breaking news
Supreme court of India
-
50 శాతం మించొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ దాఖలుచేసిన పిటిషన్ను కొట్టివేసింది. గురువారం ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ప్రభుత్వ వాదనలతో ఏకీభవించలేదు. రిజర్వేషన్ల పెంపునకు మినహాయింపులు కేవలం షెడ్యూల్డ్ ఏరియాల్లోనే ఉన్నాయని గుర్తుచేస్తూ, 50 శాతం పరిమితిని మించరాదని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ప్రభుత్వం వాదన ఇదీ.. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, రిజర్వేషన్లను నిర్ణయించుకునే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. అత్యంత శాస్త్రీయంగా, దేశంలో ఎక్కడా లేనివిధంగా కుల సర్వే నిర్వహించామని తెలిపారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన ‘ట్రిపుల్ టెస్ట్’నిబంధనలకు అను గుణంగా, డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసి, ఇంటింటికీ తిరిగి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై సమగ్రంగా, శాస్త్రీయంగా సర్వే జరిపామని తెలిపారు. 94 వేల ఎన్యూమరేషన్ బ్లాక్లలో లక్షలాది మంది సమాచారాన్ని సేకరించి, బీసీ జనాభా డేటా ఆధారంగానే కమిషన్ సిఫార్సుల మేరకు రిజర్వేషన్లు పెంచామని వివరించారు. ఈ సందర్భంగా ఇందిరా సహానీ కేసులో తీర్పును సింఘ్వీ ఉటంకించారు. డేటా బేస్ ఆధారంగా, అసాధారణ పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50% మించి పెంచుకునే సౌలభ్యం ఉందని 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందని గుర్తుచేశారు. వికాస్ కృష్ణారావ్ గవాలి కేసు తీర్పు కూడా ఇదే విషయాన్ని బలపరుస్తోందన్నారు. అంతేగాక ఈ వ్యవహారంలో రాజకీయ ఏకాభిప్రాయం సాధ్యమైందని చెప్పారు. అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపాయని, అయితే గవర్నర్, రాష్ట్రపతి వద్ద బిల్లులు పెండింగ్లో ఉండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వివరించారు. బిల్లును సవాల్ చేయకుండా, దాని ఆధారంగా జారీ చేసిన జీవోను సవాల్ చేయడం సరికాదని సింఘ్వీ వాదించారు. ఇంతటి విస్తృత కసరత్తు తర్వాత, ఎలాంటి సహేతుక కారణాలు చూపకుండా హైకోర్టు స్టే విధించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కోటా 50% పరిమితి దాటరాదు: ప్రతివాదుల వాదన ప్రతివాది మాధవరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణ ప్రభుత్వ వాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో స్పష్టం చేసిందన్నారు. కృష్ణమూర్తి కేసు తీర్పును ఉటంకిస్తూ ‘షెడ్యూల్డ్ ఏరియాలు, గిరిజన ప్రాంతాల్లో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకోవడానికి అనుమతి ఉంది. జనరల్ ఏరియాల్లో ఈ పరిమితిని దాటడానికి వీల్లేదు. తెలంగాణలో అలాంటి షెడ్యూల్ ఏరియాలు లేవు. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇదే తీర్పును వెల్లడించింది’అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ట్రిపుల్ టెస్ట్లో కూడా మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదనేది ఒక కీలకమైన షరతు అని, దాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల ఉదంతాలను ప్రస్తావిస్తూ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల్లో కూడా రిజర్వేషన్ల పెంపును సుప్రీంకోర్టు తిరస్కరించి, 50 శాతం పరిమితికి లోబడే ఎన్నికలకు వెళ్లాలని ఆదేశించిందని గుర్తుచేశారు. ధర్మాసనం కీలక వ్యాఖ్యలు ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వ వాదనలతో విభేదించింది. ‘ఎస్టీ ప్రాంతాల్లోనే రిజర్వేషన్ల పెంపునకు మినహాయింపులు ఉన్నాయి కదా?’అని పేర్కొంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను, ముఖ్యంగా కృష్ణమూర్తి కేసులో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై నిర్దేశించిన 50 శాతం పరిమితిని ధర్మాసనం పునరుద్ఘాటించింది. ఈ అంశం హైకోర్టులో విచారణ దశలో ఉన్నందున హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనబడటం లేదంటూ తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తమ ఆదేశాలతో సంబంధం లేకుండా కేసు మెరిట్స్ ఆధారంగా తదుపరి విచారణను కొనసాగించాలని హైకోర్టుకు సూచించింది. ఈ తీర్పుతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రస్తుతమున్న రిజర్వేషన్ల విధానం ప్రకారమే జరగనున్నాయి. -
రాకేష్ కిషోర్పై చర్యలు.. సుప్రీం కోర్టులో ఆసక్తికర చర్చ
తనపై షూ విసిరిన లాయర్(సస్పెండెడ్) రాకేష్ కిషోర్ను భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ క్షమించినా.. న్యాయ వ్యవస్థ మాత్రం వదిలిపెట్టడం లేదు. ఆయనపై కోర్టు ధిక్కరణ కింద క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాలని తాజాగా అటార్నీ జనరల్ అనుమతిచ్చారు. అయితే.. ఈ విషయాన్ని ఇక్కడితోనే ఆపేస్తే మంచిదంటూ సుప్రీం కోర్టు గురువారం అభిప్రాయపడింది. అటార్నీ జనరల్ ఈ చర్యకు చట్టపరమైన అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని ఇక్కడితోనే ఆపేస్తే దానంతట అదే ఆగిపోతుంది. లేకుంటే.. సోషల్ మీడియాలో చర్చలతో సాగుతుంటుంది. పైగా ఈ అంశాన్ని పదే పదే చర్చించడం ద్వారా న్యాయవ్యవస్థపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది అని జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 6వ తేదీన కేసు లిస్టింగ్లు జరుగుతున్న టైంలో.. అడ్వొకేట్ రాకేష్ కిషోర్ తన షూను సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ మీదకు విసిరారు. అయితే అది ఆయన దాకా వెళ్లకుండా కింద పడిపోయింది. దీంతో అప్రమత్తమైన తోటి లాయర్లు కిషోర్ను అడ్డగించి.. కోర్టు సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు. ఆ సమయంలో సనాతన ధర్మాన్ని అవమానిస్తే దేశం ఊరుకోదు అంటూ కిషోర్ నినాదాలు చేశాడు. అయితే ఈ ఘటనను పట్టించుకోకుండా ప్రొసీడింగ్స్ కొనసాగించాలని జస్టిస్ గవాయ్ అక్కడున్నవాళ్లకు సూచించారు. ఇలాంటివి తనని ప్రభావితం చేయబోవని ఆ టైంలో అన్నారాయన.అటుపై చీఫ్ జస్టిస్ సూచనతో ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు కాకుండా సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ చూసుకుంది. దీంతో రాకేష్ను మూడు గంటలపాటు ప్రశ్నించి.. షూ, ఆయన ఫైల్స్ను అందించి ఢిల్లీ పోలీసులు వదిలేశారు. ఈలోపు.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆయన లాయర్ లైసెన్స్ను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఘటనపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. అయితే తాను చేసిన పనికి పశ్చాత్తపం చెందడం లేదంటూ కిషోర్ పలు ఇంటర్వ్యూల్లో వ్యాఖ్యానించాడు. ఆ వెంటనే సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్.. ఆయన్ని సుప్రీం కోర్టు ఆవరణలోకి అడుగుపెట్టనివ్వకుండా నిషేధం విధించింది. అయితే.. ఏజీ ఆదేశాల నేపథ్యంలో రాకేష్ కిషోర్పై క్రిమినల్ కంటెప్ట్ ఆఫ్ కోర్టుకు అనుమతించాలంటూ సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్ అధ్యక్షుడు.. సీనియర్ లాయర్ వికాస్ సింగ్ ఇవాళ ద్విసభ్య ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇది రాజ్యాంగ వ్యవస్థను అవమానించే ఘటన అని, తీవ్రంగా పరిగణించి ఈ అంశాన్ని రేపు విచారణ జరపాలని బెంచ్ను కోరారు. అయితే.. ఈ అంశం సోషల్ మీడియాలో కొనసాగుతోందని వికాస్ సింగ్ అనగా.. కొంతమంది ఈ చర్యను సమర్థించారని, ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ గౌరవాన్ని దెబ్బ తీసే అంశమని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెంచ్ వద్ద అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుని.. ఈ ఘటనలో సీజేఐ చాలా ఉదారంగా స్పందించారు. ఇలాంటి ఘటనలు సంస్థను ప్రభావితం చేయవని హుందాగా అన్నారు. అయితే.. ఆయన స్పందన గౌరవప్రదంగానే ఉన్నా సోషల్ మీడియాలో ఈ చర్యను సమర్థించడం ఆందోళన కలిగిస్తోందని తుషార్ మెహతా చెప్పారు. ఈ వ్యవహారంలో John Doe injunction(కోర్టు నుంచి ముందస్తుగా తీసుకునే నిషేధ ఉత్తర్వు) జారీ చేయాలని లాయర్ వికాస్ సింగ్ కోర్టును కోరారు. ఆ సమయంలో జస్టిస్ బాగ్చీ కలుగజేసుకుని.. ‘‘ఇది కొత్త వివాదాలకు దారితీయవచ్చు. కోర్టులో మన ప్రవర్తనే ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తుంది. ఓ బాధ్యతలేని పౌరుడి చర్యగా పరిగణించి సీజేఐ దీనిని పట్టించుకోలేదు. అలాంటి అంశాన్ని మళ్లీ తవ్వడం అవసరమా? అని అన్నారు. పైగా ఎన్నో ముఖ్యమైన అంశాలు పెండింగ్లో ఉన్నాయని, దీనిని పైకి తేవడం సమయాన్ని వృధా చేయడమేనన్న అభిప్రాయమూ ఆయన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని మరింత పెద్దది చేయడం తన ఉద్దేశం కాదని, ఇక్కడితో నిలువరించమే తన అభిమతమని వికాస్ సింగ్ స్పష్టత ఇచ్చారు. ఆపై జస్టిస్ కాంత్ మాట్లాడుతూ.. నా సహ న్యాయమూర్తి చెబుతోంది మీరు కూడా అర్థం చేసుకున్నారు. మీరు ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించిన వెంటనే, మీడియాలో కథనాలు కొనసాగుతాయి అని అన్నారు. ఆ టైంలో..‘దురదృష్టవశాత్తు, మనం డబ్బు సంపాదించే వ్యాపారాలుగా మారిపోయాం…" అని జస్టిస్ బాగ్చీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యతో సాలిసిటర్ జనరల్ ఏకీభవించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారాలు అల్గోరిథమ్స్ ఆధారంగా పనిచేస్తాయి. ప్రజలు వాటికి బానిసలుగా మారిపోయారు. ఆ బానిసత్వాన్ని ఈ ప్లాట్ఫారాలు డబ్బుగా మార్చుకుంటున్నాయి. మనం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నామనుకుంటాం, కానీ నిజానికి మనమే ఆ ప్లాట్ఫారాల ఉత్పత్తులం’’ అని మెహతా అన్నారు. ఆ సమయంలో జస్టిస్ కాంత్ కలుగజేసుకుని మనం ఉత్పత్తులమే కాదు.. వినియోగదారులం కూడా అని అన్నారు. సోషల్ మీడియా మనుషుల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దాని అల్గోరిథమ్స్ ద్వారానే.. ద్వేషం, కోపం, కామం లాంటి భావనలకు గురవుతున్నాం. సోషల్ మీడియా మన ఈ వ్యసనాన్ని మానిటైజ్ చేస్తోంది. ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అది మళ్లీ మానిటైజ్ అవుతుంది. కాబట్టి దీనిని సహజంగా ముగియనివ్వడమే మంచిది అని జస్టిస్ కాంత్ అన్నారు. పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని.. అలాగే న్యాయస్థానం కూడా బార్ (న్యాయవాదుల సంఘం) ఆవేదనను అర్థం చేసుకోవాలని లాయర్ వికాస్ సింగ్ కోరారు. ‘‘బార్ (న్యాయవాదుల సంఘం) ఎప్పుడూ న్యాయ వ్యవస్థకు అండగా నిలిచింది. మీరు న్యాయాన్ని కోరే ప్రజలతో కోర్టును కలిపే వంతెన. మీ పరిస్థితిని, మీ భావోద్వేగాలను మేము అర్థం చేసుకుంటున్నాం’’ అని జస్టిస్ కాంత్ అన్నారు. ఈ అంశాన్ని శుక్రవారం విచారణకు తీసుకురావాలని వికాస్ సింగ్ మరోసారి కోరారు. అయితే.. దీపావళి తర్వాతే విచారించే అవకాశం ఉందని బెంచ్ స్పష్టం చేసింది. ఒక వారం తర్వాత ఇది ఇంకా 'సేలబుల్' అంశంగా ఉంటుందేమో చూద్దాం అని జస్టిస్ కాంత్ సున్నితంగా వ్యాఖ్యానించారు. ఈలోపు.. అల్గోరిథమ్ కోసం కొత్త అంశం వస్తుందేమో చూడాలి అని జస్టిస్ బాగ్చీ అన్నారు. దీనికి సాలిసిటర్ జనరల్ స్పందిస్తూ.. ఇలాంటి అంశాలకు 24–48 గంటల లైఫ్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి వస్తుంది అనడంతో నవ్వులతో విచారణ వాయిదా పడింది. -
బీసీ రిజర్వేషన్లు.. తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్
సాక్షి, ఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. జీవో నెంబర్ 9పై హైకోర్టు విధించిన స్టేను ఎత్తేయాలని దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీం కోర్టు నిరాకరించింది. గురువారం వాడి వేడి వాదనల అనంతరం.. తమ తీర్పుతో హైకోర్టు విచారణపై ప్రభావం పడొచ్చని, ఈ దశలో పిటిషన్ను స్వీకరించబోమని చెబుతూ ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలే చేసింది.స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరిట తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 9ని జారీ చేసింది. అయితే తెలంగాణ హైకోర్టు ఆ జీవోపై స్టే విధిస్తూ.. విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈలోపు రిజర్వేషన్ల పరిమితి మీరకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచించింది కూడా. అయితే.. 42 శాతం బీసీ రిజర్వేషన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ను.. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఇవాళ పరిశీలించింది. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత.. ఈ అంశం హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. మెరిట్స్ ప్రకారం విచారణ కొనసాగించాలంది. కావాలనుకుంటే ప్రభుత్వం పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది. హైకోర్టులో విచారణ యధాతథంగా కొనసాగుతుందని.. అక్కడే తేల్చుకుని రావాలని పిటిషనర్ తరఫు లాయర్కు స్పష్టం చేసింది. వాదనలు ఇలా.. తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. తెలంగాణ బీసీ బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం ఇవ్వలేదు. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపాయి. శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించాం. డేటా బేస్ ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించుకోవచ్చని ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందిదేశంలో ఎక్కడా లేనివిధంగా పకడ్బందీగా సర్వే నిర్వహించాం. గవర్నర్ బిల్లు పెండింగ్లో పెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఏకాభిప్రాయంతో ఆమోదించిన బిల్లును పెండింగ్ లో పెట్టారు. బిల్లును ఛాలెంజ్ చేయకుండా బిల్లు ద్వారా విడుదల చేసిన జీవోను సవాల్ చేశారు. రిజర్వేషన్లను పెంచుకునే సౌలభ్యం ఇందిరా సహాన్ని జడ్జిమెంట్ లో 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు విధించిన ట్రిపుల్ టెస్ట్ కండిషన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వే జరిపి ఎంపరికల్ డేటా సేకరించింది. కమిషన్ సిఫారసు ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించాం. బీసీ జనాభా డేటా ఆధారంగానే బీసీల రిజర్వేషన్లు పెంచాము. ఇంటింటికి తిరిగి సామాజిక ఆర్థిక కుల సర్వే నిర్వహించాం. సమగ్రంగా , సాంకేతికంగా సర్వే జరిపాం. అన్ని వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపాం. ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఈ సర్వే నిర్వహించాం. దీనిపైన స్టే ఎలా విధిస్తారు ?. హైకోర్టు మధ్యంతర తీర్పులో ఎలాంటి సహేతుక కారణాలు లేవు. వెంపరికల్ డేటా ద్వారా ట్రిపుల్ టెస్ట్ నిర్వహించి రిజర్వేషన్లు పెంచుకోవచ్చని గౌలి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందిబెంచ్ జోక్యం చేసుకుని.. ఎస్టీ ప్రాంతాలలోనే రిజర్వేషన్ల పెంపుకు మినహాయింపులు ఉన్నాయి కదా ? అని ప్రశ్నించింది. ప్రతివాది మాధవరెడ్డి తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది. షెడ్యూల్డ్ ఏరియా ,గిరిజన ప్రాంతాలలో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకునేందుకు అనుమతి ఉంది. జనరల్ ఏరియాలలో రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచడానికి వీలులేదు. తెలంగాణలో అలాంటి షెడ్యూల్ ఏరియాలు లేవు. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇదే తీర్పు వెల్లడించింది. మహారాష్ట్ర ,మధ్యప్రదేశ్ లో కూడా సుప్రీంకోర్టు రిజర్వేషన్ల పెంపును తిరస్కరించింది. 50 శాతానికి మించకుండా ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. ట్రిపుల్ టెస్ట్ లో కూడా 50 శాతానికి మించి రిజర్వేషన్ ఉండదు అని అన్నారు. -
