breaking news
Supreme court of India
-
తెలంగాణ డీజీపీ నియామకంలో జాప్యం వద్దు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ డీజీపీ నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సుప్రీంకోర్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)ని ఆదేశించింది. హైకోర్టు విధించిన గడువుకు అదనంగా మరో నాలుగు వారాల సమయాన్ని ఇచ్చింది. తక్షణమే ఎంప్యానెల్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల ఆధారంగా అర్హులైన అధికారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. తెలంగాణ డీజీపీ ఎంపిక విషయమై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ యూపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్పై గురువారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్య బాగ్చీల ధర్మాసనం విచారించింది. యూపీఎస్సీ తరపు సీనియర్ న్యాయవాది నరేష్ కౌశిక్ వాదనలు వినిపిస్తూ.. ‘తెలంగాణలో 2017లో మాజీ డీజీపీ అనురాగ్ శర్మ రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ డీజీపీ కోసం ప్రతిపాదనలు పంపలేదు. సుదీర్ఘ కాలం తర్వాత 2025 ఏప్రిల్లో జాబితా పంపింది. ఇంత జాప్యం జరిగినందున, దీనిపై స్పష్టత కావాలి’అని చెప్పారు. మరి రాష్ట్రం పరిస్థితి ఏంటి? యూపీఎస్సీ వాదన విన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూటిగా స్పందించారు. ’తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ మీరు పిటిషన్ వేశారు సరే.. ఒకవేళ మీ వాదనను అంగీకరించి హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇస్తే, తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఏంటి? అక్కడ యాక్టివ్ డీజీపీ లేకుండా పోతారు కదా? పిటిషన్ వేసే ముందు ఈ పరిణామం గురించి యూపీఎస్సీ ఎందుకు ఆలోచించలేదు?’అని నిలదీశారు. రాష్ట్రం మూడు నెలల గడువు పాటించనప్పుడే.. యూపీఎస్సీ ఎందుకు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. అప్పుడు మౌనంగా ఉండి, ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు ఇచ్చాక సాకులు చెప్పడం సరికాదని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో నియామక ప్రక్రియను నిలిపివేస్తే అది పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వ జాప్యానికి సహకరించినట్లవుతుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రెగ్యులర్ డీజీపీలను నియమించకుండా, యాక్టింగ్ (ఇన్చార్జి) డీజీపీలతో పాలన సాగిస్తున్న విధానంపై సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వాల వలలో మీరు (యూపీఎస్సీ) పడకండి. అసలు రాష్ట్రాలకు పూర్తిస్థాయి డీజీపీలు ఉండటం ఇష్టం లేదు. తమకు నచ్చినట్లుగా వ్యవహరించే, తమకు అనుకూలంగా ఉండే యాక్టింగ్ లేదా తాత్కాలిక డీజీపీలే వారికి కావాలి. అందుకే ఈ జాప్యమంతా’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. యూపీఎస్సీకి కోర్టు ధిక్కరణ అస్త్రం ప్రకాశ్ సింగ్ కేసులో ఇచ్చిన మార్గదర్శకాలను రాష్ట్రాలు ఉల్లంఘిస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమకు నచ్చిన అధికారులను కొనసాగించేందుకు నియామకాల్లో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నాయని, దీనివల్ల అర్హత, మెరిట్ ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. డీజీపీ పదవీ విరమణకు ముందే రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపాలని, ఒకవేళ రాష్ట్రాలు సకాలంలో స్పందించకపోయినా, జాప్యం చేసినా.. ఇకపై యూపీఎస్సీ నేరుగా సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయొచ్చని స్పష్టం చేసింది. రాజకీయ ప్రాధాన్యతలతో కాకుండా.. అధికారుల సరీ్వస్ రికార్డు, సీనియారిటీ, మెరిట్ ఆధారంగానే డీజీపీ ఎంపిక జరగాలని తేల్చిచెప్పింది. -
అనురాగ్ ఠాకూర్కు ఊరట
న్యూఢిల్లీ: బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) మాజీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. భారత క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవచ్చంటూ 2017లో ఇన ఆదేశాలను సవరించింది. అప్పటి ఆదేశాలను సవరించాలంటూ ఠాకూర్ వేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కేసు నేపథ్యమిదీ.. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ఒక రాజ్యాంగాన్ని రూపొందించడం సహా బోర్డు పనితీరులో పారదర్శకత తెచ్చేందుకు అవసరమైన సంస్కరణలను చేపట్టాలంటూ అప్పట్లో బీసీసీఐ చైర్మన్గా ఉన్న అనురాగ్ ఠాకూర్కు సుప్రీంకోర్టు సూచించింది. ఇందుకోసం నియమించిన లోథా కమిటీ కొన్ని సూచనలతో బోర్డుకు నివేదిక అందించింది. వీటిని బోర్డు అమలు చేయలేదు. పైపెచ్చు, తమది స్వతంత్ర సంస్థగా ప్రకటించాలంటూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చైర్పర్సన్ శశాంక్ మనోహర్కు బీసీసీఐ చైర్మన్గా ఉన్న ఠాకూర్ ఓ లేఖ రాయడం తీవ్ర వివాదాస్పదమైంది. అనంతరం దీనిపై, సుప్రీంకోర్టుకు బీసీసీఐ చైర్మన్ ఠాకూర్ తప్పుడు అఫిడవిట్ సమరి్పంచారు. ఈ అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం సీరియస్గా తీసుకుంది. తమ ఆదేశాల నుంచి తప్పించుకునేందుకు ప్రయతి్నంచారంటూ, ధిక్కార చర్యలకు ఉపక్రమించింది. అయితే, ఠాకూర్ స్వయంగా న్యాయస్థానానికి హాజరై, బేషరతు క్షమాపణలు చెప్పడంతో శాంతించింది. అయితే, బోర్డు కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, పదవి నుంచి తక్షణమే వైదొలగాలంటూ ఠాకూర్కు 2017 జనవరిలో ఆదేశాలింది. ఠాకూర్ వాదన ఇదే.. కోర్టు ఆదేశాల మేరకు బోర్డు పదవికి, కార్యకలాపాలకు దూరంగా ఉండబట్టి 9 ఏళ్లు గడిచాయని గుర్తు చేశారు. తనపై విధించిన నిషేధాన్ని ఇకనైనా ఎత్తివేయాలని కోరారు. జీవితకాలం నిషేధంగా అప్పటి ఆదేశాల్లో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొనలేదని తెలిపారు. బోర్డు చైర్మన్ హోదాలో అప్పట్లో చోటుచేసుకున్న అన్ని పరిణామాలకు తానే బాధ్యత వహించాల్సి వందని పేర్కొన్నారు. నేరానికి తగిన శిక్ష.. వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసులో ప్రపోర్షనాలిటీ సిద్ధాంతాన్ని వర్తింపజేయడం సరైందని భావిస్తున్నామంది. ‘వాస్తవానికి న్యాయస్థానం ఠాకూర్పై జీవితకాల నిషేధాన్ని విధించాలని అనుకోలేదు. కేసులోని వాస్తవాలు, పరిస్థితులను బట్టి కఠినమైన నిషేధం విధించాల్సిన అవసరం లేదని భావిస్తున్నాం. పరిపాలనాపరమైన లోపానికి జీవితకాలం పాటు పదవులకు దూరం చేయడం అతి అవుతుంది’అని ధర్మాసనం పేర్కొంది. 2017లో ఇచి్చన ఆదేశాలు ఆ సమయానికి అవసరమైనవే తప్ప, శాశ్వతం కాదన్న ధర్మాసనం.. ఠాకూర్ తిరిగి బీసీసీఐ వ్యవహారాల్లో పాల్గొనవచ్చని తెలిపింది. -
జనంపై ‘సర్’ బుల్డోజర్
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే సక్రమంగా జరగట్లేదని, పనిఒత్తిడితో బూత్ లెవల్ అధికారులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని, బాధితులను ఢిల్లీకి తీసుకొచ్చి బెంగాల్ అంశాన్ని హస్తిన వేదికగా చర్చనీయాంశంగా మార్చిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఈ అంశంపై నేరుగా సర్వోన్నత న్యాయస్థానంలో తన వాదనలు స్వయంగా వినిపించారు. ఐదు నిమిషాలు సమయం ఇస్తే సూటిగా, స్పష్టంగా తమ వాదనలను విన్పిస్తానని మమత కోరగా ధర్మాసనం ఏకంగా 15 నిమిషాల సమయం కేటాయించడం విశేషం. భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా స్వయంగా ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో రాష్ట్ర కేసును వాదిస్తుండటంతో ఆమె వాగ్ధాటిని వినేందుకు న్యాయవాదులు సీజేఐ కోర్టురూమ్లోకి ఎగబడ్డారు. ఈ ఘటనకు సర్వోన్నత న్యాయస్థానం వేదికైంది. ఈసీ ఒక వాట్సాప్ కమిషన్..తమ రాష్ట్రంలో ఎస్ఐఆర్ చేపట్టడాన్ని సవాల్ చేస్తూ మమతా బెనర్జీ, మొస్తారీ బానూ, టీఎంసీ ఎంపీలు డెరెక్ ఓబ్రియాన్, దోలాసేన్లు వేసిన పిటిషన్పై తానే స్వయంగా వాదనలు విన్పించేదుకు అనుమతించాలంటూ ఇప్పటికే మమత ఇంటులాక్యుటరీ పిటిషన్ వేశారు. దీంతో మమతను వాదనలకు కోర్టు అనుమతించింది. మమత తన వాదనల సందర్భంగా ఎన్నికల కమిషన్ను వాట్సాప్ కమిషన్గా అభివర్ణించారు. ‘‘ ఈసీ ఒక వాట్సాప్ కమిషన్. ఉన్నతాధికారులకు కీలక నిర్ణయాలను వాట్సాప్లలో పంపిస్తోంది. మా రాష్ట్రంలో అక్ర మంగా జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో కోర్టు జోక్యం చేసుకోవాలి. ఎన్నికల నేపథ్యంలోనే మా రాష్ట్రాన్ని ఈసీ లక్ష్యంగా చేసుకుంది. ఓటర్లపై ఈసీ ‘ఎస్ఐఆర్’ బుల్డోజర్తో తొక్కిస్తోంది. ఎస్ఐఆర్ పేరిట బూత్ లెవల్ అధికారులను ఈసీ అధికా రాలు వేధిస్తున్నారు. వేధింపులు, పని ఒత్తిడితో పెద్దసంఖ్యలో బీఎల్ఓలు ఆత్మహత్యచేసుకున్నారు. రాష్టంలో ప్రజాస్వామ్యాన్ని మీరే కాపాడాలి. ఈ కేసులో న్యాయం కోసం మొదట్నుంచీ మా లాయర్లు శతథా పోరాడుతున్నారు. అయినాసరే మాకు ఎక్కడా న్యాయం దక్కట్లేదు. నేను కూడా కట్టుబానిసను. సాధారణ కుటుంబం నుంచి వచ్చా. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడట్లేను. రాష్ట్ర ఓటర్ల ఓటింగ్ హక్కుల కోసం పోరాడుతున్నా. ఇదే విషయమై ఇప్పటికే ఆరు సార్లు ప్రధాన ఎన్నికల కమిషన్ వద్ద మొరపెట్టుకుంటూ లేఖలు రాశా. అయినాసరే ఎలాంటి స్పందన రాలేదు. స్పెల్లింగ్లో చిన్నచిన్న తప్పులను ఎత్తిచూపి కోట్లాది ఓట్లను తొలగించొద్దు. ఇతర డాక్యుమెంట్లు అడక్కుండా ఎస్ఐఆర్ వెరిఫికేషన్లో ఆధార్కార్డ్ను గుర్తింపుకార్డుగా అంగీకరించండి’’ అని మమత కోరారు. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంఛోలీల ధర్మాసనం స్పందించింది. ‘‘మీరు చేస్తున్న వాదనల్లో నిజం ఉంది. అయితే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది’’ అని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఫిబ్రవరి 9వ తేదీ(సోమవారం)కల్లా మీ స్పందన తెలపాలని ఎలక్షన్ కమిషన్కు, పశ్చిమబెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ అధికారికి నోటీసులు జారీచేసింది. బీఎల్ఓలు, ఎలక్టోరల్ రోల్ ఆఫీసర్లతో సున్నితంగా వ్యవహ రించాలని, వాళ్లకు నోటీసులు జారీచేసే ముందు ఆలోచించాలని ఈసీకి ధర్మాసనం సూచించింది. కేసు విచారణ సోమవా రానికి వాయిదా వేశారు.ఎందుకింత తొందర?‘‘ఎస్ఐఆర్ సర్వేను సమగ్రంగా, సంపూర్ణంగా చేయాలంటే కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది. కానీ హడావుడి గా కేవలం మూడునెలల్లో ముగించాలని ఎందుకు నిర్ణయించారు? ఇదే సమయంలో రాష్ట్రంలో పండగ సీజన్ ఉంది. పంటల సాగు నడుస్తోంది. అంతా బిజీగా ఉండే సమయంలో హడావిడిగా ఎస్ఐఆర్ ముగించాలని ఎందుకు భావిస్తున్నారు?’’ అని మమత వాదించారు. వేధింపులతో బీఎల్ఓలు చనిపోతున్నారని మమత వాదించగా ఎలక్షన్ కమిషన్ తరఫు సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది కలగజేసుకుని ‘‘ ఉద్దేశపూర్వకంగా మమత సర్కార్ తక్కువ పనితనం ఉన్న 80 మంది గ్రేడ్–2 అధికారులను మాకు సహాయకులుగా అందించింది’’ అని వాదించారు. దీనిపై మమత మాట్లాడారు. ‘‘ ఈసీ నిబంధనల్లో పేర్కొన్న మేరకే తగు రాష్ట్ర ఆఫీసర్లను ఈసీ కోసం కేటాయించాం’’ అని బదులిచ్చారు. మళ్లీ ద్వివేది మాట్లాడబోగా మమత చేతులు జోడించి ‘‘ జడ్జిగారు దయచేసి మమ్మల్ని పూర్తిగా మాట్లాడనివ్వండి’’ అని వేడుకున్నారు. దీంతో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ‘‘మమత ఇంతదూరం వచ్చిందే మాట్లాడేందుకు. అయినా నిజమైన ఓటరు పేరు ఖచ్చితంగా ఓటర్లజాబితా తుది లిస్ట్లో ఉండాల్సిందే. తుది జాబితా నుంచి ఏ ఒక్క అమాయకుడిని పేరు తొలగింపునకు గురికావొద్దు’’ అని అన్నారు. ఇంగ్లిష్ స్పెల్లింగ్లో తప్పులుంటే కూడా నోటీస్లు ఇస్తున్నారని శ్యామ్ దివాన్ వాదించగా కోర్టు ‘‘ఇంగ్లిష్ అంటేనే స్పెల్లింగ్ తప్పులమయం’’ అని ఒక బెంగాళీ సామెతను గుర్తుచేశారు. తెలుపురంగు చీర, నలుపు రంగు శాలువా ధరించి న్యాయవాదులు, పార్టీ ఎంపీ, సీనియర్ న్యాయవాది కల్యాణ్ బెనర్జీలతో వచ్చిన మమతను చూసేందుకు సుప్రీంకోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, పలు కేసుల పిటిషనర్లు ఎగబడ్డారు. -
దేశం నుంచి వెళ్లిపోండి.. వాట్సాప్ కు సుప్రీంకోర్టు వార్నింగ్
-
యువతను రెచ్చగొట్టారు
న్యూఢిల్లీ: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ యువతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని కేంద్రం ఆరోపించింది. పొరుగునున్న నేపాల్, బంగ్లాదేశ్లలో మాదిరిగా జెన్ జెడ్ నిరసనలకు పిలుపునిచ్చారని పేర్కొంది. తన నిజ స్వరూపం బయటపడకుండా ఉండేందుకు గాను ఆయన మహాత్మాగాంధీ ప్రసంగాలను ఉపయోగించుకున్నారని తెలిపింది. జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద వాంగ్చుక్ను నిర్బంధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య గీతాంజలి అంగ్మో వేసిన పిటిషన్పై సోమవారం జస్టిస్ అరవింద్ కమార్, జస్టిస్ పీవీ వరాలేల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్ఎస్ఏ కింద అరెస్ట్ చేసిన వ్యక్తులను ఎలాంటి విచారణ లేకుండా గరిష్టంగా 12 నెలలపాటు నిర్బంధించే హక్కు అధికారులకు ఉంటుంది. కేంద్రం, లద్దాక్ యంత్రాంగం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కేంద్రాన్ని వాళ్లు అని, లద్దాఖ్ ప్రజలను మనం అని వేరుగా చూపిస్తూ మాట్లాడారని వాంగ్చుక్ ప్రసంగించే వారని ఆయన పేర్కొన్నారు. గతంలో జమ్మూ కశీ్మర్లో వచ్చినట్లుగా ప్రజాభిప్రాయ సేకరణ, రెఫరెండం చేపట్టాలంటూ డిమాండ్ చేశారన్నారు. చైనా, పాకిస్తాన్లతో సరిహద్దులు కలిగిన లద్దాఖ్ ప్రాంతం అత్యంత సున్నితమైందన్న మెహతా..అక్కడి ప్రజలను ఉద్దేశిస్తూ వాంగ్చుక్ చేసిన ప్రసంగాలను తప్పనిసరిగా గణనలోకి తీసుకోవాలని కోరారు. ‘ప్రసంగాల వీడియోలు, ఇతర ఆధారాలను పరిశీలించిన తర్వాతే జిల్లా మేజిస్ట్రేట్ వాంగ్చుక్ నిర్బంధానికి ఆదేశాలు జారీ చేశారు. మేజి్రస్టేట్ ఆదేశాల మేరకు డీఐజీ స్థాయి అధికారి ముందుగా వాంగ్చుక్ వద్దకు వెళ్లి ఆయన ప్రసంగాల వీడియోలను, ఇతర ఆధారాలను చూపారు. నిర్బంధంలోకి తీసుకునేందుకు గల కారణాలను వివరించారు’అని ధర్మాసనానికి మెహతా తెలిపారు. మేజి్రస్టేట్ కృత్రిమ ఆధారాలతోనే వాంగ్చుక్ను నిర్బంధించాలంటూ ఆదేశాలు జారీ చేశారన్న వాదనలను ఆయన తోసిపుచ్చారు. వాంగ్చుక్ చేసిన ప్రసంగాలను విన్న అధికారులు, ఆ వీడియోలను తయారు చేసి మేజి్రస్టేట్ ముందుంచారని వివరించారు. మంగళవారం కూడా ఈ కేసులో వాదనలు కొనసాగనున్నాయి. జోథ్పూర్ సెంట్రల్ జైలులో ఉన్న వాంగ్చుక్ అరబ్ దేశాల్లో మాదిరిగా తిరుగుబాటును లేవదీసేందుకు ప్రయత్నించినట్లు తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ జనవరి 29వ తేదీన ఒక ప్రకటన వెలువరించారు. ప్రభుత్వాన్ని విమర్శించే, నిరసన తెలిపే ప్రజాస్వామిక హక్కు తనకుందని అందులో పేర్కొన్నారు. కొన్ని ఎంపిక చేసిన వీడియోలను చూపు తూ అధికారులు వాంగ్చుక్ నిర్బంధాన్ని సమరి్థంచుకుంటున్నారంటూ ఆయన తరఫు లాయర్ కపిల్ సిబాల్ వాదిస్తున్నారు. వాంగ్చుక్ నిర్బంధం చట్ట విరుద్ధం, ఏకపక్ష చర్య..ఆయన ప్రాథమిక హక్కులకు భంగకరమని గీతాంజలి అంగ్మో ఆరోపిస్తున్నారు. లద్దాఖ్ కు రాష్ట్ర హోదా ప్రకటించాలంటూ గతేడాది సెప్టెంబర్లో జరిగిన నిరసనల్లో నలుగురు చనిపోగా, 90 మంది వరకు గాయపడ్డారు. అల్లర్లకు వాంగ్చుక్ రెచ్చగొట్టే ప్రసంగాలే కారణమని ఆరోపిస్తూ రెండు రోజుల తర్వాత అధికారులు జాతీయ భద్రతా చట్టం కింద ఆయన్ను నిర్బంధంలోకి తీసుకోవడం తెల్సిందే. -
సోషల్ మీడియాలో పోస్టులు.. పోలీసులు గీత దాటొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా పోస్టులు, రాజకీయ విమర్శలకు సంబంధించి ఎడాపెడా కేసులు నమోదు చేస్తున్న పోలీసుల తీరుకు అడ్డుకట్ట వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. సోషల్ మీడియా పోస్టులపై కేసులు నమోదు చేసే సమయంలో పోలీసులు పాటించాల్సిన విధివిధానాలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రాథమిక హక్కుల రక్షణ కోసమే హైకోర్టు ఆ నిబంధనలు పెట్టిందని.. వాటిని పోలీసులు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. ఈ మేరకు జస్టిస్ జె.బి. పార్దీవాలా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. అసలేం జరిగింది? సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల పోస్టుల ఆధారంగా యాంత్రికంగా క్రిమినల్ కేసులు నమోదు చేయడాన్ని తప్పుబడుతూ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా వ్యవహరించరాదని సూచించింది. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు పాటించాల్సిన మార్గదర్శకాలను తీర్పులో పొందుపరిచింది. అయితే ఈ మార్గదర్శకాలు దర్యాప్తు సంస్థల విధులకు ఆటంకం కలిగిస్తున్నాయంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సోమవారం సుప్రీం ధర్మాసనం ముందు వాడీవేడిగా వాదనలు జరిగాయి. పోలీసుల దర్యాప్తు స్వేచ్ఛకు మార్గదర్శకాలు అడ్డంకిగా ఉన్నాయి: లూథ్రా విచారణ ప్రారంభం కాగానే తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. కేసు మెరిట్స్పై తాము వాదించడం లేదని.. కానీ హైకోర్టు విధించిన కొన్ని షరతులు ఇబ్బందికరంగా ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ‘హైకోర్టు తీర్పులోని పేరా 29లో ఇచ్చిన మార్గదర్శకాలపై మాకు అభ్యంతరం ఉంది. ముఖ్యంగా గైడ్లైన్ నంబర్ 7, 8 పోలీసుల దర్యాప్తు స్వేచ్ఛను దెబ్బతీసేలా ఉన్నాయి. రాజకీయ ప్రసంగాలు లేదా సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందే పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి న్యాయ సలహా తీసుకోవాలని హైకోర్టు చెప్పింది. ఇది ప్రాసిక్యూషన్ వ్యవస్థ స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుంది. ప్రాసిక్యూషన్ వేరు, దర్యాప్తు వేరు కదా?. కానీ గైడ్లైన్ నంబర్ 4, 7 పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఫిర్యాదులు నిరాధారమని తేలితే కేసు క్లోజ్ చేయాలని చెబుతున్నారు. అది కేవలం సాక్ష్యాధారాల లేమి వల్లే కాదు.. ఇతర కారణాల వల్ల కూడా క్లోజ్ చేయొచ్చు కదా?’అని అన్నారు. తప్పేంటి?: సుప్రీం ధర్మాసనందీనిపై జస్టిస్ పార్దివాలా జోక్యం చేసుకుంటూ ‘అసలు హైకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడంలో తప్పేముంది? పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటానికి, యాంత్రికంగా కేసులు పెట్టకుండా ఉండటానికి ఆ మాత్రం జాగ్రత్తలు అవసరం లేదా? ఒక హైకోర్టు జ్యుడీíÙయల్ ఆర్డర్ ద్వారా కొన్ని మార్గదర్శకాలు ఇస్తే సంబంధిత అధికారులు వాటిని పాటించాల్సిందే. మార్గదర్శకాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం మాకు కనిపించడం లేదు. చాలా కోర్టులు ఇలాంటి మార్గదర్శకాల కోసమే ఎదురుచూస్తున్నాయి కూడా. హైకోర్టు కేవలం విస్తృతమైన మార్గదర్శకాలనే జారీ చేసింది. వాటిని పాటించండి’అని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ ప్రభుత్వ పిటిషన్ను డిస్మిస్ చేసింది. పోలీసులకు హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు ఇవీ.. ముందస్తు పరిశీలన: సోషల్ మీడియా పోస్టులపై ఫిర్యాదు రాగానే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు. ముందుగా ప్రాథమిక విచారణ జరపాలి. న్యాయ సలహా: రాజకీయ విమర్శలు, సున్నితమైన అంశాలకు సంబంధించిన పోస్టుల విషయంలో కేసు నమోదు చేసే ముందు తప్పనిసరిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి న్యాయ సలహా తీసుకోవాలి. నిరాధారమైతే రద్దు: విచారణలో ఫిర్యాదు నిరాధారమైనదిగా లేదా దురుద్దేశపూర్వకమైనదిగా తేలితే వెంటనే కేసు మూసేయాలి. -
సుప్రీం కోర్టులో సాక్షి టీవీకి ఊరట
సాక్షి, ఢిల్లీ: సుప్రీం కోర్టులో సాక్షి టీవీకి ఊరట లభించింది. ఏపీ ఫైబర్నెట్లో సాక్షి చానెల్ తొలగించడంపై విచారణ జరపాలని డీటీ శాట్ను సోమవారం సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో సాక్షిపై కక్షగట్టి.. మీడియా స్వేచ్ఛను హరించాలని చూస్తున్న చంద్రబాబు సర్కార్కు భారీ షాక్ తగిలినట్లైంది. ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఏపీ ఫైబర్ నెట్ నుంచి సాక్షి టీవీ చానెల్ను తొలగించారు. పైగా సాక్షి టీవీని ప్రసారం చేయొద్దంటూ ఎంఎస్వోలపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అక్రమ తొలగింపు వ్యవహారంపై సాక్షి యాజమాన్యం టీడీశాట్, సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో టీడీశాట్కు ఆదేశాలను కూడా ఏపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే.. టీడీశాట్ లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. అవసరమైతే మళ్లీ తమను ఆశ్రయించవచ్చని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా సాక్షి యాజమాన్యానికి సూచించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ నెల 12న సాక్షి టీవీ పిటిషన్ను టీడీ శాట్ విచారణ జరపనుంది. టీడీశాట్ (TDSAT) అంటే Telecom Disputes Settlement and Appellate Tribunal. ఇది భారతదేశంలో టెలికాం రంగానికి సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి, అప్పీలు వినడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం. -
బ్రిజ్భూషణ్కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రయల్ కోర్టు విచారణపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆయనపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో కింది కోర్టు ప్రొసిడింగ్స్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదని పిటిషనర్ తరఫు లాయర్కు స్పష్టం చేసింది. భారతీయ జనతా పార్టీ (BJP) మాజీ ఎంపీ కూడా అయిన బ్రిజ్భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలువురు రెజ్లర్లు రోడ్డెక్కారు. రోజుల తరబడి నిరసన దీక్ష చేపట్టారు. సర్వోన్నత న్యాయస్థానం ‘సుప్రీం’ కల్పించుకోవడంతో ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు 2023, మే నెలలో అప్పటి అధికారపార్టీ ఎంపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏడాది తర్వాత 2024, మే 21న ట్రయల్ కోర్టు ఆయనపై లైంగిక వేధింపులు, బెదిరింపులు, మహిళల అణచివేత అభియోగాలు మోపి విచారణ చేపట్టింది. దీనిపై అదే ఏడాది బ్రిజ్భూషణ్ హైకోర్టును ఆశ్రయించారు. పలుమార్లు వాయిదా పడిన ఈ కేసులో తనకు అనుకూలంగా స్టే ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వినతిని హైకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా కింది కోర్టులో ఎప్పుడో విచారణ మొదలైందని, ఈ కేసు ప్రొసిడింగ్స్లో తక్షణ జోక్యం చేసుకోవాల్సిన అవసరంగానీ, స్టే ఇవ్వాల్సిన అవసరం గానీ లేవని జస్టిస్ స్వర్ణ కాంత శర్మ స్పష్టం చేస్తూ తీర్పునిచ్చారు. దీంతో ట్రయల్ కోర్టులో ఏప్రిల్ 21న తదుపరి విచారణ జరగనుంది. -
యూజీసీ కొత్త రూల్స్కు ‘సుప్రీం’ బ్రేక్.. ఎందుకో తెలుసా?
ఉన్నత విద్యా సంస్థల్లో కులవివక్షను రూపుమాపి.. సమానత్వ భావనను పెంపొందించే లక్ష్యంతో ఇటీవల నోటిఫై చేసిన విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) నిబంధనలు-2026 వివాదంలో చిక్కుకున్నాయి. ఈ నిబంధనలను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతున్నాయి. ఇంతకీ ఈ వివాదం ఎందుకు మొదలైంది? ఎలా పెద్దదైంది? దీనిని కేంద్రం ఎలా సమర్థిస్తుందో చూద్దాం.. ఏమిటీ నిబంధనలు?ప్రతి ఉన్నత విద్యా సంస్థలోనూ ‘సమానత్వ(ఈక్విటీ) కమిటీ’ల ఏర్పాటును యూజీసీ ఇటీవల తప్పనిసరి చేసింది. ఆయా కమిటీల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని స్పష్టం చేసింది. కులం, మతం, లింగం, వికలాంగత, జాతి వంటి వివక్షలపై ఫిర్యాదులను పరిష్కరించడానికి ఈ ప్రత్యేక సెల్లు పని చేస్తాయి. ఇంతకు ముందు.. 2012 నిబంధనలను రద్దు చేసి, మరింత విస్తృతమైన, కఠినమైన నియమాలు అమలు చేయబడతాయి. ఇందులో హెల్ప్లైన్లు, కఠినమైన బాధ్యతా ప్రమాణాలు వంటి నిబంధనలు ఉంటాయి. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సమానత్వ చర్యలు, ఫిర్యాదు పరిష్కారాలపై UGCకి నివేదికలు సమర్పించాలి.రోహిత్ వేముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యూజీసీ(ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వ ప్రోత్సాహం) నిబంధనలు-2012 స్థానంలో కొత్త నిబంధనలను జనవరి 13వ తేదీ నుంచి అమలులోకి తెచ్చింది. అభ్యంతరాలు దేనికి? సమానత్వ కమిటీల ఏర్పాటు ఆదేశాలను వామపక్ష విద్యార్థి సంఘాలు సమర్థించాయి. అయితే కొత్త నిబంధనలలోని కులవివక్ష నిర్వచనాన్ని ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికే పరిమితం చేయడంపై జనరల్, ఇతర కేటగిరీల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగారు. కొంతమంది విద్యార్థి సంఘాలు ఈ నిబంధనలు అనుకోకుండా కొత్త విభజనలకు దారితీయవచ్చని.. అలాగే దుర్వినియోగం జరగకుండా సరైన రక్షణలు లేవని వాదిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని యూజీసీ ప్రధాన కార్యాలయానికి కూడా ఈ నిరసన సెగ తాకింది. దీనికి నిరసనగా పార్టీకి కొందరు బీజేపీ నేతలు, ఓ సీనియర్ బ్యూరోక్రాట్ రాజీనామా చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది.సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఏముంది?మరోవైపు, రిజర్వుడు కేటగిరీల కిందకు రాని విద్యార్థులు, బోధనా సిబ్బందికి రక్షణ కల్పించే విషయాన్ని కొత్త నిబంధనల్లోని 3(సి) విస్మరించిందని పేర్కొంటూ వినీత్ జిందాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వర్సిటీలు సైతం దీనిని అదనపు బాధ్యతలుగా చూస్తున్నాయనే విషయాన్ని ప్రస్తావిస్తూ.. కమిటీ ప్రతినిధుల మధ్య విభేదాలు పెరిగే అవకాశంపై ఆందోళన పిటిషన్లో వ్యక్తం చేశారు.తాత్కాలికంగా ఎందుకు నిలిపివేసింది?బిల్లులోని కొన్ని నిబంధనలను సుప్రీం కోర్టు గురువారం తాత్కాలికంగా నిలిపివేసింది. దీని అమలుకు స్వేచ్ఛా, సమానత్వం, సమగ్రతతో కూడిన వాతావరణం అవసరమని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.కేంద్రం ఏం చెబుతోంది?కొత్త నిబంధనల వల్ల ఎవరికీ నష్టం వాటిల్లదని, ఎవరూ వేధింపులకు గురికారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ తెలిపారు.UGC బిల్లు 2026 ప్రధానంగా ఉన్నత విద్యాసంస్థల్లో కుల ఆధారిత వివక్షతో పాటు ఇతర రకాల వివక్షను నివారించడానికి రూపొందించబడిందని అంటున్నారాయన. ఈ బిల్లు మార్జినలైజ్డ్ కమ్యూనిటీలకు రక్షణ కల్పించే చారిత్రాత్మక అడుగు అని మద్దతుదారులు అంటున్నారు. విద్యా నిపుణులు ఇది వ్యవస్థలోని అడ్డంకులను తొలగించి, సమానత్వాన్ని పెంపొందిస్తుందని భావిస్తున్నారు.మొత్తంగా.. ఈ బిల్లు మార్జినలైజ్డ్ కమ్యూనిటీలకు రక్షణ కల్పించడమే లక్ష్యం అయినప్పటికీ.. దాని అమలు విధానం, దుర్వినియోగం అవకాశాలు, కొత్త విభజనల భయం కారణంగా వివాదం చెలరేగింది. -
జడ్జీల బదిలీల్లో ప్రభుత్వ జోక్యం
న్యూఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలు, కొలీజియం నిర్ణయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందంటూ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆందోళనకర పరిణామం న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు భంగకరమన్నారు. ‘‘ఇటీవల జస్టిస్ అతుల్ శ్రీధరన్ను మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. కేంద్ర ప్రభుత్వ విన్నపం మేరకే జరిగిందని నాటి ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై కార్యనిర్వాహక వ్యవస్థ (ప్రభుత్వం) ప్రభావం ఉందని దీంతో స్పష్టమవుతోంది’’ అని జస్టిస్ భూయాన్ పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వానికి అసౌకర్యం కలిగించేలా ఉత్తర్వులను ఇచి్చనంతమాత్రానే హైకోర్టు జడ్జిని బదిలీ చేస్తారా? ఇవి న్యాయవ్యవస్థ స్వతంత్రతకే గొడ్డలి పెట్టు కాదా? కొలీజియం విధానం సమగ్రతను ఇవి దెబ్బ తీసినట్లు కాదా? హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీల్లో ప్రభుత్వానికి ఎటువంటి పాత్రా ఉండరాదు’’ అని కుండబద్దలు కొట్టారు. -
‘సుప్రీం’కు అసాధారణ అధికారం
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకు అసాధారణ అధికారాలను ఇచ్చిందని ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.మురళీధర్ పేర్కొన్నారు. తన ముందు పెండింగ్లోని ఏదైనా కేసులో సంపూర్ణ న్యాయం అందించేందుకు అవసరమైన ఏ ఉత్తర్వునైనా జారీ చేసే అధికారం అత్యున్నత న్యాయస్థానానికి ఉందన్నారు. అయోధ్య వివాదం, భోపాల్ గ్యాస్ దుర్ఘటన కేసులతోపాటు విడాకుల కేసుల్లో న్యాయస్థానం దీన్ని వినియోగించుకుందని చెప్పారు. కొన్ని సందర్భాల్లో బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో న్యాయవ్యవస్థ విఫలమైందంటూ అయోధ్య కేసును ప్రస్తావించారు. నేరం బహిరంగంగా జరిగినా బాధ్యత నిర్ధారణ, శిక్ష విధింపులో తీవ్రమైన జాప్యం జరుగుతోందని అభిప్రాయపడ్డారు. న్యాయం చేయడమే కాదు, న్యాయ ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టాల్సిన బాధ్యత కూడా కోర్టులపై ఉందన్నారు. రాయదుర్గంలోని నాలెడ్జ్ సెంటర్లో జరిగిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో ఆయన ‘(అ)సంపూర్ణ న్యాయం? 75 ఏళ్ల సుప్రీంకోర్టు’అనే పుస్తకంపై మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ‘సుప్రీం’పాత్రను చెబుతుంది.. రాజ్యాంగం అమల్లోకి వచి్చన 75 ఏళ్ల సందర్భంగా సుప్రీంకోర్టు పనితీరు, పాత్ర, సవాళ్లను ఇందులో ప్రస్తావించినట్లు జస్టిస్ మురళీధర్ చెప్పారు. పలు కేసుల విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం తన రాజ్యాంగ బాధ్యతలను ఎంత సమర్థవంతంగా నిర్వర్తించిందో తెలియజేయడానికి పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రముఖుల వ్యాసాలు, ఇంటర్వ్యూలను ఈ పుస్తకంలో పొందుపర్చినట్లు చెప్పారు. తీర్పుల ప్రస్తావనతోపాటు కొన్నిసార్లు అవసరమైన చర్య తీసుకోవడంలో విఫలమైందా.. లేదా.. అన్న సున్నిత విమర్శలు, ప్రశ్నలు కూడా ఇందులో ఉంటాయని చెప్పారు. ప్రజాస్వామ్యంలో కోర్టు ప్రభావమే కాకుండా న్యాయ నియామకాల్లాంటి అంతర్గత, పరిపాలనా సవాళ్లను కూడా ఇందులోని వ్యాసాలు ప్రతిబింబిస్తాయన్నారు. సాయినాథ్, ప్రొఫెసర్ బక్షి, ప్రముఖ న్యాయవాదులు ఇందిరా జైసింగ్, మీనాక్షి ఆరోరా లాంటి వారి రచనలను ఆయన ప్రస్తావించారు. న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు న్యాయ విద్యలో సమూల మార్పు రావాల్సి ఉందని జస్టిస్ మురళీధర్ చెప్పారు. జాతీయ స్థాయి విద్యాసంస్థలున్నా.. నాణ్యమైన వాదనలు వినిపించే నిపుణులైన న్యాయవాదులను అందించడం లేదన్నారు. సుదీర్ఘమైన వాదనలతో కాకుండా నాణ్యమైన వాదనలతో కోర్టు సమయం వృథా కాదని, సత్వర న్యాయానికి దోహదం చేస్తుందన్నారు. యువ న్యాయవాదులు దీన్ని అలవర్చుకోవాలన్నారు. హైబ్రిడ్ విచారణలు ఆశించదగిన పరిణామమని చెప్పారు. కొన్నిసార్లు బెంచ్ల మధ్య తీర్పుల్లో వ్యత్యాసం ఉండొచ్చంటూ తాజా ‘ఆరావళి’తీర్పును గుర్తుచేశారు. తీర్పులు నల్లేరుపై నడక కాదని, అయోధ్య, శబరిమల.. లాంటి కేసుల విచారణ సందర్భంగా న్యాయవ్యవస్థ రాజకీయ, సామాజిక ఒత్తిళ్లకు లోనైందన్నారు. న్యాయమూర్తులు స్వేచ్ఛగా ఎక్కడికంటే అక్కడికి వెళ్లి విహరించలేరని, అయినా క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. కిందిస్థాయి కోర్టుల్లోనైనా స్థానిక భాషల్లో విచారణ కొనసాగాలని, కక్షిదారులకు తమ కేసు వివరాలు తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలన్నారు. జడ్జిలు రాజకీయాల్లో చేరడంపై లోతైన చర్చ అవసరమన్నారు. న్యాయ సంస్కరణలు అవసరం ఎలక్రో్టరల్ బాండ్లు, నోట్ల మారి్పడి, ఆర్టికల్ 370, పెగాసస్ స్పైవేర్.. లాంటి కేసుల విచారణలో సుప్రీంకోర్టు అనుసరించిన తీరు సరికాదని జస్టిస్ మురళీధర్ అభిప్రాయపడ్డారు. కొన్నిసార్లు ఆలస్య తీర్పు కారణంగా నష్టం వాటిల్లుతుందని చెప్పారు. వేగవంతమైన విచారణ, బెయిల్ మంజూరు అంశాలను ప్రస్తావించిన ఆయన ట్రయల్ సత్వరం పూర్తి చేయాలని, దీని కోసం న్యాయ సంస్కరణలు తేవాలని నొక్కిచెప్పారు. సీరియస్, నాన్–సీరియస్ కేసులుగా విభజించుకుని కీలకమైనవి కాకుంటే వెంటనే తీర్పులివ్వాలన్నారు. అవినీతి అనేది అన్ని వ్యవస్థల్లో మాదిరి న్యాయ వ్యవస్థలోనూ ఉందని, పార్లమెంట్లో బిల్లు పెట్టి ప్రత్యేక చట్టం చేయాలని సూచించారు. 1984లో మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన మురళీధర్ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు మారారు. 2006లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021లో ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2023లో పదవీ విరమణ చేశారు. -
‘గీతం’కు ప్రభుత్వ భూమి ఇవ్వడం చట్ట విరుద్ధం
సాక్షి, అమరావతి: విశాఖపట్నం రూరల్ మండలం రుషికొండ, ఎండాడ గ్రామాల్లో అత్యంత విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీకి ఉదారంగా సమర్పించడం చట్ట విరుద్ధమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కేంద్ర ప్రభుత్వ పూర్వ కార్యదర్శి ఈఏఎస్ శర్మ స్పష్టంచేశారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని తెలిపారు. ఈ ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, బాధ్యులైన అధికారులు, నాయకులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మికి వేర్వేరుగా లేఖలు రాశారు. పేదల గుడిసెలు తొలగించి.. పెద్దలు ఆక్రమించిన భూములు క్రమబద్ధీకరిస్తారా? అదే అధికారులు విశాఖ నగరానికి జీవనోపాధి కోసం వలస వచ్చి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారిని, వీధి వ్యాపారుల బళ్లను పోలీసు బలగాల సహాయంతో పొక్లెయిన్లు తీసుకువచ్చి నిర్దాక్షిణ్యంగా తొలగించారని ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు. దీన్నిబట్టి రాష్ట్రంలో పెద్దలకు ఒక న్యాయం, నిస్సహాయులకు మరొక న్యాయం ఉంటుందా? అని ప్రశ్నించారు. గీతం యూనివర్సిటీ ఆక్రమించిన భూమిని ఈ నెల 30న జరిగే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో క్రమబద్దీకరణ చేయడానికి చూస్తున్నారని పత్రికల్లో వార్తలు చూశానని తెలిపారు. ఈ విషయంలో విశాఖ రూరల్ మండలం తహసీల్దారు ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. రెవెన్యూ అధికారులు ఏ నియమం కింద ఇటువంటి క్రమబద్దీకరణకు అనుమతి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. రెవెన్యూ నిబంధనల్లో బీఎస్వో (బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్)24 కింద గానీ, రెవెన్యూ శాఖ 2012 సెప్టెంబర్ 14న జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 571 కింద గానీ ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు ఇవ్వకూడదని వివరించారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమే.. స్థానిక సంస్థల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు కేటాయించకూడదని సుప్రీంకోర్టు జగపాల్ సింగ్ (కేస్ నంబర్ 1132/2011) కేసులో 2011 జనవరి 28న అన్ని రాష్ట్రాలను ఆదేశించినట్లు ఈఏఎస్ శర్మ ఆ లేఖలో స్పష్టంచేశారు. స్థానిక రెవెన్యూ అధికారులు, జీవీఎంసీ అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లేనని తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ భూముల ధరల ప్రకారమే రుషికొండ, ఎండాడ ప్రాంతంలో ఎకరం రూ.22 కోట్లు ఉందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. అంత విలువైన భూమిని లాభాలు గడించే ప్రైవేటు సంస్థకు కేటాయిస్తే, సుప్రీంకోర్టు 2జీ స్పెక్ట్రం, బొగ్గు కుంభకోణం కేసుల్లో ఇచ్చిన తీర్పుల ప్రకారం ఆ నిర్ణయాలకు సహకరించిన అధికారులు, రాజకీయ నాయకుల మీద 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. అసైన్డ్ భూములను గీతం కొనుగోలు చేసింది గతంలో గీతం సంస్థ రుషికొండ, ఎండాడ గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించడమే కాకుండా పేదలకు కేటాయించిన డీ పట్టా భూములను కూడా చట్టాన్ని ఉల్లంఘించి కొనుగోలు చేసిందని శర్మ తెలిపారు. దీనిపై విచారణ చేపట్టి ఆ ప్రైవేటు సంస్థల మీద చర్యలు తీసుకుని ఆ కొనుగోళ్లను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమిందారీ సంస్థలు కావని అవి ప్రజాస్వామ్య విధానాలు, చట్టాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. తాను సూచించిన అంశాలపై దర్యాప్తు అవసరమని, రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలపై రాజకీయ ఒత్తిడి ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలన్నారు. అందుకే ఈ లేఖను కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా పంపుతున్నట్లు ఆయన తెలిపారు. -
హైకోర్టుకు క్షమాపణ చెప్పండి
న్యూఢిల్లీ: జార్ఖండ్ హైకోర్టులో ఓ కేసు విచారణ సమయంలో న్యాయమూర్తితో పరుషంగా మాట్లాడిన లాయర్ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. హైకోర్టుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. ఆ లాయర్ క్షమాపణను సానుభూతితో స్వీకరించాలని హైకోర్టుకు కూడా సూచించింది. గతేడాది అక్టోబర్ 16వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరణకు సంబంధించిన కేసును లాయర్ మహేశ్ తివారీ హైకోర్టులో వాదిస్తున్నారు. కనెక్షన్ తిరిగి ఇచ్చేందుకు రూ.25 వేలు డిపాజిట్ చేస్తామని క్లయింట్ తరఫున ఆయన ప్రతిపాదించగా, మొత్తం బకాయిలో 50 శాతం చెల్లించడం తప్పనిసరంటూ గత తీర్పులను న్యాయమూర్తి రాజేశ్ కుమార్ ఉదహరించారు. చివరకు రూ.50వేలు డిపాజిట్ చేయాలనే నిబంధనతో సమస్య పరిష్కారమైనప్పటికీ, వాదనల సమయంలో మాటామాటా పెరిగింది. లాయర్ తివారీ తీరు సరిగా లేదంటూ జస్టిస్ కుమార్ జార్ఖండ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఆగ్రహించిన మహేశ్ తివారీ.. ‘నేను ఇలాగే వాదిస్తా..హద్దు మీరకండి’అంటూ కోర్టు హాలులో న్యాయమూర్తితో వ్యాఖ్యానిస్తున్నట్లుగా ఉన్న వీడియో క్లిప్పింగ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ చౌహాన్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం లాయర్ తివారీకి ధిక్కారణ నోటీసు పంపింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగి్చల ధర్మాసనం విచారణ చేపట్టింది. లాయర్ తివారీ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదన వినిపించారు. తన క్లయింట్ అప్పటి ఘటనపై పశ్చాత్తాపం చెందుతున్నారని, బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. గౌరవ న్యాయమూర్తిని అగౌరవపర్చాలని గానీ, కోర్టు కార్యకలాపాలకు అవరోధం కలి్పంచాలని గానీ ఆయన ఉద్దేశం కాదన్నారు. స్పందించిన ధర్మాసనం ధిక్కారం నోటీసు ఇచి్చన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎదుట తివారీ క్షమాపణ చెబితే సరిపోతుందని పేర్కొంది. ఈ మేరకు అఫిడవిట్ వేయాలంది. దీనిని సానుభూతితో పరిశీలించాలని హైకోర్టుకు సూచించింది. అదేసమయంలో లాయర్ ప్రవర్తనను ధర్మాసనం ఆక్షేపించింది. ‘జడ్జిల ఎదుట ఆయనే స్వయంగా హాజరై వివరణ ఇవ్వొచ్చు కదా? మూర్ఖత్వానికి తగు ఫలితం స్వయంగా అనుభవించాల్సిందే. అతడినే వివరణ ఇచ్చుకోనివ్వండి. అక్కడా గుడ్లు ఉరమాలని అనుకుంటే... ఉరమనీయండి. అతడిని ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు’అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
ప్రశాంతంగా పూజలు.. నమాజ్
ధార్: మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఉన్న భోజ్శాల–కమాల్ మౌలా మసీదు సముదాయంలో శుక్రవారం ప్రశాంత వాతావరణం నెలకొంది. ఆ ప్రాంగణంలోని ఒక ప్రాంతంలో హిందువులు వసంత పంచమిని పురస్కరించుకుని పూజలు నిర్వహించగా, ముస్లిం మరోచోట నమాజ్ చేసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. ఉదయం నుంచి హిందువులు పూజలు మొదలుపెట్టారు. సాయంత్రం వరకు పూజలు కొనసాగాయి. మధ్యలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ముస్లింలు ప్రార్థనలు చేశారు. నగర వ్యాప్తంగా 8 వేల మంది పోలీసులు, పారా మిలటరీ సిబ్బందిని మోహరించారు. భోజ్ ఉత్సవ కమిటీ సభ్యులు అధికారులు నిర్దేశించిన ప్రాంతంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ సరస్వతీ మాత విగ్రహాన్ని ప్రతిష్టించి, అఖండ పూజను ప్రారంభించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగలేదని, ప్రశాంత వాతావరణానికి భంగం కలగలేదని జిల్లా మేజిస్ట్రేట్ ప్రియాంక్ మిశ్రా తెలిపారు. నగరంలోని ప్రతి వీధిలోనూ బందోబస్తుతోపాటు సీసీటీవీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ మయాంక్ అవస్థి చెప్పారు. సామాజిక మాధ్యమ వేదికలపైనా ఓ కన్నేసి ఉంచామన్నారు. 11వ శతాబ్దం నాటి ఈ కట్టడాన్ని భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) పరిరక్షిస్తోంది. 2003లో ఏఎస్ఐ ఇచి్చన ఆదేశాల ప్రకారం భోజ్శాలలో ప్రతి మంగళవారం హిందువులు పూజలు, ముస్లిం ప్రతి శుక్రవారం నమాజ్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, వసంత పంచమి శుక్రవారం రోజే రావడంతో గురువారం ఇరువర్గాలకు అనుకూలంగా ఉండేలా పూజలు, నమాజ్ చేసుకునేందుకు ఏర్పా ట్లు చేయాలని ఆదేశించడం తెల్సిందే. భవ్య సరస్వతీ ఆలయం నిర్మిస్తాం: వీహెచ్పీ వివాదాస్పద భోజ్శాల సముదాయంలో బ్రహా్మండమైన సరస్వతీ మాత ఆలయాన్ని నిర్మించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) ప్రకటించింది. చట్ట పరమైన ప్రక్రియను పూర్తి చేసుకున్నాక 2034కల్లా ఆలయ నిర్మాణ కలను సాకారం చేస్తామని తెలిపింది. ప్రస్తుతం లండన్ మ్యూజియంలో ఉన్న వాగ్దేవి మాత విగ్రహాన్ని తిరిగి తీసుకువచి్చ, ఆ ఆలయంలో ప్రతిíÙ్ఠస్తామని వీహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో నిర్మించిన ఆలయం మాదిరిగానే ఇది కూడా ఉంటుందన్నారు. శుక్రవారం ఆయన భోజ్శాలలో జరిగిన సరస్వతీమాత పూజకు హాజరైన భక్తులనుద్దేశించి మాట్లాడారు. ‘భోజ్శాలలో వాగ్దేవి ఆలయం 1034లో నిర్మితమైంది. ఆలయ ప్రతిష్ట జరిగి ఇప్పటికి 992 ఏళ్లు పూర్తయ్యాయి. 2034కల్లా వెయ్యేళ్లు అవుతాయి. అప్పటి కల్లా చట్టపరమైన అడ్డంకులను అధిగమించేందుకు మనమంతా కృషి చేయాలి. అయోధ్య రామాలయం మాదిరిగా భవ్య సరస్వతీ మాత ఆలయాన్ని నిర్మించుకోవాలి’అని అలోక్ కుమార్ పిలుపునిచ్చారు. లండన్ నుంచి వాగ్దేవి విగ్రహాన్ని భారత్కు తిరిగి తేవాలని ఈ సందర్భంగా పలువురు సాధుసంతులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉజ్జయినిలోని శ్రీ మహాకాల్ లోక్ కారిడార్ మాదిరిగానే వాగ్దేవి కారిడార్ను ఏర్పాటు చేయాలన్నారు. -
BCCI: మీ సమస్య ఏంటి?: సుప్రీంకోర్టు ఆగ్రహం
భారత క్రికెట్ జట్టును టీమిండియా అని పిలవొద్దంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో పిటిషనర్కు ఉన్న సమస్య ఏమిటో అర్థం కావడం లేదని పేర్కొంది. హైకోర్టు కఠినమైన చర్యలు తీసుకోకుండా వదిలేసినందునే పిటిషనర్ ఇక్కడి వరకు వచ్చే సాహసం చేశారని మండిపడింది.పూర్వాపరాలు ఇవేప్రైవేట్ సంస్థ అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎంపిక చేసే జట్టును టీమిండియా, జాతీయ జట్టు అని పిలవకూడదని రీపక్ కన్సాల్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వంతో సంబంధం లేని బీసీసీఐ ఎంపిక చేసిన జట్టుకు దేశం పేరు వాడుకోకూడదని పిటిషన్లో పేర్కొన్నారు.టీమిండియా అనకూడదుప్రసార్ భారతి తన కార్యక్రమాల్లో క్రికెట్ జట్టును టీమిండియా అని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రీపక్ కన్సాల్ విజ్ఞప్తి చేశారు. అయితే, ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్ను కొట్టివేసింది. విశ్వవేదికపై దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నపుడు టీమిండియా లేదంటే భారత జట్టు అని ఎందుకు పిలవకూడదని ప్రశ్నించింది.దేశం పేరు, జాతీయ చిహ్నాల వాడకం కేవలం ప్రభుత్వానికే పరిమితం కాదని.. ఇలాంటి పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని మందలించింది. అయితే, సదరు పిటిషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.ఈ క్రమంలో గురువారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం పిటిషనర్కు గట్టిగానే అక్షింతలు వేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను కొట్టివేసింది.మీ సమస్య ఏమిటి?ఈ సందర్భంగా.. ‘‘మీరు ఇంట్లో కూర్చుని ఇలాంటి పిటిషన్లు డ్రాఫ్ట్ చేయడం మొదలుపెట్టారు. అయినా ఇందులో (టీమిండియా) మీకు సమస్య ఏమిటి? జాతీయ క్రీడా ట్రిబ్యునల్లో అద్భుతమైన సభ్యులు ఉన్నారు. ఇలాంటి విషయాల కోసం కోర్టుపై భారం మోపకండి’’ అని సీజేఐ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.హైకోర్టు ఈ విషయంలో తప్పు చేసింది అదే విధంగా.. ‘‘మీ విషయంలో హైకోర్టు తప్పు చేసినట్లు అనిపిస్తోంది. ఇలా కోర్టు సమయం వృథా చేస్తున్నందుకు మీకు జరిమానా వేయాల్సింది. అలా చేయకుండా హైకోర్టు తప్పు చేసింది. అందుకే మీరు ఇలాంటి పనికిరాని పిటిషన్లతో సుప్రీం కోర్టు వరకు వచ్చారు’’ అని సీజేఐ మండిపడ్డారు.ఈ క్రమంలో ధర్మాసనం సదరు పిటిషనర్ను రూ. 10 లక్షలు కట్టాల్సిందిగా ఆదేశించగా.. తన క్లైంట్ పట్ల కాస్త ఉదారంగా వ్యవహరించాలని న్యాయవాది కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేసింది. చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే! -
భోజ్శాలలో పూజలు, నమాజ్కు ఓకే
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాలోని వివాదాస్పద భోజ్శాల–కమల్ మౌలా సమీదు వద్ద పూజల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వసంత పంచమి రోజు(శుక్రవారం) హిందువులు అక్కడ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా పూజలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అలాగే ముస్లింలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల దాకా నమాజ్ చేసుకోవచ్చని సూచించింది. ముస్లిం వర్గం నుంచి నమాజ్లో పాల్గొనేవారి పేర్ల జాబితాను జిల్లా అధికార యంత్రాంగానికి అందజేయాలని ఆ వర్గాన్ని ఆదేశించింది. భోజ్శాల కాంప్లెక్స్ వద్ద పూజలు, ప్రార్థనలు అనుమతి ఇవ్వాలని కోరుతూ హిందువులు, ముస్లింలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వసంత పంచమి సందర్భంగా సరస్వతి పూజ నిర్వహించుకుంటామని హిందువులు విజ్ఞప్తిచేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వినతిని మన్నించింది. పరస్పరం గౌరవించుకోవాలని పేర్కొంది. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని సూచించింది. ‘‘భోజ్శాల కాంపౌండ్లో వద్ద నమాజ్కు ఎంతమంది హాజరవుతారో తెలుసుకొని దాన్నిబట్టి ప్రత్యేక స్థలం కేటాయించాలి. నిర్దేశిత సమయంలో వారు అక్కడ నమాజ్ చేసుకోవచ్చు. అలాగే హిందువులు సంప్రదాయ పూజలు చేసుకోవడానికి అక్కడ ప్రత్యేక స్థలం కేటాయించాలి. హిందువులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా పూజలు, ముస్లింలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా నమాజ్ చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. జిల్లా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలి. శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగడానికి వీల్లేదు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. పూజలు, ప్రార్థనలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి. సందర్శకులకు ఉచితంగా పాసులు మంజూరు చేసే అంశం పరిశీలించాలి’’అని ధర్మాసనం స్పష్టంచేసింది. ఏమిటీ భోజ్శాల? 11వ శతాబ్దానికి చెందిన ఈ కట్టడాన్ని హిందువులు పరమ పవిత్రంగా భావిస్తారు. ఇది వాగ్దేవి(సరస్వతి) మందిరంగా కొలుస్తుంటారు. భారత పురావస్తు సర్వే విభాగం(ఏఎస్ఐ) ఈ కట్టడాన్ని పరిరక్షిస్తోంది. మరోవైపు ముస్లింలకు కూడా ఇది పవిత్రమైనదే. దశాబ్దాల క్రితమే కమల్ మౌలా మసీదుగా ప్రకటించారు. నిత్యం నమాజ్ చేస్తుంటారు. 2003 ఏప్రిల్ 7న ఏఎస్ఐ ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. భోజ్శాలలో హిందువులు ప్రతి మంగళవారం పూజలు చేసుకోవచ్చు. ముస్లింలు శుక్రవారం నమాజ్ చేసుకోవాలి. ఈసారి వసంత పంచమి శుక్రవారం రావడంతో సందిగ్ధత నెలకొంది. పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ అనే సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముస్లింలు యథాతథంగా నమాజ్ చేసుకోవడానికి అనుమతించాలంటూ మసీ దు కమిటీ పిటిషన్ దాఖలు చేసింది. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు భోజ్శాల–కమల్ మౌలా మసీదు వద్ద ఒకేరోజు పూజలు, నమాజ్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచి్చన నేపథ్యంలో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు, పారా మిలటరీ సిబ్బంది పెద్ద సంఖ్యలో మోహరించారు. సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ జవాన్లు కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ముస్లిం వర్గం ప్రజలు ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు కమల్ మౌలా నమాజ్ ఇంతెజామియా కమిటీ చీఫ్ జులీ్ఫకర్ పఠాన్ చెప్పారు. శుక్రవారం శాంతియుతంగా నమాజ్ చేసుకోవాలని ముస్లింలను కోరారు. సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయాన్ని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగి్వజయ్ సింగ్ స్వాగతించారు. ఇది కూడా చదవండి: karnataka: అసెంబ్లీలో హైడ్రామా.. మధ్యలోనే వెళ్లిపోయిన గవర్నర్ -
కర్ణాటక గవర్నర్ పంతం.. ‘సుప్రీం’కు సిద్ధరామయ్య సర్కార్!
కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. గురువారం నుంచి ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తాను ప్రసంగించకూడదని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం తనకు సమర్పించిన గవర్నర్ ప్రసంగం కాపీలో అభ్యంతరాల నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. రాజ్యాంగ సంక్షోభం తలెత్తే పరిస్థితి ఏర్పడింది.గవర్నర్ ప్రసంగం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యతలు.. గత ఏడాది పని తీరును ప్రతిబింబించే అధికారిక ప్రకటన. ఏ రాష్ట్రంలోనైనా సరే శాసనసభ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతోనే ప్రారంభం కావాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 ఈ విషయాన్నే స్పష్టంగా చెబుతోంది. ఒకవేళ.. గవర్నర్ ప్రారంభోపన్యాసం ఇవ్వకపోతే శాసనసభ ప్రారంభం జరగదు!. ఇది రాజ్యాంగపరమైన ప్రక్రియలో అంతరాయం కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మార్గం ఉంది.గవర్నర్ గనుక ప్రసంగం ఇవ్వనని చెబితే.. ఆ ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ను ఆశ్రయించవచ్చు. ఇవాళ జరగబోయే ఉమ్మడి శాసనసభ సమావేశంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్(Thawar Chand Gehlot) ప్రసంగం ఇవ్వకపోతే.. సిద్ధరామయ్య ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ను ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.గవర్నర్ అభ్యంతరాలివే.. ఈ వివాదానికి మూలం గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం చేర్చిన కొన్ని పేరాలు. ముఖ్యంగా ఎంజీఎన్ఆర్ఈజీఏ (MGNREGA) రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్రాన్ని విమర్శించడం, కర్ణాటకకు నిధుల పంపిణీ విషయంలో అన్యాయం జరిగిందని వ్యాఖ్యలు ఉండడం. థావర్ చంద్ గెహ్లాట్ వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. తొలగించాలని కోరారు. తొలగించకపోతే ప్రసంగం ఇవ్వబోనని లోక్భవన్ వర్గాల ద్వారా ప్రభుత్వానికి కబురు పంపారు.గవర్నర్ ప్రసంగం అనేది ప్రభుత్వ విధానాల ప్రతిబింబం మాత్రమే. గవర్నర్ వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పే వేదిక కాదు. ప్రసంగం ఇవ్వకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఈ అంశం మీదే సుప్రీం కోర్టులో వాదనలు జరిగే చాన్స్ ఉంది.కోర్టు ఏం చెప్పిందంటే..గతంలో గవర్నర్లు ప్రసంగాలు చదవకపోవడం.. మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడం లాంటి ఘటనలు జరిగాయి. ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 2023లో అప్పటి కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ప్రసంగం మొత్తం చదవకుండా మధ్యలో వెళ్లిపోయారు. ఆ సమయంలో పినరయి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే.. ప్రసంగం మొత్తం చదవడం గవర్నర్కున్న రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని ఆ టైంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2024-2025 మధ్యకాలంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కూడా ఇలా మూడుసార్లు చేశారు. ఆ సమయంలోనూ తమిళనాడు ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. గవర్నర్ ప్రసంగం తప్పనిసరి.. అది ప్రభుత్వ విధానాల ప్రతిబింబం మాత్రమేనని స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో గవర్నర్–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రచ్చ నడుస్తోంది. మొన్న తమిళనాడు, నిన్న కేరళలో కూడా ఇటీవలి కాలంలో ఇలాంటి వివాదాలు చోటు చేసుకున్నాయి.సభ ఆగిపోతుందా?.. రకరకాల కారణాలతో.. అసెంబ్లీ సమావేశాల ప్రారంభోపన్యాసానికి దూరం కావడం, లేదంటే మధ్యలో వెళ్లిపోవడం లాంటి పనులు గవర్నర్లు చేసిన సందర్భాలు భారత దేశ చరిత్రలోనే అనేకం ఉన్నాయి. అయితే.. గవర్నర్ ప్రసంగం ఇవ్వకపోయినా సరే ప్రభుత్వం తాను సిద్ధం చేసిన ప్రసంగాన్ని అధికారికంగా రికార్డులోకి తీసుకుని సమావేశాలను నిర్వహించుకోవచ్చు. తద్వారా రాజ్యాంగ ప్రక్రియ కొనసాగుతుంది. గవర్నర్ ప్రసంగం అనేది కేవలం రాజ్యాంగపరమైన బాధ్యతేకాని సభ ఆగిపోయేంత కారణం కాదన్నమాట. -
ఇంకెంత ఎండబెడతారు?
న్యూఢిల్లీ: చండీగఢ్లోని ప్రఖ్యాత సుఖ్నా చెరువు దుస్థితిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వెలిబుచ్చారు. ‘సుఖ్నా లేక్ కో ఔర్ కిత్నా సుఖావొగే? (ఆ చెరువును ఇంకెంత ఎండబెడతారు?)’ అంటూ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ల్యాండ్ మాఫియా ఆ చెరువును చెరబట్టిందంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. నేతలు, అధికారులు కూడా వారితో చేతులు కలిపి చెరువును సర్వనాశనం చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుఖ్నా చెరువుకు సంబంధించి 1995 నుంచి పెండింగ్లోలో ఉన్న ప్రజాప్రయోజన వ్యాజ్యంపై న్యాయమూర్తులు, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీతో కూడిన సీజేఐ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. అడవులు, చెరువులకు సంబంధించిన కేసులు హైకోర్టులకు వెళ్లకుండా నేరుగా ఇలా సుప్రీం గడప తొక్కుతుండటం ఏమిటంటూ విస్మయం వెలిబుచ్చింది. -
మీడియా ముందు పోలీసులేం మాట్లాడాలో నిర్ణయించండి
న్యూఢిల్లీ: విచారణలో ఉన్న కేసుల వివరాలను ప్రజలు, మీడియా సమక్షంలో పోలీసులు ఏ మేరకు ప్రస్తావించాలో, ఏ అంశాలను మాత్రమే వెల్లడించాలో తెలిపే నియమావళిని రూపొందించాలని రాష్ట్రాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత మూడు నెలల్లోపు ఈ మేరకు నిబంధనావళిని తయారుచేయాలని జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం సూచించింది. ఈ మేరకు జనవరి 15వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులోని వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇంకా దర్యాప్తు కొనసాగుతున్న, విచారణ దశలో ఉన్న కేసులపై మీడియా ఎదుట పోలీసులు కీలక విషయాలతోపాటు అనవసర విషయాలనూ ప్రస్తావిస్తున్నారని, ఈ ధోరణికి అడ్డుకట్టవేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా రాష్ట్రాలకు కోర్టు సూచనలుచేసింది. ‘‘కోర్టుకు సహాయకుడు(అమికస్ క్యూరీ)గా వ్యవహరించిన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ కేంద్ర ప్రభుత్వం, విదేశాలు అవలంబిస్తున్న విధానాలకు అనుగుణంగా ‘పోలీస్ మాన్యువల్ ఫర్ మీడియా బ్రీఫింగ్’ను తయారుచేశారు. దీనిని మీరు ఒకసారి పరిశీలించండి. బాగుంటే దీనిని మీరూ అనుసరించండి. లేదంటే కొత్తగా మరోటి తయారుచేసుకోండి. కొత్త మాన్యువల్ను ఆ తర్వాత రెండు వారాల్లోపు వెబ్సైట్లో అప్లోడ్ చేయండి’’అని కోర్టు ఆదేశించింది. శంకరనారాయణన్ తయారుచేసిన ఈ 60 పేజీల మాన్యువల్లో నాలుగు భాగాలున్నాయి. దర్యాప్తుకు ఎలాంటి భంగం కల్గించకుండా, నష్టం వాటిల్లకుండా, కీలక అంశాలు బయటకు పొక్కకుండా, క్లుప్తంగా విషయాలను మీడియాకు పోలీసులు చెప్పొచ్చని మాన్యువల్ పేర్కొంది. -
సుప్రీంకోర్టు విచారిస్తుండగా... ఇక్కడ ఆదేశాలివ్వలేం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో ఒకే రోజు 40 కుక్కలు చంపారంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కుక్కలకు సంబంధించిన కేసులన్నింటిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరుపుతున్నందున ఇక్కడ విచారణ చేపట్టడం సబబు కాదని అభిప్రాయపడింది. ఈ పిటిషన్ను కూడా సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. హైదరాబాద్ శివార్లలోని సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ లోపల, చుట్టుపక్కల 40 వీధి కుక్కలను సామూహికంగా చంపిన ఘటనకు సంబంధించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరుతూ న్యాయవాది రిషిహాస్రెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వర్సిటీ లోపల, వెలుపల కుక్కలను బంధించి చంపుతున్నారు. నందిగామ మండలం తహసీల్దార్, మోడల్లకుడ గ్రామ పంచాయతీ సర్పంచ్, విశ్వవిద్యాలయ అధికారుల ఆదేశాల మేరకు కుక్కలను పట్టుకుని చంపారన్నారు. ఒకేరోజు దాదాపు 40 కుక్కల చంపిన బాధ్యులపై జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసేలా నందిగామ ఎస్హెచ్వోను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తే, విచారణ జరిపే వరకు కుక్కలను చంపకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కాగా 40 కుక్కలను చంపారనేందుకు సోషల్ మీడియా తప్ప ఇతర ఆధారాలున్నాయా అని జస్టిస్ మొహియుద్దీన్ ప్రశ్నించారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు, సిబ్బంది ఈ మరణాల గురించి తనకు తెలియజేశారని, గ్రామ పంచాయతీ అధికారులు కూడా దీనిని ధ్రువీకరించారని న్యాయవాది బదులిచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ పిల్లో లేవనెత్తిన సమస్యలు ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్న ‘వీధి కుక్కలకు సంబంధించిన సాధారణ సమస్యల’పరిధిలోకి వస్తాయని పేర్కొంది. పిటిషన్ను సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు రిజిస్ట్రీకి స్పష్టం చేసింది.జంతు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జంతు సంక్షేమ బోర్డును వీలైనంత త్వరగా పునర్నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. రాష్ట్రంలోని పెంపుడు జంతువుల దుకాణాలు, కుక్కల పెంపకం కేంద్రాలను అధికారులు తనిఖీ చేసి, చట్టప్రకారం నిర్వహించకుంటే చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ (ఇండియా) హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. జంతు సంక్షేమ చట్టాలకు అనుగుణంగా అన్ని పెంపుడు జంతువుల దుకాణాలు, కుక్కల పెంపకం కేంద్రాలను వెంటనే తనిఖీ చేయాలన్నారు. రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు పునర్నిర్మాణం కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బోర్డు మొదట 2019లో ఏర్పాటు చేశారని, దాని పదవీ కాలం 2022లో ముగిసిందన్నారు. చట్టాలు కఠినంగా అమలు కావాలంటే పర్యవేక్షణ కమిటీకి నాయకత్వం వహించడానికి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తిని నియమించాలన్నారు. 2025, జనవరిలో బోర్డుకు అనధికార సభ్యుల కోసం దరఖాస్తులు ఆహ్వానించినట్లు చెప్పిన ప్రభుత్వం తర్వాత ఆ మేరకు చర్యలు చేపట్టలేదన్నారు. జంతు సంక్షేమ బోర్డు పునర్నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ వైఖరిపై ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశామని, అదనపు అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఇప్పటివరకు బోర్డును ఏర్పాటు చేయకుంటే ఆ మేరకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది. -
వివేకా కేసు.. ఇంకో పదేళ్లు పడుతుందా?
