్ని కాపాడతామని, వారి పురోభివృద్ధికి కృషి చేస్తామని ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఓ వార్తా సంస్థ సోమవారం నిర్వహించిన షిశక్తి సమ్మిట్–2024లో రాష్ట్రపతి మాట్లాడుతూ దేశంలో మహిళల భద్రతకోసం కఠినమైన చట్టాలను తీసుకొచ్చామన్నారు. అయినప్పటికీ అభద్రతా భావం కొనసాగుతుండటం దురదృష్టకరమని, మహిళలను బలహీనులుగా భావించే సామాజిక సంకుచిత మనస్తత్వం, ఛాందసవాదానికి వ్యతిరేకంగా నిరంతర పోరాటాలు చేయాల్సిన అవసరముందని ఆమె నొక్కి చెప్పారు. సమాజంలో ఎన్ని మార్పులొచి్చనా కొన్ని సామాజిక దురభిప్రాయాలు లోతుగా పాతుకుపోయాయని, ఇవి మహిళా సమానత్వానికి అవరోధాలను సృష్టిస్తున్నాయని తెలిపారు. ‘‘ఎక్కడ తప్పు చేశాం? మెరుగుపడటానికి మనం ఏమి చేయాలి?’’అని మహిళలు నిరంతరం ప్రశ్నించుకోవాలని సూచించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా శక్తి, ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్నారని మహిళలను కొనియాడారు. పితృస్వామిక దృక్పథాన్ని విడనాడాలి: సీజేఐ చట్టం మాత్రమే న్యాయమైన వ్యవస్థను తయారు చేయలేదని, సమాజం మహిళల పట్ల తన మైండ్సెట్ను మార్చుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సోమవారం నొక్కి చెప్పారు. ప్రతిఒక్కరూ పితృస్వామిక దృక్పథాన్ని విడనాడాలని సూచించారు. మహిళల ప్రయోజనాలను పరిరక్షించడానికి విధానపరమైన, చట్టపరమైన నిబంధనలు అనేకం ఉన్నాయని, కానీ కఠినమైన చట్టాలే సమ సమాజాన్ని నిర్మించలేవన్నారు. మహిళలకు రాయితీలు ఇవ్వడం నుంచి స్వేచ్ఛగా, సమానంగా జీవించే హక్కు వారికుందనే విషయాన్ని గుర్తించే దిశగా మన మనస్తత్వాలు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. మహిళల హక్కుల గురించి మాట్లాడటమంటే మొత్తం సమాజం మార్పు గురించి మాట్లాడినట్లని వ్యాఖ్యానించారు. తన జీవితంలోని కొన్ని గొప్ప పాఠాలను మహిళా సహోద్యోగుల నుంచే నేర్చుకున్నానని, మెరుగైన సమాజానికి మహిళల సమాన భాగస్వామ్యం ముఖ్యమని తాను నమ్ముతానని చెప్పారు. దేశం రాజ్యాంగాన్ని ఆమోదించక ముందే ఇండియన్ ఉమెన్స్ చార్టర్ ఆఫ్ లైఫ్ను స్త్రీవాది అయిన హంసా మెహతా రూపొందించారని సీజే గుర్తు చేశారు. -
అంతర్జాతీయ మధ్యవర్తిత్వంలో సారథ్యానికి సమయమిదే
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సంస్కృతిని పెంపొందించడంలో భారతదేశం ముందుండాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ‘చట్టాల పట్ల గౌరవం నిజాయతీని, స్థిరతను ప్రోత్సహిస్తుంది, ఆర్థిక వృద్ధికి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. హక్కులకు రక్షణ చేకూరి, ఒప్పందాలు అమలయి, వివాదాలు సమర్ధవంతంగా పరిష్కారమయ్యే ఇటువంటి వ్యవస్థలో పెట్టుబడి దారులు ముందుకొచ్చి వృద్ధికి అనుకూలమైన వాతా వరణం నెలకొంటుంది’అని ఆయన తెలిపారు. అంతర్జాతీయ మధ్యవర్తిత్వం, చట్టపాలనపై శుక్రవారం జరిగిన సదస్సులో జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడారు. చట్టబద్ధ పాలనతో విదేశీ పెట్టుబడులు, వాణిజ్యం పెరగడంతోపాటు అంతర్జాతీయంగా పోటీపడే వాతా వరణం దేశంలో నెలకొంటుందన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సంజీవ్ ఖన్నా, అటార్నీ జనరల్ వెంకటరమణి, సుప్రీం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబల్ తదితరులు మాట్లాడారు. -
తప్పుడు సంకేతాలకు ఆస్కారం..!
న్యూఢిల్లీ: ‘భారత ప్రధాన న్యాయమూర్తి ఇంటికి ఒక ప్రైవేటు కార్యక్రమం కోసం ప్రధానమంత్రి వెళ్లడం తప్పుడు సంకేతాలను పంపదా? నరేంద్ర మోదీ అలా వెళ్లకుండా ఉండాల్సింది. ఆయన సలహాదారులైనా చెప్పాలిగా.. తప్పుడు సంకేతాలు వెళ్లే ఆస్కారం ఉంద’ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబల్ అన్నారు. వ్యవస్థలపై ప్రజల్లో చర్చకు తావిచ్చే ఇలాంటి ప్రైవేట్ వేడుకల పట్ల ప్రధానమంత్రి ఆసక్తి చూపకపోవడమే మంచిదని అన్నారు. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో బుధవారం జరిగిన గణపతి పూజలో ప్రధాని మోదీ పాల్గొనడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రధాన న్యాయమూర్తిని ప్రభావితం చేసేందుకు ప్రధాని మోదీ ప్రయతి్నస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రైవేట్ కార్యక్రమాన్ని ఇలా బహిరంగపర్చడం సరైంది కాదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ గురువారం పేర్కొన్నారు. అత్యున్నత సంస్థ గురించి ప్రజల్లో రకరకాల ఊహాగానాలు చెలరేగేందుకు అవకాశం కలి్పంచకూడదని సూచించారు. సీజేఐ ఇంట్లో పూజలో మోదీ పాల్గొన్న వీడియోను సోషల్ మీడియాలో చూసి ఆశ్చర్యపోయానని సిబల్ వెల్లడించారు. గత 50 ఏళ్లుగా తాను సుప్రీంకోర్టులో పని చేస్తున్నానని, ఎంతోమంది గొప్పగొప్ప ప్రధాన న్యాయమూర్తులను చూశానని తెలిపారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్పై ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు. మనం నమ్మే మతం, మన విశ్వాసాలు పూర్తిగా వ్యక్తిగతమని, అవి అందరికీ తెలియజేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి, బయటపెట్టాల్సిన అవసరం లేదని కపిల్ సిబల్ తేలి్చచెప్పారు. తాజా వివాదంపై సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ స్పందించారు. కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉందని గుర్తుచేశారు. ఈ విభజన రేఖ విషయంలో సీజేఐ రాజీ పడుతున్నట్లు కనిపిస్తోందని ఆక్షేపించారు. ఆ పిటిషన్ల విచారణ నుంచి సీజేఐ తప్పుకోవాలి: సంజయ్ రౌత్ సీజేఐ నివాసంలో ప్రధాని మోదీ గణపతి పూజ పట్ల శివసేన(ఉద్ధవ్) పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హతకు సంబంధించిన పిటిషన్లు సుప్రీంకోర్టులో ప్రస్తుతంజస్టిస్ చంద్రచూడ్ ఎదుట పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. ఈ పిటిషన్లపై విచారణ నుంచి జస్టిస్ చంద్రచూడ్ తప్పుకోవాలని గురువారం డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తులు రాజకీయ నాయకులను కలవడంపై ప్రజల్లో సందేహాలు తలెత్తుతున్నాయని తెలిపారు. మోదీతో జస్టిస్ చంద్రచూడ్ బంధం బయటపడిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జస్టిస్ చంద్రచూడ్ మనకు న్యాయం చేకూర్చగలరా? అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది: సుప్రియా సూలే జస్టిస్ చంద్రచూడ్ ఇంటికి ప్రధాని మోదీ వెళ్లిన సంగతి తెలిసి తాను చాలా ఆశ్చర్యపోయానని నేషనలిస్టు కాంగ్రెస్ పారీ్ట(ఎస్పీ) వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ సుప్రియా సూలే గురువారం పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని చెప్పారు. వయసులో, అనుభవంలో ప్రధాని మోదీ, జస్టిస్ చంద్రచూడ్ తనకంటే చాలా పెద్దవారని, వారిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని వెల్లడించారు. అయితే, సీజేఐ ఇంటికి ప్రధాని వెళ్లడం గతంలో తాను ఎప్పుడూ వినలేదన్నారు. నీచ రాజకీయాలు చేయొద్దు: సంబిత్ పాత్రా సీజేఐ ఇంటికి ప్రధాని మోదీ వెళ్లడం పట్ల ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా విరుచుకుపడ్డారు. గతంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఇచి్చన విందుకు అప్పటి సీజేఐ వెళ్లినప్పుడు ఎందుకు మాట్లాడలేదని మండిపడ్డారు. అప్పట్లో అభ్యంతరం వ్యక్తంచేయని నాయకులు ఇప్పుడెందుకు స్పందిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. గణపతి పూజలో మోదీ పాల్గొంటే తప్పేంటని ప్రశ్నించారు. నీచ రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్ను కలిస్తే ఇక్కడి రాజకీయ పారీ్టలేవీ స్పందించడం లేదని సంబిత్ పాత్రా ధ్వజమెత్తారు. -
సీజేఐ ఇంట గణేష్ పూజలో ప్రధాని మోదీ (ఫొటోలు)
-
Supreme Court of India: జనం ఏమైపోయినా పట్టించుకోరా?