వ్యక్తి స్వేచ్ఛకే అధిక ప్రాధాన్యత
సాక్షి, న్యూఢిల్లీ: వ్యక్తి స్వేచ్ఛకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు హైకోర్టు, ట్రయల్ కోర్టులకు మరోసారి స్పష్టం చేసింది. బెయిల్ పిటిషన్ల విచారణ ప్రతి కేసు విషయంలో దాని సొంత మెరిట్స్ ఆధారంగా జరగాలని, ఒకరి కేసుతో మరొకరి కేసును ముడిపెట్టడం సరికాదని న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ కె.వి.విశ్వనాథన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై అసహనం వ్యక్తం చేసింది. ట్రయల్ కోర్టులు బెయిల్ అంశంలో వ్యక్తిగత హక్కులు, స్వేచ్ఛను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అత్యున్నత న్యాయస్థానం తాజా ఆదేశాలతో మద్యం అక్రమ కేసులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి భారీ ఊరట లభించింది.కేసు నేపథ్యం ఏమిటంటే..మద్యం అక్రమ కేసులో అరెస్టయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఇదే కేసులో నాల్గవ నిందితునికి ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ జరుపుతున్న హైకోర్టు, బెయిల్ రద్దు పిటిషన్పై తాము తుది నిర్ణయం తీసుకునే వరకు ఈ కేసుకు సంబంధించిన ఇతర బెయిల్ పిటిషన్లపై విచారణను నిలిపివేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ నిరవధికంగా నిలిచిపోయింది. తనకు సంబంధం లేని కేసు కారణంగా తన బెయిల్ పిటిషన్పై విచారణ జరగకపోవడం తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని పేర్కొంటూ భాస్కర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే:సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు భాస్కర్ రెడ్డి పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ జె.బి.పార్దీవాలా ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. పిటిషనర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ‘గత నాలుగు నెలలుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలులో ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్కు, హైకోర్టులో నడుస్తున్న మరో నిందితుడి బెయిల్ రద్దు పిటిషన్కు ఎలాంటి సంబంధం లేదు. అయినా విచారణ నిలిపివేయడం అన్యాయం. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం హామీ ఇచ్చిన వ్యక్తి స్వేచ్ఛ హక్కును హరించడమే’ అని వాదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్ వాదన.లు వినిపించారు. చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ను తక్షణం విచారించాలి: సుప్రీం ఆదేశాలుసుదీర్ఘ వాదనల అనంతరం ధర్మాసనం ఈ పిటిషన్పై స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ‘ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ విచారణను నిలిపివేస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఆమోదించలేదు. ఈ కేసులో ఇతర నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉన్నంత మాత్రాన, చెవిరెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణను ఆపడం సరికాదు. ఒకరి వ్యక్తి స్వేచ్ఛ అంశం ఇమిడి ఉన్నప్పుడు, ఆ బెయిల్ పిటిషన్పై విచారణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ట్రయల్ కోర్టు విచారణను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించడం వెనుక ఎలాంటి బలమైన కారణాలు కనిపించడం లేదు. వేర్వేరు దరఖాస్తులను ఒకే గాటన కట్టడం సరికాదు. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెయిల్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు తక్షణమే విచారించాలి. ఇతర కేసులతో సంబంధం లేకుండా, కేసు మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. మరో నిందితుడి బెయిల్ రద్దుపై హైకోర్టులో విచారణ దాని సొంత మెరిట్పై కొనసాగవచ్చు. ఆ విచారణలోని అంశాలు గానీ, పరిశీలనలు గానీ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై ఎలాంటి ప్రభావం చూపకూడదు’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలను ఆయా కోర్టుల ముందు ఉంచవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో పిటిషన్ను పరిష్కరిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. -
నిందితుల విచారణ వేళ లాయర్ ఉండాలా?
న్యూఢిల్లీ: నేరారోపణలు ఎదుర్కొంటున్న పిటిషనర్పై పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు కేసు విచారణలో భాగంగా ప్రశ్నల వర్షం కురిపించే వేళ పిటిషనర్ తరఫు న్యాయవాదులు అక్కడే ఉండొచ్చా? అనే ప్రశ్నకు సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాధానం రాబట్టదల్చుకుంది. ఇందుకోసం ఈ అంశంలో మీ స్పందన తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రాజ్యాంగంలోని 20(3), 21, 22 అధికరణాల ప్రకారం సంక్రమించిన హక్కులమేరకు కేసుల విచారణ సందర్భంలో వ్యక్తులు తమ న్యాయవాదులను పోలీసులు, ఇంటరాగేషన్ అధికారుల సమక్షంలో హాజరుపర్చవచ్చని, ఈ మేరకు అనుమతి మంజూరుచేయాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం న్యాయవాది షరీఫ్ మధార్ వేశారు. ఈ పిల్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ల ధర్మాసనం బుధవారం విచారించింది. లాయర్ మధార్ తరఫున సీనియర్ మహిళా న్యాయవాది మేనకా గురుస్వామిని ఈ సందర్భంగా జస్టిస్ చంద్రన్ ప్రశ్నించారు. ‘‘పోలీసులు, దర్యాప్తు సంస్థలు ప్రశ్నించేటప్పుడు నేరారోపణలు ఎదుర్కొంటున్న పిటిషనర్లు భౌతికంగా హింసకు గురైన ఘటనలు ఉన్నాయా? దర్యాప్తు వేళ లాయర్లు తప్పనిసరిగా ఉండాలా?’’అని ప్రశ్నించారు. దీంతో లాయర్ ‘ఇండియా: హింసా సంబంధ 2019 వార్షిక నివేదిక’ను గుర్తుచేశారు. ‘‘పోలీస్, దర్యాప్తు సంస్థల కస్టడీలో ఉన్నప్పుడు పిటిషనర్లు ఎదుర్కొంటున్న ఒత్తిడి, వేదన అంశాలను నివేదిక సవివరంగా వివరించింది. నేరాన్ని ఒప్పుకునేలా చేసేలా ప్రశ్నలు వేస్తే వాటిని లాయర్ సాయంతో పిటిషినర్ గుర్తించేందుకు, చేయని నేరాన్ని పొరపాటున ఒప్పుకున్నట్లు సమాధానాలు ఇచ్చే ప్రమాదకర స్థితిని లాయర్ తప్పించగలరు. ప్రస్తుతం లాయర్లను చాలా వరకు విచారణవేళ నిరాకరిస్తున్నారు. ఒకవేళ అనుమతించినా దూరంగా కూర్చోబెడుతున్నారు. తమ పిటిషనర్ను ఎలాంటి ప్రశ్నలను అడుగుతున్నారనేది లాయర్ వినిపించట్లేదు. పోలీసులు చేసే స్వీయ నేరాంగీకార ప్రయత్నాన్ని అడ్డుకునేలా పౌరులకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3) ద్వారా సంక్రమించిన హక్కు ఉల్లంఘనకు గురవుతోంది. ఆర్టికల్ 22(1) ప్రకారం తన లాయర్ ద్వారా తనను తాను రక్షించుకునే, లాయర్ సలహాలు తీసుకునే హక్కులూ ఉల్లంఘనకు గురవుతున్నాయి’’అని లాయర్ వాదించారు. -
కాలం మారుతున్నా ప్రభుత్వం మారదా?
న్యూఢిల్లీ: దేశంలో మరణ శిక్ష అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మరణ శిక్ష పడిన దోషులకు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా శిక్ష అమలు చేయడానికి ప్రభుత్వం అంగీకరించడం లేదని ఆక్షేపించింది. కాలానుగుణంగా మారడానికి సిద్ధంగా లేదని తప్పుపట్టింది. దోషులకు ఉరిశిక్ష విధించడాన్ని రద్దు చేయాలని, ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మరణ శిక్ష అమలు చేయాలని కోరుతూ సీనియర్ అడ్వొకేట్ రిషీ మల్హోత్రా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. మరణ శిక్ష ఎలా అమలు చేయాలన్న సంగతి దోషికే వదిలివేయాలని పిటిషనర్ వాదించారు. ఉరిశిక్షా? లేక ప్రాణాంతక ఇంజెక్షనా?.. రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకొనే అవకాశం దోషికి ఇవ్వాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రాణాంతక ఇంజెక్షనే సరైన విధానమని పేర్కొన్నారు. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉండగా, 49 రాష్ట్రాల్లో ఇంజెక్షన్ ద్వారా మరణ శిక్ష అమలు చేస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఉరిశిక్ష అత్యంత క్రూరమైనది, అనాగరికమైనదని, దోషి ప్రాణం పూర్తిగా పోవడానికి మృతదేహాన్ని దాదాపు 40 నిమిషాలపాటు ఉరికొయ్యకు వేలాడదీస్తారని చెప్పారు. ఉరిశిక్షతో పోలిస్తే ఇంజెక్షన్ విధానంలో ప్రాణం త్వరగా పోతుందని, ఇది మానవీయంగా, గౌరవంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అది ప్రభుత్వ విధాన నిర్ణయం మరణ శిక్ష అమలు చేసే విషయంలో అడ్వొకేట్ రిషీ మల్హోత్రా సూచనను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదికి జస్టిస్ సందీప్ మెహతా స్పష్టంచేశారు. సదరు న్యాయవాది స్పందిస్తూ... శిక్ష విషయంలో దోషికి ఆప్షన్ ఇవ్వడం సాధ్యం కాదని కోర్టుకు ఇప్పటికే సమర్పించిన అఫిడవిట్లో స్పష్టంచేశామని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ మెహతా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాలం మారుతున్నా ప్రభుత్వం మారదా? అని ప్రశ్నించారు. కాలానుగుణంగా ప్రభుత్వం మారకపోవడమే అసలు సమస్య అని అన్నారు. దోషికి ఉరి ద్వారా మరణ శిక్ష అమలు చేయడం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని అఫిడవిట్లో ప్రస్తావించామని న్యాయవాది గుర్తుచేశారు. ఈ విషయంలో 2023 మే నెలలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వును ప్రస్తావించారు. మరణశిక్ష ఎలా అమలు చేయాలన్నదానిపై సమీక్ష కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి పేర్కొన్నట్లు ఆ ఉత్తర్వులో కోర్టు వెల్లడించింది. కమిటీ ఏర్పాటు అంశం ఏమైందన్న సంగతిని ప్రభుత్వం వద్ద ఆరా తీస్తానని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. దాంతో తదుపరి విచారణను ధర్మాసనం నవంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వాన్ని ఆదేశించలేంఅడ్వొకేట్ రిషీ మల్హోత్రా 2017లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉరిశిక్ష రద్దుకు లా కమిషన్ మొగ్గుచూపిందని పేర్కొన్నారు. 187వ నివేదికలో ఇదే అంశాన్ని ప్రస్తావించిందని తెలిపారు. ఇప్పుడున్నర ఉరిశిక్ష స్థానంలో తక్కువ నొప్పితో కూడిన శిక్ష విధానాలను అమల్లోకి తీసుకురావాలని వాదించారు. ప్రాణాంతక ఇంజెక్షన్ లేదా తుపాకీతో కాల్చడం లేదా విద్యుత్ షాక్ ఇవ్వడం లేదా గ్యాస్ చాంబర్లోకి పంపించడం విధానాలను సూచించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అఫిడవిట్ సమర్పించింది. ఉరిశిక్షను రద్దు చేయలేమని తేల్చిచెప్పింది. ఈ కేసులో తాజాగా మరోసారి విచారణ జరిగింది. మరణశిక్షను అమలు చేసే విషయంలో ఒక కచ్చితమైన విధానం పాటించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించలేమని ధర్మాసనం వెల్లడించింది. -