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో సీబీఐ విచారణ కొసాగింపునకు ట్రయల్ కోర్టు పాక్షికంగా అనుమతివ్వడాన్ని సవాల్ చేస్తూ ఆయన కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించారు. ఈ క్రమంలో మంగళవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఇంకెంతకాలం సీబీఐ దర్యాప్తు కొనసాగించాలి?. మళ్లీ మినీ ట్రయల్ కోరుకుంటున్నారా?. ఇలా అయితే సీబీఐ దర్యాప్తు పూర్తయ్యేందుకు పదేళ్లు పడుతుంది’’ అంటూ జస్టిస్ సుందరేశ్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా.. సునీత పిటిషన్పై వైఖరి తెలియజేయాలని సీబీఐని కోరారు. అయితే.. తమ వైఖరి తెలియజేసేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరఫు న్యాయవాది కోరడంతో.. తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. సీబీఐ విచారణ అంశంపై నిర్ణయం తీసుకోవాలని హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టును గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. మూడు నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని ఆ సమయంలో జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే దీనిపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు.. కేవలం ఇద్దరి పాత్రపై మాత్రమే విచారణ జరపాలని పాక్షికంగా ఆదేశాలు ఇచ్చింది. తాము లేవనెత్తిన అంశాలకు విరుద్ధంగా పాక్షిక విచారణకు ట్రయల్ కోర్టు ఆదేశాలిచ్చిందని.. ధర్మాసనం ఇచ్చిన మార్గదర్శకాలను కూడా పట్టించుకోలేదని పిటిషన్ ద్వారా సునీత సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వివేకా కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు‘‘ఇంకెంతకాలం దర్యాప్తు కొనసాగించాలనుకుంటున్నారు. ఈ కేసులో మళ్ళీ మినీ ట్రయల్ కొనసాగించాలనుకుంటున్నారా?. ఇలాగైతే కేసు దర్యాప్తు పూర్తి కావడానికి మరో పదేళ్లు పడుతుంది. సిబీఐ ఈ విషయంలో తన వైఖరి తెలియజేయాలి. తదుపరి దర్యాప్తు అవసరం లేదనుకుంటే కేసు క్లోజ్ చేయండి. దీన్ని లాజికల్ ఎండ్కు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సీబీఐ వైఖరి ఆధారంగా ఈ కేసులో మేము నిర్ణయం తీసుకుంటాం. తదుపరి దర్యాప్తు కావాలనుకుంటే ఎంత మేరకు కావాలి ?. తదుపరి దర్యాప్తుకు అనుమతిస్తే బెయిల్ పై దాని ప్రభావం ఎలా ఉంటుంది. అన్ని అంశాలను మేము బ్యాలెన్స్ చేయాల్సి ఉంది. ఆ మేరకు ఆదేశాలను సవరించాల్సి ఉంటుంది’’ -
‘తాటాకు చప్పుళ్లకు భయపడం’
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ‘నిన్న సీఎం రేవంత్ రెడ్డి బావమరిది బాగోతాన్ని బయటపెట్టినందుకే సాయంత్రానికి తనకు నోటీసులు ఇచ్చారని ధ్వజమెత్తారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) హరీష్రావుకు నోటీసులు జారీ చేసింది. ఇవాళ జూబ్లీహిల్స్ పీఎస్లో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కోరింది. అయితే ఈ పరిణామంపై హరీష్ రావు తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘నిన్న రేవంత్ బావమరిది బాగోతాన్ని బయటపెట్టా. సాయంత్రం తొమ్మిదిగంటల సమయంలో హైదరాబాద్లోని నా నివాసంలో నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో నేను నా నియోజకవర్గం సిద్ధిపేటలో పలు కార్యాక్రమాల్లో పాల్గొన్నాను. అయినప్పటికీ.. చట్టం మీద గౌరవంతో హైదరాబాద్కు వచ్చా. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఈ తాటాకు చప్పుళ్లకు భయపడను. అక్రమాలు, బొగ్గు, భూస్కాం, హామీల అమలు విషయాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాను. వచ్చే మున్సిపల్ ఎన్నికలకు ముందే వీరి అవినీతి బయటపడుతుందని నాకు నోటీసులు ఇచ్చారు. నేను ఏ తప్పు చేయలేదు. ఈ నోటీసులు కొత్త కాదు. గతంలో నా మీద ఫోన్ టాపింగ్ కేసు పెడితే హై కోర్టు, సుప్రీం కోర్టులో కొట్టేశారు. అయినా మళ్ళీ పిలుస్తున్నారు. ఎన్ని రోజులు ఈ డ్రామా?’అని ప్రశ్నించారు. -
పండుగలప్పుడు ఛార్జీల పెంపా?
న్యూఢిల్లీ: పండుగల రద్దీని అవకాశంగా తీసుకుని విమాన ప్రయాణ ఛార్జీలను అమాంతంగా పెంచేయడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. చార్జీలను ఆకస్మిక పెంచి విమానయాన సంస్థలు సాగిస్తున్న దోపిడీపై జోక్యం చేసుకోక తప్పదని స్పష్టం చేసింది. ప్రైవేట్ విమానయాన సంస్థలు ఆకస్మికంగా పెంచుతున్న చార్జీలు, అదనపు రుసుములను నియంత్రించడానికి తగు మార్గదర్శకాలను రూపొందించాలంటూ దాఖలైన పిల్పై సోమవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘మేం ఈ విషయంలో కచ్చితంగా జోక్యం చేసుకుంటాం. కుంభమేళా, ఇతర పండగల సమయాల్లో ప్రయాణి కులను ఎలా దోచుకుందీ చూశాం. తాజాగా, ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్, జోథ్పూర్లకు చార్జీలను ఆకస్మికంగా పెంచేశారు’అని ధర్మాసనం పేర్కొంది. విమాన ప్రయాణ చార్జీల్లో పారదర్శకత, ప్రయాణికుల హక్కుల పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలంటూ సామాజిక కార్యకర్త లక్ష్మీనారాయణన్ వేసిన పిటిషన్పై గతేడాది నవంబర్ 17వ తేదీన విచారణ చేపట్టిన ధర్మాసనం..కేంద్రం, డీజీసీఏ తదితరులకు నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణ సందర్భంగా సమాధానం ఇచ్చేందుకు మరింత గడువు కావాలని కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ కౌశిక్ కోరడంతో ధర్మాసనం తదుపరి విచా రణను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేసింది. ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు గతంలో 25 కిలోల వరకు లగేజీని ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఉండగా ప్రైవేట్ విమానయాన సంస్థలు దాన్ని 15 కిలోలకు ఏకపక్షంగా తగ్గించి వేశాయని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రస్తుతం విమాన చార్జీలను, ఇతర అదనపు రుసుములను సమీక్షించేందుకు గానీ, గరిష్ట పరిమితిని నిర్ణయించేందుకు గానీ అధికారం ఏ వ్యవస్థకూ లేకపోవడంతో విమానయాన సంస్థలు వివిధ రూపాల్లో ప్రయాణికులను దోచుకుంటున్నాయని ఆరోపించారు. -
మద్యం అక్రమ కేసులో మోహిత్కు భారీ ఊరట
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ/తిరుపతి రూరల్: మద్యం అక్రమ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్సార్ సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిరవధికంగా పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆయనకిచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కేసులో అదనపు కౌంటర్ దాఖలు చేయాలనుకుంటే చేయవచ్చునంటూ సీఐడీ సిట్కి రెండు నెలల గడువునిచ్చింది. ఆ తరువాత ఆ అదనపు కౌంటర్కు సమాధానం ఇచ్చేందుకు మోహిత్కు నెల రోజుల సమయం ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్దేశపూర్వక జాప్యానికి తప్ప.. ఈ కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తీరును సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. మోహిత్ ముందస్తు బెయిల్ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయడానికి ఇప్పటికే నెలల తరబడి సమయం తీసుకున్న ప్రాసిక్యూషన్, ఇప్పుడు అదనంగా మరో రెండు నెలల సమయం కోరడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేసిన తర్వాత కూడా ‘ఇంకా పరిశీలించాల్సిన అంశాలు ఉన్నాయి‘ అని చెప్పడం విచారణను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడానికేనని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘మైదానంలో క్రీడాకారుడు ఎలాగైతే ఆటను సాగదీయాలని చూస్తాడో, ఇక్కడ ప్రాసిక్యూషన్ కూడా అదే పద్ధతిని అనుసరిస్తోంది.’ అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. కేవలం విచారణను కాలయాపన చేసేందుకే ప్రాసిక్యూషన్ పదేపదే వాయిదాలు, సమయం కోరుతోందని ధర్మాసనం తేల్చి చెప్పింది. కౌంటర్ దాఖలులో సిట్ జాప్యం మద్యం కేసులో 39వ నిందితునిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్రెడ్డి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో గత ఏడాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ గత ఏడాది అక్టోబర్ 7న తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మోహిత్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం మోహిత్రెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ అక్టోబర్ 10న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మోహిత్ ముందస్తు బెయిల్పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీ సిట్ను ఆదేశించింది. తదుపరి విచారణను గత ఏడాది డిసెంబర్ 1కి వాయిదా వేసింది. ఆ రోజున కేసు విచారణకు రాగా, కౌంటర్ దాఖలుకు సిట్ మరో నెల రోజుల సమయం కోరింది. దీంతో సుప్రీంకోర్టు కేసు విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. తాజాగా సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం, కౌంటర్ దాఖలు చేయడానికి సిట్ మరో రెండు నెలల సమయం కోరడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మోహిత్రెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తదుపరి ఉత్తుర్వులు జారీ చేసేంత వరకు పొడిగించింది. సిట్ కోరినట్లు కౌంటర్ దాఖలుకు రెండు నెలల సమయం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. అదే కేసులో కేటీఆర్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్తో మహేశ్వర్ రెడ్డి పిటిషన్ను జత చేయాలని సూచించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. గత వారం ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో చివరి ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ల విచారణను అసెంబ్లీ స్పీకర్ ఇంకా ముగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇదే చివరి అవకాశమని.. మిగిలిన అనర్హత పిటిషన్లపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనంటూ అల్టి మేటం జారీ చేసింది.ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి 8 వారాల గడువు ఇవ్వాలంటూ స్పీకర్ కార్యాలయం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. స్పీకర్ తీసుకోబోయే నిర్ణయాలతోపాటు ఇప్పటివరకు జరిగిన పురోగతిపై తదుపరి విచారణ నాటికి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఇరుపక్షాలు వాడీవేడిగా మిగతా వాదనలు వినిపించాయి.గడువు కోరిన ప్రభుత్వ న్యాయవాదులు బీఆర్ఎస్ నేతలు తమ పిటిషన్లలో ప్రతివాదులుగా పేర్కొన్న తెలంగాణ ప్రభుత్వం, స్పీకర్ కార్యాలయం తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, అభిషేక్ మను సింఘ్వీ, నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. ‘స్పీకర్ కంటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. రెండు రోజులపాటు ఆస్పత్రిలో ఉన్నారు. అలాగే అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కూడా మారారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అందువల్ల పిటిషన్ల విచారణలో జాప్యం జరిగింది. ఇప్పటికే కొన్ని అంశాలను పరిష్కరించాం. మరికొన్నింటిపై తీర్పును రిజర్వ్ చేశాం. మిగిలిన వాటిని పూర్తి చేయడానికి మరో 8 వారాల సమయం ఇవ్వండి’అని ముకుల్ రోహత్గీ ధర్మాసనాన్ని కోరారు. రెండు వారాల్లో పురోగతి చూపిస్తే నాలుగు వారాల సమయం ఇస్తామని చెబుతూ విచారణను వాయిదా వేసింది. -
సుప్రీం కోర్టులో వర్మకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: నోట్ల కట్టల వ్యవహారంలో.. జస్టిస్ యశ్వంత్వర్మకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తనను తొలగించాలని కోరుతూ వచ్చిన తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఆమోదించడంతోపాటు తనపై దర్యాప్తు కోసం ఏర్పాటుచేసిన పార్లమెంటరీ ప్యానల్ చట్టబద్ధతను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. గతేడాది మార్చిలో.. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా యశ్వంత్ వర్మ విధులు నిర్వహిస్తున్న టైంలో ఆయన అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఒక గదిలో పెద్దఎత్తున నోట్లకట్టలు లభ్యమయ్యాయి. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు తన వెబ్సైట్లో వీడియో, ఫొటోలతో సహా బయటపెట్టి సంచలనం సృష్టించింది. ఆపై ఈ అంశంపై దర్యాప్తునకు అంతర్గత త్రిసభ్య సంఘం ఏర్పాటు చేసింది. విచారణ జరిపిన కమిటీ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో పదవి నుంచి వైదొలగాల్సిందిగా సుప్రీంకోర్టు సూచించింది. కానీ, ఆయన దానికి అంగీకరించకపోవడంతో పార్లమెంటులో అభిశంసనకు ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలో.. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన జస్టిస్ వర్మకు అక్కడ మళ్లీ చుక్కెదురైంది. లోక్సభ స్పీకర్ జడ్జెస్ (Inquiry) Act, 1968 ప్రకారం కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటు చట్టబద్ధం కాదని వర్మ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. అయితే.. లోక్సభ సెక్రటేరియట్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ కమిటీ చట్టబద్ధమేనని కారణాలతో సహా వివరించారు. వాదనలు విన్న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం జనవరి 8వ తేదీన తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ జస్టిస్ వర్మ పిటిషన్ను తోసిపుచ్చుతూ తీర్పు ఇచ్చింది. -
తెలంగాణ స్పీకర్కు సుప్రీం కోర్టు అల్టిమేటం
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఉద్దేశించి సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఫిరాయింపుల వ్యవహారాన్ని తేల్చేందుకు తగిన సమయం ఇచ్చినా నిర్ణయం తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి అవకాశమని.. ఇకనైనా నిర్ణయం తీసుకోకుంటే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.ఫిరాయింపుల ఆరోపణలతో బీఆర్ఎస్ వేసిన పిటిషన్లను జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ఇప్పటికే ఏడుగురి విషయంలో స్పీకర్ ఓ నిర్ణయం తీసుకున్నారని స్పీకర్ తరఫున అభిషేక్ సంఘ్వీ వాదనలు వినిపించారు. మరో ముగ్గురిని విచారణ జరపాల్పి ఉందని నివేదించారు. ‘‘ఏడుగురు ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం తీసుకున్నాం. స్పీకర్కు కంటి సర్జరీ జరిగింది. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ మారారు. అందువల్ల విచారణ కొంత ఆలస్యమైంది. నాలుగు వారాల సమయం ఇవ్వండి విచారణ పూర్తి చేస్తాం’’ అని కోర్టుకు తెలిపారు. బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. ‘‘పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఒక ఎమ్మెల్యే ఏకంగా అధికార పార్టీ నుంచి పోటీ చేశారు. కానీ తాను పార్టీ మారలేదని అంటున్నారు. ఈ వాదనలో న్యాయమేమైనా ఉందా?. స్పీకర్ వారిని ఇప్పటికీ విచారించడం లేదు. మూడు నెలలకు పైగా గడిచిపోయాయి. ప్రతిసారి విచారణకు గడువు పెంచమని అడుగుతున్నారు’’ అని వాదించారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ తరఫు లాయర్ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది.. ‘‘ఇప్పటికే తగిన సమయం ఇచ్చాం.. ఈ పాటికే నిర్ణయం తీసుకోవాల్సి ఉండేది. ఇదే చివరి అవకాశం. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోండి. లేకుంటే పరిణామాలు ఉంటాయి’’ అని స్పీకర్కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మిగిలిన ఎమ్మెల్యేల విచారణను నాలుగు వారాల గడువు కావాలని సింఘ్వీ కోరారు. అయితే రెండు వారాల్లోపురోగతి చూపిస్తే.. నాలుగు వారాల సమయం ఇస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. తమ పార్టీ సింబల్పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, వాళ్లపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గత విచారణలో మూడు నెలల్లోపు స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. అయితే.. ఈ ఆదేశాలానుసారం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ పది మందిలో ఏడుగురిపై దాఖలైన పిటిషన్లను కొట్టేశారు. టెక్నికల్లీ వాళ్లు పార్టీ మారలేదని.. బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని తేల్చేశారు. ఇంక మిగిలిన ముగ్గురి భవితవ్యంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వివరణ ఆల్రెడీ ఇచ్చారు. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలైతే ఇంకా స్పీకర్ ఎదుట హాజరై కనీస వివరణ కూడా ఇచ్చుకోలేదు. తమకు గడువు ఇవ్వాలన్న విజ్ఞప్తులపైనా స్పీకర్ ఇప్పటిదాకా ఎలాంటి బదులు ఇవ్వకపోవడం గమనార్హం. ఈ తరుణంలో.. ఇప్పుడు సుప్రీం కోర్టు అల్టిమేటంతో ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించాల్సిన పరిస్థితి ఎదురైంది. -
స్పీకర్ కాదన్నారు.. ‘సుప్రీం’ ఏమంటుందో?
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. తమ పార్టీ సింబల్పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, వాళ్లపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గత విచారణలో మూడు నెలల్లోపు స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే.. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు ఆదేశాలానుసారం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారు. విచారణ జరిపి వాళ్ల నుంచి వివరణ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పది మందిలో ఏడుగురిపై దాఖలైన పిటిషన్లను కొట్టేశారు. టెక్నికల్లీ వాళ్లు పార్టీ మారలేదని.. బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని తేల్చేశారు. ఇంక మిగిలిన ముగ్గురి భవితవ్యంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వివరణ ఆల్రెడీ ఇచ్చారు. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలైతే ఇంకా స్పీకర్ ఎదుట హాజరై కనీస వివరణ కూడా ఇచ్చుకోలేదు. తమకు గడువు ఇవ్వాలన్న విజ్ఞప్తులపైనా స్పీకర్ ఇప్పటిదాకా ఎలాంటి బదులు ఇవ్వకపోవడం గమనార్హం. ఈ తరుణంలో.. శీతాకాల విడిది తర్వాత ఇవాళ ఫిరాయింపుల కేసు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం పిటిషన్ను విచారణ జరపనుంది. ఫిరాయింపుల పిటిషన్లు కొట్టేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ తరఫు లాయర్లు ఇవాళ్టి విచారణ సందర్భంగా వాదించే అవకాశం ఉంది. -
‘ఎవరు బతికి ఉండాలో? ఎవరు చనిపోవాలో చెప్పడానికి మనమెవరం’
ఢిల్లీ: 13 ఏళ్లుగా శాశ్వత అచేతనావస్థలో ఉన్న హరీష్ రాణాకు కారుణ్య మరణం ప్రసాదించాలని తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.పిటిషనర్ తరఫున న్యాయవాది రష్మి నందకుమార్ వాదనలు వినిపించారు. ‘19 ఏళ్ల వయసులో చండీగఢ్ యూనివర్సిటీ హాస్టల్ నాలుగో అంతస్తు నుంచి పడిన హరీష్ అప్పటి నుంచి కోలుకోలేదు. వందశాతం అచేతనావస్థలో ఉన్నందున కారుణ్య మరణం అనుమతించాలని కుటుంబం కోరుకుంటుంది’ అని తెలిపింది. వాదనలు విన్న ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసులో కారుణ్య మరణం అనే పదాన్ని ఉపయోగింలేదు. మేం నిత్యం ఎన్నో కేసులు విచారిస్తుంటాం. కానీ, ఇది చాలా సున్నితమైన అంశం మేమూ మనుషలమే. .. ‘ఎవరు బతికి ఉండాలో, ఎవరు చనిపోవాలో నిర్ణయించేందుకు మనం ఎవరం?’ అని వ్యాఖ్యానించింది.వాదనలు,అనంతరం సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తుది తీర్పును వెలువరించే ముందు పలు అంశాలను పరిశీలించనుంది. ఆ తర్వాతే తుది తీర్పు వెలవరించనుంది. Will Supreme Court allow euthanasia for man in coma for 13 years? Verdict todayIndia allows passive euthanasia ( withdrawing life support) recognising the right to die with dignity while active euthanasia remains illegal Parents of harsh have sought passive euthanasia from… pic.twitter.com/AfTaaQhrzj— Sneha Mordani (@snehamordani) January 15, 2026 -
ఇది సీరియస్ మ్యాటర్.. దీన్ని విచారించాలి
ఢిల్లీ: కోల్కతా ఐప్యాక్ కార్యాలయం ఘటన కేసుపై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. వాదనల సందర్భంగా టీఎంసీ ప్రభుత్వంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సంచలన ఆరోపణలకు దిగింది. మమత ఒక ప్లాన్ ప్రకారమే కథ నడిపిస్తున్నారని.. ఈడీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనల వినిపించారు. వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం దీనిని తీవ్రంగానే పరిగణించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.సీఎం హోదాలో ఉన్న మమతా బెనర్జీకి సోదాలు జరుగుతున్న టైంలో ఐ-ప్యాక్ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఏంటి?. ఆమె ఈడీ నుంచి కీలక డాక్యుమెంట్లు.. అధికారుల ఫోన్లను లాక్కున్నారు. ఆధారాలను దొంగింలించారు. ఆ సమయంలో యూనిఫాంలో ఉన్న పోలీసులు ఆమె వెంట ఉన్నారు. బెంగాల్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీని ధ్వంసం చేశారు. కోల్కతా హైకోర్టుకు బస్సులు ఏర్పాటు చేసి మరీ జనాల్ని తరలించారు. హైకోర్టలో మా తరఫు లాయర్ను వాదించకుండా అడ్డుకున్నారు. కోర్టు హాల్లో ఆయన మైక్ కట్ చేశారు అని సోలిసిటర్ జనరల్ వాదించారు. అయితే..సోదాలు జరిపేందుకు రెండేళ్లు ఎందుకు ఎదురు చూడాల్సి వచ్చిందని కోల్కతా ప్రభుత్వం కోర్టులో వాదనలు వినిపించింది. సరిగ్గా ఎన్నికల ముందే ఈ హడావిడి ఎందుకు? అని ప్రశ్నించింది. అయితే.. సోలిసిటర్ జనరల్ వాదనలను నిశితంగా విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోల్కతా హైకోర్టును జంతర్ మంతర్ చేశారా? అని వ్యాఖ్యానించింది. ఇది సీరియస్ మ్యాటర్.. దీన్ని విచారించాలి. కేసు మొత్తాన్ని సమగ్రంగా విచారణ జరపాలి అని అభిప్రాయపడింది.జనవరి 8వ తేదీన కోల్కతాలోని సాల్ట్లేక్ ప్రాంతంలో ఉన్న ఐ-ప్యాక్ కార్యాలయంతో పాటు ఢిల్లీలోని నాలుగు చోట్ల గురువారం ఉదయం ఏడు గంటల నుంచే ఏకకాలంలో ఈడీ సోదాలు చేసింది. కొన్ని హవాలా లావాదేవీలు, నగదు వ్యవహారాలు.. కోల్కతా ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ ద్వారా జరిగినట్లు నిర్దిష్ట ఆధారాలు ఉన్నాయని ఈడీ అంటోంది. బొగ్గు స్మగ్లింగ్ రాకెట్తో సంబంధం ఉన్న ఒక హవాలా ఆపరేటర్ ద్వారా ఐ-ప్యాక్కు చెందిన ‘ఇండియన్ పీఏసీ కన్సల్టింగ్ ప్రై.లి.’కు రూ.కోట్లలో లావాదేవీలు జరిగాయని ఈడీ వర్గాలు వెల్లడించాయి. అయితే.. సోదాల గురించి తెలిసిన వెంటనే జైన్ నివాసానికి మమత హుటాహుటిన చేరుకున్న సంగతి తెలిసిందే. రాజకీయ దురుద్దేశంతోనే ఈ సోదాలు జరిగాయని, ఇవి రాజ్యాంగ విరుద్ధమని దీదీ మండిపడ్డారు. అయితే ఈడీ తమ విధులకు ఆమె ఆటంకాలు కల్పించారని కోర్టును ఆశ్రయించగా.. మరోవైపు బీజేపీ రాజకీయంగానూ విమర్శలకు దిగింది. -
సుప్రీం కోర్టులో విజయ్ సినిమాకు భారీ ఎదురు దెబ్బ
తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్ విజయ్ నటించిన చివరి సినిమా ‘జన నాయగన్’(Jana nayagan) కి సుప్రీం కోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది. సెన్సార్ సర్టిఫికెట్ జారీకి స్టే విధించిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ సినిమా నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్ని విచారించకుండానే హైకోర్టు డివిజన్ బెంచ్కు తిరిగి పంపింది. ఈ నెల 20వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని మద్రాసు హైకోర్టుకు సూచించింది. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ బోర్డ్ (CBFC) సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో ఆలస్యమైంది. సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో, నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సినిమాకు వెంటనే సెన్సార్ సర్టిఫికెట్ను ఇవ్వాల్సిందిగా 9వ తేదీన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం సీబీఎఫ్సీని ఆదేశించింది. అనంతరం, కొద్ది గంటల్లోనే సీబీఎఫ్సీ వినతిపై స్పందించిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ తీర్పుపై మధ్యంతర స్టే విధించింది. దీంతో చిత్ర నిర్మాతలు ఈ నెల 12న సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. అయితే, సుప్రీం కోర్టు ఈ పిటిషన్ను ఎంటర్టైన్ చేయకుండా, హైకోర్టు డివిజన్ బెంచ్కు తిరిగి పంపింది. హైకోర్టు జనవరి 20లోపు ఫైనల్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. -
Harish Rana: హరీష్ భవిష్యత్తుపై దేశం కళ్లన్నీ సుప్రీం వైపే!
ఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నేడు కీలక తీర్పు వెలువరించనుంది. 13 ఏళ్లుగా జీవచ్ఛవంలా ఉన్న హరీష్ రాణాకు లైఫ్ సపోర్ట్ ఉపసంహరించాలా? కారుణ్య మరణానికి (పాసివ్ యూతనేషియా) అనుమతించాలా? అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ సుప్రీం లైఫ్ సపోర్ట్ చికిత్స ఉపసంహరణకు ఆమోదిస్తే.. 2018లో చట్టబద్దత తర్వాత మన దేశంలో పరోక్ష కారుణ్య మరణం జరిగిన మొదటి కేసు ఇది అవుతుంది.కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. ఆగస్టు 20,2013. రాఖీ పండుగ. చండీగఢ్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న హరీష్ తన హాస్టల్ నాలుగవ అంతస్తు బాల్కనీ నుంచి కింద పడ్డాడు.ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. వైకల్యం ఏర్పడింది. హరీష్కు చికిత్స చేసిన వైద్యుడు మొదట్లో అతను కళ్ళు తెరవలేకపోయాడని, అవయవాలను కదల్చలేకపోయాడని చెప్పాడు. అప్పటి నుండి, హరీష్ శాశ్వతంగా మంచానికే పరిమితమయ్యాడు.ఓ వైపు ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న హరీష్ రాణా కుటుంబ ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. హరీష్ రాణాకు ఇద్దరు తోబుట్టువులు. వారి సంరక్షణ కోసం ఢిల్లీలోని మహావీర్ ఎన్క్లేవ్లోని తమ ఇంటిని అమ్మేసి ఘజియాబాద్కు మకాం మార్చారు.రోజులు, నెలలు,సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ హరీష్ ఆరోగ్యం కుదట పడలేదు. దీంతో చేసేది లేక తమ ఆర్థిక స్థోమత దృష్ట్యా.. జూలై 2024లో కారుణ్య మరణం కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు హరీష్ వెంటిలేటర్పై ఆధారపడటం లేదని, కేవలం ట్రాకియోస్టమీ ట్యూబ్ (శ్వాస కోసం), గాస్ట్రోస్టమీ ట్యూబ్ (ఆహారం కోసం) వాడుతున్నాడని పేర్కొంది. ఫీడింగ్ ట్యూబ్ తొలగిస్తే ఆకలితో మరణం సంభవిస్తుందని, అది యాక్టివ్ యూతనేషియా అవుతుందని వ్యాఖ్యానించింది. తల్లిదండ్రుల అభ్యర్థనను తిరస్కరించింది. నవంబర్ 2024 అప్పటి సీజేఐ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్, హరీష్ పూర్తిగా లైఫ్ సపోర్ట్పై ఆధారపడటం లేదని పేర్కొంది. అయితే, కేంద్రం హరీష్ చికిత్స, వసతి కోసం ఏర్పాట్లు చేయాలని సూచించింది.డిసెంబర్ 2025 సుప్రీం కోర్టు ఆదేశాలతో కేంద్రం హరీష్కు చికిత్స అందిస్తుంది. ప్రైమరీ, సెకండరీ మెడికల్ బోర్డులు హరీష్ పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతుందని, కోలుకునే అవకాశం చాలా తక్కువేనని నివేదించాయి. మెడికల్ రిపోర్టులపై జస్టిస్ జేబీ పార్థీవాలా ధర్మాసనం.. ఇది చాలా బాధాకరమైన నివేదిక. హరీష్ను ఇలాగే ఉంచలేం’ అని అన్నారు.తీర్పును నేటికి (జనవరి16,2026) వాయిదా వేశారు. జనవరి 13న న్యాయమూర్తులు హరీష్ తల్లిదండ్రులను కలుసుకుని వారి వేదనను విన్నారు. ఇవాళ హరీష్ కేసులో తీర్పును వెలువరించనుంది. ఇది దేశంలో పాసివ్ యూతనేషియా చరిత్రలో కీలక మలుపు అవుతుంది. -
వీధికుక్కల బెడద తీరేదెలా?
మనిషికి ఎప్పుడు మచ్చికైనాయో, ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పలేం గానీ మహాభారత కాలం నుంచి శునకాల ప్రస్తావన ఉంది. ఆ కథాప్రారంభంలోనూ, ముగింపులోనూ అవి తారసపడతాయి. వీధి కుక్కల్ని అక్కున చేర్చుకుని, వాటికి ఆహారపానీయాలు అందించే వారూ, కుక్కల జోలికి ఎవరైనా పోతే ఆగ్రహించి కేసు పెట్టే జంతుప్రేమికులూ ఎప్పుడూ ఉన్నారు. కానీ ఈమధ్య అలాంటివారు ఏటికి ఎదురీదాల్సి వస్తోంది. గతంలో మాదిరి సానుభూతితో అర్థం చేసుకునేవారూ, ఆ సమస్యపై మౌనంగా ఉండిపోయేవారూ తగ్గారు. జంతు ప్రేమికుల్ని ఇరకాటంలో పెట్టేలా, వారిని సవాలు చేసేలా నిలదీస్తున్న వారి స్వరాలు కూడా వినిపిస్తున్నాయి. మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో వీధికుక్కల బెడదపై సాగుతున్న విచారణలో త్రిసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు సంధించిన ప్రశ్నలు ఆలోచించదగినవి. వీధికుక్కలపై ప్రేమతో వాటికి ఆహారం పెట్టే వారు తమ ఇళ్లకు తీసుకుపోయి ఆ పని ఎందుకు చేయరని ధర్మాసనం ప్రశ్నించింది. కేవలం కుక్కలపైనే అంతగా భావోద్వేగాలు ఎందుకుంటాయని అడిగింది. వీధికుక్కలు హఠాత్తుగా దాడి చేస్తే ఆ బాధ్యత ఎవరిదని నిలదీసింది.మనిషి పోయినచోటికల్లా, వారి ఆవాసాలున్న చోటల్లా సహజంగానే కుక్కలు వచ్చి చేరుతాయి. పాశ్చాత్య దేశాల్లో ఎక్కడా వీధి కుక్కల బెడద ఉండదు. వెనకబడిన దేశాల్లో మాత్రమే అవి మనుషులతో సహజీవనం సాగిస్తుంటాయి. కుక్కల జనాభా ఎంతో, అవి తామరతంపరగా పెరిగితే తలెత్తే సమస్యలేమిటో ప్రభుత్వాలు ఎప్పుడూ దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. 2023లో తొలిసారి యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) నిబంధనలు రూపొందాయి. వాటి అమలు బాధ్యత పురపాలక సంస్థలూ, పంచాయతీలదే! కానీ ఎక్కడా పట్టించుకోరు. అదేమని అడిగేవారూ లేరు. ఒక పసికందునో, రోడ్డున పోయే మరొకరినో దాడి చేసి కరిచినప్పుడూ... ప్రాణాలు కోల్పోయే స్థితి ఏర్పడినప్పుడూ మాత్రమే మీడియాలో ప్రముఖంగా వస్తుంది. ఆ వెంటనే ఒకటి రెండు రోజులు కుక్కల్ని బంధించే స్థానిక సంస్థల సిబ్బంది కనబడతారు. మళ్లీ మరొకటి జరిగేవరకూ అది మరుగునపడుతుంది.మనుషుల పట్ల కుక్కల ప్రవర్తనే వాటి విషయంలో ఏమేం చర్యలు తీసుకోవాలో చర్చించే సందర్భం కావటమే అసలు సమస్య. మహానగరాలు మొదలుకొని మారుమూల పల్లెటూళ్ల వరకూ అన్నిచోట్లా కుక్కలున్నప్పుడు వాటిపై ఒక విధానం అవసరమని, నియంత్రణలో పెట్టడం మంచిదని పాలకులకు తోచదు. మీడియాలో అతి ప్రచారం వల్లే ఈ సమస్య జటిలంగా కనిపిస్తున్నదని ఒక న్యాయవాది చేసిన వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు...’అని జర్నలిజంలో నానుడి ఉంది. అందుకైనా కాకపోయినా రేబిస్ మరణాల వల్లనో, కుక్కల కారణంగా ద్విచక్రవాహనదారుడు మరణించినప్పుడో, ఒక పసికందును నోట కరుచుకు పోయినప్పుడో మీడియాకు వార్తలవుతాయి. మామూలు కుక్కకాట్లు వార్తలకెక్కవు. దాదాపు పదిహేనేళ్ల క్రితం ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక మన వీధికుక్కల ప్రతాపంపై పెద్ద కథనం ప్రచురించింది. ఏటా లక్షలాదిమందిని అవి కరుస్తుంటాయని, వాటివల్ల ప్రతియేటా 20,000 మరణాలు సంభవిస్తాయని దాని సారాంశం. ‘పశ్చాత్తాపం ఏ కోశానా లేని ఈ శునకరూప హంతకులతో సహజీవనం ఎలా?’ అని వాపోయింది. రేబిస్ వ్యాధిగ్రస్థుల సంఖ్య ఆధారంగా వీధి కుక్కల గణాంకాలు కష్టమే. ఎందుకంటే ఇందులో పెంపుడు కుక్కల వల్ల వ్యాధిబారిన పడినవారూ ఉంటారు. ఏదేమైనా వీధి కుక్కల బెడద విషయంలో సుప్రీంకోర్టు ఉదాసీనంగా ఉండదల్చు కోలేదని ధర్మాసనం చేసిన వ్యాఖ్యల్నిబట్టి గ్రహించవచ్చు. వీధికుక్క కాటుకూ, అందువల్ల సంభవించే మరణానికీ మూల్యం చెల్లించక తప్పదని కేంద్రాన్నీ, రాష్ట్ర ప్రభుత్వాల్నీ ధర్మాసనం హెచ్చరించింది. వీధికుక్కలకు ఆహారం అందించేవారు సైతం వాటి దాడులకు బాధ్యులవుతారని తెలిపింది. సమస్య ఉన్న సంగతిని అందరూ అంగీకరిస్తున్నారు. కానీ పరిష్కారమే సాధ్యపడటం లేదు. ఏబీసీ నిబంధనలు అమలైతే ఇబ్బందే ఉండదని జంతు ప్రేమికుల వాదన. కానీ వాటిని అమలు చేయాల్సిందెవరు? అందుకు మూల్యం చెల్లిస్తున్నదెవరు? ఆలోచించాలి. -
వేర్వేరు తీర్పులు.. ఎటూ తేలని అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17-ఏ
సాక్షి, ఢిల్లీ: అవినీతి చట్టంలోని 'సెక్షన్ 17A' రాజ్యాంగ బద్ధతపై ఎటూ తేలలేదు. ఈ సెక్షన్ చెల్లుబాటుపై సుప్రీంకోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం వేర్వేరు తీర్పులు ఇచ్చింది. జస్టిస్ విశ్వనాథన్ ఈ సెక్షన్ను సమర్థించగా, జస్టిస్ నాగరత్న దీనిని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కొట్టిపారేశారు. ఇద్దరు న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో.. ఈ అంశాన్ని తగిన బెంచ్కు(స్పెషల్) బదిలీ చేసేందుకు భారత ప్రధాన న్యాయమూర్తికి నివేదించారు.ఆత్మాభిమానం గల వ్యక్తికి అపఖ్యాతి కంటే మరణమే మేలు. నేటి సాంకేతిక, సోషల్ మీడియా యుగంలో ఒకసారి పరువు పోతే, ఆ తర్వాత నిర్దోషిగా తేలినా ప్రయోజనం ఉండదు. అధికారులను వేధించకుండా ఉండేందుకు ఈ నిబంధన అవసరం. సెక్షన్ 17ఎ రాజ్యాంగబద్దమే. అయితే లోక్ పాల్ లేదంటే లోకాయుక్త అనుమతి ఉండాలి::జస్టిస్ విశ్వనాథన్ సెక్షన్ 17A అవినీతికి పాల్పడే అధికారులకు రక్షణ కల్పిస్తోంది. అవినీతికి పాల్పడే వారికి ఎలాంటి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. విచారణకు ముందస్తు అనుమతి అక్కర్లేదు::జస్టిస్ నాగరత్నసెక్షన్ 17 ఏ చెల్లుబాటును సవాల్ చేస్తూ సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్.. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ సెక్షన్ గురించి గతంలోనూ విచారణ జరిగింది. అంతెందుకు స్కిల్స్కాం కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు జరిపే అంశంలో ఈ సెక్షన్ కీలకంగా నిలిచిన సంగతి గుర్తుండే ఉంటుంది. 17A-చట్టం పూర్వాపరాలు…2018 లో అవినీతి నిరోధక యాక్టులో సవరణ చేస్తూ 17-A అనే కొత్త సెక్షన్ను చేర్చింది. నిజాయితీ పరులైన ప్రభుత్వ ఉద్యోగులకు కక్ష సాధింపు నుంచి తప్పించేందుకు చట్టం తీసుకువచ్చినట్లు ప్రకటించింది. అయితే..17A అనేది పూర్తిగా 2018 తరువాత కేసులకే వర్తిస్తుందని పార్లమెంటు స్పష్టం చేసంది. ఈ చట్టం ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు… ఉద్యోగ బాధ్యతలో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి నేరాల్లో ముందస్తు అనుమతి లేకుండా ఏ పోలీసు అధికారి సైతం విచారణ చేయడానికి వీలు లేదు.a) నేరము జరిగిన సమయములో సదరు వ్యక్తి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉండాలి(b) నేరము జరిగిన సమయములో సదరు వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉండాలి.(c) నేరము జరిగిన సమయంలో సదరు ఉద్యోగిని పదవి నుంచి తొలగించగల అధికారం ఉన్నవారి అనుమతి తర్వాతనే విచారణ ప్రారంభించాలి అయితే.. ►ఏసీబీ ట్రాప్తో పాటు సంఘటన స్థలంలోనే నేరం చేసిన ఉద్యోగిని అరెస్టు చేసిన సందర్భాలలో ఎలాంటి అనుమతి అవసరం లేదు. ►ప్రభుత్వ ఉద్యోగిపై విచారణ కోసం అనుమతి అడిగిన సమయంలో సదరు ఉన్నతాధికారి మూడు నెలల్లో తన నిర్ణయం వెల్లడించాలి. ఈ గడువు మరో నెలరోజులు పొడిగించే అవకాశం ఉంది.చంద్రబాబు కేసులో జరిగింది ఇదే.. స్కిల్ కేసులో నాడు(సెప్టెంబర్ 9, 2023) తనను గవర్నరు అనుమతి లేకుండా తనను అరెస్టు చేశారు గనుక అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ద్వారా రక్షణ కావాలని.. మొత్తం కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ను వేశారు. కాకపోతే స్కిల్ కుంభకోణం 2018కి ముందే జరగటం.. ఈ కేసులో పలు ఐపీసీ సెక్షన్లు కూడా ఉండటం వల్ల సెక్షన్ 17ఏ వర్తించదని చంద్రబాబు కేసులో సీఐడీ వాదించింది కూడా. చంద్రబాబుపై సెక్షన్ 13 (సీ),(డీ) కింద అభియోగాలు మోపారని, వాటిని తర్వాత రద్దు చేసినప్పటికీ, రద్దుకు ముందే నేరం జరిగిందని సీనియర్ న్యాయవాది రోహత్గీ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ‘సెక్షన్ 17ఏ జూలై 2018లో అమలులోకి వచ్చింది. నేరం 2015–2016 మధ్య జరిగింది. ఆ సమయంలో చట్టంలో సెక్షన్ 17ఏ లేదు. చట్ట సవరణకు ముందు కేసు కాబట్టి 17ఏ వర్తించదు. అలాగే.. చంద్రబాబు కేసుకు 17ఏ వర్తించదని నాలుగు హైకోర్టు తీర్పులు ఇచ్చాయి’ అని సుప్రీం కోర్టుకు గుర్తు చేశారు. ఇదిలా ఉండగానే.. ఏపీ సీఐడీ ఈ కేసులో ఆధారాల్లేవని చెప్పడంతో.. ఏసీబీ కోర్టు తాజాగా ఈ కేసును కొట్టేసిన సంగతి తెలిసిందే. -
సివిల్ దావా వేయండి
సాక్షి, న్యూఢిల్లీ: గోదావరిపై ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం–నల్లమలసాగర్ సహా ఇతర ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరం తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను ఆర్టీకల్ 32 (రిట్ పిటిషన్) కింద విచారించలేమని.. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలంటే అన్ని సాక్ష్యాధారాలతో కూడిన ‘సివిల్ సూట్’దాఖలు చేసుకోవాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు కొత్తగా దావా వేసుకోవడానికి స్వేచ్ఛనిస్తూ ప్రస్తుత పిటిషన్పై విచారణను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ముగించింది. దీంతో తెలంగాణ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. ఏపీ వాటా 484 టీఎంసీలే.. అంతకు మించి వాడకూడదు: సింఘ్వీ అంతకుముందు సాగిన విచారణలో ఆద్యంతం తెలంగాణ తరఫు న్యాయవాది సింఘ్వీ ఏపీ తీరుపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం గోదావరిలో ఏపీకి కేటాయించింది 484 టీఎంసీలే. అది వరద నీరైనా సరే అంతకుమించి వాడుకునే హక్కు ఆ రాష్ట్రానికి లేదు. కానీ ఏపీ ప్రభుత్వం 484 టీఎంసీలకు మించి నీటిని మళ్లించుకోవడం కోసం భారీ ఎత్తున ప్రాజెక్టులు నిర్మిస్తోంది. బచావత్ అవార్డు 1979–80 ప్రకారం వరద జలాల పేరుతోనైనా సరే దీనికి మించి ఒక్క చుక్క నీటిని మళ్లించినా అది చట్టవిరుద్ధమే. ఇది ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలకు, గోదావరి బోర్డు మార్గదర్శకాలకు విరుద్ధం’అని సింఘ్వీ బలమైన వాదనలు వినిపించారు. వాస్తవాలు తేలాల్సిందే: సీజేఐ సింఘ్వీ వాదనలను విన్న ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అంతర్రాష్ట్ర జల వివాదాల్లో ఆర్టీకల్ 32 కింద నేరుగా రిట్ పిటిషన్ను విచారించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ‘ఇది కేవలం చట్టపరమైన అంశం కాదు. క్షేత్రస్థాయి వాస్తవాలతో ముడిపడి ఉంది. ఎవరు ఎంత నీటిని వాడుతున్నారు? ప్రాజెక్టుల సామర్థ్యం ఎంత? అన్నది తేలాలి. సాక్షులను విచారించాలి. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక ప్రమేయం కూడా ఉంటుంది కాబట్టి రిట్ పిటిషన్ ద్వారా ఇది సాధ్యం కాదు. మీరు సివిల్ సూట్ దాఖలు చేయడమే సరైన మార్గం’అని ధర్మాసనం సూచించింది. అందుకు వీలుగా ప్రస్తుత పిటిషన్ను డిస్మిస్ చేస్తామని పేర్కొంది. దీనిపై సింఘ్వీ స్పందిస్తూ ‘ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అత్యంత సున్నితమైన రాజకీయ, జల వివాదం. డిస్మిస్ అనే పదం వాడితే మా వాదనలో పస లేకనే కోర్టు కొట్టేసిందన్నట్లుగా తప్పుడు సంకేతాలు వెళ్తాయి. దయచేసి ఆ పదాన్ని వాడొద్దు. పిటిషన్ను ఉపసంహరించుకుంటాం.. ‘డిస్పోజ్’చేసినట్లు ఉత్తర్వులివ్వండి’అని కోరారు. తెలంగాణ విజ్ఞప్తిని మన్నించిన ధర్మాసనం.. పిటిషన్ను డిస్మిస్ చేయకుండా ఉపసంహరణకు అనుమతిస్తూ ‘డిస్పోజ్’చేసింది. చట్టప్రకారం తగిన పరిష్కారం కోసం, లేవనెత్తిన అన్ని అభ్యంతరాలతో ‘సివిల్ సూట్’వేసుకునేందుకు తెలంగాణకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పిటిషన్లో లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను సివిల్ సూట్లోనూ ప్రస్తావించవచ్చని స్పష్టం చేసింది. -
25 ఏళ్లు జైల్లో ఉన్నట్లు ఎలా చెప్పగలిగారు?
న్యూఢిల్లీ: జైలులో 25 ఏళ్లు గడిపినందున విడుదల చేయాలంటూ గ్యాంగ్స్టర్ అబూసలేం పెట్టుకున్న అర్జీపై సుప్రీంకోర్టు సూటి ప్రశ్నను సంధించింది. వాదనను రుజువు చేసుకున్న పక్షంలో, జైలు నుంచి విముక్తి కలి్పస్తామని అతడికి స్పష్టం చేసింది. 1993 ముంబై పేలుళ్ల కేసులో దోషిగా ఉన్న అబూ సలేం పోర్చుగల్కు పారిపోయాడు. సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం భారత ప్రభుత్వం అతడిని 2005 నవంబర్ 11వ తేదీన తిరిగి తీసుకువచ్చింది. అప్పట్లో పోర్చుగల్ కోర్టు అతడి అప్పగింతకు కొన్ని షరతులను విధించింది. అందులో, అబూ సలేంకు మరణశిక్ష విధించరాదు, జైలు శిక్ష 25 ఏళ్లకు మించరాదనేవి కీలకంగా ఉన్నాయి. తన 25 ఏళ్ల జైలు శిక్ష పూర్తయిందని, విడుదల చేయాలంటూ అతడు వేసిన పిటిషన్పై సోమవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. 2005 నుంచి జైలులో ఉంటున్నప్పుడు 2026 నాటికి 25 ఏళ్లవుతాయని ఎలా లెక్కగట్టారు? అని ప్రశ్నించింది. పోర్చుగల్లో జైలులో ఉన్న రెండేళ్ల కాలాన్ని, స్రత్పవర్తనకు గాను శిక్ష తగ్గింపులను కలుపుకుంటే 25 ఏళ్లు అవుతాయని సలీం అంటున్నాడని అతడి లాయర్ చెప్పారు. అయితే, టాడా కింద అరెస్టయిన సలేంకు మహారాష్ట్ర చట్టాల ప్రకారం శిక్షాకాలంలో ఎటువంటి తగ్గింపు ఉండదని ధర్మాసనం పేర్కొనగా.. నిబంధనల కాపీని చూపిస్తామని సలేం న్యాయవాది తెలిపారు. సంబంధిత జైలు నిబంధనలతో రెండు వారాల్లోగా పిటిషన్ వేయాలని ఆదేశించిన ధర్మాసనం, తదుపరి విచారణను ఫిబ్రవరి 9వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ముంబైకి చెందిన బిల్డర్ ప్రదీప్ జైన్ హత్య కేసులో ప్రత్యేక టాడా కోర్టు సలేంకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ 2015లో తీర్పు ఇవ్వడం గమనార్హం. -
బెంగాల్లో మరో ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు ఈడీ
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెంగాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), టీఎంసీ ప్రభుత్వం మధ్య వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. బెంగాల్లో ఇటీవల ఐ-ప్యాక్ బొగ్గు కుంభకోణం కేసు దర్యాప్తును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఆర్టికల్ 32 పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఈ సందర్బంగా.. ఈడీ తన పిటిషన్లో ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తును కోరింది. నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా దర్యాప్తు చేసే హక్కును రాష్ట్ర యంత్రాంగం తగ్గించింది అని పేర్కొంది. అధికారులు చట్టబద్ధంగా సోదాలు నిర్వహించకుండా, బొగ్గు అక్రమ రవాణా దర్యాప్తునకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకోకుండా అడ్డుకున్నారని ఆరోపించింది. రాష్ట్ర సీనియర్ అధికారుల సమక్షంలో డాక్యుమెంట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను బలవంతంగా తీసుకున్నారని చెప్పుకొచ్చింది. పోలీసు సిబ్బందితో సహా రాష్ట్ర అధికారుల జోక్యం న్యాయాన్ని అడ్డుకోవడమేనని ఈడీ వివరించింది.ఇదిలా ఉండగా.. ఈడీ దాడుల వ్యవహారంపై బెంగాల్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై అంతకుముందే.. తమ వాదనలు వినకుండా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కావియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక, కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా గురువారం కోల్కతాలోని ఐప్యాక్ కార్యాలయం, ప్రతీక్ జైన్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా అక్కడికి చేరుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పోలీసుల సాయంతో ఆమె దర్యాప్తుకు ఆటంకం కలిగించారని, సాక్ష్యాలను మాయం చేశారని పేర్కొంటూ ఈడీ శుక్రవారం కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన హైకోర్టు.. జనవరి 14వ తేదీకి విచారణను వాయిదా వేసింది. -
టీనేజీ బంధాల రక్షణకు... రోమియో–జూలియట్ క్లాజ్
న్యూఢిల్లీ: బాలలను లైంగిక వేధింపుల బారినుంచి కాపాడేందుకు ఉద్దేశించిన పోక్సో చట్టం విచ్చలవిడిగా దురి్వనియోగం అవుతోందంటూ సుప్రీంకోర్టు ఆందోళన వెలిబుచ్చింది. దీనికి అడ్డుకట్ట వేసే దిశగా న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్సింగ్ ధర్మాసనం శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. నిజమైన టీనేజీ ప్రేమ బంధాలను దీని బారినుంచి కాపాడేందుకు చట్టానికి రోమియో–జూలియట్ క్లాజ్ను జోడించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అంతేకాదు, పోక్సో కేసుల్లో బెయిల్ దశలోనే బాధితుల వైద్యపరమైన వయసు నిర్ధారణకు హైకోర్టులు ఆదేశించజాలవని కూడా ధర్మాసనం స్పష్టం చేయడం విశేషం. ‘‘మా తీర్పు తాలూకు కాపీని కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శికి పంపండి. నిజమైన టీనేజీ ప్రేమలకు రక్షణగా నిలిచేలా పోక్సో చట్టానికి రోమియో–జూలియట్ క్లాజ్ను చేర్చడమే గాక ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని ప్రతీకారాలు తీర్చుకోజూసే వారిని శిక్షించే ఏర్పాటు కూడా చేయాల్సిందిగా సూచించండి’’అని సుప్రీంకోర్టు రిజి్రస్టార్ను ఆదేశించింది. ఓ మైనర్ రేప్ కేసులో నిందితునికి అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకున్న పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. -
Stray Dogs case : నటి షర్మిలకు సుప్రీం స్ట్రాంగ్ కౌంటర్
వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల బెడదను ఎదుర్కోనేందుకు అన్ని కుక్కల పట్ల ఒకే విధానాన్ని అనుసరించ డాన్ని వ్యతిరేకిస్తూ నటి షర్మిలా ఠాగూర్ చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆమె వాదనలు వాస్తవానికి పూర్తిగా దూరంగా ఉన్నాయని అభివర్ణించింది.ప్రజా ప్రదేశాలలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించడానికి ఇటీవల తీసుకున్న చర్యలు ఉత్తమమైన విధానం కాకపోవచ్చని షర్మిలా వాదించారు. తన వాదనలకు మద్దతుగా ఠాగూర్ కొన్ని ఉదాహరణలను కూడా ఇచ్చారు. వాస్తవదూరంగా ఆలోచిస్తున్నారు : సుప్రీంకొన్నేళ్లుగా ఎయిమ్స్లో స్నేహపూర్వకంగా ఉంటున్న కుక్క 'గోల్డీ' గురించి ఉదాహరించారు. కొన్ని కుక్కలను నిర్మూలించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది, అయితే దూకుడుగా ప్రవర్తించే వాటిని ముందుగా ఒక కమిటీ గుర్తించాల్సి ఉంటుందని, కుక్కల ప్రవర్తనను పరిశీలించేందుకు కమిటీ ఉండాలని, దూకుడుగా ఉండే కుక్కలకు, సాధారణ కుక్కలకు మధ్య తేడాను చూడాలంటూ షర్మిల తరపు న్యాయవాది వాదించారు. అలాగే వీధి కుక్కల సమస్యను పరిష్కరించడానికి సైన్స్ మనస్తత్వశాస్త్రం సహాయం అవసరమని ఠాగూర్ తన పిటిషన్లో అన్నారు. ABC నియమాలు ఫూల్ప్రూఫ్ కాకపోవచ్చు, కాబట్టి దీనిని పరిశీలించాల్సిన అవసరం ఉందని వాదించారు. వీటన్నింటినీ సుప్రీంకోర్టు ఒక్కొక్కటిగా ఖండించింది.ఆసుపత్రులలో కుక్కల్ని కీర్తించడానికి ప్రయత్నించవద్దు అంటూ సుప్రీం గట్టిగానే వాదించింది. ఆ కుక్కను ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లోకి కూడా తీసుకు వెళ్తున్నామా? వీధుల్లో తిరిగే ఏ కుక్కకైనా పేలు ఉంటాయి. అలాంటి వాటిని థియేటర్లలోకి అనుమతిస్తే ఇన్ఫెక్షన్లు, వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుంది. మీకు అర్థమవుతోందా? మీవాదనల వెనుకున్న వాస్తవికత ఏమిటో మే మీకు తెలియజేస్తాంఅంటూ మండిపడింది.ఇదీ దచవండి: అమ్మానాన్నల్ని ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిస్తే.. ఆ కిక్కే వేరప్పా!చెవులకు రంగులుమరోవైపు ప్రజలను కరిచిన కుక్కలను గుర్తించడానికి కాలర్ల (చెవులకు)కు రంగులు వేయాలని ఠాగూర్ తరపు న్యాయవాది సూచించారు. జార్జియా అర్మేనియా వంటి దేశాలలో ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని చెప్పారు. ఈ సూచనపైనా కూడా సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశాల జనాభా ఎంత? సుప్రీంకోర్టు ఆ వాదనను కూడా కొట్టిపారేసింది.సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కల్పించుకుని కమిటీలో నిపుణులు లేకుండా వచ్చిన ఆరావళి విషయంలో వచ్చిన తీర్పు ఉదహరించారు.. "న్యాయ జోక్యం అనేది ఖాళీలు ఉన్న అంతరాలలో మాత్రమే తప్ప, శాసనసభ ఉద్దేశపూర్వకంగా చట్టం చేయకూడద’’ని అనుకున్న విషయాల్లో కాదన్నారు.ఇదీ చదవండి: 498 ఏ, పొరిగింటి మహిళకు షాక్ : ఇలా కూడా కేసు పెట్టొచ్చా?దాడిచేసే వారి మీద కేసు పెట్టుకోండికుక్కలకు ఆహారాన్నదిస్తున్న మహిళలపై దాడులు, దుర్భాషలాడుతున్న వారి గురించి సీనియర్ న్యాయవాది మహాలక్ష్మి లేవనెత్తినప్పుడు, కూడా సుప్రీం ఇదే వ్యాఖ్యాచేసింది. ప్రజలు ఎవర్నైనా, ఎలా అయినా అవమానించవచ్చు. మమ్మల్ని కూడా అంటున్నారు. అలాంటి వాళ్లమీద చర్య తీసుకోండని సూచించింది. ఫీడర్ వ్యతిరేక విజిలెంట్స్" మహిళలపై దాడి చేస్తున్నారని, అధికారులు దాని గురించి మౌనంగా ఉన్నారని పావని ఆరోపించారు. ఇలాదేశవ్యాప్తంగా జరుగుతోందన్నారు. హర్యానాలో, సొసైటీలు బౌన్సర్లను నియమించుకుని మరీ దాడిచేస్తున్నాయన్నారు. దీనికి వీధి కుక్కల సమస్యలతో సంబంధం లేదని సుప్రీం స్పష్టం చేసింది. స్ట్రీట్ డాగ్స్ అంశంపై, సూచనలు ఉంటే, ఇవ్వవచ్చు అని చెబుతూ మహిళలపై దాడి చేస్తున్నవారిపై FIR దాఖలు చేయండి. హైకోర్టుకు వెళ్లండి అని సుప్రీంకోర్టు పేర్కొంది.వీధుల నుండి ప్రతి కుక్కను తొలగించాలని ఆదేశించలేదని, జంతువుల జనన నియంత్రణ (ABC) నిబంధనల ప్రకారం వీధి కుక్కలకు చికిత్స చేయాలని ఆదేశించిందని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. పబ్లిక్ ప్లేసెస్నుంచి కుక్కల్ని తొలగించడం వల్ల ప్రభుత్వానికి రూ.26,800 కోట్ల వరకు ఖర్చవుతుందని సుప్రీంకిచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఇదీ చదవండి: టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి -
రాజ్యసభ చైర్మన్గా డిప్యూటీ చైర్మన్ వ్యవహరించకూడదా?
న్యూఢిల్లీ: రాష్ట్రపతి లేనప్పుడు ఆయన విధులను ఉపరాష్ట్రపతి నిర్వహిస్తుండగా రాజ్యసభ చైర్మన్ లేని వేళ ఆయన అధికారాలను డిప్యూటీ చైర్మన్ ఎందుకు చలాయించరాదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తనపై రాజ్యసభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని డిప్యూటీ చైర్మన్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ వేసిన పిటిషన్పై గురువారం విచారణ చేపట్టిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎస్సీ శర్మల ధర్మాసనం పైవ్యాఖ్యలు చేసింది. తనపై వచి్చన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపే అధికారం పార్లమెంటరీ కమిటీకి లేదని జస్టిస్ వర్మ పేర్కొన్నారు. న్యాయమూర్తు(విచారణ)చట్టం–1968 ప్రకా రం.. స్పీకర్కు లేదా రాజ్యసభ చైర్మన్కు మాత్రమే న్యాయమూర్తిపై ప్రవేశపెట్టే తీర్మానాన్ని తిరస్కరించే– అనుమతించే అధికారం ఉంటుందని జస్టిస్ వర్మ తన పిటిషన్లో పేర్కొన్నారు. జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉండగా ఢిల్లీలోని ఆయన నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిన నోట్ల కట్టలు పెద్ద సంఖ్యలో బయటపడటం తీవ్ర సంచలనం రేపింది. ఈ పరిణామం అనంతరం ఆయన అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. గురువారం విచారణ సందర్భంగా జస్టిస్ వర్మ తరఫున సీనియర్ లాయర్లు ముకుల్ రొహత్గి, సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. చైర్మన్ లేని సమయంలో, ఆయనకున్న విచక్షణాధికారాలను డిప్యూటీ చైర్మన్ చలాయించలేరన్నారు. వాదనలు విన్న ధర్మాసనం అభ్యంతరాలపై వివరణ ఇవ్వాల్సిందిగా సంబంధిత పక్షాలను ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
కాలుష్యం కోరలు తీసేదెలా?