న్యూఢిల్లీ: కోల్కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా ఆందోళన కొనసాగిస్తున్న వైద్యులకు, వైద్య సిబ్బందికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని తేలి్చచెప్పింది. విధులను పక్కనపెట్టి నిరసనలు కొనసాగించడం సరైంది కాదని అభిప్రాయపడింది. సాధారణ ప్రజల అవసరాలను పట్టించుకోకుండా డాక్టర్లు ఇలా విధులకు గైర్హాజరు కావడం ఏమిటని ప్రశ్నించింది. జనం ఏమైపోయినా పట్టించుకోరా? అని నిలదీసింది. విధుల్లో చేరితే ఎలాంటి క్రమశిక్షణా చర్యలు ఉండబోవని వెల్లడించింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు మీ భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటారు, వెంటనే వెళ్లి డ్యూటీలో చేరండి అని డాక్టర్లను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవేళ విధులకు దూరంగా ఉంటూ నిరసనలు కొనసాగిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించినప్పుడు సంబంధిత డాక్టర్లకు ఇచ్చిన చలాన్ కనిపించకపోవడం పట్ల న్యాయస్థానం అనుమానం వ్యక్తంచేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని సీబీఐని, పశి్చమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. చలాన్ మాయం కావడంపై దర్యాప్తు జరపాలని సీబీఐకి సూచించింది. జూనియర్ డాక్టర్పై అఘాయిత్యం కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. శవపరీక్ష కోసం ఉపయోగించిన చలాన్ తమ రికార్డుల్లో లేదని చెప్పారు. అయితే, అది ఎక్కడుందో తేల్చాలని ధర్మాసనం పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదులో 14 గంటలు ఆలస్యం కావడం పట్ల మరోసారి అసహనం వ్యక్తం చేసింది. బాధితురాలి ఫోటోలు, వీడియోలను అన్ని రకాల సోషల్ మీడియా వేదికల నుంచి తక్షణమే తొలగించాలని పేర్కొంది.విరమించబోం: జూనియర్ డాక్టర్లు కోల్కతా: ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై హత్యాచారాన్ని నిరసిస్తూ నెలరోజులుగా విధులను బహిష్కరిస్తున్న పశి్చమబెంగాల్ జూనియర్ డాక్టర్లు సమ్మె కొనసాగిస్తామని సోమవారం రాత్రి ప్రకటించారు. విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ తాము సమ్మె విరమించబోమని జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. సీఐఎస్ఎఫ్కి వసతులు కలి్పంచండి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీల్డ్ కవర్లో సమరి్పంచిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై ఈ నెల 17వ తేదీలోగా తాజా నివేదిక సమరి్పంచాలని సీబీఐని ఆదేశించింది. ఈ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది. ఆర్జీ కర్ ఆసుపత్రిలో భద్రతా విధుల్లో చేరిన మూడు కంపెనీల సీఐఎస్ఎఫ్ సిబ్బందికి తగిన వసతి సౌకర్యాలు కల్పించాలని పశి్చమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారికి అవసరమైన పరికరాలు ఇవ్వాలని పేర్కొంది.ఫోరెన్సిక్ నివేదికపై అనుమానాలు డాక్టర్ ఫోరెన్సిక్ నివేదికపై సీబీఐ అనుమానాలు వ్యక్తం చేసింది. తదుపరి పరీక్షల కోసం బాధితురాలి నమూనాలను ఢిల్లీ–ఎయిమ్స్కు పంపించాలని నిర్ణయించినట్లు సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. డాక్టర్ కేవలం హత్యకు గురైనట్లు నివేదిక తేలి్చందని చెప్పారు. కానీ, ఆమెను లైంగికంగా చిత్రహింసలకు గురిచేసి, అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని వివరించారు. -
మహిళలపై నేరాల్లో... సత్వర తీర్పులు
న్యూఢిల్లీ: మహిళలపై అత్యాచారం, హత్య వంటి హేయమైన నేరాల విషయంలో తీర్పులు ఇవ్వడంలో కోర్టులు ఎంతమాత్రం జాప్యం చేయొద్దని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. సత్వర తీర్పులతో బాధితులకు న్యాయం చేకూర్చాలన్నారు. ‘‘ఇలాంటి కేసుల్లో తీర్పులు ఆలస్యమైతే న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుంది. న్యాయ వ్యవస్థ సున్నితత్వం కోల్పోయిందని భావించే ప్రమాదముంది’’ అన్నారు. జిల్లా న్యాయ వ్యవస్థపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆదివారం ముర్ము ప్రసంగించారు. హేయమైన నేరాలకు సంబంధించి కూడా కొన్నిసార్లు ఒక తరం ముగిసిన తర్వాత తీర్పులు వస్తున్నాయని ఆక్షేపించారు. కోర్టుల్లో వాయిదాల సంస్కృతి మారాలని సూచించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులు, బ్యాక్లాగ్ కేసులు న్యాయ వ్యవస్థకు పెను సవాలుగా నిలుస్తున్నాయన్నారు. వీటి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘తరచూ ప్రత్యేక లోక్ అదాలత్లు నిర్వహించాలి. ప్పారు. పెండింగ్ కేసులను తగ్గించడానికి అధిక ప్రాధాన్యమివ్వాలి’’ అని సూచించారు. న్యాయం కోసం పోరాడితే మరిన్ని కష్టాలు: అంగ బలం, అర్థబలం కలిగిన కొందరు నేరగాళ్లు యథేచ్ఛగా బయట సంచరిస్తున్నారని రాష్ట్రపతి ఆవేదన వెలిబుచ్చారు. ‘‘వారికి సకాలంలో శిక్షలు పడడం లేదన్నారు. అలాంటి నేరగాళ్ల వల్ల నష్టపోయిన బాధితులు మాత్రం భయాందోళనల మధ్య బతుకుతున్నారు. గ్రామీణ పేదలు కోర్టులకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వారు కోర్టుల దాకా వస్తున్నారు’’ అన్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు. కోర్టుల్లో మహిళలకు వసతులు మెరుగుపడాలి: సీజేఐ జిల్లా స్థాయి కోర్టుల్లో మహిళలకు తగిన మౌలిక వసతులు లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. న్యాయ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం బాగా పెరుగుతున్నా కోర్టుల్లో వారికి సరిపడా సదుపాయాలు లేకపోవడం గర్హనీయమన్నారు. జిల్లా స్థాయి న్యాయస్థానాల్లోని మౌలిక సదుపాయాల్లో కేవలం 6.7 శాతమే మహిళలకు అనువుగా ఉన్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరముందని ఉద్ఘాటించారు. ‘‘కొన్ని రాష్ట్రాల్లో న్యాయ నియామకాల్లో 70 శాతం మహిళలే ఉంటున్నారు. వారికి వసతులు మెరుగుపడాలి. కోర్టు ప్రాంగణాల్లో వైద్య సదుపాయాలు, పిల్లల సంరక్షణ కేంద్రాలు రావాలి. కక్షిదారుల కోసం ఈ–సేవా కేంద్రాలు, వీడియో కాన్ఫరెన్స్ వంటివాటితో న్యాయం సులువుగా అందుబాటులోకి వస్తుంది. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సురక్షితమైన, సానుకూల పరిస్థితులు కలి్పంచే చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. ప్రధానంగా మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు, అణగారిన వర్గాల సంక్షేమం న్యాయస్థానాల కర్తవ్యం కావాలి’’ అని పిలుపునిచ్చారు. -
‘సత్వర న్యాయం’తోనే భద్రతపై భరోసా
న్యూఢిల్లీ: మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం లభించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వేగంగా న్యాయం చేకూర్చే పరిస్థితి ఉంటే భద్రత పట్ల మహిళలకు గొప్ప భరోసా దక్కుతుందని ఉద్ఘాటించారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య, మహారాష్ట్రలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఢిల్లీలో శనివారం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జిల్లా న్యాయ వ్యవస్థపై ప్రారంభమైన జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత రాజ్యాంగానికి దేశ న్యాయ వ్యవస్థను ఒక సంరక్షకురాలిగా పరిగణిస్తుంటామని చెప్పారు. సుప్రీంకోర్టుతోపాటు మొత్తం న్యాయ వ్యవస్థ ప్రజల అంచనాలకు తగ్గట్టుగా పని చేస్తే సమాజానికి మేలు జరుగుతుందని అన్నారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... క్రియాశీలకంగా మానిటరింగ్ కమిటీలు ‘‘దేశంలో మహిళలు, చిన్నారులపై వేధింపులు, నేరాలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. మహిళల భద్రత కోసం చట్టాల్లో కఠినమైన నిబంధనలు చేరుస్తున్నాం. 2019లో ఫాస్ట్ట్రాక్ ప్రత్యేక కోర్టుల పథకాన్ని ప్రారంభించాం. అడబిడ్డలపై జరిగే నేరాల విషయంలో తీర్పులు వేగంగా రావాలి. నేరగాళ్లకు శిక్షలు పడాలి. బాధితులకు సత్వర న్యాయం దక్కాలి. అలా జరిగితేనే జనాభాలో సగం మందికి వారి భద్రతపై ఒక భరోసా, నమ్మకం లభిస్తాయి. మహిళలపై నేరాలు అరికట్టే విషయంలో జిల్లా జడ్జి, మేజి్రస్టేట్, ఎస్పీతో కూడిన జిల్లా మానిటరింగ్ కమిటీల పాత్ర చాలా కీలకం. కింది కోర్టులే మొదటి మెట్టు దేశంలో రాజ్యాంగాన్ని, చట్టాల స్ఫూర్తిని న్యాయ వ్యవస్థ చక్కగా పరిరక్షిస్తోంది. సుప్రీంకోర్టు పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల దేశ ప్రజలు ఏనాడూ అపనమ్మకం వ్యక్తం చేయలేదు. న్యాయ వ్యవస్థపై వారికి ఎంతో విశ్వాసం ఉంది. దేశ న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థ ఒక బలమైన పునాది అనడంలో సందేహం లేదు. బాధితులకు న్యాయం చేకూర్చడంలో కింది కోర్టులే మొదటి మెట్టు. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నాం. కోర్టులను ఆధునీకరిస్తున్నాం. పెండింగ్ కేసులను విశ్లేíÙంచడానికి, భవిష్యత్తులో రాబోయే కేసులను అంచనా వేయడానికి కృత్రిమ మేధ(ఏఐ), ఆప్టికల్ క్యారెక్టర్ రికగి్నషన్ వంటి నూతన సాంకేతికతలను ప్రవేశపెట్టాలని నిర్ణయించాం’’ అని ప్రధానమంత్రి మోదీ ఉద్ఘాటించారు. భారత సుప్రీంకోర్టు ఏర్పాటై 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్మారక పోస్టల్ స్టాంప్, నాణేన్ని ఆవిష్కరించారు. బెయిల్ ఇవ్వడానికి అభ్యంతరమెందుకు: కపిల్ సిబల్ ఎలాంటి సంకోచాలు, పక్షపాతానికి తావులేకుండా తీర్పులు ఇచ్చేలా ట్రయల్ కోర్టులు, జిల్లా కోర్టులు, సెషన్స్ కోర్టులు బలోపేతం కావాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ చెప్పారు. క్షేత్రస్థాయిలోని కింది కోర్టులు ఒత్తిళ్లను తట్టుకొని స్థిరంగా నిలవకపోతే మొత్తం న్యాయ, రాజకీయ వ్యవస్థ సమగ్రత ప్రమా దంలో పడుతుందని అన్నారు. జిల్లా కోర్టులపై సదస్సులో ఆయన మాట్లాడుతూ... బెయిల్ ఒక నియమం, జైలు ఒక మినహాయింపు అంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పును ప్రస్తావించారు. కీలకమైన కేసుల్లో నిందితులకు బెయిల్ ఇవ్వడానికి ట్రయల్ కోర్టులు, జిల్లా కోర్టులు నిరాకరిస్తున్నాయని ఆక్షేపించారు. తన వృత్తి జీవితంలో కింది కోర్టులు బెయిల్ ఇవ్వగా చూసిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇది కేవలం తన ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదని చెప్పారు. బెయిల్ను కింది కోర్టులు ఒక మినహాయింపుగా భావిస్తుండడంతో పై కోర్టులపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల చెప్పారని గుర్తుచేశారు. కింది కోర్టుల్లో బెయిల్ రాకపోవడంతో నిందితులు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని సూచించారు. జిల్లా కోర్టుల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని, న్యాయమూర్తుల వేతనా లు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కోర్టులే వెన్నెముక: జస్టిస్ చంద్రచూడ్ దేశంలో మొత్తం న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థ వెన్నుముక అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభివరి్ణంచారు. చట్టబద్ధ పాలనకు జిల్లా జ్యుడీíÙయరీ అత్యంత కీలకమని చెప్పారు. జిల్లా కోర్టులను కింది కోర్టులు అని పిలవడం ఆపేయాలని సూచించారు. జిల్లా కోర్టులపై జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లా న్యాయ వ్యవస్థలో కొన్నేళ్లుగా మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోందని అన్నారు. న్యాయాన్ని పొందడానికి ప్రజలకు మొదటి వేదిక జిల్లా కోర్టులేనని తెలిపారు. న్యాయ వ్యవస్థలో టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. 2023–24లో 46.48 కోట్ల పేజీల కోర్టు రికార్డులను డిజిటల్ రూపంలోకి మార్చామని వెల్లడించారు. 3,500 కోర్టు కాంప్లెక్స్లను, 22,000 కోర్టు రూమ్లను కంప్యూటరీకరించడానికి ఈ–కోర్టుల ప్రాజెక్టును ప్రారంభించినట్లు చెప్పారు. న్యాయమూర్తులపై ఒత్తిడి అధికంగా ఉంటుందని, వారు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. -