స్థానికం.. నేడే కీలకం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు సంబంధించిన చిక్కుముడి వీడే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలు 9, 41, 42ల అమలును నిలుపుదల చేస్తూ రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవా ల్ చేసిన సంగతి తెలిసిందే. కాగా సర్కార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై గురువారం సుప్రీంకోర్టు విచారణ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాల యంలో సమావేశం కానుంది. సుప్రీంకోర్టు విచారణలో వచ్చే ఫలితం ఆధారంగా ఎన్నికల నిర్వహణ విషయంలో కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. పాత విధానంలో రిజర్వేషన్లను అమలు పరుస్తూ ఎన్నికలు నిర్వహించుకోవాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చి న మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు కనుక స్టే విధించి బీసీలకు 42శాతం రిజర్వేషన్లతో పంచా యతీ ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తే తక్షణమే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లనుంది. ఒకవేళ స్టే నిరాకరిస్తూ హైకోర్టు సూచనల మేరకు పాత రిజర్వేషన్ల విధానంలోనే ఎన్నికలకు వెళ్లాలని సుప్రీం చెప్పినా, ఇతర సూచనలు ఏమైనా చేసినా..తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై మంత్రివర్గం చర్చించి ఓ నిర్ణ యం తీసుకునే అవకాశం ఉంది. ‘దేవాదుల’,‘తుమ్మిడిహెట్టి’పైనా నిర్ణయాలు! శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగాల నిర్మాణ సంస్థ జయప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్తో 2ఒప్పందం రద్దు చేస్తే మళ్లీ టెండర్లు నిర్వహించి పనులను కొత్త కాంట్రాక్టర్కు అప్పగించాల్సి ఉంటుంది. టన్నెల్ బోరింగ్ మెషీన్కి బదులు అధునాతన టెక్నాలజీతో సొరంగం తవ్వకాలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశాలపై మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది. దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ–6 అంచనాల పెంపుతో పాటు అదనంగా మూడో దశ పనులకు అనుమతులు ఇచ్చే అంశంపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనుల పునరుద్ధరణతో పాటు తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణం వంటి అంశాలపై నిర్ణయం తీసుకోనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణ పనులకు డిజైన్ల రూపకల్పన కోసం ఇటీవల నీటిపారుదల శాఖ ఆహ్వానించిన ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లకు సైతం ఆమోదం తెలిపే (రాటిఫై) అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఎస్ఆర్ఎస్పీ రెండో దశకు రాంరెడ్డి దామోదరరెడ్డి పేరు పెట్టే అంశాన్ని కూడా రాటిఫై చేయనుంది. డిసెంబర్ 1 నుంచి విజయోత్సవాలు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7తో రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. సనత్నగర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించడంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టనుంది. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్–2047పై మంత్రివర్గం చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. హామ్ విధానంలో రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి చేపట్టడంతో పాటు ఎల్అండ్టీ నుంచి హైదరాబాద్ మెట్రో రైలును టేకోవర్ చేయాలనే నిర్ణయాలకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. -
‘ఓటుకు కోట్లు’పై నేడు సుప్రీం తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై గతంలో దాఖలైన ‘ఓటుకు కోట్లు’కేసులో గురువారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. ఓటుకు నోటు కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల నియమావళి కింద విచారణ చేపట్టాలని కోరుతూ 2021 జూలై 22న రేవంత్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే ఈ కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ అంతకుముందు ఏప్రిల్ 13న సండ్ర వెంకట వీరయ్య కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లపై తాజాగా బుధవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఈ కేసు విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని గతంలో బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్కు సంబంధించి వారి తరఫు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం తొలుత వాదనలు వినిపించారు. అనంతరం రేవంత్రెడ్డి తరఫున సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహిత్గీ సుమారు గంటకుపైగా వాదనలు వినిపించారు. ఏసీబీ కేసు అక్రమం: ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై గతంలో దాఖలైన కేసు చెల్లుబాటు కాదని రోహత్గీ వాదించారు. ఈ కేసులో ముందుగా రేవంత్రెడ్డిని ట్రాప్ చేసిన తర్వాతే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఎఫ్ఐఆర్ను నమోదు చేసిందని చెప్పారు. ఏసీబీ ట్రాప్ అక్రమమని పేర్కొన్నారు. 2015లో అమలుల్లో ఉన్న అవినీతి నిరోధక చట్టాలను అనుసరించి లంచం ఇవ్వడం నేరం కూడా కాదన్నారు. తమ కేసు 2015లో దాఖలైనందున, ఆనాటి చట్టాలే వర్తిస్తాయని చెప్పారు. మరోవైపు.. అప్పట్లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన రేవంత్ ఇప్పుడు సీఎంగా ఉన్నారు కాబట్టి మరోసారి తమ వైపు వాదనలు వినాలని బీఆర్ఎస్ నేత జగదీశ్వర్రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం ధర్మాసనాన్ని కోరారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. గురువారం వాదనల అనంతరం తీర్పును వెలువరించనుంది. -
ఏపీ మద్యం కేసు.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
సాక్షి, ఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్లు తేలేవరకు.. ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్లు విచారించవద్దన్న ఏపీ హైకోర్టు తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బెయిల్ రద్దు, బెయిల్ పిటిషన్లను మెరిట్ ఆధారంగానే నిర్ణయించాలని స్పష్టం చేస్తూ.. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది. అక్రమ మద్యం కేసులోచెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తీర్పు సందర్భంగా.. ‘‘ఈ కేసుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ఇమిడి ఉంది. బెయిల్ కేసులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఎదురు చూడాలనే ఆదేశం ఏమాత్రం సరికాదు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమే. బెయిల్ రద్దు పిటిషన్లు గానీ, బెయిల్ పిటిషన్లు గానీ మెరిట్ ఆధారంగానే నిర్ణయించాలి’’ జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఏ-38 నిందితుడిగా ఉన్నారు. తుడా (Tirupati Urban Development Authority) అధికార వాహనాలను ఉపయోగించి అక్రమ మద్యం డబ్బును తరలించారని, 2024 ఎన్నికల నిధుల కోసం అక్రమంగా ఆ డబ్బును వాడినట్లు సిట్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో.. ఈ ఏడాది జూన్ 18న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తానే తప్పూ చేయలేదని.. దేవుడు అంతా చూస్తున్నాడని.. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని పలుమార్లు ఆయన జైలు, కోర్టు బయట ఆవేదన వ్యక్తం చేయడం చూసిందే. మరోవైపు.. బెయిల్ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటిదాకా ఫలించ లేదు. తాజాగా సుప్రీం కోర్టు జోక్యం నేపథ్యంలో ఆయనకు ఉపశమనం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: లిక్కర్ కేసులో మోహిత్రెడ్డికి బిగ్ రిలీఫ్ -
‘సాక్షి’ నిలిపివేతపై సుప్రీం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ‘సాక్షి’ టీవీ ప్రసారాల నిలిపివేతపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రైవేట్ మల్టీసిస్టమ్ ఆపరేటర్ ఎలా వాదిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో తన వైఖరిని తెలియజేస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆయుధంగా వాడుకుంటూ.. తమ చానల్ను ప్రజలకు చేరకుండా అణచివేస్తున్నారంటూ ‘సాక్షి’ టీవీ యాజమాన్యం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ, జస్టిస్ అతుల్ ఎస్.చందూర్కర్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ప్రజలను, కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది నీరజ్కిషన్ కౌల్ వాదనలు వినిపిస్తూ.. ‘సాక్షి టీవీ ప్రసారాలను ఏపీ ప్రభుత్వం పూర్తిగా అడ్డుకుంటోంది. తన అధికారాన్ని, యంత్రాంగాన్ని ఒక ఆయుధంగా ప్రయోగించి సాక్షి చానల్ను ప్రజలకు దూరం చేస్తోంది. మా ప్రసారాలు ఎక్కడా కనిపించడం లేదు. కొందరు ఎమ్మెస్వోలు నిబంధనల ప్రకారం ‘అలా కార్టే’ పద్ధతిలో చానళ్లను అందిస్తున్నామని చెప్పడం కేవలం కంటితుడుపు చర్యే. కోర్టు విచారణకు రెండు రోజుల ముందు మాత్రమే మా చానల్ను అందుబాటులోకి తెస్తున్నారు. విచారణ ముగిసిన వెంటనే మళ్లీ ప్రసారాలు నిలిపివేస్తున్నారు. ఇది ప్రజలను, న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించడమే’ అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం తరఫున ప్రైవేట్ ఆపరేటర్ ఎలా వాదిస్తారు? ఎమ్మెస్వో తరఫు న్యాయవాది ఆర్యమ సుందరం స్పందిస్తూ.. తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పారు. పిటిషనర్ చానల్ను ‘అలా కార్టే’ విధానంలో అందిస్తున్నామని తెలిపారు. దీనిపై జస్టిస్ నరసింహం అసహనం వ్యక్తం చేశారు. ‘అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్నది రాష్ట్ర ప్రభుత్వం. అలాంటప్పుడు, ప్రభుత్వం తరఫున ఒక ప్రైవేట్ ఆపరేటర్ ఎలా వాదిస్తారు? ఇది ఎంతమాత్రం సరికాదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమ వైఖరిని తెలియజేస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వానికి బదులుగా సమాధానం చెప్పడాన్ని తాము అంగీకరించబోమని హెచ్చరించారు. ప్రధాన ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నందున.. ఈ కేసులో వారే స్వయంగా సమాధానం చెప్పాలని ధర్మాసనం తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ స్పందన అత్యంత కీలకమని పేర్కొంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరణతో కౌంటర్ దాఖలు చేసేందుకు.. విచారణను వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు తదుపరి విచారణను వీలైనంత త్వరగా చేపట్టేందుకు ధర్మాసనం అంగీకరించింది. -
‘అగ్రకులాల వాళ్లు వెళ్తుంటే.. ఇప్పటికీ లేచి నిలబడుతున్నారు!’
ఓబీసీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని సమర్థించుకుంటూ.. ఈ వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే 15,000 పేజీల ఆ అఫిడవిట్ ఆసక్తికర అంశాలనే పొందుపరిచింది. ప్రాచీన భారతంలో లేని కుల వివక్ష.. విదేశీ ఆక్రమణల కాలం నుంచే మొదలైందని, అది ఇప్పటికీ సమాజంలో కొనసాగుతోందంటూ ఉదాహరణలతో సహా అందులో ప్రస్తావించింది.మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం ఏప్రిల్ 21, 2021లో.. ఓబీసీ రిజర్వేషన్లను 14 శాతం నుంచి 27 శాతానికి పెంచింది. దీంతో మొత్తం రిజర్వేషన్లు 73 శాతానికి చేరాయి. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధంగా 50% రిజర్వేషన్ పరిమితిని ఉల్లఘించేలా ఉందని(ఇంద్రా సాహ్నీ కేసు), ఈ నిర్ణయం రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నమేనని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో రాజ్యాంగ పరిమితులు, సామాజిక న్యాయం మధ్య సమతుల్యతపై చర్చ మొదలైంది. ఈ లోపు.. నిశ్చయ సోనిర్బే అనే ఓబీసీ నేతతో పాటు ఎనిమిది మంది ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో అఫిడవిట్ దాఖలు చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. తాజాగా.. ఆ అఫిడవిట్లో రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం సమర్థించుకుంది. ప్రాచీన భారతదేశం కులాల లేని, ప్రతిభ ఆధారిత సమాజంగా ఉండేదని అందులో ప్రముఖంగా పేర్కొంది. వేద కాలాన్ని సమానత్వ యుగంగా అభివర్ణిస్తూ.. విదేశీ ఆక్రమణల వల్ల కుల వివక్ష వచ్చిందని తెలిపింది. అదే సమయంలో, రైతులు, కళాకారులపై కుల ఆధారిత దోపిడీ వల్ల దేశ ఆర్థిక పతనం జరిగిందని పేర్కొంది. వర్గ వివక్ష ఇంకా కొనసాగుతోందని వాదించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వ శాఖల్లో 56% ఓబీసీ ఉద్యోగులు.. ఉన్నత కులాల వారు పక్కన నుంచి పోతుంటే ఇప్పటికీ లేచి నిలబడతారు అని ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ క్రమంలో.. దామోహ్లో జరిగిన ఓ ఘటనను ప్రముఖంగా ప్రస్తావించింది. ఓబీసీ కుష్వాహా వర్గానికి చెందిన ఓ యువకుడు, ఓ బ్రాహ్మణుడి ఏఐ ఇమేజ్ క్రియేట్ చేశాడని పాదాలు కడిగించి.. బలవంతంగా ఆ నీటిని తాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కేసు నమోదైంది కూడా. ఇలాంటి ఘటనలతో.. కుల వివక్ష సమాజంలో పేరుకుపోయిందనే విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం గుర్తించాలని విజ్ఞప్తి చేసింది. జాతి నిర్మాణంలో భాగంగానే.. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో.. ఓబీసీ రిజర్వేషన్లను పెంచామని అఫిడవిట్లో పేర్కొంది. ఇదే కాదు.. సుదీర్ఘమైన అఫిడవిట్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సోషల్ సైన్స్ యూనివర్సిటీ 2023లో గోప్యంగా నిర్వహించిన ఓ సర్వే వివరాలను పొందుపరిచింది. మధ్యప్రదేశ్ వ్యాప్తంగా 10 వేల గ్రామీణ కుటుంబాలను ఈ సర్వేలో భాగం చేశారు. ఇందులో 5,578 మంది అంటే 56 శాతం.. అగ్రవర్ణాల వాళ్లు తమ నుంచి గౌరవాన్ని ఆశిస్తున్నారని, ఆఖరికి వాళ్లు వెళ్తుంటే మంచంలో కూడా కూర్చోనివ్వరని.. లేచి నిలబడి గౌరవించాల్సిందేనని పేర్కొన్నారు. 3,397 కుటుంబాలు అంటరానితనం, అస్పృశ్యత కొనసాగుతున్నట్లు వెల్లడించారు. 3,763 కుటుంబాలు.. కలిసి భోజనం చేసేందుకు ఇతర కులాల వాళ్లు అంగీకరించరని తెలిపారు. చివరకు.. కులం కారణంగానే తమ ఇళ్లలో పూజలు నిర్వహించేందుకు పూజారులు ముందుకు రావడం లేదని 3,238 మంది తెలిపారు. ఓబీసీకి చెందిన సగం మహిళలు.. వ్యవసాయ కూలీలుగానో, కూలీ పనులు చేసుకుంటున్నో గడుపుతున్నారని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో OBCల జనాభా అత్యధికంగా ఉందని.. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో తక్కువ ప్రాతినిధ్యం కలిగి ఉన్నారని వాదించింది.అయితే ఈ అఫిడవిట్లో సాంకేతిక అంశాలు ఇంకా పరిశీలించాల్సి ఉందని పేర్కొంటూ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును సమయం కోరారు. దీనిపై ద్విసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది రోజువారీ విచారణకు అనుకూలమైన కేసు అని, వాయిదాలు వల్ల ప్రజలకు న్యాయం ఆలస్యం అవుతుందని తెలిపింది. అత్యంత ప్రాధాన్యత గల కేసుగా అభివర్ణిస్తూనే.. చివరకు నవంబర్ 9వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీసీలకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించగా.. దానిని ఎత్తివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఇటు మధ్యప్రదేశ్ రిజర్వేషన్ కోటా పిటిషన్ విచారణ కొనసాగుతుండడం గమనార్హం. -
BC Reservations: ‘మా వాదనలు పూర్తిగా వినలేదు..’