సంకల్పం ఉంటే దేన్నయినా సాధించవచ్చంటారు. అది కొరవడటం దేశ రాజధాని నగరానికి శాపంగా మారింది. కనుకనే కాలుష్యం అక్కడి నుంచి కదలనంటున్నది. ఈ సంగతి తెలిసే సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎం)ను తీవ్రంగా తప్పుబట్టింది. ప్రధాన కాలుష్య కారకాలను గుర్తించి, ఏయే పరమాణువులు ఏ మేరకు కారణమవుతున్నాయో, వాటిని అరికట్టడానికి ఏం చేయాలో చెప్పాలని కోరింది. మనం పీల్చే గాలితోపాటే నైట్రేట్లూ, సల్ఫేట్లూ, కర్బనాలు, కాడ్మియం, పాదరసం వంటి అత్యంత ప్రమాదకర పరమాణువులు ఊపిరితిత్తుల్లో ప్రవేశిస్తున్నాయి. నెత్తురుతోపాటే శరీరమంతటా ప్రవహిస్తున్నాయి. ఇవన్నీ గుండెపోటు, ఊపిరితిత్తుల క్యాన్సర్, నవజాత శిశు మరణాలూ తదితర దారుణాలకు కారణమవు తున్నాయి. అయినా అన్ని వ్యవస్థలూ కాలుష్యాన్ని ఆషామాషీగా తీసుకుంటున్నాయి. వివిధ అధ్యయనాలు చెబుతున్న దాన్నిబట్టి ఢిల్లీ వరకూ చూస్తే వాహనాల కాలుష్యమే అధికం. ఆ తర్వాత వరసగా పారిశ్రామిక ఉద్గారాలు, నిర్మాణరంగం వల్ల వెలువడే ధూళి, పంట వ్యర్థాలు తగలబెట్టినందువల్ల వచ్చే పొగ ఉంటాయి. కానీ నిర్దిష్టమైన డేటా లేనందువల్ల అరికట్టడం విషయంలో వెనకబడిపోతున్నాం.రెండు దశాబ్దాల క్రితం చైనా రాజధాని నగరం బీజింగ్ పరిస్థితి ఇదే. 2008లో బీజింగ్ ఒలింపిక్స్ జరుగుతున్న సందర్భంగా ఆ దేశం తొలిసారిగా కాలుష్యంపై రణభేరి మోగించింది. పలు తాత్కాలిక చర్యలు ప్రారంభించారు. అటుతర్వాత అయిదేళ్లపాటు అధ్యయనాలు నిర్వహించారు. వాటితోపాటే ప్రయోగాత్మకంగా వివిధ రకాల విధానాలు అమల్లోకి తెచ్చారు. ప్రధాన కాలుష్య కారకాలను గుర్తించారు. వాటి తీవ్రత ఆధారంగా వర్గీకరించారు. వాతావరణంలో అతి సూక్ష్మ ధూళి కణాల(పీఎం 2.5)ను సాధ్యమైనంత మేర తగ్గించాలని సంకల్పించారు. అటు తర్వాత 2013లో అయిదేళ్ల జాతీయ కార్యాచరణ పథకం రంగప్రవేశం చేసింది. బొగ్గు ఆధారిత బాయిలర్లను మూసివేయాలని నిర్ణయించటంతోపాటు ప్రజా రవాణా వ్యవస్థను అంచెలంచెలుగా మెరుగుపరిచారు. వివిధ పరిశోధనల ద్వారా కొత్త సాంకేతికతల్ని ఆవిష్కరించారు. హరిత ఇంధన వాడకమే వీటన్నిటి ధ్యేయం. కనుకనే అత్యంత కాలుష్య ప్రాంతాలుగా గుర్తించినవి కాస్తా నాలు గేళ్లలో గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ మెరుగుదల 35 శాతంపైగా ఉంది. మధ్యలో కరోనా మహమ్మారి విరుచుకుపడినా కాలుష్యంపై పోరు ఎక్కడా తగ్గలేదు. చైనా మాత్రమే కాదు... మనకన్నా బాగా వెనకబడిన ఫిలిప్పీన్స్, పెరూ, ఉరుగ్వే వంటి దేశాలు సైతం కాలుష్యాన్ని అరికట్టడంలో మెరుగైన విజయాలు సాధించాయి. ఒక్క ఢిల్లీ అనేమిటి... హైదరాబాద్ మొదలుకొని పది నగరాల వరకూ దాదాపు ప్రతిచోటా ఏడాది పొడవునా కాలుష్యం బుసలు కొడుతోంది. ఢిల్లీలో గురువారం సాయంత్రానికి వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) 328 (విపత్కరం)గా ఉన్నదని వెల్లడైందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో ఊహించుకోవచ్చు. 2022 జూలైలో సీఏక్యూఎం వెలువరించిన నివేదిక రవాణారంగం, పారిశ్రామిక ఉద్గారాలు, విద్యుత్ ప్లాంట్లు, వ్యర్థాల్ని తగలబెట్టడం, నిర్మాణరంగ పనుల వల్ల వెలువడే ధూళి వగైరాలు ప్రధానంగా కాలుష్యానికి కారణమవుతున్నాయని గుర్తించింది. కానీ వాటిని అరికట్టడానికి లేదా వాటి తీవ్రత తగ్గించటానికి జరిగిన కృషేమీ లేదు. ఈ విషయంలో తీసుకోవాల్సిన చర్యలేమిటో సూచించాలంటూ గత నెల 17న సీఏక్యూఎంను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పుడు మళ్లీ మరోసారి చెప్పాల్సివచ్చింది. సీఏక్యూఎం ఒక్కటే దీన్ని సాధించటం సాధ్యంకాదు. అన్ని విభాగాలూ కలిస్తేనే సమస్యపై పోరాడటానికి వీలవుతుంది. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సీఏక్యూఎం పర్యవేక్షణలో ట్రాఫిక్ పోలీస్, రవాణా విభాగం, మున్సిపాలిటీలు, కాలుష్య నియంత్రణ సంస్థలు సమన్వయంతో పనిచేసేలా నిర్దిష్టమైన విధానం రూపొందించాలి. పకడ్బందీ కార్యాచరణ ఉండాలి. పొరుగునున్న చైనా నిర్దిష్టమైన కాలపరిమితి పెట్టుకుని లక్ష్యాన్ని సాధించగలిగినప్పుడు... మనకన్నా వెనకబడిన దేశాలు సైతం చేసి చూపిస్తున్నప్పుడు మనం ఎందుకు విఫలమవుతున్నామని ప్రశ్నించుకోవాలి. ఎక్కడ లోటుపాట్లున్నాయో సమీక్షించుకుని సరిచేసుకోవాలి. -
అవినీతి నిరోధక చట్టం కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాలు
-
మగవాళ్ల మూడ్.. నటి వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం
వీధికుక్కల కేసు విచారణలో.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తున్నది తెలిసిందే. అయితే కోర్టు వ్యాఖ్యల ఆధారంగా ప్రముఖ నటి, మాజీ ఎంపీ రమ్య(దివ్య స్పందన) చేసిన ఓ పోస్ట్పై నెటిజన్స్ భగ్గుమంటున్నారు. కుక్కలను.. మగవాళ్లకు ముడిపెట్టి ఆ పోస్ట్ ఉండడమే అందుకు కారణం. వీధి కుక్కల అంశంపై మరోసారి విచారణ జరుపుతున్న సర్వోన్నత న్యాయస్థానం.. వీధి కుక్కలను(Dogs) వాటి ప్రవర్తన ఆధారంగా వర్గీకరించడం సాధ్యం కాదంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే ‘‘ఫలానా కుక్క కాటేస్తుంది.. ఫలానాది కాటేయదు అని వీధుల్లో తిరిగే కుక్కలను చూసి ముందుగా తెలుసుకోవడం సాధ్యం కాదు. వీధి కుక్కల మూడ్ ను ఎవరు అర్థం చేసుకోలేరు’’ అంటూ బుధవారం విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై రమ్య తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ చేశారు. ‘మరి మగవాళ్ల మైండ్ను కూడా చదవలేం. వాళ్ళు ఎప్పుడు లైంగికదాడి చేస్తారో.. ఎప్పుడు హత్య చేస్తారో తెలియదు. కాబట్టి వాళ్లందరినీ జైలులో పెట్టాలా?’ అని ఇన్స్టాలో ఓ పోస్టు చేశారు. దీంతో కుక్కలతో పోలుస్తావా? అంటూ కొందరు పురుషులు నటి రమ్యపై భగ్గుమంటున్నారు. ఆమె క్షమాపణలు చెప్పేదాకా ఊరుకునేది లేదని.. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. కన్నడ నటి రమ్య అలియాస్ దివ్య స్పందనకు శాండల్వుడ్ క్వీన్గా పేరుంది. ఆమె తెలుగు, తమిళ్ భాషల్లోనూ నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లో చేరారు. కాంగ్రెస్ తరఫున 2013 మాండ్య లోక్సభ ఉప ఎన్నికల్లో నెగ్గి ఎంపీ అయ్యారు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. యువతలో ఆమెకు ఉన్న క్రేజ్ గుర్తించి.. రాహుల్ గాంధీ ఆమెకు సోషల్ మీడియా వింగ్ను అప్పగించారు. ఈ క్రమంలోనే తరచూ పలు అంశాలపై స్పందిస్తూ వస్తున్నారు. కన్నడనాట సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో స్టార్ నటుడు దర్శన్ నిందితుడిగా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కన్నడ సినీ పరిశ్రమ మౌనంగా ఉండిపోయింది. అయితే.. ఎంతటి వారైనా చేసినదానికి ఫలితం అనుభవించాల్సిందే అంటూ రమ్య స్పందించడంతో దర్శన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఆమెను రేప్ చేస్తామని, చంపుతామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులకు దిగారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. -
‘దర్యాప్తు జరగాల్సిందే.. ఎఫ్ఐఆర్లు కొట్టేయడం కుదరదు’
సాక్షి, ఢిల్లీ: అవినీతి నిరోధక చట్టం కేసులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఏపీ ఏసీబీ (సీఐయూ) నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం గురువారం కొట్టేసింది. రద్దు చేసిన ఆ ఎఫ్ఐఆర్లపై ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్కు నోటిఫైడ్ పోలీస్ స్టేషన్ హోదా లేదని గంపగుత్తగా ఎఫ్ఐఆర్లను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో ఏసీబి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ)విజయవాడ నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్లపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈ ఎఫ్ఐఆర్లపై ఆరు నెలల్లో తుది నివేదిక సమర్పించాలని కోరింది.అలాగే, ప్రతివాదులను అరెస్ట్ చేయవద్దని ఏసీబీని ఆదేశిస్తూనే.. దర్యాప్తు పూర్తయ్యేందుకు సహకరించాలని ప్రతివాదులకు సూచించిఇంది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లపై, పెండింగ్లో ఉన్న దర్యాప్తులపై ఎలాంటి పిటిషన్లను హైకోర్టు స్వీకరించవద్దు అని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత చట్టాలను మార్చకుంటే పాత చట్టాలు అమల్లో ఉన్నట్లేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, గతంలోనే అవినీతి నిరోధక చట్టం కింద పలువురిపై ఏసీబీ సీఐయూ.. ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. -
కుక్కల కంటే పిలుల్ని పెంచుకోండి
సాక్షి, ఢిల్లీ: వీధి కుక్కల కేసు విచారణ ఇవాళ ఎటు నుంచి ఎటో పోయింది. ఈ కేసు విచారణ సందర్భంగా గురువారం సుప్రీం కోర్టులో పిల్లుల ప్రస్తావన కూడా వచ్చింది. అలాగే వీధుల్లోని అన్ని కుక్కలను తరలించమని తాము ఆదేశించలేదని.. కేవలం సంస్థలు, కార్యాలయాల నుండి మాత్రమే తరలించమన్నామని స్పష్టం చేసింది. జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన బెంచ్ ఈ కేసును విచారించింది. ‘‘కుక్కలను పెంచుకునే కంటే పిల్లుల్ని పెంచుకోండి. ఎలుకల్ని నియంత్రించడంలో పిల్లులు సహాయ పడుతాయి. కాబట్టి కుక్కలను పెంచే కంటే పిల్లులను పెంచుకోవడానికి ప్రోత్సహించాలి’’ అని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. అలాగే.. వీధి కుక్కల తొలగింపు విషయంలో నియమాలను పాటించాల్సిందేనని మరోమారు స్పష్టం చేసింది.విచారణలో భాగంగా.. పట్టణాల్లో జంతువుల నియంత్రణ అంశంపై వాదిస్తూ సీనియర్ అడ్వొకేట్ సీయూ సింగ్(యానిమల వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ తరఫున) కుక్కల అంశంతో పాటు ఎలుకలు, పిల్లుల గురించి ప్రస్తావించారు. కుక్కలు లేకపోతే ఎలుకలు, కోతుల సమస్య పెరుగుతుందని వాదించారు. దీనిపై స్పందించిన జస్టిస్ సందీప్ మెహతా.. కుక్కలు, పిల్లులు పరస్పరం శత్రువులు. పిల్లులు, ఎలుకలు బద్ధ శత్రువులు. వీధుల్లో కుక్కల సంఖ్య తగ్గితే.. పిల్లుల సంఖ్య పెరుగుతుంది. అప్పుడవి ఎలుకలను తింటాయి కదా” అని జస్టిస్ మెహతా సరదాగా వ్యాఖ్యానించారు. వీధి కుక్కల దాడుల వ్యవహారంలో సుప్రీం కోర్టు సుమోటో విచారణ కొనసాగుతోంది. సీనియర్ అడ్వొకేట్ సీయూ సింగ్ వాదిస్తూ.. ఏబీసీ (Animal Birth Control) నియమాలు అమలు చేయడం.. స్టెరిలైజేషన్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టడం.. సరైందని వాదించారు. పెద్ద సంఖ్యలో కుక్కలను షెల్టర్లలో ఉంచితే ఇతర వ్యాధులు వ్యాప్తి చెందుతాయని హెచ్చరించారు.సీనియర్ అడ్వకేట్ కృష్ణన్ వేణుగోపాల్ వాదిస్తూ.. దేశవ్యాప్తంగా ABC అమలు చేయడానికి రూ.1,600 కోట్లు అవసరమని, ఐదు మంత్రిత్వ శాఖలు కలసి పని చేయాలని సూచించారు. అయితే.. ప్రస్తుతం కేవలం 66 ABC కేంద్రాలు మాత్రమే ఉన్నాయని.. దేశవ్యాప్తంగా 5.2 కోట్ల వీధికుక్కలన్నాయనే అంచనాలున్నాయని, అదే సమయంలో వెటర్నరీ డాక్టర్లకు పెద్ద స్థాయిలో శిక్షణ అవసరమని పేర్కొన్నారు.బీజేపీ నేత విజయ్ గోయల్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ABC నియమాలు కుక్కల జనాభాను తగ్గించడానికి రూపొందించబడ్డాయని చెప్పారు. హింసాత్మక కుక్క(violent dog) అనే పదానికి నిర్వచనం స్పష్టంగా లేదని, ఢిల్లీలో ఒకే కుక్క వరుసగా ముగ్గురిని కరిచిన ఉదాహరణను చూపించారు. తమ హెల్ప్లైన్కు ఇప్పటివరకు 20,000 పైగా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.కోర్టు ఆందోళనదేశవ్యాప్తంగా కుక్కల దాడులు పెరుగుతున్నాయి అని కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. - మున్సిపల్ సంస్థలు, స్థానిక సంస్థలు ABC నియమాలను సరిగా అమలు చేయడంలో విఫలమయ్యాయని పేర్కొంది. వీధుల్లో జంతువుల ఉనికి రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతోందని గమనించినట్లు తెలిపింది. తదుపరి వాదనలు రేపు కూడా జరగనున్నాయి. -
5.25 కోట్ల కుక్కలు, రోజుకు రూ. 61.81 కోట్లు
న్యూఢిల్లీ: వీధికుక్కల అంశంలో వ్యతిరేక, అనుకూల వాదనలతో దాఖలైన పిటీషన్లను సుప్రీంకోర్టు బుధవారం విచారిస్తోంది. విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్.వి. అంజారియాతో కూడిన ధర్మాసనం జాతీయ రహదారులపై కలిగే భద్రతాపరమైన ఆందోళనలను ప్రస్తావించింది. ఈ సందర్భంంగా సీనియర్ న్యాయవాది, NALSAR హైదరాబాద్ తరపున వాదించిన KK వేణుగోపాల్ కీలక వ్యాఖలు చేశారు. యూనివర్శిటీ జంతు న్యాయ కేంద్రం జంతు సంరక్షణలో మాస్టర్స్ కోర్సు , PG డిప్లొమాను నిర్వహిస్తుందని, హార్వర్డ్ విశ్వవిద్యాలయంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కలిగి ఉందని కోర్టుకు తెలిపారు. అతని బృందం దేశవ్యాప్తంగా కుక్కల జనాభా, ఆశ్రయ అవసరాలతో సహా గతంలో సమర్పించని గణాంకాలను వెలికితీసింది, మౌలిక సదుపాయాలు మరియు నిధులలో అంతరాలను ప్రస్తావించారు.నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలిచట్టబద్ధమైన నియమాలను సవరించే వరకు లేదా పక్కన పెట్టే వరకు, సుప్రీంకోర్టు వాటిని విస్మరించలేదని వేణుగోపాల్ నొక్కిచెప్పారు. దీర్ఘకాలంగా ఉన్న పద్ధతులను మార్చే ముందు నిపుణుల సలహా అవసర మన్నారు. ABC నియమాలు, ఇతర చట్టబద్ధ నియమాలను పాటించడం ప్రాధాన్యంగా ఉండాలన్నారు.ఈ విషయంలో కోర్టుకు మార్గనిర్దేశం చేయడానికి విజయవంతమైన రాష్ట్రాల నుండి పశుసంవర్ధక శాఖల అధిపతులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని వేణుగోపాల్ సమర్పించారు. ప్రస్తుత చట్టం ప్రకారం వీధి కుక్కలను వాటి అసలు స్థానాలకు తిరిగి ఇవ్వాలని, మరియు అదే స్థలంలో విడుదల చేయడాన్ని నిరోధించే ప్రస్తుత ఉత్తర్వు చట్టబద్ధమైన నియమాలను ఉల్లంఘిస్తుందని ఆయన వాదించారు.వేణుగోపాల్ పాఠశాలల్లోని సదుపాయల లేమిని వేణుగోపాల్ ఎత్తిచూపారు, 194,412 పాఠశాలల్లో విద్యుత్, సరైన మరుగుదొడ్లు , తాగునీరు లాంటి కనీససౌకర్యాలు లేవని నివేదించారు. కుక్కలను నిరోధించేందుకు కంచెలు నిర్మించమని వీటిని కోరడం అవాస్తవికమని ఆయన వాదించారు. సౌకర్యాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కుక్కల నిర్వహణ ప్రోటోకాల్లను అమలు చేయడంలో ఉన్న సవాళ్లకు ఇది నిదర్శనమన్నారు.5.25 కోట్ల వీధి కుక్కలుభారతదేశంలో దాదాపు 5.25 కోట్ల వీధి కుక్కలు ఉన్నాయని వేణుగోపాల్ ధర్మాసనానికి తెలియజేశారు. ఒక్కో సౌకర్యానికి 200 కుక్కల చొప్పున వాటిని ఉంచడానికి, 77,347 షెల్టర్లు అవసరమవుతాయి, ఒక్కొక్కటి ఒక్కో కుక్కకు 40 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. ఒక కుక్కకు ఆహారం ఇవ్వడానికి రోజుకు రూ.40 ఖర్చవుతుందని, అంటే 1.54 కోట్ల కుక్కలకు ఆహారం ఇవ్వడానికి రోజుకు రూ.61.81 కోట్లు అవసరమవుతుందని, ఇది సమస్య యొక్క స్థాయిని వివరిస్తుందని ఆయన అన్నారు.ఇదీ చదవండి: కుక్క కరిచే మూడ్లో ఉందని ఎలా తెలుస్తుంది : సుప్రీంకోర్టు -
కుక్క కరిచే మూడ్లో ఉందని ఎలా తెలుస్తుంది : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వీధి శునకాలకు సంబంధించిన విచారణలో సుప్రీంకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది.ఈ సమస్య కుక్క కాటుకు మాత్రమే పరిమితం కాదని ధర్మాసనం పేర్కొంది. సైకిళ్ళు , మోటార్ సైకిళ్లపై ప్రజలను వెంబడించే కుక్కలు సమానంగా ప్రమాదకరమని , తీవ్రమైన రోడ్డు ప్రమాదాలకు దారితీయవచ్చని పేర్కొంది. వీధి కుక్కలను తొలగించడంపై అభ్యంతరంపై బెంచ్ స్పష్టత కోరింది. ఈ అంశాన్ని మరింత నొక్కి చెబుతూ, సంస్థాగత ప్రాంతాల నుండి వీధి కుక్కలను తొలగించడంలో ఉన్న వ్యతిరేకతను వివరించాలని బెంచ్ న్యాయవాదిని కోరింది. కుక్క కరిచే మూడ్లో ఉన్నప్పుడు దాని మనసులో ఏముందో మనం చదవలేం కదా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అందుకేనివారణే ఉత్తమమైన మార్గమని, అయితే కుక్కలను కాల్చి చంపాలని సూచించడం లేదని, వాటిని ఆశ్రయాలకు మార్చాలని బెంచ్ నొక్కి చెప్పింది. మున్సిపల్ సంస్థలు జంతు జనన నియంత్రణ నియమాలను కఠినంగా అమలు చేయడం వల్ల పర్యవేక్షణతో క్రమంగా సంఖ్యలు తగ్గుతాయని కూడా పేర్కొంది. లక్షలాది కుక్కలకు ఆహారం ఇవ్వడం యొక్క సాధ్యాసాధ్యాలను బెంచ్ ప్రశ్నించింది.అలాగే ABC (యానిమల్ బర్త్ కంట్రోల్) నియమాలు , చట్టాలను పాటించేలా చూడటం కోర్టు పాత్ర అనిజస్టిస్ విక్రమ్ నాథ్ స్పష్టం చేశారు. పాటించని రాష్ట్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.దీనిపై తన వాదనను వినిపిస్తూ కుక్కలను తొలగించడం వల్ల పట్టణ సమస్యలు మరింత తీవ్రమవుతాయని, భారతదేశం వంటి దేశంలో చెత్త డంపింగ్, మురికివాడలు విస్తృతంగా ఉన్న చోట, వీధి కుక్కలను తొలగించడం వల్ల ఇప్పటికే ఉన్న సమస్యలు మరింత తీవ్రమవుతాయని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ హెచ్చరించారు. పట్టణ పర్యావరణ వ్యవస్థలలో కుక్కలు పాత్ర పోషిస్తాయని మరియు ఆకస్మిక తొలగింపు ఊహించని పరిణామాలను సృష్టించవచ్చని ఆయన వాదించారు ABC, CSVR (వంధ్యీకరణ–టీకాలు వేయడం,విడిచిపెట్టడం) లాంటి చర్యల ద్వారా వీటి సంఖ్యన పరిమితం చేయవచ్చని కూడా సిబల్ ప్రతిపాదించారు. దీన్ని విజయవంతంగా పరీక్షించారనీ, కుక్కల్ని నిర్మూలించడం కాకుండా, వాటి జనాభాను నియంత్రించాలన్నారు. అలాగే వీధి కుక్కలను షెల్టర్లలోకి మార్చడం శారీరకంగా అసాధ్యం, ఆర్థికంగా అసాధ్యమైనదని సిబల్ సుప్రీంకు తెలిపారు. ప్రత్యామ్నాయాలను అన్వేషించడానికి శాస్త్రవేత్తలు మరియు డొమైన్ నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని సిబల్ సుప్రీంకోర్టును కోరారు. వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి.కాగా తమ వద్ద విచారణలో ఉన్న కేసుకు అనుబంధంగా కుప్పలుతెప్పలుగా అనుబంధ పిటిషన్లు, దరఖాస్తులు వచ్చిపడుతున్నాయని సుప్రీం వెల్లడించింది. సాధారణంగా చూస్తే మనుషులకు సంబంధించిన ఏ కేసులో కూడా ఇన్ని అప్లికేషన్లు రాలేదేమో. కుక్కల విషయంలో పిటిషన్లు పోటెత్తు తున్నాయి. ఇలాంటి అప్లికేషన్లు బుధవారం కూడా వస్తాయేమో. అన్నీ కలిపి బుధవారమే కేసును విచారిస్తాం’’ అని సుప్రీంకోర్టు వెల్లడించింది. వీధి శునకాలకు సంబంధించిన కేసును జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనం విచారిస్తోంది. -
పీఎఫ్ వేతన పరిమితి పెంపుపై
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి పథకం (ఈపీఎఫ్ఓ) పథకం లబ్ధిదారుల అర్హతకు సంబంధించిన గరిష్ట వేతన పరిమితిని పెంచడంపై నాలుగు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. నెలవారీ వేతనం రూ.15 వేలకు మించిన వారికి పీఎఫ్ పథకం వర్తించదన్నది తెలిసిందే. దీన్ని గత 11 ఏళ్లుగా సవరించకపోవడాన్ని ప్రశ్నిస్తూ నవీన్ ప్రకాశ్ నౌటియాల్ అనే సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నెలవారీ వేతనం 15 వేలకు మించితే పీఎఫ్ ప్రయోజనాలు దక్కకపోవడం దారుణమని ఆయన ఆరోపించారు. కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన కనీస నెలవారీ వేతన మొత్తమే రూ.15 వేలకు మించి ఉందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో 15 వేల పరిమితి వల్ల పీఎఫ్ పథకం తాలూకు సామా జిక సంక్షేమ ఫలాలు చాలామంది అర్హులైన చిరుద్యోగులకు అందకుండా పోతున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. దాంతో, పీఎఫ్ వేతన పరిమితి పెంపుపై 4 నెలల్లో కేంద్రం నిర్ణయం తీసుకోవాలంటూ న్యాయ మూ ర్తులు జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ ఎ.ఎస్.చందూర్కర్ ధర్మాసనం సోమ వారం తీర్పు వెలువరించింది. తమ తీర్పు కాపీని జత పరు స్తూ రెండు వారాల్లోగా కేంద్రానికి విన తిపత్రం ఇవ్వాల్సిందిగా పిటిషనర్కు సూచించింది.ఉపసంఘమే చెప్పినా: పీఎఫ్ పథకం లబ్ధిదారుల గరిష్ట వేతన పరిమితి పెంపుపై నిర్దిష్ట నియమ నిబంధనలేవీ లేవు. దాంతో దాని సవరణ విషయంలో ఒక క్రమమంటూ లేకుండా పోయింది. ఒకసారి 12 ఏళ్లకు, మరోసారి 13, 14 ఏళ్లకు గరిష్ట వేతన పరిమితిని సవరించారు. పైగా ద్రవ్యోల్బణం, తలసరి ఆదాయం, ఆర్థిక సూచనలను కూడా పెద్దగా పరిగణనలోకి తీసు కోవడం లేదన్నది సామాజిక కార్యకర్తల ఆరోప ణ. దీనివల్ల అర్హులైన చిరుద్యోగులెందరో పీఎఫ్ పథకం ఫలాలకు దూరమవుతున్నారని నౌటియాల్ తన పిటిషన్లో ఆవేదన వెలిబుచ్చారు. -
ఖలీద్, ఇమామ్లకు నో బెయిల్
న్యూఢిల్లీ: ఆరేళ్ల క్రితం దేశ రాజధానిలో 53 మంది మరణాలకు, 700 మందికిపైగా గాయాలపాలు కావడానికి కారణమైన భారీ అల్లర్ల కేసులో నిందితులు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్లకు సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వీళ్లకు ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ ఇచ్చేది లేదని జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ వీఎన్ అంజారియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. అల్లర్లకు భారీ స్థాయిలో కుట్ర పన్నడం, అమలు చేయడం, అల్లరిమూకలకు మార్గదర్శకం వహించడం, అల్లర్లలో భాగస్వాము లుగా మారడం దాకా ప్రతిదశలో వీళ్ల పాత్ర ఉన్నట్లు తెలిపే బలమైన సాక్ష్యాధారాలు ఉన్న కారణంగా ఖలీద్, ఇమామ్ల బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ‘‘ ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్లకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక)చట్టం(ఉపా)లోని సెక్షన్ 43డీ(5) ప్రకారం నిందితులపై ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలుంటే బెయిల్ను కోర్టు తిరస్కరించవచ్చు. దీని ప్రకారం వీళ్ల బెయిల్ పిటిషన్ తిరస్కరణకు అర్హమైందే. కేసు కీలక దర్యాప్తు, విచారణదశలో ఉన్న ఈ తరుణంలో వీళ్లిద్దరికీ బెయిల్ ఇవ్వడం సముచితం అనిపించుకోదు. కేసు విచారణ ఆలస్యమైనంత మాత్రాన నిందితులకు కొత్తగా ఒనగూరేది ఏమీ ఉండదు. నేరంలో లోతైన ప్రమేయం ఆధారంగా ఏడుగురు నిందితులను ఒకే గాటన కట్టట్లేము. అందుకే ఇతర ఐదుగురు నిందితులైన గుల్ఫిషా ఫాతిమా, మీరన్ హైదర్, షిఫా ఉర్ రెహ్మాన్, మొహమ్మద్ సలీమ్ ఖాన్, షాదాబ్ అహ్మద్లకు బెయిల్ ఇస్తున్నాం’’ అని సోమవారం సుప్రీంకోర్టు ప్రకటించింది. 11 షరతులు విధించిన కోర్టుఈ సందర్భంగా ఈ ఐదుగురికి కోర్టు 11 షరతులు విధించింది. ‘‘ తలా రూ.2 లక్షల పూచీకత్తుతో వ్యక్తిగత బాండ్ సమర్పించండి. దేశం దాటి ఎక్కడికీ పోవద్దు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోనే అధికారులకు అందుబాటులో ఉండాలి. పాస్ట్పోర్ట్లను అధికారులకు ఇచ్చేయాలి. ఢిల్లీ జైసింగ్ మార్గ్ పోలీస్స్టేషన్కు ప్రతి సోమ, గురువారాలు వచ్చి సంతకాలు చేసి వెళ్లాలి. మీరు ఉండబోయే ఇంటి అడ్రస్, వాడబోయే ఫోన్ నంబర్, ఈమెయిల్లను దర్యాప్తు అధికారులకు ఇవ్వాలి. కేసు పూర్తయ్యేదాకా కేసు వివరాలు ఎక్కడా ఎవరితో పంచుకోవద్దు. ప్రచారసభల్లో ప్రసంగాలు చేయొద్దు. భౌతికంగా, ఎలక్ట్రానిక్ వస్తువులు, మాధ్యమాల్లో ఎలాంటి అంశాలను ప్రచారంలోకి తేవొద్దు’’ అని కోర్టు వాళ్లకు సూచించింది.వీళ్లది కీలక పాత్ర..‘‘ ఉమర్ ఖలీద్, ఇమామ్లు భారీ కుట్రలో కీలక భాగస్వాములుగా ఉన్నారు. వ్యూహరచన, అల్లరిమూకలను రెచ్చగొట్టడం, లక్షిత ప్రాంతాల్లో గుమిగూడేలా చేయడం, ప్రణాళిక అమలులో వీళ్ల పాత్ర ఉందని ప్రాథమిక సాక్ష్యాధారాలు స్పష్టంచేస్తున్నాయి. ట్రంప్ పర్యటన సందర్భంగా జనం రోడ్లమీదకొచ్చి రాస్తారోకోలు, ధర్నాలు చేసేలా ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ఖలీద్ విద్వేషపూరిత ప్రసంగాలిచ్చాడు. భారత్లో మైనార్టీలు హింసకు బలవుతున్నారనే వాదనలు నిజమని అంతర్జాతీయ సమాజం విశ్వసించేలా ప్రసంగాలిచ్చారు. జేఎన్యూ వర్సిటీలో ముస్లిం స్టూడెంట్స్ ఆఫ్ జేఎన్యూ వాట్సాప్ గ్రూప్ సృష్టించి అందర్నీ సమీకరించాడు. ఇతని పాత్ర ఒక్క ఢిల్లీకే పరిమితం కాలేదు. జనాన్ని పోగేసేందుకు అలీగఢ్, ఇతర ప్రాంతాల్లోనూ పర్యటించాడు’’ అని ధర్మాసనం తన తీర్పులో పలు అంశాలను ప్రస్తావించింది.గుల్ఫిషా ఫాతిమా పాత్రపై..‘‘ఇక మరో నిందితురాలు గుల్ఫిషా ఫాతిమా.. స్థానిక మహిళలను పోగేసి నిరసన ప్రదర్శనల ప్రాంతాలకు తరలించారని, ఉద్యమ సంబంధ వస్తువుల సేకరణకు సాయపడ్డారని చేసిన వాదనల్లో పస లేదు. అందుకే ఆమెకు బెయిల్ ఇస్తున్నాం’’ అని కోర్టు స్పష్టంచేసింది. పౌరసత్వ సవరణచట్టం–2020, జాతీయ పౌరపట్టీ (ఎన్ఆర్సీ)లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ చట్టవ్య తిరేక విద్వేషక ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై ఇమామ్ను పోలీసులు 2020 జనవరి 28వ తేదీన, సెప్టెంబర్ 13వ తేదీన ఖలీద్ను అరెస్ట్చేశారు. ఈ కేసులో బెయిల్ కుదరదని ఢిల్లీ హైకోర్టు గత ఏడాది సెప్టెంబర్ రెండో తేదీన ఇచ్చిన తీర్పును ఖలీద్, ఉమర్తోపాటు మరో ఐదుగురు నిందితులు సుప్రీంకోర్టులో సవాల్ చేయగా గత ఏడాది డిసెంబర్లో వాదనలు పూర్తయ్యాయి. నిందితుల తరఫున కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ, సిద్ధార్థ దవే, సల్మాన్ ఖుర్షీద్, సిద్ధార్థ్ లూథ్రా హాజరై వాదనలు వినిపించారు. ఢిల్లీ పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించగా తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం గత ఏడాది డిసెంబర్ 10వ తేదీన రిజర్వ్చేసి సోమవారం తీర్పును వెలువర్చింది. సాక్ష్యాధారాల పరిశీలన, సాక్షుల విచారణ తర్వాత లేదా ఏడాది తర్వాత ఉమర్, ఇమామ్లు తాజాగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ధర్మాసనం సూచించింది. ఉత్తర ఢిల్లీలో 2020 ఫిబ్రవరిలో జరిగిన అల్లర్ల వెనుక ముందస్తు ప్రణాళిక దాగి ఉందని, ఇలాంటి వ్యూహరచన, అమలు అనేవి దేశ సార్వభౌమత్వంపై దాడి అని ఢిల్లీ పోలీసులు విచారణ సందర్భంగా వాదించారు. అందుకే అత్యంత కఠినమైన ఉపా, భారత శిక్షాస్మృతి సెక్షన్ల కింద కేసు నమోదుచేశామని వాదించారు.అదృష్టం లేదంతే బెయిల్ తిరస్కృతిపై ఖలీద్ తండ్రి ఆవేదన న్యూఢిల్లీ: ఉమర్ ఖలీద్కు బెయిల్ రాకపోవడంపై అతని తండ్రి ఎస్క్యూఆర్ లియాస్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ తీర్పు కాపీ అందరికీ అందుబాటులోనే ఉంది. దీనిపై నేను కొత్తగా చెప్పేదేం లేదు. ఖలీద్ విషయంలో మాకు అదృష్టం లేదంతే. ఇది నిజంగా దురదృష్టకరం’’ అని వ్యాఖ్యానించారు. ఇకపై ఇదే నా కొత్త జీవితం.. తీర్పుపై ఖలీద్ సహచరిణి బానోజ్యోత్స్న లాహిరి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. అతనికి బెయిల్ రాకపోయినా తన తోటి వాళ్లు బెయిల్పై విడుదల అవుతున్నందుకు ఖలీద్ సంతోషం వ్యక్తం చేశాడని బానోజ్యోత్స్న వెల్లడించారు. ‘‘ బెయిల్ కనీసం వాళ్లకయినా వచి్చందికదా. సంతోషం. నాకెంతో తృప్తిగా ఉంది’’ అని ఖలీద్ అన్నారు. దీనికి స్పందనగా ‘‘ నేను రేపు వచ్చి జైలులో నీతో ములాఖత్ అవుతాను’’ అని జ్యోత్స్న సమాధానం ఇచ్చారు. దీనికి స్పందనగా ఖలీద్ ‘‘ మంచి పని. వచ్చేసెయ్. ఇకపై ఇదే నా కొత్త జీవితం’’ అని వ్యాఖ్యానించాడు. ఆయనకు 15 సార్లు ఎలా?ఉమర్ ఖలీద్, ఇమామ్ల బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు వెలువ ర్చిన తీర్పుపై విపక్ష నేతలు అసహనం వ్యక్తంచేశారు. ఈ మేరకు సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిటాస్ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్పె ట్టారు. ‘‘ వీలైనంత వరకు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకే చూడాలి. తప్పనిసరి పరిస్థితుల్లోనే జైలుకు పంపాలి అనే సూత్రం అందరికీ ఒకేలా వర్తించబోదని నేడు సుప్రీం తీర్పుతో అర్థమైంది. ఈ కేసులో విచారణ ఇంకా మొదలుకాలేదు. అయినాసరే కఠిన ఉపా చట్టం కింద ఉమర్ఖలీద్ను ఐదేళ్లుగా కారాగార చీకటికొట్టంలో పడేశారు. ఇది విచారణకు ముందే జైలుశిక్ష అమలుచేయడం కాదా?. మహిళా భక్తులపై రేప్, హత్య కేసులో 2017లోనే 20 ఏళ్ల శిక్షపడిన డేరాసచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీం సింగ్కు మరోసారి తాత్కాలిక జైలుశిక్ష నిలుపుదల(పెరోల్) అవకాశం కల్పించారు. ఇప్పటికి ఆయన ఇలా 15 సార్లు పెరోల్మీద బయటికొచ్చాడు. ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయమా. ఒకరు(ఖలీద్) నిరవధికంగా జైళ్లో మగ్గిపోతుంటే మరొకరు(గుర్మీత్ బాబా) బయట డిమాండ్కు తగ్గట్లు ఎప్పటికప్పుడు జైలు నుంచి సెలవుల మీద విడుదలై సంతోషంగా గడుపుతున్నారు’’ అని జాన్ బ్రిటాస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తీర్పును బీజేపీ స్వాగతించింది. సత్యమేవ జయతే అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సైతం తీర్పుపై సంతోషం వ్యక్తంచేశారు. -
మధ్యవర్తిత్వమే మార్గం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న గోదావరి జలాల వివాదాన్ని న్యాయ పోరాటాలతో కంటే.. సామరస్య పూర్వకంగా, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడం మేలని సుప్రీంకోర్టు సూచించింది. సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని చెప్పింది. మధ్యవర్తిత్వంతో సహా మూడు పరిష్కార మార్గాలను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ రెండు రాష్ట్రాల ముందుంచారు. పోలవరం ప్రాజెక్టును అనుసంధానిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ‘పోలవరం–నల్లమల సాగర్’ ఎత్తిపోతల పథకం చేపట్టిందని, ఇందుకు సంబంధించి టెండర్లు పిలిచిందని, దీనిపై తక్షణమే స్టే ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం జస్టిస్ జాయ్మాల్యా బగ్చితో కూడిన సీజేఐ ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, ఏపీ తరఫున మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఇతర న్యాయవాదులు వాదనలు విన్పించారు. మా నీటిని తరలించుకుపోయే కుట్ర: తెలంగాణ సింఘ్వి వాదనలు వినిపిస్తూ.. ‘ఏపీ ప్రభుత్వం గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. గోదావరి బేసిన్లో తెలంగాణకు 968 టీఎంసీల వాటా ఉంది. పోలవరం–నల్లమల సాగర్ ప్రాజెక్టు ద్వారా ఏపీ 200 టీఎంసీలను మళ్లిస్తే తెలంగాణ వాటాకు గండి పడుతుంది. వరద జలాల పేరుతో తెలంగాణకు కేటాయించిన నీటిని తరలించుకుపోయే కుట్ర ఇది. ఈ ప్రాజెక్టును ఆపాలని ఆదేశించాలి. అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినా ఏపీ ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. పోలవరం నుంచి అక్రమంగా 200 టీఎంసీల వరద నీటిని మళ్లించేందుకు వీలుగా టెండర్లు పిలిచింది. సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండా, కనీసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఆమోదం పొందకుండానే ఏపీ ప్రాజెక్టు పనులు చేపడుతోంది. ప్రస్తుతం సీడబ్ల్యూసీ చైర్మన్ నేతత్వంలో వేసిన కమిటీకి ప్రాజెక్టు పనులను ఆపే అధికారం లేదు. కాబట్టి సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకుని కేంద్రం నియమించిన కమిటీ నివేదిక వచ్చేంత వరకైనా పనులను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలి..’ అని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ పోయింది..నీళ్లు కూడా వద్దా?: ఏపీ ముకుల్ రోహత్గీతో పాటు సీనియర్ న్యాయవాదులు బల్బీర్ సింగ్, జైదీప్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. ‘పోలవరం–నల్లమల సాగర్ విషయంలో ఏపీ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదు. ప్రస్తుతం ప్లానింగ్ దశలోనే ఉన్నాం. ప్రీ ఫీజబిలిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్), డీపీఆర్ తయారీ కోసమే సర్వేలు, టెండర్ల ప్రక్రియ చేపట్టాం. క్షేత్రస్థాయిలో నిర్మాణాలు చేయడం లేదు. గోదావరి నుంచి సముద్రంలో వృధాగా కలుస్తున్న నీటిని కరువు ప్రాంతమైన రాయలసీమకు అందించాలన్నదే ఏపీ ఉద్దేశం. ఇది ఆ రాష్ట్ర అంతర్గత అవసరాల కోసం చేపడుతున్న ప్రాజెక్టు..’ అని వెల్లడించారు. రోహత్గీ వాదిస్తూ.. ’ఇప్పటికే రాష్ట్ర విభజనలో ఏపీ నుంచి హైదరాబాద్ను తీసేసుకున్నారు. ఇప్పుడు సముద్రంలో కలిసే నీళ్లు కూడా వాడుకోకూడదా?..’ అని ప్రశ్నించారు. 2014 విభజన చట్టం ద్వారా ఈ జాతీయ ప్రాజెక్టుకు తెలంగాణ సమ్మతి తెలిపినట్టేనని బల్బీర్ సింగ్ అన్నారు. తెలంగాణ పిటిషన్ దురుద్దేశపూర్వకమైనదని జైదీప్ గుప్తా చెప్పారు. ప్లానింగ్ దశలోనే ఉండొచ్చు కానీ..: సీజేఐ వాదనల సమయంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కేవలం ప్రాజెక్టు నివేదికల తయారీ కోసమే టెండర్లు పిలిచామన్న వాదనలపై స్పందిస్తూ.. ’ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్లానింగ్ దశలోనే ఉండొచ్చు. కానీ ఒకవేళ భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధమని తేలి ఆగిపోతే.. ప్లానింగ్, డాక్యుమెంటేషన్ కోసం ఖర్చు చేసిన ప్రజల నిధులు వృధా అవుతాయి కదా?’ అని ప్రశ్నించారు. ఈ పిటిషన్ విచారణార్హతను పరిశీలిస్తున్నామని చెప్పారు. మూడు పరిష్కార మార్గాలు ఈ కేసులో ఏదో ఒక నిర్ణయం తీసుకునే ముందు, సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మూడు ప్రధాన పరిష్కార మార్గాలను ఇరు రాష్ట్రాల ముందు ఉంచారు. వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. ‘మొదటి మార్గంగా.. ఇది రెండు రాష్ట్రాల నడుమ తలెత్తిన జల వివాదం కాబట్టి, ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్గా కాకుండా, ఆర్టికల్ 131 ప్రకారం ‘సివిల్ సూట్’గా దాఖలు చేస్తే సమగ్ర విచారణ జరిపేందుకు కోర్టుకు వెసులుబాటు ఉంటుంది. రెండవ మార్గంలో.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ వివాదంపై ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేసినందున, ఆ కమిటీకి.. తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యర్థనలను పరిశీలించి, అవసరమైతే ఆ ప్రాజెక్టును నిలిపివేసే (స్టే ఇచ్చే) ‘నిర్ణయాధికారాన్ని’ కల్పిస్తూ కోర్టు ఆదేశాలిచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన మూడవ మార్గంగా.. కోర్టు తీర్పుల దాకా వెళ్లకుండా, ఇరు రాష్ట్రాల ప్రతినిధులు కలిసి కూర్చుని, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను స్నేహపూర్వకంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయవచ్చు..’ అని చెప్పారు. ఈ ప్రతిపాదనలపై తమ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుసుకునేందుకు సమయం కావాలని తెలంగాణ తరఫు న్యాయవాది సింఘ్వీ కోరడంతో.. ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 12వ తేదీకి వాయిదా వేసింది. -
ఢిల్లీ అల్లర్ల కేసులో ‘సుప్రీం’ కీలక తీర్పు
సాక్షి, ఢిల్లీ: 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితులు, విద్యార్థి సంఘాల నేతలు ఉమర్ ఖాలీద్, శార్జీల్ ఇమామ్కు బెయిల్ తిరస్కరించింది. అలాగే.. మరికొందరికి మాత్రం బెయిల్ మంజూరు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజారియా ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఆదేశాలు తీర్పు ఇచ్చారు.ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు కుట్ర పన్నారని ఉమర్ ఖలీద్, షార్జిల్ ఇమామ్లపై అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ట్రయల్ ఆలస్యం బెయిల్ ఇచ్చేందుకు ఆధారం కాదని ధర్మాసనం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. జాతీయ భద్రత అంశంలో స్వేచ్ఛకు భిన్నమైన అర్థం ఉందని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో నిందితుల బెయిల్ పిటిషన్లను వేర్వేరుగా విచారించాలని నిర్ణయించింది. ఢిల్లీ అల్లర్ల కేసులో గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రెహమాన్, మహమ్మద్ షకీల్ఖాన్, షాబాద్ అహ్మద్లకు మాత్రమే ఊరట లభించింది. మిగిలిన నిందితులతో పోలిస్తే ఖాలీద్, ఇమామ్ల విషయంలో భిన్నమైన పరిస్థితి నెలకొందని.. అల్లర్లలో వీళ్లిద్దరి పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా ఆధారాలున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాబట్టి వీళ్లిద్దరూ ఏడాది తర్వాతే బెయిల్ కోసం ఆశ్రయించాలని సూచించింది. అల్లర్ల నేపథ్యం..కేంద్ర ప్రభుత్వం 2019లో సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్(CAA)ను 2019లో ప్రవేశపెట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ దేశంలో పలు చోట్ల నిరసనలు జరిగాయి. ఢిల్లీలో జాఫ్రాబాద్, షాహీన్ బాగ్ వంటి ప్రాంతాల్లో మహిళలు దీక్షలు చేపట్టారు. వీటిని ఉద్దేశిస్తూ బీజేపీ నేత కపిల్ మిశ్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 23వ తేదీన మౌజ్పూర్ వద్ద జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..‘‘నిరసనకారుల్ని అణచివేయాలి. లేకుంటే చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకుంటాం’’ అని పోలీసులకు అల్టిమేటం ఇచ్చారు. ఆ మరుసటి రోజు నుంచి మూడు రోజులపాటు ఉత్తర ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి.2020 ఢిల్లీ అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువగా మైనారిటీలే ఉన్నారు. సుమారు 700 మందికి పైగా గాయపడ్డారు. అనేక ఇళ్లు, వ్యాపార సంస్థలు, మసీదులు, దేవాలయాలు ధ్వంసమయ్యాయి. దీంతో కపిల్ మిశ్రాపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. అదే సమయంలో ఈ అల్లర్ల వెనుక మేధావుల ముసుగులో ఉగ్రవాదులు ఉన్నారని.. రెజీమ్ చేంజ్ ఆపరేషన్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరం చేయాలనే కుట్ర చేశారని ఢిల్లీ పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. విద్యార్థి సంఘాల నేతలు అయిన ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్లను UAPA (Unlawful Activities Prevention Act) కింద అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.దీర్ఘకాలిక కస్టడీ.. విచారణ ఆలస్యం, ట్రయల్ ప్రారంభం కాని పరిస్థితులను ప్రధానంగా ప్రస్తావిస్తూ బెయిల్ కోరగా.. అల్లర్లకు ప్రణాళికాబద్ధంగా సహకరించారని, ఇది దేశ భద్రతకు ముప్పు అని పోలీసులు సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సర్కార్కు షాక్
సాక్షి, ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. మాజీ మంత్రి హరీష్రావు పాత్రను విచారించేందుకు అనుమతించాలన్న అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. బీఆర్ఎస్ హయాంలో హరీష్ రావు ఆదేశాలతో పోలీసు ఉన్నతాధికారి రాధా కిషన్ రావు తన ఫోన్ టాప్ చేశారని రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ గతంలో పంజాగుట్ట పీఎస్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. దానిని కొట్టేయాలని హరీష్రావు హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఎఫ్ఐఆర్ను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పూ ఇచ్చింది. ఆ వెంటనే.. హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేయగా.. సుప్రీం పిటిషన్ ఆ పిటిషన్ను కొట్టేసింది. అయితే హరీష్రావుపై ఎఫ్ఐఆర్ను కొట్టివేయడం సరికాదంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో మరోసారి స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్రావు పాత్రపై తమకు ఆధారాలు లభించాయని, ఆయన బెదిరింపులకు పాల్పడ్డారని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. అయితే.. సుప్రీం కోర్టు ఇదివరకే ఇచ్చిన తీర్పులో జోక్యానికి జస్టిస్ బీవీ నాగరత్న నిరాకరించారు. సోమవారం తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ను ఆమె కొట్టేశారు.నవీన్రావును కలవనున్న హరీష్!ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ బృందం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్రావును సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. సుమారు 9 గంటల పాటు సాగిన విచారణలో గతంలో బీఆర్ఎస్ పార్టీకి సమకూరిన ఎలక్టోరల్ బాండ్ల అంశం, ఆ పార్టీ నేతలతో ఉన్న ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నవీన్రావు వాంగ్మూలం ఆధారంగా కీలక వ్యక్తులను విచారించే అవకాశమున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇవాళ నవీన్రావుతో హరీష్రావు భేటీ అవుతారని, విచారణ వివరాలను అడిగి తెలుసుకుంటారని తెలుస్తోంది. -
అవసరంలో ఉన్నవారికి న్యాయం అందాలి
పట్నా: న్యాయ వ్యవస్థలో సహానుభూతి అత్యంత కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. న్యాయం కోరి వచ్చినవారి పట్ల దయతో మెలగాలని అన్నారు. సమాజం మెరుగుపడాలంటే అవసరంలో ఉన్నవారికి కచ్చితంగా న్యాయం అందాలని స్పష్టంచేశారు. అవసరార్థుల పట్ల న్యాయ వ్యవస్థ మొగ్గుచూపాలని సూచించారు. శనివారం బిహార్ రాజధాని పట్నాలోని చాణక్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగించారు. యువ న్యాయవాదులు కెరీర్ను నిర్మించుకొనే క్రమంలో సున్నితత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కోల్పోవద్దని పేర్కొ న్నారు. పూర్తిగా పనికి బానిసగా మారితేనే వృత్తిలో విజయం సాధిస్తామని చాలామంది యువ లాయర్లు నమ్ముతుంటారని తెలిపారు. చేసే పనే జీవితంగా మారిపోతే ఇతరుల సహానుభూతిని కోల్పోయే ప్రమాదం ఉంటుందన్నారు. న్యాయం కోసం వచ్చిన కక్షిదారులకు దయతో సేవ చేయడమే పరిమావధి కావాలని న్యాయ వాదులకు కావాలని జస్టిస్ సూర్యకాంత్ పిలుపునిచ్చారు. న్యాయం చేకూర్చడం పవిత్రమైన బాధ్యత ‘‘న్యాయం అనేది న్యాయాన్ని పొందగలిగే ఆర్థిక స్థోమత ఉన్నవారికి మాత్రమే కాకుండా.. న్యాయం తప్పనిసరిగా అవసరమైన వారికి కూడా సులువుగా అందాలి. కక్షిదారులకు న్యాయం చేకూర్చడానికి న్యాయవాదులు తమ శక్తియుక్తులు, నైపుణ్యాలు ఉపయోగించాలి. అదొక పవిత్రమైన బాధ్యత. ఇక్కడ నేర్చుకున్న న్యాయశాస్త్రాన్ని ప్రజలు మేలు చేసేలా మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సమాజంలో పేద, అణగారిన వర్గాలకు కొన్ని సందర్భాల్లో న్యాయం దక్కడం లేదు. అలాంటివారి కోసం న్యాయ వ్యవస్థ పనిచేయాలి. ఎవరికి న్యాయం అవసరమో వారికి న్యాయం అందించడం కర్తవ్యం కావాలి. లిటిగేషన్, ప్రజాసేవ, విద్యా రంగం, జ్యుడీషియల్ సర్వీసు.. ఇలా ఏ మార్గంలో నడిచినా సరే న్యాయ వ్యవస్థ పరిరక్షణకు కృషి చేయాలి. ప్రజల్లో విశ్వాసం పెంచేలా చిత్తశుద్ధితో పని చేయాలి. గొంతు విప్పలేని అసహా యకులకు గొంతుకగా మారడానికి నైపు ణ్యాలు ఉపయోగిస్తే వారి గౌరవాన్ని కూడా పెంచినట్లు అవుతుంది. చదుకున్న చదు వుకు సార్థకత లభిస్తుంది’’ అని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పట్నా హైకోర్టు ప్రాంగణంలో ఏడు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు జస్టిస్సూర్యకాంత్ పునాది రాయి వేశారు. ఇందులో ఆడిటోరియం, ఐటీ బిల్డింగ్, పరిపాలన భవనం, బహుళ అంతస్తుల కారు పార్కింగ్, ఆసుపత్రి వంటివి ఉన్నాయి.సైబర్ నేరగాళ్ల ఆట కట్టించాలి దేశంలో సైబర్నేరాలు నానాటికీ విపరీతంగా పెరిగిపోతున్నాయని జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తంచేశారు. సామాన్య ప్రజలు.. ముఖ్యంగా వృద్ధులు కోట్ల రూపాయలు పోగోట్టుకుంటున్నారని చెప్పారు. ప్రజలను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్ల ఆట కట్టించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జస్టిస్ సూర్యకాంత్ శనివారం పట్నా శివారులోని పొతాహీలో బిహార్ జ్యుడీషియల్ అకాడమీ నూతన క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... డిజిటల్ అరెస్టు గురించి గతంలో ఎప్పుడూ వినలేదని, ప్రస్తుతం అలాంటి చూడాల్సి వస్తోందని అన్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా సైబర్ నేరగాళ్లు ప్రజలను బెదిరించి, సొమ్ము లూటీ చేస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుతం న్యాయ వ్యవస్థ ఎదుట ఉన్న అతిపెద్ద సవాలు ఇదేనని పేర్కొన్నారు. సైబర్ నేరాల కారణంగా మన దేశంలో జనం వేలాది కోట్ల రూపాయలు కోల్పోవడం తనకు షాక్కు గురి చేసిందని చెప్పారు. వృద్ధులకు సరైన అవగాహన లేకపోవడంతో ఎక్కువగా నష్టపోతున్నారని గుర్తుచేశారు. ఆధునిక కాలంలో కొత్త కొత్త సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడానికి, సైబర్ నేరాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించడానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు నైపుణ్యాలు పెంచుకోవాలని, అందుకోసం శిక్షణ పొందాలని జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల ఆకాంక్షలు పెరుగుతున్నాయని, అందుకు తగ్గట్టుగా పనిచేయాలని పేర్కొన్నారు. -
ఉన్నావ్ కేసు.. సెంగార్ కూతురి ఎమోషనల్ పోస్టు
ఉన్నావ్ అత్యాచార కేసులో ఉత్తర ప్రదేశ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. వారం తిరగకుండానే అతని బెయిల్ను సర్వోన్నత న్యాయస్థానం పక్కనపెట్టేసింది. దీంతో ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో.. సెంగార్ కుమార్తె ఇషితా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారిందిఇంతకాలం తమను శక్తివంతులమని విమర్శిస్తున్నవాళ్లు.. ఇప్పుడేం అంటారు అని ఓ ప్రశ్న సంధించారామె. ‘‘అధికారంలో ఉన్నవాళ్లమని.. పవర్ఫుల్ వ్యక్తులమంటూ ఇంతకాలం మమ్మల్ని నిందిస్తూ వచ్చారు. కానీ ఆ అధికారమే ఉంటే.. ఈ ఎనిమిదేళ్లుగా మాకు మాట్లాడే అవకాశం ఎందుకు దొరకలేదు?. పైగా అవమానాలు.. బెదిరింపులు.. ఆన్లైన్లో దాడులు ఎందుకు ఎదుర్కొంటున్నాం’’ అంటూ డాక్టర్ ఇషితా సెంగార్ భావోద్వేగంగా ఓ సందేశం ఉంచారు. నేను నోరు విప్పకుండానే.. నాపై బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె అనే లేబుల్ పడిపోయింది. నాకు, నా కుటుంబానికి మానవత్వమే లేదని తిట్టారు. నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ కొందరు పోస్టులు చేశారు. నన్ను, నా సోదరిని అత్యాచారం చేయాలి.. చంపాలి అంటూ కామెంట్లు చేశారు. మా గౌరవాన్ని ఒక్కొక్కటిగా లాక్కొన్నారు. మమ్మల్ని అవమానించారు.. ఎగతాళి చేశారు. ఇది అన్యాయం అని నేను అనను. ఎందుకంటే.. ఉద్దేశపూర్వకంగానే ఈ భయాన్ని సృష్టించారు కాబట్టి. ఎనిమిదేళ్లుగా.. ఇది ప్రతీరోజూ జరుగుతోంది.కోర్టులో మా వాదనలకు అవకాశం లేకుండా పోయింది. న్యాయ వ్యవస్థతో పాటు జర్నలిజం.. ఆఖరికి మా గురించి తెలిసిన జనాలు కూడా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారు. అంతలా ఒత్తిళ్లు నెలకొంటున్నాయి. నాకు ఇంకెక్కడా చోటు కనిపించలేదు. అందుకే ఇక్కడ రాస్తున్నా. ఇంతకాలం భయంతో పరుగులు తీశాం. ఒక కార్యాలయం నుండి మరొకదానికి లేఖలు రాస్తూ, కాల్స్ చేస్తూ.. అలసిపోయి ఉన్నాం. అయినా ఆశను వదులుకోవడం లేదు.నా ఈ ప్రయత్నం.. ఎవరినో బెదిరించడానికో, సానుభూతి పొందడానికో కాదు. నేనూ ఈ దేశపు బిడ్డనే. మేం మనుషులమే. మేమూ న్యాయ్యాన్ని కోరుకుంటున్నాం. ఆ న్యాయం కోసం ఇంకా ఎదురుచూస్తున్న ఓ కుమార్తె.. అంటూ పోస్ట్ చేశారామె. ToThe Hon’ble Authorities of the Republic of India,I am writing this letter as a daughter who is exhausted, frightened, and slowly losing faith, but still holding on to hope because there is nowhere else left to go.For eight years, my family and I have waited. Quietly.…— Dr Ishita Sengar (@IshitaSengar) December 29, 2025సెంగార్ మరో కూతురు ఐశ్వర్య కూడా గతంలో ఇదే తరహా ప్రకటనలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉన్నావ్ బాధితురాలి క్యారెక్టర్ మంచిది కాదని.. తమ తండ్రిని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు జరిగిన కుట్రలో ఆమె భాగమైందని.. అందుకే అత్యాచార ఆరోపణలు చేసిందని.. తమ తండ్రి అమాయకుడని.. మీడియాగోల తప్ప అసలు విచారణ జరగడం లేదని ఇద్దరు కూతుళ్లు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. 2017లో యూపీ ఉన్నావ్కు చెందిన 17 ఏళ్ల బాధితురాలిపై అప్పటి బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ అత్యాచారం చేశారని.. ఆపై తన అనుచరులతో గ్యాంగ్ రేప్ చేయించారని.. ఆమెను అమ్మేందుకు ప్రయత్నించారన్న అభియోగాలు ఎదుర్కొన్నారు. ఈ కేసుల విచారణ సమయంలో తన మనుషులతో సెంగార్ తన తండ్రిని చంపించాడని.. తనపైనా హత్యాయత్నం జరిగిందని.. ఆ దాడి నుంచి తాను తప్పించుకుంటే బంధువులిద్దరు మృతి చెందారని బాధితురాలు ఆరోపించింది. సీబీఐ దర్యాప్తు.. విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు 2019 డిసెంబర్ చివర్లో.. సెంగార్ను ఈ కేసుల్లో దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ఆ సమయంలో సెంగార్ కుటుంబం కోర్టులో కన్నీటి పర్యంతం అయ్యింది. తీవ్ర విమర్శల నేపథ్యంలో.. అదే ఏడాది ఆయన్ని బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది కూడా. అయితే ఈ ఏడాది డిసెంబర్ 23న ఢిల్లీ హైకోర్టు సెంగార్ జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ కండిషనల్ బెయిల్ ఇచ్చింది. అయితే సెంగార్ మరో కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తుండడంతో వెంటనే రిలీజ్ కాలేదు. ఈలోపు.. బాధితురాలు, సీబీఐలు సుప్రీం కోర్టులో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేశారు. ఈ పిటిషన్లను సోమవారం(డిసెంబర్ 29) విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని నిలిపివేసింది. -
ఉరితీసే దాకా విశ్రమించం: బాధితురాలు
ఉన్నావ్: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఉన్నావ్ కేసు బాధితురాలు సోమవారం సంతృప్తి వ్యక్తంచేశారు. సెంగార్ను ఉరితీసే దాకా విశ్రమించే ప్రసక్తే లేదని బాధితురాలు తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు నుంచి న్యాయం జరిగినట్లు భావిస్తున్నానని చెప్పారు. తనపై అత్యాచారం జరిగినప్పటి నుంచి న్యాయం కోసం గొంతు వినిపిస్తున్నానని పేర్కొన్నారు. ఏ కోర్టుపైనా తాను ఆరోపణలు చేయడం లేదని, అన్ని కోర్టులపై సంపూర్ణ విశ్వాసం ఉందని తెలిపారు. న్యాయం జరిగేదాకా పోరాడుతూనే ఉంటానని స్పష్టంచేశారు. సెంగార్ను ఉరి తీస్తేనే పూర్తిగా న్యాయం జరిగినట్లు అవుతుందన్నారు. తమకు ఇప్పటికీ బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం బలపడిందని బాధితురాలి సోదరి చెప్పారు. సెంగార్ ఒక క్రూర జంతువు అని మండిపడ్డారు. తొలుత తన సోదరిని, తర్వాత తమ కుటుంబాన్ని నాశనం చేశాడని ధ్వజమెత్తారు. అతడికి ఇచ్చిన బెయిల్ను సుప్రీంకోర్టు నిలిపివేయడం సంతోషం కలిగిస్తోందన్నారు. ఈ కేసులో పోరాటం ఆపబోమని తేల్చిచెప్పారు. మరోవైపు బాధితురాలి తల్లి సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తన బిడ్డపై అత్యాచారం చేసి, తన భర్తను చంపిన నేరగాడికి మరణ శిక్ష పడాల్సిందేనని అన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలపై సామాజిక కార్యకర్త యోగితా స్పందించారు. ఇది కేవలం ఉన్నావ్ బాధితురాలి పోరాటం కాదని.. మహిళలందరి పోరాటమని ఉద్ఘాటించారు. ఇది చాలా భిన్నమైన కేసు కాబట్టి హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు. -
ఆరావళి ‘ఎత్తు’ వివాదంలో కీలక మలుపు
న్యూఢిల్లీ/జైపూర్: ఆరావళి శ్రేణిలో వంద మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న కొండలనే పర్వతాలుగా పరిగణిస్తూ కొత్త నిర్వచనం ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తడంతో సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 20వ తేదీన తాము ఇచ్చిన తీర్పును పక్కనబెడు తున్నట్లు సోమవారం సుప్రీంకోర్టు ప్రకటించింది. వంద మీటర్ల కంటే ఎత్తున్న ఆరావళి పర్వతాలకే పర్యావరణ పరిరక్షణ లభిస్తుండటంతో ఎత్తు తక్కువ ఉన్నవి గనుల తవ్వకంతో కనుమరుగయ్యే ప్రమాదముందని పర్యావ రణవేత్తలు మొదలు నేతలు, సామాన్య ప్రజానీకం నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఈ అంశాన్ని సర్వోన్నత న్యాయ స్థానం సూమోటోగా స్వీకరించింది. సోమవారం ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల వెకేషన్ బెంచ్ విచారించి పలు వ్యాఖ్యలుచేసింది. ‘‘ఫలానా ఎత్తు ఉన్న కొండలనే ఆరావళి పర్వతాలుగా పరిగణించాలనే నిర్వచనం ఇవ్వడంలో సహేతుకత లోపించినట్లు స్పష్టమవుతోంది. సంబంధిత కమిటీ నివేదికలో, తీర్పులో ఇలాంటి పలు సంక్లిష్టమైన, కీలక అంశాలపై దృష్టిపెట్టలేదు. అందుకే ఈ అంశంలో మరింత లోతైన అధ్యయనం, దర్యాప్తు, విచారణ అవసరం. అప్పటిదాకా మేం గతంలో ఇచ్చిన తీర్పును పక్కనబెడుతున్నాం. 2010 ఆగస్ట్ 25వ తేదీన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఐ) ఇచ్చిన నిర్వచనం మేరకు 2024 మే 9న మేం ఇచ్చిన తీర్పు ప్రకారం ఆరావళి పర్వతాల్లో ఇకపై ఎలాంటి మైనింగ్ అనుమతులు ఇవ్వకూడదు. నవంబర్ 20న మేం ఇచ్చిన తీర్పు, అందులో పర్వతం నిర్వచనాన్ని తప్పుగా ఆపాదించే పెను ప్రమాదముందని అర్థమవుతోంది. కొత్త నిర్వచనాన్ని మైనింగ్ సంస్థలు తప్పుగా అన్వయించి తమను అనువుగా అమలుచేసే ప్రమాదం పొంచి ఉంది. గతంలో కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, నియమ నిబంధనల్లో స్పష్టత కరువవడంతో ఇదంతా జరిగింది. ఆరావళి పర్వతాల పర్యావరణ పరిరక్షణ, సమగ్రత కాపాడేలా నిబంధనల్లో లోటుపాట్లను సమగ్ర స్థాయిలో పూడ్చాల్సి ఉంది. 100 మీటర్లు, అంతకంటే ఎక్కువ ఎత్తున్న కొండలను మాత్రమే ఆరావళి పర్వత శ్రేణిగా పేర్కొనడంలో తర్కం లోపించింది. 500 మీటర్ల దూరం ఎడంగా ఉన్న కొండలనే ఆరావళి పర్వత శ్రేణిలో భాగంగా పరిగణించాలన్న నిబంధనలోనూ లోపాలున్నాయి. ఇలాంటి పలు నిబంధనలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలులేవని అర్థమవుతోంది. పలు కీలక అంశాల్లో సంక్లిష్టత నెలకొంది. రాజస్థాన్లోని ఆరావళి పర్వతాల్లో 12,081కిగాను కేవలం 1,048 పర్వతాలు మాత్రమే 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నాయి. దీంతో మిగతా కొండలకు మైనింగ్ ముప్పు పొంచి ఉంది. ఇలా చిన్న కొండలు పర్యావరణ పరిరక్షణ ఛత్రం ఆవల ఉండిపోవడం మేం ఏమాత్రం ఒప్పుకోం. మళ్లీ సమగ్ర స్థాయిలో శాస్త్రీయ, భౌగోళిక దర్యాప్తు జరగాల్సిందే. ఈ మేరకు స్థానిక నిపుణులతో అత్యున్నత కమిటీ ఏర్పాటును ప్రతిపాదిస్తున్నాం. ఈ విషయంలో మీ స్పందన తెలియజేయండి’’ అంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. ఆరావళి పర్వతాల పరిధిలోకి వచ్చే ఢిల్లీ, రాజస్థాన్, హరియాణా, గుజరాత్లకూ నోటీసులు పంపించింది. జనవరి 21వ తేదీలోగా స్పందన తెలపాలని సుప్రీంకోర్టు గడువు విధించింది.ఆరావళి పర్వతాల ప్రత్యేకత ఏంటి?ప్రపంచంలోనే అత్యంత పురాతన ముడత పర్వతాలుగా ఆరావళి పర్వతాలకు పేరుంది. ఢిల్లీ నుంచి మొదలై హరియాణా, రాజస్థాన్, గుజరాత్లదాకా ఆరావళి పర్వతాలు విస్తరించి ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో మొత్తంగా 37 జిల్లాల్లో ఈ పర్వతాలున్నాయి. రాజస్థాన్లోని థార్ ఎడారి నుంచి ఇసుక మేఘాలు ఢిల్లీసహా ఉత్తరభారతాన్ని కమ్మేయకుండా ఈ ఆరావళి పర్వతాలే అడ్డుకుంటున్నాయి. ఆరావళి కారణంగానే థార్ ఎడారి ఉత్తరదిశగా విస్తరించకుండా ఆగిపోయింది. అలా ఉత్తరభారతంలో జీవవైవిధ్యానికి, భూగర్భ జలాలకు ఆరావళి పర్వతాలు రక్షాకవచాలుగా నిలుస్తున్నాయి. ఆరావళి కొండల్లోని వర్షపు నీరు నేలలోకి ఇంకి ఆయా ప్రాంతాల భూగర్భజలాలను ఎప్పటికప్పుడు రీచార్జ్ చేస్తున్నాయి. దీంతో భూసారం పరిరక్షించబడుతోంది. పరోక్షంగా జీవజాతుల మనుగడ సాధ్యమవుతోంది. ఆరావళిలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే పులుల అభయారణ్యాలుగా, జాతీయ వనాలుగా, పక్షుల సంరక్షణ కేంద్రాలుగా, పర్యావరణంపరంగా అత్యంత సున్నిత ప్రదేశాలుగా కొనసాగుతున్నాయి.స్వాగతించిన పర్యావరణ నిపుణులుగత తీర్పుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు వెలు వర్చిన తాజా నిర్ణయంపై పర్యావరణవేత్తలు ఆనందం వ్యక్తంచేశారు. అత్యున్నత కమిటీ అనేది కేవలం ప్రభుత్వ ఉన్నతాధికారుల కూటమిగా మిగిలిపోకుండా జీవావరణ, పర్యావరణవేత్తలకూ స్థానం కల్పించాలని పర్యావరణవేత్త భావరీన్ కంధారీ డిమాండ్చేశారు. ‘‘ఇది తాత్కాలిక గెలుపు. ఇప్పటి దాకా జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని వెల్లడి స్తూనే ఇకమీదట మైనింగ్ను పూర్తిగా ఆపేలా తుది తీర్పు రావాలి’’ అని ‘పీపుల్స్ ఫర్ ఆరావళి’ వ్యవస్థాపక సభ్యురాలు నీలం అహ్లూవాలియా ఆశాభావం వ్యక్తంచేశారు. పర్యావరణవేత్త విమలేందు ఝా, జీవావర ణవేత్త విజయ్ ధాస్మాన తదితరులూ తాజా ఉత్తర్వును స్వాగతించారు. ‘‘ ఉత్తర్వును మేం కూడా స్వాగతిస్తున్నాం. ఆరావళి పరిరక్షణకు, పునరుద్ధరణకు మోదీ సర్కార్ కట్టుబడి ఉంది’’ అని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. ‘‘ కొత్త నిర్వచనం సరిగా లేదని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు కేంద్ర సాధికారత కమిటీ, కోర్టు అమికస్ క్యూరీ సైతం గతంలోనే చెప్పారు. అయినాసరే కొత్త నిర్వచనం సరైందేనంటూ మంత్రి యాదవ్ గతంలో చేసిన వాదనలన్నీ తప్పు అని నేడు తేలింది. ఆయన వెంటనే రాజీనామా చేయాలి’’ అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. -
జైల్లోనే సెంగార్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో 2017 నాటి ఉన్నావ్ అత్యాచారం కేసులో దోషి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అతడికి బెయిల్ మంజూరు చేయడంతోపాటు కింది కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ‘స్టే’ విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా సెంగార్ను జైలు నుంచి విడుదల చేయొద్దని అధికారులకు తేలి్చచెప్పింది. ఐపీసీ ప్రకారం ఎమ్మెల్యేను ‘ప్రజాసేవకుడి’గా పరిగణించలేమన్న ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలను అత్యున్నత న్యాయస్థానం తప్పు బట్టింది. ఇది చట్టసభ సభ్యులకు మినహాయింపు ఇచ్చినట్లు అవుతుందన్నది.ఎమ్మెల్యే ప్రజాసేవకుడు కాదా? ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తోపాటు బాధితురాలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన వెకేషన్ బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘చట్టపరమైన అంశాలను పరిశీలించాల్సిందే. హైకోర్టు న్యాయమూర్తులు ఎంతో అనుభవజు్ఞలు, కానీ ఎవరైనా పొరపాట్లు చేస్తారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 5(సి) నిర్వచనం చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. చట్టం ప్రకారం ఒక కానిస్టేబుల్ ‘పబ్లిక్ సర్వెంట్’ అవుతారు. అలాంటప్పుడు ఒక శాసనసభ్యుడు మాత్రం ప్రజా సేవకుడు కాదా? ఎమ్మెల్యేను మినహాయించడం సరైందేనా? చట్టసభ సభ్యులను దీని నుంచి మినహాయించడం సరైన ది కాకపోవచ్చు’ అని ధర్మాసనం పేర్కొంది. సాధారణంగా ఒక దోషి లేదా అండర్ ట్రయల్ ఖైదీకి బెయిల్ ఇస్తూ కింది కోర్టు లేదా హైకోర్టు ఉత్తర్వు జారీ చేసినప్పుడు అతడి వాదన వినకుండా ఆ ఉత్తర్వుపై స్టే విధించలేమని తెలియజేసింది. మరో కేసులో సెంగార్ దోషిగా తేలి, ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నాడని పేర్కొంది. ఈ నెల 23న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఉన్నావ్ కేసుకు సంబంధించిన ప్రత్యేక పరిస్థితులను, వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని నిలిపివేస్తున్నామని స్పష్టంచేసింది. బాధితురాలికి ప్రాణహాని ఉంది: తుషార్ సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ‘ఇది అత్యంత పాశవికమైన నేరం. ఘటన జరిగినప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్ల కంటే తక్కువ (15 ఏళ్ల 10 నెలలు). కేవలం ఏడేళ్ల జైలుశిక్ష పూర్తయిందన్న కారణంతో దోషికి బెయిల్ ఇవ్వడం సరికాదు. సవరించిన చట్టం ప్రకారం ఇలాంటి నేరాలకు కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష విధించాలి’ అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘నేరం జరిగిన సమయానికి ఈ చట్ట సవరణ రాలేదు కదా! ఆ తర్వాత వచ్చిన సవరణలను పాత కేసులకు ఎలా వర్తింపజేస్తాం?’ అని ప్రశ్నించింది. దీనికి తుషార్ బదులిస్తూ.. ‘మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగినప్పుడు పబ్లిక్ సర్వెంట్ నిర్వచనంతో పనిలేదు. ఎమ్మెల్యే అనే వ్యక్తి ప్రజల దృష్టిలో బలమైన స్థానంలో ఉంటారు. ఎవరైనా సాయం కోసం ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తారు. అలాంటి నమ్మకమైన స్థానంలో ఉండి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసే నేరం కచ్చితంగా తీవ్రమైన లైంగిక దాడి కిందకే వస్తుంది. ఆర్మీ ఆఫీసర్ విధుల్లో ఉన్నప్పుడు తప్పు చేస్తే ఎలా శిక్షార్హుడో, ఎమ్మెల్యే కూడా అంతే’ అని వాదించారు. సెంగార్ బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని తుషార్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. ‘సెంగార్ ఇప్పటికే బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ కేసులోనూ దోషిగా తేలారు. ఈ హత్య కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నారు. పలుకుబడి ఉన్న వ్యక్తి సెంగార్ బయటకొస్తే బాధితురాలికి, ఆమె కుటుంబానికి తీరని అన్యాయం జరు గుతుంది. ఆ బాధితురాలి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బెయిల్ రద్దు చేయాలి’ అని కోర్టును కోరారు. ఎల్.కె. అద్వానీ కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ఎంపీలు లేదా ఎమ్మె ల్యేలుగా పదవిలో ఉన్న వాళ్లను ప్రజా ప్రతినిధులుగానే పరిగణిస్తూ అప్పట్లో న్యాయస్థానం తీర్పు ఇచ్చినట్లు గుర్తు చేశారు. సెంగార్ తరఫు న్యాయవాదుల వాదన సెంగార్ తరఫున న్యాయవాదులు సిద్ధార్థ దవే, ఎన్.హరిహరన్ వాదనలు వినిపించారు. ‘ట్రయల్ కోర్టు సెంగార్ను పబ్లిక్ సర్వెంట్గా పరిగణించడం వల్లనే జీవిత ఖైదు విధించింది. ఐపీసీలోని పబ్లిక్ సర్వెంట్ నిర్వచనాన్ని తీసుకొచ్చి పోక్సో చట్టానికి ఆపాదించడం న్యాయం కాదు. ఒక చట్టంలోని నిర్వచనాన్ని మరో చట్టానికి వర్తింపజేయకూడదు’ అని సాంకేతిక అంశాన్ని లేవనెత్తారు. అలాగే సెంగార్కు బెయిల్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఆరోపణలు వస్తున్నాయని, టీవీల్లో కొందరు చర్చలు సాగిస్తున్నారని సెంగార్ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయండి ఇరుపక్షాల వాదనలు తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఎమ్మెల్యేను పబ్లిక్ సర్వెంట్ కాదనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూనే, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ను నిలిపివేసింది. దీనిపై లోతుగా విచారణ జరపాల్సి ఉందని వెల్లడించింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సెంగార్కు నోటీసులు జారీ చేసింది.అసలేం జరిగింది? ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్ ఓ మైనర్ బాలికను అపహరించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో అతడు దోషిగా తేలడంతో 2019 డిసెంబర్లో ట్రయల్ కోర్టు జీవిత ఖైదు(మరణించేదాకా జైలులోనే) విధించింది. మరోవైపు బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలో మరణించాడు. ఈ కేసులోనూ సెంగాల్ దోషిగా తేలడంతో పదేళ్ల జైలు శిక్ష పడింది. ఉన్నావ్ అత్యాచారం కేసుతోపాటు సంబంధిత ఇతర కేసులను ఉత్తరప్రదేశ్ ట్రయల్ కోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఉన్నావ్ రేప్ కేసులో ట్రయల్ కోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలని, బెయిల్ ఇవ్వాలని కోరుతూ సెంగార్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు ఇటీవల విచారించింది. సెంగార్ చేసిన నేరం పోక్సో చట్టంలోని సెక్షన్ 5(సి) కింద ‘తీవ్రమైన లైంగిక దాడి’ పరిధిలోనికి రాదని అభిప్రాయపడింది. ఐపీసీ సెక్షన్ 21 ప్రకారం ప్రజల చేత ఎన్నికైన ప్రజా ప్రతినిధి ‘పబ్లిక్ సర్వెంట్’ నిర్వచనం పరిధిలోకి రారని పేర్కొంది. సెంగార్ ఇప్పటికే ఏడేళ్లపాటు జైలు శిక్ష అనుభవించినందున బెయిల్ మంజూరు చేస్తున్నట్లు, జీవిత ఖైదును కూడా రద్దు చేస్తున్నట్లు ఈ నెల 23వ తేదీన తీర్పునిచ్చింది. -
ఆరావళికి ఊపిరి
చరిత్రకు పూర్వమే కొన్ని నదులకు చిరునామాగా, వైవిధ్యభరిత ప్రకృతికి ఆలవాలంగా, రకరకాల జీవరాశులకు ఆలంబనగా నిలిచిన ఆరావళి ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకున్నట్టే. ఆ పర్వత శ్రేణిపై గత నెల 20న తామిచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సుప్రీకోర్టు సోమవారం తీసుకున్న నిర్ణయం పర్యావరణ ఉద్యమకారులకూ, ఆ ప్రాంత ప్రజానీకానికీ ఉపశమనం కలిగించింది. 250 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించి వాయవ్య భారత్ను 670 కిలోమీటర్ల పొడవునా కంటికి రెప్పలా చూసుకుంటున్న ఆరావళికి కష్టం వచ్చిందంటే జనం తల్లడిల్లారు. టేపు తీసుకుని కొలతలు కొలిచి, ఎన్ని డిగ్రీల కోణంలో వాలాయో గమనించి ఆ కొండల్ని కత్తిరించాలని చూసినవారి ఎత్తు గడలకు విస్తుపోయారు. అందుకే పర్యావరణ ఉద్యమకారుల నాయకత్వంలో పార్టీల కతీతంగా గొంతెత్తారు. చివరకు జనానిదే పైచేయి అయింది. ఈ అంశంలో మరిన్ని వివరణలు, భిన్న కోణాల్లో పరిశీలనలూ అవసరమవుతాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టిన్ జార్జి మాసీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడి ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ మరింత సమగ్రంగా,మరింత సంపూర్ణంగా దీన్ని పరిశీలించాల్సి ఉంటుందని భావించింది. ఎన్నో పురుటినొప్పులు పడి, ఎన్నెన్నో ఉత్పాతాలు చవిచూసి, ఎన్నో విధాల భౌగోళిక మార్పులు జరిగి ప్రకృతి సంపద ఈ రూపంలో మన కళ్లముందుంది. అధికారం ఉండొచ్చు, కుబేరుణ్ణి తలదన్నేంత ఐశ్వర్యం ఉండొచ్చు – కానీ ఈ సంపదను అవసరా లకు పొదుపుగా వినియోగించుకుంటూ సురక్షితంగా భవిష్యత్తరాలకు అప్పగించటం మనిషి జన్మెత్తినవారి బాధ్యత. ప్రపంచవ్యాప్తంగా పాలకులుగా ఉన్నవారూ, పారిశ్రామిక వేత్తలూ దీన్నెక్కడా గమనించుకుంటున్నట్టు లేరు. అందుకే అడవులు మటుమాయమవు తున్నాయి. కొండలు కరిగిపోతున్నాయి. నదులు ఇంకిపోతున్నాయి. జీవ వైవిధ్యం గతి తప్పుతోంది. కొన్ని రకాల జంతువులు, పక్షులు ఇప్పటికే అంతరించిపోయాయి. నదుల గమనాలు మారాయి. రుతువులు తీరు మార్చుకుంటున్నాయి. రకరకాల కాలుష్యం కాటేస్తోంది.ఆరావళి మాత్రమే కాదు... దేశంలో చిన్నా పెద్దా కొండలు, గుట్టలు దీనంగా వేడుకుంటున్నాయి. మానవాళికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్న తమ ఉసురు తీయ డానికి సిద్ధపడుతున్న వైనం చూసి దుఃఖిస్తున్నాయి. అయినా ఆగిందేమీ లేదు. బంగారం మొదలుకొని డోలమైట్, గ్రాఫైట్, మాంగనీస్, బొగ్గు, రాగి, బాక్సైట్ వంటి రకరకాల ఖనిజాలు వాటిల్లో నిక్షిప్తమై ఉండటమే అందుకు కారణం. అభివృద్ధికి అవసరమనుకుంటే పరిమిత స్థాయిలో వాటిని వినియోగించటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ప్రకృతి విపత్తులకు దారితీసే స్థాయికి అది చేరుకోవటం వల్ల అసలు అభివృద్ధి పరమార్థమే దెబ్బతింటోంది. ఆ ప్రాంతాల్లో నివసించే ఆదివాసుల జీవిక ధ్వంసమవుతోంది.ఇన్ని దశాబ్దాలుగా మౌనంగా వీక్షించిన వాయవ్య భారతం ఇప్పుడైనా గొంతెత్తగలిగింది గనుకే ప్రస్తుతానికిది ఆగింది. ఆరావళి పర్వత పంక్తులు చంబల్, సబర్మతి, లూని వంటి నదులకు జీవం పోస్తున్నాయి. అక్కడ అడవులున్నాయి, గడ్డిభూములు న్నాయి. సారవంతమైన నేలలు సరేసరి. అపురూపమైన జంతు, వృక్షజాలాలున్నాయి. దేశ రాజధాని నగరం ఈ మాత్రమైనా ఊపిరి పీల్చుకోగలుగుతున్నదంటే అది ఆరావళి చలవే. అంతేకాదు... భూగర్భ జలాలు సమృద్ధిగా లభించేలా చేస్తున్నాయి. ఇప్పటికే కొన సాగుతున్న మైనింగ్ను నిలిపేయటంతోపాటు కొత్తగా మైనింగ్ లైసెన్సులు జారీ చేయకుండా చర్యలు తీసుకుంటేనే ఈ మాత్రమైనా మిగులుతాయి. ఆ దిశగా తీసుకోవా ల్సిన చర్యల్లో సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు తొలి అడుగు కావాలి. ఆరావళిలో కోల్పో యింది కోల్పోగా ప్రస్తుతం మిగిలినదాన్నయినా ఎలా రక్షించుకోవాలన్న ఆర్తి ఉంటే తప్ప ఇదంతా సాధ్యపడదు. వాయవ్య భారతమే కాదు... దేశంలోని అన్ని ప్రాంతాలూ తమ గొంతు బలంగా వినిపించినప్పుడే కొనసాగుతున్న విధ్వంసానికి తెరపడుతుందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. భూ ఆకృతి సంబంధిత అంశంగా చూసి కొలతలతో, కోణాలతో యాంత్రికంగా చూడక, మనిషి ఇరుసుగా ప్రకృతిని వీక్షించగలిగితే తరతరాల పాటు ఈ అపురూప సంపద మానవాళికి ఆసరా అందిస్తుంది. -
ఆరావళి పాత తీర్పుపై.. సుప్రీం స్టే..