మహిళలపై నేరాలకు వెంటనే తీర్పు రావాలి: ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టు మన ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అలాగే, వ్యవస్థల పట్ల గౌరవాన్ని, విశ్వాసాన్ని సుప్రీంకోర్టు నెలకొల్పిందని ప్రశంసలు కురిపించారు.కాగా, సుప్రీంకోర్టు 75ఏళ్ల వార్షికోత్సవం పురస్కరించుకొని జిల్లా న్యాయవ్యవస్థపై ప్రత్యేక సదస్సు జరిగింది. ఈ ప్రత్యేక సదస్సులో ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై. చంద్రచూడ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు 75 ఏళ్ల స్మారక చిహ్నం స్టాంప్ను, 75 రూపాయా నాణెంను విడుదల చేశారు. #WATCH | Prime Minister Narendra Modi addresses the inaugural event of the 2-day National Conference of District Judiciary, at Bharat Mandapam'He says, "75 years of the Supreme Court, this is not just the journey of an institution. This is the journey of the Constitution of… pic.twitter.com/6hO07Zqd3B— ANI (@ANI) August 31, 2024 అనంతరం, ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘సుప్రీంకోర్టు ప్రయాణంలో 75 ఏళ్లు పూర్తి కావడమంటే, రాజ్యాంగ విలువలకు, పరిపక్వమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం. సుప్రీంకోర్టు మన ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. వ్యవస్థల పట్ల గౌరవాన్ని, విశ్వాసాన్ని నెలకొల్పింది. ఎమర్జెన్సీ చీకటి కాలంలో కూడా సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులకు హామీ ఇచ్చింది. జాతీయ ప్రయోజనాలను, జాతీయ సమగ్రతను సుప్రీం కోర్టు ఎప్పుడూ కాపాడుతుంది. మన న్యాయవ్యవస్థ 140 కోట్ల మంది దేశ ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. మహిళలపై నేరాలకు సత్వరమే తీర్పులు రావాలి. మహిళలపై చోటు చేసుకొనే నేరాలపై సత్వరమే విచారణ పూర్తి అయి తీర్పులు రావాలి. మహిళలు, చిన్నారుల భద్రత సమాజానికి ఆందోళనకరంగా మరిందన్నారు. కాగా, కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. Delhi | Prime Minister Narendra Modi says, "To eliminate delay in justice, work has been done at many levels in the last decade. In the last 10 years, the country has spent about 8 thousand crore rupees for the development of judicial infrastructure. 75 per cent of the amount… pic.twitter.com/RCuA3XrVuN— ANI (@ANI) August 31, 2024 -
‘ఆమె మహిళా హక్కుల పరిరక్షకురాలు’
న్యూఢిల్లీ: జస్టిస్ హిమా కోహ్లి ఒక మహిళా జడ్జి మాత్రమే కాదని స్త్రీ హక్కుల పరిరక్షణకు తీవ్రంగా పాటుపడ్డారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ కితాబిచ్చారు. సెప్టెంబరు 1న రిటైరవుతున్న హిమా కోహ్లి గౌరవార్థం సీజేఐ శుక్రవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఆమె రిటైరయ్యాక సర్వోన్నత న్యాయస్థానంలో ఇద్దరు మహిళా న్యాయమూర్తులు.. జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ బేలా ఎం. త్రివేదిలు ఉంటారు. ‘జస్టిస్ కోహ్లితో కలిసి ధర్మాసనంపై కూర్చోవడం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. హిమా.. మీరొక మహిళా జడ్జి మాత్రమే కాదు.. స్త్రీల హక్కుల పరిరక్షకురాలు కూడా’ అని సీజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చంద్రచూడ్, హిమాకోహ్లిలు బ్యాచ్మేట్లు కావడం గమనార్హం. న్యాయం కోసం జస్టిస్ కోహ్లి తన జీవితాన్ని ధారబోశారని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి అన్నారు. 2006 మే నెలలో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులైన హిమా కోహ్లి.. 2007 ఆగస్టులో శాశ్వత జడ్జి అయ్యారు. జనవరి 7, 2021న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 ఆగస్టు 31న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. -
సుమోటోగా స్వీకరించిన సుప్రీం
న్యూఢిల్లీ: కోల్కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 20న ఈ కేసు విచారణ చేపట్టనుంది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం వెబ్సైట్లో వివరాలు పొందుపర్చారు. దేశాన్ని కుదిపేస్తున్న వైద్యురాలి హత్య కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఘటనపై 14న సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు పలువురు న్యాయవాదులు సుప్రీంకోర్టు సీజేఐకు లేఖ రాశారు. డాక్టర్ హత్య ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రత్యేక చట్టం తీసుకురావాలి కోల్కతాలో వైద్యురాలి హత్యపై 70 మందికిపైగా పద్మ అవార్డుల గ్రహీతలైన డాక్టర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో పని చేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిపై హింసను అరికట్టడానికి, వారి తగిన భద్రత కల్పించడానికి, ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను పటిష్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. వైద్యులపై, సిబ్బందిపై దాడులకు పాల్పడేవారిని, మానసికంగా వేధించేవారిని శిక్షించడానికి ఆర్డినెన్స్ తేవాలని సూచించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో వైద్యుల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయని, ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు. బాధితురాలి కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. ఆ కుటుంబానికి న్యాయం చేకూర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాని మోదీకి లేఖ రాసినవారిలో ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్, ఎయిమ్స్ రెసిడెంట్స్ డాక్టర్లు తదితరులు ఉన్నారు. -
స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఎంతో విలువైనవి: సీజేఐ
న్యూఢిల్లీ: స్వేచ్ఛ, స్వాతంత్య్రం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే స్వేచ్ఛ, స్వాతంత్య్రం విలువ ఏమిటో అర్థం చేసుకోవచ్చని అన్నారు. గురువారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో జస్టిస్ చంద్రచూడ్ జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. గత చరిత్రను పరికిస్తే స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఎంత విలువైనవో అవగతమవుతుందని పేర్కొన్నారు. ఇవి సులువుగా లభిస్తాయని అనుకోవద్దని సూచించారు. దేశంలో సాటి పౌరుల పట్ల మన బాధ్యతలను స్వాతంత్య్ర దినోత్సవం గుర్తుచేస్తుందని తెలిపారు. రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడానికి స్వాతంత్య్ర దినోత్సవం దోహదపడుతుందని అన్నారు. మన దేశంలో న్యాయవాదులు ఎన్నో త్యాగాలు చేశారని, వృత్తిని తృణప్రాయంగా వదిలేసి దేశ సేవ కోసం అంకితమయ్యారని కొనియాడారు. పౌరులుగా దేశం పట్ల, సాటి మనుషుల పట్ల నిర్వర్తించాల్సిన బాధ్యతలను అందరూ చక్కగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. -
Supreme Court: ఆ బకాయిలను రాష్ట్రాలకు చెల్లించాల్సిందే
న్యూఢిల్లీ: ఖనిజ సంపన్న రాష్ట్రాలకు శుభవార్త. గనులకు సంబంధించిన రాయల్టీ, పన్నుల తాలూకు బకాయిలను కేంద్రం నుంచి వసూలు చేసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. 2005 ఏప్రిల్ 1 నుంచీ బకాయిలను వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు బుధవారం తీర్పు వెలువరించింది. బకాయిలను 12 ఏళ్లలోపు చెల్లించాలని కేంద్రాన్ని, వాటిపై పెనాలీ్టల వంటివేమీ విధించొద్దని రాష్ట్రాలను ఆదేశించింది.ధర్మాసనం తరఫున సీజేఐ తీర్పు రాశారు. ఖనిజాలు, నిక్షేపాలున్న భూములపై రాయల్టీ వసూలు అధికారం కేంద్రానిదేనన్న 1989 నాటి సుప్రీంకోర్టు తీర్పును పలు రాష్ట్రాలు సవాలు చేశాయి. గనులు, ఖనిజాలపై రాయల్టీ విధించే అధికారం రాష్ట్రాలకే ఉంటుందంటూ 8:1 మెజారిటీతో జూలై 25న ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీన్ని 1989 నుంచీ వర్తింపయాలని పలు రాష్ట్రాలు కోరాయి. దీన్ని కేంద్రం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇందుకు ఒప్పుకుంటే సంబంధిత ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్రాలకు రూ.70 వేల కోట్ల మేరకు చెల్లించాల్సి రావచ్చని తెలిపింది. కనుక తీర్పును జూలై 25 నుంచే వర్తింపజేయాలని అభ్యర్థించింది. దీన్ని ధర్మాసనం తాజాగా తోసిపుచి్చంది. -
CJI DY Chandrachud: న్యాయం, వైద్యం... అత్యంత ఖరీదు!
చండీగఢ్: ‘‘వైద్య, న్యాయ వృత్తుల రెండింటి లక్ష్యమూ ఒక్కటే. అంకితభావంతో కూడిన సేవ ద్వారా వ్యక్తులకు, సమాజానికి హితం చేకూర్చడం. సంక్షేమమే వాటి మూలసూత్రం. కానీ, సమాజ హితానికి పాటుపడేందుకే పుట్టుకొచి్చన అతి కీలకమైన ఆ రెండు రంగాలూ నేడు అదే సమాజానికి అందుబాటులో లేకుండా పోవడం ఆశ్చర్యకరం’’ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆవేదన వెలిబుచ్చారు. ముఖ్యంగా ప్రైవేట్ రంగం రాకతో 1980ల నుంచి భారత్లో వైద్యం బాగా వ్యాపారమయంగా మారిపోయిందన్నారు. ‘‘పలు ఔషధాల ఖరీదు భరించలేనంతగా పెరిగిపోయింది. గ్రామీణుల ఆదాయంలో ఏకంగా 77 శాతం, పట్టణ ప్రాంతాల్లో 70 శాతం వైద్య ఖర్చులకే పోతోంది’’ అని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా వైద్య కళాశాలు చూడాల్సిన అవసరముంది. ఇది వాటి సామాజిక బాధ్యత కూడా’’ అని హితవు పలికారు. శనివారం చండీగఢ్లో పీజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 37వ స్నాతకోత్సవంలో సీజేఐ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువ వైద్యులను ఉద్దేశించి ప్రసంగించారు. రోగుల పట్ల దయ, సహానుభూతి ఉండాలని వారికి ఉద్బోధించారు. ‘‘భారత్ ఇన్నొవేషన్ల కేంద్రంగా మారడం అభినందనీయం. కానీ వాటి ఫలాలు అతి కొద్దిమందికే పరిమితం అవుతుండటం బాధాకరం. కనుక వైద్య రంగంలో కీలక పరిశోధనలకు యువ డాక్టర్లు శ్రీకారం చుట్టాలి’’ అని ఆకాంక్షించారు. టెక్నాలజీ వాడకం పెరగాలి టెక్నాలజీ ద్వారా కోర్టుల పనితీరులో జవాబుదారీతనం పెరగడమే గాక న్యాయప్రక్రియ ప్రజలకు మరింత చేరువవుతుందని సీజేఐ అభిప్రాయపడ్డారు. ‘‘పారదర్శకత, ప్రజాస్వామ్యం, అందరికీ సమన్యాయం వంటి విలువల పరిరక్షణకు టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది. కక్షిదారులు కూడా ఉన్నచోటి నుంచే వారి కేసుల విచారణను ప్రత్యక్షంగా వీక్షించే వీలు కలి్పస్తోంది’’ అని చెప్పారు. గత నాలుగేళ్లలో సుప్రీంకోర్టు ఏకంగా 8 లక్షలకు పైగా కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిందని గుర్తు చేశారు. పెండింగ్ భారాన్ని తగ్గించేందుకు కోర్టుల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. -
Justice D.Y. Chandrachud: న్యాయప్రక్రియతో జనం విసుగెత్తిపోయారు
న్యూఢిల్లీ: దేశంలో కోర్టులకు సంబంధించిన వ్యవహారాలు, సుదీర్ఘంగా సాగే న్యాయ వ్యవస్థ ప్రక్రియతో ప్రజలు విసుగెత్తిపోయారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్లు చక్కటి ప్రత్యామ్నాయ వేదికలని చెప్పారు. వాటిని ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించారు. శనివారం సుప్రీంకోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ వారోత్సవంలో ఆయన మాట్లాడారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న వివాదాలను, కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకొనే అవకాశం ఉందని, ఇరుపక్షాల అంగీకారంతో రాజీ పడొచ్చని వెల్లడించారు. న్యాయస్థానాల్లో న్యాయం చేకూర్చే ప్రక్రియ కక్షిదారులకు ఒక శిక్షగా మారిపోయిందని, ఇది నిజంగా న్యాయమూర్తులకు ఆందోళన కలిగించే విషయమని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని ఆకాంక్షించారు. -
కోర్టులతో ప్రజలు విసిగిపోయారు: సీజేఐ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: న్యాయప్రక్రియపై చీఫ్జస్టిస్ఆఫ్ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టుల్లో కేసుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంతో ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. శనివారం(ఆగస్టు3) సుప్రీంకోర్టులో జరిగిన ప్రత్యేక లోక్అదాలత్ వారోత్సవాల కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. కేసుల సత్వర పరిష్కారానికి ప్రజలు సెటిల్మెంట్లు కోరుకుంటున్నారన్నారు. జడ్జిలకు ఇది ఆందోళన కలిగించే విషయమేనని అభిప్రాయపడ్డారు. కేసుల సెటిల్మెంట్లో లోక్అదాలత్లది కీలక పాత్ర అని చెప్పారు. లోక్అదాలత్లో సెటిల్ చేసుకున్న కేసుల్లో అప్పీల్ ఉండదని తెలిపారు. -