సాక్షి, ఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాలు చేసింది. బీసీలకు 42% శాతం రిజర్వేషన్ల జీవో పై హైకోర్టు స్టే తొలగించాలని అందులో కోరింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం సోమవారం అర్ధరాత్రి పిటీషన్ దాఖలు చేసినట్లు సమాచారం. అందులో ఏముందంటే.. 50% రిజర్వేషన్లు పరిమితి నియమమే తప్ప రాజ్యాంగ పరమైనది కాదని పిటిషన్లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. హైకోర్టు తమ వాదనలు సంపూర్ణంగా వినకుండానే జీవో 9పై స్టే విధించిందని తెలిపింది. ఓబీసీ సమగ్ర వివరాలను కుల సర్వే ద్వారా సేకరించాం. కమిషన్ అధ్యయన తర్వాత రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించారు. తెలంగాణలో 56% పైగా బీసీలు ఉన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారమే వారికి 42 శాతం రిజర్వేషన్లు కేటాయించామని పిటిషన్ లో పేర్కొంది ప్రభుత్వం. వీలైనంత త్వరగా విచారణకు స్వీకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ శనివారం నుంచి పదిరోజుల పాటు సుప్రీం కోర్టుకు సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారాంతం లోపే ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు కావడంతో విచారణ జరిగితే వాటిని కూడా కలిపి సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. -
పాలియేటివ్ కేర్పై మార్గదర్శకాల అమలు విధానాన్ని తెలపండి
న్యూఢిల్లీ: పాలియేటివ్ కేర్పై 2017లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ జారీ చేసిన మార్గదర్శకాల అమలుపై వివరాలు తెలియజేయాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు మూడు వారాల గడువు ఇచి్చంది. కేసు తదుపరి విచారణను నవంబర్ 25కు వాయిదా వేసింది. టర్మీనల్ ఇల్నెస్ (వ్యాధి)తో బాధపడుతున్న రోగులకు జాతీయ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా పాలియేటివ్ కేర్ విధానాన్ని వర్తింపజేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా బెంచ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేంద్రానికి ఈ ఆదేశాలను జారీ చేసింది. కేంద్రం మాత్రమే కాకుండా రాష్ట్రాల నుండి కూడా సమగ్ర సమాచారం సేకరించి తెలియజేయాలని కేంద్రం తరఫు హాజరైన అదనపు సాలిసిటర్ జనరల్, సీనియర్ న్యాయవాదిని ధర్మాసనం ఆదేశాలిచి్చంది. పాలియేటివ్ కేర్: తీవ్రమైన లేదా చివరి దశ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు అందించే ప్రత్యేక వైద్య సంరక్షణ విధానం. టర్మీనల్ ఇల్నెస్ రోగి: నయంకాని వ్యాధి లేదా వైద్య పరిస్థితితో బాధపడుతూ, చివరికి మరణానికి దారితీసే అవకాశం ఉన్న వ్యక్తి. -
ముళ్ల పెరియార్ డ్యామ్ పటిష్టతకు మార్గదర్శకాలు అవసరం: సుప్రీం
న్యూఢిల్లీ: కేరళలోని 130 ఏళ్ల ముళ్ల పెరియార్ డ్యామ్ భద్రత, నిర్మాణ స్థిరత్వంపై ఉన్న ఆందోళనల నేపథ్యంలో.. ఈ డ్యామ్ను పటిష్టం, బలోపేతం చేయడానికి కొన్ని మార్గదర్శకాలు, ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. ఈ విషయమై కేంద్రం, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలకు అలాగే జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డీఎంఏ)లకు నోటీసులు జారీ చేసింది. పాత డ్యామ్కు ప్రత్యామ్నాయంగా కొత్త డ్యామ్ నిర్మించాలని కోరుతూ సేవ్ కేరళా బ్రిగేడ్’అనే ఎన్జీఓ సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై (పిల్) చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తాజా నోటీసులు జారీ చేసింది. డ్యామ్ భద్రతా అంశాలను అంచనా వేయడానికి, అలాగే కొత్త నిర్మాణం అవకాశాలను పరిశీలించడానికి నిపుణుల బృందం ద్వారా సమీక్ష చేయించాలని కూడా పిల్ కోరడం గమనార్హం. 1895లో కేరళ ఐడుక్కీ జిల్లాలోని పెరియార్ నది మీద ముళ్ల పెరియార్ డ్యామ్ నిర్మాణం జరిగింది. లీజ్ అగ్రిమెంట్ ప్రాతిపదికన ఈ డ్యామ్ను తమిళనాడు రాష్ట్రం నిర్వహిస్తోంది. -
కర్ణాటక ఓటర్ల జాబితా మోసాలపైసిట్ ఏర్పాటుకు సుప్రీం నో
న్యూఢిల్లీ: బెంగళూరు సెంట్రల్, ఇతర నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ‘మేము పిటిషనర్ తరఫు వాదనలు విన్నాం. ప్రజా ప్రయోజన పిటిషన్ (పిల్)గా దాఖలైన ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించడానికి మేము సిద్ధంగా లేము. పిటిషనర్ కావాలంటే ఎన్నికల సంఘం ముందు తన అభ్యర్థనను ఉంచవచ్చు’అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగీ్చతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం తమ అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవడానికి గడువు విధించాలని ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున న్యాయవాది రోహిత్ పాండే చేసిన అభ్యర్థనను సైతం ధర్మాసనం త్రోసిపుచి్చంది. ఇలాంటి సందర్భాల్లో తగిన న్యాయ మార్గాలను అనుసరించవచ్చని సుప్రీం సూచించింది. -
కరూర్ తొక్కిసలాటపై సీబీ‘ఐ’
సాక్షి, చెన్నై/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని కరూర్ పెను విషాద తొక్కిసలాట ఘటన కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై సీబీఐ జరిపే దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని కూడా సుప్రీంకోర్టు నియమించడం విశేషం. కమిటీలోని ముగ్గురు సభ్యుల్లో ఇద్దరు తమిళనాడు కేడర్కు చెందిన ఐపీఎస్లు ఉంటారని ధర్మాసనం తెలిపింది. తమిళనాడులో గత నెల 27వ తేదీన కరూర్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, సినీ నటుడు విజయ్ ప్రచార సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట పెను విషాదానికి దారి తీసింది. ఈ కేసును ఐజీ అష్రా కార్గ్ నేతృత్వంలోని సిట్ విచారిస్తోంది. దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ టీవీకే సుప్రీంను కోరింది. కాగా, బీజేపీసహా కొందరు బాధితులు సీబీఐ విచారణను కోరుతూ పిటిషన్ను దాఖలు చేశారు. వీరి పిటిషన్లను విన్న జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్.వి. అంజారియా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. మద్రాసు హైకోర్టు సిట్ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాగా, ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ అరుణా జగదీషన్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ యథావిధిగా కొనసాగుతుందని, దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి కామెంట్ చేయలేదని ప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో పాటు వాదనలు వినిపించిన న్యాయవాది, డీఎంకే ఎంపీ విల్సన్ తెలిపారు. కాగా, బాధితులుగా పేర్కొంటూ బాధితులు కానివారు సైతం కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారన్న విషయాన్ని న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకునిరావడంతో ఈ అంశంపై విచారణ జరుపుతామని బెంచ్ పేర్కొన్నట్లు విల్సన్ తెలియజేయడం గమనార్హం. ఇదీ చదవండి: 'మీరేం ఒంటరి కాదు..' విజయ్కు బీజేపీ సపోర్ట్!! -
ఢిల్లీలో దీపావళి ధమాకా..?
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దీపావళికి టపాసుల మోత మోగే అవకాశాలున్నాయి. వాయు కాలుష్యం దృష్ట్యా ఏళ్లుగా కొనసాగుతున్న సంపూర్ణ నిషేధంపై బీజేపీ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ప్రజల మతపరమైన, సాంస్కృతిక మనోభావాలను గౌరవిస్తూ, పర్యావరణానికి హాని కలగని రీతిలో హరిత (గ్రీన్) టపాసులకు అనుమతి ఇవ్వాలని యోచిస్తోంది. ఈ మేరకు టపాకాయలపై నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. గ్రీన్ కాకర్స్కే అనుమతి! సంపూర్ణ నిషేధం బదులుగా, ప్రభుత్వం నిర్దేశించిన, ధ్రువీకరించిన గ్రీన్ క్రాకర్స్ను మాత్రమే పరిమిత సమయం పాటు కాల్చేందుకు అనుమతించాలని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించనుంది. పండుగ ఉత్సాహాన్ని దెబ్బతీయకుండా, అదే సమయంలో కాలుష్య నియంత్రణకు పెద్దపీట వేసేలా ఈ మధ్యేమార్గం ఉత్తమమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ తమ ప్రథమ ప్రాధాన్యాలని, అందుకే కేవలం తక్కువ ఉద్గారాలు వెలువరించే హరిత టపాసుల వైపే మొగ్గు చూపుతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. ఫలించని సంపూర్ణ నిషేధం కొన్నేళ్లుగా అమలు చేస్తున్న సంపూర్ణ నిషేధం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని ప్రభుత్వం వాదించనుంది. నిషేధం ఉన్నప్పటికీ, ప్రజలు అక్రమ మార్గాల్లో ప్రమాదకరమైన, అధిక కాలుష్యాన్ని వెదజల్లే టపాసులను కొనుగోలు చేసి కాలుస్తున్నారని, దీనివల్ల కాలుష్య తీవ్రత తగ్గకపోగా కొన్నిసార్లు మరింత పెరుగుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కఠినమైన నిషేధం కంటే నియంత్రిత పద్ధతిలో గ్రీన్ క్రాకర్స్ను అనుమతించడమే ఆచరణాత్మక పరిష్కారమని బీజేపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచి్చంది. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించి, గ్రీన్ క్రాకర్స్కు అనుమతిస్తే నిబంధనల అమలులో ఏమాత్రం ఉపేక్షించబోమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నగరం అంతటా పటిష్ట నిఘా ఏర్పాటు చేయనున్నారు. -
డీప్ఫేక్, ఏఐలతో బాలికలకు వేధింపులు
న్యూఢిల్లీ: డీప్ఫేక్, కృత్రిమ మేధ (ఏఐ) సంబంధిత సాంకేతికతతో బాలికలపై జరుగుతున్న అకృత్యాలు, వేధింపుల పట్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న ఆదివారం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టేందుకు తగిన చట్టాలు అవసరమన్నారు. బాలికలపై జరుగుతున్న ఈ తరహా సాంకేతిక పరమైన దురి్వనియోగాలను గుర్తించి, తగిన చర్యలు తీసుకునే దిశలో ‘‘ఏఐ సైబర్క్రైమ్ అడ్వైజరీ కమిటీ ఆన్ గర్ల్ చైల్డ్’’అనే ప్రత్యేక సలహా కమిటీ ఏర్పాటు చేసే అవకాశాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ సూచించారు. న్యాయమూర్తులు, న్యాయ శాఖ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అవసరమని పేర్కొన్నారు. లింగ ఆధారిత బ్రూణ, శిశు హత్యలపై ప్రస్తుత చట్టాలను కఠినంగా అమలు చేయాలని సూచించారు. వీటితోపాటు బాలికలకు పోషకాహారం అందించాల్సిన ఆవశ్యకతనూ ఉద్ఘాటించారు. ఆయా అంశాలు అన్నింటిపై తల్లిదండ్రుల్లో అవగాహన పెంపునకూ కృషి జరగాలని ఉద్భోదించారు. యూనిసెఫ్ ఇండియాతో కలిసి సుప్రీంకోర్టు జువెనైల్ జస్టిస్ కమిటీ (జేజేసీ) ఆధ్వర్యంలో ‘భారతదేశంలో బాలిక రక్షణ– సురక్షిత, ప్రోత్సాహక వాతావరణం’అనే అంశంపై ఇక్కడ జరిగిన రెండు రోజుల జాతీయ వార్షిక భాగస్వామ్య సదస్సులో జస్టిస్ బీవీ నాగరత్న ముగింపు ఉపన్యాసం చేశారు. జేజేసీ సభ్యులు కూడా అయిన జస్టిస్ నాగరత్న ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... → తరచుగా మారుతున్న టెక్నాలజీల వల్ల కలిగే ప్రమాదాలు.. నిరంతరం తలపై వేలాడుతున్న ఖడ్గం లాంటిది. ఈ నేపథ్యంలో డీప్ఫేక్, ఏఐ ఆధారిత టెక్నాలజీల ద్వారా బాలల హక్కులు దురి్వనియోగం కాకుండా తగిన చట్టాలను రూపొందించాలి. ఆయా అంశాలపై 24 గంటల సమాచారం వ్యవస్థ, నిరంతరం స్పందించే జాతీయ ట్రాకింగ్ వ్యవస్థను తప్పనిసరి చేయాలి. → చట్టం ఒక్కటే సమాజాన్ని మార్చలేదు. తల్లిదండ్రుల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. బాలిక భారమనే అపోహను తొలగించే దిశలోకి తల్లిదండ్రుల దృక్పథం మారాలి. → బాలికను కాపాడటం అంటే తరతరాలను కాపాడడమంటూ సదస్సులో వ్యక్తమైన అభిప్రాయం హర్షణీయం. → ఆహారమే ఉత్తమ ఔషధం అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని పిల్లలలో పోషకాహారంపై అవగాహన పెంచడానికి పాఠశాల సిలబస్లో పోషకాహార విద్యను చేర్చాలి. పాఠశాలల చుట్టూ జంక్ఫుడ్ ప్రకటనలను నిషేధించాలి. → బాలికల అక్రమ రవాణా నిరోధక చర్యలు మరింత ఫలప్రదం కావాలంటే ఆయా నేరాలకు సంబంధించిన దర్యాప్తును ఫోరెన్సిక్, ఫైనాన్షియల్ ట్రేసింగ్తో అనుసంధానించి ప్రొఫెషనల్గా నిర్వహించాలి. అలాంటి బాలికల పునరావాసాన్ని ప్రభుత్వ బాధ్యతగా వ్యవస్థ పటిష్టం కావాలి. ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షించే వ్యవస్థను నెలకొల్పాలి. → బాధితుల సమస్యల పరిష్కారంపైనే దృష్టి కేంద్రీకరించే విధంగా ప్రతి జిల్లాలో పిల్లలకు, మహిళలకు వైద్య, మానసిక, న్యాయ సేవలు అందుబాటులో ఉండాలి. → పోలీసులకు, న్యాయ వ్యవస్థ సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వడం, విభాగాల మధ్య సమన్వయం, బాధితుల సంతృప్తి తీరుపై వార్షిక సమీక్ష అవసరం. → అణగారిన, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, వికలాంగుల విభాగాలకు సంబంధించిన బాలికలకు రాజ్యాంగం, అంతర్జాతీయ బాలల హక్కుల ఒప్పందాల ప్రకారం తగిన గుర్తింపు ఇవ్వాలి. ఆయా ప్రయోజనాలు వారికి అందేట్లు చూడాలి. → లింగ నిష్పత్తి మెరుగుదల కోసం జాతీయ, రాష్ట్ర, స్థానిక స్థాయిలలో గణాంకాల ను సమీక్షిస్తూ సంస్థల పనితీరును నిరంతరం పరిశీలించాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరాలపై పటిష్ట దర్యాప్తు పద్దతులు లేవు: జస్టిస్ పార్దీవాలా సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దీవాలా మాట్లాడుతూ క్లిష్టమైన సైబర్ నేరాలను ఎదుర్కొనే దర్యాప్తు విధానాలు దేశంలో సమర్థంగా లేవని అన్నారు. ప్రస్తుత సైబర్ యుగంలో బాలికలు బాధితులుగా మారే ప్రమాదం ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాలుసహా భారతదేశంలోని అనేక స్థానిక తెగలలో బాలిక పుట్టినప్పుడు సంతోషంగా ఉత్సవాలను జరుపుకుంటారని, అది అందరూ నేర్చుకోవాల్సిన విషయమని సూచించారు. -
‘రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్తాం.. ఈటల, సంజయ్ ఎక్కడ దాక్కున్నారు?’