-
ఆ సెంగార్ను జైలు నుంచి విడుదల చేయొద్దు: సుప్రీం కోర్టు
సాక్షి, ఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్కు బిగ్ షాక్ తగిలింది. ఆయన జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ.. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్పై సుప్రీం కోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ను సోమవారం జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ చేపట్టి కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలి భద్రతకు సంబంధించిన అంశాలతో సీబీఐ ప్రస్తావించిన అభ్యంతరాలను పరిశీలించిన ధర్మాసనం.. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్టే విధించడంతో పాటు నిందితుడు కుల్దీప్కు నోటీసులు జారీ చేసింది. బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్పై నాలుగు వారాల్లో బదులు ఇవ్వాలని సెంగార్ను అందులో కోర్టు ఆదేశించింది. ‘‘ఈ కేసులో జీవిత ఖైదు పడ్డ సెంగార్ను జైలు నుంచి విడుదల చేయొద్దు. ఓ కానిస్టేబుల్ పబ్లిక సర్వెంట్ అయినప్పుడు.. ఓ ఎమ్మెల్యే మాత్రం కాదా?.. ఈ కేసులో ఆ బెయిల్ ఇచ్చింది కూడా ఉత్తమ జడ్జీలే. మేం కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటాం కదా. ఇంతకీ ఎవరు పబ్లిక్ సర్వెంట్లు?’’ అంటూ సెంగార్ తరపు వాదించిన లాయర్లు సిద్ధార్థ దవే, హరిహరన్లను జస్టిస్ సూర్యకాంత ప్రశ్నించారు. ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో 2017లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అప్పటి బీజేపీ నేత కుల్దీప్ సెంగర్ ఈ కేసులో ప్రధాన నిందితుడుగా తేలాడు. అయితే ఈ కేసు విచారణలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసులను ఆశ్రయించినా.. నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంతో బాధితురాలు సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇంటి ముందు ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఈ కేసు.. హైప్రొఫైల్ కేసుగా గుర్తింపు దక్కించుకుంది. అయితే కేసు దర్యాప్తులో ఉండగానే.. బాధితురాలి తండ్రి సెంగార్ మనుషుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఆపై ఆమె అనూహ్యంగా ప్రమాదానికి గురికాగా.. సురక్షితంగా బయటపడింది. అయితే ఆమె ఇద్దరి బంధువులు మాత్రం ప్రమాదంలో మరణించారు. ఈ యాక్సిడెంట్ కూడా సెంగార్ జరిపించాడనే అభియోగాలు నమోదు అయ్యాయి. 2018లో ఈ కేసు సీబీఐ చేతికి వెళ్లింది. కేసు విచారణ యూపీ ట్రయల్ కోర్టు ఢిల్లీ కోర్టుకు మారింది. 2019 డిసెంబర్లో దోషిగా తేలడంతో జీవితఖైదు విధించింది కోర్టు. అయితే తాజాగా ఈ కేసులో అనూహ్య పరిణామలు చోటు చేసుకున్నాయి. సెంగార్కు పోక్సో చట్టం వర్తించదని చెబుతూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. అయితే.. కుల్దీప్ సింగ్ సెంగర్ జైలు శిక్షను సస్పెండు చేయడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు రగిలాయి. బాధిత కుటుంబం దేశరాజధానిలో ఆందోళనకు దిగడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అదే సమయంలో.. యూపీ ఎన్నికల నేపథ్యంలో సెంగార్ కమ్యూనిటీ ఓట్ల కోసమే ఆయన్ని విడిపించే ప్రయత్నం జరుగుతోందని రాజకీయ విమర్శలు తలెత్తారు. ఈ పరిణామాల నడుమ.. సీబీఐతో పాటు బాధితురాలి తరఫు న్యాయవాదులు కూడా సుప్రీం కోర్టులో అప్పీల్ చేశారు. సోమవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. -
ఉన్నావ్ కేసు.. విచారణ వేళ ఉత్కంఠ
సాక్షి, ఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార కేసు విచారణ ఇవాళ సుప్రీం కోర్టులో జరగనుంది. ఈ కేసులో దోషిగా తేలిన ఉత్తర ప్రదేశ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ జీవిత ఖైదును ఢిల్లీ హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇది రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపింది.ఈ బెయిల్ను సవాల్ చేస్తూ సీబీఐ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. దీనిని కాసేపట్లో కోర్టు విచారణ జరపనుంది. ఈ కేసులో సెంగార్కు ఇటీవల బెయిల్ లభించటం సంచలనంగా మారింది. బెయిల్పై అతడు బయటకు రావటంతో.. బాధితురాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనతో పాటు ఇంటివద్ద ఉన్న తన పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయిందని వాపోయారు.‘సుప్రీంకోర్టులో న్యాయం దక్కుతుందన్న నమ్మకముంది. అతడికి బెయిల్ రాకుండా ఉండాల్సింది. నా తండ్రిని, కుటుంబాన్ని కోల్పోయాను. ఇప్పుడు నా పిల్లల భద్రత కూడా ప్రమాదంలో పడింది’ అంటూ బాధితురాలు వాపోతున్నారు. బాధితురాలి భద్రత దృష్ట్యా బెయిల్ రద్దు చేయాలని సీబీఐ తన పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్ విచారణలో సెంగార్ తరఫు వాదనలు ఎలా ఉండనున్నాయో అనే ఉత్కంఠ నెలకొంది. -
మెరుపులు.. కొన్ని మరకలు.. ఇంకొన్ని వివాదాలు
త్వరలో కాలగర్భంలో కలిసిపోనున్న 2025 సుప్రీంకోర్టు చరిత్రలో చిరకాలం గుర్తుండిపోయే ఏడాదిగా నిలవనుంది. పలు సంచలనాత్మక కేసులు, వక్ఫ్ చట్టం వంటి వివాదాస్పద అంశాలు, రాజ్యంగపరంగా కీలకమైన సందేహాలు లేవనెత్తిన రాష్ట్రపతి రిఫరెన్సు వంటివి సంవత్సరం పొడవునా అత్యున్నత న్యాయస్థానానికి ఊపిరి సలపనివ్వలేదు. ఆ కేసులను పరిష్కరించే క్రమంలో సుప్రీం పలు చరిత్రాత్మక తీర్పులు వెలువరించింది. ప్రజాప్రయోజనాలు, రాజకీయాలు, పర్యావరణం, నేర సంబంధిత కేసులతో పాటు పలు సంక్లిష్టమైన పౌరసంబంధ తగాదాలను సైతం సమర్థంగా పరిష్కరించింది. కీలకమైన కేసుల్లో రాష్ట్రపతి, గవర్నర్లకు డెడ్లైన్ వంటి తీర్పుల విషయంలో కాస్త చూసీచూడనట్టు పోయిందన్న అభిప్రాయాలకు కూడా తావిచ్చింది. ఈ ఏడాది అత్యున్నత న్యాయస్థానం ముందుకొచ్చిన పలు కీలక కేసులను ఓసారి చూస్తే... వ్యవస్థల నడుమ... టగ్ ఆఫ్ వార్!గవర్నర్లు, విపక్ష పాలిత రాష్ట్రాల మధ్య చిరకాలంగా పెను వివాదంగా మారిన బిల్లుల ఆమోదం అంశం ఈ ఏడాది సుప్రీంకోర్టుకు అగ్నిపరీక్షే పెట్టింది. బిల్లులను తమిళనాడు గవర్నర్ రవి తొక్కిపట్టడాన్ని సవాలు చేస్తూ తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టడంతో న్యాయవ్యవస్థకే సుదీర్ఘ, సంక్లిష్ట సవాలుకు తెరలేచింది. గవర్నర్తో పాటు రాష్ట్రపతి కూడా మూడు నెలల్లోపు బిల్లులకు ఆమోదం తెలపడం, వాటిని తిప్పి పంపడమో చేయని పక్షంలో అవి ఆమోదం పొందినట్టే భావించాలంటూ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు పెను సంచలనమే సృష్టించింది. అధికార బీజేపీకి ఖేదం, విపక్షాలకు మోదం కలిగించింది. దాంతో, ఇలా గడువు విధించడం సబబేనా అంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తన అసాధారణ అధికారాలను ఉపయోగించుకుంటూ, ఈ అంశంపై కోర్టుకు 14 ప్రశ్నాస్త్రాలు సంధించి వాటికి బదులు కోరారు. దాంతో సమస్య కీలక మలుపు తిరిగింది. ఒక దశలో అతి కీలకమైన న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అమీతుమీ తరహా పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి రాష్ట్రపతికి, గవర్నర్లకు కోర్టులు అలా గడువు విధించలేవంటూ ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించడం ద్వారా ఈ వివాదానికి సామరస్యపూర్వకంగా తెర దించింది. అయితే ఆ క్రమంలో న్యాయవ్యవస్థ ఒక మెట్టు దిగిందన్న అభిప్రాయాలు విపక్షాలతో పాటు న్యాయ నిపుణుల నుంచి కూడా విన్పించాయి. కాకపోతే గవర్నర్లు బిల్లులపై ఏ నిర్ణయమూ తీసుకోకుండా సుదీర్ఘకాలం సాగదీస్తే ఊరుకునేది లేదని, అలాంటప్పుడు న్యాయసమీక్ష సబబేనని ధర్మాసనం పేర్కొనడం ప్రజాస్వామ్యవాదులకు కాస్త ఊరటనిచ్చింది. ‘వక్ఫ్’పై మధ్యేమార్గంవక్ఫ్ ఆస్తులను క్రమబద్ధీకరించే క్రమంలో మోదీ సర్కారు తీసుకొచ్చిన అత్యంత వివాదాస్పద కొత్త వక్ఫ్ (సవరణ) చట్టం–2025 కేసు విషయంలో సుప్రీంకోర్టు వీలైనంత సమతుల్యత పాటించే ప్రయత్నం చేసింది. వక్ఫ్ బై యూజర్ ప్రయోజనాన్ని తొలగింపు సక్రమమేనని, ఈ నిర్ణయం ద్వారా వక్ఫ్ భూములను కేంద్రం లాక్కుంటుందన్న వాదనలో పస లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో కనీసం ఐదేళ్లుగా ఇస్లాంను అనుసరిస్తున్న వాళ్లు మాత్రమే వక్ఫ్ కింద దానాలు ఇవ్వొచ్చన్న నిబంధనను ప్రస్తుతానికి పక్కన పెట్టింది. సోషల్ న్యూసెన్స్కు ముకుతాడుభావ ప్రకటన స్వేచ్ఛ పేరిట హద్దు మీరుతున్న యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూ యన్సర్లకు సుప్రీంకోర్టు ముకుతాడు వేసింది. తల్లిదండ్రులు–పిల్లలపై అసహ్యకరమైన లైంగిక వ్యాఖ్యలు చేసిన రణ్వీర్ అలహాబాదియా, దివ్యాంగులను కించపరిచిన సమయ్ రైనా వంటి పలువు రు ఇన్ఫ్లూయన్సర్లను కోర్టు గట్టిగా నలుగు పెట్టి వదిలింది. మున్ముందు ఇలాంటి ఉదంతాల్లో కఠిన శిక్షలు విధించేలా ఎస్సీ, ఎస్టీ చట్టం తరహాలో గట్టి చట్టం తేవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఆన్లైన్ కంటెంట్ను క్రమబద్ధీకరించేలా గైడ్లైన్స్ విడుదల రూపొందించాలని పేర్కొంది. గ్రామ సింహాల గోలఏ వీధికి వెళ్లినా సర్వసాధారణంగా కన్పించే వీధి కుక్కల బెడద సుప్రీం దృష్టికీ వెళ్లింది. దీనిపై మీడియా కథనాలను సుమోటోగా విచారణకు స్వీకరించడమే గాక వీధి కుక్కలను శాశ్వతంగా తరలించే దిశగా కేంద్ర, రాష్ట్రాలకు పలు నిర్దేశాలు జారీ చేసింది. దీనిపై జంతు ప్రేమికుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాల నేపథ్యంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం లోతైన విచారణ జరిపింది. కుటుంబనియంత్రణ ఆపరేష్ల అనంతరం కుక్కల్ని తిరిగి వీధుల్లోకి వదలవచ్చంటూ తీర్పును కాస్త సవరించింది. సీజేపైకి బూటుఅక్టోబర్ 6వ తేదీ. సుప్రీంకోర్టులో అత్యంత అరుదైన, అవాంఛనీయమైన ఉదంతం జరిగిన రోజు. రాకేశ్ కిషోర్ అనే సీనియర్ న్యాయవాది ఏకంగా నాటి సీజేఐ జస్టిస్ గవాయ్పైకి బూటు విసిరి కలకలం రేపాడు. అంతకుముందు విచారణ సందర్భంగా హిందూ దేవీ దేవతలపై ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ మతిలేని చర్యకు పూనుకున్నాడు.న్యాయమూర్తుల ఆస్తుల వెల్లడిన్యాయవ్యవస్థలో మరింత పారదర్శకత, విశ్వసనీయత దిశగా న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను బయట పెట్టాలని అత్యున్నత న్యాయస్థానం మరో కీలక నిర్ణయమూ తీసుకుంది. వాటిని ఆన్లైన్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంది. అలాగే న్యాయ సిబ్బంది తదితర నియామకాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రజలకు రిజర్వేషన్ల కల్పన కూడా వినూత్నమే.జడ్జి ఇంట్లో నోట్ల కట్టలుదేశ రాజధానిలో హైకోర్టు న్యాయ మూర్తిగా ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో కట్టలు కట్టలుగా కరెన్సీ నోట్లు సగం కాలిపోయిన స్థితిలో బయటపడ్డ ఉదంతం దేశమంతటా పెను ప్రకంపనలు సృష్టించడమే గాక న్యాయవ్యవస్థ ప్రతిష్టకే మచ్చగా నిలిచింది. మార్చి 14వ తేదీ రాత్రి ఢిల్లీలోని ఆయన అధికార నివాసంలో చెలరేగిన మంటలను ఆపేందుకు వెళ్లిన అగ్నిమాపక, పోలీసు సిబ్బంది స్టోర్ రూములో నేలపై పరిచిన భారీస్థాయిలో నోట్ల కట్టలు చూసి నోరెళ్లబెట్టారు. ఇతర పౌరుల్లాగే ఆయన్ను కూడా చట్టప్రకారం కఠినంగా శిక్షించి న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచాలని సామాన్యులంతా ఆశించారు. సుప్రీంకోర్టు నియమించిన అంతర్గత న్యాయ మూ ర్తుల కమిటీ సైతం ఆయన్ను దోషిగా తేల్చి చర్యలకు సిఫార్సు చేసింది. రాజీ నామా చేయాల్సిందిగా నాటి సీజేఐ జస్టిస్ ఖన్నా సూచించినా జస్టిస్ వర్మ ససేమిరా అన్నారు. దాంతో ఆయన్ను అభి శంసించాల్సిందిగా రాష్ట్రపతి, ప్రధానులకు సీజే లేఖ రాయాల్సి వచ్చింది. జస్టిస్ వర్మను తొలగించాలని పలువురు ఎంపీలు కూడా పార్లమెంటుకు లేఖ రాశారు. అభిశంసన ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఆయనపై పార్లమెంటరీ ప్యానల్ విచారణ కొన సాగుతోంది. దాన్ని కూడా సవాలు చేస్తూ జస్టిస్ వర్మ సుప్రీం మెట్లెక్కడం అందరినీ నిర్ఘాంతపరిచింది.ముగ్గురు సీజేలుసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీఠంపై ముగ్గురు అత్యంత సీనియర్ జడ్జీలు కొలువుతీరడం ఈ ఏడాది ప్రత్యేకతగా చెప్పొచ్చు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ గవాయ్ ఈ ఏడాదే రిటైరవగా జస్టిస్ సూర్యకాంత్ సీజేగా బాధ్యతలు స్వీకరించారు. న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని నిలబెట్టే క్రమంలో రిటైర్మెంట్ అనంతరం ఎలాంటి ప్రభుత్వ పదవులూ స్వీకరించబోమని జస్టిస్ ఖన్నా, జస్టిస్ గవాయ్ స్పష్టం చేయడం మరో విశేషం.మరిన్ని కీలక తీర్పులు...→ పెచ్చరిల్లుతున్న సైబర్ నేరాలపైనా సుప్రీంకోర్టు ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయకులను, ముఖ్యంగా వృద్ధులను భయభ్రాంతులకు గురిచేసి భారీగా డబ్బు కొల్లగొడుతున్న ఆన్లైన్ మోసగాళ్లపై ఉక్కుపాదం మోపాల్సిందిగా సీబీఐని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇందుకోసం దేశవ్యాప్త విచారణ జరపాలని సూచించింది.→ బోగస్ ఓట్ల ఏరివేతకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే రాజకీయ రంగు పులుముకుని సుప్రీంకోర్టుకు చేరింది.→ పశ్చిమబెంగాల్లో దశాబ్దం క్రితం నియమి తులైన ఏకంగా 25,753 మంది ప్రభుత్వ టీచర్లు, సిబ్బంది నియామ కాన్ని సుప్రీం ఒక్క కలం పోటుతో రద్దు చేయడం మమత సర్కారుకు తీరని షాకిచ్చింది.→ లాయర్లు, కక్షిదారులను దర్యాప్తు సంస్థలు తమ ఇష్టమొచ్చిన రీతిలో విచారించేందుకు వీల్లేదంటూ, వారి ప్రత్యేక హక్కుల పరిరక్షణకు పలు చర్యలు ప్రకటించిన సుప్రీం తీర్పు కూడా చరిత్రాత్మకమైనదే.→ నోయిడాలో 2006లో 8 మంది పేద చిన్నారుల అస్థిపంజరాలు ఓ కాలువలో బయటపడ్డ ఉదంతంలో ప్రధాన నిందితుడు సురేంద్ర కోలీని నిరపరాధిగా సుప్రీం తేల్చడం విస్మయం కలిగించింది.→ జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలకు లాయర్లకు కనీసం మూడేళ్ల అనుభవం తప్పనిసరని, న్యాయాధికారులు బార్ కోటా కింద పదోన్నతి పరీక్షలు రాయొచ్చంటూ ఇచ్చిన తీర్పులు చర్చనీయంగా మారాయి.→ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పిడి ఉదంతంపై తాము సూచించినట్టుగా మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోనందుకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్పై సుప్రీంకోర్టు ధిక్కరణ చర్యలకు దిగడమూ సంచలనమే సృష్టించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మా ‘సిక్స్త్ సెన్స్’ ముందే చెప్పింది
న్యూఢిల్లీ: విబేధాలతో వ్యక్తిపై అత్యాచార కేసు నమోదుచేసిన బాధితురాలు తన మనసు మార్చుకుని అతడినే పెళ్లాడవచ్చని తాము ముందే ఊహించామని, తమ ‘సిక్స్త్ సెన్స్’ అదే చెప్పిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఓ కేసు విచారణ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. మహిళను రేప్ చేశాడన్న కేసులో దోషిగా తేలి మధ్యప్రదేశ్ హైకోర్టులో పదేళ్ల శిక్ష పడిన వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించగా సంబంధిత కేసును జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల విచారించింది. బాధితురాలు, దోషి వివాహంచేసుకుని గత ఆరునెలలుగా సంతోషంగా జీవిస్తున్న నేపథ్యంలో దోషికి గతంలో హైకోర్టు విధించిన శిక్షను రద్దుచేస్తూ సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు పలు ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. డిసెంబర్ ఐదున వెలువ డిన ఈ కేసు తీర్పు వివరాలు ఆలస్యంగా శనివారం వెలుగుచూశాయి. ‘‘ శిక్షను రద్దుచేయాలంటూ అప్పీల్ చేసుకున్న వ్యక్తిని బాధితురాలు ఒకవేళ వివాహం చేసుకునేందుకు సుముఖత చూపితే ఇద్దరూ మళ్లీ కలిసిపోతారని మేం ముందే ఊహించాం. మా సిక్త్స్ సెన్స్ ఇదే చెప్పింది. ముందుచూపుతో ముందే ఊహించాం. ఇలాంటి కేసు నిజంగా అరుదైంది. బాధితురాలిని పెళ్లిచేసుకోవడం ద్వారా దోషిపై ఉన్న నేరారోపణలను, శిక్షను రద్దుచేస్తున్నాం’’ అని న్యాయమూర్తులు తీర్పు చెప్పారు. 2015లో సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన వ్యక్తిని మధ్యప్రదేశ్కు చెందిన ఒక యువతి ఇష్టపడింది. తర్వాత కొన్నాళ్లపాటు ఇద్దరూ సహజీవనంచేశారు. తర్వాత మనస్పర్థలొచ్చాయి. దీంతో పెళ్లాడతానని మాయమాటలు చెప్పి తనను పలుమార్లు అత్యాచారంచేశాడని మహిళ ఫిర్యాదుచేయడంతో 2021 నవంబర్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. గత ఏడాది ఏప్రిల్లో ట్రయల్ కోర్టు ఆ వ్యక్తిని దోషిగా తేల్చింది. తీర్పును అతను మధ్యప్రదేశ్ హైకోర్టులో సవాల్చేయగా అక్కడా అతనికి చుక్కెదురైంది. పైగా పదేళ్ల కఠిన కారాగార శిక్షను, రూ.55,000 జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పుచెప్పింది. దీంతో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఇద్దరినీ, వాళ్ల తల్లిదండ్రులను సుప్రీంకోర్టు ధర్మాస నం పిలిపించింది. వివాహంచేసుకునేందుకు ఇరువైపులా సమ్మతి తెలపడంతో పెళ్లాడేందుకు వీలుగా అతనికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది. ఆ తర్వాత వాళ్లు పెళ్లాడారు. ఈ విషయంతెల్సి ధర్మాసనం ఈ కేసును విచారించింది. ‘‘ఇద్దరి మధ్య చిన్నపాటి బేధాభిప్రాయాలు ఉన్నట్లు మాకు అర్థమైంది. అనివార్య కారణాలతో వివాహం వాయిదావేద్దామని కలిసున్నకాలంలో అబ్బాయి చెప్పడంతో ఆగ్రహించిన అమ్మాయి నేరపూరిత రంగు పులిమి విషయాన్ని పెద్దదిచేసింది. వాస్తవానికి పెళ్లిచేసుకోవాలన్న ఉద్దేశం ఇద్దరికీ ఉందని మా సిక్త్స్ సెన్స్ ఎప్పుడో చెప్పింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా మాకు సంక్రమించిన అసాధారణ అధికారాలతో ఎఫ్ఐఆర్ను, ట్రయల్ కోర్టులో తీర్పును రద్దుచేస్తున్నాం. తద్వారా హైకోర్టులో పెండింగ్లో ఉన్న సంబంధిత కేసు నిర్వీర్యమైపోయినట్లే’’అని ధర్మాసనం స్పష్టంచేసింది. -
సిట్ కస్టడీ నుంచి ప్రభాకర్ రావు రిలీజ్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. శుక్రవారం వేకువజామునే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయన్ని విడిచిపెట్టింది. అక్కడి నుంచి ఆయన నేరుగా ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు.. ఈ కేసులో 14 రోజుల పాటు కస్టోడియల్ విచారణ జరిపిన సిట్ నెక్ట్స్ ఏం చేయబోతుందా? అనే ఆసక్తి నెలకొంది. అయితే.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేవలం ప్రతిపక్షాలకే పరిమితం కాలేదని, నాటి అధికార బీఆర్ఎస్కు చెందిన అసమ్మతి నేతలపైనా సాగిందని సిట్ గుర్తించింది. దీనికి సంబంధించి కీలక ఆధారాలను సేకరించిన అధికారులు ఆ కోణంలోనూ ప్రభాకర్రావును ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రభాకర్రావు విచారణ ద్వారా.. మొయినాబాద్ ఫామ్హౌస్ కేంద్రంగా సాగిన ఎమ్మెల్యేలకు ఎర ఆపరేషన్ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వెలుగులోకి వచ్చిందని, దాని కోసం అవసరమైన నిఘా పరికరాలను ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి ఖరీదు చేశారని సిట్ తేల్చింది. గతంలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ఆ పార్టీకి బ్రేక్ వేయాలంటూ వచ్చిన ఆదేశాలతో ప్రభాకర్రావు టీమ్ అప్రమత్తమైందని సిట్ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి.. 2022 అక్టోబర్ చివరి వారంలో ప్రభాకర్రావు–రాధాకిషన్రావు మధ్య జరిగిన ఓ సమావేశంలో నాటి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి వ్యవహారం ప్రస్తావనకు వచ్చిందని గుర్తించింది. ‘నాకు పదవీ విరమణ తర్వాత అప్పటి డీజీపీ ఎం.మహేందర్రెడ్డి ఎక్స్టెన్షన్ కోసం ప్రతిపాదనలు పంపారు. దీని ఆధారంగా అప్పట్లో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రవిగుప్తా ఆదేశాలు ఇచ్చారు. నా పనితీరు ఆధారంగానే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు ఎవరికీ సంబం«ధం లేదు. అప్పటి సీఎం కేసీఆర్కు, నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని ప్రభాకర్రావు సిట్ అధికారులతో చెప్పినట్లు తెలుస్తోంది. .. ఈ నేపథ్యంలోనే సిట్ గురువారం ఆనాడు సీఎస్గా పని చేసిన సోమేశ్కుమార్తోపాటు మాజీ డీజీపీ మహేందర్రెడ్డి నుంచి వాంగ్మూలాలు సేకరించింది. అధికారులు సేకరించిన ఆధారాల్లో కొందరు రాజకీయ నాయకులు, అనుచరులు, జర్నలిస్టులు, అధికారులకు సంబంధించినవి ఉండటంతో వాటిని చూపిస్తూ... అవి ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందంటూ ప్రభాకర్రావును సిట్ ప్రశ్నించింది. ఈ కేసులో బాధితుడిగా ఉన్న ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు నిందితుడు నందకుమార్ వాంగ్మూలాన్నీ సిట్ సేకరించింది. ‘నన్ను సిట్ అధికారులు ప్రశ్నించారు. నా ఫోన్ ట్యాప్ చేశారనే అనుమానాలు ఉన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫామ్హౌస్లో రికార్డు చేసిన వీడియోలు బయటకు వెళ్లాయి. కేసీఆర్ స్వయంగా వాటిని మీడియాకు విడుదల చేశారు. నాటి ఫామ్హౌస్ తతంగంపై సిట్ అధికారులు వివరాలు అడిగారు. ఎమ్మెల్యేలు, స్వామీజీలతోపాటు నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. దీనిపై అప్పట్లో డీజీపీ రవి గుప్తాకు ఫిర్యాదు చేశా. రాధాకిషన్రావు ఎలా వేధించారని సిట్ అధికారులు అడిగారు. వారికి పూర్తి సమాచారం అందించా అని నందకుమార్ విచారణ తర్వాత మీడియాకు తెలిపారు. ఆనాడు అధికారపక్షంలోని నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మరో నిందితుడిగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్రావుతో కలిపి మరీ ప్రభాకర్రావును విచారించారు. బీఆర్ఎస్ నేతలపై నిఘా ఉంచడం వెనుక ప్రభాకర్రావుతోపాటు హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్రావు పాత్ర ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ వ్యవహారంపై గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు త్వరలో నోటీసులు ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనవరి 16వ తేదీ నాటికి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ సమగ్ర నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈలోపే ఆ పెద్దలను విచారించే అవకాశం కనిపిస్తోంది. -
ఉన్నావ్ కేసు.. సెంగర్కు షాక్ తప్పదా?
ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్లో సంచలనం సృష్టించిన అత్యాచార కేసులో పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. నిందితుడు కుల్దీప్ సింగ్ సెంగర్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడం.. దీనిని నిరసిస్తూనే ప్రాణభయంతో బాధితురాలు, ఆమె తల్లి ఆందోళనకు దిగడం.. అందుకు అనుమతి లేదంటూ భద్రతా సిబ్బంది వాళ్లను ఈడ్చిపారేయడం.. యోగి ప్రభుత్వ నుంచి కనీస స్పందన లేకపోవడం.. బాధితుల సోనియా-రాహుల్ గాంధీలను కలవడంతో రాజకీయ రగడ నెలకొంది. ఈ తరుణంలో.. న్యూఢిల్లీ: ఉన్నావ్ కేసులో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు జరిపిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెంగర్ బెయిల్ను సవాల్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని భావిస్తోంది. ఢిల్లీ హైకోర్టును సమీక్షించిన తర్వాత పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. 2017లో నాడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కుల్దీప్ సింగ్ సెంగర్ మైనర్ అయిన బాధితురాలిని ఎత్తుకెళ్లి పలుమార్లు అత్యాచారం జరపడంతో పాటు ఆమెను అమ్మే ప్రయత్నమూ చేశారు. ఆ సమయంలో పోలీసుల చొరవతో ఆమె బయటపడగలిగింది. అయితే న్యాయం కోసం ఆమె పోరాడినా ఫలితం దక్కలేదు. దీంతో సీఎం యోగి ఆదిత్యానాథ్ నివాసం వద్ద బలవన్మరణం కోసం ప్రయత్నించడంతో ఈ కేసు దేశం దృష్టిని ఆకర్షించగలిగింది. ఈలోపు.. ఆమె తండ్రి హత్యకు గురికాగా.. ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది కూడా. ఈ కేసు తీవ్రత దృష్ట్యా యూపీ ప్రభుత్వం సీబీఐకి అప్పగించగా.. సుప్రీం కోర్టు చొరవతో విచారణను కూడా యూపీ నుంచి ఢిల్లీ కోర్టుకు మార్చారు. 2019లో విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు నిందితుడు కుల్దీప్ సెంగర్కు జీవితఖైదు విధించింది. అయితే.. తాజాగా(డిసెంబర్ 23, 2025) మంగళవారం ఢిల్లీ హైకోర్టు సెంగర్ జీవితఖైదును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పోక్సో చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం.. అధికారం ఉన్న వ్యక్తి లైంగిక దాడి చేస్తే కనీసం 20 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది. సెంగార్ నాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారి కిందకు రారని.. కాబట్టి ఆయపై పెట్టిన పోక్సో చట్టంలోని సెక్షన్-5 వర్తించదని ఢిల్లీ హైకోర్టు ద్విసభ ధర్మాసనం తీర్పు సందర్భంగా అభిప్రాయపడింది. కాబట్టి ఆ చట్టంలోని సెక్షన్ 4 మాత్రమే ఆయనకు వర్తిస్తుందని పేర్కొంది.ఈ తీర్పును బాధితురాలి కుటుంబం తీవ్రంగా తప్పుబడుతోంది. సెంగార్ బయటకు రావడం అంటే.. తమ ప్రాణాలకు ముప్పు తప్పదని ఆందోళన చెందుతోంది. ఈ మేరకు సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేయబోతోంది. అయితే ఇప్పుడు సీబీఐ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుండడంతో కేసు ఎలాంటి మలుపు తిరగబోతోందా? అనే ఆసక్తి నెలకొంది. ‘‘ దారుణోదంతానికి ఒడిగట్టి దోషిగా తేలిన వ్యక్తికి హైకోర్టు మళ్లీ బెయిల్ మంజూరుచేయడమేంటి? ఇది నా కుటుంబానికి మరణశాసనం రాయడమే. బెయిల్ రద్దు డిమాండ్తో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా’’ అని ఆమె అన్నారు. బెయిల్ను తీవ్రంగా తప్పుబడుతూ బాధితురాలి తల్లితోపాటు మహిళా హక్కుల కార్యకర్త యోగితా భయానా మంగళవారం రాత్రి ఢిల్లీలోని ఇండియాగేట్ సమీప మండీ హౌస్ వద్ద బైఠాయించి ధర్నా చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు వెంటనే వారిని అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. ఈ క్రమంలో బాధితురాలికీ గాయాలయ్యాయని యోగిత చెప్పారు. ‘‘దోషికి ఇలాగే బెయిల్ ఇస్తూ పోతే దేశంలోని ఆడబిడ్డలకు రక్షణ అనేదిఉంటుందా? మా విషయంలో మాత్రం ఈ తీర్పు మరణశాసనమే. న్యాయం పొందటంలో ధనికులు లాభపడతారు. మాలాంటి పేదలు ఓడిపోతారు. తీర్పు తర్వాత మమ్మల్ని లాయర్లతోనూ కలవనివ్వట్లేరు. వాళ్లను కలిసేందుకు వెళ్తుంటే సీఆర్పీఎఫ్ జవాన్లు అడ్డుకుని తిరిగి ఇంటికి పంపేస్తున్నారు. నా కుటుంబసభ్యులు, లాయర్లు, సాక్షులకు గతంలో ఇచి్చన పోలీస్భద్రతనూ ఉపసంహరించారు. ఇప్పుడు మాకు ప్రాణహాని ఎక్కువైంది. మా గతేంటి? దోషిని బెయిల్పై విడుదలచేస్తే మమ్మల్ని అయినా జైలుకు పంపండి. అతడి మిగతా జైలుశిక్షను నేను అనుభవిస్తా. అక్కడయినా క్షేమంగా ఉంటాం. సరైన ఉపాధి లేదు. అక్కడయినా తినడానికి తిండి దొరుకుతుందేమో’’ :::ఉన్నావ్ బాధితురాలి ఆవేదనసోనియా, రాహుల్లతో భేటీ ధర్నా తర్వాత బాధితురాలు తన తల్లితో కలిసి 10, జన్పథ్లోని సోనియాగాంధీ అధికారిక నివాసంలో సోనియా, రాహుల్గాంధీలను కలిశారు. నైతిక మద్దతు ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టులో నేరాన్ని నిరూపించి దోషిని బోనులో నిలబెట్టేలా అత్యంత ప్రతిభావంతులైన లాయర్ల బృందాన్ని ఇవ్వాలని ఆమె ఇరునేతలను కోరారు. పూర్తి సహాయసహకారాలు అందిస్తామని ఇరునేతలు బాధిత కుటంబానికి హామీ ఇచ్చారు. అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. ‘‘ న్యాయం కోసం పోరాడుతున్నా. ప్రధాని మోదీని కలవాలని నిర్ణయించుకున్నా. న్యాయపోరాటం చేస్తున్నందుకు రాహుల్ అభినందించారు’’ అని బాధితురాలు తర్వాత మీడియాతో చెప్పారు. ‘‘ అమలవుతున్న యావజ్జీవ కారాగారశిక్షను హఠాత్తుగా నిలుపుదలచేసి బెయిల్ ఇవ్వడం భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి అనుకుంటా. రేపిస్ట్లు అందరూ ఇలాగే విడుదలవుతారనే భయం ఇప్పుడు బాధితులందరి మనసుల్ని పురుగులా తొలిచేస్తోంది. ఇదే ప్రభుత్వం? ఇదేం పాలన?’’ అని బాధితురాలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదిలా ఉంటే.. సెంగర్ వర్గ ఓట్ల కోసమే కుల్దీప్ను యూపీ బీజేపీ సర్కార్ బయటకు రప్పించే ప్రయత్నం చేస్తోందని రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సిగ్గుచేటుఉన్నావ్లో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో దోషి కుల్దీప్ సెంగర్ జైలు నుంచి విడుదల కావడం దేశానికి సిగ్గు చేటు అని కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు బుధవారం రాహుల్ తన సామాజికమాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘సామూహిక అత్యాచార బాధితురాలి విషయంలో ప్రభుత్వం ఇంత నిర్దయంగా వ్యవహరించడం ఏ విధంగా సమర్థనీయం?. న్యాయం కోసం గొంతు వినిపించడానికి ధైర్యం చేయడమే ఆమె చేసి తప్పా?. బాధితురాలు పదే పదే వేధింపులకు గురవుతూ ప్రాణభయంతో జీవిస్తుంటే దోషికి బెయిల్ మంజూరు చేయడం అత్యంత దారుణం. బెయిల్ రావడం చాలా నిరాశపరిచింది. ఇది సిగ్గుచేటు. అత్యాచారం చేసిన వారికి బెయిల్ ఇవ్వడం, బాధితులను నేరస్థుల్లా చూడడం ఇదేం న్యాయం?. కేవలం ఒక మృత ఆర్థిక వ్యవస్థే కాదు ఇలాంటి అమానవీయ సంఘటనలతో మనం ఒక నిర్జీవ సమాజంగా విపరిణామం చెందుతున్నాం. ప్రజాస్వామ్యంలో అసమ్మతి గళం వినిపించడం హక్కు. దానిని అణచివేయడం నేరం. బాధితురాలు గౌరవం, భద్రత, న్యాయం పొందాలి. కానీ నిస్సహాయత, భయం, అన్యాయం కాదు’’ అని రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. -
‘డీజీపీ’ అర్హుల లిస్ట్ యూపీఎస్సీకి పంపండి
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డీజీపీ పోస్టుకు అర్హులైన వారి పేర్లతో ఐపీఎస్ అధికారుల ప్యానెల్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. యూపీఎస్సీ పంపిన వివరాలు అక్కడి నుంచి వచ్చిన ఆమోదంతో ఓ నివేదికను తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు శివధర్రెడ్డి నియామకాన్ని రద్దు చేస్తూ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పిటిషనర్కు తేల్చిచెప్పింది. తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా వేసింది. డీజీపీగా శివధర్రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన సామాజిక కార్యకర్త టి.ధన్గోపాల్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 2025న సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులు.. 2018లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై జస్టిస్ పుల్ల కార్తీక్ సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కమిషన్కు పంపిన ప్యానె ల్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, యూపీఎస్సీ మధ్య జరిగిన ఉత్తర ప్ర త్యుత్తరాల వివరాలను సమర్పించారు. ఆంధ్రప్ర దేశ్కు కేటాయించగా, తెలంగాణలో పనిచేస్తున్న 1994 బ్యాచ్ అధికారిణి అభిలాష బిస్త్ను ప్యానెల్లో చేర్చవచ్చా అని కమిషన్ను ప్రభుత్వం అడిగిందని, అందుకు యూపీఎస్సీ నుంచి ప్రతికూల సమాధానం వచ్చిందన్నారు. కమిషన్ కోరిన వివరణలు, ప్రభుత్వం ఇచ్చిన సమాధానాల్లో లోపాల కారణంగా డీజీపీ ప్రక్రియ ఆలస్యమైందని యూపీఎస్సీ తరఫు న్యాయవాది అజయ్కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల మేరకు అడిగిన వివరాలు పంపితే.. ప్రక్రియ వేగవంతం చేస్తామన్నారు. పార్టీ ఇన్ పర్సన్ (పిటిషనర్) వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా చేపట్టిన శివధర్రెడ్డి నియామకం చట్టవిరుద్ధమన్నారు. వెంటనే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. రెండు నెలలకుపైగా నిబంధనలకు విరుద్ధంగా ఆయన పదవిలో కొనసాగుతున్నారని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. శివధర్రెడ్డి నియామక రద్దుకు నిరాకరించారు. యూపీఎస్సీకి ఎంపిక ప్యానెల్ను పంపే ప్రక్రియ కొనసాగించాలన్నారు. నివేదిక అందజేసిన తర్వాత కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి సమయం ఇస్తామంటూ విచారణ వాయిదా వేశారు. ప్రకాశ్సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలివి...» డీజీపీ ఖాళీకి మూడు నెలల ముందే రాష్ట్రాలు ఐపీఎస్ల పేర్లను యూపీఎస్సీకి పంపాలి» కమిషన్ ముగ్గురితో కూడిన ప్యానెల్ను వెనక్కి పంపించాలి» అందులో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వాలు నియమించుకోవచ్చు» డీజీపీకి కనీసం రెండేళ్ల పదవీకాలం ఉండేలా రాష్ట్రం, యూపీఎస్సీ ఎంపిక ఉండాలి » యాక్టింగ్, తాత్కాలిక డీజీపీలను రాష్ట్రాలు నియమించుకోవడం నిషేధం» ఎంపిక చేసిన వ్యక్తి పదవీ విరమణ తర్వాత కూడా కొనసాగొచ్చు. అయితే, పొడిగింపునకు సహేతుక కారణం ఉండాలి» సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా నియామకాలుంటే నిలిపివేయబడతాయి. -
కొండలపై కత్తి!
ఒకసారి కాలంలో ఓ 300 కోట్ల ఏళ్లు వెనక్కి వెళ్లి, అంతరిక్షం నుంచి ప్రస్తుత భారతదేశాన్ని ఒక్కసారి చూస్తే? ఉత్తర ప్రాంతంలో కన్పించే ఏకైక భౌగోళిక స్వరూపం ఏమిటో తెలుసా? ఆరావళీ పర్వత శ్రేణులు! భూమిపై అత్యంత పురాతన పర్వతాల్లో ఒకటిగా అది గుర్తింపు పొందింది. కానీ, వందలాది కోట్ల ఏళ్లుగా అతి కఠినమైన కాలపరీక్షకు తట్టుకుని మరీ ఉనికిని కాపాడుకుని నిలిచిన ఆరావళీ శ్రేణులు మనిషి పేరాశ పాలిట పడి త్వరలోనే ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. వాటి పరిరక్షణకు తాము చిరకాలంగా చేస్తున్న ప్రయత్నాలకు సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పు గొడ్డలిపెట్టుగా మారిందని పర్యావరణవేత్తలు వాపోతున్నారు. ‘‘ఫలితంగా పంజాబ్, హరియాణా మొదలుకుని దేశ రాజధాని ఢిల్లీ దాకా ఆరావళి శ్రేణులు చూస్తుండగానే గనులుగా, రియల్ వెంచర్లుగా మారిపోవడం ఖాయం. అదే జరిగితే థార్ ఎడారి అడ్డూ అదుపూ లేకుండా విస్తరిస్తుంది. దాంతో ఉత్తరాదిలో చాలా భాగం అతి త్వరలోనే ఎడారిగా మారిపోతుంది’’అని హెచ్చరిస్తున్నారు! ఆరావళి. గుజరాత్ మొదలుకుని ఢిల్లీ దాకా 650 కిలోమీటర్ల పై చిలుకు విస్తరించిన పర్వత శ్రేణులు. ఉత్తరాదిని అన్నివిధాలా పెట్టని కోటలా కాపాడుకుంటూ వస్తున్నాయి. థార్ ఎడారి తూర్పు దిశగా విస్తరించకుండా అడ్డుకుంటున్నాయి. ఉత్తరాదిన అంతంత మాత్రమే ఉండే భూగర్భ జలాలను గుజరాత్ నుంచి ఢిల్లీ దాకా 4 రాష్ట్రాల పరిధిలో ఎప్పటికప్పుడు రీచార్జి చేయడమే గాక రాజధాని ప్రాంతంలోని అపార కాలుష్యాన్ని వీలైనంత మేరకు తగ్గిస్తున్నాయి.కోర్టు తీర్పుతో...ఆరావళి రగడ ఇప్పటిది కాదు. దశాబ్దాలుగా ఉన్నదే. సుప్రీంకోర్టు ఇటీలి తీర్పుతో తాజాగా అది మరోసారి రగులుకుంది. అసలు ఆరావళి పర్వత శ్రేణుల నిర్వచనం పరిధిలోకి వచ్చే ప్రాంతాలు ఏమిటన్న దానిపై కోర్టు చిరకాలంగా విచారణ జరుపుతూ వస్తోంది. ఈ విషయంలో కేంద్రం వాదనతో ఏకీభవిస్తూ గత నవంబర్ 20న కోర్టు తీర్పు వెలువరించింది. దానిప్రకారం పరిసర ప్రాంతాలతో పోలిస్తే కనీసం 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న వాటిని మాత్రమే గుట్టలుగా, అంటే ఆరావళీ ప్రాంతంగా గుర్తిస్తా రు! ఇది చాలా ప్రమాదకరమైన తీర్పు అని విపక్షాలు మొత్తుకుంటున్నాయి. హరియాణా, దేశ రాజధాని ప్రాంతంలో అస్మదీయులైన రియల్టీ, ఇన్ఫ్రా వ్యాపార దిగ్గజాలకు మేలు చేసేందుకే కేంద్రం ఈ వాదన లేవనెత్తింది. దానితో సుప్రీంకోర్టు ఏకీభవించడం తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుంది. దోపిడీదారులు ఇప్పుడిక చట్టబద్ధంగానే పేట్రే గుతారు’’అని పేర్కొంటున్నాయి. పర్యావరణవేత్తలు కూడా ఈ వాదనతో ఏకీభవిస్తున్నారు. ఆరావళి శ్రేణుల్లో దాదాపు 90 శాతం ప్రాంతం 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తే ఉంటుందని వారు గుర్తు చేస్తున్నారు. ‘‘కనుక నయా నిర్వచనం ప్రకారం అది గుట్టల లెక్కలోకి రాదు. కనుక అక్కడ గనులు తవ్వుకోవడం మొదలుకుని రియల్టీ వెంచర్ల దాకా ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఇది పర్యావరణానికే గాక మొత్తం ఉత్తరాదికే తీరని నష్టం చేస్తుంది. చూస్తుండగానే ఢిల్లీ నుంచి పంజాబ్ దాకా ఏమాత్రమూ నివాసయోగ్యం కాకుండా పోవ డం ఖాయం’’అని వారు హెచ్చరిస్తున్నారు.కొట్టిపారేస్తున్న కేంద్రంపాలక బీజేపీ మాత్రం ఆరావళి విషయమై విపక్షాలు, పర్యావరణవేత్తల ఆందోళనలను అసంబద్ధమైనవిగా కొట్టిపారేస్తోంది. ఆరావళి శ్రేణుల నిర్వచనం విషయంలో సుప్రీంకోర్టు నిజానికి ఎలాంటి సడలింపులూ ఇవ్వలేదని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పుకొచ్చారు. ఆరావళి శ్రేణులు నిత్యం పచ్చగా ఉండాలన్నదే కేంద్రం ఆకాంక్ష అన్నా రు. అయితే, ‘100 మీటర్ల ఎత్తు’నిర్వచనం ప్రపంచవ్యాప్తంగా అంగీకరించినదేనంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారాయన! ఆరావళి శ్రేణుల్లో కేవలం 0.19 శాతం ప్రాంతంలో మాత్రమే మైనింగ్కు అనుమతిస్తున్నట్టు వివరించారు. మొత్తమ్మీద 90 శాతం పర్వతాలను పూర్తిస్థాయిలో పరిరక్షిస్తున్నామన్నారు.సేవ్ ఆరావళిఅతి పురాతనమైన ఆరావళి పర్వత శ్రేణులను విధ్వంసం బారినుంచి కాపాడుకుందామంటూ ఆన్లైన్లో ఉద్యమం ఊపందుకుంటోంది. ‘సేవ్ ఆరావళి’హాష్ట్యాగ్కు సోషల్ సైట్లలో మద్దతు వెల్లువెత్తుతోంది. ఇది క్రమంగా ఉత్తరాదిని దాటుకుని జాతీయ ఆందోళనగా రూపుదిద్దుకునే సూచనలు కన్పిస్తున్నాయి.–సాక్షి, నేషనల్ డెస్క్ -
పౌరుల స్వేచ్ఛ...ప్రభుత్వ తొలి బాధ్యత
న్యూఢిల్లీ: ‘స్వేచ్ఛ దేశ పౌరులకు ప్రభుత్వాలిచ్చే కానుక కాదు. వారిపట్ల వాటి తొలి బాధ్యత. ఎందుకంటే రాజ్యాంగం వారికి కల్పించిన మౌలిక హక్కు’అని అత్యున్నత న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది. పాస్ పోర్ట్ రెన్యువల్ కోసం భావి విదేశీయానాలు, వీసా వివరాలను పాస్పోర్ట్ అథారిటీ డిమాండ్ చేయడం సరికాదని స్పష్టం చేసింది. ‘జీవనోపాధి, అవకాశాల అన్వేషణలో భాగంగా చట్టబద్ధంగా ఎక్కడికైనా వెళ్లేందుకు, ప్రయాణించేందుకు పౌరులకు అన్ని హక్కులూ ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఇందుకు వీలు కల్పిస్తోంది’అని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎ.జి.మసీహ్ల ధర్మాసనం గుర్తు చేసింది. క్రిమినల్ ప్రొసీడింగ్స్ పెండింగ్లో ఉన్న ఉదంతాల్లో నిందితుల విదేశీయానం సంబంధిత కోర్టుల దృష్టిలో ఉందా లేదా అన్నది మాత్రమే దాని పని అని పేర్కొంది. జార్ఖండ్ బొగ్గు గనుల కేటాయింపు కేసులో ఎన్ఐఏ విచారణ ఎదుర్కొంటున్న మహేశ్ కుమార్ ఝా అనే వ్యక్తి పిటిషన్ విచారణ సందర్భంగా శుక్రవారం ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘క్రిమినల్ కేసులున్నంత మాత్రాన సదరు వ్యక్తికి పాస్పోర్ట్ ఉండొద్దని, రెన్యువల్ చేయించుకోవద్దని ఏమీ లేదు. సంబంధిత క్రిమినల్ కోర్టు అనుమతి, పిలిచినప్పుడల్లా విచారణకు హాజరవుతానని నిందితుని ప్రమాణ పత్రం ఉంటే చాలు’అని స్పష్టం చేసింది. -
26న విడుదల చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు కస్టడీని సుప్రీంకోర్టు మరో వారం పొడిగించింది. డిసెంబర్ 25 వరకు పోలీసు విచారణకు అనుమతి ఇచ్చిన కోర్టు, 26న ఆయన్ను విడుదల చేసి ఇంటికి పంపాలని ఆదేశించింది. ప్రభాకర్రావును జైలుకు పంపాల్సిన అవసరం లేదని పేర్కొంటూ.. తదుపరి విచారణ జరిగే 2026 జనవరి 16 వరకు అరెస్టు కూడా చేయరాదని స్పష్టం చేసింది. ’ఆయన మా ఉత్తర్వుల మేరకే సరెండర్ అయ్యారు..అలాంటప్పుడు విచారణ పూర్తయ్యాక మళ్లీ రిమాండ్కు ఎందుకు పంపాలి?’అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కస్టడీలో ఉన్న సమయంలో ఇంటి భోజనం, మందులు అనుమతించాలని తెలిపింది. ప్రభాకర్రావు కూడా దర్యాప్తునకు సహకరించాలని, విచారణకు పిలిచినప్పుడు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసును జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్ల ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రభాకర్రావు కస్టడీ విచారణ రిపోర్టును కోర్టుకు సమరి్పంచింది. అనంతరం ఇరుపక్షాలు వాదనలు విన్పించాయి. కాల్చమని చెబితే కాల్చేస్తారా? ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ‘విచారణకు ప్రభాకర్రావు సహకరించడం లేదు. డివైస్లలో ఎలాంటి సమాచారం లేదు. ముందుగానే వాటిని ధ్వంసం చేశారు. దర్యాప్తు ఇంకా కీలక దశలో ఉంది. నిందితుడి నుంచి రాబట్టాల్సిన సమాచారం చాలా ఉంది. అందువల్ల మరో వారం రోజుల కస్టడీ అవసరం. కస్టడీ గడువు ముగిసిన తర్వాత, తదుపరి విచారణ జరిగే వరకు ప్రభాకర్రావును జ్యుడీషియల్ రిమాండ్కు తరలించేలా ఆదేశాలివ్వాలి. నక్సలైట్ల పేరుతో అనేక మంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారు. జడ్జిలు, డ్రైవర్ల ఫోన్లను సైతం ట్యాప్ చేశారు. ఇది రాజకీయ సమస్య కాదు. వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశం. ప్రభుత్వ పెద్దలు.. ఎవరినైనా కాల్చమని చెబితే కాలుస్తారా?..’అంటూ వాదించారు. అసలు మీరెందుకు భయపడుతున్నారు? అయితే ఈ అభ్యర్థనను జస్టిస్ నాగరత్న తోసిపుచ్చారు. ’పోలీసు విచారణ కోసమే ప్రభాకర్రావు వచ్చారు. అది పూర్తయిన తర్వాత ఆయన్ను జ్యుడీషియల్ రిమాండ్కు తరలించాల్సిన అవసరం ఏముంది?..’అని ప్రశ్నించారు. రిమాండ్ ప్రతిపాదనను తిరస్కరించారు. ’అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్య వహారం గురించి మీరెందుకు (ప్రభుత్వం) అంతగా భయపడుతున్నారు? ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నారు? ఎలాంటి తప్పు చెయ్యనప్పుడు ఎవరైనా మీ ఫోన్ వింటే ఏమవుతుంది..’అని ప్రశ్నించారు. అది విచారణ కాదు.. ‘చైనీస్ టార్చర్’ అంతకుముందు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు రంజిత్కుమార్, దామా శేషాద్రినాయుడు వాదించారు. ‘ప్రభాకర్రావు వయసు 69 ఏళ్లు. కేన్సర్ సర్వైవర్. ఆయన్ను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు.. రోజుకు 12 గంటల పాటు కూర్చోబెట్టి నరకం చూపిస్తున్నారు. అడిగిన ప్రశ్నలే వందసార్లు అడుగుతూ వేధించడం దర్యాప్తు కాదు. ఇది మనిషిని మానసికంగా కుంగదీసే ‘చైనీస్ టార్చర్ మెథడ్’. తనకు వ్యతిరేకంగా తానే స్టేట్మెంట్ ఇచ్చేలా వేధిస్తున్నారు..’అని చెప్పారు. ‘ఒక సీనియర్ సిటిజన్ను, 30 ఏళ్లు ప్రజలకు సేవలందించిన అధికారిని ఇలా రోడ్డున పడేయడం దారుణం. సిట్ బృందాన్ని పెంచింది దర్యాప్తు కోసం కాదు. షిఫ్టుల వారీగా మారుతూ వృద్ధుడైన నిందితుడిని వేధించడానికే..’అని వాదించారు. -
ప్రభాకర్రావుకు మరో షాక్
సాక్షి, ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్పెషల్ ఐబీ మాజీ చీఫ్, ఈ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్రావుకు మరో షాక్ తగిలింది. దర్యాప్తునకు సహకరించాల్సిందేనని మరోసారి స్పష్టం చేస్తూ.. ఆయన కస్టడీని వారం పొడిగిస్తూ శుక్రవారం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్రావుకు సంబంధించిన కస్టడీ ఇంటరాగేషన్ స్టేటస్ రిపోర్టును ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఇవాళ కోర్టుకు సమర్పించింది. ‘‘ప్రభాకర్రావు కీలక విషయాలు దాటవేస్తున్నారు. విచారణకు ఏమాత్రం సహకరించలేదు’’ అని తెలంగాణ ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ తరుణంలో.. ఆయన్ని మరికొన్ని రోజులు విచారణ జరపాల్సి ఉందని. కస్టడీ పొడిగించాలని మరో న్యాయవాది సిద్ధార్థ లూత్రా విజ్ఞప్తి చేశారు.పోలీస్ కస్టడీలో విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదు. డివైజ్లలో ఎలాంటి సమాచారం లేదు. ముందుగానే వాటిని ధ్వంసం చేశారు. మరో వారం రోజుల పోలీస్ కస్టడీ అవసరం. నక్సలైట్ల పేరుతో అనేక మంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారు. జడ్జిలు, డ్రైవర్ల ఫోన్లను సైతం ట్యాప్ చేశారు. ఇది రాజకీయ సమస్య కాదు. వ్యక్తిగత గోప్యత కు సంబంధించిన అంశం. ప్రభుత్వ పెద్దలు.. ఎవరినైనా కాల్చమని చెబితే కాలుస్తారా?.. ప్రభాకర్ రావు అనేక సాక్షాధారాలను ధ్వంసం చేశారు.. అని తుషార్ మెహతా, సిద్ధార్థ్ లూత్రా వాదించారు. ప్రభాకర్ రావు తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘‘విచారణ పేరుతో ప్రభాకరరావును వేధిస్తున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు ఏకకాలంలో విచారిస్తున్నారు. ప్రభాకర్ రావు 69 ఏళ్ల క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడు. కనీసం మానవత్వం చూపించడం లేదు. తనకు వ్యతిరేకంగా తానే స్టేట్మెంట్ ఇచ్చేలా వేధిస్తున్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 20, 21 ఉల్లంఘించడమే. 17 సార్లు పిలిచి దాదాపు 96 గంటలకు పైగా విచారించారు అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే తెలంగాణ పోలీసుల తరఫు లాయర్ల వాదనలతో ఏకీభవించిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం .. ఆయన కస్టడీని మరో వారం రోజులు(డిసెంబర్ 25 దాకా) పొడిగించింది. ఆ మరుసటిరోజు ఆయన్ని విడుదల చేయాలని సిట్ను ఆదేశించింది. అదే సమయంలో తదుపరి విచారణ దాకా ప్రభాకర్రావు విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు (అరెస్ట్.. థర్డ్ డిగ్రీలాంటి చర్యలు) తీసుకోవద్దని సిట్కు స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు తదుపరి విచారణ జనవరి 16కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే.. ముందస్తు బెయిల్ను తిరస్కరిస్తూనే అరెస్ట్ నుంచి ఇంతకాలం ఊరటగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కోర్టు డిసెంబర్ 11వ తేదీన ఎత్తేసింది. ఆయన్ని తక్షణమే సిట్ ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. వారంపాటు ఆయన్ని కస్టడీలోకి తీసుకుని విచారించాలని.. ఆ సమయంలో థర్డ్ డిగ్రీ ఉపయోగించకూడని.. విచారణ వివరాలను తమకు నివేదిక రూపంలో సమర్పించాలని కోర్టు ఆ సమయంలో సిట్కు సూచించింది. వారం రోజుల కస్టడీ విచారణ ముగియడంతో శుక్రవారం ఆ నివేదికను కోర్టుకు అందించింది. అయితే విచారణలో ఆధారాలు ముందుంచి ప్రశ్నించినా కూడా.. ఆయన నోరు మెదపలేదని తెలుస్తోంది. ప్రభాకర్రావుకు సంబంధించి ఫోన్లు, ల్యాప్ట్యాప్, ట్యాబ్లలోని ఐక్లౌడ్, జీమెయిల్ అకౌంట్లలోని సమాచారాన్ని సిట్ కీలకంగా భావిస్తోంది. కానీ, అప్పటికే ఆయన ఆ సమాచారం అంతా డిలీట్ చేశారు. దీంతో ఫోరెన్సిక్ నివేదిక మీద సిట్ ఆశలు పెట్టుకుంది. మరోవైపు.. వారం కస్టడీ పొడిగింపుతోనైనా ఆయన్నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు సిట్ ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది. -
ఇదో లగ్జరీ లిటిగేషన్.. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్కు అంతర్జాతీయ ప్రమాణాలుండేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిల్ను ‘లగ్జరీ లిటిగేషన్’ అంటూ సుప్రీంకోర్టు కొట్టివేసింది. దేశంలో ఇప్పటికీ చాలా మంది ప్రజలకు కనీసం మంచినీరు కూడా దొరకని పరిస్థితులున్నాయని పేర్కొంది.‘ఈ దేశంలో తాగు నీరు ఎక్కడుంది, మేడమ్? ప్రజలకు తాగు నీరే అందుబాటులో లేదు. నీటి నాణ్యత విషయం తర్వాత మాట్లాడుకుందాం’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొనగా, ఇవన్నీ ఖరీదైన పిటిషన్లంటూ ధర్మాసనంలో ఉన్న జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి వ్యాఖ్యానించారు. మన దేశంలో విక్రయించే ప్యాకేజ్డ్ తాగు నీటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) వంటి సంస్థలు నిర్ణయించిన అంతర్జాతీయ ప్రమాణాలుండేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సారంగ్ వామన్ యద్వాద్కర్ వేసిన పిటిషన్పై సీనియర్ లాయర్ అనితా షెనాయ్తో ధర్మాసనం పైవ్యాఖ్యలు చేసింది. అసలు, మీ ఇంట్లో మంచినీరు ఉందా అని ప్రశ్నించింది.దేశంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను తాము మరువలేమని తెలిపింది. పట్టణ ప్రాంత పరిస్థితులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపిస్తోందని పేర్కొన్న ధర్మాసనం.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బావుల్లో నీటిపైనే ఆధారపడుతున్నారని, వారెలాంటి అనారోగ్యాలకు గురికావడం లేదని తెలిపింది. అమెరికా, జపాన్, ఈయూ తరహా మార్గదర్శకాలను మనం అమలు చేయగలమని భావిస్తున్నారా అంటూ నిలదీసింది. పేదల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని, ఇలాంటివన్నీ కేవలం పట్టణవాసులు, ధనికుల భయాందోళనల నుంచి వస్తున్న పిటిషన్లు మాత్రమేనని పేర్కొంది. -
ఆ వీడియో చూసి.. మానవత్వం అంటే ఏమిటో చెప్పండి..!
న్యూఢిల్లీ: ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) వీధి కుక్కలపట్ల అమానవీయంగా వ్యవహరిస్తోందంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘తదుపరి విచారణ సమయంలో ఒక వీడియో చూపిస్తాము, అమానవీయం ఏమిటో అప్పుడే మీరు చెబుదురుగాని అంటూ వ్యాఖ్యానించింది. దేశ రాజధాని ఢిల్లీలో కుక్క కాట్లతో చిన్నారులు రేబిస్ బారినపడుతున్నారంటూ వచి్చన కథనంపై సుమోటోగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం..నవంబర్ 7వ తేదీన విద్యాసంస్థలు, ఆస్పత్రులు, రైల్వే స్టేషన్లలో వీధికుక్కలు, ఇతర జంతువులు కనిపించరాదని, వీధికుక్కలను పట్టుకుని స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేయించాలని దేశవ్యాప్త ఆదేశాలివ్వడం తెల్సిందే. అయితే, ఢిల్లీలోని అధికారులు అదనంగా మరికొన్ని నిబంధనలను చేర్చి, వీధి కుక్కలపై దయాదాక్షిణ్యం లేకుండా ప్రవర్తిస్తున్నారంటూ సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ గురువారం వాదించారు. అయితే, దీనిపై ఇప్పుడేమీ తాము విచారణ చేపట్టబోమని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం స్పష్టం చేసింది. జనవరి 7వ తేదీన జరిగే విచారణ సందర్భంగా తామొక వీడియో చూపిస్తామని, దాన్ని చూశాక మానవత్వం గురించి మాట్లాడుతామంటూ వ్యాఖ్యానించింది. కుక్కల పట్ల అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న వైఖరిపై తామూ ఒక వీడియో చూపుతామని కపిల్ సిబాల్ తెలిపారు. -
ఎక్స్టెన్షన్ ఇస్తే తప్పేముంది?