CJI D Y Chandrachud: వారం రోజుల స్పెషల్ లోక్ అదాలత్
న్యూఢిల్లీ: వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి, తద్వారా పెండింగ్ భారాన్ని తగ్గించుకునేందుకు సుప్రీంకోర్టు సోమవారం ప్రత్యేక లోక్ అదాలత్ను ప్రారంభించింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టులోని మొదటి ఏడు ధర్మాసనాలు మధ్యాహ్నం 2 గంటలకు కేసులను విచారిస్తాయి. సుప్రీంకోర్టు వజ్రోత్సవాల సంబరాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వెల్లడించారు. ప్రత్యేక లోక్ అదాలత్ వారం పాటు కొనసాగుతుందని తెలిపారు. సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్న కక్షిదారులు, లాయర్లు దీన్ని వినియోగించుకోవాలని కోరారు. వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడంలో కక్షిదారులకు సాయపడితే కలిగే తృప్తి వెల కట్టలేనిదని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్యల పరిష్కారంలో లోక్ అదాలత్ల ప్రాధాన్యతకు సంబంధించి స్వీయానుభవాన్ని ఉదాహరించారు. ‘‘నా ముందుకు ఒక విడాకుల కేసు వచి్చంది. భార్య నుంచి విడాకులు కోరుతూ భర్త కింది కోర్టుకు వెళ్లాడు. అతడి నుంచి పరిహారం, పాప సంరక్షణ హక్కులు కోరుతూ భార్య కూడా కోర్టుకెక్కింది. వారితో సామరస్యపూర్వకంగా మాట్లాడిన మీదట మనసు మార్చుకున్నారు. కలిసుండేందుకు ఒప్పుకున్నారు. వైవాహిక జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తామని చెబుతూ కేసులు వెనక్కు తీసుకున్నారు’’ అని వివరించారు. ఇలా లోక్ అదాలత్లు ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి! పైగా సోమవారం జరిగిన విచారణల కవరేజీ కోసం మీడియాను కోర్టు రూముల లోపలికి అనుమతించడం విశేషం. -
CJI D Y Chandrachud: బెయిల్ అర్జీలపై ‘సేఫ్ గేమ్’ వద్దు
బెంగళూరు: బెయిల్ అర్జీల విషయంలో ట్రయల్ కోర్టుల జడ్జీలు ‘సేఫ్ గేమ్’ ఆడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. అనుమానాస్పదం అనే పేరు చెప్పి ప్రతి కేసులోనూ బెయిల్ తిరస్కరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఆదివారం బెంగళూరులో బెర్క్లే సెంటర్ 11వ వార్షిక సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ట్రయల్ కోర్టులు ప్రతి బెయిల్ పిటిషన్ను క్షుణ్ణంగా పరిశీలించాలి. కానీ అనుమానాస్పదం పేరిట అర్జీలను ట్రయల్ కోర్టుల జడ్జీలు కొట్టేస్తున్నారు. ఇలాంటి సేఫ్గేమ్ పనికిరాదు. బెయిల్ అర్జీలపై ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలి. కేసు ప్రాముఖ్యతను బట్టి తుది నిర్ణయం తీసుకోవాలి. అంతేగానీ పై కోర్టుకు వదిలేయకూడదు. ఎందుకంటే వాళ్లంతా హైకోర్టు గడపతొక్కుతున్నారు. అక్కడా బెయిల్ దొరక్కపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. అనవసరంగా అరెస్ట్ అయిన వాళ్లు కూడా సుప్రీంకోర్టు దాకా రావాల్సిన పరిస్థితి! ఇలాంటి కేసులన్నీ అంత దూరం రావడం సరికాదు’’ అన్నారు. వాతావరణ మార్పులు మహిళలు, చిన్నారులు, దివ్యాంగులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని సీజేఐ అన్నారు. ‘‘వాతావరణ మార్పులతో వలసలు పెరుగుతున్నాయి. ప్రజలకు నాణ్యమైన జీవితం కరువవుతోంది. ఆహార కొరతతో చిన్నారులు, ఇతర సమస్యలతో మహిళలు బాధ పడుతున్నారు. ఇబ్బందుల కొలిమిలో కాలిపోతున్నారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. -
Supreme Court: ‘రాయల్టీ’ రాష్ట్రాలదే
న్యూఢిల్లీ: ఖనిజాలపై రాయల్టీ విధించే అధికారం రాష్ట్రాలకు మాత్రమే ఉందని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఖనిజాలపై చెల్లించే రాయల్టీ పన్ను కాదని న్యాయస్థానం తేలి్చచెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం 8:1 మెజారిటీతో కీలక తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వానికి ఇది ఎదురుదెబ్బే. గనుల, ఖనిజాల అభివృద్ధిపై కేంద్రం నియంత్రణకు వీలు కలి్పస్తున్న రాజ్యాంగంలోని జాబితా–1లో పేర్కొన్న ఎంట్రీ 54 ప్రకారం.. ఖనిజ హక్కులపై పన్నులు విధించే అధికారం పార్లమెంటుకు లేదని తేల్చిచెప్పింది. అయితే ఖనిజ హక్కులపై రాయల్టీ విధించే రాష్ట్రాల అధికారాన్ని ఏ స్థాయికైనా పరిమితం చేసే అధికారం పార్లమెంటుకు ఉందని స్పష్టం చేసింది. గనులు, ఖనిజాలు అధికంగా ఉన్న జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు ఈ తీర్పుతో లబ్ధి చేకూరనుంది. తమ ప్రాంతంలో ఉన్న గనులు, ఖనిజాలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా వసూలు చేసిన రూ.వేల కోట్ల పన్నులను తిరిగి తమకు ఇప్పించాలని ఆయా రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయి. తీర్పును అమల్లోకి తీసుకురావాలని కోరాయి. రాష్ట్రాల విజ్ఞప్తిని కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ వ్యతిరేకించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఈ అంశంపై లిఖితపూర్వకంగా స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. పన్నులను రాష్ట్రాలకు తిరిగి ఇచ్చే విషయంలో ఈ నెల 31న తమ నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించింది. 1989 నాటి తీర్పును తోసిపుచ్చిన ధర్మాసనం గనులు, ఖనిజాలపై రాయల్టీ విధించే హక్కు రాష్ట్రాలకే ఉందంటూ తమ తీర్పును జస్టిస్ డి.వై.చంద్రచూడ్ స్వయంగా చదివి వినిపించారు. ధర్మాసనంలోని 8 మంది సభ్యులు రాష్ట్రాల హక్కును సమర్థిస్తూ తీర్పు ఇచ్చారు. జస్టిస్ నాగరత్న ఒక్కరే వ్యతిరేకిస్తూ భిన్నమైన తీర్పు వెలువరించారు. రాజ్యాంగంలో జాబితా–2లోని ఎంట్రీ 50 కింద గనులు, ఖనిజాలపై పన్నులు విధించే అధికారం పార్లమెంట్కు లేదని జస్టిస్ చంద్రచూడ్ తమ తీర్పులో చెప్పారు. రాయల్టీ అంటే పన్ను అని తేల్చేస్తూ 1989లో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచి్చన తీర్పు సరైంది కాదని పేర్కొన్నారు. ఆæ తీర్పును తోసిపుచ్చారు.రాష్ట్రాల అధికారాన్ని పార్లమెంటు పరిమితం చేయవచ్చు ఖనిజాలపై రాయల్టీ వసూలు చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నప్పటికీ.. దేశంలో ఖనిజాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాల అధికారాన్ని పరిమితం చేసే హక్కు మాత్రం పార్లమెంటుకు ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. ‘ఖనిజాభివృద్ధి ఆటంకం కలగకుండా ఉండటానికి రాష్ట్రాల రాయల్టీ అధికారాన్ని పార్లమెంటు పరిమితం చేయగలదు. ఆ మేరకు పార్లమెంటు ఏదైనా చట్టాన్ని చేస్తే రాష్ట్రాలు దానికి కట్టుబడి ఉండాలి’ అని స్పష్టం చేసింది. -
Supreme Court: రెండిట్లో ‘సరైన’ సమాధానం ఏమిటి?
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్–యూజీ, 2024 పరీక్షలో పేపర్ లీకేజీ ఉదంతంపై పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టులో సోమవారం ఒక ప్రశ్నపై తీవ్రమైన చర్చ జరిగింది. ఒక ప్రశ్నకు ఇచి్చన ఆప్షన్లలో రెండు సరైన సమాధానాలు ఉన్నాయని, వీటిల్లో ఒకటి ఎంచుకున్న అభ్యర్థులకు మార్కులేసి రెండోది ఎంచుకున్న అభ్యర్థులకు మార్కులు వేయలేదని దీనిపై తేల్చాలని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జసిŠట్స్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పారి్ధవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం సోమవారం విచారించింది. రెండింటిలో సరైన సమాధానం ఏది? అనే దానిపై స్పష్టత వస్తే అభ్యర్థుల తుది జాబితా మెరిట్ లిస్ట్లో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. ఈ అంశంపై తొలుత పిటిషన్ల తరఫు న్యాయవాది వాదించారు. ‘‘ఈ ప్రశ్నకు సమాధానం రాసేందుకు ప్రయతి్నంచిన అభ్యర్థుల్ని మూడురకాలుగా విడగొట్టాలి. ఎందుకంటే రెండు ‘సరైన’ సమాధానాల్లో ఒకదానికి ఎంచుకున్న వాళ్లకు నెగిటివ్ మార్కింగ్ కారణంగా ఐదు మార్కులు పోయాయి. రెండో సమాధానం ఎంచుకున్న వాళ్లకు నాలుగు మార్కులు పడ్డాయి. రెండింటిలో ఏది కరెక్టో తేల్చుకోలేక, నెగిటివ్ మార్కింగ్ వల్ల మార్కులు పోతాయన్న భయంతో సమాధానం రాయకుండా వదిలేసిన వాళ్లూ ఉన్నారు’’ అని న్యాయవాది వివరించారు. దీంతో ధర్మాసనం స్పందించింది. ‘‘ ఫిజిక్స్ విభాగంలో అణువుకు సంబంధించిన ప్రశ్నలో నాలుగు ఆప్షన్లలో రెండు సరైన సమాధానాలు ఉన్నాయన్న వాదనల నడుమ అసలైన సమాధానాన్ని తేల్చాల్సిన సమయమొచి్చంది. అందుకోసం ముగ్గురు విషయ నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటుచేయండి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలలోపు మాకు సరైన సమాధానమేంటో నివేదించండి’’ అని ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ను కోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలు ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్కు చేరేలా చూడాలని సుప్రీంకోర్టులో సెక్రటరీ జనరల్కు ధర్మాసనం సూచించింది. ‘పరీక్ష నిర్వహణలో లోపాలు చూస్తుంటే ఇది వ్యవస్థాగత వైఫల్యమని తెలుస్తోంది. గుజరాత్లో ఒక విద్యార్థి 12వ తరగతిలో ఫెయిల్ అయ్యాడుగానీ నీట్ పరీక్షలో చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. కొన్ని కేంద్రాల్లో అడ్రస్ వెరిఫికేషన్ చేయలేదు. మరి కొన్నింటిలో సీసీటీవీ కెమెరాలే లేవు’ అని లాయర్ నరేందర్ హూడా వాదించారు.కొలిక్కి వస్తున్న నీట్–యూజీ వివాదం! నీట్ యూజీ పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని దాదాపు 40 పిటిషన్లు దాఖలైన విషయం తెల్సిందే. పరీక్ష రద్దు చేయాలంటూ, రద్దు చేయొద్దంటూ దాఖలు చేసిన వారి వాదనలు సుప్రీంకోర్టులో పూర్తయ్యాయి. ఇక కేంద్రం తరఫు వాదనలు మిగిలి ఉన్నాయి. మంగళవారం కేంద్రం వాదనలు పూర్తయితే త్వరగా తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి. -
‘నీట్’ పేపర్ లీకేజీపై నేడు సుప్రీంలో విచారణ
ఢిల్లీ: ఇవాళ సుప్రీం కోర్టులో నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ, అవతకవకలపై విచారణ జరగనుంది. సుప్రీం కోర్టు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.చివరి సారిగా ‘జులై 8న అత్యున్నత న్యాయ స్థానంలో నీట్ లీకేజీపై వ్యవహారంపై విచారణ జరిగింది. ఆ సమయంలో ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) , కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పేపర్ లీకేజీపై తమ స్పందనలు తెలియజేస్తూ అఫిడవిట్లను దాఖలు చేశాయి. ఆ అఫిడవిట్లు అందరు పిటిషన్దారులకు ఇంకా చేరలేదు. వాటిని పరిశీలించేందుకు వీలుగా సమయమిస్తూ తదుపరి విచారణ జులై 18కి వాయిదా వేస్తున్నాం’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారుసీల్డ్ కవర్లో సీబీఐ దర్యాప్తు నివేదికవిచారణ సందర్భంగా నీట్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ కే పరిమితమని అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. ఐఐటి మద్రాస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అసాధారణ మార్కులు ఏ అభ్యర్థులకు రాలేదని స్పష్టం చేయగా.. నీట్ లీక్పై సీబీఐ తన దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు అందించింది. ఈ వరుస పరిణామల నేపథ్యంలో ఇవాళ నీట్పై సుప్రీం కోర్టులో కీలక విచారణ జరగనుంది. నీట్లో పేపర్ లీకేజీపై వరుస అరెస్ట్లుమరోవైపు నీట్ పేపర్ లీకేజీ నిందితులను అరెస్ట్లు కొనసాగుతున్నాయి. కేంద్రం ఆదేశాలతో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు ఈ కేసులో ఇప్పటి వరకు 14మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తాజాగా ఈ వారంలో.. కీలక నిందితుడు పంకజ్ కుమార్ అలియాస్ ఆదిత్య, అతని సహాయకుడు రాజుసింస్ను అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ అధికారుల విచారణలో పంకజ్ కుమార్ హజారీబాగ్లోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి నీట్ ప్రశ్నపత్రం తస్కరించినట్లు అధికారులు తెలిపారు. నిందితుల్లో మొత్తం ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. -
అభివృద్ధికి కొలమానం... సంపదా? సంతోషమా?