సాక్షి, హైదరాబాద్: యూపీఏ హయంలో చారిత్రాత్మక చట్టాలు అమల్లోకి వచ్చాయని చెప్పుకొచ్చారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇదే సమయంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు తెలిపారు. బీజేపీ.. బీసీ వ్యతిరేక పార్టీ.. బీజేపీకి బీఆర్ఎస్ తోడైంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ..‘రేపు ఢిల్లీకి వెళ్తాం. సుప్రీంకోర్టు తలుపు తడుతాం. ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలకు మేం భయపడం. బీసీ రిజర్వేషన్ల పెంపుపై మా చిత్తశుద్ధి ప్రజలకు తెలుసు. బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు వెళ్తాం. బీసీ రిజర్వేషన్ల పెంపుపై వెనక్కి తగ్గేది లేదు. బిల్లులు గవర్నర్ దగ్గర పెండింగులో ఉన్నాయి. ప్రధాని దగ్గరికి వెళ్ళి బీజేపీ నాయకులు ఎందుకు అడగడం లేదు?. బీసీ సంఘాలు బంద్కి పిలుపునిస్తే మద్దతు ఇస్తాం. బీసీ సంఘాలు ధర్నా చేసినప్పుడు ఈటల, సంజయ్ ఎక్కడ దాక్కున్నారు?. బీజేపీ నరనరాన బీసీ వ్యతిరేక పార్టీ. బీజేపీకి బీఆర్ఎస్ తోడైంది అంటూ విమర్శలు చేశారు. అలాగే,ఆర్టీఐపై కీలక వ్యాఖ్యలు..నేటితో RTI చట్టం అమలులోకి వచ్చి 20 ఏళ్ళు అయిన సందర్భంగా స్పందిస్తూ.. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ దూరదృష్టి నాయకత్వంలో చారిత్రాత్మక సమాచార హక్కు చట్టం (RTI) 2005 అక్టోబర్ 12న అమలులోకి వచ్చింది. దేశ చరిత్రలో RTI చారిత్రాత్మక నిర్ణయం. ప్రజలకి వాస్తవాలను తెలుసుకోవడానికి మహత్తర అవకాశం RTI ద్వారా కల్పించారు. ప్రజలకు RTI జీవన రేఖగా మారింది. ఈ చట్టం ప్రజలకు ప్రభుత్వ విభాగాల సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చి పాలనలో పారదర్శకత, బాధ్యతాయుతమైన విధానాన్ని తీసుకొచ్చింది. 2014 నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం RTIకి తూట్లు పొడుస్తోంది.2019 సవరణలతో సమాచారం కమిషన్ల స్వతంత్రతను బలహీనపరిచాయి. కమిషనర్ల పదవీకాలం (5 సంవత్సరాలు), సేవా షరతులను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేలా మార్పులు జరిగాయి. స్వయం ప్రతిపత్తితో నిర్వహించే RTI కమిషనర్లు కేంద్రం ఒత్తిడిలకు తల్లోగే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర సమాచారం కమిషన్ ప్రస్తుతం 11 పోస్టులకు బదులుగా కేవలం ఇద్దరు కమిషనర్లతోనే పనిచేస్తోంది. 2025 సెప్టెంబర్ తర్వాత చీఫ్ కమిషనర్ పదవి కూడా ఖాళీగా ఉంటుంది. ఇంతకంటే దుర్మార్గం లేదు. కేంద్రంలోని ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వ అవినీతిని బహిర్గతం చేసే వ్యక్తులు రక్షణ లేకుండా దాడులు, వేధింపులకు గురవుతున్నారు. 2019 సవరణలను రద్దు చేసి కమిషన్ల స్వతంత్రతను పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర కమిషన్లలో ఖాళీలను తక్షణమే పారదర్శకంగా భర్తీ చేయాలి. కమిషన్ల పనితీరుపై నిర్దిష్ట ప్రమాణాలు, ప్రజా నివేదికలు తప్పనిసరి చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
కోటాపై ముందుకే!
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలకు సంబంధించిన జీవోలు 9, 41, 42లను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న ఈ అంశంపై సోమవారం సర్వోన్నత న్యాయస్థానంలో పిటి షన్ వేయనుంది. హైకోర్టు తీర్పు దరిమిలా తదుపరి కార్యాచరణపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, మంత్రులు, న్యాయ నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు అన్ని కోణాల్లో చర్చించాక సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలుకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు అధికారవర్గాల సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కేలా చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉన్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ క్షుణ్ణంగా పరిశీలించాకే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ సంక్షేమశాఖ ఇచ్చిన జీవో నంబర్ 9తో పాటు దాని ఆధారంగా గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్లలో రిజర్వేషన్ల ఖరారుపై పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన జీవోలు 41, 42ల అమలుపై హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 9 నుంచి అయిదు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) జారీ చేసిన నోటిఫికేషన్ కూడా రద్దయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాకే సుప్రీంను ఆశ్రయించాలనే నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. 16న కేబినెట్లో చర్చ.. ఈ నెల 16వ తేదీన కేబినెట్ భేటీ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయించారు. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలు, ఏపీ చేపడుతున్న ‘బనకచర్ల’, ఆలమట్టి ఎత్తు పెంపు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లిన తర్వాత ఎలాంటి తీర్పు వెలువడితే ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, ప్రభుత్వ జీవోలు, స్థానిక ఎన్నికల నిర్వహణతో ముడిపడిన వివిధ శాఖల మంత్రులు కూడా ఆయా అంశాలపై తమ అభిప్రాయాలను ఇప్పటికే వెల్లడించారు. మొత్తం 50 శాతం రిజర్వేషన్లతో ఈ ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రత్యేక జీవో ద్వారా బీసీలకు అదనంగా కేటాయించిన 17 శాతం రిజర్వేషన్లను ఆన్ రిజర్వ్డ్ (జనరల్)గా పరిగణించి, పెంచిన రిజర్వేషన్లు సర్దుబాటు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో..బీసీ రిజర్వేషన్ల పెంపుదలకు సంబంధించి చేసిన కసరత్తు, ఆ దిశలో కొన్ని నెలలుగా సాగించిన కృషిని తుదకంటా కొనసాగించాలనే నిశ్చితాభిప్రాయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం. తద్వారా స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచన అని అంటున్నారు. సుప్రీంలో సమర్థ వాదనలు వినిపించాలి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వేషన్ల కోసం బీసీ కమిషన్ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే, ఏకసభ్య కమిషన్ ఏర్పాటు, ఎంపిరికల్ డేటా విశ్లేషణ అనంతర నివేదికల ఆధారంగా శాసనసభలో బిల్లులు ఆమోదం, వాటిని గవర్నర్ ఆమోదం కోసం పంపించిన తీరును సుప్రీంకోర్టుకు సవివరంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను, న్యాయ నిపుణులను కోరినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు, స్థానిక సంస్థల్లో 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్ల అమలుకు మొదట ఆర్డినెన్స్ ఆ తర్వాత బిల్లుల ఆమోదం వంటి కీలక అంశాలలో జరుగుతున్న జాప్యాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావాలని, రిజర్వేషన్లకు సంబంధించిన ట్రిపుల్ టెస్ట్ను పకడ్బందీగా నిర్వహించిన విషయం వివరించాలని నిర్ణయించారు. అసెంబ్లీలో బిల్లులకు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయన్న విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని భావిస్తున్నారు. రాష్ట్రపతి, గవర్నర్ల వద్ద 90 రోజుల పరిమితికి మించి బిల్లులు పెండింగ్లో ఉంటే అవి ఆమోదం పొందినట్టుగానే భావించాల్సి ఉంటుందని గతంలో సుప్రీంకోర్టు.. తమిళనాడు ప్రభుత్వం విషయంలో ఇచ్చిన ఉత్తర్వులను గురించి ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. లక్షల మందికి పైగా ఉద్యోగులతో చేసిన సర్వే వివరాలను సుప్రీంకోర్టు ముందుంచాలని నిర్ణయించినట్లు సమాచారం. -
తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవో నెంబర్ 9 అమలుకు సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. తాజాగా హైకోర్టు ఆర్డర్ కాపీ విడుదల కాగా.. దానిని అధ్యయనం చేసిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించింది.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోను, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని, హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతి కోరాలని, ఈ మేరకు సీనియర్ కౌన్సిల్తో వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం. దీంతో సోమవారం పిటిషన్ దాఖలు చేయనుంది. ఈ సందర్భంగా.. బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ ఉద్ఘాటించినట్లు తెలుస్తోంది.ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రధానంగా వాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించి, బీసీ జనాభా 57.6% ఉన్నందున 42% రిజర్వేషన్లు కల్పించామని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే..రిజర్వేషన్ల జీవో 9ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన బీ మాధవరెడ్డి, మరొకరు.. సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా అప్పీలు దాఖలు చేస్తే తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని అభ్యర్థించారు.ఇదీ చదవండి: ‘అలాగైతే ఎన్నికలు నిర్వహించుకోవచ్చు’.. : తెలంగాణ హైకోర్టు -
నాలుగు వారాల్లోగా బదులివ్వండి
న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే విష యమై నాలుగు వారాల్లోగా సమాధాన మివ్వా లని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ అంశంపై దాఖలైన పలు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వి నోద్ చంద్రన్ల ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. రాష్ట్ర హోదాను పునరుద్ధరి స్తామంటూ ఇచ్చిన హామీని సాధ్యమైనంత త్వరగా కేంద్రం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ విద్యావేత్త జహూర్ అహ్మద్ భట్, సామాజిక– రాజకీయ ఉద్యమకా రుడు అహ్మద్ మాలిక్ తదితరులు తమ పిటిషన్లలో కోరారు. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సమయంలో రాష్ట్ర హోదాను తిరిగి ఇస్తామంటూ హామీ ఇచ్చిందని పిటిషనర్లు గుర్తు చేశారు. ఈ విషయంపై నాలుగు వారా ల్లోగా స్పందించాలని ఈ సందర్భంగా సీజేఐ బీఆర్ గవాయ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
‘మీరు మోసగాళ్ల తరఫు లాయర్లు కదా!’