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు కస్టోడియల్ విచారణ గురువారంతో ముగిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత శుక్రవారం ఆయన జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో ఉన్న సిట్ కార్యాలయంలో లొంగిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన్ను ఏసీపీ పి.వెంకటగిరితో పాటు సంయుక్త సీపీ తఫ్సీర్ ఇక్బాల్ సైతం వివిధ కోణాల్లో ప్రశ్నించారు. అయితే ఈ విచారణ నేపథ్యంలో ఎలాంటి అదనపు సమాచారం లభించలేదని పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి శుక్రవారం సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. మరికొన్ని రోజుల పాటు ప్రభాకర్రావును కస్టడీలోకి ఇవ్వాలని, ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయాలని న్యాయస్థానాన్ని కోరనున్నట్లు సమాచారం. సుదీర్ఘకాలం ఎస్ఐబీలోనే విధులు 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్నాళ్లు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీసీపీగా పని చేసిన ప్రభాకర్రావు ఆపై 2016లో ఎస్ఐబీకి డీఐజీగా వెళ్లారు. ఐజీగా పదోన్నతి పొందినా అక్కడే కొనసాగారు. చివరకు 2020లో పదవీ విరమణ చేసిన ప్రభాకర్రావును నాటి ప్రభుత్వం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా (ఓఎస్డీ) నియమించింది. హోదా ఏదైనా ఎస్ఐబీ చీఫ్గా కొనసాగారు. 2023 డిసెంబర్ వరకు ఎక్స్టెన్షన్పై కొనసాగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్రావును సిట్ అధికారులు ఆయన ఎక్స్టెన్షన్ అంశంపై ప్రశ్నించారు. పరిపాలనా అవసరాలకే ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ లభించడానికి కారణం ఏమిటని అడిగారు. అక్రమ వ్యవహారాలకు పాల్పడిన నేపథ్యంలోనే ఇది సాధ్యమైందా? అనే కోణంలో ఆరా తీశారు. దీంతో.. ఏ ప్రభుత్వమైనా ఆయా పోస్టులకు ఉన్న ప్రాధాన్యత, అధికారుల సమర్థత, పరిపాలన అవసరాలకు అనుగుణంగానే ఎక్స్టెన్షన్ ఇస్తుందని ఆయన సమాధానం ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అనేక విభాగాల్లో పని చేసి, పదవీ విరమణ పొందిన అధికారులకు ఎక్స్టెన్షన్ ఇస్తోందని, అంతమాత్రాన వాళ్లంతా అక్రమాలకు పాల్పడుతున్నట్లేనా? అంటూ ఎదురు ప్రశ్నించారు. భవిష్యత్తులో మరో ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు ఎక్స్టెన్షన్పై పోలీసు విభాగంలో ఓఎస్డీలుగా పని చేస్తున్న వారిపైనా కేసులు పెడతారా? అని అడిగారు.. పార్టీలకు విరాళాలు వ్యాపారుల ఇష్టం..ప్రభాకర్రావు టీమ్ టార్గెట్ చేసిన వారిలో బడా బిల్డర్లు, జ్యువెలరీ దుకాణాల యజమానులు, రియల్టర్లతో పాటు ప్రముఖ వ్యాపారులు ఉన్నారన్నది సిట్ ఆరోపణ. వారి ఫోన్లను ట్యాప్ చేసి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని, మాట వినని వ్యాపారుల వాట్సాప్లకు ట్యాపింగ్ చేసిన ఆడియోలు పంపి లొంగదీసుకున్నారని పేర్కొంది. కొందరు నాయకుల ఆదేశాల మేరకు వివిధ రంగాలకు చెందిన వ్యాపారులు, కాంట్రాక్టర్లను బెదిరించి ఓ పార్టీ కోసం ఎలక్టోరల్ బాండ్స్ ఖరీదు చేయించారని అనుమానించిన సిట్ ఆ కోణంలోనూ సిట్ను ప్రశ్నించింది. అయితే ఎలక్టోరల్ బాండ్స్తో పాటు పార్టీలకు విరాళాలు ఇవ్వడమనేది ఆయా వ్యాపారులకు సంబంధించిన అంశమని ప్రభాకర్రావు సమాధానమిచ్చారని తెలిసింది. -
బార్ కౌన్సిల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో 30 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు న్యాయవాది గుడిమళ్ల సుభాషిణి. ఈ మేరకు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ కల్పిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని పేర్కొంది. ఈ నెల 20వ తేదీన బార్ కౌన్సిల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా, జనవరి 30వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 10వ తేదీన కౌంటింగ్ జరుగనుంది. -
ఆ టోల్ప్లాజాలను మూసేయండి
న్యూఢిల్లీ: టోల్ఫీజు కట్టేందుకు తరచూ కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిల్చిపోతుండటం, వందల వాహనాల నుంచి ఒకేచోట వెలువడుతున్న పొగ, కాలుష్యం కారణంగా ఢిల్లీ–నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) పరిధిలో కాలుష్యఛాంబర్లుగా తయారైన 9 టోల్ప్లాజాలను తక్షణం తాత్కాలికంగానైనా మూసేయాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. లేదంటే కనీసం ఢిల్లీ–ఎన్సీఆర్ నుంచి సుదూరాలకు తరలించాలని జాతీయరహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ), మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ)లకు సుప్రీంకోర్టు బుధవారం సూచించింది. వారంలోపు మీ నిర్ణయం తెలపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పాంఛోలీల ధర్మాసనం ఆదేశించింది. టోల్ప్లాజాల తాత్కాలిక మూసివేత లేదా వేరే చోట ఏర్పాటు ద్వారా హస్తిన సరిహద్దుల్లో తీవ్ర వాయుకాలుష్యానికి కళ్లెం వేయొ చ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘చలికాలంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరగడం అనేది ఒక వార్షిక తంతుగా తయారైంది. వాయుకాలుష్యానికి ఇకనైనా చెక్పెట్టేలే చర్యలు తీసుకోండి. భారత్ స్టేజ్–4 స్థాయిలో తక్కువ ఉద్గారాలను వెదజల్లని వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ ఆగ స్ట్ 12న మేం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తాం. ఇక నర్సరీ నుంచి ఐదో తరగతి చిన్నారులు నేరుగా పాఠశాలకు రావొద్దంటూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోబోం. ఎందుకంటే త్వరలోనే చిన్నారులకు శీతాకాల సెలవు రాబోతున్నాయి. అప్పుడెలాగు పిల్లలు పాఠశాలకు రారు. ఆమాత్రందానికి మేం జోక్యం చేసుకోవడం అనవసరం’’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎంసీడీకి పరిహారం ఇవ్వండి ‘‘ఢిల్లీలోకి ఎంట్రీ పాయింట్లుగా మారిన ఈ 9 టోల్బూత్లు ప్రస్తుతం ఎంసీడీ నిర్వహిస్తోంది. వీటిని తాత్కాలికంగా మూసేయండి. మూసివేత కారణంగా ఎంసీడీ చవిచూసే నష్టాలను ఎన్హెచ్ఏఐ భర్తీచేయొచ్చేమో యోచించండి. తాత్కాలికంగా ఆదాయం కోల్పోయేందుకు ఎంసీడీ సిద్ధపడాలి. ఆ మేరకు తోడ్పాటునందించేలా ఎంసీడీ ముందుకురావాలి. ఈ విషయంలో ఎంసీడీ తన నిర్ణయాన్ని వారంలోపు తెలుపుతూ నివేదికను మా ముందు ఉంచండి’’అని ఎంసీడీని ధర్మాసనం ఆదేశించింది. కన్నాట్ ప్లేస్లోనూ పెట్టేస్తారా? కేసు విచారణ సందర్భంగా సీజేఐ ఒకింత అసహనంవ్యక్తంచేశారు. ‘‘గురుగ్రామ్ సరిహద్దులోని ఒక టోల్ప్లాజా వద్ద గంటల తరబడివాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో వందల వాహనాల నుంచి దట్టమైన పొగ ఒకేచోట పరుచుకుంటోంది. జనవరిదాకా టోల్ప్లాజాను తీసేస్తామని అధికారులు ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు?. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఢిల్లీ నడిబొడ్డున ఉన్న కన్నాట్ ప్లేస్ ప్రాంతంలోనూ టోల్ప్లాజా కట్టేస్తారు. ఎందుకంటే మీకు టోల్ప్లాజా నగదు వసూళ్లు మాత్రమే ముఖ్యంకదా? టోల్గేట్లు ఆదాయాన్ని కళ్లజూపిస్తాయేమో అంతకంటే ఎక్కువగా కాలుష్యాన్నీ తీసుకొస్తున్నాయి. ఈ విషయంలో మీరు నిర్మాణాత్మకమైన ప్రణాళికతో రండి. జనవరి 31వ తేదీదాకా టోల్ప్లాజా ఉండబోదని ధీమాగా చెప్పగలిగేలా ఒక ప్లాన్తో రండి’’అని మున్సిపల్ కార్పొరేషన్కు సీజేఐ సూచించారు. -
రఘురామకు సుప్రీంకోర్టులో భారీ షాక్
సాక్షి, అమరావతి: వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బ్యాంకుల నుంచి రుణాల రూపంలో తీసుకుని ఎగ్గొట్టిన వ్యవహారంలో మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, ఆయన చైర్మన్, ఎండీగా ఉన్న ఇండ్ భారత్ కంపెనీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టినందుకు నమోదు చేసిన కేసులో దర్యాప్తు చేపట్టేందుకు సీబీఐకి లైన్ క్లియర్ చేసింది. ఈ కేసు విషయంలో ముందుకెళ్లొద్దంటూ 2022 సెపె్టంబర్ 30న తానిచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. అలాగే కేసులు నమోదు చేసే ముందు సీబీఐ తమకు నోటీసులు ఇవ్వలేదని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్న రఘురామకృష్ణరాజు, ఆయన కంపెనీ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో నిందితులకు ముందస్తు నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ఇదీ జరిగింది.. రఘురామకృష్ణరాజు, ఆయన చైర్మన్, ఎండీగా ఉన్న ఇండ్ భారత్ పవర్, ఇండ్ భారత్ ఇన్ఫ్రాలతో సహా ఇతర అనుబంధ సంస్థలు పలు ఆర్థిక సంస్థల నుంచి దాదాపు రూ.947.71 కోట్ల రుణం తీసుకున్నాయి. అలాగే పలు జాతీయ బ్యాంకుల కన్సార్షియం నుంచి కూడా రూ.826.17 కోట్ల రుణాలు తీసుకున్నాయి. థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామంటూ బ్యాంకుల నుంచి తీసుకున్న ఈ రుణాలను రఘురామరాజు కంపెనీలు దారి మళ్లించాయి. ఇతర బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. విచిత్రమేమిటంటే.. ఆ ఫిక్స్డ్ డిపాజిట్లను మళ్లీ తనఖా పెట్టి, మరోసారి రుణాలు తీసుకున్నారు. ఈ మొత్తాన్ని కూడా దారి మళ్లించారు. మే 2012 నుంచి మే 2017 వరకు ఐదేళ్ల పాటు నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. రుణాల ఎగవేతపై, రఘురామకృష్ణరాజు మోసాలపై పలు ఆరి్థక సంస్థలు, బ్యాంకుల కన్సార్షియం 2019లో సీబీఐకి ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదు ఆధారంగా సీబీఐ రఘురామకృష్ణరాజు, ఆయన కంపెనీలపై ఫోర్జరీ పత్రాల సృష్టి, నిధులు స్వాహా చేయడం వంటి అభియోగాలపై ఐపీసీ సెక్షన్లు 120బీ (కుట్ర), 420 (మోసం), 467, 468, 471 (ఫోర్జరీ) కింద కేసులు నమోదు చేసింది. దీనిపై రఘురామకృష్ణరాజు, ఆయన కంపెనీలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం, రఘురామకృష్ణరాజు, ఆయన కంపెనీలపై ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దని ఆదేశించింది. అటు తరువాత ఈ ఉత్తర్వులను 2021లో హైకోర్టు ఎత్తివేసింది. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు.. హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రఘురామకృష్ణరాజు, ఆయన కంపెనీ ఇండ్ భారత్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా 2022లో సుప్రీంకోర్టు ధర్మాసనం, రఘురామకృష్ణరాజుపై నమోదు చేసిన కేసులో ముందుకెళ్లొద్దని సీబీఐని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తాజాగా మంగళవారం ఈ వ్యాజ్యంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కాగా రఘురామకృష్ణరాజు తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదిస్తూ.. తమకు సహజ న్యాయ సూత్రాల ప్రకారం నోటీసు ఇవ్వలేదని, తమ వాదన వినకుండానే కేసులు పెట్టారని అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టులో ఇంకా తుది తీర్పు రాలేదని, తమకు వాదన వినిపించే హక్కు కల్పించలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఫ్రాడ్ డిక్లరేషన్ వల్లే ఎఫ్ఐఆర్ వచ్చిందని, కాబట్టి రక్షణ కల్పించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఎఫ్ఐఆర్ నమోదు చేసే దశలో అది వర్తించదని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. బ్యాంకులు ఇచ్చిన ఫ్రాడ్ డిక్లరేషన్పై గానీ, ఎఫ్ఐఆర్లోని అంశాలపై గానీ పిటిషనర్లకు అభ్యంతరాలు ఉంటే చట్టప్రకారం సంబంధిత న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని సూచించింది. మాజీ ఎమ్మెల్సీ కేసులోనూ..బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ఆయన కంపెనీల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇదే రకమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై నమోదు చేసిన కేసు విషయంలో ముందుకెళ్లేందుకు సీబీఐ, బ్యాంకులకు అనుమతిచ్చింది. నారాయణరెడ్డి , ఆయన కంపెనీలు సైతం పలు బ్యాంకుల నుంచి దాదాపు రూ.500 కోట్ల మేర రుణాలు తీసుకుని ఎగవేశారు. దీనిపై పలు బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. దీంతో సీబీఐ నారాయణరెడ్డి, ఆయన కంపెనీలపై కేసులు నమోదు చేసింది. -
వైఎస్ జగన్పై దర్యాప్తు అవసరం లేదు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చంద్రబాబు చేతిలో పావుగా మారి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురదజల్లేందుకు యత్నించిన ఎల్లో మీడియా, నర్రెడ్డి సునీతలకు సీబీఐ కోర్టు గట్టిగా అక్షింతలు వేసింది. వీళ్లంతా గత కొన్నేళ్లుగా చేస్తున్నదంతా కేవలం దుష్ప్రచారమేనని, అందులో ఎంతమాత్రమూ వాస్తవం లేదని సీబీఐ కోర్టు తీర్పు సాక్షిగా స్పష్టమయ్యింది. నిరాధార ఆరోపణలతో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించాలనుకున్న కుట్రలన్నీ బెడిసి కొట్టాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలన్న పిటిషన్పై విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేకన్యాయస్థానం విస్పష్టంగా తీర్పును వెల్లడించింది. రెండువారాలపాటు దాదాపు 20 గంటల సేపు వాదనలు విన్న సీబీఐ కోర్టు 161 పేజీల సుదీర్ఘమైన, స్పష్టమైన తీర్పును వెలువరించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతిపై ఎలాంటి తదుపరి దర్యాప్తు అవసరం లేదని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఏ వ్యక్తి మరణించినా, అతని సమీప బంధువులకు తెలియజేయడం చాలా సహజమని.. వివేకా హత్య విషయం జగన్కు తెలియజేయడాన్ని తప్పుబట్టడంగానీ, అనుమానించడంగానీ సరికాదని కోర్టు స్పష్టం చేసింది. వివేకా హత్యకు సంబంధించి వైఎస్ జగన్కు ముందే కాల్ వచ్చిందంటూ చంద్రబాబు, ఆయన చేతిలో పావుగా మారిన సునీత, ఎల్లోమీడియా చేసిందంతా దుష్ప్రచారమేనని, అంతా కట్టుకథేనని ఈ తీర్పును బట్టి స్పష్టమయ్యింది. స్వయంగా కన్నతండ్రిని అత్యంత కిరాతకంగా హత్యచేసిన దస్తగిరి బైట దర్జాగా తిరుగుతుంటే ప్రశ్నించాల్సిన సునీత.. చంద్రబాబు కేసులు వాదించే సుప్రీంకోర్టు న్యాయవాది లూథ్రా దస్తగిరి న్యాయవాదిగా మారి వాదిస్తుంటే పట్టించుకోని సునీత.. చేస్తున్న ఆరోపణలన్నీ దిగజారుడు ఆరోపణలేనని సీబీఐ కోర్టు తీర్పుతో వెల్లడైంది.చంద్రబాబు చేతిలో పావుగా మారి సీబీఐ కోర్టును సైతం తప్పుదోవ పట్టించేందుకు సునీత ప్రయతి్నంచినట్లు ఈ తీర్పును బట్టి అర్ధమవుతోంది. ‘వైఎస్ జగన్ స్వయానా వివేకా సోదరుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు. జగన్ తాతగారైన రాజారెడ్డికి, వైఎస్ భాస్కర్రెడ్డి తండ్రి చిన్న కొండారెడ్డి కుటుంబాలకు ఏదో చిన్న ఆస్తి తగాదాలు తప్ప.. జగన్, వివేకాకు మధ్య ఎలాంటి వివాదాలు లేవన్నది ప్రాసిక్యూషన్ వాదన’ అని పేర్కొంది. నాటి సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, సాంబశివారెడ్డిలను విచారించినా ఎలాంటి ప్రయోజనం ఉండదంటూ సునీత విజ్ఞప్తిని తిరస్కరించింది. చార్జిïÙట్ ప్రకారం వారికి హత్యతో ఏదైనా సంబంధం ఉన్నట్లు ఎక్కడా కనిపించలేదంది. హత్య జరిగిన రోజు(2019 మార్చి 15) ఉదయం 5:30 గంటలకు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ కాల్ వచ్చిందంటూ చేస్తోన్న ఆరోపణలపై మరింత దర్యాప్తు చేయవలసిన అవసరం లేదని అభిప్రాయపడింది. వైఎస్ వివేకా హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ సీబీఐ కోర్టులో నర్రెడ్డి సునీత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై ఈ నెల 10న తీర్పును వెల్లడించిన న్యాయస్థానం.. మంగళవారం అధికారిక కాపీని విడుదల చేసింది. వివరాలు ఆ మేరకు.. చాలా అంశాలపై దర్యాప్తునకు నిరాకరణ ‘ఈ కేసులో మొదటి దర్యాప్తు అధికారి జె.శంకర్ను సీఆర్పీసీ సెక్షన్ 161 కింద విచారించారు. 2021, సెపె్టంబర్ 28న వాంగ్మూలంలో జరిగిందంతా చెప్పారు. ఈ విషయంలో తదుపరి విచారణ అవసరం లేదు. భాస్కర్రెడ్డి, అవినాశ్రెడ్డిని రక్షించడానికి, హత్యకు బాధ్యత వహించేందుకు శివశంకర్రెడ్డి రూ.10 కోట్లను గంగాధర్రెడ్డికి ఇవ్వాలని చూశారని, అతని పాత్రపై విచారణ చేసినందున దర్యాప్తు చేయాలన్న సునీత అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేం. అవినాశ్రెడ్డితో సునీల్యాదవ్కు ఉన్న సంబంధం.. హత్యకు ముందు, తర్వాత వారి కదలికలకు సంబంధించి మొబైల్ ఫోన్ల కాల్ డేటా రికార్డు సేకరించి ఇప్పటికే పరిశీలించారు. హత్య జరిగిన రోజు అవినాశ్రెడ్డి ఎక్కడ ఉన్నారనే విషయానికి సంబంధించి ఐపీడీఆర్ విశ్లేషణ జరిగింది. ప్రాసిక్యూషన్ వాదన ప్రకారం... న్యాయవాది ఓబుల్రెడ్డి, భరత్యాదవ్లు అవినాశ్రెడ్డికి సన్నిహితులు. ఎంవీ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు ఇస్తున్నప్పుడు ఓబుల్రెడ్డి కూడా స్టేషన్కు వెళ్లారు. భరత్ యాదవ్ వాంగ్మూలాన్ని సెక్షన్ 161 కింద 2021, జూన్ 28న నమోదు చేశారు. ఫిర్యాదుదారుడితో పాటు స్టేషన్కు వెళ్లారన్న ఒక్క కారణంతో ఓబుల్ రెడ్డి పాత్రపై తదుపరి దర్యాప్తుకు ఆదేశించలేం. ఆర్థిక లావాదేవీలు ఉంటే విచారణ సమయంలో నిరూపించవచ్చు’అని పేర్కొంది. అనుమానం ఆధారం కాదు.. ‘సయ్యద్ మున్నాకు చెందిన ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్లోని లాకర్ తెరవడం, అందులో నగదు, ఆభరణాలు లభించడం విషయానికొస్తే.. మరో తాళంతో సీబీఐ తిరిగి వాటిని లాకర్లో ఉంచినందున దీనిపై తదుపరి విచారణ అవసరం లేదు. మున్నా లాకర్లో లభించిన మొత్తానికి సంబంధించి సీబీఐ.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు తెలియజేసింది. 2019, మార్చి 14 నాటి ఫుటేజీకి కాకుండా కేవలం 15 నాటి ఫుటేజీకి మాత్రమే సీబీఐ పరిమితమైందన్న పిటిషనర్ చేసిన వాదననూ అనుమతించలేం. ఈ విషయాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తారు. పిటిషనర్ వద్ద తన వాదనకు ఎటువంటి ఆధారం లేదు. హత్య జరిగిన రోజు ఒకే విధమైన నడక ఉన్న వ్యక్తిని గమనించిన విషయానికి సంబంధించి పిటిషనర్ అభ్యంతరం సరికాదు. కేవలం అనుమానం ఆధారంగా, ప్రత్యేకించి చిత్రం స్పష్టంగా లేనప్పుడు, ఆ విషయంలో తదుపరి విచారణ జరిపినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇదే విషయాన్ని వి.శివకుమార్ వర్సెస్ తెలంగాణ రాష్ట్రం కేసులో హైకోర్టు స్పష్టం చేసింది. నేర స్థలం ఫోటోలు, వీడియోల ఫోరెన్సిక్ నివేదిక అసంపూర్ణంగా ఉందన్నది ఈ దశలో నిర్ణయించలేం. విచారణ సమయంలో సంబంధిత సాక్షులను విచారించడం ద్వారా దానిని పరీక్షించవచ్చు’అని న్యాయస్థానం స్పష్టం చేసింది. డ్రైవర్ లోవరాజు ఏప్రిల్ ఉద్యోగం మానేయడం, హత్య జరిగిన రోజు విధులకు గైర్హాజర్ కావడానికి ఎలాంటి ప్రాముఖ్యత లేదు. దర్యాప్తు అధికారి రాజు ప్రభుత్వ ఉద్యోగులందరినీ, అవినాశ్రెడ్డి వ్యక్తిగత సిబ్బంది రాఘవ రెడ్డిని సరిగ్గా విచారించలేదనే పిటిషనర్ వాదనను స్వాగతించలేం. ఎందుకంటే, నిందితులతో రాఘవ రెడ్డి ఎలాంటి లావాదేవీలు జరిపారని గానీ లేదా మధ్యవర్తిగా వ్యవహరించారని గానీ చార్జిషీట్లో ఎక్కడా పేర్కొనలేదు. ఇప్పటికే విచారించిన సాక్షులను తిరిగి విచారించడం అంటే.. దర్యాప్తు మళ్లీ మొదటి నుంచి ప్రారంభినట్లు అవుతుంది. ఇది అనుమతించబడదు. శివశంకర్రెడ్డి కుమారుడైన డాక్టర్ చైతన్యరెడ్డిపైనా దర్యాప్తు అనవసరం’ అని న్యాయస్థానం పేర్కొంది. -
సుప్రీంకోర్టులో రఘురామ కృష్ణరాజుకు భారీ షాక్
ఢిల్లీ: సుప్రీంకోర్టులో రఘురామ కృష్ణరాజుకు భారీ షాక్ తగిలింది. ఇండ్ భారత్ కేసులో స్టేను సుప్రీంకోర్టు తాజాగా ఎత్తివేసింది. దాంతో సీబీఐ దర్యాప్తునకు అడ్డంగి తొలగింది. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు నిందితులకు షోకాజ్ నోటీసులు అవసరం లేదని సీజేఐ ధర్మాసనం తేల్చిచెప్పింది. నోటీసులు ఇవ్వలేదన్న కారణంతో ఎఫ్ఐఆర్న క్వాష్ చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది. రఘురామ కృష్ణం రాజు, వాకాటి నారాయణ రెడ్డి కంపెనీల కేసుల్లో గతంలో ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులు ఎత్తివేసింది. ఖాతాల ఫ్రాడ్ తదితర అంశాలపై ఇతర న్యాయస్థానాల్లో సవాల్ చేసే స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. ఫలితంగా ఫోర్జరీ పత్రాలు, నిధుల మళ్లింపు ఆరోపణలపై ఇక సీబీఐ దర్యాప్తు వేగవంతం కానుంది. బ్యాంకుల కన్సర్షియం నుంచి వేలకోట్ల రూపాయలు అప్పులు తీసుకొని నిధులు దారి మళ్లించిన రఘురామ కృష్ణంరాజు కంపెనీ.. గతంలో తీసుకున్న రుణాలను ఎఫ్డీలు చేసి.. వాటిపై మళ్లీ రుణాలు తీసుకుంది. -
దేవుడా... అలసిపోయావా?
అంతర్యామి అలసితి సొలసితి...అంటూ అన్నమయ్య నీరసంగా ఆపసోపలు పడుతూ పాడారే కానీ...ఇపుడు ఆ దేముడికే అలసట వచ్చిపడుతోంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామికి క్షణం తీరిక దొరకట్లేదు. వేళాపాళ లేకుండా భక్తాదులు వచ్చి వాకిట నిలబడుతుండటంతో వారి ఆలనా పాలనా చూసుకోవాల్సిన పెనుబాధ్యత స్వామి వారి భుజస్కందాలపై ఉంది. అర్ధరాత్రి అపరాత్రి అయినా భక్తులు దర్శనమీయాల్సిందే....మా మొర ఆలకించాల్సిందే అంటూ మొండికేస్తున్నారు. పైగా వడ్డీకాసుల వాడి చెంత ఉత్త చేతులతో ఎలాగూ పోలేరు...పాలకమ్మన్యులు పోనివ్వరు కూడా. పోనీ రాత్రి బాగా పొద్దుపోయాక కాసింత నడుం వాలుద్దామన్నా...కళ్ళు మూసి తెరిచేలోగా సుప్రభాత సేవలు షురూ అయిపోతున్నాయి. అంతలోనే అర్చకులు, భక్తులు కమలాకుచ చూచుక కుంకుమ...అంటూ శ్లోకాలు అందుకుం టున్నారు. స్వామివారు బిక్కమొగం వేసుకుని తన ఇరు దేవేరులను చూస్తూ భక్తులకు విసుగు కనిపించనీయకుండా ప్రసన్నచిత్తులై దర్శనమీవాలి. ఒక్కసారి గమనించండి దేముడికి ఎంత కష్టం వచ్చిందో.అందుకే సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఏంటసలు మీ తీరు...భక్తి సరే...భగవంతుడి మాటేంటి? స్వామి వారిని కనీసం నిద్రకూడా పోనివ్వరా? అనేక దంతం భక్తానాం అంటారా సరే..మరి కోట్లాది మంది భక్తులు నిరంతరం స్వామి చెంత నిలుచునుంటే...దేముడికి కాసింత పర్సనల్ స్పేస్ అక్కర్లేదా? కాసులకు కక్కుర్తిపడి గర్భగుడి తలుపులు వేళలు పాటించకుండా తెరిచేస్తారా? ఇది మీరు దేముడికి చేస్తున్న అపచారం కాదా? అంటూ బృందావన్ లోని బంకీ బిహారీ ఆలయ వ్యవహారంపై మండిపడింది. శక్తి కొద్ది భక్తి అన్నారు కానీ కరెన్సీ కొద్ది భక్తి అనలేదు కదా...మరి డబ్బున్న భక్తుల కోసం ఆ దేముడ్ని ఎందుకండీ ఇబ్బంది పెడతారు అంటూ సుప్రీం సీరియస్ అయ్యింది.బంకీ బిహారీ జీ ఆలయంలో పాలకుల తీరుతెన్ను చూసి మండిపోయిన ఓ భక్తాగ్రేసరుడు సుప్రీం చెంతకు చేరాడు. నాస్వామిని వీళ్ళందరూ రాచి రంపాన పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశాడు. దర్శన వేళలతోపాటు ఆలయ సంప్రదాయాల్లో తెచ్చిన మార్పుల్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేయడంతో ...సుప్రీం స్పందించక తప్పలేదు. ఆలయవేళల్లో మార్పు చేయడంతోపాటు దెహ్రి వంటి పలు ముఖ్యమైన ఆచారాలను బంద్ చేశారని పిటిషనర్ వాపోయారు. పోనీలే కనీసం ఓ భక్తుడైనా నా గురించి ఆలోచిస్తున్నాడని బంకీ బిహారీజీ అమందానంద కందళిత హృదయారవిందులై ఉప్పొంగి పోయుంటారుఈ సమస్య ఒక బంకీ బిహారీజీ...వేంకటేశ్వస్వామీ...సింహాద్రి అప్నన్న సామిలదే కాదు. అసలే మనకు ముప్పది మూడు కోట్ల దేముళ్ళు. కానీ కొందరికే భక్త పరంపర హెచ్చుగా ఉంటుంది. దాన్ని మనం తర్కించలేం. భక్తుని కష్టాలు భగవంతుడికే తెలుసంటారు...మరి భగవంతుడి కష్టాలు భక్తులకు తెలుసా? కనీసం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎంతసేపూ సేవలకు సొమ్ముకట్టామా....కాయకొట్టామా....ముడుపులు వేశామా...కొండవీటి చాంతాడంత కోరికల లిస్ట్ స్వామి ముందుంచామా....ఇదే తప్ప...అరె స్వామివారికి మనవల్ల ఎంత మనస్తాపం కలుగుతుంది...అసలు వారికి విశ్రాంతి దొరుకుతోందా అని ఎప్పుడైనా అనుకున్నామా? ఇదేం చోద్యం దేముడికి రెస్ట్ కూడా ఉంటుందా అని కొందరు ఎగతాళి చేస్తుంటారు...మరి ఆ స్లీపింగ్ స్లాటే లేకుంటే...ఉయ్యాల సేవలు...నిద్రపుచ్చే పాటలు ఎలా వచ్చాయండి? అని మరికొందరు లా పాయింటు లేవదీసి మరీ వాదిస్తుంటారు.ఇక తిరుమల వేంకటేశ్వరుడు...వారి భక్తిసామ్రాజ్యం ఎంత సువిస్తారమో....అక్కడ రాజకీయాలు అంతకన్నా విస్తారం. గత వైకుంఠఏకాదశి పుణ్యదినం కోసం ఎందరు భక్తులు టికెట్ల రద్దీలో చితికి ప్రాణాలు వదిలేశారో మనకు తెలుసు కదా. అదే సమయంలో గరికపాటివారి వ్యంగ్య ప్రసంగం తెగ వైరల్ కాలేదూ. అసలు వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే పుణ్యం దక్కుతుంది...ముక్తి ప్రాప్తమవుతుందని అశేష ఆస్తికమహాశయుల ప్రగాఢ నమ్మిక. అయితే శక్తి లేనివారిలో భక్తులుండరా? నీ కొండకు నీవే రప్పించుకో...ఆపదమొక్కలు మాతో ఇప్పించుకో అని ఘంటసాల ఎంత ఆర్డ్రంగా పాడారు. భక్తుడు రావాలా...లేదా తనే ఆతని వద్దకు వెళ్లాలా అని డిసైడ్ చేయాల్సింది భగవంతుడు. కానీ మన సర్కారు మహత్తరంగా...ప్రచారాలు చేసి మీకు మోక్షం దక్కాలన్నా...పున్నెం రావాలన్నా తెల్లారు జాము ఉత్తర దర్శనం తప్పని సరి అది ఈరోజే అంటూ ఊదరగొట్టినందుకే కదా తొక్కిసలాట...మరణాలు సంభవించింది. దీని పై సర్కారు స్పందన ఉండదు....కానీ లడ్డూలో కల్తీ అంటూ రాజకీయం చేయడానికి సిద్ధం. సాక్షాత్తు సుప్రీం కోర్టే సర్కారును నిలదీసి...తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారో లేదో తెలుసుకోకుండా ప్రచారాలు ఎలా చేస్తారు? భక్తుల మనోభావాలు దెబ్బతినవా అంటూ ప్రశ్నించింది. ల్యాబ్ రిపోర్టులో ఉన్న కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్లు ఆధారాలు ఏమున్నాయంటూ.. సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. తన మహాప్రసాదం...భక్తులు భక్తితో కళ్లకద్దుకుని స్వీకరించే లడ్డూపైన వివాదలు పుట్టించడం గమనించిన ఆ దేవదేవుడి మనసు ఎంత వ్యాకులత చెంది ఉంటుందో కదా. అయినా ఆలయాల్లో రాజకీయాలేంటి అని స్వామివారు చిరాకుపడ్డా ఇపుడు లాభం లేదు. ఎందుకంటే తిరుమల ఆ దశను దాటిపోయింది. అక్కడ ప్రతీది రాజకీయమే. దర్శనంతో మొదలు లడ్డూ దాకా...భక్తుని మొదలు పాలక మండలి దాకా అంతా రాజకీయమే. ఇంత జరుగుతున్నా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గట్లేదంటే అది స్వామివారి వైభవం...వైభోగం అంతే. ఒక తిరుపతే కాదు దేశంలో ఏ ఆలయమైనా భక్తులతో కిటకిటలాడుతునే ఉంటుంది. ఈ దేశంలో మనుషులతో కిక్కిరిసి కనిపించేవి రెండే రెండు...ఇకటి ఆలయం...రెండోది ఆసుపత్రి.ఏది ఏమైనా సుప్రీం జోక్యంతో అయినా బంకీ బిహారీ జీ ...తిరుపతి వెంకన్నలకు కాసింత ఊరట లభిస్తే అదే పదివేలు.:::ఆర్ఎం -
దేవుడిని విశ్రాంతి కూడా తీసుకోనివ్వరా..?
న్యూఢిల్లీ: ఆలయాల్లో ధనవంతులిచ్చే డబ్బుల కోసం కక్కుర్తిపడి దేవుడి విశ్రాంతి వేళలోనూ ప్రత్యేక పూజలకు అనుమతించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దేవుడి విశ్రాంతికి అంతరాయం కల్గిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. బృందావన్లోని ప్రఖ్యాత బంకీ బిహారీ జీ ఆలయంలో దర్శన వేళలతోపాటు సంప్రదాయాల్లో తీసుకువచ్చిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా సోమవారం ఈ మేరకు స్పందించింది. బంకీ బిహారీ జీ ఆలయంలో దర్శన వేళల్లో మార్పులు చేశారని, దెహ్రి పూజ వంటి పలు ముఖ్యమైన మతాచారాలను నిలిపివేశారని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్, తన్వి దుబేలు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీల ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ‘సంప్రదాయం, వేడుకల్లో దర్శన వేళలు కూడా ఒక భాగం. భక్తుల దర్శనాల కోసం ఆలయాన్ని తెరిచి ఉంచడం ఎప్పట్నుంచో వస్తున్న సంప్రదాయం. ఆలయ వేళలను మార్చితే, లోపల జరిగే పూజలు, వేడుకల వేళలు కూడా మారుతాయి. తదనుగుణంగా దేవుడి ఉదయం మేల్కొనే వేళ, రాత్రి నిద్రించే వేళలూ మారుతాయి. ఇలా జరగరాదు. తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని, పవిత్రతను తుచ తప్పక అనుసరించాలి’అని ఈ సందర్భంగా దివాన్ వాదించారు. సెపె్టంబర్లో జారీ అయిన ఆఫీసు మెమోరాండం ప్రకారం ఆలయంలో జరిగే ముఖ్యమైన పూజా సంప్రదాయాల్లో మార్పులు తెచ్చారని ఆయన తెలిపారు. ఆలయంలో దర్శన వేళలు పూర్తయ్యాక, ఒక ప్రత్యేక ప్రదేశంలో చేపట్టే దెహ్రి పూజను సైతం రద్దీని నివారించేందుకంటూ రద్దు చేస్తూ తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పక్కనబెట్టారని పిటిషనర్లు తెలిపారు. గురు–శిష్య పరంపరలో భాగంగా గోస్వామీలు మాత్రమే ఈ పూజా కార్యక్రమాన్ని జరపాల్సి ఉంటుందన్నారు. ఈ వాదలనపై సీజేఐ సూర్యకాంత్ మౌఖికంగా.. ‘బంకీ బిహారీ జీ ఆలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని నామమాత్రంగా మూసివేస్తున్నారు. అయితే, ఆ వెంటనే దేవుడికి ఒక్క సెకను కాలం కూడా విశ్రాంతినివ్వకుండా, ఇతర విషయాల మాదిరిగానే దేవుడిని కూడా వాడేసుకుంటున్నారు. భారీగా డబ్బు ఇవ్వజూపే ధనవంతుల కోసం ప్రత్యేక పూజలకు అనుమతిస్తున్నారు’అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై సమాధానమివ్వాలని ఆలయ నిర్వహణ కమిటీతోపాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో తదుపరి విచారణ చేపడతామని ప్రకటించింది. వాస్తవానికి ఈ ఆలయంలో వేడుకలు, పూజలు, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ 1939 నాటి నిబంధనల ప్రకారం జరుగుతోంది. అయితే, 2025లో తీసుకువచ్చిన ఉత్తరప్రదేశ్ శ్రీ బంకీ బిహారీ జీ ఆలయ ట్రస్ట్ ఆర్డినెన్స్తో రాష్ట్ర ప్రభుత్వం మత సంస్థల్లో జోక్యం చేసుకునేందుకు అవకాశ మేర్పడింది. తద్వారా అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయాలకు విఘాతం కలుగుతోందన్న వాదనలు ఉన్నాయి. దీనిపై ఈ ఏడాది ఆగస్ట్లో దాఖలైన పిటిషన్పై జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. వ్యవహారాన్ని అలహాబాద్ హైకోర్టుకే విడిచిపెట్టింది. అదే సమయంలో, హైకోర్టు స్పష్టత ఇచ్చే వరకు ఆర్డినెన్స్పై స్టే విధించింది. ఆలయ రోజువారీ వ్యవహారాల పర్యవేక్షణకు అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్ కుమార్ సారథ్యంలో కమిటీని నియమించింది. -
వరకట్న వ్యతిరేక చట్టాలకు కోరల్లేవు
న్యూఢిల్లీ: వరకట్న భూతాన్ని సమూలంగా రూపుమాపడం తక్షణావసరం అని అత్యున్నత న్యాయస్థానం సోమవారం అభిప్రాయపడింది. అయితే వరకట్న వ్యతిరేక చట్టాలు ఆచరణలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. పైగా తరచూ వాటి దుర్వినియోగం జరుగుతుండటం మరో ఆందోళనకర పరిణామం. దాంతో మన దేశంలో వరకట్న దురాచారం ఇప్పటికీ నిర్ని రోధంగా కొనసాగుతూనే ఉందని న్యాయ మూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం ఆవేదన వెలిబు చ్చింది. 24 ఏళ్లనాటి వరకట్న హత్య కేసులో ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇద్దరు నిందితులను అలహాబాద్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించడాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. వారికి జీవిత ఖైదు విధించడమే సరైనదని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ‘కేవలం కలర్ టీవీ, మోటార్ సైకిల్, రూ.25 వేలు ఇవ్వలేదని నవ వధువును కిరాతకంగా పొట్టన పెట్టుకున్నారు. అయితే నిందితుల్లో మహిళకు ఇప్పుడు 94 ఏళ్లు గనుక ఆమెకు తీర్పు అమలు కాబోదు. రెండో వ్యక్తి మాత్రం 4 వారాల్లో లొంగిపోవాలి‘ అని ఆదేశించింది. వరకట్న దురాచారం విషయమై కేంద్ర రాష్ట్రాలకు, దిగువ కోర్టులకు ఈ సందర్భంగా పలు నిర్దేశాలు చేసింది. పెండింగ్ లో ఉన్న వరకట్న హత్యలు (సెక్షన్ 304–బి), భర్త, అత్తింటివారి హింస (398–ఏ) కేసులపై హైకోర్టులు మరింతగా దృష్టి పెట్టాలి. వరకట్నం సాంఘిక దురాచారమని మన భావితరాలకు తెలియాలి. ఆ మేరకు బాలల్లో అవగాహన కలిగేలా విద్యా ప్రణాళికల్లో కేంద్రం, రాష్ట్రాలు అవసరమైన మార్పులు చేయాలి. చట్టం పేర్కొన్న మేరకు వరకట్న నిషేధ అధికారులను రాష్ట్రాలన్నీ తక్షణం నియమించాలి. వారికి అవసరమైన అన్ని అధికారాలు, సాధన సంపత్తి కట్టబెట్టాలి. వారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబరు, మెయిల్ ఐడీలను అందరికీ తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలి. వరకట్న కేసులను విచారించే పోలీసు, న్యాయాధికారులకు ఇందుకు సంబంధించిందిన అంశాలపై తరచూ శిక్షణ ఇవ్వాలి‘ అని సూచించింది. -
YSRCP సోషల్ మీడియా కార్యకర్త ప్రతాప్ రెడ్డికి సుప్రీం కోర్టు బెయిల్
-
సుప్రీం కోర్టులో కూటమి సర్కార్కు మరో ఎదురు దెబ్బ
సాక్షి, ఢిల్లీ: సుప్రీం కోర్టులో కూటమి ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త తారక్ ప్రతాప్ రెడ్డికి సోమవారం బెయిల్ మంజూరు చేసింది. తక్షణమే విడుదల చేయాలంటూ జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ అగస్టీన్ జార్జిలతో కూడిన ధర్మాసనం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే అణచివేత ధోరణిని కూటమి ప్రదర్శించడం చూస్తున్నదే. ఈ క్రమంలోనే యూరియా కొరతపై తారక్ ప్రతాప్ రెడ్డి ఓ పోస్ట్ చేశారు. ఈ పరిణామంలో రగిలిపోయిన ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దించింది. తారక్ను అక్రమ అరెస్ట్ చేయించింది. తారక్ తరఫున సుప్రీం కోర్టులో సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. ‘‘యూనిఫాంలో కాకుండా మఫ్టీలో వైఎస్ఆర్సిపీ సోషల్ మీడియా కార్యకర్తలను కిడ్నాప్ చేస్తున్నారని.. ప్రభుత్వ దమనకాండపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారని’’ వాదించారు. సోషల్ మీడియాను అణగదొక్కేందుకు ఏపీ ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తుందో కోర్టుకు వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ద్విసభ్య ధర్మాసనం.. తారక్కు బెయిల్ మంజూరు చేస్తూ తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. -
ఇంక్రిమెంటేగా...ఇచ్చేస్తే పోలా...
వడ్డించేటోళ్ళు మనోళ్ళయితే ఆ కిక్కే వేరప్పా...డిపార్ట్ మెంట్ ఏదైనా...ఫికరే లేదు. మన బాస్ కు మనం కాకా కొడితే చాలు. బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనే సూత్రాన్ని గట్టిగా పాటిస్తే...జీతం అదంతటదే పెరుగుతుంది. తెలివితేటలు, శ్రద్ధ, నిబద్ధత...ఇవన్నీ తుప్పాస్... పెద్ద సార్ ను జాగ్రత్తగా చూసుకుని వారి కనుసన్నల్లో పడుంటే చాలు. అందుకే అక్కడి ఉద్యోగుల్లో కొందరికి ఎడాపెడా ఇంక్రిమెంట్లు వచ్చి పడుతున్నాయి. కారణం బాస్ భజనే. ఇదెక్కడో కాదండోయ్ సాక్షాత్తు న్యాయవ్యవస్థలోనే. అందరికీ శకునాలు చెప్పే బల్లి తానే కుడితిలో పడ్డట్టు...ఊరందరికీ న్యాయం చేసే పెద్దమనుషులు తమ కింది ఉద్యోగులకు మాత్రం తమను తోచినట్టుగా....తమకు నచ్చినట్టుగా ఇంక్రిమెంట్లు ఇస్తుండటంతో అందరూ ముక్కున వేలేసేకుని...ఔరా ఇలా కూడా చేస్తున్నారా అనుకుంటూ సన్నాయినొక్కుల నొక్కుతున్నారు.సాదారణంగా ఓ కంపెనీలో... ప్రైవేటయినా...ప్రభుత్వం అయినా...పనిచేసే ఉద్యోగికి ప్రమోషన్ రావాలన్నా...కనీసం ఇంక్రిమెంట్ పడాలన్నా...సదరు ఉద్యోగి తలప్రాణం తోకకొస్తుంటుంది. ఎంత పనిచేసినా...ఎంత కష్టపడినా...బాస్ గుడ్ లుక్స్ లో లేకుంటే ఆ ఉద్యోగికి ప్రమోషన్, ఇంక్రిమెంట్ల మాట అటుంచి ఉద్యోగం నిలబట్టుకోవడమే కష్టంగా మారిపోతుంటుంది. ఇంక్రిమెంట్లు ఎండమావుల్లా ఊరిస్తుంటాయే కానీ జీతంలో వచ్చి చేరవు. ఏడాదంతా కష్టపడి గొడ్డులా పనిచేస్తే...చివర్లో వచ్చే ఇంక్రిమెంట్ కోసం బిక్కమొగం వేసుకుని ఎదురు చూస్తుంటే... పదో పరకో మొహాన కొట్టే కంపెనీలు ఎన్ని లేవు. అలాగని ఆ ఉద్యోగాన్ని వదిలేసుకునే ధైర్యం చేయలేరు. ఇదేం గానుగెద్దులాంటి జీవితంరా బాబు. ఖర్చులు కొండవీటి చాంతాడంత...జీతం మాత్రం గొర్రబెత్తడంత అని నిట్టూర్చుకోవడం మినహా చేయగలిగేదేం ఉండదు.ఎవరికి ఏ అన్యాయం జరిగినా కోర్టు తలుపులు తట్టుతుంటాం. మనకు న్యాయవ్యవస్థపై అపారమైన నమ్మకం...గౌరవం. ఎవరు అన్యాయం చేసినా అక్కడ న్యాయం దొరికే దొరుకుతుందని ఆనుకుంటుంటాం. అంతటి ప్రతిష్టాత్మకమైన సర్వోన్నత న్యాయస్థానంలోని ఉద్యోగం చేసేవారిలో కొందరికి అత్యధికంగా ఇంక్రిమెంట్లు దక్కుతున్నాయి. ఎంతటి ప్రతిభావంతుడికైనా ఏడాదికి ఒక ఇంక్రిమెంట్ న్యాయం ధర్మం. కానీ ఇక్కడ మాత్రం కొందరికి ఇబ్బడి ముబ్బడిగా ఇంక్రిమెంట్లు వచ్చేస్తున్నాయి. పోనీ వారు చేస్తున్న పనికి గుర్తింపా అంటే అదేం కాదు...బాస్ ను మెప్పించినందుకే ఈ నజరానాలు అని తెలుస్తోంది.సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తులు వారు తమ పదవీ కాలం ముగిసే సమయాన...వ్యవధి ఎంత తక్కువ కాలం అయినా సరే... రిటైర్ అయ్యేటైములో తమకు నచ్చిన వారికి...తమను మెప్పించిన వారికి ఇంక్రిమెంట్లు అప్పనంగా ఇచ్చేస్తున్నారు. ఏడాదికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు ఇవ్వడానికి ప్రధాన న్యాయమూర్తులు కొందరు వెనకాడటం లేదు. ఇంక్రిమెంట్ ఇచ్చేందుకు వారికి అధికారం ఉందన్న ఏకైక కారణంతో తమ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారనేది విమర్శ. ఉద్యోగులకు వృత్తిగత నైపుణ్యం లేకున్నా...ఏడాదికి రెండు మూడు ఇంక్రిమెంట్లు ఉదారంగా ఇస్తున్నారు. ఇలా లబ్ది పొందన వారిలో సీజేఐ పర్సనల్ సిబ్బందే అధికం.ఈ అవ్యవహారాన్ని గత నాలుగైదేళ్లుగా గమనిస్తే...ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 2000మంది ఉద్యోగులకు ఒక ఏడాదలో పలుసార్లు ఇంక్రిమెంట్లు లభించాయి. ప్రధాన న్యాయమూర్తి కనుసన్నల్లో మెదిలిన కొందరు సిబ్బందికి ఆరుసార్లు ఇంక్రిమెంట్లు పడ్డాయంటే...పరస్థితి ఎంత దారుణంగా తయారైందో తెలుస్తోంది. సాధారణ పరిస్థితిలో లభించే ఇంక్రిమెంట్ల కంటే 150 శాతం అధికంగా లభించడం ఇక్కడ గమనించదగ్గ విషయం. ఇలా అవ్యవస్థగా సాగిన అవ్యవహారం గురించి చర్చించేందుకు మాజీ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ న్యాయమూర్తులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా చాలా మంది న్యాయమూర్తులు కోర్టు ఎవరి సామ్రాజ్యమో కాదని... ప్రధాన న్యాయమూర్తులు ఇక్కడ రాజులు కారని, వారి ఇష్టారీతిగా ఏదో అగ్రహారాలు రాసిచ్చినట్లు ఇంక్రిమెంట్లు ఇవ్వడం సరికాదని భావించారు. సుదీర్ఘ చర్చానంతరం ఇలా ఇష్టారీతిగా ఇంక్రిమెంట్లు ఇచ్చే విధానాన్ని బంద్ చేయాలని ఫుల్ కోర్టు నిర్ణయించింది అలాగే కొందరు ఉద్యోగులకు అర్తరహితంగా ఇచ్చిన ఇంక్రిమెంట్లను ఉపసంహరించుకోవాలని కోర్టు భావిస్తోంది. పొరపొటు తెలుసుకుని సరిచేయడం సరే...అసలు సర్వోన్నత న్యాయస్థానంలో కొందరు ప్రధాన న్యాయమూర్తులు ఈ వ్యవహార శైలి ఏంటని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -ఆరెం. -
తీర్పును టెక్నాలజీ మెరుగుపర్చగలగాలి
కటక్(ఒడిశా): నూతన సాంకేతికత అనేది న్యాయస్థానాల తీర్పును మరింత మెరుగుపర్చాలిగానీ తీర్పును అధిగమించేదిగా ఉండకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఒడిశాలోని కటక్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. పెండింగ్ కేసుల భారం దిగువ కోర్టు నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకు న్యాయ వ్యవస్థలోని ప్రతి స్థాయిలోనూ ఇబ్బందులను సృష్టిస్తున్నాయన్నారు. పైస్థాయిలో తలెత్తిన అడ్డంకులు దిగువ స్థాయిపై ఒత్తిడిని మరింతగా పెంచుతున్నాయని చెప్పారు. పెండింగ్ సమస్యను అధిగమించేందుకు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని సీజేఐ తెలిపారు. అవసరానికి తగినన్ని న్యాయస్థానాలు లేకుంటే, ఎంత చిత్తశుద్ధి కలిగిన న్యాయవ్యవస్థ అయినా కుప్పకూలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆధునిక సాంకేతికతతో ఎన్నో సౌలభ్యాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ దు్రష్పభావాలు కూడా ఉన్న విషయం మరువరాదన్నారు. నేటి డీప్ ఫేక్లు, డిజిటల్ అరెస్ట్ల కాలంలో న్యాయస్థానాలకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పేదలు, వృద్ధులను పట్టించుకోని సంస్కరణ అస్సలు సంస్కరణే కాదు, అది తిరోగమనం కూడా అని తెలిపారు. -
ఇలాంటి కేసులతో పరువు తీయకండి
న్యూఢిల్లీ: విద్యా హక్కు చట్టం(ఆర్టీఈ) పరిధి నుంచి మైనారిటీ స్కూళ్లను మినహాయిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి కేసులతో న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చవద్దని హెచ్చరించింది. న్యాయవ్యవస్థను కూలి్చవేద్దామనుకుంటున్నారా అంటూ దుయ్యబట్టింది. పిటిషనర్ను రూ.లక్ష జరిమానా విధించిన న్యాయస్థానం.. ఇలాంటి కేసులు వేయాలనుకునే వారికి ఇదో గుణపాఠం కావాలని వ్యాఖ్యానించింది. ఆర్టీఈ పరిధి నుంచి మైనారిటీ స్కూళ్లకు మినహాయింపు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, ఆర్టీఈ లక్ష్యాలకు వ్యతిరేకమని పేర్కొంటూ యునైటెడ్ వాయిస్ ఫర్ ఎడ్యుకేషన్ ఫోరం అనే ఎన్జీవో వేసిన పిటిషన్పై శుక్రవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘మీరు సుప్రీంకోర్టులో ఇలాంటి కేసును వేసి మాకు తీవ్ర ఆగ్రహం తెప్పించారు. ఇలాంటి కేసులు దేశ న్యాయ వ్యవస్థ స్థాయిని తగ్గించేవి. ఈ కేసు తీవ్రత ఏమిటో మీకు తెలియదు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రిట్ వేసినందుకు వాస్తవానికి ధిక్కారం కింద చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ, ఇప్పటికి వదిలేస్తున్నాం. లక్ష రూపాయల జరిమానాతో సరిపెడుతున్నాం’అంటూ పిటిషనర్పై నిప్పులు చెరిగింది. ఇటువంటి కేసులు వేయాలని సలహాలిచ్చే లాయర్లపైనా జరిమానా విధించవలసి ఉంటుందంటూ తీవ్ర హెచ్చరికలు చేసింది. సుప్రీంకోర్టు 2014లో వెలువరించిన తీర్పు ప్రకారం..విద్యా హక్కు చట్టం నిబంధనలు మైనారిటీ స్కూళ్లకు వర్తించవు. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 30(1) మత, భాషాపరమైన మైనారిటీలు సొంతంగా విద్యాసంస్థలను నెలకొల్పుకుని, వాటిని స్వయంగా నిర్వహించుకునేందుకు వీలు కలి్పస్తోంది. -
అలాంటి వాటిని మేం పట్టించుకోం
న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులపై మీడియాలో వచ్చే అసమగ్ర, సత్యదూరమైన కథనాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటివి ప్రజాభిప్రాయంపై ప్రభావం చూపుతున్నాయని తెలిపింది. ప్రచారం కోసమో సొంత అభిప్రాయాన్ని తెలిపేందుకో వచ్చే ఇటువంటి కథనాల మాయలో తాము పడబోమని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్కు పంపించిన కొందరు వ్యక్తులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చే కేసు విషయమై శుక్రవారం చేపట్టిన విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విజయ్ మాల్యాబాగి్చ, జస్టిస్ విపుల్ ఎం పంచోలీల ధర్మాసనం పైవ్యాఖ్యలు చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన మేరకు.. ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన సునాలి ఖాతూన్ అనే గర్భిణీతోపాటు ఆమె 8 ఏళ్ల కుమారుడిని అధికారులు బంగ్లాదేశ్ నుంచి పశ్చిమబెంగాల్లోని బీర్భూమ్లో ఉంటున్న తండ్రి వద్దకు తీసుకువచ్చారని ఈ సందర్భంగా లాయర్లు ధర్మాసనానికి నివేదించారు. ఆమెకు వైద్యసాయం అందుతోందని కూడా తెలిపారు. సరైన విచారణ జరపకుండానే కొందరిని బంగ్లాదేశ్కు పంపించారంటూ కలకత్తా హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సవాల్ చేస్తూ కేంద్రం వేసిన పిటిషన్పై జనవరి 6వ తేదీన విచారణ చేపడతామంది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. సరైన విచారణ చేపట్టకుండానే బంగ్లాదేశ్ పౌరులంటూ కేంద్రం కొందరిని బలవంతంగా పంపించి వేసిందంటూ ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేసే ఉద్దేశంతోనే ఇలాంటివి వస్తున్నాయని వ్యాఖ్యానించారు. అయితే, ఇలా ప్రచారం కోసం చేసే స్టంట్లకు తాము దూరంగా ఉంటామని స్పష్టం చేసిన ధర్మాసనం..వీటిని పట్టించుకోవద్దని తుషార్ మెహతాను కూడా కోరింది. ‘వాస్తవానికి న్యాయ వ్యవస్థపై మీడియా ఇలా వ్యాఖ్యానాలను చేయరాదు. మీరు ఇటువంటి అంశాలను ప్రస్తావించడం మంచిదే. సంబంధిత కథనంతో మీకు ఆవేదన కలగడం పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం’అని ధర్మాసనం తెలిపింది. అమెరికా, యూకేల్లో వలసలకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలపై అంతర్జాతీయంగా కథనాలు వస్తున్నాయని, సోషల్ మీడియా, ఇతర వేదికలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయని సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ ధర్మాసనం ఎదుట వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో 20 ఏళ్లుగా ఉంటున్న స్వీటీ బీబీ, ఆమె భర్త, ఇద్దరు పిల్లలను కూడా అధికారులు బంగ్లాదేశ్లోకి పంపించారని మరో లాయర్ సంజయ్ హెగ్డే ప్రస్తావించగా, ఈ విషయాన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దృష్టికి తీసుకెళ్లాలని ధర్మాసనం కోరింది. -
పోలవరం–నల్లమలసాగర్పై సుప్రీంకు!
సాక్షి, హైదరాబాద్: పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును పక్కనపెట్టిన ఏపీ ప్రభుత్వం తాజాగా పోలవరం–నల్లమలసాగర్ను తెరపైకి తీసుకొచ్చింది. అంతేకాకుండా గోదావరి–కావేరి అనుసంధానాన్ని నల్లమలసాగర్ నుంచే చేపట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ చర్యలను అడ్డుకొనే ప్రయత్నాల్లో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు కూడా రాసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి కూడా ఫిర్యాదు చేసింది. తాజాగా ఈ అంశాన్ని న్యాయస్థానం ద్వారా అడ్డుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ కేసులో తెలంగాణ తరఫున వాదించాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి శనివారం ఢిల్లీలో కలిసి కోరనున్నారు. ఏపీతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సీడబ్ల్యూసీని ప్రతివాదిగా చేర్చి కేసు వేయాలని సింఘ్వీకి ఉత్తమ్ సూచించనున్నారు. ప్రస్తుతం అంతర్రాష్ట్ర నదీ జలాల అంశాలపై మరో న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదిస్తున్నారు. ఆయన స్థానంలో సింఘ్వీకి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు డీపీఆర్కు ఏపీ టెండర్లు.. పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక (పీఎస్ఆర్)ను ఏపీ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖతోపాటు సీడబ్ల్యూసీకి అందించి మదింపు చేయిస్తోంది. మరోవైపు ప్రాజెక్టు డీపీఆర్ను సిద్ధం చేయడానికి వీలుగా గత నెలలోనే టెండర్లు పిలిచింది. పోలవరం నుంచి నల్లమలసాగర్కు తొలిదశలో... నల్లమలసాగర్ నుంచి సోమశిలకు రెండోదశలో... ఆ తర్వాత కావేరికి తరలించాలని యోచిస్తోంది. కేంద్రం సంకేతాల నేపథ్యంలో.. గోదావరి–కావేరి అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ కట్టి నీటిని తరలించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. సమ్మక్కసాగర్ (తుపాకులగూడెం) నుంచి నీటి తరలింపునకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమ్మతి తెలపగా... కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి నీటిని తరలించాలని సూచించింది. అంతేకాకుండా ఇచ్చంపల్లి బ్యాక్వాటర్ నుంచి 200 టీఎంసీల వరద జలాలను వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించింది. తెలంగాణ కొన్ని షరతులతో ఇచ్చంపల్లికి అంగీకరించగా ఏపీ మాత్రం బేషరతుగా పోలవరం–నల్లమలసాగర్–సోమశిల–కావేరి అనుసంధానం చేపట్టాలని కేంద్రాన్ని కోరడం.. అందుకు కేంద్రం సానుకూల సంకేతాలు ఇవ్వడంతో దీన్ని అడ్డుకొనే ప్రయత్నాల్లో తెలంగాణ ఉంది. -
కరూర్ తొక్కిసలాట కేసు: ఏదో తప్పు జరుగుతోంది..? సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: తమినాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సిట్ దర్యాప్తునకు మద్రాసు హైకోర్టు ఆదేశాలివ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుకు సంబంధించి మద్రాసు హైకోర్టులో ‘ఏదో తప్పు జరుగుతోంది అంటూ వ్యాఖ్యానించింది. ప్రధానంగా ఈ కేసు విచారణ లిస్టింగ్ జాబితాకు సంబంధించి ఏదో జరుగుతోందని అనుమానం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఈరోజు(శుక్రవారం, డిసెంబర్ 12) ఈ కేసు విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు రిజిస్టార్ జనరల్ నివేదికను పరిశీలించిన క్రమంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రార్ను పార్టీగా చేరుస్తూ నోటీసు జారీ చేసింది అదే సమయంలో మద్రాస్ హైకోర్టులో అనుసరిస్తున్న నియమాలను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు.. సిట్ను ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ విజయ్ టీవీకే పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఈ మేరకు వ్యాఖ్యానించింది. టీవీకే విజయ్ దాఖలు చేసిన పిటిషన్లో భాగంగా మద్రాస్ హైకోర్టు సిట్ విచారణకు ఆదేశిస్తూ తీర్పు ఇవ్వడంపై గతంలోనే ఆశ్చర్యం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఈసారి ఆ హైకోర్టులో ఏదో తప్పు జరుగుతోంది’ అంటూ అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్టోయిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆశ్చర్యంతో పాట అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. తమిళనాడులోని కరూర్ తొక్కిసలాటపై మద్రాస్ హైకోర్టు రెండు విరుద్ధమైన ఉత్తర్వులు జారీ చేయడంలోని ఔచిత్యాన్ని గతంలో కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది సీబీఐ విచారణ కోరుతూ విజయ్ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించిన మద్రాస్ హైకోర్టు.. సిట్ దర్యాప్తునకు మాత్రం ఆదేశాలివ్వడంతో కేసుల విచారణ లిస్టింగ్ సరిగా జరుగుతుందా లేదా అనేది పరిశీలించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ఎదుట ప్రభాకర్ రావు సరెండర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో సరెండర్ అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన సిట్ ఎదుట హాజరయ్యారు. దీంతో, ప్రభాకర్ రావును.. సిట్ అధికారులు విచారించనున్నారు. ఈ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో గురువారం గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. తక్షణమే ఆయన విచారణాధికారుల ఎదుట లొంగిపోవాలని, కస్టోడియల్ విచారణకు సహకరించాలని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది. కస్టడీ సమయంలో ఆయనపై ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని, శారీరక హింసకు గురిచేయకూడదని చెప్పింది. ఆయన వయసును దృష్టిలో ఉంచుకుని గౌరవంగా వ్యవహరించాలని సూచించింది. ఇంటి నుంచే భోజనం అందించాలని ఆదేశాల్లో తెలిపింది. అనంతరం, తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది.‘క్రిమినల్స్ మధ్య 30 ఏళ్లు పనిచేశారు.. జాగ్రత్త!’విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఆయన 30 ఏళ్ల పాటు పోలీసు శాఖలో పనిచేశారు. ఎంతోమంది నేరస్తులను డీల్ చేసి ఉంటారు. కాబట్టి కస్టడీలో ఆయనకు ఎలాంటి శారీరక హాని కలగకుండా చూడాల్సిన బాధ్యత మీదే’ అని పోలీసుల తరఫు న్యాయవాదికి సూచించింది. అయితే, ఆయనకు ప్రత్యేకంగా వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వలేమని, చట్టం అందరికీ సమానమేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పష్టం చేశారు. ఆధారాలు ధ్వంసం చేశారు..అంతకుముందు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ ప్రభాకర్ రావు అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా, సాక్ష్యాధారాలను పకడ్బందీగా ధ్వంసం చేశారని చెప్పారు. 2023 నవంబర్ 29న ఎన్నికలకు సరిగ్గా ఒకరోజు ముందు ప్రభాకర్ రావు సంతకంతో 50 కొత్త హార్డ్ డిస్క్లను కొనుగోలు చేశారని తెలిపారు. 30న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, డిసెంబర్ 2న రికార్డులన్నింటినీ ధ్వంసం చేయాలని ప్రభాకర్ రావు ఆదేశించారని చెప్పారు. డిసెంబర్ 4న ఫలితాలు వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు రాజీనామా చేశారని, వెళ్లేముందు కంప్యూటర్ల నుంచి 50 పాత హార్డ్డిస్క్లను తీయించి, వాటిని కట్టర్లతో కోయించి నదిలో పారేయించారన్నారు. ‘ఆయన చాలా తెలివైన అధికారి.. ఆధారాలు లేకుండా చేశారు’ అని వ్యాఖ్యానించారు. ప్రభాకర్ రావు ఏమాత్రం సహకరించడం లేదని సిట్ తరఫు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా చెప్పారు.కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్తామన్నారుప్రభాకర్ రావు తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య అని పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు) 2021లో చేసిన ప్రసంగాన్ని ఆయన కోర్టులో చదివి వినిపించారు. ‘ప్రభాకర్ రావు.. రిటైర్ అయ్యాక ఇంట్లో ఉన్నా సరే, హోంగార్డును పంపి కాలర్ పట్టుకుని ఈడ్చుకొస్తాం’ అని రేవంత్ రెడ్డి హెచ్చరించారని, ఇప్పుడు ఆ పగ తీర్చుకుంటున్నారని రంజిత్ కుమార్ వాదించారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని ఇంటి భోజనానికి, మందులకు అనుమతించాలని కోరడంతో కోర్టు అనుమతి ఇచ్చింది. -
ఆ ప్రైవేట్ వైద్యుల కుటుంబాలు పీఎంజీకేవైకి అర్హులే: సుప్రీం
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి సమయంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వైద్యుల కుటుంబాలు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై) కింద రూ.50 లక్షల బీమా పరిహారానికి అర్హమైనవేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ పీఎంజీకేవై ప్యాకేజీకి ప్రైవేట్ వైద్యులు అర్హులు కారంటూ బాంబే హైకోర్టు వెలువరించిన తీర్పును గురువారం జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆర్.మహదేవన్ల ధర్మాసనం పక్కనబెట్టింది. చట్టాలు, నిబంధనల ప్రకారం వైద్యులకు ఉపయోగపడేందుకు గల అన్ని అవకాశాలను పరిశీలించాలి. పైపెచ్చు, కోవిడ్ సమయంలో ఫ్రంట్లైన్ వైద్యులకు, ఆరోగ్య నిపుణులకు యావత్తూ దేశం దన్నుగా ఉంటుందనే హామీ ఇవ్వడానికి ఉద్దేశించిన బీమా పథకమిది’అని ధర్మాసనం తెలిపింది. ‘పీఎంజీకేవై–ప్యాకేజీ కింద చేసిన బీమా కోసం వ్యక్తిగత క్లెయిమ్లు చట్టానికి లోబడి రుజువుల ప్రాతిపదికన పరిశీలించాలి. అనుగుణంగా పరిహారాన్ని నిర్ణయించాలి’అని పేర్కొంది. ‘కోవిడ్ సంబంధిత విధి నిర్వహణలోనే ఆ వ్యక్తి తన ప్రాణాన్ని కోల్పోయినట్లు నిరూపించే బాధ్యత క్లెయిమ్ చేసిన కుటుంబీకులపై ఉంటుంది. నమ్మదగిన సాక్ష్యం ఆధారంగా దానిని ధ్రువీకరించాల్సి ఉంటుంది’అని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల తరఫున పనిచేస్తేనే తప్ప, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులకు పీఎంజీకేవై ప్యాకేజీ వర్తించదంటూ బాంబే హైకోర్టు 2021లో వెలువరించిన తీర్పును ప్రదీప్ అరోరా తదితరులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అంతకుముందు, మహారాష్ట్రలోని థానెలోని ఓ ప్రైవేట్ క్లినిక్లో వైద్యుడైన తన భర్త 2020లో కోవిడ్ సమయంలో చనిపోయారని, పీఎం జీకేవై ఆయనకు వర్తింప జేయాలంటూ కిరణ్ భాస్కరే సుర్గాడే వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఆయన పనిచేసే ఆస్పత్రిని కోవిడ్–19 ఆస్పత్రిగా ప్రభుత్వం గుర్తించనందున బీమా వర్తింజేయలేమని బీమా కంపెనీ తెలిపింది. కోవిడ్ సేవల్లో ప్రాణాలు కోల్పోయిన వైద్యుల కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు కేంద్రం 2020 మార్చిలో పీఎంజీకేవైను ప్రకటించింది. -
యాసిడ్ బాధితుల కోసం చట్టాన్ని సవరించాలి
న్యూఢిల్లీ: నేరగాళ్ల బలవంతంపై యాసిడ్ తాగిన బాధితులను ‘రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్’లో చేర్చేందుకు చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. చట్టాన్ని సవరించి, యాసిడ్ కారణంగా అనేక ఇబ్బందులకు గురవుతున్న బాధితులకు సంక్షేమ పథకాలను ఉపయోగించుకునేలా చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం కోరింది. యాసిడ్ దాడి బాధితురాలు షహీన్ మాలిక్ వేసిన పిల్పై ఈ నెల 4వ తేదీన విచారణ జరిపిన ధర్మాసనం..ఢిల్లీలోని రోహిణి కోర్టులో 16 ఏళ్లుగా పెండింగ్లో ఉండటంపై విస్మయం వ్యక్తం చేయడంతోపాటు, వివిధ హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్న యాసిడ్ దాడి కేసుల వివరాలను తెలపాలంటూ ఆదేశాలివ్వడం తెల్సిందే. షహీన్ మాలిక్ కేసు విచారణ రోజువారీగా జరుగుతోందని, ముగింపునకు వచ్చిందని గురువారం విచారణ సందర్భంగా ధర్మాసనానికి రోహిణి కోర్టు సమాచారం అందజేసింది. అదే సమయంలో, యాసిడ్ దాడి కేసుల గురించి మాత్రమే తమకు ఇప్పటి వరకు తెలుసని, నేరగాళ్లు యాసిడ్ తాగించడంతో అంతర్గత వ్యవస్థలు దెబ్బతిన్న కేసులు కూడా ఉన్న విషయం ఇప్పుడే తెలిసిందని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. పిటిషనర్ కోరిన విధంగా, ఇటువంటి బాధితులకు న్యాయం చేసేందుకు, చట్టాన్ని అవసరమైన సవరణ చేపట్టేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని ఆయన అన్నారు. చట్టానికి తీసుకురావాల్సిన సవరణలపై ఒక నోట్ అందజేయాల్సిందిగా సీజేఐ ఈ సందర్భంగా పిటిషనర్ను కోరారు. అందులోని అంశాలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. దీంతోపాటు, బలవంతంగా యాసిడ్ తాగిన వారికి రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం రూ.3 లక్షలు మాత్రమే పరిహారంగా అందజేస్తున్నాయని పిటిషనర్ తెలపగా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నల్సా) నుంచి కూడా పరిహారం అందించే విషయం పరిశీలిస్తామన్నారు. అదేవిధంగా, జమ్మూకశ్మీర్, లద్దాఖ్ హైకోర్టులో పెండింగ్లో ఉన్న ఐదు యాసిడ్ దాడి కేసులపై వేగవంతంగా విచారణ పూర్తి చేయాలని ఉత్తర్వు జారీ చేసింది. -
లొంగిపోవడానికి వస్తే అరాచకం!