ఆత్మహత్యల్ని సామాజిక సమస్యగా పేర్కొంటూ దీని పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త గౌరవ్ కుమార్ బన్సాల్ వేసిన ప్రజాప్రయోజన వాజ్యం (పిల్) విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సామాన్యులతోపాటూ వైద్యశాస్త్ర నిపుణులు సహితం ఇప్పటికీ ఆత్మహత్యల్ని మానసిక సమస్యగా పరిగణిస్తుంటారు. భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు మన సాధారణ అవగాహనలో ఒక గొప్ప ముందడుగు అనే భావించాలి. ప్రభుత్వాలు ఆర్థిక సూచికల్ని ప్రచారం చేసుకున్నంతగా ఆనంద సూచికల్ని ప్రచారం చేయవు. స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) వంటి ఆర్థిక సూచికల గణాంకాలను సేకరించడం సులువు. అవి ప్రజలకు కూడ సులువుగా అర్థమవుతాయి. ఆరోగ్యం, ఆనందం, సంతృప్తి, భవిష్యత్తు మీద నమ్మకం వంటి సామాజిక సూచికల గణాంకాలు తీయడం అంత సులువు కాదు. మనుషులు తమ వ్యక్తిగత ఆందోళన, ఒత్తిడి, కుంగుబాట్లను ఇతరులతో పంచుకోరు.జనాభాలో మనదేశం ఇప్పుడు ప్రపంచంలో అగ్రస్థానంలో వుంది. మన తరువాత చైనా, అమెరికా, ఇండోనేషియా, పాకిస్తాన్, నైజీరియా, బ్రెజిల్, బంగ్లాదేశ్, రష్యా, మెక్సికో ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థల్లో 29 ట్రిలియన్ డాలర్లతో అమెరికాది అగ్రస్థానం. నాలుగు ట్రిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో ఇండియా ఉంది. త్వరలో మనం జపాన్, జర్మనీలను అధిగమించి ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొంతకాలంగా గట్టిగా ప్రచారం చేస్తున్నారు. అది సాధ్యమూ కావచ్చు. ఈ సందర్భంగా గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు మరికొన్ని వున్నాయి. మనం జనాభాలో చైనాను అధిగమించవచ్చుగానీ చైనా ప్రజల జీవనస్థాయికి చేరుకోలేము. చైనా సాలీన తలసరి ఆదాయం 13 వేల డాలర్లు. అది అమెరికాలో 85 వేల డాలర్లు. మన దేశంలో 3 వేల డాలర్లకన్నా తక్కువ. జీడీపీలో మనం జర్మనీని అధిగమించవచ్చు గానీ, మన ప్రజల జీవనస్థాయి జర్మన్ల జీవన స్థాయిలో 20వ వంతు మాత్రమే వుంటుంది. ఇవి సగటు లెక్కలు మాత్రమే. వాస్తవానికి జనాభాలో 20 శాతం జీవనస్థాయి ఇంతకన్నా చాలా మెరుగ్గా వుంటుంది. 80 శాతం జీవనస్థాయి ఇంతకన్నా మరీ హీనంగా వుంటుంది. మన దేశంలో సంపదకు లోటు లేనప్పటికీ సంపద పంపిణి విధానంలో ఘోరమైన లోటు ఉన్నదని ఈ గణాంకాలు చెబుతున్నాయి. జీడీపీ, తలసరి ఆదాయాలకు భిన్నమైన ప్రమాణాలు కూడా సమాజంలో ఉంటాయి. ఐక్య రాజ్య సమితి ప్రతి సంవత్సరం మార్చి 20న ‘అంతర్జాతీయ ఆనంద దినోత్స’వాన్ని నిర్వహిస్తోంది. ఆ సందర్భంగా ప్రపంచ ఆనంద నివేదికను (వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్–డబ్ల్యూహెచ్ఆర్) పకటిస్తుంది. డబ్ల్యూహెచ్ఆర్ – 2024లో 143 దేశాల ర్యాంకులున్నాయి. గత ఏడు సంవత్సరాలుగా ఫిన్లాండ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. స్కాండినేవియన్ రాజ్యాలు, సంక్షేమ దేశాలుగా పేరొందిన నార్వే, స్వీడన్, డెన్మార్క్ తొలి పది సంతోష దేశాల్లో ఉన్నాయి. అఫ్గానిస్తాన్ అన్నింటికన్నా దిగువన వుందని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ జాబితాలో ఇండియా స్థానం ఎక్కడా? 143లో 126. శ్రీలంక, మయన్మార్, పాకిస్తాన్, నేపాల్ దేశాల ప్రజలు మనకన్నా సంతోషంగా ఉన్నారని ఐక్య రాజ్య సమితి ప్రకటించింది. సంతోష సూచికలకు, ఆత్మహత్యలకు ఒక విలోమానుపాత సంబంధం ఉంటుంది. సంతోష సూచికలు మెరుగ్గా ఉంటే ఆత్మహత్యల రేటు తక్కువగా ఉంటుంది. సంతోష సూచికలు తక్కువగా ఉంటే ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉంటుంది. సంతోష సూచికలు తక్కువగావున్న కారణంగా భారతదేశంలో ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉందని నివేదికలు చెపుతున్నాయి. ఇండియా ఇప్పుడు ఆత్మహత్యల కేంద్రంగా మారిందని అనేకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం 2022లో దేశంలో 1 లక్షా 71 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. జనాభాలో లక్ష మందికి సాలీనా 12.4 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇది ప్రపంచ రికార్డు. ఇవి అధికారిక గణాంకాలు మాత్రమే. మనుషులు వ్యక్తిగత మానసిక కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటారని అనిపించడం సహజం. కానీ, ఇది రూపం మాత్రమే; సారం వేరు. ఆత్మహత్యలకు అసలు కారణం ‘సమాజం సంక్షోభంలో పడడం’ అని తొలిసారిగా చెప్పినవాడు ఫ్రెంచ్ సమాజ శాస్త్రవేత్త ఎమిలే దుర్ఖేమ్ (1858–1917). ఆయన అభిప్రాయం ప్రకారం సమాజ మౌలిక స్వభావం సంఘీభావం. సమాజం తన మౌలిక స్వభావమైన సంఘీభావాన్ని కోల్పోయినపుడు అక్కడ మనుషులు బతకలేరు. గ్రామీణ ప్రాంతాల్లో కన్నా నగరాల్లో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోకన్నా అభివృద్ధి చెందిన దేశాల్లో; నిరక్షరాస్యులకన్నా విద్యావంతుల్లో ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి.ప్రతి చారిత్రక దశలోనూ తిరిగితిరిగి ఒకే ప్రశ్న మన ముందుకు వచ్చి నిలబడుతుంది. అభివృద్ధికి కొలమానం ఏమిటి?– సంపదా? శాంతా? జీడీపీ పెరుగుదల రేటా? సంతోష సూచికలా? పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలోనే ఒక అమానవీయ లక్షణం ఉందన్నాడు కార్ల్ మార్క్స్. కార్మికుడు తాను ఉత్పత్తి చేసిన సరుకుకు పరాయివాడైపోతాడు అన్నాడు. ఈ పరాయీకరణ ఫ్యాక్టరీ నుండి ఫ్యామిలీ లోనికి ప్రవేశించినపుడు మనిషి ఒంటరివాడయిపోతాడు. సంఘీభావానికి నోచుకోలేడు. ఓదార్చేవాడు కనుచూపు మేరలో కనిపించకపోతే మనిషి స్వచ్ఛందంగా లోకాన్ని వదిలేస్తాడు. మనం మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి ముందే ఆత్మహత్యల నిలయంగా మారాము. అదీ విషాదం! డానీ వ్యాసకర్త సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు -
‘విద్యుత్’ కమిషన్ చైర్మన్ను మార్చండి
మీడియా సమావేశంలో కేసు మెరిట్పై కమిషన్ చైర్మన్ వ్యాఖ్యలు చేయకుండా ఉంటే ఫర్వాలేదు. కానీ కేసు మెరిట్స్లోకి వెళ్లారు. విచారణ కమిషన్ నివేదిక ఓ వ్యక్తి ఇమేజ్ను దెబ్బతీసే అవకాశం ఉంది. అందుకే అభిప్రాయాలు తెలపాలంటూ ముందుగా నోటీసులు ఇస్తారు. నోటీసుల జారీ వరకే చైర్మన్ ప్రెస్మీట్ పెట్టి ఉంటే ఓకే. కానీ జరిగినది వేరు..’’ – సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై నియమించిన కమిషన్ చైర్మన్ను మార్చాలని కాంగ్రెస్ సర్కారును సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణకు సంబంధించిన అంశాలపై కమిషన్ చైర్మన్ బహిరంగంగా మీడియాతో ఎలా వ్యాఖ్యలు చేస్తారని అసహనం వ్యక్తం చేసింది. చైర్మన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అభిప్రాయపడింది. దీంతో కమిషన్ చైర్మన్ను మారుస్తామని, వచ్చే సోమవారంలోపు కొత్త చైర్మన్ పేరు వెల్లడిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీం ధర్మాసనానికి విన్నవించారు. మరోవైపు ‘విద్యుత్’పై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ను రద్దు చేయాలంటూ తాము పిటిషన్ దాఖలు చేశామని.. కానీ చైర్మన్ మార్చాలంటూ కోర్టు ఆదేశాలు ఇవ్వడం సరికాదని బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. మరోవైపు ‘విద్యుత్’ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి తాను స్వయంగా బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్టు సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే: కేసీఆర్ తరఫు న్యాయవాది ‘విద్యుత్’ అంశాలపై విచారణ కోసం కాంగ్రెస్ సర్కారు నియమించిన కమిషన్ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం దీనిపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పార్డీ వాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తొలుత కేసీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. కమిషన్పై హైకోర్టులో కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను తొలిరోజే కనీసం వాదనలు కూడా వినకుండా ఎలా కొట్టివేసిందని ప్రశ్నించారు. ఇందులో రాజకీయ కక్ష సాధింపు స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. ఈ సమయంలో చీఫ్ జస్టిస్ స్పందిస్తూ.. ‘అది ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఓ పద్ధతి ప్రకారం జరుగుతున్న విచారణ మాత్రమేనని, దానికి న్యాయపరమైన అధికారం లేదు కదా’ అని పేర్కొన్నారు. దీనికి ముకుల్ రోహత్గి సమాధానమిస్తూ.. ‘రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడింది. దాంతో ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిషన్తో తెలంగాణ రాష్ట్ర కమిషన్కు విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో తక్కువ ధరకే విద్యుత్ కొనుగోళ్లు చేసినట్టు నిరూపిస్తాం. అయినా విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలోని కమిషన్ దోషిగా నిర్ధారించినప్పటికీ అది పరిగణనలోకి రాదు’’ అని పేర్కొన్నారు. దీనిపై చీఫ్ జస్టిస్ స్పందిస్తూ.. కమిషన్ విషయంలో పలు అభ్యంతరాలు ఉన్నాయని సింఘ్వితో పేర్కొన్నారు. ప్రభుత్వం పొరపాటుగా జ్యుడీషియల్ పదం వాడింది ప్రభుత్వం తరఫు న్యాయవాది సింఘ్వి వివరణ ఇస్తూ.. ‘‘కమిషన్ నియామక డాక్యుమెంటులో.. విశ్రాంత న్యాయమూర్తి నియామకం నేపథ్యంలో జ్యుడీషియల్ అనే పదం పొరపాటుగా వాడారు. కానీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం పరిధిలోకి వస్తుంది’’ అని తెలిపారు. దీనిపై కేసీఆర్ తరఫు న్యాయవాది రోహత్గీ స్పందిస్తూ.. ‘‘పవర్ పర్చేజీ అంశాన్ని ఇప్పటికే ట్రిబ్యునళ్లు పరిశీలిస్తున్నాయి. అక్కడ పెండింగ్లో ఉన్న అంశాలపై కమిషన్ ఎలా నియమిస్తారు. ట్రిబ్యునళ్ల కన్నా ఓ విశ్రాంత న్యాయమూర్తికి ఎక్కువ అధికారాలు ఎలా ఉంటాయి?’’ అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఓ అవకాశం ఇస్తున్నాం.. ఈ సమయంలో చీఫ్ జస్టిస్ కల్పించుకుంటూ.. ‘‘కమిషన్ చైర్మన్ మీడియా సమావేశంలో కేసు మెరిట్స్పై అభిప్రాయాలు వెల్లడించినట్టు ఉంది కదా?’’ అని ప్రభుత్వం తరఫు న్యాయవాదులను ప్రశ్నించారు. దీంతో సింఘ్వి స్పందిస్తూ.. ‘‘ప్రభుత్వం మార్చి 14న కమిషన్ను నియమించింది. తమ విచారణ సందర్భంగా ఏం జరిగిందనేది తెలుపుతూ.. పలువురితోపాటు మాజీ సీఎం కేసీఆర్కు కమిషన్ ఏప్రిల్లో నోటీసులు జారీ చేసింది. అయితే మాజీ సీఎం వాటిని సవాల్ చేయకుండా, ఎన్నికల్లో బిజీగా ఉన్నానంటూ జూన్ చివరి వరకూ సమయం అడిగారు’’ అని వివరించారు. అయితే కమిషన్ చైర్మన్ తన అభిప్రాయాలను మీడియాకు వెల్లడించడంపై చీఫ్ జస్టిస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘మాజీ సీఎం ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే.. కమిషన్ చైర్మన్ మీడియా సమావేశం నిర్వహించడం, కేసు మెరిట్స్లోకి వెళ్లడం సబబు కాదు కదా. కేసు మెరిట్స్పై వ్యాఖ్యలు చేయకుంటే మేం జోక్యం చేసుకునే వాళ్లమే కాదు. కానీ అలా చేశారు. ఇది ఓ వ్యక్తి రెప్యుటేషన్పై ప్రభావం చూపుతుంది కదా. మేం ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నాం. కమిషన్లో న్యాయమూర్తిని (చైర్మన్గా) భర్తీ చేయడానికి అవకాశం ఇస్తున్నాం. న్యాయం జరిగేలా చూడాలి. ఇది విచారణ కమిషన్’’ అని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. భోజన విరామం అనంతరం తర్వాత కొత్త చైర్మన్ పేరు తెలపాలని సూచించారు. బాధ్యతల నుంచి తప్పుకొంటూ జస్టిస్ నరసింహారెడ్డి లేఖ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన సూచనల విషయం తెలిసిన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి.. ‘విద్యుత్’ కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్టుగా కోర్టుకు లేఖ రాశారు. భోజన విరామం అనంతరం సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్నారాయణ్ ఈ విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కమిషన్ నూతన న్యాయమూర్తిగా ఎవరిని నియమిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించగా.. సోమవారం నాటికి కోర్టుకు చెబుతామని ప్రభుత్వం తరఫు న్యాయవాది సింఘ్వి తెలిపారు. దీనితో పిటిషన్పై విచారణ ముగిస్తున్నట్టు సీజేఐ ప్రకటించారు. జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి లేఖ సారాంశమిదీ.. ‘‘మీడియా సమావేశంలో నా అభిప్రాయాలు వెల్లడించడంపై కోర్టులో పరిశీలనలు జరుగుతున్నాయని సమాచారం ఉంది. బీఆర్కేఆర్ భవన్లోని ఏడో అంతస్తులో నా కార్యాలయం పనిచేస్తోంది. అదే భవనంలోని ఎనిమిదో అంతస్తులో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కార్యాలయం పనిచేస్తోంది. రోజు విడిచి రోజు ఆ కమిషన్ మీడియా బ్రీఫింగ్ జరుగుతోంది. ఆ సమయంలో విలేకరులు నా కార్యాలయంలో ఏం జరుగుతుందోనని ఆరా తీసేవారు. కమిషన్కు సంబంధించి ఊహాజనిత వార్తలు ఇచ్చేవారు. అందువల్ల అప్పటివరకు జరిగిన పురోగతి మీడియాకు తెలపాలనే ఉద్దేశంతో సమావేశం నిర్వహించాను. ఒక న్యాయమూర్తి లేదా విశ్రాంత న్యాయమూర్తి పక్షపాతంగా వ్యవహరించబోరని స్పష్టంగా చెప్పొచ్చు. ఆరోపణల నేపథ్యంలో న్యాయవ్యవస్థ ప్రతిష్టను నిలబెట్టడానికి కమిషన్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా..’’ అని జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. -
రిటైరయ్యేలోపు తీర్పివ్వండి
న్యూఢిల్లీ: ఆధార్ వంటి సాధారణ చట్టాలను ద్రవ్య బిల్లులుగా ఎన్డీఏ సర్కార్ లోక్సభలో ప్రవేశపెడుతున్న విధానాన్ని తప్పుబడుతూ ఈ విధానం చట్టబద్ధతను తేల్చేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేయాలంటూ దాఖలైన పిటిషన్ను విచారణకు అనుమతించింది. సుప్రీంకోర్టు చీఫ్జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పారి్ధవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం సంబంధిత పిటిషన్ను సోమవారం విచారించింది. కాంగ్రెస్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ‘‘ ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేశాక ఈ అంశాన్ని పరిశీలిస్తాం’ అని సీజేఐ చంద్రచూడ్ చెప్పారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘ రాజ్యాంగంలోని ఆరి్టకల్ 110 కింద ఎన్నో సాధారణ బిల్లులను ద్రవ్యబిల్లులుగా పేర్కొంటూ మోదీ సర్కార్ లోక్సభలో ఆమోదింపజేసుకుంటోంది. ఈ రాజ్యాంగ అతిక్రమణకు 2016నాటి ఆధార్ చట్టం చక్కని ఉదాహరణ. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే కోర్టు కూడా ‘ఇది రాజ్యాంగపరంగా మోసమే’ అంటూ సమరి్థంచింది. 2014 నుంచి ఆర్టికల్110 దుర్వినియోగంపై విచారణకు రాజ్యాంగ బెంచ్ ఏర్పాటుచేస్తానని సీజేఐ తీర్పుచెప్పడం హర్షణీయం. ఈ ఏడాది నవంబర్లో సీజేఐ చంద్రచూడ్ రిటైర్ అయ్యేలోపు తీర్పు ఇస్తారని ఆశిస్తున్నాం’ అని పోస్ట్ చేశారు. ఆధార్ చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం(సవరణ) వంటి కీలక బిల్లులను ద్రవ్యబిల్లుగా మోదీ సర్కార్ లోక్సభలో ప్రవేశపెట్టింది. పెద్దలసభలో మెజారిటీ లేని కారణంగా అక్కడ బిల్లులు వీగిపోకుండా, తప్పించుకునేందుకు ప్రభుత్వం ఇలా చేస్తోందని చాన్నాళ్లుగా విపక్షాలు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టడం తెల్సిందే. -
రుతుస్రావ సెలవులపై మోడల్ పాలసీ
న్యూఢిల్లీ: నెలసరివేళ ఇబ్బందిపడే ఉద్యోగిను లకు రుతుస్రావ సెలవులపై మోడల్ పాలసీని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో సంబంధిత వర్గాలు, రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన విధానానికి రూపకల్పన చేయాలని సోమవారం కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. అయితే విధాన నిర్ణేతల పరిధిలోని ఈ అంశాల్లో కోర్టులు జోక్యంచేసుకోబోవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా విద్యార్థినులు, ఉద్యోగినులకు ప్రతినెలా నెలసరి సెలవులు ఇవ్వాలంటూ లాయర్ శైలేంద్రమణి త్రిపాఠి వేసిన పిటిషన్ను కొట్టేస్తూ కోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘రుతుస్రావ సెలవుపై కోర్టు నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగినుల ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. అసౌకర్యంవేళ సెలవు దొరుకుతుందని భావిస్తే ఎక్కువ మంది ఉద్యోగాలు చేసేందుకు మొగ్గుచూపుతారు. అయితే ఉద్యోగినులకు ఇలాంటి సెలవు ఇవ్వడం ఇష్టంలేని సంస్థలు, యాజమాన్యాలు మహిళలకు ఉద్యోగం ఇచ్చేందుకు విముఖత చూపే ప్రమాదం కూడా ఉంది. ఉన్న ఉద్యోగినులను కూడా తగ్గించుకునే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి విపరిణామాలకు మేం అవకాశం ఇవ్వదల్చుకోలేదు. వాస్తవానికి ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. ఇందులో కోర్టు జోక్యం ఉండకూడదు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. చైనా, బ్రిటన్, జపాన్, ఇండోనేసియా, స్పెయిన్, జాంబియా, దక్షిణకొరియాలో ఏదో ఒక కేటగిరీ కింద ఇలాంటి సెలవులు ఇస్తున్నాయంటూ లాయర్ చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ‘‘ఈ సెలవులు ఇవ్వాలని గత ఏడాది మే నెలలోనే పిటిషనర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రం నుంచి ఇంతవరకు స్పందన లేదు. విధానపర నిర్ణయమైన ఇలాంటి అంశంలో కోర్టులు జోక్యం చేసుకోలేవు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. -
NEET-UG 2024: నీట్పై నేడు సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: వివాదాస్పదంగా మారిన నీట్–యూజీ 2024 నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో సోమవారం నుంచి విచారణ మొదలుకానుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం నీట్కు సంబంధించి దాఖలైన 38 పిటిషన్లపై వాదనలు విననుంది. అయితే, పరీక్షను రద్దు చేయడం సహేతుకం కాదని, పేపర్ లీకేజీ భారీపెద్ద ఎత్తున జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని ఇప్పటికే సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. మే 5వ తేదీన జరిగిన ఈ పరీక్షలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ విద్యార్థులు, రాజకీయ పార్టీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. పేపర్ లీకేజీ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. -
మార్కెట్ల పరుగు... తస్మాత్ జాగ్రత్త!