సాక్షి, ఢిల్లీ: అక్రమ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్రెడ్డికి శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వం తరఫున వాదించిన లాయర్లకు జస్టిస్ విక్రమ్నాథ్ సరదాగా ఓ చురక అంటించారు. ఏపీలో మద్యం కుంభకోణం జరిగిందని ప్రముఖ బ్రాండ్లను తొలగించి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారని ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి (Mukul Rohatgi) వాదించారు. అయితే.. ఎంఎస్ఎంఈ తరహాలో వాటిని ప్రోత్సహించారామో? అని ఈ సందర్భంగా ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. అక్కడితో ఆగకుండా.. ‘‘మీరు బెయిల్కు వ్యతిరేకంగా వాదిస్తున్నారా? మీరు దేశంలోని మోసగాళ్లు అందరి తరఫున వాదనలు వినిపించే న్యాయవాదులు... పెద్ద పెద్ద స్కాంలలో నిందితుల తరఫున వాదనలు వినిపించారు... ఇప్పుడు మీరు బెయిల్కు వ్యతిరేకంగా?" అని జస్టిస్ విక్రమ్నాథ్ ఫ్రెండ్లీగా అనడంతో కోర్టు హాల్లో నవ్వులు పూశాయి.#SupremeCourt bench's funny banter with Sr Advs Mukul Rohatgi & Siddharth Luthra on their opposing a politician's bail pleaJ Vikram Nath: You're opposing bail? You are counsels for all fraudsters of the country...all of you are fraudsters' counsels, in the biggest scams...And… pic.twitter.com/3o6Jw62yPS— Live Law (@LiveLawIndia) October 10, 2025ఇదిలా ఉంటే ఈ కేసులో ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లూత్రా, సిద్దార్థ్ అగర్వాల్లు వాదనలు వినిపించారు. ఈ ముగ్గురిలో ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూథ్రాలు గతంలో ఎన్నో హైప్రొఫైల్ కేసుల్లో బెయిల్ కోసం వాదనలు వినిపించారు. ఇందులో గుజరాత్ అల్లర్ల కేసు, జస్టిస్ లోయా కేసు(అమిత్ షా తరఫున), ఆశారాం బాపు కేసు, కోల్స్కాం, 2జీ కుంభకోణం కేసులు, అలాగే.. నోట్ల కట్టల జస్టిస్ వర్మ కేసులు ఉన్నాయి. వీటితో పాటు చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు కూడా ఉంది. ఇదీ చదవండి: విశాఖ సీపీపై వైఎస్సార్సీపీ ఫైర్ -
లిక్కర్ కేసులో చెవిరెడ్డి మోహిత్రెడ్డికి భారీ ఊరట
సాక్షి, ఢిల్లీ: అక్రమ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్రెడ్డి(chevireddy mohith reddy)కి భారీ ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీం కోర్టు ఆయనకు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలాగే.. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.లిక్కర్ కేసులో మోహిత్ రెడ్డిని ఏ-39గా, ఆయన తండ్రి.. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఏ38 నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. జూన్ 18వ తేదీన భాస్కర్రెడ్డిని అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం విజయవాడ జైల్లో ఆయన జ్యుడీషియల్ రిమాండ్ మీద ఉన్నారు. ఇక.. మద్యం ముడుపుల సొమ్మును మోహిత్ అధికార వాహనాల ద్వారా తరలించారన్నది సిట్ ఆరోపణ. అయితే.. ఈ కేసులో ఉపశమనం కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. ఊరట దక్కలేదు. దీంతో సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మోహిత్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించగా.. ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లూత్రా, సిద్ధార్థ అగర్వాల్ వాదించారు. జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. కేవలం తన పేరుతో ఉన్న కారులో డబ్బు పట్టుబడ్డాయని కేసు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారని మోహిత్రెడ్డి న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే.. మోహిత్రెడ్డి వాదనలతో ఏకీభవించిన జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఊరట ఇచ్చింది. ఇదీ చదవండి: టార్గెట్ ఎస్సీలు.. బాబు కుతంత్రం -
మరణ శిక్ష పడిన ఖైదీని వదిలేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: 2017నాటి ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న వ్యక్తిని సుప్రీంకోర్టు విడిచిపెట్టింది. దిగువ కోర్టులో ఈ కేసు విచారణ ఏకపక్షంగా జరిగిందని, పోలీసులు అతడిని బలిపశువు ను చేశారని వ్యాఖ్యానించింది. నిందితుడికి తనను తాను రక్షించుకునే హక్కును రాజ్యాంగం కల్పించిందని, ఇదేమీ భ్రాంతి కాదని తెలిపింది. ఈ హక్కుకు భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత న్యాయస్థానంతోపాటు ప్ర భుత్వానికి ఉందని పేర్కొంది. మరణ శిక్ష విధించాల్సిన కేసయినా నిందితుడికి తనను తాను కాపాడుకునే అవకాశం కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. దిగువ కోర్టు తనకు మరణ శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును 2018లో మద్రాస్ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ నిందితుడు దశ్వంత్ వేసిన పిటిషన్పై జస్టిస్ విక్రమ్ సేథ్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ‘ఎఫ్ఎస్ఎల్ నివేదికలతో సహా ముఖ్యమైన పరిస్థితులను నిరూ పించడంలో ప్రాసిక్యూషన్ ఘోరంగా విఫలమైంది. పిటిషనర్ను కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆరోపణలకు సంబంధించిన పత్రాలను నిందితుడికి అందించలేదు. మరణ శిక్ష పడే కేసులో ఇటువంటి వాటిని రాజ్యాంగం తప్పనిసరిచేసింది’అని ధర్మాసనం తన 71 పేజీల తీర్పులో పేర్కొంది. 2018 ఫిబ్రవరి 19వ తేదీన పిటిషనర్కు దోషిగా నిర్థారించిన కోర్టు, అదే రోజు మరణ శిక్ష విధిస్తూ తీర్పునివ్వడాన్ని కూడా ధర్మాసనం ప్రస్తావించింది. ఈ తీర్పును వెలువరించేందుకు కోర్టు అనవసర ఉత్సాహం చూపినట్లుగా భావిస్తున్నామంది. ఈ కేసులో దిగువ కోర్టు, మద్రాస్ హైకోర్టు వెలువరించిన తీర్పులను పక్కనబెడుతున్నామని తెలిపింది. ఇతరత్రా కేసులు ఏవీ లేనట్లయితే నిందితుడిని కారాగారం నుంచి విడుదల చేయాలని అధికారు లను ఆదేశించింది. -
గట్టు వామన్ రావు దంపతుల కేసులో సీబీఐ దూకుడు
సాక్షి,హైదరాబాద్: అడ్వకేట్స్ నాగమణి, వామన్ రావు జంట హత్యల కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇవాళ వామన్ రావు అనుచరులు బొల్లంపల్లి సంతోష్, ఇనుముల సతీష్ను సీబీఐ అధికారులు విచారించారు. ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం 3 గంటల వరకు ప్రశ్నల వర్షం కురిపించిన అధికారులు.. వామన్ రావుతో సాన్నిహిత్యం, ఆయనతో కలిసి చేసిన ప్రయాణంలో పలు రకాల అంశాలపై ఆరా తీశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ రెండో ఫ్లోర్లో విచారణ చేపట్టిన అధికారులు.. విచారణ కోసం ముందస్తు నోటీసులు అందించారు. గత 20 రోజుల నుంచి కొనసాగుతున్న సీబీఐ విచారణ కొనసాగుతుంది. ఇక తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో సీబీఐ అధికారులు మొత్తం 130మందిని విచారిస్తున్నట్లు సమాచారం. గతంలో తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. వామనరావు తండ్రి గట్టు కిషన్రావుకు భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.తన కుమారుడు, కోడలి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కిషన్రావు 2021 సెప్టెంబర్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్.కె. సింగ్లా ధర్మాసనం సీబీఐ విచారణకు ఆదేశించింది. కిషన్రావు తరఫున సీనియర్ న్యాయవాదులు మేనక గురుస్వామి, చంద్రకాంత్లు వాదనలు వినిపించారు. నడిరోడ్డుపై హత్య: పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని కల్వచర్ల వద్ద కారులో వెళ్తున్న వామనరావు, నాగమణి దంపతులను 2021 ఫిబ్రవరి 17న దుండగులు అడ్డగించి నడిరోడ్డుపైనే కత్తులతో నరికి చంపారు. మొదట ఈ కేసును స్థానిక పోలీసులు దర్యాప్తు చేశారు. దానిని సీబీఐకి అప్పగించాలని కిషన్రావు అదే ఏడాది సెప్టెంబర్లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారణలో భాగంగా హత్యకు సంబంధించిన వీడియోలు, పత్రాలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గతంలో కోర్టు ఆదేశించింది.చనిపోయే ముందు వామనరావు ఇచ్చిన మరణ వాంగ్మూలం వీడియోపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఎఫ్ఎస్ఎల్కి పంపించగా, అది అసలుదేనని ల్యాబ్ నివేదిక తేల్చింది. ఈ నివేదికతోపాటు అన్ని రికార్డులు పరిశీలించిన సుప్రీంకోర్టు.. కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది. సీబీఐ దర్యాప్తుపై ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలియచేసింది. ఈ క్రమంలో వామన్రావు దంపతుల కేసు దర్యాప్తు చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. దీంతో సీబీఐ అధికారులు వామన్ రావు కేసును విచారిస్తున్నారు. -
‘ఏదో సరదాగా అన్నంత మాత్రాన..’: సీజేఐ గవాయ్
న్యూఢిల్లీ: కోర్టుల్లో కేసుల విచారణల సమయంలో న్యాయమూర్తులు సరదాగా చేసే వ్యాఖ్యలను కూడా సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్(CJI BR Gavai) ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో తనపై దాడి జరిగిన మరుసటిరోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది(Lord Vishnu Shoe Attack Row).సర్వీస్ కండిషన్స్, వేతనాలు, వృత్తిగతమైన పురోగతిపై ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ కే వినోద్ చంద్రన్తో కలిసి జస్టిస్ గవాయ్ మంగళవారం విచారించారు. ఈ సందర్భంగా జస్టిస్ కే వినోద్తో తన గత అనుభవాన్ని జస్టిస్ గవాయ్ వివరించారు. ‘ఇటీవల ధీరజ్ మోర్ కేసు విచారణ సందర్భంగా నా సహోదరుడు (జస్టిస్ కే వినోద్ని ఉద్దేశించి..) ఏదో వ్యాఖ్యానించబోయారు. ఆయనను నేను ఆపాను. లేదంటే తెల్లారి సోషల్ మీడియాలో ఏమేం ప్రచారం చేసేవారో తెలియదు. అందుకే ఆయనను నాకు మాత్రమే వినపడేలా చెప్పమన్నాను’అని జస్టిస్ గవాయ్ తెలిపారు. కాగా, ఈ కేసు విచారణను ధర్మాసనం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. కొద్దిరోజుల క్రితం ఖజురహో ఆలయంలో ధ్వంసమైన విష్ణు విగ్రహాన్ని మళ్లీ ఏర్పాటుచేసేలా ఆదేశాలివ్వాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ సరదాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. ‘‘మీరు విష్ణువు భక్తులని అంటున్నారు. కాబట్టి, మీరు వెళ్లి ప్రార్థన చేయండి. కోర్టులకు కాకుండా దైవాన్నే అడిగి చూడండి’’ అంటూ పిటిషనర్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఖజురహో ఆలయ సముదాయం యూనెస్కో (UNESCO) వారసత్వ స్థలంగా గుర్తించబడింది. కాబట్టి విగ్రహ పునఃస్థాపనకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అనుమతి అవసరమని కోర్టు అభిప్రాయపడుతూ ఆ పిటిషన్ను తోసిపుచ్చింది. ఈ క్రమంలో.. తన వ్యాఖ్యలపై సోషల్మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో జస్టిస్ గవాయ్ ఆ తర్వాత వివరణ కూడా ఇచ్చారు. తనకు అన్ని మతాలు సమానమే అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. సనాతన ధర్మాన్ని కించపరిస్తే దేశం సహించబోదు అంటూ కోర్టులోనే జస్టిస్ గవాయ్పై ఓ న్యాయవాది బూటు విసిరేయటం సంచలనం సృష్టించింది(Attack on BR Gavai).ఇదీ చదవండి: బూటు విసిరింది ఆ దేవుడే! -
ఈ దశలో జోక్యం చేసుకోలేం
సాక్షి, న్యూఢిల్లీ: గ్రూప్–1 సర్వీసుల నియామకాల వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మంగళవారం ఊరట లభించింది. ఈ అంశంపై దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ప్రధాన అప్పీళ్లు హైకోర్టులో ఈ నెల 15న విచారణకు రానున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. అయితే ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నియామకాలన్నీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉండాలని తేల్చిచెప్పింది. అదే సమయంలో ఆయా పోస్టుల్లో నియమితులైన వారికి ఎలాంటి సమానత్వ హక్కులు వర్తించవని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జొయ్మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ అంశంపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించాలని హైకోర్టుకు సూచించింది.వివాద నేపథ్యం ఇదీ..తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల మార్కులు, ర్యాంకింగ్ జాబితాను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ ఏడాది సెప్టెంబర్ 9న తీర్పు ఇచ్చారు. సమాధాన పత్రాలను సరైన మోడరేషన్తో తిరిగి మూల్యాంకనం చేయాలని లేదా కొత్తగా మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ తీర్పును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తోపాటు ఎంపికైన కొందరు అభ్యర్థులు హైకోర్టులోని డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేశారు. ఈ అప్పీళ్లను విచారించిన డివిజన్ బెంచ్.. సింగిల్ జడ్జి తీర్పుపై స్టే విధిస్తూ సెప్టెంబర్ 24న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం ఒకవేళ నియామకాలు చేపడితే అవి రిట్ అప్పీళ్ల తుది తీర్పునకు లోబడి ఉండాలని షరతు విధించింది. డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ఆ బూటు విసిరింది నేను కాదు.. : రాజేష్ కిషోర్
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై షూతో దాడికి ప్రయత్నించిన(Shoe Attack On CJI BR Gavai) అడ్వొకేట్(సస్పెండెడ్) రాజేష్ కిషోర్(71).. నేషనల్ మీడియాలో హైలైట్ అయ్యారు. ఇప్పుడు వరుస బెట్టి మీడియా చానెల్స్కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తన చర్యను సమర్థించుకుంటున్న ఆయన.. ఆ పని తాను చేయలేదంటూ వింత వాదన చేస్తున్నారు. ‘‘ఆ పని నేను చేయలేదు, దేవుడే చేశాడు. భారత ప్రధాన న్యాయమూర్తి సనాతన ధర్మాన్ని అవమానించారు. ఇది భగవంతుని ఆజ్ఞ, చర్యకు ప్రతిచర్య మాత్రమే’’ అని అంటున్నారు. అదే సమయంలో తనను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేయడాన్ని రాజేష్ కిషోర్(Rajesh Kishore) తీవ్రంగా తప్పుబడుతున్నారు. తన వాదన వినకుండానే చర్యలు తీసుకున్నారని, ఇది హద్దులు దాటడడమేనని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాపై మండిపడుతున్నారు. సీజేఐ గవాయ్పై షూ విసిరిన ఘటన సోమవారం(అక్టోబర్ 6వ తేదీన) సుప్రీం కోర్టులో కలకలం రేపింది. ఓ కేసు విచారణ జరుగుతున్న సమయంలో రాజేష్కిషోర్ తన షూ తీసి సీజేఐ మీదకు విసిరారు. అయితే షూ ఆయన ముందున్న టేబుల్ మీద పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే తోటి లాయర్లు రాజేష్ను పట్టుకుని.. సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు మూడు గంటలపాటు రాజేష్ను విచారించి వదిలేశారు. అయితే.. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ సూచన మేరకు సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ కేసు నమోదుకు ముందుకు రాలేదు. అయితే.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాత్రం రాజేష్పై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. జరిగిన దానికి 15రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.ఇదీ చదవండి: సీజేఐపై దాడి ఘటన: ప్రధాని మోదీ ఏమన్నారంటే.. -