మాచర్ల/మాచర్ల రూరల్/నరసరావుపేట రూరల్/బాపట్ల : చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా నమోదు చేసిన కేసులో సుప్రీంకోర్టు సూచన మేరకు పిన్నెల్లి సోదరులు పల్నాడు జిల్లా మాచర్ల కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన సందర్భంగా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే రీతిలో వ్యవహరించారు. మాచర్ల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా అడుగడుగునా తనిఖీలు చేస్తూ షాపులు.. దుకాణాలను బంద్ చేయించారు. సంఘీభావం తెలపడానికి వచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులను బలవంతంగా అడ్డుకున్నారు. జిల్లా వ్యాప్తంగా, మాచర్లలో వైఎస్సార్సీపీకి చెందిన పలువురు పార్టీ నేతలను గృహ నిర్బంధం చేశారు. పలువురిని హెచ్చరిస్తూ నోటీసులు ఇచ్చారు. కోర్టు వద్ద స్వయంగా జిల్లా ఎస్పీ బందోబస్తు పర్యవేక్షించారు. తుదకు పిన్నెల్లి కుటుంబ సభ్యులను, బంధువులను కూడా వారి ఇంట్లోకి అనుమతించక పోవడం ప్రభుత్వ అరాచకానికి అద్దం పడుతోంది. మాచర్ల నియోజకవర్గంలో మే 24వ తేదీన వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు బోదిలవీడు వద్ద జవిశెట్టి వెంకటేశ్వర్లు, (అలియాస్ మొద్దయ్య) కోటేశ్వరరావులను తెలుగుదేశం పార్టీ వారే హత్య చేశారని అప్పటి ఎస్పీనే స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ ఘటనలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై అక్రమ కేసు బనాయించారు. ఈ హత్య కేసులో తమకు ఏమీ సంబంధం లేదని పీఆర్కే సోదరులు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించి, బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. సుప్రీంకోర్టు కొన్ని రోజుల పాటు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. అనంతరం బెయిల్ రద్దు చేస్తూ లొంగిపోవాలని చెప్పింది. ఈ క్రమంలో గురువారం ఉదయం పీఆర్కే సోదరులు తమ లాయర్లతో కలిసి మాచర్ల కోర్టుకు హాజరయ్యారు. జూనియర్ సివిల్ జడ్జి, కోర్టు అడిíÙనల్ జడ్జి ప్రశాంత్ వారికి ఈ నెల 24 వరకు రిమాండ్ విధించగా వైద్య పరీక్షలు చేయించి నెల్లూరు జైలుకు తరలించారు. గృహ నిర్బంధాలు.. బెదిరింపులు పిన్నెల్లి సోదరులకు సంఘీభావం తెలిపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పిన్నెల్లి నివాసం వద్దకు బయలుదేరగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. మాచర్ల పట్టణానికి నలువైపులా కంచె, బారికేడ్లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ ఐడి కార్డు ఉంటేనే పట్టణంలోనికి అనుమతించారు. రాయవరం జంక్షన్, రచ్చమల్లపాడు, కొత్తపల్లి, గుంటూరు, నర్సరావుపేట రోడ్లు, జమ్మలమడక రహదార్లలో తనిఖీలు చేశారు. కోర్టు వద్ద స్వయంగా జిల్లా ఎస్పీ బందోబస్తు పర్యవేక్షించారు. పీఆర్కేను చూసేందుకు వారి సోదరి, పెద్దమ్మ, బంధువులు వచ్చినా అనుమతించ లేదు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్ధారెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. శ్యామల భర్త నర్సారెడ్డిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్లో ఉంచారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సు«దీర్ భార్గవ్రెడ్డిలను అడ్డగించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో బ్లడ్ బుక్ను నడుపుతున్నారని మండిపడ్డారు. నీచ రాజకీయాలకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడతారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి, వైఎస్సార్పీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్లు నరసరావుపేటలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లాలో పార్టీ నేతలు వరికూటి అశోక్ బాబు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, డాక్టర్ అశోక్ కుమార్, ఈవూరి గణేశ్, గాదె మధుసూదన్రెడ్డి తదితరులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజాస్వామ్యం ఖూనీ న్యాయస్థానంపై గౌరవంతో, న్యాయంపై నమ్మకంతో వారి ఆదేశాల మేరకు కోర్టులో హాజరవుతున్నాం. ఈ సందర్భంగా మాకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న ప్రజలను, నాయకులను, కార్యకర్తలను అడుగడుగునా అడ్డుకోవటం దారుణం. నేతల అక్రమ నిర్బంధాలేంటి? రోడ్లపై అడ్డగింతలేంటి? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి చర్యలు మంచివి కావు. – పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
సాక్షి, ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు భారీ షాక్ తగిలింది. ఆయన్ని వెంటనే లొంగిపోవాలని సుప్రీం కోర్టు గురువారం ఆదేశించింది. వారంపాటు ఆయన్ని విచారణ జరపొచ్చని సిట్కు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ప్రభాకర్రావు రేపు సరెండర్ కావాలి. అలాగే ఆయన్ని ఫిజికల్గా టార్చర్ చేయొద్దు. థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండానే ఇంటరాగేషన్ చేయండి. వారంపాటు కస్టోడియల్ విచారణ జరిపాక ఆ వివరాలను మాకు తెలియజేయండి’’ అని సుప్రీం కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇంతకాలం సుప్రీం కోర్టు తాత్కాలిక రక్షణతో ప్రభాకర్రావు అరెస్ట్ నుంచి ఊరట పొందుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ్టి విచారణలో.. ‘‘డేటా ఎక్కడుంది?. 36 హార్డ్ డిస్క్ లను ఎలా ధ్వంసం చేస్తారు?. హార్డ్ డిస్క్ లలో డేటా తొలగించాలని మీకు లిఖిత పూర్వక ఆదేశాలు ఎవరైనా ఇచ్చారా?. ఆ ఆదేశాల ప్రతులు చూపండి’’ అని ద్విసభ్య ధర్మాసనం ప్రభాకర్రావు తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అయితే ఆ ఆదేశాలు తమ వద్ద లేవని ఆయన కోర్టుకు తెలిపారు. అందుకే కస్టడీ కోరుతున్నారని జస్టిస్ మహదేవన్ అన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏసీబీ వెంకటగిరి ముందు ప్రభాకర్రావు లొంగిపోవాలి. ఫిజికల్ టార్చర్ చేయకుండా ఇంటరాగేషన్ చేయండి. మందులు, ఇంటి నుంచి భోజనం తెచ్చుకునేందుకు ఆయన్ని అనుమతి ఇవ్వండి అని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఈ క్రమంలో.. విచారణ రోజునే కస్టడీ పొడగింపు కోరుతామని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా అన్నారు. ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు, ఆఖరికి న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్కు గురయ్యాయని అభియోగాలున్నాయి. అంతేకాదు.. ఆ ఆధారాలను మాయం చేసే ప్రయత్నమూ జరిగిందనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభాకర్ రావు బంధువు, ఇంటెలిజెన్స్లో డీఎస్పీగా పని చేసిన ప్రణీత్రావు అరెస్ట్తో ట్యాపింగ్ తేనెతుట్టె కదిలింది. ఈ కేసులో ఏ1గా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు పేరును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) చేర్చింది. ప్రణీత్రావు అరెస్ట్ అప్పటి నుంచి ప్రభాకర్రావు విదేశాల్లో ఉంటూ వచ్చారు. చివరకు.. సుప్రీం కోర్టు నుంచి మధ్యంతర ఆదేశాలతో అరెస్ట్ నుంచి ఊరట పొందిన ఆయన హైదరాబాద్కు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి పలుమార్లు ఆయన్ని సిట్ విచారణ జరిపింది. అయితే.. అరెస్టు నుంచి ఊరట కావాలంటే దర్యాప్తునకు అన్నివిధాలా సహకరించాలని ప్రభాకర్రావుకు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయినా కూడా ఆయన ఐక్లౌడ్ అకౌంట్ పాస్వర్డ్ ఇవ్వకుండా డేటాను డిలీట్ చేశారని.. దర్యాప్తులో ఏరకంగానూ సహకరించడం లేదని సిట్ తరఫున తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. దీంతో.. తాత్కాలిక రక్షణను పక్కన పెట్టి లొంగిపోయి విచారణకు సహకరించాలని ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇదిలా ఉంటే.. ఈ కేసులో మాజీ పోలీసు అధికారులు రాధాకిషన్, తిరుపతి రావులు అరెస్ట్ అయ్యారు. రాధాకిషన్ తన కన్ఫెషన్లో మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తావన తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో.. కేసీఆర్కు పదేళ్లపాటు ఓఎస్డీగా పని చేసిన పీ రాజశేఖర్ రెడ్డిని ఇటీవలె SIT ప్రశ్నించింది కూడా. ఇప్పుడు ప్రభాకర్రావు కస్టోడియల్ విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తాయా? అనే ఆసక్తి నెలకొంది. -
క్షమించండి, తీర్పు అనంగీకారం!
‘తమిళనాడు రాష్ట్రం వర్సెస్ తమిళనాడు గవర్నర్’ కేసులో సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. ఈ తీర్పు నేపథ్యం: తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆమోదించ లేదు. వాటిని ఆయన రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి కూడా ఆ బిల్లులకు సమ్మతి తెలుపలేదు. మరోసారి పరిశీలించవలసిందిగా కోరుతూ శాసనసభకు తిప్పి పంపనూ లేదు. ఈ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం–గవర్నర్ మధ్య వివాదానికి దారితీసింది.ఇక్కడ మూడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి: 1. ఆమోదం పొందని బిల్లుపై సుప్రీం కోర్టు విచారణ జరిపి తీర్పు చెప్పగలదా? శాసనసభ ఆమోదించి పంపినా గవర్నర్ లేదా రాష్ట్రపతి దానికి సమ్మతి ఇవ్వనప్పుడు అది చట్టం హోదా పొందినట్లేనని భావించ వచ్చా? 2. ఆ బిల్లుకు ఆమోద ముద్ర వేయాలంటూ గవర్నర్ లేదా రాష్ట్రపతిని, ఆర్టికల్ 142 కింద, సంపూర్ణ న్యాయం అనే సూత్రం ప్రాతిపదికగా సుప్రీం కోర్టు బలవంత పెట్టగలదా? 3. శాసన సభ–గవర్నర్ మధ్య వివాదాన్ని పరిష్కరించే అధికారం రాజ్యాంగం సుప్రీం కోర్టుకు దఖలు పరిచిందా?రాజ్యాంగం ఏం చెబుతోంది?ఆర్టికల్ 200 ప్రకారం, గవర్నర్ బిల్లును అందుకున్న తరువాత సాధ్యమైనంత త్వరగా దానికి ఆమోదముద్ర వేయాలి లేదా తన వ్యాఖ్యలు జోడించి వెనక్కు పంపాలి లేదా రాష్ట్రపతికి నివేదించాలి. ఒకసారి తిప్పిపంపిన తర్వాత, శాసనసభ ఆ బిల్లును మళ్లీ పంపితే, దానికి ఆమోదముద్ర వేయడం తప్ప గవర్నర్కు మరో మార్గం లేదు. తమిళనాడు విషయంలో బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయలేదు, వెనక్కు పంపలేదు. శాసనసభ తనకుతానుగా అదే బిల్లును రెండోసారి ఆమోదించి గవర్నర్కు పంపింది. గవర్నర్ ఎంతకాలం బిల్లును పెండింగులో పెట్టగలరు? రాజ్యాంగం కాలపరిమితి విధించడం లేదు. ‘సాధ్యమైనంత త్వరగా’ తిప్పి పంపాలని మాత్రమే చెబుతోంది. ఒకవేళ బిల్లు ఆమో దించడానికి నిరాకరిస్తే? అలాంటప్పుడు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి, గవర్నర్ లేదా రాష్ట్రపతి మీద చట్టసభల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం. రెండు, ఆ బిల్లును మరోసారి పరిశీలించి ఆమోదించి పంపడం. తమిళనాడు శాసనసభ ఈ రెండో మార్గం ఎంచుకుంది. అది ప్రారంభించిన ఈ రాజ్యాంగ సంప్రదాయానికి రాజ్యాంగబద్ధత ఉందా? సుప్రీం కోర్టు ఈ అంశాన్ని చర్చించలేదు. మరొక పరిస్థితిని పరిశీలిద్దాం. గవర్నర్ ఒక బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం నివేదించినప్పుడు, రాష్ట్రపతి దానికి ఆమోదముద్ర వేయకుండా నిలిపివేస్తే, రాష్ట్ర శాసనసభ ఏం చేయాలి? రాష్ట్రపతి నుండి ఎలాంటి సందేశం రాకపోతే, శాసనసభ స్వయంగా బిల్లును పున:పరిశీలించి రెండోసారి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించ వచ్చు. బిల్లు రెండోసారి సభ ఆమోదం పొందినప్పుడు, ఆమోద ముద్ర వేయడం తప్ప రాష్ట్రపతికి మరో మార్గం లేదు. ఆర్టికల్ 143 కింద, రాష్ట్రపతి సుప్రీం కోర్టును అడిగిన ప్రశ్న: రాష్ట్రపతి ఎంతకాలం బిల్లును నిలిపివేయవచ్చు? దీనికి సమాధానంగా ఒక సంప్రదా యాన్ని నెలకొల్పే అవకాశం ఇదే ఆర్టికల్ కల్పిస్తోంది. సుప్రీంకోర్టు ఈ విషయంలో మార్గదర్శక న్యాయస్థానంగా వ్యవహరించకుండా, దేశానికి సూపర్ హీరోగా, బాస్గా వ్యవహరించింది.ప్రస్తుత పరిస్థితిప్రస్తుత కేసులో రాష్ట్రపతి బిల్లును తిప్పి పంపలేదు, ఆమోద ముద్రా వేయలేదు. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం ఇవ్వకపోయినా, లేదా సందేశంతో వెనక్కు పంపకపోయినా, శాసనసభకు ఉన్న ప్రత్యామ్నాయం ఆ బిల్లును తిరిగి పరిశీలించడం. అలా రాష్ట్రపతి సలహా లేకుండా బిల్లును పున:పరిశీలించి ఆమోదిస్తే, రాష్ట్రపతి దానికి ఆమోదముద్ర వేయడం తప్ప మరోలా చేయలేరు. భవిష్య త్తులో శాసనసభకు రాష్ట్రపతికి మధ్య విభేదాలు వస్తాయని రాజ్యాంగం ఊహించలేదు.కానీ సుప్రీం కోర్టు తీర్పు వ్యవస్థల అధికార పరిధి అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. ఇదే ప్రధాన సమస్య. ఆర్టికల్ 145 ప్రకారం, సుప్రీం కోర్టుకు తన కార్యకలాపాలకు అవసరమైన నియమావళిని రూపొందించుకునే అధికారం ఉంది. అలాగే, ఆర్టికల్స్ 118, 208 ప్రకారం, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు తమ సభావ్యవహారాల నిర్వహణకు అవసరమైన నియమావళిని రూపొందించుకునే అధికారం కలిగి ఉన్నాయి. ఆర్టికల్స్ 122, 212 ప్రకారం సభా కార్యకలాపాలను కోర్టులో ప్రశ్నించే వీల్లేదు. రాష్ట్రం, కేంద్రం నడుమ వివాదమా?భారత రాజ్యాంగం శాసనసభ, గవర్నర్ మధ్య సంబంధాన్ని స్పష్టంగా నిర్వచించింది. అయితే, ఆచరణలో అనేక సందిగ్ధతలు ఉత్పన్నమవుతున్నాయి. బిల్లులు స్పీకర్ ద్వారా మాత్రమే గవర్నర్కు చేరతాయి. గవర్నర్ సమ్మతి పొందే వరకు బిల్లు శాసనసభ ఆస్తిగా ఉంటుంది. ఆమోదముద్ర పడిన తర్వాత అది చట్టంగా మారుతుంది. బిల్లు ఆమోదముద్ర పొందనంత వరకు ఈ వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదు.ఆర్టికల్ 212 ప్రకారం శాసనసభ ప్రక్రియలు న్యాయస్థాన అధికార పరిధిలోకి రావు. అదే సమయంలో, ఆర్టికల్స్ 32, 131 ప్రకారం, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన లేదా రాష్ట్రం–కేంద్రం నడుమ వివాదాలు సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తాయి. గవర్నర్ లేదా రాష్టపతి బిల్లుపై సంతకం చేయకపోవడం రాష్ట్రం–కేంద్రం మధ్య వివాదం అవుతుందా? అలా అయ్యేట్లయితే అది సుప్రీం పరిధిలోకి వస్తుంది. సమస్య ఏమిటంటే, సుప్రీంకోర్టు తీర్పు ఈ అంశాన్ని పరిశీలించలేదు. ఈ ప్రతిష్టంభనను అధిగమించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, శాసనసభ బిల్లును రెండోసారి ఆమో దించడం. దీనివల్ల గవర్నర్ ఆమోదం ఇవ్వకుండా తప్పించు కోలేరు. రెండవది, ఆర్టికల్ 156(1) ప్రకారం, రాష్ట్రపతి సంతృప్తి మేరకు గవర్నర్ పదవిలో ఉంటారు. అసెంబ్లీ తీర్మానం చేసి, గవర్నర్ను వెనక్కి పిలిపించవలసిందిగా రాష్ట్రపతిని కోరవచ్చు. తమిళనాడు అసెంబ్లీ ఈ మార్గాన్ని ఉపయోగించకపోవడం వల్ల రాజ్యాంగ సంక్షోభం ఉత్పన్నమైంది.గవర్నర్ ఒక బిల్లును రాష్ట్రపతికి రిజర్వ్ చేసినప్పుడు, ఆయన తన అధికారాన్ని రాష్ట్రపతికి అప్పగించినట్లే. అందువల్ల రాష్ట్రపతి, గవర్నర్ ఒకే గుర్తింపు కలిగిన వారవుతారు. ఈ ముఖ్యాంశాన్ని సుప్రీం కోర్టు పరిశీలించలేదు. ఆర్టికల్ 12 ప్రకారం ‘స్టేట్’ అంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభ; కేంద్రంలో కేంద్రప్రభుత్వం, పార్లమెంటు అవుతాయి. కాబట్టి, రాష్టం గవర్నర్పై పిటిషన్ వేయడం అంటే తన మీద తనే కేసు వేసుకున్నట్లు అవుతుంది. ఇదెలా సాధ్యం? రాష్ట్రంలోని ఒక విభాగం మరొక విభాగానికి వ్యతి రేకంగా రిట్ పిటిషన్ను ఎలా దాఖలు చేయగలదో తేల్చడంలో అత్యున్నత న్యాయస్థానం విఫలమైంది. ఈ కారణాల వల్లనే నేను ఆ తీర్పుతో ఏకీభవించడం లేదు.ప్రకాశ్ అంబేడ్కర్వ్యాసకర్త లోక్సభ, రాజ్యసభ మాజీ సభ్యులు, అడ్వకేట్ (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
KSR Live Show : సాక్షి ఛానల్ ను ఎలా బ్లాక్ చేస్తారు?
-
‘సాక్షి’ చానల్ను ఎలా బ్లాక్ చేస్తారు?
సాక్షి, న్యూఢిల్లీ: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ‘సాక్షి’ టీవీపై సాగిస్తున్న కక్షసాధింపు చర్యలకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సాక్షి టీవీ ప్రసారాలను రాష్ట్రవ్యాప్తంగా అడ్డగోలుగా నిలిపివేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఒక వార్తా చానల్ను పూర్తిగా అంధకారంలోకి నెట్టేయడం (కంప్లీట్ బ్లాక్ ఔట్) అత్యంత తీవ్రమైన అంశం’’ అని మండిపడింది. ఈ అన్యాయంపై తక్షణమే విచారణ జరిపి పరిష్కరించాలని టెలికం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (టీడీ శాట్)ను ఆదేశించింది. పూర్తిగా ప్రసారాలు నిలిపివేసిన తరుణంలో... ట్రిబ్యునల్ తదుపరి విచారణను వచ్చే ఏడాది మార్చి నెలకు వాయిదా వేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. పిటిషనర్ అభ్యర్థన మేరకు విచారణను ముందే ముగించాలని టీడీ శాట్ను ఆదేశించింది. ఇది అత్యవసరమని, భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన అంశమని స్పష్టం చేసింది. చానల్ ప్రసారాలను పునరుద్ధరించేలా ఆదేశించాలంటూ సాక్షి టీవీ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం విచారణ సందర్భంగా జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అతుల్ ఎస్.చందూర్కర్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజల గొంతుకను అణచివేస్తున్నారు ‘‘ఏపీలో ప్రభుత్వం మారిన కేవలం రెండు వారాల్లోనే, రాజకీయ దురుద్దేశంతో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేశారు. 2024 జూన్ 3 వరకు ప్రజలకు అత్యంత చేరువలో ఉన్న చానల్ను జూన్ 20 తర్వాత కుట్రపూరితంగా అడ్డుకున్నారు’’ అని ‘సాక్షి’ టీవీ తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, నిరంజన్రెడ్డి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ప్రభుత్వం నేరుగా ఆదేశాలు ఇవ్వకుండా, వెనుక ఉండి ఎంఎస్వోలను భయభ్రాంతులకు గురిచేస్తోందని రోహత్గీ వాదించారు. ఎలాంటి రాతపూర్వక ఉత్తర్వులు లేకుండానే, కేవలం మౌఖిక ఆదేశాలతో సాక్షి ప్రసారాలను అడ్డుకుంటున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కస్టమర్ కేర్కు ఫోన్ చేసినా చానల్ను ఆపేశామని చెబుతున్నారే తప్ప, కనీసం వినియోగదారుడు కోరుకుంటే ఇచ్చే పద్ధతిలోనూ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని నివేదించారు. మీడియా స్వేచ్ఛను బాబు సర్కారు కాలరాస్తోందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఫైబర్నెట్ నుంచే కుట్ర సాక్షి ప్రసారాల నిలిపివేత కుట్రలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీ ఫైబర్నెట్ ప్రధాన పాత్ర పోషిస్తోందని సాక్షి తరపు న్యాయవాదులు వాదించారు. ఈ వ్యవహారంపై గతంలోనే ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ పటేల్ తీవ్రంగా స్పందించారని, ఫైబర్ నెట్ అధికారులు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారని రోహత్గీ ప్రస్తావించారు. అయినా, ప్రభుత్వం తీరు మారలేదని, బ్లాక్ ఔట్ కొనసాగుతూనే ఉందని తెలిపారు. -
S.I.R. Row: ఎస్ఐఆర్పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో.. కీలక వ్యాఖ్యలు చేసింది కూడా. వరుసగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోనే ఎస్ఐఆర్ జరుగుతోంది. ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండోదశ ఎస్ఐఆర్ కొనసాగుతోంది. దీనిపై పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు వేర్వురుగా పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే ఈ పిటిషన్లను వేర్వేరుగా విచారిస్తున్న సుప్రీం కోర్టు.. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుందని మంగళవారం స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో భాగమైన బీఎల్ఓలు (బూత్ లెవెల్ అధికారులు), ఇతర అధికారులకు బెదిరింపులు రావడాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలను తమ దృష్టికి తీసుకురావాలని లేకపోతే గందరగోళ పరిస్థితులు ఎదురుకావొచ్చని హెచ్చరించింది. బీఎల్ఓలకు బెదిరింపులు, ఎస్ఐఆర్ ప్రక్రియలో అంతరాయాల గురించి తమ దృష్టికి తీసుకువస్తే.. వారి భద్రతకు సంబంధించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించింది. బీఎల్ఓలు ఒత్తిడికి గురైతే వారి స్థానంలో వేరే వారిని తీసుకోవడం వంటి పరిష్కార మార్గాలను అనుసరిస్తూ.. ఎస్ఐఆర్ జరిగేలా చూడాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఈ ప్రక్రియ నిర్వహణలో ఏవైనా అవాంతరాలు ఏర్పడితే.. అధికారులను రక్షించడానికి పోలీసుల సహకారం తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం (Election Commission) కోర్టుకు వెల్లడించింది. -
బార్ కౌన్సిళ్లలో మహిళా లాయర్లకు 30% సీట్లు
న్యూఢిల్లీ: రాష్ట్రాల బార్ కౌన్సిళ్లలో మహిళా న్యాయవాదులకు 30 శాతం సీట్లు కేటాయించాలని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది. ఆయా కౌన్సిళ్లలో ఎన్నికల ప్రక్రియ ఇంకా మొదలుకాని రాష్ట్రాల్లోనే తమ నిర్ణయాన్ని వర్తింపజేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగీ్చల ధర్మాసనం స్పష్టంచేసింది. ‘‘కౌన్సిళ్లకు ఎన్నికలు జరగని పక్షంలో ఆయా రాష్ట్రాల్లో మహిళలకు 20 శాతం సీట్లు కేటాయించాలి. పోటీ చేయడానికి సరిపడా మహిళా అభ్యర్థులు లేనిపక్షంలో మరో10 శాతం సీట్లను వీలైతే పురుషులకు కేటాయించుకోవచ్చు’’అని ధర్మాసనం స్పష్టంచేసింది. గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఇప్పటికే ఆరు బార్ కౌన్సిళ్లలో ఎన్నికల ప్రక్రియ మొదలెట్టేశామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) ఛైర్మన్పర్సన్, సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ బార్ కౌన్సిళ్లలో ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లలో మహిళలకు మూడింట ఒకవంతు రిజర్వేషన్ అమలుచేయాలని లాయర్లు యోగమయ ఎంజీ, షెహ్లా చౌదరిలు వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం పై విధంగా స్పందించింది. ఆఫీస్ బేరర్ పోస్టుల్లో కనీసం ఒక్కటైనా మహిళలకు కేటాయించాలని వాళ్లు ధర్మాసనాన్ని గతంలో కోరారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్, ఒక ఆఫీస్బేరర్ పోస్ట్ రిజర్వ్చేస్తూ గత ఏడాది మే రెండో తేదీన సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెల్సిందే. -
వాంగ్చుక్ నిర్బంధంపై నేడు సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ నిర్బంధాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య గీతాంజలి జె. ఆంగ్మో వేసిన పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద వాంగ్చుక్ను నిర్బంధించడం అక్రమం, ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తూ ఏకపక్షంగా తీసుకున్న చర్యగా గీతాంజలి పేర్కొన్నారు. నవంబర్ 24వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా పిటిషన్పై వివరణ ఇచ్చేందుకు సమయం కావాలంటూ కేంద్రం, లద్దాఖ్ యంత్రాంగం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరడంతో సుప్రీం ఓకే చెప్పింది. దీనిపై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టనుంది. లద్దాఖ్ను రాజ్యాంగం ఆరో షెడ్యూల్లో చేర్చాలని, రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్లతో సెప్టెంబర్లో చేపట్టిన ఆందోళన హింసాత్మక రూపం దాల్చింది. పలు ఘటనల్లో నలుగురు చనిపోగా, 90 మంది వరకు గాయప డ్డారు. హింసను ప్రేరేపించారనే ఆరోప ణలపై వాంగ్చుక్ను సెప్టెంబర్ 26వ తేదీన నిర్బంధంలోకి తీసుకున్నారు. -
సామాన్యుల కోసమే సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు అంటే సామాన్య ప్రజల కోసమేనని, తాను ఇవ్వాలనుకుంటున్న సందేశం అదేనని భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టంచేశారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నానని తెలిపారు. ఇందుకోసం స్పష్టమైన టైమ్లైన్, ఏకీకృత జాతీయ జ్యుడీషియల్ విధానం తీసుకురావాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. శనివారం ఢిల్లీలో హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడారు. ప్రజలకు న్యాయం సులభంగా అందాలన్నారు. లిటిగేషన్ వ్యయాన్ని తగ్గించడం దృష్టి పెట్టానని చెప్పారు. నిర్దేశిత గడువులోగా కేసులు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నానని, తద్వారా కక్షిదారులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. పెండింగ్ కేసులన్నీ ఒకేసారి పరిష్కారం అవుతాయని తాను చెప్పడం లేదని, కేసుల పరిష్కారం అనేది నిరంతర ప్రక్రియ అని వ్యాఖ్యానించారు. పాత కేసులను తొలుత పరిష్కరించాలి న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. మన రాజ్యాంగం మూడు కీలక విభాగాల మధ్య స్పష్టమైన అధికారాల విభజన చేసిందని వివరించారు. శాసన వర్గం, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థ వేటికవే స్వతంత్రంగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ఒక వ్యవస్థ అధికారాల్లో మరో వ్యవస్థ అతిగా జోక్యం చేసుకోకుండా రాజ్యాంగం ఏర్పాట్లు చేసిందని ఉద్ఘాటించారు. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. కొత్త కేసుల కంటే పాత కేసుల పరిష్కారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మధ్యవర్తిత్వం కీలకమైన అస్త్రం అవుతుందన్నారు. మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కరించుకోవాలని కక్షిదారులకు సూచించారు. పాత కేసులను మొదట పరిష్కరించే దిశగా రాబోయే రోజుల్లో కొన్ని సంస్కరణలు చేపట్టబోతున్నట్లు సంకేతాలిచ్చారు. ఇందుకోసం తనకు సహకరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కోరారు. న్యాయ వ్యవస్థ కొత్తకొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయని గుర్తుచేశారు. ఇలాంటి కేసులను విచారించడానికి న్యాయ వ్యవస్థను ఆధునీకరించాలని వివరించారు. న్యాయవాదులు, న్యాయమూర్తులకు తగిన శిక్షణ ఇవ్వాలన్నారు. -
ఆలయం సొమ్మును ఆ దేవత కోసమే వినియోగించాలి: సుప్రీం
న్యూఢిల్లీ: ఆలయానికి చెందిన సొమ్మును ఆ దేవత కోసం వాడాలే తప్ప, కష్టాల్లో ఉన్న సహకార బ్యాంకుల కోసం వినియోగించరాదని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. తిరునెల్లి టెంపుల్ దేవస్వోమ్కు చెందిన డిపాజిట్లను తిరిగి ఆలయానికి వాపసు చేయాలంటూ కేరళ హైకోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ కొన్ని సహకార బ్యాంకులు వేసిన పిటిషన్ను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం..‘బ్యాంకులను కాపాడుకునేందుకు మీరు ఆలయం సొమ్మును వాడుకోవాలనుకుంటున్నారా? నష్టాల్లో ఉన్న ఒక సహకార బ్యాంకులో ఆలయం డబ్బును ఉంచే బదులు, ఎక్కువ వడ్డీ ఇచ్చే జాతీయ బ్యాంకుకు మళ్లించాలని ఆదేశించడంలో తప్పేముంది?’అని పిటిషనర్లను ప్రశ్నించింది. ‘ఆలయం సొమ్ము ఆ దేవతకే చెందుతుంది. అందుకే, ఆ సొత్తును దాచాలి, కాపాడుకోవాలి, ఆలయ ప్రయోజనాల కోసమే వాడాలి. అంతేగానీ, నష్టాల్లో ఉన్న సహకార బ్యాంకు మనుగడకు ఒక వనరుగా ఆ సొమ్ము మారరాదు’అని ఈ సందర్భంగా సీజేఐ వ్యాఖ్యానించారు. బ్యాంకులు ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకోవాలన్న ధర్మాసనం.. ఖాతాదారులను, డిపాజిట్లను ఆకర్షించలేకపోవడం మీ సమస్య’అని పిటిషనర్లనుద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషన్పై విచారణ చేపట్టేందుకు నిరాకరించింది. అయితే, డిపాజిట్ల ఉపసంహరణ గడువు పెంచాలని కేరళ హైకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ఆలయానికి చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లను కొన్ని సహకార బ్యాంకులు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించిన నేపథ్యంలో తిరునెల్లి ఆలయ బోర్డు కోర్టుకెక్కింది. -
ఉపా కేసులో వ్యక్తికి సుప్రీం బెయిల్
న్యూఢిల్లీ: నకిలీ కరెన్సీ నోట్లు కలిగి ఉన్న ఆరోపణలపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం(ఉపా)కింద అరెస్టయిన ఓ వ్యక్తికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండేళ్లుగా జైలు జీవితం గడుపుతున్నప్పటికీ ఇప్పటి వరకు అసోం పోలీసులు కోర్టులో చార్జిషీటు వేయలేదని అత్యున్నత న్యాయస్థానం అగ్రహం వ్యక్తం చేసింది. నిర్దేశిత సమయంలోగా విచారణ మొదలు కాలేదని, ఇలా కస్టడీలో ఉంచటం అక్రమమని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం స్పష్టం చేసింది. ఉపా–1967 కింద అరెస్ట్ చేసిన వ్యక్తిపై 90 రోజుల్లోగా చార్జిషీటు వేయాలి. కోర్టు అనుమతి లేకుండా ఈ గడువును 180 రోజుల వరకు పొడిగించే వెసులుబాటు కూడా ఉంది. ‘రెండేళ్లు గడిచినా ఎందుకు చార్జిషీటు వేయలేదని పోలీసులను ప్రశ్నించింది. ఇది అక్రమ కస్టడీ అన్నది వాస్తవం. మీరేమైనా గొప్ప వాళ్లనుకుంటున్నారా? అంటూ కడిగిపారేసింది. అయితే, మయన్మార్ వాసి అయిన నిందితుడు తొన్లొంగ్ కొన్యాక్పై పలు కేసులున్నాయని, నకిలీ నోట్ల కేసులో సహ నిందితులు పరారీలో ఉండటంతో చార్జిషీటు వేయలేకపోయామని పోలీసుల తరఫున లాయర్ ధర్మాసనానికి నివేదించారు. అయితే, ఈ కేసును ప్రత్యేకమైందిగా భావించి నిందితుడికి బెయిల్ ఇస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. -
మహిళా న్యాయవాదులకు 30శాతం రిజర్వేషన్లు కల్పించండి
న్యూఢిల్లీ: రాష్ట్ర బార్కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బార్ కౌన్సిల్ ఆ‹ఫ్ ఇండియా (బీసీఐ)కి సుప్రీంకోర్టు సూచించింది. ‘రాష్ట్ర బార్కౌన్సిల్లలో 30శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా బీసీఐ నియమాలను రూపొందిస్తుందని ఆశిస్తున్నాం. కొన్ని ఆఫీస్ బేరర్ పోస్టులు కూడా అందుబాటులో ఉండాలి ’ప్రదాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టి‹స్ జోయ్ మాల్యా బాగి్చలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర బార్ కౌన్సిల్లలో మహిళా ప్రాతినిధ్యం తప్పనిసరి చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం అటువంటి రిజర్వేషన్లను అమలు చేయడానికి అడ్వకేట్స్ చట్టానికి సవరణలు అవసరమని బీసీఐకి తెలిపింది. అయితే రాష్ట్రాల బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రక్రియలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, తక్షణ మార్పులు కష్టమని బీసీఐ తరపు న్యాయవాది గురుకుమార్ ధర్మాసనానికి తెలిపారు. అంతేకాదు.. మహిళా న్యాయవాదులు పోటీ చేయడంపై ఆయన అనుమానం వ్యక్తం చేయగా.. మహిళా న్యాయవాదుల సర్వే ఆధారంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన వర్క్షా‹ప్ను ధర్మాసనం ప్రస్తావించింది. 83 మంది శాతం మహిళా న్యాయవాదులు బీసీఐలో సభ్యులుగా ఉండాలని కోరుకుంటున్నారని వెల్లడించింది. ఒక ఆఫీ‹స్ బేరర్ పదవిని మహిళా న్యాయవాదులకు రిజర్వ్ చేయాలని సూచించింది. -
బీఎల్వోలపై పనిభారం తగ్గించండి
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్ పలు రాష్ట్రాల్లో చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)లో పాల్గొనే బూత్ లెవల్ అధికారు(బీఎల్వో)లపై పని ఒత్తిడి తగ్గించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. వారిపై పనిభారం తగ్గించేందుకు వీలుగా మరింత మంది సిబ్బందిని కేటాయించాలని సంబంధిత రాష్ట్రాలను ఆదేశించింది. ఎస్ఐఆర్ను గడువులోగా పూర్తి చేయాలంటూ బీఎల్వోలపై ఈసీ ఒత్తిడి పెంచుతోందని, అలా చేయని వారిపై ప్రజాప్రాతినిథ్య చట్టం కింద చర్యలు తీసుకుంటోందని, ఈ పరిస్థితుల్లో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కూడా ఉన్నాయని నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) సుప్రీంలో పిటిషన్ వేసింది. దీనిని గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగి్చల ధర్మాసనం విచారణ చేపట్టింది. బీఎల్వోలుగా విధులు నిర్వర్తిస్తున్న టీచర్లు, అంగన్ వాడీ సిబ్బంది వంటి వారిపై ఒత్తిడి చేయడం, కేసులు నమోదు చేయడం వంటి ఆపేలా ఈసీని ఆదేశించాలని ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ లాయర్ గోపాల్ శంకరనారాయణన్ కోరారు. ‘రాష్ట్రాలు ఎస్ఐఆర్ కోసం ఈసీకి అదనంగా సిబ్బందిని కేటాయిస్తే సరిపోతుంది. పనిగంటలు తగ్గి, బీఎల్వోలపై ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. ఇలాంటి ఇబ్బందులుంటే రాష్ట్రాలు పరిష్కరించుకోవాలి. ఎస్ఐఆర్ జరుగుతున్న రాష్ట్రాలు అవసరమైన మేరకు అదనంగా సిబ్బందిని నియమించుకోవాలి’అని ధర్మాసనం పేర్కొంది. ‘సిబ్బంది ఎవరైనా ప్రత్యేక కారణాలతో మినహాయింపు కోరిన పక్షంలో సంబంధిత రాష్ట్ర ఉన్నతాధికారి అలాంటి కేసులను పరిస్థితులను బట్టి డీల్ చేయాలి. వేరొకరిని ఆస్థానంలో నియమించాలి’అని ధర్మాసనం వివరించింది. అలా ప్రత్యామ్నాయం ఇవ్వలేనప్పుడు, ఆ ఉద్యోగిని బాధ్యతల నుంచి ఉపసంహరించుకోవాలనడం తమ ఉద్దేశం కాదని కూడా ధర్మాసనం స్పష్టతనిచి్చంది. విధుల్లో మరణించిన బీఎల్వోల కుటుంబాలకు పరిహారం ఇవ్వడం వంటి అంశాలపై తర్వాత వేరుగా ఆదేశాలిస్తామని తెలిపింది. -
వ్యవస్థను అపహాస్యం చేయడమే
న్యూఢిల్లీ: హైకోర్టుల్లో యాసిడ్ దాడి కేసుల విచారణలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ వైఖరి వ్యవస్థను అపహాస్యం చేయడమేనంటూ తప్పుబట్టింది. పెండింగ్లో ఉన్న యాసిడ్ దాడి కేసుల వివరాలను నాలుగు వారాల్లోగా తమ ముందుంచాలని అన్ని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. యాసిడ్ దాడి కేసుల సత్వరణ విచారణ కోసం ప్రత్యేక కోర్టుల ఏర్పాటు విషయం కూడా తమ పరిశీలనలో ఉందని తెలిపింది. యాసిడ్ దాడుల బాధితులను దివ్యాంగుల జాబితాలో చేర్చి వారికి సంక్షేమ పథకాలను వర్తింప జేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ షహీన్ మాలిక్ అనే బాధితురాలు వేసిన పిల్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగి్చల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. రోహిణి కోర్టులో 2009లో బాధితురాలు షహీన్ మాలిక్ వేసిన కేసు 16 ఏళ్లుగా పెండింగ్లో ఉండటంపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. బాధితురాలు ధర్మాసనం ఎదుట స్వయంగా హాజరై తన వాదన వినిపించారు. తనపై జరిగిన యాసిడ్ దాడిపై ఇప్పటికీ విచారణ కొనసాగుతోందని తెలిపారు. 2013 వరకు కేసులో ఎలాంటి పురోగతి లేదని, ఇప్పటికి తుది దశకు చేరుకుందని ఆమె వివరించారు.‘దేశ రాజధాని పరిస్థితులే ఇలాగుంటే బాధితుల గోడు పట్టించుకునేదెవరు..? ఈ పరిస్థితి మన వ్యవస్థకు, జాతికే సిగ్గుచేటు’అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఈ కేసును సుమోటో తీసుకుంటున్నామని, విచారణ ఇకపై రోజువారీగా జరపాలని సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు. అదే సమయంలో, యాసిడ్ను బలవంతంగా శరీరంలోకి ఇంజెక్షన్ చేసిన, తాపించిన ఘటనలు కూడా ఉన్నాయని బాధితురాలు షహీన్ మాలిక్ తెలిపారు. యాసిడ్ శరీరంలోకి వెళ్లిన బాధితులకు కృత్రిమ ఆహారాన్ని ట్యూబుల ద్వారా అందించేంతటి తీవ్ర పరిస్థితులున్నాయని, కొందరు అంగవికలురయ్యారని కూడా ఆమె పేర్కొన్నారు. ఇది విని సీజేఐ సూర్యకాంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటివి కూడా జరిగినట్లు ఇప్పటి వరకు తమకు తెలియదన్నారు. అత్యంత ఘోరమైన, బాధితులపై తీవ్ర ప్రభావం చూపే ఇలాంటి దారుణాలపై ప్రత్యేక కోర్టుల్లో విచారణ జరపాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ‘ఇది వ్యవస్థను అపహాస్యం చేయడమే. ఇందుకు బాధ్యులైన వారిపై దయాదాక్షిణ్యాలు చూపించాల్సిన పనిలేదు. వారికి తగిన విధంగా శాస్తి చేయాల్సిందే’అని ఆయన వ్యాఖ్యానించారు. వివిధ హైకోర్టుల పరిధిలో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను నాలుగు వారాల్లోగా అందజేయాలని సంబంధిత రిజి్రస్టార్ జనరల్స్ను ఈ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది. అదేవిధంగా, యాసిడ్ దాడుల బాధితులు సంక్షేమ పథకాలు పొందేందుకు వీలుగా ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ చట్టం కింద వికలాంగుల నిర్వచనంలో చేర్చే విషయమై అభిప్రాయం తెలపాల్సిందిగా కేంద్రంతోపాటు డిపార్టుమెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్కు నోటీసులు జారీ చేసింది. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి తెలిపారు. అదే సమయంలో, రోహిణి కోర్టులో ఇన్నేళ్లపాటు ఈ కేసు పెండింగ్లో ఉండటానికి దారి తీసిన కారణాలపై వచ్చే వారం విచారణ చేపడతామని కూడా ధర్మాసనం ప్రకటించింది. -
‘సుప్రీం’లో చెవిరెడ్డి మోహిత్రెడ్డికి మళ్లీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్సీపీ యువనేత చెవిరెడ్డి మోహిత్రెడ్డి(chevireddy mohith reddy)కి సుప్రీంకోర్టులో మరోసారి ఊరట లభించింది. ఏపీ లిక్కర్ కేసులో ఆయనపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణ ఉత్తర్వులు జనవరి 19 వరకు పొడిగించింది. ఈ కేసుకు సంబంధించి సోమవారం జరిగిన విచారణలో ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది.. కేసును త్వరగా తేల్చాలని, ఎక్కువ గడువు ఇవ్వొద్దని కోరినప్పటికీ, ధర్మాసనం విచారణను జనవరికి వాయిదా వేసింది. రెండునెలల గడువు వద్దే వద్దు.. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం ఎదుట సోమవారం ఈ కేసు విచారణకు వచ్చింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. దీనికి స్పందించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయడానికి ‘రెండు నెలల సమయం’ ఇస్తామని ప్రతిపాదించింది. ప్రభుత్వ న్యాయవాది వెంటనే జోక్యం చేసుకుని.. ‘మై లార్డ్స్.. మాకు రెండు నెలల సమయం వద్దు. కేవలం రెండు వారాలు చాలు. ఈ కేసులో పిటిషనర్ (మోహిత్రెడ్డి) ఇప్పటికే అరెస్టు నుంచి రక్షణ పొందుతున్నారు. ఎక్కువ రోజులు వాయిదా వేస్తే అది దర్యాప్తుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి కౌంటర్ దాఖలు చేయడానికి మాకు రెండు వారాల సమయం చాలు’ అని కోర్టును కోరారు. అంతేగాక.. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నారని, ఆయన అందుబాటులో లేనందున తదుపరి తేదీని నిర్ణయించాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 19కి వాయిదా వేసింది. అప్పటివరకూ మోహిత్రెడ్డిని అరెస్టుచేయడానికి వీల్లేకుండా ఉన్న మధ్యంతర రక్షణ కొనసాగనుంది. -
10న సహ చట్టం ప్రధాన కమిషనర్ ఎంపిక
న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ ఎంపిక, నియా మకంపై కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు స్పష్టత నిచ్చింది. ఈ నెల 10వ తేదీన ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశ మయ్యే కమిటీ ప్రధాన కమిషనర్తోపాటు కమిషనర్ల పోస్టులకు పేర్లను పరిశీలించనున్నట్లు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చిల ధర్మాసనానికి అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ ఈ విషయం తెలిపారు. ప్రధాని సారథ్యంలోని ఎంపిక కమిటీలో ప్రతిపక్ష నేత, ఒక కేంద్ర మంత్రి ఉంటారు. ఈ కమిటీ ప్రధాన సహ కమిషనర్ను, ఇతర కమిషనర్ల పేర్లను సిఫారసు చేస్తుంది. రాష్ట్రాల సమాచార హక్కు కమిషన్లలో ఖాళీల వివరాలను తమ ముందు ఉంచాలని ధర్మాసనం ఈ సందర్భంగా ఎస్ఐఆసీలను ఆదేశించింది. -
డిజిటల్ అరెస్టుల కేసుల్లో సీబీఐ దర్యాప్తు
-
వ్యక్తిత్వానికి ఆభరణం నిజాయతీ
సోనీపట్: మనుషులు ఎల్లవేళలా నిజాయతీ కి, క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. నిజాయతీ అనేది మనిషి వ్యక్తిత్వానికి విలువైన ఆభరణం లాంటిదని చెప్పారు. అంతేకాకుండా న్యాయం, ఖ్యాతిని కాపాడుతుందని అన్నారు. న్యాయ శాస్త్రం అభ్యసిస్తున్న విద్యార్థులు నిజాయతీని తమ జీవితాల్లో అంతర్భాగంగా మార్చుకో వాలని పిలుపునిచ్చారు. హరియాణా రాష్ట్రం సోనీపట్లోని ఓ.పి.జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో న్యాయ వ్యవస్థ స్వతంత్రపై శనివారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో జస్టిస్ సూర్యకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయ శాస్త్రంపై చర్చల కోసం న్యాయాభ్యాస మండపాన్ని ప్రారంభించారు. అలాగే ఇంటర్నేషనల్ మూటింగ్ అకాడమీ ఫర్ అడ్వొకసీ, నెగోషియేషన్, డిస్ప్యూట్ అడ్జుడికేషన్, అర్బిట్రేసన్, రిసొల్యూ సన్ (ఇమాన్దార్)కు శ్రీకారం చుట్టారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్, ఎంపీ, యూనివర్సిటీ చా న్సలర్ నవీన్ జిందాల్, పలువురు న్యాయని పుణులు, న్యాయవాదు లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగిస్తూ.. నిజాయతీ ప్రాముఖ్యతను వివరించారు. ఎవరూ చూడనప్పుడు మనం ఏం చేస్తామో అదే నిజాయతీ, చుట్టూ ఉన్న అందరూ చూస్తుండగా చేసేది సాహసం అని పేర్కొన్నారు. నిజాయతీ అనే ఒక్క పదానికి నైతికంగా ఎంతో విలువ ఉందన్నారు. సత్యం, జ్ఞానం పరస్పరం పోటీ పడాలి నేడు టెక్నాలజీ యుగంలో డీఫ్ ఫేక్ ఫోటోలు, వీడియోల బెడద పెరిగిపోయిందని జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తంచేశారు. తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతోందని అన్నారు. ప్రతిరోజూ దేశంలో ఏదో ఒకచోట డిజిటల్ అరెస్టులు చోటు చేసుకుంటున్నాయని చె ప్పారు. ఇలాంటి పరి స్థితుల్లో సత్యం, జ్ఞానం పరస్పరం పోటీ పడా లని ఉద్ఘాటించారు. నీతి నిజాయతీ అనేవి కేవలం మాటల్లో చెప్పుకొనే ఆదర్శాలు కాదని, మనిషి మనగడకు అవి ముఖ్య సాధనాలు అని స్పష్టంచేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ నిజాయతీని వదు లుకోవద్దని న్యాయ విద్యార్థులకు సూచించారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవాలని అన్నారు. రాజ్యాంగ పరిషత్లోని 15 మంది మహిళా సభ్యులలో ఒకరైన దుర్గాబాయి దేశ్ముఖ్ చెప్పిన మాటలను జస్టిస్ సూర్యకాంత్ గుర్తుచేశారు. స్వతంత్రంగా ఉన్నట్లు న్యాయ వ్యవస్థ భావించాలని స్పష్టంచేశారు. న్యాయ వ్యవస్థ ఇతరుల ఒత్తిళ్లు, ప్రలోభాకలు లొంగకుండా స్వతంత్రంగా పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని తేల్చిచెప్పారు. కాలం మారుతున్నప్పటికీ న్యాయ వ్వవస్థ ప్రజల విశ్వాసం కోల్పోవద్దని పేర్కొన్నారు. -
రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం మరింతగా పెరుగుతుందా?
చట్టసభలు చేసే బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ లకు డువు విధించలేమని ,అది పూర్తిగా రాజ్యాం గవిరుద్దమని సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం మరింతగా పెరుగుతుందా?లేక రాష్ట్రాలు తమ ఇష్టం వచ్చిన రీతిలో బిల్లులు పాస్ చేయకుండా నియంత్రిస్తుందా అన్నది చర్చనీయాంశమే. ఈ తీర్పుపై వచ్చిన కధనాలన్నిటిని పరిశీలిస్తే ఒక విషయం బోధ పడుతుంది. దేశంలో జరుగుతున్న రాజకీయాలు, గవర్నర్ ల నియామకాల తీరుతెన్నులు మొదలైన వాటి విషయంలో గౌరవ న్యాయ మూర్తులకు కూడా మనసులో ఆవేదన ఉన్నప్పటికీ ,రాజ్యాంగ రీత్యా వారి వారికి గడువు విధించలేమని చెప్పారా అన్న భావన కలుగుతుంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది.బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా సుధీర్ఘకాలం గవర్నర్ లు సమయం తీసుకుంటున్నట్లయితే న్యాయ వ్యవస్థ పరిశీలించవచ్చని చెబుతున్నప్పటికీ, అంతిమ అధికారం గవర్నర్ లే అయితే అప్పుడు పెద్దగా ప్రయోజనం ఉంటుందా అన్న సంశయం కలుగుతుంది. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ఒక పరీక్షగా కనబడుతోంది. రాష్ట్రపతి పార్లమెంటు, అసెంబ్లీ సభ్యుల ద్వారా ఎన్నికవుతారు.కాని గవర్నర్ లు మాత్రం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఇష్టాలకు అనుగుణంగా నియమితులవుతారు. కొన్నిసార్లు రాజ్ భవన్ లు రాజకీయ నేతల పునరావాలస కేంద్రాలు గా మారుతున్నాయన్న విమర్శలు కూడా లేకపోలేదు.అది కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా,లేదా బిజెపి కేంద్రంలో ఉన్నా పెద్ద తేడా లేదనే చెప్పాలి. గవర్నర్ లను అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ పార్టీ విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నాయన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది. ఈ మద్యకాలంలో కేరళ ల చట్టసభలు చేసే బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ లకు డువు విధించలేమని ,అది పూర్తిగా రాజ్యాం గవిరుద్దమని సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం మరింతగా పెరుగుతుందా?లేక రాష్ట్రాలు తమ ఇష్టం వచ్చిన రీతిలో బిల్లులు పాస్ చేయకుండా నియంత్రిస్తుందా అన్నది చర్చనీయాంశమే. ఈ తీర్పుపై వచ్చిన కధనాలన్నిటిని పరిశీలిస్తే ఒక విషయం బోధ పడుతుంది. దేశంలో జరుగుతున్న రాజకీయాలు, గవర్నర్ ల నియామకాల తీరుతెన్నులు మొదలైన వాటి విషయంలో గౌరవ న్యాయ మూర్తులకు కూడా మనసులో ఆవేదన ఉన్నప్పటికీ ,రాజ్యాంగ రీత్యా వారి వారికి గడువు విధించలేమని చెప్పారా అన్న భావన కలుగుతుంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది.బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా సుధీర్ఘకాలం గవర్నర్ లు సమయం తీసుకుంటున్నట్లయితే న్యాయ వ్యవస్థ పరిశీలించవచ్చని చెబుతున్నప్పటికీ, అంతిమ అధికారం గవర్నర్ లే అయితే అప్పుడు పెద్దగా ప్రయోజనం ఉంటుందా అన్న సంశయం కలుగుతుంది. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ఒక పరీక్షగా కనబడుతోంది. రాష్ట్రపతి పార్లమెంటు, అసెంబ్లీ సభ్యుల ద్వారా ఎన్నికవుతారు.కాని గవర్నర్ లు మాత్రం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఇష్టాలకు అనుగుణంగా నియమితులవుతారు. కొన్నిసార్లు రాజ్ భవన్ లు రాజకీయ నేతల పునరావాలస కేంద్రాలు గా మారుతున్నాయన్న విమర్శలు కూడా లేకపోలేదు.అది కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా,లేదా బిజెపి కేంద్రంలో ఉన్నా పెద్ద తేడా లేదనే చెప్పాలి. గవర్నర్ లను అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ పార్టీ విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నాయన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది. ఈ మద్యకాలంలో కేరళ లో కొంతకాలం క్రితం వరకు ఉన్న గవర్నర్ కు, సిపిఎం ప్రభుత్వానికి మద్య పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ, కర్నాటక ,పంజాబ్, పశ్చిమబెంంగాల్ రాష్ట్రాలలోని బిజెపియేతర ప్రభుత్వాలు కూడా ఈ సమస్యను ఎదుర్కుంటున్నాయి. రాష్ట్రాలలో ఇది రాజకీయ దుమారంగా ఉంటోంది. తమిళనాడులో శాసనసభ ఆమోదించిన పది బిల్లులను గవర్నర్ తొక్కి పెట్టి ఉంచారు. దానిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రింకోర్టుకు వెళ్లినప్పుడు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం మూడు నెలల గడువులోపు బిల్లులపై నిర్ణయం చేయాలని తీర్పు ఇచ్చింది. అది సంచలనంగా మారింది. కాని కేంద్రం దీనిని అంగీకరించలేదు. రాష్ట్రపతి ఈ విషయంలో పద్నాలుగు ప్రశ్నలు సంధిస్తూ సుప్రింకోర్టుకు లేఖ రాశారు.ఆ మీదట రాజ్యాంగ ధర్మాసనం దీనిపై విచారణ జరిపి రాష్ట్రపతి,గవర్నర్ లకు గడువు విధించలేమని స్పష్టం చేసింది. అలాఅని సుదీర్ఘ సమయం తీసుకోవడం కూడా సరికాదని,ఫెడరల్ స్పూర్తికి విరుద్దం అన్నప్పటికీ, అలా వ్యవహరిస్తే పరిష్కారాన్ని సుప్రింకోర్టు సూచించినట్లు అనిపించదు.ఇది దేశంలో భవిష్యత్తులో మరిన్ని రాజకీయ ,రాజ్యాంగ సంక్షోభాలకు దారి తీసే అవకాశం కూడా ఉంది. కేంద్రం కనుక దీనిని తనకు అనుకూలంగా మలచుకుని రాష్ట్రాలపై గవర్నర్ ల ద్వారా మరింత పెత్తనం చేయవచ్చు.ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.ఒకవేళ రాష్ట్రాలు ఏదైనా రాజ్యాంగ విరుద్దమైన చట్టాన్ని రూపిందిస్తే దానిపై నిపుణులైన న్యాయ కోవిదులతో పాటు ,వివిధ వర్గాల అభిప్రాయం తీసుకుని గవర్నర్ లు నిర్ణయాలు తీసుకునేలా ఏర్పాటు చేయడం అవసరం అనిపిస్తుంది.. బిల్లును ఆమోదించడం, రాష్ట్రపతికి నివేదించడం,లేదా పునస్సమీక్షకు అసెంబ్లీకి తిరిగి పంపడం అనే ఆప్షన్లు ఉన్నాయని అంటూనే గడువు పెట్టలేమని చెప్పడం వల్ల రాజకీయ సమస్య అయ్యే అవకాశం ఉంటుందనిపిస్తుంది. ఈ సందర్భంగా ఛీఫ్ జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యను చూస్తే ఆపివేలయాలన్న బిల్లులను అసెంబ్లీకి తిరిగి పంపడం అనేది ఆప్షన్ కాదని, నిబంధన అనడం బాగానే ఉంది. ఇక్కడే ఒక సందేహం వస్తుంది. న్యాయమూర్తుల మనసులలో గవర్నర్ ల అధికారాలపై అనుమానాలు ఉన్నప్పటికీ, రాజ్యాంగంలో ఉన్న అంశాలను దృష్టిలో ఉంచుకుని తీర్పు ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఒకవేళ ఆ నిబంధనను గవర్నర్ లు పట్టించుకోకపోతే ఎలా వ్యవహరించాలన్నదానిపై మరింత స్పష్టత అవసరం అనిపిస్తుంది. రాజ్యాంగ విరుద్దం కానప్పటికీ, గవర్నర్ లు కావాలని బిల్లులను ఆమోదించకుండా ఉంటే ఏమి చేయాలన్నది ఇప్పుడు ప్రశ్న.ప్రజాస్వామ్యంలో గవర్నర్ లు పెత్తనంపై ఇంతవరకు చాలా చర్చ జరిగింది. సర్కారియా కమిషన్ వంటివి దీనిపై విస్తృతంగా పరిశీలన చేసి అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ముఖ్యంగా చట్టసభలలో మెజార్టీ పై గవర్నర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం కాకుండా శాసనసభలలోనే రుజువు చేసుకోవాలన్న సూత్రం అప్పటి నుంచే వచ్చింది. 1980,90 వ దశకాలలో ఉమ్మడి ఎపితో పాటు పలు రాష్ట్రాలలో గవర్నర్ ల తప్పుడు నిర్ణయాల వల్ల రాజకీయ సంక్షోభాలు వచ్చాయి. మెజార్టీ లేని పార్టీ నేతలకు కేంద్రం లోని పెద్దల సలహాల మేరకు పట్టం కట్టి నాలుక కరచుకున్న ఘట్టాలు జరిగాయి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు గవర్నర్ ల వ్యవస్థ ఉండరాదని వాదించేవారు. ఆయన సీఎం.గా ఉన్నప్పుడు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన గవర్నర్ కుముద్ బెన్ జోషి తో తరచు వివాదాలు ఏర్పడేవి. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొన్ని సందర్భాలలో గవర్నర్ లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.కాకపోతే ఆయన ఎప్పుడూ ఒక స్థిరమైన విధాన నిర్ణయానికి కట్టుబడి లేరు. యుపిలో గవర్నర్ కు వ్యతిరేకంగా బిజెపి అగ్రనేత వాజ్ పేయి ఏకంగా నిరాహార దీక్షకు దిగిన సందర్భం కూడా ఉంది. పశ్చిమబెంగాల్ లో గతంలో గవర్నర్ గా ఉన్న జగదీప్ ధంఖడ్ కు, ముఖ్యమంత్రి మమత బెనర్జీకి ఎంత పెద్ద రగడ నడిచింది ఇటీవలి చరిత్రే. చివరికి ధంఖడ్ ఒక సందర్భంలో అసెంబ్లీ వద్దకు వెళితే గేటు కూడా తెరలేదు. ప్రస్తుత గవర్నర్ తో కూడా వివాదం సాగుతోంది. అది ఎంతవరకు వెళ్లిందంటే టీఎంసీ పార్లమెంటు సభ్యుడు ఒకరు రాజ్ భవన్ లో ఆయుధాలు ఉన్నాయని ఆరోపించారు. దానిపై ఆయన మీద కేసు పెట్టడం, అందుకు ప్రతిగా గవర్నర్ ఆఫీస్ పై ఎమ్.పి కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు బిల్లుల ఆమోదం తో పాటు పలు అంశాలపై బిజెపి ప్రభుత్వ నియమిత గవర్నర్ లు వ్యవహరిస్తున్న తీరుపై ఎన్.డి.ఎ. యేతర ప్రభుత్వాలు గుస్సగాఉన్నాయి. ఉదాహరణకు ఎమ్మెల్సీ నియామకాలపై గవర్నర్ లు ఒక్కోసారి ఒక్కోరకంగా వ్యవహరిస్తున్నారు.ఎన్.డి.ఎ.పాలిత రాష్ట్రాలలో గవర్నర్ లు రాష్ట్రాల అభిమతం మేరకు నడుచుకుంటారు. గతంలో కాంగ్రెస్ కేంద్రంలో పవర్ లో ఉన్నప్పుడు కూడా ఇదే తంతు సాగేది. ఈ నేపధ్యంలో మంత్రివర్గ సలహాను కూడా గవర్నర్ లు విధిగా పాటించనవసరం లేదని సుప్రింకోర్టు తీర్పు ఇవ్వడం వల్ల ఆయా రాష్ట్రాలలోని ప్రభుత్వాలు సరికొత్త సంక్షోభాలలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అందువల్ల దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్ర, రాష్ట్రాలు పరస్పరం చర్చించుకుని ఒక అభిప్రాయానికి రావడం మంచిది. అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా చేయాలని కొందరు న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు అధికారం కాకుండా, నామినేటెడ్ గవర్నర్ లకు అధికారం ఉండడం ప్రజాస్వామ్య వ్యవస్థకు తగదని చెప్పాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మా దగ్గర మంత్రదండం ఉందా?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో గాలి కాలుష్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఏదైనా మంత్ర దండం ఉందా? అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని పరిష్కరించడంలో న్యాయ వ్యవస్థలకు కొన్ని పరిమితులు ఉంటాయన్నారు. ఢిల్లీ వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారణ జరపాలని గురువారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చిల ధర్మాసనం ఎదుట అమికస్ క్యూరీగా ఉన్న అపరాజిత ప్రస్తావించారు. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య పరిస్థితి ఆందోళన కరంగా ఉందని నివేదించారు. ఇది హెల్త్ ఎమర్జెన్సీ వంటి పరిస్థితి అని పేర్కొన్నారు. స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్..‘ఢిల్లీ–ఎన్సీఆర్లో ప్రమాదకర పరిస్థితులున్న విషయం మాకూ తెలుసు. సమస్య పరిష్కారానికి న్యాయ వ్యవస్థ ఏదైనా మంత్రదండం ప్రయోగిస్తుందని అనుకోవద్దు. స్వచ్ఛమైన గాలిని ప్రజలకు అందించడానికి ఎలాంటి మార్గనిర్దేశాలు చేయగలమో చెప్పండి? వాయు కాలుష్యానికి అనేక కారణాలు ఉన్నాయి. కాలుష్య నియంత్రణకు గతంలో ఎన్నో కమిటీలు ఏర్పాటు చేశారు. కానీ, నిర్ణయాలు కాగితాలకే పరిమితం అయ్యాయి. కఠినమైన రోజువారీ పర్యవేక్షణతోనే ఈ పరిస్థితి మెరుగుపడుతుంది’అని వ్యాఖ్యానించారు. కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆంక్షలు అమలు చేయాలన్న వాదనను తోసిపుచ్చింది. దీర్ఘకాల పరిష్కారం అవసరమంది.‘ప్రభుత్వం వేసిన కమిటీలు చేసిన సిఫార్సులు ఏమిటి? తక్షణ చర్యలు చూపే చర్యలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఫైళ్లలో మగ్గుతున్న ఆదేశాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ అంశాన్ని నిరంతరం పర్యవేక్షిస్తాం’అని ధర్మాసనం అభిప్రాయపడింది. -
ఆన్లైన్ కంటెంట్ నియంత్రణకు స్వతంత్ర వ్యవస్థ
సాక్షి, న్యూఢిల్లీ: ఆన్లైన్ వేదికలు, సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా వస్తున్న అశ్లీల, అసభ్యకర కంటెంట్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆన్లైన్ ప్లా్లట్ఫామ్లు పాటిస్తున్నామని చెబుతున్న స్వీయ నియంత్రణ విధానం పూర్తిగా విఫలమైందని, అసలు అది ఓ బూటకమని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ అరాచకాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వ ప్రమేయం లేని, మీడియా సంస్థల ప్రభావం లేని ఒక అత్యంత శక్తివంతమైన ‘స్వతంత్ర, తటస్థ స్వయం ప్రతిపత్తి’కలిగిన వ్యవస్థ అత్యవసరమని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీల ధర్మాసనం స్పష్టం చేసింది. ‘ఇండియాస్ గాట్ లేటెంట్’అనే షోలో అశ్లీల కంటెంట్, దివ్యాంగులను కించపరిచేలా జోకులు వేశారన్న ఆరోపణలపై నమోదైన ఎఫ్ఐఆర్లను సవాల్ చేస్తూ పాడ్కాస్టర్ రణవీర్ అల్హాబాదియా తదితరులు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా గురువారం ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.వికృత పోకడలు..సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. సమస్య కేవలం అశ్లీలతకే పరిమితం కాలేదని, యూజర్ జనరేటెడ్ కంటెంట్ పేరుతో వికృత పోకడలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సీజేఐ.. ‘ఎవరికి వారే సొంత చానల్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఎవరికీ జవాబుదారీతనం లేకుండా పోతోంది. ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందే కదా. నేను ఎవరికీ జవాబుదారీ కాదంటే ఎలా కుదురుతుంది? సమాజంలో విషం చిమ్ముతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందే. అడిగే వారు లేరని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే చట్టం ఒప్పుకోదు’అని స్పష్టం చేశారు. వాక్స్వాతంత్య్రం అమూల్యమైనదే కానీ, అది వికృత పోకడలకు దారితీయకూడదని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. అడల్ట్ కంటెంట్ ఉంటే కనీసం ముందస్తు హెచ్చరికలైనా ఉండాలని సీజేఐ అభిప్రాయపడ్డారు.స్వయం ప్రకటిత సంస్థలతో పనికాదునెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్ల తరఫున సీనియర్ న్యాయవాది అమిత్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే ఐటీ రూల్స్–2021 అమల్లో ఉన్నాయని, జస్టిస్ గీతా మిట్టల్ నేతృత్వంలో స్వీయ నియంత్రణ వ్యవస్థ పనిచేస్తోందని తెలిపారు. దీనిపై సీజేఐ అభ్యంతరం వ్యక్తం చేశారు. ’స్వయం ప్రకటిత సంస్థల వల్ల ప్రయోజనం లేదు. ఒకవేళ మీ స్వీయ నియంత్రణ అంత గొప్పగా ఉంటే, ఉల్లంఘనలు ఎందుకు పదేపదే జరుగుతున్నాయి?’అని ప్రశ్నించారు. వాణిజ్య ప్రయోజనాల కోసం పనిచేసే వారి ప్రభావం లేని, ప్రభుత్వానికి కూడా సంబంధం లేని ఒక తటస్థ వ్యవస్థ ద్వారానే నియంత్రణ సాధ్యమని సీజేఐ స్పష్టం చేశారు.త్వరలో నూతన మార్గదర్శకాలు: కేంద్రంఆన్లైన్ కంటెంట్ నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రతిపా దిస్తోందని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి తెలిపారు. స్పందించిన ధర్మాసనం.. ముసా యిదా మార్గదర్శకాలను పబ్లిక్ డొమైన్లో ఉంచి, ప్రజలు, నిపుణుల నుంచి అభిప్రాయాలు సేక రించాలని సూచించింది. అనంతరం న్యాయరంగ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొంది. కేసుపై తదుపరి విచారణను ధర్మాస నం నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
ఫెడరలిజంను బలహీనపరిచే సలహా
తమిళనాడు గవర్నర్ అనేక బిల్లులను, అవినీతి కేసులపై దర్యాప్తు అనుమతి ఫైళ్ళను, ఖైదీల విడుదల ప్రతిపాదనలను నెలల తరబడి నిలిపివేసి పరిపాలనను దెబ్బకొట్టారు. ఇలా నిలిపివేయడంపై సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ‘ఇది రాజ్యాంగ విరుద్ధం’ అంటూ గతంలో సూటిగా చెప్పింది. కానీ ఆశ్చర్య కరంగా, అదే అంశంపై, 14 ప్రశ్నలతో రాష్ట్రపతి కోరిన సలహా కేసులో (ప్రెసిడె న్షియల్ రిఫరెన్స్ కేసు) మాత్రం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ పీఠం అందుకు విరుద్ధమైన తీర్పు ఇచ్చింది. మన రాష్ట్రపతికి ధర్మాసనం అద్భుతమైన ‘సలహా’ రూపొందించింది. ఆ సలహా అర్థం ఇదీ: ఎ) గవర్నర్కు కాల గడువు (టైమ్ లిమిట్) విధించలేం. బి) రాష్ట్రపతి నిర్ణయాలను కోర్టు ప్రశ్నించలేదు. (సి) గవర్నర్ పరిపాలనను నిలి పేసినా, ఏమీ చేయలేం. ఎంత అన్యాయం? దేశ ప్రధాన న్యాయ మూర్తి తన పదవీ విరమణ చేయడానికి ముందు ఇటువంటి సలహా తీర్పును ఇచ్చి రాజ్యాంగ ఆత్మకు, ఫెడరలిజానికి, పరిపాలనా సమతౌల్యానికి పెద్ద దెబ్బ కొట్టారు.కేంద్ర ప్రతినిధిగా మార్చే పరిస్థితిఈ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సలహా ఎందుకు ప్రమా దకరం? దీనివల్ల ఒక్క తమిళనాడుకే కాదు, ప్రతి బీజేపీయేతర రాష్ట్రంలో కొత్త రాజ్యాంగ సంక్షోభం వచ్చిపడింది. బిల్లులు గవర్నర్ దగ్గరే నెలల తరబడి నిలిచిపోవడం, విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్ లర్ నియామకాల్లో పూర్తిగా పక్షపాతం, అవినీతి కేసుల్లో అభియోగ అనుమతులపై నిర్ణయాలు పెండింగ్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియా మకాల నిలిపివేత వంటి దారుణమైన వైఫల్యాలకు ఈ సంక్షోభం కారణం కానుంది. అంతా గవర్నర్ ఇష్టం ప్రకారం చేయడానికి ఉంటే ఇక జనం ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం పరిపాలన సాగించడం సాధ్యమా? ఫైళ్ళు, నియామకాలు అన్నీ ఆగిపోయే పనులను గవ ర్నర్ చేయడానికి రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఇది రాజ్యాంగా ధికారి అయిన రాజ్ ప్రముఖ్ను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా మార్చే పరిస్థితి. రాష్ట్రపతి గారు సార్వభౌమ ప్రజల తరఫున పనిచేసే అత్యున్నత రాజ్యాంగాధికారే. కానీ గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వం వారు నియమించేవారు. (ఎన్నికల్లో గెలవకుండా) ఎంపిక చేయబడినవారే రాజ్ ప్రముఖ్ అవుతారు. ఈ సలహా వంటి తీర్పు వల్ల రాష్ట్రపతినీ, గవర్నర్నూ ఒకే స్థాయిలో గానీ, హోదాలో గానీ (కాన్స్టిట్యూషనల్ పెడెస్టల్) పెట్టడం రాజ్యాంగ ఆత్మను అవమానించడమే!సరైన కాలం అంటే?గవర్నర్ల రాజకీయ పక్షపాతం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెను సమస్యగా మారింది. ‘గవర్నర్ సరైన సమయంలో నిర్ణయం తీసు కోవాలి’ అని సుప్రీంకోర్టు తన సలహా తీర్పు వెలువరించింది. ఎంత వ్యవధి సమంజసం? ఒక నెల సరైనదా? ఒక సంవత్సరం సరైనదా? మూడు సంవత్సరాలు సరైనవా? ఎవరికీ తెలియదు. ఈ అస్పష్టత రాజకీయ పక్షపాతంతో వ్యవహరించే గవర్నర్లకు పెద్ద ఆయుధం. దీనివల్ల పరిపాలన నిలిచిపోతుంది, లెజిస్లేచర్ సంక ల్పానికి అడ్డుకట్ట పడుతుంది. ప్రజాభిప్రాయం నీరుగారిపోతుంది. గవర్నర్ ‘రబ్బర్ స్టాంప్’ కాదు. కానీ పాలనకు స్పీడ్ బ్రేకర్ అయిపోవడం న్యాయమా? గవర్నర్ బిల్లులను ఆపాలని అనుకుంటే పూర్తిగా ఆపగలిగే అవకాశం కొనసాగుతుంది. ఒకసారి బిల్లును ఆమోదించకుండా అసెంబ్లీకి తిప్పిపంపిన తరువాత, మళ్లీ అదే బిల్లును పంపితే గవర్నర్ వెంటనే ఒప్పుకోవాలి. కానీ ఆ పనీ చేయ కుండా, రాష్ట్రపతికీ పంపకుండా వదిలేస్తూ పోతూ ఉంటే పరిపాలన స్తంభించిపోతుంది. ఈ లోగా అయిదేళ్ల పాలన ‘కాలధర్మం’ చెందు తుంది. బిల్లులు, చట్టాలను నిష్క్రియ, ఆలస్యాలతో చంపేస్తారా? చేతలలో చంపరు. కానీ తిండి ఇవ్వక వదిలేస్తే వాడే చస్తాడు అన్నట్టుంది. ఫెడరలిజంపై చావు దెబ్బసమాఖ్య విధానంలో కేంద్రం–రాష్ట్రాల మధ్య సంబంధాలు సమతౌల్యంగా ఉండటం కీలకం. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ సలహా (అడ్వైజరీ ఒపీని యన్) రాష్ట్రం ఆమోదించిన బిల్లులను... రాష్ట్ర ప్రజా మద్దతుతో వచ్చిన లెజిస్లేచర్ బిల్లులను, గవర్నర్ ఒకరే నెలల తరబడి అడ్డుకునే పరిస్థితిని అన్యాయంగా రాజ్యాంగబద్ధం చేసిపెట్టింది. ఇది రాష్ట్ర ప్రభుత్వాల కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంది. కేంద్ర అధికారుల అతి చర్యలను బలపరుస్తుంది. అంతేగాక ఫెడరలిజం మూల సూత్రానికి విరుద్ధం అవుతుంది. ఈ సలహా తీర్పులో ‘‘రాజ్యాంగాధికారులు తమ విధులు నిర్వ ర్తించకపోతే కోర్టు నిష్క్రియగా ఉండదు’’ అని చెప్పడానికి బాగానే ఉంది. కానీ దీనివల్ల ప్రయోజనం ఉండదు. ఈ సలహా వినాల్సిన అవసరం లేదు. గడువు (టైమ్ లైన్) పెట్టలేమనీ, ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి నిర్ణయాలను ప్రశ్నించలేమనీ అన్నారు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కచ్చితంగా అటువంటి అధికారాలను వాడుకుంటాయి. అంటే, మన సుప్రీంకోర్టు అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం సమస్యను గుర్తించినప్పటికీ, పరిష్కారాన్ని చూపలేదన్న మాట! ఇది ఫెడరల్ రాజ్యాంగ సంక్షోభ నివారణకు సరైన మార్గం కాదు.గవర్నర్ తన ఇష్టానుసారం ఆలస్యాలు చేయడం రాజ్యాంగ విలువలకు వ్యతిరేకం. ప్రజాస్వామ్య సంకల్పాన్ని, రాష్ట్రాల పరిపా లనను అణగదొక్కడం అవుతుంది. అధికారాలను సరిగ్గా సమంగా విభజించే సిద్ధాంతాన్ని వక్రీకరించడం అవుతుంది. ఇది రాజకీయ అవినీతి మాత్రమే కాదు. రాజ్యాంగ అనైతికం కూడా అవుతుంది. ఈ అవినీతిని ఆపడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం సలహా తీర్పు ప్రభావంతమైన పరిష్కారం ఇవ్వలేదు. ప్రజాస్వామ్యంలో రాష్ట్రపతి పాత్ర అత్యంత కీలకం. ఆర్టికల్ 143 కింద ఇచ్చే కోర్టు సలహా బైండింగ్ కాదు. అందుకే రాజ్యాంగాన్ని మనస్సాక్షి ప్రకారం, నమ్మిన దేవుడి ముందు ప్రమాణం చేసిన అత్యున్నతాధికారి అయిన రాష్ట్రపతి గారూ! మీ ప్రమాణాన్ని గుర్తు చేసుకోండి. మీరు మన రాజ్యాంగపు ఆత్మను రక్షించవలసిన బాధ్యత కలిగినవారు. ఫెడరల్ సమతౌల్య తను, ప్రజాస్వామ్య కర్తవ్యాలను పరిరక్షించవలసి ఉంటుంది. కనుక రాజ్యాంగ విరుద్ధమైన, ఫెడరలిజాన్ని బలహీనపరిచే ఈ అడ్వై జరీ ఒపీనియన్ను తిరస్కరించడం రాష్ట్రపతి ప్రాథమిక రాజ్యాంగ బాధ్యత.మాడభూషి శ్రీధర్-వ్యాసకర్త కేంద్ర సమాచార సంఘం మాజీ కమిషనర్ -
దివ్యాంగులపై జోకుల కేసులో సమయ్ రైనాకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
ఆధార్ ఉన్నంత మాత్రాన ఓటు హక్కు ఇవ్వాలా ? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ( SIR) పై విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వానికి ఆధార్ కార్డు రుజువు కాదని వెల్లడించింది. ఆధార్ కార్డులున్న చొరబాటుదారులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆధార్ కార్డు ఉన్న పౌరుడు కాని వ్యక్తికి కూడా ఓటు హక్కులు ఇవ్వాలా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సామాజిక సంక్షేమ ప్రయోజనాలు అందరికీ చేరేలా చూసుకోవడానికే ఆధార్ తప్ప , ఇది స్వయంచాలకంగా ఓటు హక్కును ప్రసాదించకూడదని ప్రధాన న్యాయమూర్తి (CJI) స్పష్టం చేశారు.అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్ చర్య చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్ఘ బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వేడివాడి వాదనలు జరిగాయి. ఆధార్ కార్డు "పౌరసత్వానికి సంపూర్ణ రుజువు కాదని ధర్మాసనం పునరుద్ఘాటించింది. అందుకే అది పత్రాల జాబితాలోని పత్రాలలో ఒకటిగా ఉంటుందనీ, ఎవరి పేరైనా తొలగిస్తే, వారికి తొలగింపు నోటీసు ఇవ్వవలసి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది.ఒక వ్యక్తి పొరుగు దేశానికి చెందినవాడు మరియు కార్మికుడు వంటి అసంఘటిత రంగంలో పనిచేస్తుంటే, వారికి మానవతా దృక్పథంతో రేషన్ లేదా ఇతర ప్రయోజనాల కోసం ఆధార్ ఇవ్వవచ్చని ఆయన అన్నారు. ఇది భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తిలో భాగం. అయితే, ఆధార్ కార్డు కలిగి ఉండటం వల్ల వారిని ఓటరుగా మార్చలేము. పౌరసత్వం మరియు ఓటు హక్కుల ప్రమాణాలు వేరుగా ఉంటాయి. ఆధార్తో అనుసంధానించబడవు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి కూడా ఆధార్ కార్డులు అందుతున్నాయని, అలాంటప్పుడు ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన వారికి ఓటు హక్కు కూడా కల్పించాలా?ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు" అనే వాదన ఒక ప్రక్రియను రాజ్యాంగ విరుద్ధమైనదిగా మార్చలేదని సుప్రీం వ్యాఖ్యానించింది. ఆధార్ పౌరసత్వ రుజువు కాదని, ఎన్నికల కమిషన్కు పత్రాలను ధృవీకరించే రాజ్యాంగ హక్కు ఉందని జస్టిస్ బాగ్చి పేర్కొన్నారు. అలాగే కమిషన్ కేవలం పోస్టాఫీసు కాదు. పత్రాల ఖచ్చితత్వాన్ని ధృవీకరించే రాజ్యాంగ హక్కు దీనికి ఉంది. ఫారం 6లో ఏదైనా తప్పు ఉంటే, దానిపై దర్యాప్తు చేసే అధికారం కమిషన్కు ఉందని స్పష్టం చేశారు.ఆధార్ను నివాస రుజువుగా పేర్కొనడం ద్వారా పౌరులపై సందేహ భారాన్ని మోపడానికి వ్యతిరేకంగా, పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదనలను వినిపించారు. SIR ముందుకు సాగుతున్న తీరు తొందరపాటు మరియు మినహాయింపుతో కూడుకున్నది. ఇది నిరక్షరాస్యులైన సాధారణ ఓటర్లపై రాజ్యాంగ విరుద్ధమైన భారం మోపుతోందన్నారు. ఫారాలు నింపడం తెలియని వారిని జాబితా నుంచి తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆధార్ పౌరసత్వానికి తిరుగులేని రుజువు కాకపోయినా, నివాసానికి సంబంధించి ప్రాథమిక ఆధారంగా పరిగణించాలని ఆయన వాదించారు. SIR ప్రచారం లోపభూయిష్టంగా , రాజ్యాంగ విరుద్ధమైందని పేర్కొన్నారు.తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్లలో SIRని ప్రత్యేకంగా సవాలు చేస్తున్న పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు షెడ్యూల్ను కూడా నిర్ణయించింది. డిసెంబర్ 1 లోగా ప్రతిస్పందనలను దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్ను బెంచ్ కోరింది. ఈ గడువులో పిటిషనర్లు తమ వాదనలను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ విషయాలు త్వరలో విచారణకు వస్తాయి. -
పారిపోయిన వాళ్లను పట్టుకొచ్చే హక్కు ప్రభుత్వానికి ఉంది
న్యూఢిల్లీ: డజన్లకొద్దీ నేరాలను దర్జాచేసి విదేశాలకు పారిపోయిన వ్యక్తులను పట్టుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి సర్వాధికారం ఉందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. గుజరాత్కు చెందిన విజయ్ మురళీధర్ ఉద్వానీ తనపై నమోదైన 153 కేసులకు సంబంధించి జారీ అయిన రెడ్కార్నర్ నోటీస్ సంబంధ హైకోర్టు తీర్పును సవాల్చేస్తూ దాఖలుచేసిన పిటిషన్ను విచారణకు తిరస్కరిస్తున్న ట్లు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం ప్రకటించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలుచేసింది. 2022 జులైలోనే దుబాయ్కు పారిపోయిన మీపై రెడ్కార్నర్ నోటీసు జారీ సరైందేనంటూ గతంలో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాల్చేస్తూ ఉద్వానీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్నుద్దేశిస్తూ సుప్రీంకోర్టు.. ‘‘మీపై ఎన్నో ఆరోపణలు, 153 కేసు లు ఉన్నాయి. ముందు భారత్ రావాల్సిందే. వస్తే ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలుకుతారని అనుకో వద్దు’’ అని వ్యాఖ్యానించింది. తన పిటిషన్దారుకు తనపై 38 కేసుల వివరాలు కూడా తెలీదని అతని న్యాయవాది చెప్పారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘వివరాలు తెలీదంటే ఎలా? ట్ర యల్ కోర్టుకువెళ్లి సర్టిఫైడ్ కాపీల కోసం దరఖా స్తుచేస్తే వాళ్లే ఇస్తారు. ఇదేం రాకెట్ తయారీ శాస్త్రం కాదు. అతడిపై అరెస్ట్వారెంట్ జారీ అయింది’’ అని అన్నారు. ఎఫ్ఐఆర్లలోని వివరాలను అధికా రులు చెప్పడంలేదని లాయర్ వాదించగా ధర్మా సనం మళ్లీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ ఎఫ్ఐఆర్ వివరాలు మీకు దుబాయ్లో పళ్లెంలో పెట్టి అందించాలా? ముందు భారత్కు రండి. వచ్చాక అధికారులు అన్ని వివరాలు అందిస్తారు’’ అని అన్నారు. ‘‘ అతని వద్ద ప్రస్తుతం పాస్పోర్ట్ లేదు. ఎలామరి?’’ అని ప్రశ్నించగా.. ‘‘ అంత కష్టపడకండి. అధికారులు అక్కడ అరెస్ట్చేసి తీసుకొస్తారులే’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ అతని తోటి నిందితుడు భారత్లో పోలీస్కస్టడీలో చనిపో యాడు. అందుకే నా పిటిషనర్ భారత్కు వచ్చాక సీసీటీవీ నిఘా ఉన్న గదిలోనే ఉంచాలి’’ అని లాయర్ కోరగా.. ‘‘ఇంక ఈ పిటిషన్ను విచారించలేం’’ అని ధర్మాసనం కోప్పడటంతో లాయర్ ఆ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. -
కస్టడీలో ఉంచి ఏం సాధిస్తారు?
సాక్షి, న్యూఢిల్లీ: మద్యం అక్రమ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్పకు సుప్రీంకోర్టులో బుధవారం ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం (నవంబర్ 26న) వారు సరెండర్ కావాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘వారిని కస్టడీలో ఉంచితే దానితో ఏ ప్రయోజనం ఒనగూరుతుందో మీరు చెప్పాలి. వారిలో ఒకరు సీనియర్ అధికారి అని మాకు తెలుసు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని మీరు భావిస్తే దానికి తగిన షరతులు విధించవచ్చు. అంతేకానీ అరెస్ట్ పరిష్కారం కాబోదు’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘200 మంది సాక్షులను విచారించాలని మీరు (సిట్, ప్రభుత్వం) చెబుతున్నారు. కనీనం 100 మంది సాక్షులు ఉన్నారనుకుందాం. అలాంటప్పుడు విచారణ పూర్తయ్యేందుకు మీరు ఎంతకాలం తీసుకుంటారు?’ అని ప్రశ్నించింది. తదనంతరం సరెండర్ నుంచి పిటిషనర్లకు మినహాయింపునిస్తూ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ట్రయల్ కోర్టు విధించిన షరతులకు లోబడి వారు డిఫాల్ట్ బెయిల్పై కొనసాగుతారని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం 10రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. రిజాయిండర్కు పిటిషనర్లకు మరో 5రోజులు గడువు మంజూరు చేస్తూ విచారణను డిసెంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది.అకడమిక్ చర్చల్లోకి వెళ్లాలనుకోవడం లేదుబెయిల్ మంజూరు సరికాదంటూ రాష్ట్ర ప్రభుత్వం, సిట్ తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ అగర్వాల్ చేసిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఈ కేసులో దాదాపు 400 మంది సాక్షులు ఉన్నారని, ఇప్పటికి ఇంకా 200 మందికి పైగా సాక్షులను విచారించాల్సి ఉందన్నారు. ‘మొదట ట్రయల్ కోర్టు మా చార్జ్ షీట్ను విస్మరించింది. ఇప్పుడు చార్జ్ షీట్ను తగిన విధంగా సమర్పించాం. ట్రయల్ను వీలైనంత త్వరగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా నివేదించగా, దీనిపై చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకుంటూ, ‘కోర్టు సమయం వృథా అయ్యే అకడమిక్ చర్చల్లోకి వెళ్లాలనుకోవడం లేదు’ అని వ్యాఖ్యానించారు.‘కస్టడీ’పై సీజేఐ కీలక ప్రశ్నలు» 200 మంది సాక్షులను విచారించాలని మీరు (సిట్, ప్రభుత్వం) చెబుతున్నారు. కనీనం 100 మంది సాక్షులు ఉన్నారనుకుందాంం. అలాంటప్పుడు విచారణ పూర్తయ్యేందుకు మీరు ఎంతకాలం తీసుకుంటారు?» పెద్ద సంఖ్యలో సాక్షులను విచారించాలన్న కారణంతో ఒక వ్యక్తిని చాలా కాలం జైలులో ఉంచడం సరైంది కాదు. » హైకోర్టు ఉత్తర్వులపై దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రాష్ట్ర ప్రభుత్వ (సిట్) తీరుపై పలు కీలక ప్రశ్నలు సంధించారు. కీలక వ్యాఖ్యలు, సూచనలు చేశారు. » నిందితులను ఇప్పుడు కస్టడీలో ఉంచడం వల్ల కొత్తగా సాధించేదేముంది?» రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఆధారంగానే నిందితునికి బెయిల్ రావాలని భావించడం వల్ల (న్యాయమైన విచారణకు భంగం లేకుండా నిందితుడికి స్వేచ్ఛ ఇవ్వవచ్చని కోర్టు భావించేంతవరకూ) డిఫాల్ట్ బెయిల్ విషయంలో అనేక పిటిషన్లు చివరకు నిరర్థకంగా మారుతున్నాయి. » సాక్షులను ప్రభావితం చేస్తారన్న ఆందోళన ఉంటే, కఠినమైన షరతులు విధించి బెయిల్ ఇవ్వవచ్చు. » అంతేకానీ అరెస్ట్ పరిష్కారం కాదు.దర్యాప్తులో లోపాలకు నిందితులను బలి చేయకూడదుపిటిషనర్ల వాదనలుపిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సి. ఆర్యమ సుందరం, నిరంజన్ రెడ్డి, సిద్ధార్థ దవేలు బలమైన వాదనలు వినిపించారు. దర్యాప్తులో లోపాలకు నిందితులను బలి చేయకూడదన్న పిటిషనర్ల వాదనలపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. వాదనల్లో ముఖ్యాంశాలు ఇవీ. దర్యాప్తు పూర్తయ్యాక అరెస్ట్ చేయడం అన్యాయం. హైకోర్టు ఆదేశాల ప్రకారం పిటిషనర్లు బుధవారం సరెండర్ కావాల్సి ఉంది. ఈ కేసు విచారణ అత్యవసరం. నిందితులు ఇప్పటికే 108 రోజులు కస్టడీలో ఉన్నారు. సెప్టెంబర్ నుంచి బెయిల్పై బయట ఉన్నారు. ఇప్పుడు మళ్లీ అరెస్ట్ చేయడం అన్యాయం. దర్యాప్తు సంస్థ గడువులోగా పూర్తి చార్జ్షీట్ దాఖలు చేయలేదు. సాంకేతిక కారణాలతో బెయిల్ రద్దు చేయడం సరికాదు. దర్యాప్తులో లోపాలకు నిందితులను బలి చేయకూడదు. అసంపూర్ణ చార్జ్షీట్ దాఖలైనప్పుడు నిందితులకు డిఫాల్ట్ బెయిల్ హక్కు ఉంటుందా? ఉండదా? అనే అంశంపై సుప్రీంకోర్టులోనే భిన్న తీర్పులు ఉన్నాయి. రీతు ఛబ్రియా కేసులో దర్యాప్తు పూర్తి కాకుండా కేవలం చార్జ్ షీట్ వేసినంత మాత్రాన నిందితుడు డిఫాల్ట్ బెయిల్ హక్కు కోల్పోడని తీర్పు ఉంది. కపిల్ వాధ్వాన్ కేసులో చార్జ్ షీట్ వేసి, కోర్టు కాగ్నిజెన్స్ తీసుకుంటే ఇక డిఫాల్ట్ బెయిల్ రాదని పేర్కొన్నారు. ఈ న్యాయపరమైన వైరుధ్యంపై స్పష్టత కోసం ’మన్ప్రీత్ తల్వార్’ కేసును ఇప్పటికే ముగ్గురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేశారు. ఆ కేసులో తీర్పు వచ్చేంతవరకు, లేదా ఈ కేసులో తదుపరి విచారణ జరిగేంతవరకు నిందితుల స్వేచ్ఛను హరించడం సరికాదు.అసలేం జరిగింది? నిర్దేశిత గడువులోగా చార్జ్ షీట్ దాఖలు కానందున ధనుంజయరెడ్డి, కృష్ణమోహనరెడ్డి, బాలాజీ గోవిందప్పకు గతంలో ట్రయల్ కోర్టు ‘డీఫాల్ట్ బెయిల్’ మంజూరు చేసింది. దాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన ఏపీ హైకోర్టు వారి డీఫాల్ట్ బెయిల్ను రద్దు చేసింది. నవంబర్ 26లోగా ట్రయల్ కోర్టులో లొంగిపోవాలని, రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
S.I.Rను ఆపలేం, కానీ..: సుప్రీం కోర్టు
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను నిలిపివేయాలన్న పిటిషనర్లకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. పలు రాష్ట్రాల్లో ప్రక్రియ కొనసాగుతున్నందున నిలుపుదల చేయలేమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశాశారు. అయితే పిటిషన్లపై విచారణ కొనసాగుతుందని పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఆయన ఆదేశించారు.పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లను బుధవారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా.. ఎస్ఐఆర్ విషయంలో రాజకీయ పార్టీలు లేనిపోని భయాందోళనలు కలిగిస్తున్నాయి ఈసీ పేర్కొంది. ఈ క్రమంలో.. కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం డిసెంబర్ 1వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను వివరణ కోరింది. తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఎస్ఐఆర్ విషయంలో కేరళ ప్రభుత్వం రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. ఎస్ఐఆర్ను సవాల్ చేస్తూ వేరుగా పిటిషన్లో ఇప్పటికే(నవంబర్ 21వ తేదీన) సుప్రీం కోర్టు ఈసీకి నోటీసులు జారీ చేసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేదాకా ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని వేసిన మరో పిటిషన్పైనే ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. డిసెంబర్ 9-11 తేదీల మధ్యలో కేరళలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది.తమిళనాడు నుంచి ఎస్ఐఆర్కు అన్నాడీఎంకే మద్దతుగా అప్లికేషన్ను సమర్పించింది. అధికార డీఎంకే సహా అన్ని పార్టీలు వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై విచారణను డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. పుదుచ్చేరి నుంచి ప్రతిపక్ష నేత ఆర్ శివ వేరుగా పిటిషన్ వేశారు. అలాగే.. పశ్చిమ బెంగాల్ నుంచి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ కమిటీ పిటిషన్లు వేసింది. ఈ పిటిషన్పై విచారణ డిసెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. అయితే.. అదే తేదీన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా విడుదల కావాల్సి ఉందని విషయం ధర్మాసనం దృష్టికి వెళ్లగా.. అవసరమైతే ఆ గడువును(డ్రాఫ్ట్ రోల్స్ ప్రచురణ) పొడిగించవచ్చని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.‘‘అవసరమని తేలితే ఎన్నికల సంఘాన్ని తేదీ పొడిగించమని ఆదేశించవచ్చు. ఆ తేదీ(డిసెంబర్ 9) కారణంగా కోర్టుకు అధికారమే లేదని చెప్పలేం. కోర్టు ఎప్పుడైనా తేదీ పొడిగించమని చెప్పగలదు’’ అని అన్నారాయన. ఎస్ఐఆర్ ఉద్దేశ్యంఎస్ఐఆర్ అనేది ఓటర్ల జాబితా ఖచ్చితత్వం కోసం ఎన్నికల సంఘం చేపట్టే ప్రత్యేక సవరణ ప్రక్రియ. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఇది వివాదాస్పదమై, సుప్రీం కోర్టుకు చేరింది. దీని ఉద్దేశం.. ఓటర్ల జాబితాలో తప్పులు సరిచేయడంకొత్తగా అర్హులైన ఓటర్లను చేర్చడంమరణించిన లేదా అర్హత కోల్పోయిన వారిని తొలగించడంస్థానిక ఎన్నికలు లేదా ముఖ్యమైన ఎన్నికల ముందు జాబితా ఖచ్చితత్వం పెంచడం ఎస్ఐఆర్ ప్రక్రియలో.. డ్రాఫ్ట్ రోల్స్ ప్రచురణ.. ప్రస్తుత ఓటర్ల జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచడం.అభ్యంతరాలు/సవరణలు స్వీకరణ.. ప్రజలు తమ పేర్లు లేకపోవడం, తప్పులు ఉండడం వంటి అంశాలను తెలియజేయవచ్చు.ఫీల్డ్ వెరిఫికేషన్.. అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు ధృవీకరిస్తారు.ఫైనల్ రోల్స్ ప్రచురణ – సవరణల తర్వాత తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు -
ప్రతి విద్వేష ప్రసంగాన్నీ పట్టించుకోలేం: సుప్రీం
న్యూఢిల్లీ: దేశంలో జరిగే ప్రతి విద్వేషపూరిత ప్రసంగం కేసును పర్యవేక్షించడానికి, ఉత్తర్వులివ్వడానికి తాము సిద్ధంగా లేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకోసం చట్టపరమైన చర్యలు, పోలీస్స్టేషన్లు, హైకోర్టులు ఉన్నాయని తెలిపింది. ఒక వర్గాన్ని ఆర్థికంగా బహిష్కరించాలంటూ ఆన్లైన్ వేదికగా వస్తున్న విజ్ఞాపనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్పై మంగళవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. దేశంలో ఏదో ఒక మూల జరిగే ప్రతి చిన్న సంఘటనను తాము పరిశీలించలేమని తెలిపింది. ఇందుకోసం ఇప్పటికే ఇతర ప్రత్యామ్నాయాలు చాలానే ఉన్నాయంది. ‘ఈ ఫిర్యాదుపై ముందుగా అధికారుల వద్దకు వెళ్లండి. వారు చర్యలు తీసుకోనివ్వండి. స్పందించని పక్షంలో సంబంధిత హైకోర్టుకు వెళ్లండి’అని పిటిషనర్కు సూచించింది. ప్రజా ప్రయోజన సంబంధమైన అంశం కాకుంటే హైకోర్టులు తగు రీతిలో స్పందిస్తాయని తెలిపింది. భాగల్పూర్ హింస, బిహార్లో ఎస్ఐఆర్కు సంబంధించి చేసిన విద్వేష వ్యాఖ్యలపై డిసెంబర్ 9వ తేదీన విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.కస్టోడియల్ మరణాలను ఉపేక్షించంకస్టడీలో ఉన్న వారిని చిత్ర హింసలకు గురిచేయడం, వారి ప్రాణాలను హరించడం పోలీసు వ్యవస్థపై మాయని మచ్చ అని, ఇలాంటి చర్యలను జాతి సహించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలీస్స్టేషన్లలో సీసీటీవీలు పనిచేయకపోవడంపై దాఖలైన సుమోటో కేసుపై విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం పైవ్యాఖ్య చేసింది. వీటిని ఎవరూ సమర్థించడం లేదంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొనగా ..మరైతే ఇప్పటి వరకు తగు విధంగా అఫిడవిట్ను ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. ఈ విషయాన్ని కేంద్రం చాలా తేలిగ్గా ఎందుకు తీసుకుంటోందని నిలదీయగా మూడు వారాల్లో అఫిడవిట్ వేస్తామని తుషార్ మెహతా బదులిచ్చారు. రాజస్తాన్లో 2025లో మొదటి 8 నెలల కాలంలో 11 కస్టడీ మరణాలు సంభవించడంపై ప్రచురితమైన కథనాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతుండటం తెల్సిందే. సీఐబీ, ఈడీ, ఎన్ఐఏలు సహా అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు, రికార్డింగ్ పరికరాలను ఏర్పాటు చేయాలని 2020లో జారీ చేసిన ఉత్తర్వులపై 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే స్పందించాయని అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే ధర్మాసనానికి వివరించారు. ఇందులో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకోవడంపై ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, తదుపరి విచారణ జరిగే డిసెంబర్ 16 కల్లా కేంద్రం సహా అన్ని రాష్ట్రాలు అఫిడవిట్లు వేయాలని ఆదేశించింది. లేకుంటే కేంద్ర దర్యాప్తు విభాగాల చీఫ్లు సహా వివరణతో అందరూ స్వయంగా హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది.వేధింపులపై ఎన్సీపీసీకి వెళ్లండిదేశవ్యాప్తంగా నడిచే ఇస్కాన్(ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్) స్కూళ్లలో లైంగిక వేధింపులపై ఫిర్యాదులను నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఛైల్డ్ రైట్స్(ఎన్సీపీసీ) ముందుంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పిటిషనర్లు పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్లలోని చిన్నారుల హక్కుల కమిషన్లనూ ఆశ్రయించవచ్చని తెలిపింది. వారు తగు రీతిలో చర్యలకు ఆదేశిస్తారని సూచించింది. ఇస్కాన్ విద్యాసంస్థల్లో లైంగిక వేధింపులు చోటుచేసుకుంటున్నాయంటూ రజ్నీశ్ కపూర్ తదితరులు వేసిన పిటిషన్లను కొట్టివేస్తూ మంగళవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్ల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇస్కాన్ సీనియర్ నాయకులు 200 మందికి పైగా చిన్నారులపై లైంగిక, భౌతిక, మానసిక వేధింపులకు పాల్పడినట్లు ఆధారాలున్నాయని పిటిషనర్లు తెలిపారు. వీటిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. -
హరియాణా నుంచి తొలి సీజేఐ
న్యూఢిల్లీ: హరియాణా రాష్ట్రంలో సాధారణ కుటుంబంలో జన్మించిన జస్టిస్ సూర్యకాంత్ న్యాయవాదిగా, న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం సేవలందించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్నాయమూర్తిగా అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. పలు కీలకమైన తీర్పులు వెలువరించిన సుప్రీంకోర్టు ధర్మాసనాల్లో ఆయన సభ్యుడిగా వ్యవహరించారు. రాష్ట్రాల శాసనసభల్లో ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలియజేసే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించే అధికారం కోర్టులకు లేదని ఇటీవలే సంచలనాత్మక తీర్పునిచ్చారు. ఆర్టీకల్ 370 రద్దు, బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్), పెగాసస్ స్పైవేర్, పౌరసత్వ హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ వంటి అంశాలపై జస్టిస్ సూర్యకాంత్ తీర్పులు వెలువరించారు. బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని నిలిపివేశారు. సైనిక దళాల్లో ‘వన్ ర్యాంక్, వన్ పెన్షన్’ పథకాన్ని సమర్థించారు. పలు సందర్భాల్లో అవినీతికి వ్యతిరేకంగా గళం వినిపించారు. సీజేఐగా ఆయన 2027 ఫిబ్రవరి 9వ తేదీ దాకా పదవిలో కొనసాగుతారు. దాదాపు 15 నెలలపాటు అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా పని చేయబోతున్నారు. → జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హరియాణాలోని హిసార్ జిల్లాలో సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జని్మంచారు. జస్టిస్ సూర్యకాంత్ తండ్రి మదన్గోపాల్ శర్మ సంస్కృత ఉపాధ్యాయుడిగా పని చేశారు. → 1981లో హిసార్లోని ప్రభుత్వ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. → 1984లో మహారిషి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ అభ్యసించారు. → 1984లో హిసార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. → 1985లో పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టులో లాయర్గా చేరారు. → రాజ్యాంగం, సేవలు, సివిల్ వ్యవహారాల్లో నిష్ణాతుడైన న్యాయవాదిగా పేరు సంపాదించారు. → పలు యూనివర్సిటీలు, బ్యాంకులు, కార్పొరేట్ సంస్థల తరఫున కోర్టులో వాదించారు. హైకోర్టు తరఫున వాదించిన సందర్భాలూ ఉన్నాయి. → 2000 జూలై 7న చిన్న వయసులోనే హరియాణా అడ్వొకేట్ జనరల్గా నియమితులయ్యారు. → 2001 మార్చిలో సీనియర్ లాయర్గా మారారు. → 2004 జనవరి 9న పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. → 2007 ఫిబ్రవరి నుంచి 2011 ఫిబ్రవరి దాకా నేషనల్ లీగల్ సరీ్వసెస్ అథారిటీ సభ్యుడిగా పనిచేశారు. → 2011 కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో దూరవిద్య విధానంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. → 2018 అక్టోబర్ 5న హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. → 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2024 నవంబర్ 12 నుంచి సుప్రీంకోర్టు లీగల్ సరీ్వసెస్ కమిటీ చైర్మన్గా పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టులో 300కుపైగా ధర్మాసనాల్లో సభ్యుడిగా వ్యవహరించారు. → హరియాణా నుంచి సీజేఐగా ఎదిగిన మొట్టమొదటి వ్యక్తిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డుకెక్కారు. -
నోటిమాట వినతులు చెల్లవు!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సూర్యకాంత్ సోమవారం తొలిరోజే తనదైన శైలిలో కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. అత్యవసరంగా విచారించాల్సిన కేసుల విషయంలో నూతన నిబంధన విధించారు. అర్జెంట్గా విచారణ చేపట్టాల్సిన కేసుల గురించి నోటిమాటగా విజ్ఞప్తి చేయడం ఆపాలని, ఇకపై లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. ఒక కాగితంపై కేసు వివరాలు రాసి ఇస్తే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిశితంగా పరిశీలిస్తుందని, తమ దృష్టికి తీసుకొస్తుందని అన్నారు. మరణ శిక్ష, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే నోటిమాటగా వచ్చే వినతులను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. అర్జెంట్ లిస్టింగ్ కేసుల విచారణలో న్యాయవాదులు ఈ నిబంధనకు కట్టుబడి ఉండాలని సూచించారు. సుప్రీంకోర్టులో అత్యవసర కేసుల గురించి న్యాయవాదులు నోటిమాటగానే సంబంధిత ధర్మాసనం దృష్టికి తీసుకురావడం చాలాఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. జస్టిస్ సూర్యకాంత్ సీజేఐ హోదాలో కేవలం రెండు గంటల వ్యవధిలో ఏకంగా 17 కేసులను విచారించారు. జస్టిస్ సూర్యకాంత్ ప్రస్థానం స్ఫూర్తిదాయకం ప్రమాణ స్వీకారం తర్వాత సుప్రీంకోర్టుకు చేరుకున్న జస్టిస్ సూర్యకాంత్ తొలుత మహాత్మాగాం«దీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాల వద్ద నివాళులర్పించారు. అనంతరం ఒకటో నంబర్ కోర్టుగదిలో త్రిసభ్య ధర్మాసనానికి నేతృత్వం వహించి, కేసుల విచారణ ప్రారంభించారు. హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థకు మధ్య వివాదంలో తీర్పు వెలువరించారు. తర్వాత సుప్రీంకోర్టు అడ్వొకేట్స్–ఆన్–రికార్డు అసోసియేషన్ అధ్యక్షుడు విపిన్ నాయర్.. జస్టిస్ సూర్యకాంత్కు సాదర స్వాగతం పలికారు. సాధారణ కుటుంబంలో జని్మంచి, సీజేఐ స్థాయికి చేరుకోవడం స్ఫూర్తిదాయకం అంటూ ఓ న్యాయవాది కొనియాడారు. ఆయనకు జస్టిస్ సూర్యకాంత్ కృతజ్ఞతలు తెలియజేశారు. -
రూ.5వేల కోట్లు చెల్లించండి.. సందేసర సోదరులకు సుప్రీం ఆదేశాలు!
న్యూఢిల్లీ: గుజరాత్ వ్యాపారవేత్తలు సందేసర సోదరుల ఆర్థిక కుంబకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలు బ్యాంకుల వద్ద రుణాల ఎగవేతకు పాల్పడిన సందేసర సోదరులు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు అంగీకరించారు. వారి విజ్ఞప్తికి సుప్రీం కోర్టు అంగీకరించింది. డిసెంబర్ 17లోపు ఆ మొత్తాన్ని చెల్లిస్తే వారిపై నమోదైన అన్నీ క్రిమినల్ కేసులపై విచారణ నిలిపివేస్తామని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.నితిన్ సందేసర, చేతన్ సందేసర,దీప్తి సందేసర ఇతర కుటుంబ సభ్యులు స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ అనే కంపెనీని ప్రమోట్ చేశారు. ఈ సంస్థ భారత్తో పాటు, విదేశీ బ్యాంకుల్లో విదేశీ శాఖల నుంచి రూ.13వేల కోట్లుకు (అంచనా)పైగా రుణాలు తీసుకున్నారు. ఆ రుణాలను డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించి, బ్యాంకులకు నష్టం కలిగించారని కేంద్ర దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఈ కేసు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) స్కామ్ కంటే పెద్దదిగా భావించబడుతోంది. పీఎన్బీ స్కామ్ (నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ) సుమారు రూ. 13,500 కోట్లుకాగా.. సందేసరా బ్రదర్స్ స్కామ్ రూ. 14,000 కోట్లకు పైగా ఉంది. ఇది భారత బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద మోసాలలో ఒకటిగా పరిగణలో ఉంది. స్టెర్లింగ్ బయోటెక్ సంస్థపై పదుల సంఖ్యలో ఆర్థిక నేరానికి పాల్పడ్డారనే కేసులు నమోదయ్యాయి. వాటిపై సుప్రీం కోర్టులో సుదీర్ఘంగా విచారణ జరుగుతూ వస్తోంది. ఈక్రమంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్ని తిరిగి చెల్లిస్తామని సందేసర సోదరులు ముందుకు వచ్చారు. ఇదే అంశంపై జరిగిన విచారణలో సందేసర సోదరుల విజ్ఞప్తికి సుప్రీం కోర్టు సమ్మతి తెలిపింది. డిసెంబర్ 17 లోగా వారు రుణదాత బ్యాంకులకు రూ.5,100 కోట్ల వన్ టైమ్ సెటిల్మెంట్ చెల్లించాలనే షరతు విధించింది.ఈ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. నితిన్ సందేసర,చేతన్ సందేసర సహ నిందితులపై సీబీఐ,ఈడీ,పీఎంఎల్ఎ కింద దాఖలు చేసిన అన్ని కేసులను సెటిల్మెంట్ మొత్తాన్ని డిపాజిట్ చేసిన తర్వాత క్రిమినల్ విచారణ నిలిపివేస్తామని ఉత్తర్వులో పేర్కొంది. ఆ ఉత్తర్వులో, ప్రజాధనాన్ని తిరిగి పొందడం ప్రాథమిక లక్ష్యం అని బెంచ్ నొక్కి చెప్పింది. మోసం చేసిన మొత్తాన్ని తిరిగి ఇస్తే నేరారోపణలను పొడిగించడం వల్ల ప్రయోజనం ఉండదని పేర్కొంది. -
సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం.. వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్కి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయటంపై హర్షం వ్యక్తం చేశారు. ఆయన పదవీకాలాన్ని సంతృప్తికరంగా, విజయవంతంగా కొనసాగించాలని ఆక్షాంక్షించారు. Congratulations to Hon’ble Justice Surya Kant Ji on taking oath as the 53rd Chief Justice of India. Wishing him a fulfilling and successful tenure in upholding the constitutional spirit. pic.twitter.com/NHWnnMn2yD— YS Jagan Mohan Reddy (@ysjagan) November 24, 2025 -
నేడు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణం చేయనున్నారు. ఆదివారం సాయంత్రం రిటైరైన జస్టిస్ బీఆర్ గవాయ్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమానికి పలు ప్రత్యేకతలున్నాయి. మొదటిసారిగా ఆరు దేశాల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొననున్నారు. భూటాన్, కెన్యా, మలేసియా, మారిషస్, నేపాల్ శ్రీలంక దేశాల చీఫ్ జస్టిస్లు, కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హరియాణా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ నిలిచిపోనున్నారు.సాధారణ లాయర్ నుంచి... అక్టోబర్ 30వ తేదీన సీజేఐగా నియమితులైన జస్టిస్ సూర్యకాంత్ సుమారు 15 నెలలపాటు బాధ్యతల్లో కొనసాగుతారు. 65వ ఏట ప్రవేశించనున్న జస్టిస్ సూర్యకాంత్ 2027 ఫిబ్రవరి 9వ తేదీన రిటైరవుతారు. హరియాణాలోని హిసార్ జిల్లాలో 1962 ఫిబ్రవరి 10వ తేదీన మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. కురుక్షేత్ర వర్సిటీ నుంచి ఎంఏ లాలో డిస్టింక్షన్ సాధించారు. అనంతరం జస్టిస్ కాంత్ చిన్న పట్టణంలో లాయర్గా ప్రస్థానం ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి స్థాయికి చేరుకున్నారు. అంతకుముందు, ఆయన పంజాబ్ హరియాణా హైకోర్టు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుల్లో పనిచేశారు.సీజేఐల గురించి ఐదు విశేషాలు!భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ కాసేపట్లో బాధ్యతలు చేపట్టనున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 52 మంది ప్రధాన న్యాయమూర్తులు ఈ దేశ న్యాయవ్యవస్థ కాపు కాసినవారే. అయితే మనలో చాలామందికి గత సీజేఐల విశేషాలు తెలిసింది తక్కువే. మహిళ న్యాయమూర్తి ఇప్పటివరకూ ఈ అత్యున్నత పదవిని చేపట్టకపోవడం గమనార్హం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు 65 ఏళ్లకు పదవీ విరమణ పొందుతారు. హైకోర్టు న్యాయమూర్తుల విషయంలో ఇది 62 ఏళ్లు మాత్రమే. సుప్రీంకోర్టు సీజేఐకి మాస్టర్ ఆఫ్ ద రోస్టర్గా పేరు. ఏ న్యాయమూర్తి ఏ రకమైన కేసుల విచారణ చేపడతారన్న విషయంపై సీజేఐదే తుది నిర్ణయం. అధికారిక హోదాల ప్రకారం... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్రాల గవర్నర్లు, మాజీ రాష్ట్రపతుల తరువాతి స్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులది. ఇలాంటివే మరికొన్ని ఆసక్తికరమైన వివరాలు ఇలా ఉన్నాయి.1. జస్టిస్ హరిలాల్ జెకిసన్దాస్ కానియాదేశ మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి. 1950లో సుప్రీంకోర్టు ఏర్పాటు తరువాత నియమితులయ్యారు.2. జస్టిస్ కె.జి.బాలక్రిష్ణన్తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి. 2007-2010 మధ్యకాలంలో పనిచేశారు.3. జస్టిస్ బి.ఆర్.గవాయి52వ ప్రధాన న్యాయమూర్తిగా ఈ ఏడాది మేలో నియమితులయ్యారు. బౌద్ధ మతాన్ని అనుసరించిన తొలి సీజేఐ. ఈ అత్యున్నత పదవిని అధిష్టించిన రెండో దళితుడు కూడా.4.జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్1978 - 19875 మధ్య దేశ అత్యున్నత న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. ఏడేళ్లకాలం ఈ పదవిలో ఉన్న తొలి జస్టిస్.5. జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్1991లో కేవలం పదిహేడు రోజులు మాత్రమే సీజేఐగా పనిచేశారు. అతితక్కువ కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తిగా ఇదో రికార్డు. -
కేసుల కొండ కరిగిస్తా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా న్యాయస్థానాల నెత్తిన గుదిబండగా తయారైన కేసుల సత్వర పరిష్కారంపై దృష్టిసారిస్తానని కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టికరించారు. నవంబర్ 24వ తేదీన సర్వోన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్ సూర్యకాంత్ శనివారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మీడియా ప్రతినిధులతో కొద్దిసేపు పిచ్చాపాటీ మాట్లాడారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన ప్రాధాన్యాలకు సంబంధించిన ఆయన తన మనసులోని మాటలను బయటపెట్టారు. ‘‘నా ముందున్న తొలి, అత్యంత ముఖ్యమైన సవాల్ ఏదైనా ఉందంటే అది పేరుకుపోయిన కేసుల కొండ. దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో కుప్పలుతెప్పలుగా పడి ఉన్న పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించడంపై దృష్టిసారిస్తా. ఒక్క సుప్రీంకోర్టులోనే ఏకంగా 90,000 కేసులు పరిష్కారం కోసం ఫైళ్లలో మూలుగుతున్నాయి. అసలు ఇన్ని కేసులు పెరిగేదాకా ఏం చేస్తున్నట్లు? అపరిష్కృతంగా పడి ఉండటానికి కారకులు ఎవరు? బాధ్యతారహితంగా వ్యవహరించింది ఎవరు? అనే అంశాల జోలికి వెళ్లదల్చుకోలేదు. కానీ వీటిని సత్వరం పరిష్కరించాల్సిందే. పేరుకుపోయిన పెండింగ్ కేసుల సంగతేంటి? అని హైకోర్టులు, ట్రయల్ కోర్టుల నుంచి నివేదికలు తెప్పిస్తా’’అని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉత్తమం ‘‘కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వ బాటలో పయనించడం చాలా మంచిది. వాస్తవానికి మధ్యవర్తి త్వం అనేది సమస్యలు, కేసులు పరిష్కృతం కావడా నికి అత్యంత చక్కటి మార్గం. కేసుల కొండ కరగాలంటే మధ్యవర్తిత్వ అస్త్రాన్ని ప్రయోగించక తప్ప దు. ఇది కేసుల పరిష్కార వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఈమధ్యే సుప్రీంకోర్టుకు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ సైతం మధ్యవర్తిత్వం ప్రాముఖ్యతను ప్రస్తావించారు. ఇప్పు డు దేశం మొత్తం ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. భారత్లోని బహుళజాతి సంస్థలు, బ్యాంక్లు, బీమా సంస్థలు సైతం ఇదే బాటలో పయనించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి’’అని అన్నారు. నా ఒక్క తీర్పుతో 1,200 కేసులు పరిష్కారం ‘‘ఢిల్లీలో భూ సమీకరణకు సంబంధించి ఒకే తరహా కేసులు చాలా ఉండిపోయాయి. నేనిచి్చన ఒక్క తీర్పుతో ఏకంగా 1,200 కేసులు ఒకేసారి పరిష్కారమయ్యాయి. కీలకమైన చట్టపర, రాజ్యాంగ అంశాలతో ముడిపడిన చాలా కేసులు హైకోర్టుల వద్ద పేరుకుపోయాయి. వీటికి నేను సుప్రీంకోర్టులో విస్తృతస్థాయిలో రాజ్యాంగ ధర్మాసనాలను ఏర్పాటుచేసి పరిష్కారం చూపుతా’’అని అన్నారు. ఈస్థాయికి వచ్చాక అవి ఏపాటి? తమకు వ్యతిరేకంగా వచి్చన తీర్పులపై రాజకీయనేతలు లేదా కొన్ని వర్గాల వాళ్లు చేసే విమర్శలపై జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. ‘‘ఇటీవలికాలంలో న్యాయమూర్తులపైనా నిందలు వేస్తున్నారు. కోర్టుల తీర్పులను సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుబడుతున్నారు. జడ్జీలను ఎగతాళి చేస్తూ ట్రోలింగ్ పెరిగింది. అయినాసరే వృత్తి ధర్మం పాటిస్తూ న్యాయమూర్తులు ముందుకు సాగిపోతారు. సుప్రీంకోర్టు జడ్జి లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదిగిన మేం ఇలాంటి చవకబారు అంశాలను అస్సలు పట్టించుకోము. నా దృష్టిలో సామాజికమాధ్యమం అనేది అసమాజ మా ధ్యమంగా తయారైంది. ఆన్లైన్ వేధింపులు, వ్యాఖ్యానాలను పట్టించుకోను. ఇవి నాపై ప్రభా వం చూపబోవు. వీటి వల్ల అస్సలు ఒత్తిడికి గురికాను. జడ్జీలు, తీర్పులపై సది్వమర్శను మాత్రమే నేను లెక్కలోకి తీసుకుంటా’’అని అన్నారు. కాలుష్యమున్నా కాలు బయటపెడతా ‘‘దేశరాజధానిలో వాయు కాలుష్యం విపరీతంగా ఉంది. పొగచూరినా సరే పాదం కదపాల్సిందే. వాతావరణం ఎలాగున్నా సరే రోజు ఉదయం మారి్నంగ్వాక్ చేస్తా. ఖచి్చతంగా దాదాపు గంటసేపు బయట నడుస్తా’’అని అన్నారు. -
మంత్రి ఒం‘టెట్టు’ పోకడ
‘‘ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకు ఇన్ సర్వీస్ టెట్ (టీచర్ఎలిజిబులిటీ టెస్ట్)పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం. రద్దుకు కృషి చేస్తామని హామీ ఇస్తున్నాను’’ గత నెల 28న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రకటన ఇది. ఈ హామీ ఇచ్చి దాదాపు నెలవుతోంది. టెట్ దరఖాస్తు గడువు నేటితో ముగుస్తోంది. మంత్రి హామీతో పరీక్షకు అర్హులైన టీచర్లు దరఖాస్తు చేసుకోలేదు. ఇప్పుడు అప్పీల్ కాదుగదా.. కనీసం ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించే నిర్ణయం కూడా తీసుకోలేదు. ఫలితంగా ఉపాధ్యాయులు ఇరకాటంలో పడ్డారు. సాక్షి, అమరావతి: ఉపాధాయుల అర్హత పరీక్ష (టెట్)కు ఇన్సర్వీస్ టీచర్ల నుంచి స్పందన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. గతనెల 23న విద్యాశాఖ టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆదివారం (నేటి)తో దరఖాస్తు గడువు ముగియనుంది. అయినా ఇన్ సర్వీస్ టీచర్ల టెట్ దరఖాస్తులు 26 వేలు దాటలేదు. వాస్తవానికి 2011కి ముందు టెట్ లేకుండా డీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు 1.62 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు వీరిలో కేవలం 25 వేల మంది మాత్రమే అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. రెగ్యులర్ టెట్ దరఖాస్తులు 2.34 లక్షలు రాగా, ఇన్ సర్వీస్ దరఖాస్తులు మాత్రం 25 వేలు మాత్రమే వచ్చాయి. ఉపాధ్యాయుల్లో ఆందోళనఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి చేస్తూ సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అప్పటి నుంచి ఇది సరైన విధానం కాదని, దీనిపై రివ్యూ పిటిషన్ వేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. రెండు మూడు దశాబ్దాలుగా వృత్తిలో ఉన్నవారికి ఇప్పుడు పరీక్ష నిర్వహించడం సరికాదని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రికి ఉపాధ్యాయ సంఘాలు విన్నపాలు చేశాయి. అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలూ స్వయంగా మంత్రిని కలిసి టెట్ నిలిపివేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయితే, వాటిని పట్టించుకోని మంత్రి లోకేశ్ గతనెల 28న తమ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కోరిక మేరకు ఇన్ సర్వీస్ టెట్పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయనున్నట్టు ప్రకటించారు. దీంతో ఉపా«ద్యాయులు తాజా టెట్కు దరఖాస్తు చేయలేదు. ఇప్పటికే పలు ఉపాధ్యాయ సంఘాలు ఇన్ సర్వీస్ టెట్పై ‘సుప్రీం’ను ఆశ్రయించాయి. అటు తమిళనాడు, కర్ణాటకతోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాలు సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్లు వేయడంతోపాటు ఆర్టీఈ–2009 చట్ట సవరణ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయలేదు. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పరీక్షపై ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది.1.30 లక్షల మంది టీచర్లపై తీవ్ర ప్రభావంరాష్ట్రంలో అన్ని మేనేజ్మెంట్ పాఠశాలల్లోనూ దాదాపు 3 లక్షల మంది ఉపాధ్యాయులు సేవలు అందిస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో 2.09 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలో 2008 వరకు జరిగిన డీఎస్సీలకు టెట్ లేదు. అంతకు ముందు విధుల్లో చేరిన 1.62 లక్షల మంది ప్రభుత్వ టీచర్లకు టెట్ లేకుండానే సేవలందిస్తున్నారు. పిల్లల ఉచిత నిర్బంధ విద్యా హక్కు (ఆర్టీఈ)చట్టం–2009, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష తప్పనిసరి అని సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని మేనేజ్మెంట్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధిస్తున్న ఉపాధ్యాయులకు తప్పనిసరిగా టెట్ ఉండాలని ఆదేశించింది. నాటి నుంచి ఉపాధ్యాయులు దీనిపై రివ్యూ పిటిషన్ వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా గతనెలలో టెట్కు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈమేరకు టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (ఏపీ టెట్) నిర్వహణకు విధివిధానాలు, సిలబస్, పరీక్ష తీరు తెన్నులతో కూడిన మార్గదర్శకాలను విడుదల చేసి నవంబర్ 23 చివరి తేదీగా నిర్దేశించింది. ఈ క్రమంలో మంత్రి లోకేశ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పడంతో ఇన్ సర్వీస్ టీచర్లకు పరీక్ష ఉండదని అంతా భావించారు. కానీ సుప్రీంలో పిటిషన్ వేయకపోవడంతో ఇప్పుడు 1.62 లక్షల మందిలో ఐదేళ్లలో రిటైరయ్యే 32 వేల మంది ఉపాధ్యాయులు మినహా మిగిలిన 1.30 లక్షల మంది పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరుగాకుండా ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్న మరో 50 వేల మందీ పరీక్ష రాయాల్సి వస్తుందని అంచనా. చట్ట సవరణపై స్పందించని ప్రభుత్వందేశంలో 2011కి ముందు సర్వీసులో చేరిన ఉపాధ్యాయులు టెట్ పూర్తిచేయాలా వద్దా, మైనార్టీ స్కూళ్లలోని టీచర్లకు ఈ నిబంధన వర్తిస్తుందా లేదా అనే అంశంపై వివిధ రాష్ట్రాల హైకోర్టులు భిన్నమైన తీర్పునిచ్చినట్టు నిపుణులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో వాటన్నింటికీ తెరపడింది. అన్ని యాజమాన్య పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేయడంతోపాటు 2011కి ముందు సర్వీసులో చేరిన వారికీ ఈ నిబంధన వర్తిస్తుందని సుప్రీం పేర్కొంది. ఈ తీర్పును పదోన్నతులు, నియామకాలకు ముడిపెట్టింది. ఈ తీర్పుపై పలు రాష్ట్రాలు రివ్యూ పిటిషన్లు వేయడంతోపాటు ఆర్టీఈ–2009 చట్ట సవరణ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. చట్ట సవరణతోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని, దీనిపై కేంద్రంపై ఒత్తిడి తేవాలని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశాలను పూర్తిగా విస్మరించి టెట్ నిర్వహణకు సిద్ధమైంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. సుప్రీం తీర్పుపై కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఏంటో సమీక్షించకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వు ఇచ్చిన వెంటనే టెట్ నిర్వహణకు పూనుకోవడం ఏమిటని నిలదీస్తున్నాయి. -
మొన్న అలా! ఇవాళ ఇలా!!
సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తాను గవర్నరు, రాష్ట్రపతి విధుల్లో వేలు పెట్టేది లేదని పరోక్షంగానైనా స్పష్టంగానే తెలియబర్చింది. రాష్ట్రపతి రిఫరెన్స్ ద్వారా అడిగిన ప్రశ్నలకు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ తన అభిప్రాయాల్ని ఏకగ్రీవంగా వెలిబుచ్చింది. కొండొకచో కార్యనిర్వాహక వ్యవస్థ అధికారాన్నీ, వాదననూ బలపర్చింది. శాసన వ్యవస్థకు, కార్య నిర్వాహక వ్యవస్థకు నడుమ ఏర్పడగల వివాదానికి ‘మీరూ మీరే చూసుకోండి గానీ నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు’ అన్న తరహాలో జవాబులిచ్చింది.ఈమధ్య గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదాలు ఎక్కువవుతున్నాయి. కేంద్రంలో ఒక పార్టీ ప్రభుత్వం, రాష్ట్రంలో తస్మదీయ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి వివాదాలు వస్తున్నాయి. రాష్ట్ర శాసన సభ ఆమోదించిన బిల్లు గవర్నర్ సంతకం పెడితేనే చట్టంగా మారుతుంది. ఆయన సంతకం పెట్టాలి, లేదా తిప్పి పంపాలి లేదా రాష్ట్రపతి అభిప్రాయాన్ని కోరుతూ పంపాలి. ఇలా ఏదో ఒక నిర్ణయం ఎప్పటిలోగా తీసుకోవాలన్నది రాజ్యాంగం చెప్పలేదు. అది ఆధారం చేసుకొని కొంతమంది గవర్నర్లు ఎటూ తేల్చకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారు. దాని వల్ల ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాను చట్టాన్ని అందివ్వలేని స్థితిలో పడుతుంది. (మాటలే సరిగ్గా రాని వయసులో డైరెక్టరై పోయాడు)ఇలాంటి కేసుల్లో గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది ఏమంటే మరీ జాప్యం చేసిన బిల్లుల్ని ఆటోమేటిక్గా ఆమోదం పొందినట్లు అనుకోవాలని! అయితే ఇప్పుడు అదే సుప్రీం కోర్టు అలా ఆటోమేటిక్ ఆమోదం (డీమ్డ్ అస్సెంట్) అన్నది రాజ్యాంగ బద్ధం కాదంది. అలాగే రాష్ట్రపతి, గవర్నర్ నిర్ణయం తీసుకోవడంపై ఎలాంటి గడువూ లేదంది. పైగా వారి నిర్ణయాలు న్యాయ సమీక్షకు అతీతం అని కూడా అభిప్రాయ పడింది. అయితే బిల్లులపై జాప్యం చెయ్యడం అన్యాయమని తోస్తే వాటిపై కాల పరిమితి పెట్టే అవకాశం కోర్టు తీసుకుంటుందని చెప్పింది. స్థూలంగా రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాల పట్ల, కేంద్రం వాదన పట్ల సానుకూల ధోరణితో ఉందీ తీర్పు. చదవండి: ఇంటర్న్స్ కావాలి, నెలకు రూ. లక్ష స్టైఫండ్ : ట్విస్ట్ ఏంటంటే– డా.డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ -
కడియం ఓకే.. దానం పరిస్థితి ఏంటో?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం మరోసారి హాట్టాపిక్గా మారింది. సుప్రీంకోర్టు ఈ కేసును సీరియస్గా పరిగణించి విచారణను వేగవంతం చేయాలని సూచించిన నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ వేగం పెంచారు. సుప్రీంకోర్టు దిశానిర్దేశాలు చేసిన నేపథ్యంలో ఇప్పటికే అఫిడవిట్లు సమర్పించని ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే స్పీకర్ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిసి కాస్త గడువు కోరారు. ఇదిలావుండగా మరోవైపు ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం స్పీకర్ వద్ద ఎలాంటి విజ్ఞప్తి చేయలేదని తెలుస్తోంది. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండి పార్టీ అధిష్టాన పెద్దలతో ఆయన చర్చించినట్టు సమాచారం. తిరిగి రాష్ట్రానికి వచ్చాక కూడా కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే.. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు సంబంధించిన వివరణను సిద్ధం చేసుకునే ప్రక్రియలో భాగంగా దానం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో గంటకు పైగా భేటీ అయినట్లు తెలుస్తోంది. అధిష్టాన పెద్దలు సూచించిన అంశాలనే ఆయన ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు సైతం పాల్గొన్నారు. -
పూర్తి సంతృప్తితో వెళ్తున్నా..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రజలకు తన వంతు సేవలు అందించానని, పూర్తి సంతృప్తితో పదవీ విరమణ చేయబోతున్నానని సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ పేర్కొన్నారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా నాలుగు దశాబ్దాల ఈ ప్రస్థానం తనకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. న్యాయరంగ విద్యారి్థగానే తన ప్రయాణానికి ము గింపు పలుకబోతున్నానని తెలిపారు. జస్టిస్ గవాయ్ ఈ నెల 23వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు. శుక్రవారం చివరి పని దినం పూర్తిచేసుకున్నారు. ఆనవాయితీ ప్రకారం సుప్రీంకోర్టులో సెర్మోనియల్ బెంచ్ నిర్వహించారు. జస్టిస్ గవాయ్తోపాటు బెంచ్ సభ్యులైన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది జస్టిస్ గవాయ్కి ఘనంగా వీడ్కోలు పలికారు. పూర్తి సంతృప్తి, సంతోషంతో సుప్రీంకోర్టును వీడుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. దేశానికి తాను చేయగలిగినదంతా చేశానని ఉద్ఘాటించారు. పదవిని సేవగానే భావించాలి ప్రతి న్యాయమూర్తి, ప్రతి న్యాయవాది, ప్రతి ఒక్కరూ రాజ్యాంగ సూత్రాలకు లోబడి పనిచేయాలని జస్టిస్ గవాయ్ సూచించారు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వాన్ని భారత రాజ్యాంగం బోధిస్తోందని గుర్తుచేశారు. రాజ్యాంగానికి కట్టుబడి తన విధులను చిత్తశుద్ధితో నిర్వ ర్తించడానికి కృషి చేశానని పేర్కొన్నారు. 1985లో ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రవేశించానని, తద్వారా న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టానని గుర్తుచేసుకున్నారు. ఈరోజు న్యాయరంగ విద్యార్థిగానే పదవీ విరమణ చేస్తున్నానని తెలిపారు. రికార్డుకెక్కిన జస్టిస్ గవాయ్జస్టిస్ బి.ఆర్.గవాయ్ ఈ ఏడాది మే 14న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆరు నెలలకుపైగా సేవలందించారు. రెండో దళిత సీజేఐగా, మొదటి బౌద్ధ మతస్తుడైన సీజేఐగా ఆయన రికార్డుకెక్కారు. వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్ సూర్యకాంత్, అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ లాయర్ కపిల్ సిబల్ తదితరులు మాట్లాడారు. జస్టిస్ గవాయ్ మహోన్నతమైన సేవలందించారని కొనియాడారు. ఒక సామాన్యుడు నిరంతర కృషితో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని నిరూపించారని ప్రశంసించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మరో వీడ్కోలు కార్యక్రమంలోనూ జస్టిస్ గవాయ్ పాల్గొన్నారు. షెడ్యూల్డ్ కులాల్లో(ఎస్సీ) క్రీమీలేయర్పై ఇచ్చిన తీర్పుతో సొంత సామాజికవర్గం నుంచి ఆగ్రహం ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాల్లో క్రీమీలేయర్ వర్గానికి రిజర్వేషన్లు కల్పించకూడదని తాను ఇచ్చిన తీర్పు ఎస్సీలో చాలామందికి నచ్చలేదని అన్నారు. -
రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేం
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీలు ఆమోదించి పంపే బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్లు ఆమోదం తెలిపే అంశంపై న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల నడుమ తలెత్తిన పెను సంక్షోభానికి అత్యున్నత న్యాయస్థానం ఎట్టకేలకు సామరస్యపూర్వకంగా తెరదించింది. ‘‘ఈ విషయంలో సుప్రీంకోర్టుతో సహా ఏ న్యాయస్థానమూ వారికి ఎలాంటి గడువూ విధించజాలదు. అలా చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే ఇది కార్యనిర్వాహక వ్యవస్థ అధికారాలను న్యాయవ్యవస్థ తన గుప్పెట పట్టడమే అవుతుంది. దీన్ని రాజ్యాంగం ఏ రూపంలోనూ అనుమతించలేదు’’ అని తేల్చిచెప్పింది. అంతేగాక సదరు బిల్లులకు ఆమోదం తెలపడం, రిజర్వులో ఉంచడంపై న్యాయ సమీక్ష కూడా కుదరదని స్పష్టం చేసింది. బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి, గవర్నర్లకు మూడు నెలల గడువు విధిస్తూ ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో సంచలన తీర్పు వెలువరించడం, అది రెండు కీలక వ్యవస్థల నడుమ సంక్షోభానికి దారితీయడం తెలిసిందే. మూడు నెలల్లోపు నిర్ణయం వెలువరించని పక్షంలో సదరు బిల్లులకు ఆమోదం లభించినట్టే భావించాలని కూడా ఆ తీర్పు పేర్కొంది. ఈ రెండు అంశాలూ చెల్లుబాటు కాబోవని సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఈ అంశంపై గురువారం ఈ మేరకు ఏకగ్రీవంగా 111 పేజీల తుది తీర్పు వెలువరించింది. ‘‘రాష్ట్రపతి, గవర్నర్లకు ఇది కార్యనిర్వాహక వ్యవస్థ విధుల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడమే అవుతుంది. అది రాజ్యాంగ విరుద్ధం’’అని వ్యాఖ్యానించింది. 142వ అధికరణంలోని ప్రత్యేక అధికారాలను వినియోగించుకుంటూ ద్విసభ్య ధర్మాసనం వెలువరించిన ఆ తీర్పును కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే బిల్లులకు ఆమోదాన్ని గవర్నర్లు నిరవధికంగా పెండింగ్లో పెట్టడం మాత్రం ఎంతమాత్రమూ సబబు కాదని సీజేఐ ధర్మాసనం ఈ సందర్భంగా విస్పష్టంగా పేర్కొంది. ‘‘రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా అంతులేని జాప్యం చేస్తే కోర్టులు చూస్తూ ఊరుకోబోవు. వాటిపై పరిమిత న్యాయసమీక్ష జరపవచ్చు’’అని పేర్కొంది. అయితే, ‘‘అప్పుడు కూడా వీలైనంత త్వరగా బిల్లులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించాలే తప్ప రాష్ట్రపతికి, గవర్నర్లకు కోర్టులు గడువు విధించడానికి వీల్లేదు’’అని స్పష్టం చేసింది. అంతేకాదు, ‘‘బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్ర మంత్రిమండలి సలహాకు గవర్నర్ కట్టుబడాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో విచక్షణ మేరకు వ్యవహరించే అధికారం రాజ్యాంగమే కల్పించింది’’అని కూడా గుర్తు చేసింది. రాజ్యాంగ ధర్మాసనంలో సీజేఐతో పాటు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ ఎ.ఎస్.చందూర్కర్ ఉన్నారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హర్షం ఈ తీర్పుపై వెలిబుచ్చారు. చరిత్రాత్మక తీర్పు వెలువరించినందుకు రాష్ట్రపతి తరఫున సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. దీనిపై డీఎంకే సర్కారు స్పందించలేదు. ఆపితే తిప్పి పంపాల్సిందే.. ఏ నిర్ణయమూ తీసుకోకుండా గవర్నర్లు సుదీర్ఘకాలం పాటు బిల్లులను పెండింగ్లో పెట్టడం కుదరదని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అది సబబు కూడా కాదని పేర్కొంది. ‘‘ఏ బిల్లునైనా ఆపితే దాన్ని కచ్చితంగా అసెంబ్లీకి వెనక్కి పంపాల్సిందే. రాజ్యాంగంలోని 200 అధికరణ ప్రకారం బిల్లుల విషయంలో గవర్నర్ల ముందున్నది మూడు దారులు. వాటిని ఆమోదించడం, రాష్ట్రపతికి నివేదించడం, లేదా పునఃసమీక్ష నిమిత్తం అసెంబ్లీకి తిప్పి పంపడం’’అని సీజేఐ పేర్కొన్నారు. వాటిని ఆమోదించకుండా గవర్నర్ తన వద్దే అట్టిపెట్టుకోవచ్చన్న కేంద్రం వాదనను తోసిపుచ్చారు. ‘‘అలా చేయడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. ఆపేయాలనుకున్న బిల్లులను అసెంబ్లీకి పంపడం ఆప్షన్కాదు, నిబంధన’అని చెప్పారు. న్యాయమూర్తి పేరు లేదు! రాజ్యాంగ ధర్మాసనం తరఫున తీర్పు రాసిన న్యాయమూర్తి పేరును అందులో పేర్కొనకపోవడం విశేషం. ఇలా అరుదుగా మాత్రమే జరుగుతుంటుంది. 2019లో రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదం కేసుపై కూడా ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఆ తీర్పు రాసిన న్యాయమూర్తి పేరును కూడా అందులో పేర్కొనలేదు. ఇదీ నేపథ్యం...! అసెంబ్లీ పంపే బిల్లుల ఆమోదంలో గవర్నర్ల మితిమీరిన జాప్యం కొన్నేళ్లుగా వివాదాలకు దారితీస్తూ వస్తోంది. ముఖ్యంగా విపక్షాల పాలనలో ఉన్న తమిళనాడు, కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఈ సమస్య తరచూ తలెత్తుతోంది. సుప్రీంకోర్టు తాజా తీర్పుకు కారణంగా నిలిచిన కేసు కూడా బిల్లుల ఆమోదం విషయమై తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ ఎన్.రవి మధ్య తలెత్తిన వివాదానికి సంబంధించినదే. అసెంబ్లీ ఆమోదించి పంపిన 10 బిల్లులను ఆమోదించకుండా ఆయన సుదీర్ఘంగా జాప్యం చేయడాన్ని సవాలు చేస్తూ ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాంతో, చట్టసభలు ఆమోదించి పంపే బిల్లులపై గవర్నర్లతో పాటు రాష్ట్రపతి కూడా మూడు నెలల్లోగా ఏ నిర్ణయమూ తీసుకోవాలంటూ జస్టిస్ జేబీ పార్డీవాలా ద్విసభ్య ధర్మాసనం గత ఏప్రిల్ 8న సంచలన తీర్పు వెలువరించింది. అది తీవ్ర కలకలానికి దారితీసింది. ఆ తీర్పు ఆధారంగా గవర్నర్ ఆమోదించకుండా పక్కన పెట్టిన 10 బిల్లులను చట్టాలుగా నోటిఫై చేస్తూ తమిళనాడు ప్రభుత్వం గెజిట్ కూడా జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన అపీళ్లను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరిచడంతో కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు మధ్య విభేదాలు మరింత తీవ్రతరమయ్యాయి. దాంతో నేరుగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అంశంలో జోక్యం చేసుకున్నారు. బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతికి, గవర్నర్లకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను కాదని కోర్టులు ఇలా గడువులు పెట్టవచ్చా అంటూ నేరుగా సుప్రీంకోర్టునే నిలదీశారు. ఈ విషయమై పలు సందేహాలు లేవనెత్తుతూ 14 ప్రశ్నలు సంధించి వాటికి బదులు కోరారు. 143(1)వ అధికరణం రాష్ట్రపతికి కట్టబెట్టిన విశేషాధికారాలను ఉపయోగించుకుంటూ ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఆమె లేఖ రాశారు. దాంతో దీనిపై విచారణకు సీజేఐ సారథ్యంలో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. గడువును వ్యతిరేకిస్తూ కేంద్రం, సమరి్థస్తూ తమిళనాడు సహా కేరళ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలు వాదనలు విని్పంచాయి. అనంతరం గత సెపె్టంబర్ 11న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. రాష్ట్రపతి వేసిన 14 ప్రశ్నల్లో పదకొండింటిపై తాజా తీర్పులో తమ అభిప్రాయం వెలిబుచి్చంది. మిగతా మూడింటినీ ఈ అంశంతో సంబంధం లేనివిగా పేర్కొంది. ‘‘గవర్నర్లు బిల్లుపై తమ నిర్ణయాన్ని రిజర్వు చేసిన ప్రతిసారీ రాష్ట్రపతి ఇలా 143వ అధికరణ కింద సుప్రీంకోర్టు అభిప్రాయం కోరాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొంది. -
ఉగ్రవాదులుగా విద్యావంతులు, మేధావులు.. మరింత ప్రమాదకరం
ఢిల్లీ: 2020 దేశరాజధాని అల్లర్ల కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టులో ఢిల్లీ పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు. మేధావులు ఉగ్రవాదం వైపు అడుగులేస్తే.. వాళ్లు మరింత ప్రమాదకరంగా మారతారని కోర్టుకు నివేదించారు. ఈ సందర్భంగా నిందితులు ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్ బెయిల్ను తిరస్కరించాలని కోరారు.సుప్రీం కోర్టులో నిందితుల బెయిల్ పిటిషన్పై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసుల తరఫున అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ‘‘వాళ్లు ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదు’’ అని విజ్ఞప్తి చేశారు. ‘‘ఈ మధ్య కాలంలో డాక్టర్లు, ఇంజినీర్లు తమ వృత్తులు వదిలి దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. మేధావులు ప్రభుత్వ సహాయంతో డాక్టర్లు, ఇంజినీర్లు అవుతారు. తర్వాత దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటారు. అలాంటి వారు సాధారణ ఉగ్రవాదుల కంటే మరింత ప్రమాదకరులు’’ అని అన్నారాయన.ఈ సందర్భంగా నిందితుడు షర్జీల్ ఇమామ్ 2019–2020లో సీఏఏకు వ్యతిరేకంగా ఇచ్చిన ప్రసంగాల వీడియోలు కోర్టులో ప్రదర్శించారు. ఈ అల్లర్లు సహజమైనవి కావని.. పక్కా ప్రణాళికతో జరిగిన కుట్ర అని వివరించారు. నిందితులు ఉపా చట్టం కింద అరెస్ట్ అయ్యారని.. బెయిల్ ఇవ్వడానికి కొత్త కారణాలు కనిపించడం లేవని పేర్కొన్నారు.అల్లర్ల నేపథ్యం..కేంద్ర ప్రభుత్వం 2019లో సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్(CAA)ను 2019లో ప్రవేశపెట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ దేశంలో పలు చోట్ల నిరసనలు జరిగాయి. ఢిల్లీలో జాఫ్రాబాద్, షాహీన్ బాగ్ వంటి ప్రాంతాల్లో మహిళలు దీక్షలు చేపట్టారు. వీటిని ఉద్దేశిస్తూ బీజేపీ నేత కపిల్ మిశ్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 23వ తేదీన మౌజ్పూర్ వద్ద జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..‘‘నిరసనకారుల్ని అణచివేయాలి. లేకుంటే చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకుంటాం’’ అని పోలీసులకు అల్టిమేటం ఇచ్చారు. ఆ మరుసటి రోజు నుంచి మూడు రోజులపాటు ఉత్తర ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి.2020 ఢిల్లీ అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువగా మైనారిటీలే ఉన్నారు. సుమారు 700 మందికి పైగా గాయపడ్డారు. అనేక ఇళ్లు, వ్యాపార సంస్థలు, మసీదులు, దేవాలయాలు ధ్వంసమయ్యాయి. దీంతో కపిల్ మిశ్రాపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. అదే సమయంలో ఈ అల్లర్ల వెనుక మేధావుల ముసుగులో ఉగ్రవాదులు ఉన్నారని.. రెజీమ్ చేంజ్ ఆపరేషన్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరం చేయాలనే కుట్ర చేశారని ఢిల్లీ పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. విద్యార్థి సంఘాల నేతలు అయిన ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్లను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు.ఫేక్ ఎవిడెన్స్పై విమర్శలు..2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించి మొత్తం 695 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీ కింది కోర్టుల్లో ఇవి విచారణ జరిగాయి. 116 కేసుల్లో ఇప్పటికే తీర్పులు వెలువడ్డాయి. 97 కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. ఈ క్రమంలో.. పోలీసులు సమర్పించిన వాటిల్లో నకిలీ ఆధారాలు, కల్పిత సాక్ష్యాలు ఉన్నట్లు కోర్టులు గుర్తించారు. ప్రత్యేకించి.. 17 కేసుల్లో ఫేక్ ఎవిడెన్స్ను కోర్టులు హైలైట్ చేశాయి. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి.తాజాగా ఢిల్లీ ఎర్రకోట వద్ద కారు పేలిన ఘటనలో 12 మంది మరణించారు. ఇది ఉగ్రదాడి అని, ఆత్మాహుతి దాడికి పాల్పడింది జమ్ముకశ్మీర్ పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీ విచారణలో తేలింది. అంతేకాదు.. ఉమర్కు పాక్ ఆధారిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్తో సంబంధాలున్నట్లు తేలింది. అయితే ఈ పేలుళ్లకు కొన్నిగంటల ముందు భారీ ఉగ్రకుట్రను ఫరీదాబాద్+జమ్ము కశ్మీర్ పోలీసులు చేధించారు. భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలోనూ పలువురు వైద్యులను అరెస్ట్ చేశారు. మరోవైపు.. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులోనూ పలువురు వైద్యులు అరెస్ట్ అయ్యారు. దీంతో విద్యావంతులు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనే వైట్కాలర్ టెర్రరిజంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
సుప్రీంకోర్టు కీలక ప్రకటన రాష్ట్రపతి, గవర్నర్లకు ఉపశమనం
-
గడువు విధించలేం.. నాలుగో అధికారం ఉండదు: సుప్రీం కోర్టు
సాక్షి, ఢిల్లీ: రాష్ట్రపతి, గవర్నర్లకు పెండింగ్ బిల్లుల విషయంలో న్యాయస్థానాలు గడువులు విధించలేవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మూడు నెలల గడువు విధిస్తూ గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోర్టును రిఫరెన్స్ కోరిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అలాంటి గడువులు ఉండబోవని.. అయితే అకారణంగా బిల్లుల్ని పెండింగ్లో పెడితే మాత్రం కోర్టులు జోక్యం చేసుకోక తప్పదంటూ తమ అభిప్రాయం వెల్లడించింది. ‘‘రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లులపై కోర్టులు గడువు నిర్దేశించలేవు. గవర్నర్ బిల్లును ఆమోదించేందుకు రాజ్యాంగంలో ఏ సమయ పరిమితి (టైమ్లైన్) లేదు. అయితే.. గవర్నర్లు బిల్లులను సుదీర్ఘకాలం ఆమోదించకుంటే మాత్రం న్యాయ సమీక్ష అధికారం కోర్టులకు ఉంటుంది. మేము గవర్నర్కు పరిమితమైన సూచనలు మాత్రమే ఇవ్వగలం. గవర్నర్ ముందు మూడే మార్గాలు ఉన్నాయి.. ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం, నిలుపుదల చేసి అసెంబ్లీకి తిరిగి పంపడం. ఈ మూడు మార్గాలను ఎంపిక చేయడంలో మాత్రమే గవర్నర్ విచక్షణ ఉంది. పునఃపరిశీలనకు పంపకపోవడం ఫెడరల్ స్పూర్తికి విరుద్ధం. నాలుగో అధికారం గవర్నర్లకు ఉండదు. నిరవధిక ఆలస్యం జరిగితే న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది’’ అని చీఫ్ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అసెంబ్లీ బిల్లులను పలు రాష్ట్రాల గవర్నర్లు పెండింగ్లో పెడుతుండడం సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మూడు నెలల గడువు విధిస్తూ ఆలోపు ఆమోదించాల్సిందేనని.. లేకుంటే ఆమోదించినట్లేనని పేర్కొంది. గవర్నర్ విషయంలోనే కాదు.. రాష్ట్రపతి విషయంలోనూ ఇది వర్తిస్తుందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ తీర్పులో జస్టిస్ బీఆర్ గవాయ్ కూడా భాగం అయ్యారు. అయితే.. గడువుపై పిటిషన్లను సుప్రీం కోర్టు అనుమతించలేదు. దీంతో ఈ తీర్పుపై స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రిఫరెన్స్ కోరారు. రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ కింద అధికారాలపై ఆరా తీసిన ఆమె.. సర్వోన్నత న్యాయస్థానానికి 14 ప్రశ్నలు సంధించారు. రాజ్యాంగం కల్పించిన అధికారాలను కాదనొచ్చా? అని ప్రశ్నించారు. రాష్ట్రపతి రిఫరెన్స్పై చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం వాదనలు వింది. ఈ బెంచ్లో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందుర్కర్ ఉన్నారు. సుప్రీం కోర్టుకు రాష్ట్రపతి వేసిన 14 ప్రశ్నలు..1. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును గవర్నర్కు సమర్పించినప్పుడు అతని ముందు ఉన్న రాజ్యాంగపరమైన ఎంపికలు ఏమిటి?2. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ తన వద్ద ఉన్న అన్ని ఎంపికలను వినియోగించుకుంటూ మంత్రి మండలి అందించే సహాయం & సలహాలకు కట్టుబడి ఉంటారా?3. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద గవర్నర్ రాజ్యాంగ విచక్షణను ఉపయోగించడం న్యాయబద్ధమైనదా?4. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద గవర్నర్ చర్యలకు సంబంధించి న్యాయ సమీక్షకు సంపూర్ణ అడ్డంకిగా ఉందా?5. రాజ్యాంగబద్ధంగా సూచించబడిన కాలపరిమితి మరియు గవర్నర్ అధికారాలను వినియోగించే విధానం లేనప్పుడు, గవర్నర్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద ఉన్న అన్ని అధికారాలను వినియోగించడానికి కాలక్రమాలను విధించవచ్చా మరియు న్యాయపరమైన ఆదేశాల ద్వారా వ్యాయామ విధానాన్ని సూచించవచ్చా?6. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణను వినియోగించడం న్యాయబద్ధమైనదేనా?7. రాజ్యాంగబద్ధంగా నిర్దేశించిన కాలక్రమం మరియు రాష్ట్రపతి అధికారాలను వినియోగించే విధానం లేనప్పుడు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి విచక్షణను వినియోగించడానికి న్యాయపరమైన ఆదేశాల ద్వారా కాలక్రమాలను విధించవచ్చా మరియు ఆ విధానాన్ని నిర్దేశించవచ్చా?8. రాష్ట్రపతి అధికారాలను నియంత్రించే రాజ్యాంగ పథకం దృష్ట్యా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద సూచన ద్వారా సుప్రీంకోర్టు సలహా కోరడం మరియు గవర్నర్ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసినప్పుడు సుప్రీంకోర్టు అభిప్రాయం తీసుకోవడం అవసరమా?9. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 మరియు ఆర్టికల్ 201 ప్రకారం గవర్నర్ మరియు రాష్ట్రపతి నిర్ణయాలు చట్టానికి ముందు దశలో న్యాయబద్ధమైనవేనా? బిల్లు చట్టంగా మారడానికి ముందు, దాని విషయాలపై కోర్టులు న్యాయపరమైన తీర్పును చేపట్టడానికి అనుమతి ఉందా?10. రాజ్యాంగ అధికారాలను మరియు రాష్ట్రపతి/గవర్నర్ ఆదేశాలను భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఏ విధంగానైనా భర్తీ చేయవచ్చా?11. రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టం, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద మంజూరు చేయబడిన గవర్నర్ అనుమతి లేకుండా అమలులో ఉన్న చట్టమా?12. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 145(3) నిబంధన దృష్ట్యా, ఈ గౌరవనీయ న్యాయస్థానంలోని ఏ బెంచ్ అయినా ముందుగా దాని ముందు విచారణలో ఉన్న ప్రశ్న రాజ్యాంగ వివరణకు సంబంధించిన చట్టపరమైన గణనీయమైన ప్రశ్నలను కలిగి ఉందో లేదో నిర్ణయించడం మరియు దానిని కనీసం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్కు సూచించడం తప్పనిసరి కాదా?13. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు యొక్క అధికారాలు విధానపరమైన చట్టం లేదా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 అంశాలకు పరిమితం చేయబడతాయా లేదా రాజ్యాంగం లేదా అమలులో ఉన్న చట్టం యొక్క ప్రస్తుత ముఖ్యమైన లేదా విధానపరమైన నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆదేశాలు/ఆదేశాలను జారీ చేయడం వరకు విస్తరించిందా?14. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 కింద దావా వేయడం ద్వారా తప్ప, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను పరిష్కరించుకోవడానికి సుప్రీంకోర్టు యొక్క ఏదైనా ఇతర అధికార పరిధిని రాజ్యాంగం నిషేధిస్తుందా?న్యాయ వ్యవస్థ రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం సరికాదని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్రాలు వాదనలు వినిపించాయి. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి విచక్షణాధికారాల్లో జోక్యం చేసుకోవడం తమ పరిధి అతిక్రమించడమేనన్న కేంద్రం వాదించింది. మరోవైపు.. రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు పెట్టడం సరైనని సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సమర్థించాయి.రాజ్యాంగ ధర్మాసనం తీర్పులో పది కీలక అంశాలు1. రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లులపై గడువు నిర్దేశించలేం2. గవర్నర్లు బిల్లులు సుదీర్ఘకాలం ఆమోదించకుంటే రాజ్యాంగ కోర్టులకు న్యాయ సమీక్ష అధికారం ఉంది3. మేము గవర్నర్ కు పరిమితమైన సూచనలు మాత్రమే ఇవ్వగలం4. గవర్నర్ ముందు మూడే మార్గాలు : ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం, నిలుపుదల చేసి అసెంబ్లీకి తిరిగి పంపడం.ఈ మూడు మార్గాలను ఎంపిక చేయడంలో మాత్రమే గవర్నర్ విచక్షణ ఉంది5. గవర్నర్ బిల్లును తిరిగి సభకు పంపకుండా నిలిపేయడం సమాఖ్య(ఫెడరల్) స్ఫూర్తిని ఉల్లంఘించడమే. గవర్నర్ బిల్లును సభకు తిరిగి పంపకుండానే నిలిపివేయవచ్చని కేంద్ర ప్రభుత్వ వాదనలను తిరస్కరిస్తున్నాము6. ఆర్టికల్ 200 కింద గవర్నర్ విచక్షణ అధికారం అంటే.. బిల్లును తిరిగి వెనక్కి పంపడం లేకుంటే రాష్ట్రపతికి రిజర్వ్ చేయడం మాత్రమే7. గవర్నర్ బిల్లును రిజర్వ్ చేసిన ప్రతిసారి రాష్ట్రపతి సలహా తీసుకోవాల్సిన అవసరం లేదు. బిల్లులో స్పష్టత లేకుంటే ,సలహా అవసరమని భావించినప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు సలహా తీసుకోవాలి8. రాష్ట్రపతి, గవర్నర్ ఆదేశాలను ఆర్టికల్ 142 కింద కోర్టులు సబ్స్టిట్యూట్ చేయలేవు. ఆర్టికల్ 142 " డీమ్డ్ అస్సెంట్"(ఆమోదం పొందినట్లే) అనే భావనను అనుమతించదు9. ఆర్టికల్ 200 కింద గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టం అమల్లోకి రాదు. ఆర్టికల్ 200 కింద గవర్నర్ , శాసనసభ పాత్రలను మరొక రాజ్యాంగ వ్యవస్థ భర్తీ చేయదు 10. బిల్లుల ఆమోదంపై రాజ్యాంగంలో ఎలాంటి కాల పరిమితి లేదు. ఆర్టికల్ 200 కింద అధికారాలను వినియోగించడానికి కాల పరిమితి నిర్దేశించడం సరికాదు. చట్టాన్ని రూపొందించే ప్రక్రియలో సమతుల్యత కోసమే ఆర్టికల్ 200, 201 ఏర్పాటు చేశారు. -
దయచేసి వీలునామా రాయండి
న్యూఢిల్లీ: భారతీయ స్త్రీలు తమ స్వార్జితాలను తమ తదనంతరం ఎవరికి చెందాలనే విషయంలో కచ్చితంగా వీలునామా రాస్తే ఆయా ఆస్తులపై భవిష్యత్తులో ఎలాంటి వారసత్వ తగాదాలు రాబోవని సుప్రీంకోర్టు ఆశాభావం వ్యక్తంచేసింది. ఉన్నత విద్యావంతురాలై కష్టపడి పనిచేసే మహిళలు హఠాత్తుగా భర్త, కుమారులు, కుమార్తెలను కోల్పోతే ఆమె ఆస్తులు అత్తింటి వాళ్లకు చెందుతాయా? పుట్టినింటి వాళ్లకు చెందుతాయా? అనే ప్రశ్న తలెత్తకుండా ఉండేందుకు వీలునామా అనేది చక్కటి పరిష్కారమని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్ల ధర్మాసనం అభిప్రాయపడింది. హిందూ వారసత్వ చట్టం, 1956ను అమల్లోకి తెచ్చేనాటికి మన రాజ్యాంగ నిర్మాతలు భారతీయ హిందూ మహిళలు ఒకవేళ పెద్దమొత్తంలో ఆమె పేరిటే ఆస్తిపాస్తులు ఉంటే ఎలా అనే ఆలోచన వచ్చి ఉండకపోవచ్చని అందుకే ఆ నిబంధనలు చట్టంలో లేవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆస్తుల వారస త్వం విషయంలో తల్లిదండ్రులు, అత్తా మామల మధ్య మనస్పర్థల నివారణకు ఇకనైనా హిందూ మహిళ వీలునామా బాట పట్టాలని ధర్మాసనం సూచించింది. హిందూ మహిళ మరణిస్తే వీలునా మా రాయని పక్షంలో ఆమె పేరిట ఉన్న స్థిరచ రాస్తులన్నీ భర్త తరఫు వారసులకే చెందుతాయంటూ హిందూ వారసత్వచట్టం,1956లోని 15(1) (బి) సెక్షన్లో పేర్కొనడాన్ని న్యాయవాది స్నిధా మెహ్రా కోర్టులో సవాల్చేయగా ఈ ప్రజా ప్రయోజనవ్యాజ్యాన్ని బుధవారం సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ సెక్షన్ రాజ్యాంగంలోని 14, 15, 21వ అధికరణాలను ఉల్లంఘించేదిగా ఉందన్న వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ‘‘ దేశంలోని మహిళలు ముఖ్యంగా హిందు మహిళల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావివ్వకూడదనే ఉద్దేశంతోనే వీలునామా ఉంటే బాగుంటుందని సూచి స్తున్నాం’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘వారసత్వం పోరు రాకుండా ఉండాలంటే సంబంధిత మహిళ చనిపోతే వెంటనే తల్లిదండ్రులు, అత్తామామలు రాజీ మార్గాన్ని ఎంచుకోవాలి. మ ధ్య వర్తిత్వంతో తీసుకునే నిర్ణయాన్ని కోర్టు తీర్పుగా మేం గౌరవిస్తాం’’ అని కోర్టు హామీ ఇచ్చింది. -
పాత నిబంధనలకే కొత్త ముసుగు
సాక్షి, న్యూఢిల్లీ: ట్రిబ్యునల్స్ సంస్కరణల(హేతుబద్దీకరణ, సర్వీసు నిబంధనల) చట్టం–2021 విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానంలో కేంద్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రిబ్యునల్ సభ్యులు, ప్రిసైడింగ్ అధికారుల నియామకం, పదవీ కాలం, సర్వీసు నిబంధనలపై కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణల పట్ల సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. గతంలో సుప్రీంకోర్టు రద్దు చేసిన కొన్ని నిబంధనలను స్వల్ప మార్పులతో సంస్కరణల పేరిట ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెట్టిందని, ఇది ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. న్యాయ వ్యవస్థ తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంట్ అతిక్రమించడం తగదని స్పష్టంచేసింది. పాత నిబంధనలనే చిన్నచిన్న మార్పులతో మళ్లీ తీసుకురావడం ఏమిటని ప్రశ్నించింది. ట్రిబ్యునల్స్ సంస్కరణల(హేతుబద్ధీకరణ, సర్వీసు నిబంధనల) చట్టం–2021 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం విచారణ పూర్తిచేసింది. బుధవారం 137 పేజీల తీర్పు వెలువరించింది. కీలక అంశాలపై ఇచ్చిన తీర్పులను, ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించడానికి ఇష్టపడడం లేదని, ఈ ధోరణి నిజంగా గర్హనీయమని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. ట్రిబ్యునళ్ల స్వతంత్రతను కాపాడడంతోపాటు వాటి పనితీరు, కార్యకలాపాలను నిర్దేశిస్తూ ఇచ్చిన విస్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయకపోవడం దురదృష్టకరమని పేర్కొంది. కోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కనపెట్టి, ఆర్డినెన్స్లోని కొన్ని పాత నిబంధనలను మార్పులు చేసి చట్టంరూపంలో మళ్లీ పవేశపెట్టడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. దీనివల్ల చట్టంపై రాజ్యాంగపరమైన చర్చకు తెరలేచినట్లయ్యిందని వెల్లడించింది. పదవీ కాలంలో స్థిరత్వం అవసరం ట్రిబ్యునళ్లలో నియామకానికి కనీసం 50 ఏళ్ల వయసు ఉండాలంటూ పార్లమెంట్లో తీసుకొచ్చిన నిబంధనతోపాటు మరికొన్నింటిని వ్యతిరేకిస్తూ మద్రాసు బార్ అసోసియేషన్తోపాటు మరికొందరు సుప్రీంకోర్టు వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్ల వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. ట్రిబ్యునళ్ల చైర్మన్లు, సభ్యుల పదవీ కాలం కేవలం నాలుగేళ్లే అంటూ కేంద్రం తీసుకొచ్చిన నిబంధనను కొట్టిపారేసింది. అలాగే ట్రిబ్యునల్స్లో నియామకాలకు ప్రతి పదవికి ఇద్దరి పేర్లను సెలక్షన్ కమిటీ ప్రతిపాదించాలంటూ తెచ్చిన మరో నిబంధనను కూడా తోసిపుచ్చింది. న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు సభ్యుల పదవీ కాలంలో స్థిరత్వం, వారి హక్కుల పరిరక్షణ అత్యంత కీలకమని ఉద్ఘాటించింది. కోర్టులో ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించడం సరైంది కాదని సూచించింది. కొత్త సీసాలో పాత సారా ట్రిబ్యునల్స్ సంస్కరణల(హేతుబద్దీకరణ, సర్వీసు నిబంధనల) చట్టం–2021.. ట్రిబ్యు నల్స్ సంస్కరణల(హేతుబద్దీకరణ, సర్వీసు నిబంధనల) ఆర్డినెన్స్–2021కు దాదాపు ప్రతిరూపంగానే ఉందని, కొత్త సీసాలో పాత సారా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజ్యాంగపరంగా లోపంతో కూడుకున్న అంశాన్ని కోర్టు తిరస్కరిస్తే పార్లమెంట్ అదే అంశాన్ని మరో రూపంలో తీసుకురావడం న్యాయ వ్యవస్థ నిర్ణయాన్ని అతిక్రమించినట్లే అవుతుందని స్పష్టంచేసింది. కోర్టు గుర్తించిన లోపాన్ని సరిచేయడమే పార్లమెంట్ విధి అని సూచించింది. కోర్టులపై ఇప్పటికే పెండింగ్ కేసుల భారం పెరిగిపోతోందని గుర్తుచేసింది. ఈ భారాన్ని తగ్గించే బాధ్యత కేవలం కోర్టులపైనే కాకుండా అందరిపైనా ఉందని పేర్కొంది. ప్రభుత్వం కూడా తోడ్పాటు అందించాలని కోరింది. ట్రిబ్యునళ్ల స్వతంత్రత, పారదర్శకతను కాపాడడంతోపాటు నియామకాలు, పరిపాలనలో ఏకరూపత కోసం నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్ను ఏర్పాటు చేయాలని కేంద్రానికి తేల్చిచెప్పింది. ఇందుకోసం నాలుగు నెలల సమయం ఇస్తున్నామని తెలిపింది. తమ ఆదేశాల మేరకు ఈ కమిషన్ పని చేయాలని వెల్లడించింది. ట్రిబ్యునళ్ల సభ్యుల పదవీకాలానికి సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలను ఈ సందర్భంగా ధర్మాసనం పునరుద్ధరించింది. ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్, కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ సభ్యులు 62 ఏళ్లు వచ్చేవరకు పదవిలో కొనసాగవచ్చని తెలియజేసింది. ట్రిబ్యునల్స్ చైర్మన్ల పదవీ విరమణ వయసు 65 ఏళ్ల వరకు ఉంటుందని పేర్కొంది. -
ఇదెక్కడి దురాచారం?
న్యూఢిల్లీ: ఇస్లాం మతాచారం ప్రకారం భర్త నెలకోసారి చొప్పున తలాక్ చెబుతూ మూడు నెలల వ్యవధిలో భార్యకు విడాకులిచ్చే తలాక్ ఏ హసన్ పద్ధతిని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. దాని రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి నివేదించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం బుధవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇలాంటి విడాకుల పద్ధతిని నాగరిక సమాజం అంగీకరించడం సహేతుకమేనా అంటూ పలు కీలక ప్రశ్నలు సంధించింది. ఇస్లాంలో ఎన్ని విడా కుల పద్ధతులు ఉన్నదీ లిఖితపూర్వకంగా తమకు కూలంకషంగా వివరించాల్సిందిగా ఇరు పక్షాలకూ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. ‘మేమేదో ఒక ప్రబలమైన మతాచారాన్ని రద్దు చేయబో తున్నామని భావించరాదు. కానీ సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే తలాక్ ఏ హసన్ వంటి దురాచారాలను సరిదిద్దేందుకు కోర్టులు తప్పక జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది‘ అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.ఇదేం దుస్థితి?తలక్ ఏ హసన్ బాధితురాలైన బేనజీర్ హీనా అనే ఢిల్లీకి చెందిన పాత్రికేయురాలు ఈ సందర్భంగా తన వాదనను స్వయంగా ధర్మాసనానికి వినిపించారు. ‘ఈ పద్ధతిలో భర్త నేరుగా భార్యకు తలాక్ చెప్పే పని కూడా లేదు. ఆయన తరఫు లాయర్, లేదా మరే ఇతర వ్యక్తి అయినా భార్యకు నెలకోసారి తలాక్ చెప్పవచ్చు. దేశ రాజధానిలోనే ఇలాంటి పరిస్థితి ఉందంటే ఇక మారుమూల ప్రాంతాలకు చెందిన ముస్లిం మహిళలు ఇలాంటి దురాచారాలకు ఇంకెంతగా బలవుతున్నదీ అర్థం చేసుకోవచ్చు‘ అని ఆవేదన వెలిబుచ్చారు. ఆమె మాజీ భర్త తరఫు లాయర్ తలాక్ ఏ హసన్ ను సమర్థిస్తూ వాదనలు వినిపించబోగా జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఏ విధంగా చూసినా ఇదసలు మహిళల గౌరవాన్ని కాపాడే చర్యేనా? 2025లో కూడా ఇలాంటి వాటిని అనుమతించడం ఏ మేరకు సబబు? వీటిని మీరెలా సమర్థిస్తారు?‘ అని ప్రశ్నించారు. ‘తలాక్ కోసం లాయర్ ను సంప్రదించగలిగిన వ్యక్తి, అదే విషయమై నేరుగా భార్యతో మాట్లాడేందుకు ఇబ్బందేమిటన్నది అర్థం కావడం లేదు. ఇకముందు బహుశా లాయర్లే విడాకులు ఇచ్చేస్తారు కాబోలు!‘ అంటూ దుయ్యబట్టారు. ‘తన హక్కుల కోసం కోర్టు మెట్లెక్కిన హీనా ధైర్యానికి సెల్యూట్. తనో జర్నలిస్టు గనుక ఇక్కడిదాకా రాగలిగింది. అంతటి అవగాహన, వెసులుబాటు లేని పేద, అణగారిన ముస్లిం మహిళల పరిస్థితి ఏమిటి? ఇలాంటి అన్యాయపు మతాచారాలకు మౌనంగా బలి కావాల్సిందేనా?‘ అంటూ ఆవేదన వెలి బుచ్చారు. తర్వాతి విచారణకు మాజీ భర్త హాజర య్యేలా చూడాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఇస్లాంలో అత్యంత ప్రబలంగా ఉన్న ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని 2917లో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇవ్వడం తెలిసిందే. -
ఆస్తి వివాదాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: హిందూ వారసత్వ చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కుటుంబాల్లో వారసత్వ హక్కులపై తలెత్తే వివాదాలను నివారించేందుకు హిందూ మహిళలు తమ ఆస్తిపై వీలునామా రాసుకోవాలని సూచించింది. వయస్సుతో సంబంధం లేకుండా, మహిళలు ముందుగానే తమ ఆస్తులపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోర్టు అభిప్రాయపడింది.ఓ హిందూ కుటుంబంలో ఆస్తి పంపకాలపై తలెత్తిన వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా తల్లిదండ్రుల ఆస్తిపై హక్కు, భర్త ఇంటి ఆస్తిపై హక్కు వంటి అంశాల్లో మహిళలు న్యాయపరంగా చిక్కుల్లో పడే అవకాశాలు ఉన్నాయని, అలాంటి పరిస్థితుల్లో విలునామా ఉంటే స్పష్టత ఉంటుందని కోర్టు పేర్కొంది.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ సందర్భంగా మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, అత్తమామల మధ్య తలెత్తే ఆస్తి వివాదాల్లో మహిళలు న్యాయపరంగా ఇరుక్కుపోవడం మంచిది కాదు. అలాంటి వివాదాల్లో మహిళలు న్యాయపరంగా జోక్యం చేసుకోవడం వల్ల కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి’అని పేర్కొంది.కోర్టు అభిప్రాయం ప్రకారం, హిందూ వారసత్వ చట్టం ప్రకారం మహిళలకు తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు ఉన్నప్పటికీ, వాస్తవికంగా ఆ హక్కును వినియోగించడంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వివాహిత మహిళలు తమ తల్లిదండ్రుల ఆస్తిపై హక్కు కోరినప్పుడు, అత్తింటి కుటుంబంతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో మహిళలు తమ ఆస్తులపై ముందుగానే వీలునామా రాసుకోవడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే వివాదాలను నివారించవచ్చని కోర్టు సూచించింది. ఇది కుటుంబ శాంతి, సౌహార్దతకు దోహదపడుతుందని అభిప్రాయపడింది. ఈ తీర్పు, హిందూ వారసత్వ చట్టం పరిధిలో మహిళల హక్కుల పరిరక్షణకు దోహదపడేలా ఉండగా..ఆస్తి పంపకాల విషయంలో ముందస్తు ప్రణాళిక అవసరమని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పు ఆధారంగా, హిందూ మహిళలు తమ ఆస్తులపై స్పష్టమైన వీలునామా ఉండడం వల్ల భవిష్యత్తులో తలెత్తే కుటుంబ వివాదాలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
‘పిల్లల్ని గ్యాస్ చాంబర్లో పెట్టినట్లే అవుతోంది’
ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ రాజధానిలో పెరుగుతున్న కాలుష్యంపై సీజేఐ ధర్మాసనం బుధవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కాలుష్యం నడుమ స్కూల్ పిల్లలను గ్యాస్ చాంబర్లో పెట్టినట్లే అవుతోందని.. కాబట్టి ఇలాంటి సమయంలో క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని వ్యాఖ్యానించింది. దేశ రాజధానిలో కాలుష్యం రోజురోజుకి పెరిగిపోతోంది. పాఠశాల పిల్లలను గ్యాస్ చాంబర్లో పెట్టినట్లే అవుతోంది. కాలుష్యం ఎక్కువగా ఉన్న ఈ సమయంలో స్పోర్ట్స్ ఈవెంట్ల పెట్టొద్దు. క్రీడా కార్యక్రమాలను కాలుష్యం లేని ప్రాంతాల్లో నిర్వహించాలి. నవంబర్-డిసెంబర్ నెలల్లో నిర్వహించాల్సిన స్పోర్ట్స్ ఈవెంట్లు వాయిదా వేయించండి అని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో స్కూళ్లలో స్పోర్ట్స్ ఈవెంట్లను వాయిదా వేయించాలని, గాలి నాణ్యత మెరుగయ్యాకే వాటిని నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(CAQM)కి చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. -
ఇదే లాస్ట్ స్పీకర్పై సుప్రీం సీరియస్..
-
ఎమ్మెల్యేల అనర్హతపై వారంలోగా నిర్ణయం తీసుకోండి. లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలకు సిద్దంగ ఉండండి.
-
టైగర్ రిజర్వుల చుట్టూ ఈఎస్జెడ్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న టైగర్ రిజర్వుల పరిరక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. టైగర్ రిజర్వుల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని సున్నిత పర్యావరణ జోన్లు(ఈఎస్జెడ్)లుగా ప్రకటించాలని, బఫర్ జోన్లలో కిలోమీటర్ పరిధిలో మైనింగ్ కార్యకలాపాలపై పూర్తి నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.ఏడాదిలోగా వీటిని అమలు చేయాలని స్పష్టం చేసింది. జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వులో అక్రమంగా చెట్ల నరికివేత, నిర్మాణ పనుల కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని ఉత్తరఖాండ్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ సారథ్యంలోని ధర్మాసనం 80 పేజీల తీర్పు వెలువరించింది. జిమ్ కార్బెట్కు తీవ్ర నష్టం టైగర్ రిజర్వుల్లో పర్యావరణ ఉల్లంఘనలు, నష్టం తీవ్రత, పునరుద్ధరణ చర్యలతోపాటు ప్రఖ్యాత జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వులో జరిగిన విధ్వంసానికి బాధ్యులైన అధికారుల గుర్తింపు తదితరాలపై 2024 మార్చిలో నియమించిన నిపుణుల కమిటీ తాజాగా ఇచి్చన నివేదికను ధర్మాసనం ఆమోదించింది.కార్బెట్ టైగర్ రిజర్వులో సుమారు రూ.30 కోట్ల మేర విధ్వంసం జరిగినట్లు కమిటీ అంచనా వేసిందని ధర్మాసనం పేర్కొంది. దెబ్బతిన్న పర్యావరణ వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించేందుకు రూ.4.3 కోట్ల వరకు ఖర్చవుతుందని తేలి్చనట్లు కూడా ధర్మాసనం తెలిపింది. ఈ నివేదిక సూచనల మేరకు జిమ్కార్బెట్ టైగర్ రిజర్వు పునరుద్ధరణ కోసం చేపట్టాల్సిన చర్యలపై రెండు నెలల్లోగా ఒక ప్రణాళికను రూపొందించాలని ఉత్తరాఖండ్ చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్ను ధర్మాసనం ఆదేశించింది. నిపుణుల కమిటీ నివేదికలో పేర్కొన్న అనధికారి నిర్మాణాలను మూడు నెలల్లోగా కూల్చి వేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తమ తీర్పు మేరకు అమలు చేసిన చర్యలతో ఏడాదిలోగా అఫిడవిట్ దాఖలు చేయాలంది. -
విమాన చార్జీల అడ్డ్డగోలు పెంపు
న్యూఢిల్లీ: దేశంలో ప్రైవేట్ విమానయాన సంస్థలు ఆకస్మికంగా ప్రయాణ ఛార్జీలను, ఇతర రుసుములను పెంచకుండా నిబంధనలు పాటించేలా చూడాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసు జారీ చేసింది. సామాజిక కార్యకర్త ఎస్.లక్ష్మీనారాయణన్ వేసిన పిటిషన్పై సోమవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎకానమీ తరగతి ప్రయాణికులకు 25 కిలోల వరకు లగేజీ ఉచిత సౌకర్యం ఉండగా, దానిని ప్రైవేట్ విమానయాన సంస్థలు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా దీనిని 15 కిలోలకు తగ్గించాయని పేర్కొన్నారు.అదేవిధంగా, విమాన ప్రయాణ చార్జీలు, అనుబంధ ఫీజులను నియంత్రించే వ్యవస్థంటూ ఏదీ లేకుండా పోయిందన్నారు. ఇదే అదనుగా విమాన యాన సంస్థలు ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచుతు న్నాయని, ముఖ్యంగా పండగలు, అననుకూల వాతావరణ పరిస్థితుల్లో మరీ హద్దుమీరు తున్నాయన్నారు. పౌర విమానయాన రంగంలో ప్రయాణికులకు భద్రతతోపాటు పారదర్శకత ఉండేలా సమర్థమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి, డీజీసీఏకి, ఎయిర్పోర్టు నియంత్రణ ప్రాథికార సంస్థకు నోటీసులు జారీ చేసి..తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
నిర్ణయం తీసుకుంటారా? ధిక్కరణ చర్యలు ఎదుర్కొంటారా?
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో తాత్సారం చేస్తున్నారంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారంటూ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం మండిపడింది. ‘అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకుంటారా? లేక కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొంటారా? అనేది స్పీకరే తేల్చుకోవాలి. వచ్చే వారంలోగా అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోండి. లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవ డానికి సిద్ధంగా ఉండండి’అనిఅల్టిమేటం జారీ చేసింది. ఈ వ్యవహారంలో 4 వారా ల్లోగా సమాధానం ఇవ్వాలని స్పీకర్ కార్యాల యానికి నోటీసులు జారీ చేసింది.కచ్చితంగా కోర్టు ధిక్కరణే.. రక్షణ ఉండదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి దాఖ లు చేసిన పిటిషన్తో పాటు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు దాఖలు చేసిన కోర్టు ధిక్క రణ పిటిషన్ను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. గతంలో జూలై 31న, మూడు నెలల్లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్ను ఆదేశించింది. అయితే ఆ గడువు ముగిసినా ఎటువంటి నిర్ణయం వెలువడలేదు. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. ‘అనర్హత పిటిషన్లను విచారించేటప్పుడు స్పీకర్ ఒక ‘ట్రిబ్యునల్’గా వ్యవహరిస్తారు. ఆ సమయంలో ఆయనకు ఎటువంటి రాజ్యాంగపరమైన మినహాయింపులు వర్తించవు. కోర్టు ఆదేశాలను పాటించకపోవడం స్పష్టంగా తీవ్రమైన ధిక్కరణ కిందకే వస్తుంది’అని ఘాటుగా వ్యాఖ్యానించారు. న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారు? విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. స్పీకర్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. ‘వచ్చే కొత్త సంవత్సరాన్ని ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో ఆయనే (స్పీకర్) నిర్ణయించుకోవాలి’అని హెచ్చరించారు. ‘తక్షణం దీనిని తేల్చండి.. లేదా మేమే ధిక్కరణ చర్యలు మొదలుపెడతాం’అని సీజేఐ స్పష్టం చేశారు. కాగా నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని స్పీకర్ తరఫు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, అభిషేక్ మను సింఘ్వీలు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అంతేగాక తాము ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం లేదని, హైకోర్టు, సుప్రీంకోర్టు మధ్య పిటిషనర్ తిరుగుతుండటం వల్ల ఏర్పడిన న్యాయపరమైన సందిగ్ధత వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వారు సమరి్థంచుకునే ప్రయత్నం చేశారు. అన్ని పిటిషన్లూ ఒకే దశలో లేవని, నాలుగు పిటిషన్ల విచారణ పూర్తయిందని, మూడు పిటిషన్లకు సంబంధించి సాక్ష్యాధారాల నమోదు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. రెండు పిటిషన్లను ఇంకా పరిశీలించలేదని అవి విచారణ దశలో ఉన్నాయని స్పీకర్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వివరించారు. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలి.. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం, సమాధానం చెప్పడానికి నాలుగు వారాల సమయం ఇచ్చింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతానికి స్పీకర్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ, తదుపరి విచారణ నాటికి కచ్చితమైన పురోగతి ఉండాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ధర్మాసనం సంకేతాలు ఇచ్చింది. -
ఎమ్మెల్యేల ఫిరాయింపు.. స్పీకర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ స్పీకర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోకపోవడాన్ని ఆక్షేపించింది. అంతేకాదు.. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా జవాబు చెప్పాలని ఆదేశించింది.2023 డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ తరఫున గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పక్షంవైపు మళ్లడం తెలిసిందే. పార్టీ ఫిరాయించిన వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెళ్ళం వెంకటరావు, అరెకపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, ప్రకాశ్ గౌడ్, కాలే యదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. వీరిపై వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ స్పీకర్ను కోరింది. నిర్ణయం ఏదీ వెలువడని నేపథ్యంలో జనవరి 16న సుప్రీంకోర్టు ఆశ్రయించింది. కేసు విచారించిన సర్వోన్నత న్యాయస్థానం మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ గడువు పూర్తయిన తరువాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఈ విషయమై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయి నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపింది. నిర్ణీత గడువులోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలన్న తమ ఆదేశాలను పాటించకపోవడం కోర్టు ధిక్కారమేనని స్పష్టం చేసింది. స్పీకర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ, , ముకుల్ రోహత్గీలు మాట్లాడుతూ ఇంకో నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని నివేదించారు. రోజువారీ విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని, నాలుగు వారాల్లో తమకు జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతకుముందు.. తెలంగాణ స్పీకర్ కార్యాలయం ఫిరాయింపు ఎమ్యెల్యేలపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ ప్రారంభించినట్టు సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ విచారణ పూర్తి చేసేందుకు మరింత సమయం కావాలని కోరింది. అయితే, జూలై 31న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ పాటించట్లేదంటూ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.Supreme Court asks Telangana Speaker to decide the disqualification pleas against 10 BRS MLAs who defected to the ruling Congress. Supreme Court asks Speaker to decide the disqualification petitions by next week or face contempt.— ANI (@ANI) November 17, 2025 -
మహిళా సాధికారత దిశగా 'దేశం పురోగమనం'
భారత రాజ్యాంగాన్ని అంబేడ్కర్ ఓ స్థిర పత్రంలా చూడలేదు. దేశంలో పరిస్థితులు, సమాజ మార్పులకు అనుగుణంగా మారుతూ ఉండాలని ఆకాంక్షించారు. అందులో భాగంగానే మన రాజ్యాంగానికి సవరణలు చేస్తూ వస్తున్నాం. దేశ పౌరుల హక్కులకు విఘాతం కలిగినప్పుడు కోర్టులను ఆశ్రయించే అవకాశం ఇచ్చింది మన రాజ్యాంగమే. ఈ నేపథ్యంలో న్యాయ, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మనందరం కట్టుబడి ఉండాలి. – సీజేఐ జస్టిస్ గవాయ్సాక్షి, అమరావతి: సమానత్వం, మహిళా సాధికారత దిశగా దేశం పురోగమిస్తోందని, అన్ని రంగాల్లో మహిళలు గొప్పగా రాణిస్తున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్నారు. న్యాయ వ్యవస్థలోకి వచ్చే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, కింది స్థాయి న్యాయ వ్యవస్థలో మహిళా న్యాయాధికారుల సంఖ్య 60–70% ఉండటం సమానత్వానికి, మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు. ఇది దేశ ప్రగతికి శుభ సూచకమని.. దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ పురోగతిని సైతం సూచిస్తోందని ఆయన తెలిపారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆదివారం విజయవాడలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ గవాయ్ ప్రధానోపన్యాసం చేశారు. ప్రజలకు తమ హక్కులపై అవగాహన ఉన్నప్పుడే వాటిని పొందడం సాధ్యమవుతుందని చెప్పారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే పౌరులు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించే గొప్ప అవకాశాన్ని రాజ్యాంగం కల్పించిందన్నారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగించే సమయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాట్లాడిన మాటలు ప్రతి న్యాయ విద్యార్థికి కంఠోపాఠం కావాలని తెలిపారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని ఓ స్థిర పత్రంలా చూడలేదని.. పరిస్థితులు, సమాజ మార్పులకు అనుగుణంగా మారుతూ ఉండాలని ఆకాంక్షించారన్నారు. అందులో భాగంగానే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన భారత రాజ్యాంగానికి సవరణలు చేస్తూ వస్తున్నామని, అంబేడ్కర్ సైతం ఇదే ఆశించారని తెలిపారు.మన రాజ్యాంగం వల్లే అణగారిన వర్గాలకు అవకాశాలురాజ్యాంగంలో పేర్కొన్న వ్యవస్థలు ఒక దాంట్లో ఒకటి జోక్యం చేసుకోరాదని, ఒకవేళ జోక్యం చేసుకుంటే ప్రజాస్వామ్యం పేక మేడలా కూలిపోతుందని జస్టిస్ గవాయ్ తెలిపారు. మన రాజ్యాంగం వల్లే ఈ దేశంలో అణగారిన వర్గాల వారు ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారన్నారు. ఇందుకు ప్రస్తుత రాష్ట్రపతి, తానే ప్రత్యక్ష ఉదాహరణ అని స్పష్టం చేశారు. గతంలో కేఆర్ నారాయణన్, రామ్నాథ్ కోవింద్లు రాష్ట్రపతులుగా పనిచేశారని, ఎస్సీ అయిన బాలయోగి లోక్సభ స్పీకర్గా పని చేశారన్నారు. ఓ ఛాయ్వాలా కూడా ఈ దేశ ప్రధాని కాగలిగారంటే అందుకు రాజ్యాంగమే కారణమని ప్రస్తుత ప్రధాన మంత్రి చెప్పారని గుర్తు చేశారు. మొదట దేశమే ముఖ్యమని, దేశ గతి కన్నా ఏదీ, ఎవరూ ముఖ్యం కాదని అంబేడ్కర్ చాలా స్పష్టంగా చెప్పారన్నారు. తాను పుట్టిన అమరావతి (మహారాష్ట్రలో ఉంది) నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రావడం యాధృచ్చికమన్నారు. తాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినప్పుడు మొదట అమరావతికే వెళ్లానని, ఇప్పుడు పదవీ విరమణ చేస్తున్న వేళ మళ్లీ అమరావతికే వచ్చానని చెప్పారు.సమానత్వం కాగితాలకు పరిమితం కారాదు పరిష్కారాలు చూపకుండా హక్కులు కల్పించినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదని అంబేడ్కర్ గట్టిగా వాదించారని జస్టిస్ గవాయ్ తెలిపారు. హక్కులకు విఘాతం కలిగినప్పుడు పౌరులు కోర్టులను ఆశ్రయించే అవకాశం అలానే వచ్చిందన్నారు. ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణకే రాజ్యాంగ సవరణలు చేస్తూ వస్తున్నామని చెప్పారు. సమానత్వమే అన్నింటి కన్నా సర్వోత్కృష్టమైనదన్నారు. సమానత్వం కేవలం కాగితాలకే పరిమితం కారాదన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్లతో పాటు ఇతర ఉన్నతాధికారుల పిల్లలకు మంచి విద్యను అభ్యశించే అవకాశం ఉంటుందని, అదే ఓ పేద రైతు బిడ్డకు ఆ అవకాశం ఉండదని చెప్పారు. అందుకే తాను రిజర్వేషన్ల కల్పనలో క్రిమిలేయర్ను ప్రామాణికంగా చేసుకోవాలని ఎస్సీ ఉప వర్గీకరణ తీర్పులో స్పష్టంగా చెప్పానని గుర్తు చేశారు. హక్కులు, మహిళా సాధికారిత కోసం జ్యోతిరావు పూలే, సావిత్రీ బాయి ఎంతో పాటుపడ్డారన్నారు. జ్యోతిరావు పూలేను అంబేడ్కర్ తన గురువుగా భావించారని తెలిపారు. న్యాయ, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం ఎంతో అవసరమని, ఇప్పుడు దేశం ఆ దిశగా పయనిస్తోందని చెప్పారు. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మనందరం కట్టుబడి ఉండాలని, ఇందుకు అందరం ప్రతిజ్ఞ చేయాలన్నారు. ప్రజాస్వామ్యం మరింత గొప్ప స్థాయికి చేరాలంటే మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.సాధించిన మైలు రాళ్లు ఎంతో గర్వ కారణం హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, దశాబ్దాల కాలంగా పలు రంగాల్లో మనం ఎన్నో మైలు రాళ్లు సాధించామని, ఇది మనకు ఎంతో గర్వకారణమని చెప్పారు. మన రాజ్యాంగం మన దేశాన్ని కొత్తగా ఆవిష్కరించిందన్నారు. దేశ ఐక్యత, సార్వభౌమత్వానికి రాజ్యాంగం ప్రతీక అన్నారు. అణగారిన వర్గాలకు, మైనారిటీలు, వెనుకబడిన తరగతులకు రాజ్యాంగం ఎన్నో రక్షణలను కల్పించిందని చెప్పారు. ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవించడమే కాకుండా, దాన్ని సదా పరిరక్షిస్తుండాలని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, జస్టిస్ గవాయ్ ఎంతో గొప్ప మానవతా వాది అన్నారు. సమానత్వాన్ని మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపించే వ్యక్తి అని తెలిపారు. ఆయన ఇచ్చిన పలు తీర్పులు చిరస్థాయిగా నిలచిపోతాయన్నారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థకు శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ, మీడియా అనేవి నాలుగు మూల స్థంభాలని.. వీటి వల్లే మన దేశం ఉత్తమమైన ప్రజాస్వామ్య దేశంగా నిలబడిందని చెప్పారు. అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం కూడా మాట్లాడారు.జస్టిస్ గవాయ్కి ఘన సన్మానం కార్యక్రమంలో చివరగా జస్టిస్ గవాయ్ని హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యవర్గం ఘనంగా సన్మానించింది. వేంకటేశ్వరస్వామి జ్ఞాపికలు బహూకరించింది. రాష్ట్ర న్యాయాధికారుల సంఘం కూడా ఆయన్ను సత్కరించి, గౌతమ బుద్దుని జ్ఞాపికను అందించింది. విజయవాడ, గుంటూరు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు కూడా సత్కరించి పుష్పగుచ్ఛాలు అందించారు. బార్ కౌన్సిల్ సభ్యుడు బీవీ కృష్ణారెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు కేవీ రఘువీర్లు జస్టిస్ గవాయ్ని గజ మాలతో సన్మానించారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి చేజర్ల సుబోధ్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదులు, హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి చేజర్ల సుబోధ్, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇవన సాంబశివ ప్రతాప్, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పసల పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ, పలువురు సీనియర్ న్యాయవాదులు, జిల్లా జడ్జీలు, న్యాయాధికారులు, న్యాయవాదులు, ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. -
ఆల్–ఉమెన్ రూట్స్ కేఫ్
‘నేను ఎంత సంపాదించాను’ అని లెక్కలు వేసుకునేవారు కోకొల్లలుగా ఉంటారు. ‘నేను ఏం తింటున్నాను’ అని ఆరోగ్య ప్రమాణాలతో విశ్లేషించుకునేవారు వేళ్ల మీద లెక్కించే స్థాయిలోనే ఉంటారు. సుప్రీం కోర్టు లాయర్ మీనాక్షి కుమార్ రెండో కోవకు చెందిన వ్యక్తి. వివిధ రకాల వంటకాలు నేర్చుకోవడానికి థాయ్లాండ్ వెళ్లి ప్రత్యేక శిక్షణ తీసుకున్న మీనాక్షి... ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత ‘తాజా కూరగాయలు – తాజా వంటకాలు’ నినాదంతో ‘రూట్స్ కేఫ్’ పేరుతో ఫామ్–టు–టేబుల్ ఫుడ్ కేఫ్ స్టార్ట్ చేసి దానిని ఆల్–ఉమెన్ కేఫ్గా తీర్చిదిద్దింది. తన పొలంలో రసాయన రహిత కూరగాయలు పండిస్తోంది. మహిళా ఆర్థిక స్వాతంత్య్రం ప్రాముఖ్యత గురించి ప్రచారం చేస్తోంది..నల్లకోటులో సుప్రీం కోర్టు కారిడార్లలో బిజీ బిజీగా కనిపించేది మీనాక్షి కుమార్. ఆమె తండ్రి కూడా న్యాయవాది. క్రిమినల్ లాయర్గా మంచి పేరు తెచ్చుకుంది. 2011 సంవత్సరం ఆమె జీవితాన్ని కొత్తదారిలోకి తీసుకువెళ్లింది. ఆ సంవత్సరం యూకేలోని న్యూ క్యాజిల్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి వెళ్లింది మీనాక్షి.సరదాగా మొదలైంది...యూనివర్శిటీలోని డార్మిటరీ కిచెన్లో సరదాగా వంట చేసేది మీనాక్షి. ఆ సరదా కాస్తా ఫ్యాషన్గా మారింది. యూకేలో తనకు సింగపూర్ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడు ఇలా అన్నాడు.... ‘చదువు కోసం మాత్రమే కాదు మనకు ఆనందాన్ని ఇచ్చే కొత్త విద్యలు నేర్చుకోవడానికి కూడా సెలవులు పెట్టవచ్చు’ చార్టెర్డ్ ఎకౌంటెంట్ అయిన అతడు కిక్ కోసం పేస్ట్రీ స్టూడెంట్గా మారాడు. అతడి మాటలు మీనాక్షిపై బాగా ప్రభావం చూపించాయి. వెంటనే బ్యాంకాక్కు వెళ్లి ప్రసిద్ధ పాకశాస్త్ర పాఠశాల ‘లె కార్డాన్ బ్లూ’లో చేరింది. అది తొమ్మిది నెలల కోర్సు. స్టార్ చెఫ్ గగన్ ఆనంద్ దగ్గర పాఠాలు నేర్చుకునే అవకాశం వచ్చింది. అలా వచ్చింది ఒక ఐడియా!మీనాక్షి ఇండియాకు వచ్చిన తరువాత, కోవిడ్ కల్లోలం మొదలైంది. ఇంటికే పరిమితమైన ఆమె టెర్రస్పై రకరకాల కూరగాయలు పండించేది. ‘సరిగ్గా వినియోగించుకుంటే చిన్న స్థలంలో కూడా పెద్ద దిగుబడి సాధించవచ్చు’ అనే విషయాన్ని గ్రహించిన మీనాక్షి ఆ తరువాత నోయిడాలోని తన కుటుంబానికి చెందిన ఎకరం పొలంలో సేంద్రియ వ్యవసాయానికి శ్రీకారం చుట్టింది. ఆ వ్యవసాయ క్షేత్రం ఆమె ప్రయోగశాలగా మారింది. ఒకరోజు మార్నింగ్ వాక్కు వెళుతూ ఒక మూలన మూతబడి ఉన్న పిజ్జా పాయింట్ను చూసింది మీనాక్షి. ఆ సమయంలోనే తనలో ఒక ఆలోచన మెరిసింది.రూట్స్ కేఫ్ మొదలైంది ఇలా...‘తాజా కూరగాయలు... తాజా వంటకాలు’ నినాదంతో ‘రూట్స్ కేఫ్’ ప్రారంభించింది. తమ పొలంలో పండిన కూరగాయలనే ‘రూట్ కేఫ్’లో వినియోగించేవారు. సీజన్లను బట్టి మెనూ మారుతుంది. ‘ప్రతిదీ తాజాగా’ అనే పేరు రావడంతో ‘రూట్స్ కేఫ్’ బాగా క్లిక్ అయింది.మన దేశంలో పండే కూరగాయలే కాకుండా ప్రపంచవ్యాప్త ప్రసిద్ధి పొందిన కూరగాయలతో చేసిన వంటకాలు ‘రూట్స్ కేఫ్’లో అందుబాటులో ఉంటాయి. ‘రూట్స్ కేఫ్’ను ప్రత్యేకంగా నిలబెట్టింది దేశ, విదేశ రసాయన రహిత కూరగాయలతో చేసిన నోరూరించే వంటకాలు మాత్రమే కాదు... సిబ్బంది కూడా. ‘రూట్స్ కేఫ్’లో ఉద్యోగులందరూ మహిళలే. ‘రూట్స్ కేఫ్లో పనిచేయాలనుకునే మహిళలకు ప్రధాన అర్హత...వారికి ఎలాంటి అనుభవం లేక΄ోవడం! ఇది ఆశ్చర్యంగా ఉండవచ్చు. అయితే అనుభవం లేని వారే ఆసక్తితో అన్నీ నేర్చుకుంటారు. వారిలో అంకితభావం అధికంగా కనిపిస్తుంది. రూట్స్ కేఫ్ను ఆల్–ఉమెన్ కేఫ్గా తీర్చిదిద్దడంలో విజయం సాధించాను’ అంటుంది మీనాక్షి.జీరో నుంచి శిక్షణ‘రూట్స్ కేఫ్’లో చేరిన మహిళలకు కూరగాయలు కోయడం, వంట చేయడం నుంచి వడ్డించడం వరకు జీరో నుంచి శిక్షణ ఇచ్చింది మీనాక్షి. ‘ఉద్యోగం చేస్తున్నాను అనే సంతోషం కంటే కొత్త విద్య నేర్చుకున్నామనే సంతృప్తి వారిలో కనిపిస్తుంది’ అని రూట్స్ కేఫ్లో పనిచేసే ఉద్యోగుల గురించి చెబుతోంది మీనాక్షి. గృహిణిగా పదిహేడు సంవత్సరాలు ఇంటికే పరిమితమైన మీనాక్షి ‘రూట్స్ కేఫ్’తో ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టింది.‘కోవిడ్ తరువాత మాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏదైనా ఉద్యోగం చేయాలని గట్టిగా అనుకున్నాను. కాని నాకు ఎవరు ఉద్యోగం ఇస్తారు? మీకు ఎలాంటి అనుభవం ఉండనక్కర్లేదు. ఇంటర్వ్యూకు వచ్చేయండి...అనే రూట్స్ కేఫ్ పిలుపు నన్ను ఆకట్టుకుంది. ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. నా జీవితంలో తొలిసారిగా ఉద్యోగంలో చేరాను. నెల జీతం ఇరవై వేలు అందుకున్నప్పుడు నా సంతోషానికి హద్దులు లేవు. ఇది నేను సాధించిన జీతం అనే భావన ఎంతో సంతృప్తిని ఇచ్చింది’ అంటుంది మధుమిత. ఇలాంటి మధుమితలెందరికో కొత్త జీవితాన్ని ఇచ్చింది రూట్స్ కేఫ్. ఆర్థిక స్వాతంత్య్రమే... అసలైన ప్రాధాన్యతమోడల్ స్ట్రీట్ఫుడ్ కార్ట్లు, హై–ఎండ్ కాఫీ ప్రోగ్రామ్స్, ప్రాంతీయ వంటకాలతో ప్రయోగాలు... మొదలైనవాటితో ‘రూట్స్ కేఫ్’ విజయపథంలో దూసుకు΄ోవడం ఒక కోణం అయితే, మరో కోణం... స్త్రీల ఆర్థిక స్వాతంత్రానికి విలువనిచ్చే వేదికగా రూట్స్ కేఫ్ పేరు తెచ్చుకోవడం.‘డబ్బు అనేది మహిళలకు మాట్లాడే గొంతును ఇస్తుంది. స్వేచ్ఛను, గౌరవాన్నీ ఇస్తుంది’ అంటున్న మీనాక్షి కుమార్ ఎంతోమంది మహిళలకు శిక్షణ ఇచ్చి మరీ తన‘రూట్స్ కేఫ్’లో ఉద్యోగాలు ఇచ్చింది.ప్రతిరోజూ ఆ ఉత్సాహం మీలో ఉంటే...మొదటి అడుగు వేయడం అత్యంత కష్టతరమైనది కావచ్చు. అంతమాత్రాన అధైర్య పడవద్దు. ఒక అడుగు పడిన తరువాత భయం వెనకడుగు వేయిస్తుంది. ఆ తరువాత మాత్రం ప్రయాణం సజావుగానే సాగుతుంది. ప్రతిరోజూ ఉదయం మీలో ‘ఈ రోజు ఉద్యోగానికి వెళుతున్నాను’ అనే ఉత్సాహం కనిపిస్తుంటే మీరు సరిౖయెన బాటలోనే ప్రయాణిస్తున్నారని అర్థం. పూర్తిగా మహిళల నేతృత్వంలో ఒక కేఫ్ నడుపుతున్నందుకు గర్వంగా ఉంది. అయితే వ్యాపారం అన్నాక అన్నీ సంతోషకరమైన రోజులే ఉండవు. కొన్నిసార్లు కస్టమర్లు ఉండరు. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అయినప్పటికీ అన్నింటినీ తట్టుకుని ఉత్సాహంగా ముదుకు సాగాలి.– మీనాక్షి కుమార్ -
‘జాతీయ పార్కుల చుట్టూ మైనింగ్’పై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: వన్యప్రాణుల సంరక్షణ దిశగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ పార్కులు, వన్యప్రాణుల అభయారణ్యాల లోపల, అలాగే వాటి సరిహద్దుల నుంచి కిలోమీటర్ పరిధి వరకు ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు చేపట్టరాదని తేలి్చచెప్పింది. గతంలో ’గోవా ఫౌండేషన్’ కేసులో ఈ రకమైన ఆంక్షలను కేవలం గోవా రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేసిన ధర్మాసనం, ఇప్పుడు ఆ పరిధిని విస్తరింపజేసింది. దేశవ్యాప్తంగా ఆంక్షలు అమలవుతాయని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. ‘రక్షిత ప్రాంతాలకు కిలోమీటర్ పరిధిలో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించడం వన్యప్రాణులకు అత్యంత ప్రమాదకరం. ఇది ఈ కోర్టు స్థిరమైన అభిప్రాయం. గతంలో గోవా ఫౌండేషన్ కేసులో ఈ ఆదేశాలు గోవాకు మాత్రమే ఇచి్చనా, వీటిని దేశవ్యాప్తంగా జారీ చేయాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కొత్త ఆదేశాలతో, 2022 జూన్ 3న జారీ చేసిన పాత ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించినట్లయింది. శరందా అడవులపై విచారణ సందర్భంగా.. ప్రఖ్యాత ‘టి.ఎన్.గోదావర్మన్ తిరుమల్పాడ్’ కేసులో భాగంగా దాఖలైన పలు పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఆదేశాలను ఇచి్చంది. ముఖ్యంగా జార్ఖండ్లోని ‘శరందా’ ప్రాంతాన్ని వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను కోర్టు పరిశీలించింది. ఈ విచారణలో, శరందా ప్రాంతాన్ని వెంటనే వన్యప్రాణుల అభయారణ్యంగా నోటిఫై చేయాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేంటి?
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాల తగలబెట్టడం సైతం ప్రధాన కారణమంటూ ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పొలాల్లో వ్యర్థాలను తగలబెట్టకుండా, పరిస్థితిని నియంత్రించడానికి తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆయా రాష్ట్రాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనం ఆదేశించింది. కోర్టు సహాయకురాలు(అమికస్ క్యూరీ)గా వ్యవహరిస్తున్న సీనియర్ మహిళా అపరాజితా సింగ్ కోర్టు ఎదుట పలు అంశాలను ప్రస్తావించారు. ‘‘పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాల దహనాలు ఢిల్లీలో గాలి నాణ్యత స్థాయిలను మరింత దిగజార్చాయి. ఈ రెండు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందని స్వయంగా నాసా వారి ఉపగ్రహ చిత్రాలు సైతం రుజువుచేస్తున్నాయి. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రాలు పెడచెవిన పెట్టాయి. ఇప్పుడైనా రాష్ట్రాలు ఏపాటి చర్యలు తీసుకుంటాయో చూద్దాం’’ అని ఆమె అన్నారు. ‘పంట వ్యర్థాలను తగలబెట్టకుండా నియంత్రించడానికి తీసుకున్న చర్యలేంటో రాష్ట్రాలు స్పష్టంచేయాలి’ అని జస్టిస్ గవాయ్ ఆదేశించారు. కాలుష్యనియంత్రణ మాత్రమేకాదు నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించి ఆదేశాలిస్తామని సీజేఐ అన్నారు. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 17వ తేదీన చేపట్టనున్నారు. -
ఆ లాయర్ను వెంటనే వదిలేయండి
న్యూఢిల్లీ: గ్యాంగ్స్టర్ల తరఫున వాదిస్తున్నాడని, హత్య కేసులో అన్యాయంగా న్యాయవాదిని హరియాణా పోలీసులు అరెస్ట్చేశారని దాఖలైన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం వేగంగా స్పందించింది. చట్టవ్యతిరేకంగా లాయర్ నడుచుకున్నట్లు తమకు అనిపించట్లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అన్జారియాల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ తక్షణం న్యాయవాది విక్రమ్ సింగ్ను విడుదలచేయండి. రూ.10,00 విలువైన బాండు పూచీకత్తుపై ఆయనను వదిలేయండి. మా ఆదేశాలు త్వరగా గురుగ్రామ్ పోలీస్ కమిషనర్కు చేరేలా చూడండి’’ అని సుప్రీంకోర్టు జ్యూడీషియల్ రిజిస్ట్రార్ను ధర్మాసనం ఆదేశించింది. గురుగ్రామ్ పోలీసుల ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఢిల్లీకి చెందిన న్యాయవాది విక్రమ్సింగ్ను వెంటనే విడుదల చేయాలని దాఖలైన పిటిషన్పై వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు పైవిధంగ ఆదేశాలిచ్చింది. ఈ కేసులో న్యాయవాది తరపున హాజరైన సీనియర్ న్యాయవాది వికాస్సింగ్ వాదనలు వినిపించారు. ‘‘ పోలీసుల ఇలాంటి అత్యంత కఠిన చర్యల కారణంగా న్యాయవాదులు నేర చట్టాలపై కేసులను వాదించడానికి ముందుకురాబోరు. న్యాయవాదులపై పోలీసుల ఈ తరహా వైఖరి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అయిన వికాస్సింగ్ ఆవేదన వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైనందున ఈ అంశంపై సమ్మె కొనసాగించవద్దని ఢిల్లీ న్యాయవాదులను ఒప్పించానని ఆయన సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పిటిషనర్పై ఉన్న అన్ని క్రిమినల్ చర్యలను రద్దు చేయాలని కూడా కోరారు. న్యాయవాది విక్రమ్సింగ్ 2019 జులైలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో న్యాయవాదిగా తన పేరు నమోదుచేయించుకున్నారు.