ముంబై: ఈక్విటీ మార్కెట్ల గణనీయమైన పెరుగుదల నేపథ్యంలో భారత్ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ రెగ్యులేటర్– సెబీ, సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్కు (శాట్) కీలక సూచనలు చేశారు. ఈ విషయంలో ముందస్తు జాగ్రత్త అవసరమన్నారు. ఎటువంటి సవాలునైనా సత్వరం పరిష్కరించడానికి, వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి మరిన్ని ట్రిబ్యునల్ బెంచ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. శాట్ కొత్త ప్రాంగణాన్ని ఇక్కడ ప్రారంభించిన ప్రధాన న్యాయమూర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కెట్లలో అధిక మొత్తంలో లావాదేవీలు, అలాగే కొత్త నిబంధనల కారణంగా శాట్పై అధిక పనిభారం పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో శాట్ కొత్త బెంచ్లను ఏర్పాటు చేసే అంశాన్ని అధికారులు పరిశీలించాలన్నారు. → బీఎస్ఈ సెన్సెక్స్ 80,000 పాయింట్ల మైలురాయిని దాటడం ఒక ఆనందకరమైన క్షణం అంటూ వచి్చన వార్తాపత్రికల కథనాలను ప్రస్తావిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ నష్టపోని వ్యవస్థల ఏర్పాటు, పటిష్టతలపై రెగ్యులేటరీ అధికారుల దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఇలాంటి సంఘటనలు ఉద్ఘాటిస్తున్నాయని తెలిపారు. → ‘మీరు స్టాక్ మార్కెట్లో ఉప్పెనను ఎంత విజయవంతంగా చూస్తారో... అంతే స్థాయిలో జాగ్రత్తలు పాటించే విషయంలో సెబీ, శాట్లకు ఎక్కువ పాత్ర ఉంటుందని నేను విశ్వసిస్తునాను. మార్కెట్ భారీ పెరుగుదల సమయాల్లోనే వ్యవస్థ స్థిరంగా ఉండేలా చూసుకోవాలి’ చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. → స్థిరమైన–ఊహాజనిత పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరచడంలో, పరిరక్షించడంలో సెబీ, శాట్ వంటి అప్పీలేట్ ఫోరమ్ల ప్రాముఖ్యత ఎంతో ఉంటుందన్నారు. దీనిని కీలక జాతీయ ప్రాముఖ్యతగల అంశంగా పేర్కొన్న ఆయన, ఇది దేశ ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైన అంశంగా వివరించారు. 6,700 అప్పీళ్ల పరిష్కారం శాట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ జస్టిస్ పీఎస్ దినేష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ శాట్లో ప్రస్తుతం 1,028 పెండింగ్ అప్పీళ్లు ఉన్నాయని, 1997లో మొదలైనప్పటి నుండి 6,700 అప్పీళ్లను పరిష్కరించామని తెలిపారు. శాట్ కొత్త వెబ్సైట్ ప్రారంభం.. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించిన శాట్ కొత్త వెబ్సైట్ను భారత్ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ కార్యక్రమంలో ప్రారంభించారు. సాంకేతికత సమస్యపై తగిన శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. డిజిటల్ రంగం పురోగతి నేపథ్యంలో న్యాయం పొందడానికి సంబంధించిన భావనకు కొత్త రూపును ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. -
‘పెండింగ్’కు మంచి దోవ!
న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల గురించి ఎవరికీ తెలియనిది కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసినవారు గతంలో చాలాసార్లు మాట్లాడారు. రిటైరయ్యే రోజున కూడా ఆ మాట చెప్పి నిష్క్రమించేవారు. తమ పదవీకాలంలో పెండింగ్ బెడదను సాధ్యమైనంత తగ్గించేందుకు పలు విధానాలు అమలు పరిచేవారు. న్యాయమూర్తుల సంఖ్య పెంచాలంటూ ప్రధానికి బహిరంగ వినతులు చేసినవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మరో అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. ఈ శనివారం నుంచి వరసగా ఆరురోజులపాటు ప్రత్యేక లోక్ అదాలత్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతంలో సుప్రీంకోర్టులో లోక్ అదాలత్లు జరగకపోలేదు. కానీ ఎప్పుడో ఒకసారి జరిగే ఈ అదాలత్లకు పెద్దగా స్పందన ఉండేది కాదు. అందువల్లే ఈసారి వరసగా ఆరురోజులపాటు సాగించాలని ఆయన భావించారు. ఈ కార్యక్రమంలో పదివేల కేసుల్ని పరిష్కరించాలన్నది ఆయన లక్ష్యం. పైగా ఈ కేసుల పరిష్కారానికి లిటిగెంట్లకు పైసా ఖర్చుండదు. వీటిల్లో కార్మిక చట్టాలు, అద్దె, సేవలు, పరిహారం, కుటుంబ తగాదాలు, సాధారణ సివిల్ తగాదాలు, వినియోగదారుల కేసులు ఉంటాయి. జస్టిస్ చంద్రచూడ్ చెబుతున్న ప్రకారం సుప్రీంకోర్టులో ప్రస్తుతం 66,059 సివిల్ కేసులూ, 18,049 క్రిమినల్ కేసులూ ఉన్నాయి. రెండూ లెక్కేస్తే 84 వేల పైమాటే. ఇవిగాక వివిధ హైకోర్టుల్లో 44,03,152 సివిల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని జాతీయ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ చెబుతోంది. క్రిమినల్ కేసుల సంఖ్య 17,55,946. మొత్తంగా చూస్తే దాదాపు 62 లక్షలు! హైకోర్టుల్లో ఏడాదిగా పెండింగ్లో ఉన్నవి పది లక్షల సివిల్ కేసులు. ఇవిగాక సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో రోజూ దాఖలయ్యే కేసులు, అప్పీళ్లు, కింది కోర్టుల్లో పెండింగ్ పడిన కోట్లాది కేసులు అదనం.న్యాయవ్యవస్థ పుట్టిన నాటినుంచీ అవతలి పక్షాన్ని కోర్టుకీడ్చి ఇరుకున పెట్టాలన్న యావ కక్షిదారులకు సహజంగా ఏర్పడివుంటుంది. రాచరికాల్లో ఇంత చేటు సాహసం ఉండేది కాదు. తప్పనిసరైతే తప్ప, తనవైపే న్యాయం ఉందన్న ధీమా ఉంటే తప్ప ఫిర్యాదు చేయడానికి జంకేవారు. తేడా వస్తే తల తీస్తారన్న భయమే అందుకు కారణం కావొచ్చు. చిత్రమేమంటే వర్తమాన కాలంలో ప్రభుత్వాలే పెద్ద లిటిగెంట్లుగా మారాయి. అసమ్మతి ప్రకటించేవారిపై ఎడాపెడా కుట్ర కేసులు బనాయించటం, ఇతరత్రా కేసుల్లో ఇరికించటం ఇప్పటికీ సాగుతూనే వుంది. ప్రభుత్వాలు అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవటం ఒకపక్క, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాలను కోర్టుకీడ్చటం మరోపక్క సమాంతరంగా సాగుతుంటాయి. వలస పాలకుల నాటి చట్టాలనే ఇప్పటికీ నెత్తిన పెట్టుకోవటం, అవకతవకలు జరగలేదని తెలిసికూడా అధికార మదంతో వ్యతిరేకులను అక్రమ కేసుల్లో ఇరికించటం మితిమీరుతోంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాల పుణ్యమా అని యూపీ నుంచి ఏపీ దాకా బుల్డోజర్లు నడిపించే సంస్కృతి పెరిగింది. ప్రత్యర్థి పక్షాలకు చెందినవారి ఇళ్లపై, కార్యాలయాలపై దాడులు సరేసరి. సహజంగానే ఇలాంటి కేసులన్నీ న్యాయస్థానాలకు ఎక్కక తప్పదు. దానికితోడు పొలాలు, స్థలాలు, ఇళ్లు వగైరా స్థిరాస్తుల వారసత్వ హక్కుల కోసం దాయాదులు, తామే న్యాయమైన హక్కుదారులమంటూ వచ్చే కక్షిదారులు లెక్కలేనంతమంది. ఎన్డీఏ సర్కారు ఈమధ్య కాలం చెల్లిన చట్టాల్లో కొన్నిటిని రద్దుచేయటంతోపాటు ఐపీసీ, సీపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టం స్థానాల్లో కొత్త చట్టాలు తీసుకొచ్చింది. అవి ఏమేరకు మార్పు తీసుకురాగలవో ఆచరణ తర్వాతగానీ తెలియదు. నీతి ఆయోగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా నిరుడు ఏపీలో జగన్ సర్కారు తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం కూడా వినూత్నమైనది. 130 ఏళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా తీసుకొచ్చిన ఈ చట్టం ఉద్దేశం నిజమైన హక్కుదారులను గుర్తించి వారి హక్కులు కాపాడటం, అనవసర వ్యాజ్యాలు నిరోధించటం. అధికార యావతో ప్రత్యర్థులు ఎన్నికల్లో వక్ర భాష్యాలు చెప్పి ప్రజలను పక్కదోవ పట్టించారు. చివరకు ఎన్డీఏ సర్కారు దాన్ని రద్దుచేస్తోంది. లోక్ అదాలత్ల పనితీరు భిన్నమైనది. ఇందులో సామరస్య పరిష్కారానికి ఇరుపక్షాలనూ ప్రోత్సహిస్తారు. ప్రధాన న్యాయమూర్తి నియమించిన న్యాయనిపుణులు ఆ కేసులో ఉన్న సమస్యను న్యాయమూర్తులకూ, లిటిగెంట్లకూ వివరిస్తారు. పిటిషనర్లు నేరుగా న్యాయమూర్తులతో మాట్లాడే అవకాశం కూడా ఇస్తున్నారు. జస్టిస్ చంద్రచూడ్ తీసుకొచ్చిన మరో మార్పేమిటంటే... పిటిషనర్లు దీనికోసం ఢిల్లీ వరకూ వెళ్లనవసరం లేదు. వారికి హైకోర్టుల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. ఇది పెండింగ్ కేసులకు న్యాయవ్యవస్థ నుంచి వచ్చిన ఒక సృజనాత్మక పరిష్కారం. ఇప్పుడు తమ వంతుగా ఏం చేయవచ్చునో ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎప్పటికప్పుడు న్యాయమూర్తుల ఖాళీలు భర్తీచేయటం తక్షణావసరం. వేరే దేశాలతో పోలిస్తే జనాభాకూ, న్యాయమూర్తుల సంఖ్యకూ మధ్య నిష్పత్తి మన దేశంలో చాలా అధికం. అలాగే చట్టాలు చేసేముందు వాటి పర్యవసానంగా ఎన్ని వ్యాజ్యాలు కోర్టు మెట్లెక్కే అవకాశమున్నదో ప్రభుత్వాలు అంచనా వేసుకోవాలి. చెక్ బౌన్స్ కేసులు ఇందుకు ఉదాహరణ. గతంలో సివిల్ తగదాగా ఉన్నదాన్ని శిక్షార్హమైన నేరంగా మార్చారు. దీనివల్ల అసంఖ్యాకంగా కేసులు పెరిగాయి. పెండింగ్ కేసులు తగ్గించటం కోసం సెలవు రోజుల్లోనూ పనిచేయక తప్పడం లేదని ఆ మధ్య ఒక న్యాయమూర్తి వాపోయారు. సుప్రీంకోర్టు తీసుకున్న తాజా చొరవకు ప్రభుత్వాల వివేకం కూడా తోడైతే ఈ సంక్లిష్ట సమస్యకు సులభంగా పరిష్కారం దొరుకుతుంది. -