వాంగ్చుక్ అరెస్ట్పై కేంద్రానికి సుప్రీం నోటీసు
న్యూఢిల్లీ: లద్దాఖ్కు చెందిన ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ అరెస్ట్పై సుప్రీంకోర్టు సోమవారం కేంద్రంతోపాటు లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం యంత్రాంగానికి నోటీసులు జారీ చేసింది. జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ)కింద అరెస్ట్ చేసిన వాంగ్చుక్ను వెంటనే విడుదల చేయాలంటూ ఆయన భార్య గీతాంజలి అంగ్మో వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనం విచారణ చేపట్టింది. వాంగ్చుక్ అరెస్ట్కు కారణాలు తెలిపాలని ఆయన భార్య గీతాంజలి కోరుతున్నారని సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ ధర్మాసనానికి నివేదించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జోక్యం చేసుకుని, ఇప్పటికే వాంగ్చుక్కు ఈ మేరకు అధికారులు వివరాలు అందజేసినట్లు వివరించారు. నిర్బంధానికిగల కారణాలను భార్యకు తెలపాలనే నిబంధనేదీ లేదని కూడా ఆయన చెప్పారు. అయితే, ఈ సమయంలో తామేమీ చెప్పలేమని ధర్మాసనం పేర్కొంది. అరెస్ట్కు కారణాలను తెలిపే విషయం పరిశీలించాలని సొలిసిటర్ జనరల్ను కోరింది. అదే సమయంలో, వాంగ్చుక్ వైద్య అవసరాలను జైలు నిబంధనలకు లోబడి తీర్చాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను 14వ తేదీకి వాయిదా వేసింది. లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్తో రెండు రోజులపాటు కొనసాగిన ఆందోళనల్లో నలుగురు చనిపోగా 90 మంది గాయపడ్డారు. హింసకు వాంగ్చుక్ ప్రేరేపించారంటూ అధికారులు సెప్టెంబర్ 26న అదుపులోకి తీసుకుని, ఆ వెంటనే రాజస్తాన్లోని జోథ్పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఎన్ఎస్ఏ కింద అరెస్టయితే గరిష్టంగా 12 నెలలపాటు నిర్బంధంలో ఉంచొచ్చు. -
సీజేఐపై దాడికి యత్నం.. ప్రధాని మోదీ ఆగ్రహం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (CJI Justice BR Gavai)పై దాడి చేసేందుకు ఓ న్యాయవాది యత్నించాడు. ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. సీజేఐపై దాడికి యత్నించిన ఘటనను మోదీ ఖండించారు. ఈ మేరకు సోమవారం (అక్టోబర్6న) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్తో మాట్లాడాను. ఈ రోజు సుప్రీం కోర్ట్ ప్రాంగణంలో జరిగిన ఘటన ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసింది. మన సమాజంలో ఇలాంటి దారుణమైన చర్యలకు స్థానం లేదు. ఇది పూర్తిగా ఖండించదగిన చర్య. ఈ పరిస్థితిలో న్యాయమూర్తి గవాయ్ చూపిన శాంత స్వభావాన్ని నేను అభినందిస్తున్నాను. ఇది న్యాయ విలువల పట్ల ఆయన నిబద్ధతను, అలాగే మన రాజ్యాంగాన్ని బలపరిచేందుకు చేసిన ఆయన కృషిని ప్రతిబింబిస్తుంది’ అని పేర్కొన్నారు.Spoke to Chief Justice of India, Justice BR Gavai Ji. The attack on him earlier today in the Supreme Court premises has angered every Indian. There is no place for such reprehensible acts in our society. It is utterly condemnable. I appreciated the calm displayed by Justice…— Narendra Modi (@narendramodi) October 6, 2025 -
సుప్రీంకోర్టులో సీజేఐపై దాడి యత్నం కేసులో కీలక పరిణామం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై ఓ లాయర్ దాడికి ప్రయత్నించిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడికి యత్నించిన లాయర్పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చర్యలకు ఉపక్రమించింది. రాకేష్ కిషోర్ను విధుల నుంచి బహిష్కరించింది. న్యాయ వ్యవస్థను కాపాడాల్సిన లాయర్.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడికి యత్నించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సోమవవారం (అక్టోబర్6న) సుప్రీంకోర్టులో ఓ కేసుకు సంబంధించిన వాదనలు జరిగే సమయంలో లాయర్ రాకేష్ కిషోర్ జస్టిస్ బీఆర్ గవాయ్పై ‘షూ’ విసిరేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో తోటి లాయర్లు అప్రమత్తం కావడంతో కోర్టు భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన బార్ కౌన్సిల్.. న్యాయవాదిగా ప్రవర్తించాల్సిన నైతిక ప్రమాణాలను ఉల్లంఘించినందుకు రాకేష్ కిషోర్ను తక్షణమే సస్పెండ్ చేసింది.‘ఇది న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీసే చర్య. ఇటువంటి ప్రవర్తనను ఏ మాత్రం సహించం’ అని బార్ కౌన్సిల్ ప్రకటనలో పేర్కొంది.ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. అవసరమైతే శాశ్వతంగా లాయర్గా ప్రాక్టీస్ చేసే హక్కును రద్దు చేయొచ్చని బార్ కౌన్సిల్ సూచించింది. మరోవైపు, ఢిల్లీ పోలీస్ శాఖ కూడా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. -
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని ఖండించిన సాకే శైలజానాథ్
-
సీజేఐపై దాడికి లాయర్ యత్నం
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సుప్రీంకోర్టులో సోమవారం ఉదయం 11.35 గంటలకు ఓ కేసుపై విచారణ జరుగుతుండగానే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్పై ఓ న్యాయవాది బూటు విసిరేందుకు ప్రయతి్నంచడం తీవ్ర కలకలం సృష్టించింది. కోర్టుగదిలో విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై అడ్డుకోవడంతో ఆ బూటు జస్టిస్ గవాయ్ని తాకలేదు. సీజేఐపై దాడికి ప్రయతి్నంచిన లాయర్ను ఢిల్లీ మయూర్ విహార్కు చెందిన రాకేశ్ కిశోర్(71)గా గుర్తించారు. అతడిని కోర్టు గది నుంచి బలవంతంగా బయటకు తరలించారు. సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించబోనంటూ రాకేశ్ కిశోర్ నినాదాలు చేయడం గమనార్హం. త నపై జరిగిన దాడి యత్నంపై జస్టిస్ గవాయ్ స్పందించారు. ఇలాంటి ఘటనలు తనపై ఏమా త్రం ప్రభావం చూపబోవని తేల్చిచెప్పారు. దాడులకు భయపడే ప్రసక్తే లేదంటూ పరోక్షంగా స్పష్టంచేశా రు. దాడి యత్నం తర్వాత కూడా కేసుల విచారణ ను ఆయన యథాతథంగా కొనసాగించడం విశేషంఅసలేం జరిగింది? సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం వేర్వేరు కేసుపై విచారణ నిర్వహిస్తుండగా, అక్కడే ఉన్న లాయర్ రాకేశ్ కిశోర్ వారిద్దరూ కూర్చున్న వేదిక వద్దకు దూసుకొచ్చాడు. తన కాలికున్న బూటు తీసి న్యాయమూర్తులపైకి విసిరేందుకు ప్రయత్నించాడు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది మధ్యలోనే అడ్డుకుని బయటకు లాక్కెళ్లారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. విష్ణు దేవుడి విగ్రహంపై వ్యాఖ్యల వివాదం మధ్యప్రదేశ్లోని ఖజురహోలో ఉన్న విష్ణు దేవుడి విగ్రహంపై దాఖలైన పి టిషన్ విషయంలో చేసిన వ్యాఖ్యలే జస్టిస్ గవాయ్పై దాడి యత్నానికి కారణం కావొచ్చని న్యాయవాద వర్గాలు భావిస్తున్నాయి. ఖజురహోలోని జవెరీ టెంపుల్ను మళ్లీ నిర్మించి, ఏడు అడుగుల విష్ణు దేవుడి విగ్రహాన్ని నెలకొల్పేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ జస్టిస్ గవాయ్ తిరస్కరించారు. ‘మీరు ఏం కోరుకుంటున్నారో వెళ్లి ఆ దేవుడినే అడగండి. విష్ణు దేవుడికి మీరు నిజమైన భక్తులైతే అక్కడికే వెళ్లి ప్రారి్థంచండి. కొంతసేపు ధ్యానం కూడా చేయండి’’ అని పిటిషనర్కు సూచించారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.లాయర్పై సస్పెన్షన్ వేటు సాక్షాత్తూ సీజేఐపైనే బూటు విసిరేందుకు ప్రయత్నించిన లాయర్ రాకేశ్ కిశోర్పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) తక్షణమే చర్యలు తీసుకుంది. అతడిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. లెసెన్స్ను రద్దు చేసింది.రాజ్యాంగంపై దాడి: సోనియాజస్టిస్ గవాయ్పై బూటుతో దాడిచేసేందుకు ప్రయతి్నంచడాన్ని కాంగ్రెస్ సీని యర్ నేత సోనియా గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన సిగ్గుచేటు, మతిలేని చర్య అని పేర్కొన్నారు. ఇది మన రాజ్యాంగంపై, న్యాయ వ్యవస్థపై దాడేనని వ్యాఖ్యానించారు. విద్వేషం, ఉన్మాదం మన సమాజం చుట్టూ ఆవరించుకొని ఉన్నాయని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు సోని యా ఒక ప్రకటన విడుదల చేశారు.జస్టిస్ గవాయ్కి ప్రధాని మోదీ ఫోన్ న్యూఢిల్లీ: జస్టిస్ బి.ఆర్.గవాయ్పైకి లాయర్ బూటు విసిరేందుకు ప్రయత్నించడాన్ని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన ప్రతి ఒక్క భారతీయుడిని ఆగ్రహానికి గురి చేసిందని పేర్కొన్నారు. మన సమాజంలో ఇలాంటి అనుచిత ధోరణులకు స్థానం లేదని తేలి్చచెప్పారు. ఈ మేరకు మోదీ సోమవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. జస్టిస్ గవాయ్తో ఫోన్లో మాట్లాడానని పేర్కొన్నారు. లాయర్ చర్య పట్ల పూర్తి సంయమనం పాటించినందుకు జస్టిస్ గవాయ్ని ప్రశంసించానని వెల్లడించారు. న్యాయ వ్యవస్థ విలువలను, రాజ్యాంగ స్ఫూ ర్తిని బలోపేతం చేయడానికి ఆయన కట్టుబడి ఉన్నట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోందని ప్రధాని ఉద్ఘాటించారు. ఇదీ చదవండి: పార్లమెంట్ కాదు.. రాజ్యాంగమే సర్వోన్నతం -
బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో(Supreme Court) తెలంగాణ స్థానిక ఎన్నికల్లో(Telangana Elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పిటిషన్పై(BC Reservations) విచారణ జరగనుంది. వంగ గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేపట్టనుంది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-9 అమలుపై స్టే ఇవ్వాలని పిటిషన్లో గోపాల్రెడ్డి విజ్ఞప్తి చేశారు. వంగా గోపాల్రెడ్డి పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారించనున్నది. గోపాల్రెడ్డి ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని పిటిషన్లో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఇతర రిజర్వేషన్లు అన్నీ కలిపి కూడా 50 శాతం రిజర్వేషన్ దాటవద్దని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్ను ఎత్తివేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఎస్సీలకు15 శాతం రిజర్వేషన్, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ 42 శాతంతో కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్లు 67 శాతం అవుతున్నదని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే జీవో 9ను తక్షణమే రద్దుచేయాలని కోరారు. ఇది ముమ్మాటికీ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285కు విరుద్ధమని పిటిషన్లో తెలిపారు.ఇక, ఇప్పటికే హైకోర్టులో అదే అంశంపై పిటిషన్ విచారణలో ఉన్నందున హైకోర్టులో తేల్చుకోండని, అక్కడ తేలకపోతే ఇక్కడికి రావాలని సుప్రీంకోర్టు చెప్తుందా? లేదా ఇంకా ఏమైనా కీలక వ్యాఖ్యలు చేస్తుందా? అనే అంశంపై బీసీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. న్యాయంగా అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందేనని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.మరోవైపు.. ఈ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు జారీచేసిన జీవోపై సుప్రీంకోర్టులో జరగనున్న విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఈ జీవో చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఇటు అధికారులను, అటు పార్టీ నేతలను ఆదేశించారు. -
ప్రిలిమినరీ తర్వాత తాత్కాలిక జవాబు కీ
న్యూఢిల్లీ: ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన తర్వాత తాత్కాలిక జవాబు కీని ప్రచురించాలని నిర్ణయించినట్లు యూనియన్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్.. సుప్రీంకోర్టుకు తెలియజేసింది. గత నెలలో అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన అఫిడవిట్లో.. తుది ఫలితాల ప్రకటన తర్వాతే తుది జవాబు కీని ప్రచురిస్తామని కమిషన్ తెలిపింది. ఈ అఫిడవిట్ను సివిల్ సరీ్వసెస్ పరీక్షకు సంబంధించి.. పెండింగ్లో ఉన్న పిటిషన్లో దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో ఉన్న సమయంలో, కోర్టు నియమించిన అమికస్ క్యూరీ సూచనతో సహా వివిధ అంశాలపై తాము చర్చించామని యూపీఎస్సీ పేర్కొంది. ‘సమగ్ర చర్చల అనంతరం.. బాగా ఆలోచించాక ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన తర్వాత తాత్కాలిక జవాబు కీని ప్రచురించాలని కమిషన్ నిర్ణయించింది.. అని అడ్వకేట్ వర్ధమాన్ కౌశిక్ ద్వారా దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు లేదా ప్రాతినిధ్యాలు కోరతామని అందులో వివరించింది. అభ్యర్థులు తెలిపే ప్రతి అభ్యంతరం లేదా ప్రాతినిధ్యానికి మూడు ప్రామాణిక ఆధారాలను జత చేయాలని, అలా జత చేయని అభ్యంతరాలను ప్రారంభ దశలోనే తిరస్కరించాలని అఫిడవిట్లో తెలిపారు. ‘అయితే, సమర్పించిన ఆధారాలు ప్రామాణికమైనవా? కాదా? అనేది కమిషనే నిర్ణయిస్తుంది’.. అని కూడా అందులో స్పష్టం చేశారు. -
వాంగ్చుక్ నిర్బంధం అక్రమం