ఈ వార్తను నేనెలా మిస్ అయ్యాను!.. ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ.. ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియో షేర్ చేస్తూ ఇలాంటి ఉత్తేజకరమైన వార్తను నేను ఎలా మిస్ అయ్యాను అంటూ ట్వీట్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో మార్చిలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించినది. సుప్రీంకోర్టులో వంటమనిషిగా పనిచేస్తున్న అజయ్ కుమార్ కుమార్తె ప్రజ్ఙను.. భారత ప్రధాన న్యాయమూర్తి, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో ఎంతగానో మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రజ్ఞ తల్లితండ్రులను జస్టిస్ చంద్రచూడ్ సన్మానించారు.ఆనంద్ మహీంద్రా ఈ వీడియో షేర్ చేస్తూ.. భారతదేశం ఎందుకు పుంజుకుంటుంది అని ఎవరైనా నన్ను అడిగితే, నేను ఈ వీడియోను షేర్ చేస్తాను. ఇది నిబద్దత, కృషి, తల్లిదండ్రుల మద్దతుకు నిదర్శనం. యునైటెడ్ స్టేట్స్లోని రెండు వేర్వేరు విశ్వవిద్యాలయాలలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ అధ్యయనం చేయడానికి స్కాలర్షిప్ సాధించినందుకు, ఒక కుక్ కుమార్తె అభినందించారు అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.I don’t know how I missed seeing this uplifting news in March this year. If anyone asks me why I think India will rise, I will share this video. It’s about aspirations, commitment, hard work & parental support. And most important, about us all recognizing & cheering each… pic.twitter.com/4bVPEtm8tB— anand mahindra (@anandmahindra) June 20, 2024 -
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
ఖాట్మాండ్: పిల్లలను క్రమశిక్షణతో పెంచే క్రమంలో దండించడాన్ని ఈరోజుల్లో చాలా కఠిన పద్దతిగా భావిస్తున్నారు. అయితే కొన్ని దశాబ్దాల కింద పాఠశాలల్లో అందరూ ఉపాధ్యాయుల చేతిలో బెత్తం దెబ్బలు తిన్నావారే. అటువంటి చిన్ననాటి సంఘటనను భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్వయంగా పంచుకున్నారు. చిన్నతనంలో తాను ఓ చిన్న తప్పుకు బెత్తం దెబ్బలు తిన్నానని తెలిపారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేపాల్ పర్యటనలో భాగంగా ఖాట్మాండ్లో నిర్వహించిన ‘జువెనైల్ జస్టిస్’ అనే అంశానికి సంబంధించిన ఓ సెమినార్లో పాల్గోని మాట్లాడారు. ‘చిన్నారులతో మనం ప్రవర్తించే తీరు వారి మనసులో జీవితాంతం గుర్తుండిపోతుంది. నేను కూడా నా చిన్న తనంలో స్కూల్లో జరిగిన ఘటనను ఇప్పటికీ మర్చిపోలేదు. నా చేతులు బెత్తం దెబ్బలు తిన్న సమయంలో నేను ఏ నేరం చేయలేదు. క్రాఫ్ట్ నేర్చుకోవటంలో భాగంగా అసైన్మెంట్కు సరైన సూదిని తీసుకురాలేదు. దీంతో టీచర్తో బెత్తం దెబ్బలు తిన్నా. నా చెతులపై కొట్టవద్దని టీచర్ను బతిమాలాడాను. అయినా టీచర్ వినలేదు.బెత్తం దెబ్బ కారణంగా కుడి చేతికి అయిన చిన్న గాయం విషయాన్ని నా తల్లిదండ్రులకు పదిరోజుల పాటు చెప్పకుండా దాచిపెట్టాను. ఐదో తరగతిలో జరిగిన ఈ ఘటన సంబంధించి బెత్తం దెబ్బ భౌతికంగా అప్పుడే మానిపోయినప్పటికి దాని ప్రభావం నాపై చాలా పడింది. నేను ఏ పని చేసినా ఆ ఘటన గుర్తుకు వచ్చేది. చిన్నపిల్లల్లో ఇటువంటి ఘటనలు ప్రభవం వారి మనసుపై తీవ్రంగా ప్రభావం చూపుతాయి’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. -
న్యాయవ్యవస్థను తక్కువ చేసేందుకు ప్రయత్నాలు
న్యూఢిల్లీ: పథకం ప్రకారం ఒత్తిళ్లు తేవడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, బహిరంగ విమర్శల ద్వారా న్యాయ వ్యవస్థను చులకన చేసేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని రిటైర్డు జడ్జీల బృందం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్కు రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగత లబ్ధి, రాజకీయ స్వార్థం కోసం జరిగే ఇటువంటి ప్రయత్నాల కారణంగా న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం తగ్గిపోయే ప్రమాదముందని వారు పేర్కొన్నారు. అయితే, ఏ పరిణామాలు తమను ఈ లేఖ రాసేందుకు ప్రేరేపించాయనే విషయాన్ని అందులో వారు ప్రస్తావించలేదు. అవినీతి కేసుల్లో కొందరు ప్రతిపక్ష నేతల అరెస్టుపై అధికార బీజేపీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్న సమయంలో ఈ లేఖ రాయడం గమనార్హం. ఆరోపణలెదుర్కొంటున్న నేతలు, వారి పార్టీలు కోర్టులను ఆశ్రయించడం, న్యాయవ్యవస్థ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను చూపుతూ బీజేపీ వారిపై ప్రత్యారోపణలు చేస్తుండటాన్ని లేఖలో వారు ప్రస్తావించారు. ‘ఇటువంటి చర్యలతో న్యాయవ్యవస్థ పవిత్రత దెబ్బతింటోంది. జడ్జీల నిష్పాక్షికత, సచ్ఛీలత అనే సూత్రాలకు ఇవి సవాల్గా మారాయి. ఇటువంటి అవాంఛిత ఒత్తిడుల నుంచి న్యాయవ్యవస్థను కాపాడు కోవాల్సిన అవసరం ఉంది’అని లేఖలో పేర్కొన్నారు. నిరాధార సిద్ధాంతాలను ప్రచారం చేయడం వంటి చర్యల ద్వారా న్యాయపరమైన ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొన్ని సమూహాలు అనుసరిస్తున్న వ్యూహం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. సుప్రీంకోర్టు నేతృత్వంలోని న్యాయవ్యవస్థను ఇటువంటి ఒత్తిళ్లకు వ్యతిరేకంగా బలోపేతం చేయాలని, న్యాయ వ్యవస్థ పవిత్రతను, స్వయంప్రతిపత్తిని పరిరక్షించాలని వారు కోరారు. న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా, అస్థిర రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. లేఖ రాసిన వారిలో సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జీలు జస్టిస్ దీపక్ వర్మ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ ఎంఆర్ షా సహా వివిధ హైకోర్టులకు చెందిన 21 మంది న్యాయమూర్తులు ఉన్నారు. -
సీజేఐ చంద్రచూడ్కు రిటైర్డ్ జడ్జిల లేఖ..
ఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు మొత్తం 21 మంది కలిసి భారత ప్రధాన న్యాయమూర్తి 'డీవై చంద్రచూడ్'కు లేఖ రాశారు. కొన్ని వర్గాలు న్యాయవ్యవస్థ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, బహిరంగంగా కించపరచడం ద్వారా న్యాయవ్యవస్థను అస్థిరపరిచేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఈ లేఖలో ఎత్తిచూపారు. మన న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని వమ్ముచేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారని 21 మంది రిటైర్డ్ జడ్జీలు రాసిన లేఖలో పేర్కొన్నారు. జరుగుతున్న పరిణామాలు కేవలం అనైతికంగా మాత్రమే కాదు, మన ప్రజాస్వామ్యం పునాది సూత్రాలకు అత్యంత హానికరమని కూడా వారు పేర్కొన్నారు. 21 Retired Judges write to Chief Justice of India (CJI) Dy Chandrachud "We write to express our shared concern regarding the escalating attempts by certain factions to undermine the judiciary through calculated pressure, misinformation, and public disparagement. It has come to… pic.twitter.com/bPZ0deczI2 — ANI (@ANI) April 15, 2024 -
సుప్రీంకోర్టులో సింగిల్ మాల్ట్ ఎపిసోడ్
న్యూఢిల్లీ: సంక్లిష్టమైన కేసులపై సీరియస్గా విచారణ జరిగే సుప్రీంకోర్టులో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. విస్కీ, దాని రకాలు తదితరాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, సీనియర్ న్యాయవాది దినేశ్ ద్వివేది మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ నవ్వులు పూయించింది. సీజేఐ హాస్య చతురత అందరినీ అలరించింది. పారిశ్రామిక ఆల్కహాల్ ఉత్పత్తి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు సంబంధించిన వివాదంపై సీజేఐ నేతృత్వంలోని 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ముందు జరిగిన విచారణ ఇందుకు వేదికైంది. ఈ కేసులో యూపీ తరఫున వాదిస్తున్న ద్వివేది తెల్ల జుట్టు రంగులమయంగా కని్పంచడంపై జస్టిస్ చంద్రచూడ్ సరదాగా ఆరా తీశారు. హోలీ సంబరాలు కాస్త శ్రుతి మించడమే కారణమంటూ ద్వివేది కూడా అంతే సరదాగా బదులిచ్చారు. ‘‘ఈ విషయంలో దయచేసి నన్ను క్షమించాలి. నా మనవల నిర్వాకం కూడా ఇందుకు కొంతవరకు కారణమే. సంతానం, మనవలు మరీ ఎక్కువగా ఉంటే, అందులోనూ వారంతా మనతో పాటే ఉంటుంటే ఇలాంటి గమ్మత్తైన సమస్యలుంటాయి. తప్పించుకోలేం’’ అన్నారు. సీజేఐ అంతటితో వదల్లేదు. ‘అంతేగానీ, ఆల్కహాల్కు ఏ సంబంధమూ లేదంటారు!’ అంటూ చెణుకులు విసిరారు. విస్కీప్రియుడైన ద్వివేది అందుకు చిరునవ్వులు చిందించారు. ‘‘విస్కీ పాత్ర కూడా ఉందని నేను ఒప్పుకుని తీరాలి. హోలీ అంటేనే ఆల్కహాల్ పారీ్టలు. పైగా నేను విస్కీకి వీరాభిమానిని’’ అనడంతో అంతా గొల్లుమన్నారు. సింగిల్ మాల్ట్ విస్కీ విషయంలో ఇంగ్లండ్లో తనకెదురైన గమ్మత్తైన అనుభవాన్ని విచారణ సందర్భంగా ద్వివేది ఏకరువు పెట్టారు. ‘‘నేను సింగిల్ మాల్ట్ విస్కీనే ఇష్టపడతా. ఆ విస్కీకి స్వర్గధామంగా చెప్పదగ్గ ఎడింబర్గ్ వెళ్లానోసారి. సింగిల్ మాల్ట్ తెప్పించుకుని ఐస్క్యూబ్స్ వేసుకోబోతుంటే వెయిటర్ అడ్డుకున్నాడు. ‘ఇదేం పని! అది సింగిల్ మాల్ట్ విస్కీ. దాన్నలాగే నేరుగా ఆస్వాదించాలి. అంతేతప్ప ఇలా ఐస్క్యూబులూ సోడాలూ కలపొద్దు! పైగా దానికంటూ ప్రత్యేకమైన గ్లాస్ ఉంటుంది. అందులో మాత్రమే తాగాలి’ అంటూ సుదీర్ఘంగా క్లాస్ తీసుకున్నాడు. సింగిల్ మాల్ట్ తాగేందుకు ఇంత తతంగం ఉంటుందని అప్పుడే నాకు తెలిసొచి్చంది’’ అంటూ వాపోయారు. దాంతో న్యాయమూర్తులతో పాటు కోర్టు హాల్లో ఉన్నవాళ్లంతా పడీపడీ నవ్వారు. ధర్మాసనంలోని మిగతా న్యాయమూర్తులు కూడా తమ చెణుకులతో ఈ సరదా సన్నివేశాన్ని మరింత రక్తి కట్టించారు. పారిశ్రామిక ఆల్కహాల్తో పాటు విస్కీ, వోడ్కా వంటివి కూడా రాష్ట్రాల నియంత్రణ పరిధిలోకే వస్తాయంటూ ద్వివేది వాదించడంతో ఒక న్యాయమూర్తి కలి్పంచుకున్నారు. ‘‘ఇంతకీ మీరనేదేమిటి? ఆల్కహాల్ మందుబాబులకు కిక్కిచి్చనా, ఇవ్వకపోయినా రాష్ట్రాల ఖజానాకు మాత్రం కిక్కివ్వాల్సిందేనంటారా?’’ అనడంతో నవ్వులు విరిశాయి. ఇంకో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, ‘‘కొన్ని రకాల మద్యం రుచి కాలం గడిచేకొద్దీ పెరుగుతుందని, కొన్ని తేలిక రంగులోనూ మరికొన్ని ముదురు రంగులోనూ ఉంటాయని... ఇలా ఆల్కహాల్కు సంబంధించిన చాలా అంశాలను మీరు ఎంతో చక్కగా వివరించారు. సాక్ష్యంగా ఆయా రకాల మద్యం బాటిళ్లను ప్రవేశపెడితే ఎలా ఉంటుందంటారు!’’ అనడంతో కోర్టు హాలంతా మరోసారి నవ్వులతో దద్దరిల్లిపోయింది.