న్యూఢిల్లీ: ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ను జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ)కింద నిర్బంధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య గీతాంజలి అంగ్మో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన భర్తను నిర్బంధించడం రాజ్యాంగ వ్యతిరేకం, ఏకపక్షం, చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. వాంగ్చుక్ను వెంటనే విడుదల చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. లద్దాఖ్కు రాష్ట్ర హోదా డిమాండ్తో ఆయన దీక్షకు పూనుకోవడం, కేంద్ర పాలిత ప్రాంతంలో నిరసనలు హింసాత్మక రూపం దాల్చి నలుగురు చనిపోగా 90 మంది వరకు గాయపడటం తెల్సిందే. ఈ పరిణామాల నేపథ్యంలో అధికారులు ఆయన్ను సెపె్టంబర్ 26న అదుపులోకి తీసుకుని, రాజస్తాన్లోని జోథ్పూర్ జైలుకు తరలించారు. అంగ్మో తరఫున సీనియర్ లాయర్ వివేక్ తన్ఖా హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. వెంటనే విచారణ చేపట్టి, వాంగ్చుక్ను సుప్రీంకోర్టులో హాజరు పరచాలంటూ లద్దాఖ్ యంత్రాంగాన్ని ఆదేశించాలన్నారు. ఆయన్ను నేరుగా, ఫోన్ ద్వారా కలిసి మాట్లాడేందుకు తక్షణమే అవకాశం కల్పించాలన్నారు. కేంద్ర హోం శాఖ, లద్దాఖ్ యంత్రాంగం, లేహ్ డిప్యూటీ కమిషనర్, జోథ్పూర్ జైలు సూపరిటెండెంట్లను ఇందులో ప్రతివాదులుగా చేరారు. ‘అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన ఆవిష్కర్త, పర్యావరణవేత్త, సామాజిక సంస్కర్త అయిన వాంగ్చుక్, లద్దాఖ్లో పర్యావరణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గాంధేయ విధానంలో, శాంతియుతంగా సాగే ఆందోళనలను మాత్రమే సమర్థించారు’అని అందులో పేర్కొన్నారు. దీర్ఘకాలం పాటు నిరాహార దీక్ష సాగించిన వాంగ్చుక్ తిరిగి కోలుకుంటున్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేయడం, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనన్నారు. అత్యవసరమైన వస్తువులు, మందులు తీసుకోనివ్వకుండా కుటుంబసభ్యులతో మాట్లాడనీయకుండా హడావుడిగా ఆయన్ను జోథ్పూర్ సెంట్రల్ జైలుకు తరలించారని అందులో ఆరోపించారు. ఇప్పటి వరకు ఆ నిర్బంధానికి గతల కారణాలను కుటుంబసభ్యులకు అధికారులు వెల్లడించలేదని పిటిషన్లో తెలిపారు. తనను దాదాపుగా గృహ నిర్బంధంలో ఉంచారని అంగ్మో తెలిపారు. వాంగ్చుక్ స్థాపించిన హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్, లద్దాఖ్ (హెచ్ఐఏఎల్) విద్యార్థులను, సిబ్బందిని అధికారులు విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. వాంగ్చుక్కు విదేశీ సంస్థలతో సంబంధాలను అంటగడుతూ దు్రష్పచారం సాగిస్తున్నారన్నారు. నిర్బంధానికి సంబంధించిన ఉత్తర్వులను బయటపెట్టాలని, అరెస్ట్కు కారణాలను తెలిపే అన్ని రికార్డులను బహిర్గతం చేయాలని కోరారు. వాంగ్చుక్కు వెంటనే డాక్టర్తో వైద్య పరీక్షలు చేయించి, ఆరోగ్య నివేదికలను బయటపెట్టాలన్నారు. -
భారత న్యాయ వ్యవస్థను నడిపించేది న్యాయ పాలనే.. బుల్డోజర్ పాలన కాదు
న్యూఢిల్లీ: భారత న్యాయ వ్యవస్థను నడిపించేది న్యాయ పాలనే తప్ప, బుల్డోజర్ న్యాయం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. న్యాయస్థానం వెలువరించే తీర్పుతోటే ఈ విషయం అర్థమవుతుందన్నారు. ప్రభుత్వమే జడ్జి, లాయర్, అధికారి బాధ్యతలను ఏకకాలంలో నిర్వర్తించలేదన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన 75 ఏళ్లలో ‘చట్ట పాలన’పరిణతి చెందుతూ వస్తోందన్నారు. చట్ట పాలన కేవలం నిబంధనావళి మాత్రమే కాదు, నైతిక చట్టం ఇది విభిన్న, సంక్లిష్టమైన సమాజంలో సమానత్వాన్ని నిలబెట్టడానికి, వ్యక్తి గౌరవాన్ని కాపాడటానికి, పాలనను మార్గనిర్దేశం చేయడానికి రూపొందించిన నైతిక చట్రమని ఆయన అన్నారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లను కూల్చడం చట్ట పరమైన ప్రక్రియలను మరుగు పర్చడం, నియమాలను, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందంటూ యూపీ ప్రభుత్వంపై కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ పేర్కొనడం తెల్సిందే. వివిధ కేసుల్లో చారిత్రక తీర్పులను ఈ ప్రసంగం సందర్భంగా జస్టిస్ గవాయ్ ఉదహరించారు. ‘రూల్ ఆఫ్ లా ఇన్ ది లార్జెస్ట్ డెమోక్రసీ’అంశంపై మారిషస్లో జరిగిన వార్షిక సర్ మౌరిస్ రౌల్ట్ స్మారక ఉపన్యాసం సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మారిషస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా 1978–82 సంవత్సరాల్లో జస్టిస్ రౌల్ట్ పనిచేశారు. -
ఉత్తరాఖండ్ ఈసీకి సుప్రీం జరిమానా
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లు పలు ఓటరు జాబితాల్లో ఉన్నా పోటీ చేయొచ్చంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) ఇచ్చిన సర్క్యులర్ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. చట్టబద్ధమైన నిబంధనలకు విరుద్ధంగా మీరెలా వ్యవహరిస్తారంటూ ప్రశ్నించింది. హైకోర్టు తీర్పును సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం..రాష్ట్ర ఎన్నికల కమిషన్కు రూ.2 లక్షల జరిమానా విధించింది. ఉత్తరాఖండ్ పంచాయతీ రాజ్ చట్టం–2016కు వ్యతిరేకంగా ఎస్ఈసీ వివరణ ఉందంటూ ఉత్తరాఖండ్ హైకోర్టు పేర్కొంది. ఒకే వ్యక్తి ఒకే సమయంలో వేర్వేరు చోట్ల ఓటరుగా నమోదై ఉండరాదని ఆ చట్టం చెబుతోందని గుర్తు చేసింది. ఈ ఉత్తర్వును సవాల్ చేస్తూ ఎస్ఈసీ సుప్రీంకోర్టు గుమ్మం తొక్కగా చుక్కెదు రవడం గమనార్హం. సుప్రీం తీర్పుపై కాంగ్రెస్ స్పందించింది. ఓటు చోరీని సుప్రీంకోర్టు బట్టబయలు చేసిందని, ఎన్నికల కమిషన్ అధికార బీజేపీతో చేతులు కలిపిందని ఆరోపించింది. -
ఓటుకు నోటు కేసు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాజకీయ ప్రకంపలు సృష్టించిన ఓటుకు నోటు కేసు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో జెరూసలెం మత్తయ్య(Jerusalem Mattaiah) పాత్రపై దర్యాప్తు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్పై నేడు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్(Justice BR Gavai) ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది. 2015 ఓటుకు నోటు కేసులో మత్తయ్య ఏ4గా ఉన్నారు. అయితే ఈ కేసు నుంచి ఆయన పేరును క్వాష్ చేస్తూ ఉమ్మడి హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసులో మత్తయ్యను దర్యాప్తు చేయాల్సి ఉందని పేర్కొంటూ తెలంగాణ సర్కార్ ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కానీ, ఈ కేసులో(Vote For Cash Case) అసలు సూత్రధారి చంద్రబాబు అని, ఆయన పైనే దర్యాప్తు జరపాలని మత్తయ్య అంటున్నారు. ఈ మేరకు ఆయన సుప్రీం కోర్టుకు ఓ లేఖ కూడా రాశారు.2015లో ఓటుకు నోటు కేసులో అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి అరెస్ట్ కావడం సంచలనం సృష్టించింది. ఆనాడు ఆంగ్లో ఇండియన్ కోటాలో ఎమ్మెల్యేగా ఉన్నఎల్విస్ స్టీఫెన్సన్కు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు కోసం డబ్బు ఆఫర్ చేసినట్లు వీడియో ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. చంద్రబాబు ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందన్న ప్రచారమూ ఒకటి ఉంది. ఈ కేసులో నేరానికి ప్రరేపితుడిగా(abettor)గా జెరూసలెం మత్తయ్య పేరును చేర్చారు. అయితే అప్పటి ఉమ్మడి హైకోర్టులో ఆయన పిటిషన్ వేయగా.. ఊరట దక్కింది. 2017లో తెలంగాణ ప్రభుత్వం, స్టీఫెన్సన్లు ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగానే.. తీర్పు వెలువడే వేళ ‘అంతా చంద్రబాబే చేశాడు’ అంటూ మత్తయ్య సంచలన ప్రకటన చేశారు. ఏసీబీ, తెలంగాణ ప్రభుత్వం ఈ కేసులో తనను బలిపశువును చేస్తున్నారంటూ అందులో తన ఆవేదన వ్యక్తం చేశారాయన. ఇదీ చదవండి: ఓటుకు నోటు కేసులో లోకేష్ పాత్ర.. సంచలన వ్యాఖ్యలు -
మఫ్టీలో వెళ్లి.. పౌరుల అరెస్టులా?
సాక్షి అమరావతి: పోలీసులు యూనిఫామ్లో కాకుండా.. సివిల్ దుస్తుల్లో వెళ్లి అరెస్టులు చేస్తుండటాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ విషయంలో సాక్షాత్తూ సుప్రీంకోర్టు తీర్పునే పట్టించుకోరా? అని సూటిగా నిలదీసింది. ఇదెక్కడి సంస్కృతి అంటూ ప్రశ్నించింది. మఫ్టీలో వెళ్లి సోషల్ మీడియా యాక్టివిస్టు కుంచాల సౌందరరెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. అసలు పౌరులను అరెస్ట్ చేయడానికి మఫ్టీలో ఎందుకు వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అందరూ పాటించాల్సిందేనంది. సుప్రీంకోర్టు ఆదేశాలు మీకు వర్తించవని అనుకుంటున్నారా..? అని నిలదీసింది. తన భర్త సౌందరరెడ్డిని పోలీసులు ఈనెల 22న సాయంత్రమే అరెస్ట్ చేశారంటూ రాత్రి 7 గంటల సమయంలో పిటిషనర్ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తే... మీరు మాత్రం రాత్రి 7.30–8.45 గంటల మధ్య అరెస్ట్ చేశామని ఎలా చెబుతారని విస్మయం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి తాము తాడేపల్లి పోలీస్స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలని నిర్ణయించినట్లు హైకోర్టు ప్రకటించింది. రాత్రి 8.30 గంటలకు సౌందరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తే, ఆమె 7 గంటలకే ఫిర్యాదు చేసేందుకు తాడేపల్లి పోలీస్స్టేషన్కు ఎందుకు వెళతారని ప్రశ్నించింది. సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తాం... ఒకవేళ పిటిషనర్ లక్ష్మీప్రసన్న(సౌందరరెడ్డి భార్య) తన భర్త అక్రమ నిర్బంధంపై ఫిర్యాదు చేసేందుకు రాత్రి 7 గంటలకు తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తే పోలీసులు చెప్పేదంతా అబద్ధమని తేలిపోతుందని హైకోర్టు తేల్చి చెప్పింది. అందువల్ల ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి అదే రోజు అర్థరాత్రి 12 గంటల వరకు సీసీటీవీ ఫుటేజీని తమ ముందుంచాలని తాడేపల్లి పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈలోపు సౌందరరెడ్డిని స్వేచ్ఛగా వదిలేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణకు కోర్టు ముందు హాజరు కావాలని ఆయన్ను ఆదేశించింది. 22, 23వ తేదీల్లో సౌందరరెడ్డి ఎక్కడున్నారో నిర్ధారించేందుకు అతనున్న సెల్ఫోన్ టవర్ వివరాలను తమ ముందుంచాలని జియోను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ల ధర్మాసనంబుధవారం ఉత్తర్వులిచ్చింది. అక్రమ నిర్బంధంపై పిటిషన్... తన భర్త సౌందరరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ కుంచాల లక్ష్మీప్రసన్న హైకోర్టులో మంగళవారం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. అయితే సౌందరరెడ్డిని తాము అదుపులోకి తీసుకోలేదని, ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. దీంతో సౌందరరెడ్డి ఎక్కడున్నా వెతికి తమ ముందు మాత్రమే హాజరుపరచాలని, ఆయన్ను ఏ కేసులోనూ మేజి్రస్టేట్ ముందు హాజరుపరచడానికి వీల్లేదని పోలీసులను ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే. బుధవారం ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) తిరుమాను విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ సౌందరరెడ్డిని ప్రత్తిపాడు పోలీసులు గంజాయి కేసులో అరెస్ట్ చేశారన్నారు. సౌందరరెడ్డి ఎక్కడ ఉన్నారో తెలియదని పిటిషనర్ చెబుతున్నారని, వాస్తవానికి ఆయన ఎక్కడున్నారనే విషయం వారికి తెలుసునన్నారు. సౌందరరెడ్డిని కోర్టుకు తెచ్చినప్పుడు అక్కడికి ఆయన బావ మరిది వచ్చారన్నారు. ధర్మాసనం స్పందిస్తూ బావ మరిది కోర్టుకు రాకూడదా? దీనికి, సౌందరరెడ్డి అరెస్ట్కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించింది. తన భర్తను అపహరించారని లక్ష్మీప్రసన్న ఫిర్యాదు చేస్తే దానిపై పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని నిలదీసింది. కేవలం జనరల్ డైరీలో రాసి చేతులు దులుపుకొన్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. హైకోర్టు చెప్పినా వినకుండా.. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు... ఈ సమయంలో లక్ష్మీప్రసన్న తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డి స్పందిస్తూ, సౌందరరెడ్డిని మేజి్రస్టేట్ ముందు హాజరుపరచడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంగా చెప్పినా పోలీసులు ఖాతరు చేయకుండా మేజి్రస్టేట్ ముందు హాజరుపరిచారని తెలిపారు. అది కూడా హైకోర్టులో విచారణ జరుగుతుండగానే పోలీసులు ఆయన్ను మేజి్రస్టేట్ వద్దకు తీసుకెళ్లారన్నారు. అయితే హైకోర్టు ఉత్తర్వుల గురించి తాము మేజిస్ట్రేట్ కు నివేదించడంతో ఆయన రిమాండ్ విధించకుండా సౌందరరెడ్డిని హైకోర్టు ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించారన్నారు. సౌందరరెడ్డిని పోలీసులు సివిల్ దుస్తుల్లో వచ్చి పట్టుకెళ్లారని రామలక్ష్మణరెడ్డి హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ, ఫోటోలున్నాయన్నారు. ‘సుప్రీం’ ఆదేశాలు మీకు వర్తించవా..? ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అసలు పోలీసులు యూనిఫామ్లో కాకుండా సివిల్ దుస్తుల్లో వచ్చి ఎలా అరెస్టులు చేస్తారని ప్రశ్నించింది. కోర్టులోనే ఉన్న ప్రత్తిపాడు సీఐ శ్రీనివాస్తో నేరుగా ధర్మాసనం మాట్లాడింది. సివిల్ దుస్తుల్లో అరెస్టులు చేయడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధం కదా? మరి మీరెందుకు సివిల్ దుస్తుల్లో వెళుతున్నారు? ఇదేం సంస్కృతి? సుప్రీంకోర్టు ఆదేశాలు మీకు వర్తించవని అనుకుంటున్నారా? మఫ్టీలో ఎందుకు అపార్ట్మెంట్ వద్దకు వెళ్లారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. యూనిఫామ్లో ఉంటే నిందితులు పారిపోతారని మఫ్టీలో ఉంటున్నామని సీఐ చెప్పారు. ఈ సమాధానంపై ధర్మాసనం సంతృప్తి చెందలేదు. నన్ను, నా భార్యను పోలీసులు బాగా ఇబ్బంది పెట్టారు... ఇంతకీ సౌందరరెడ్డి ఎక్కడ ఉన్నారని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించడంతో.. కోర్టు ముందుకు తీసుకొచ్చామంటూ పోలీసులు ఆయన్ను ప్రవేశపెట్టారు. సహ నిందితుల వాంగ్మూలం ఆధారంగా సౌందరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారని రామలక్ష్మణరెడ్డి తెలిపారు. రిమాండ్ రిపోర్టులో రాత్రి 7.30 గంటలకు అతన్ని పాతూరు రోడ్డులో అరెస్ట్ చేశారని పేర్కొన్నారని, అయితే నిర్దిష్టంగా ఏ ప్రాంతంలో అరెస్ట్ చేశారో మాత్రం పేర్కొనలేదన్నారు. వాస్తవానికి సౌందరరెడ్డిని పోలీసులు 22 సాయంత్రమే అరెస్ట్ చేశారన్నారు. అంతకు ముందు పోలీసులు మఫ్టీలో అపార్ట్మెంట్కు సైతం వచ్చి వెళ్లారన్నారు. అదే రోజు రాత్రి 7 గంటలకే లక్ష్మీప్రసన్న తాడేపల్లి పోలీస్స్టేషన్కు వెళ్లి సౌందరరెడ్డి అపహరణపై ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం కోర్టులో ఉన్న సౌందరరెడ్డితో స్వయంగా మాట్లాడటంతో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పోలీసులు తనను, తన భార్యను బాగా ఇబ్బంది పెట్టారని వెల్లడించారు. గంజాయి కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. -
చేసిందంతా చంద్రబాబే
సాక్షి, న్యూఢిల్లీ: ‘అంతా ఏపీ సీఎం చంద్రబాబే చేశారు.. ఓటుకు కోట్లు కేసులో అతనూ కీలక నిందితుడే. నన్ను స్టీఫెన్సన్ వద్దకు పంపడంలో రేవంత్తోపాటు ఆయనదీ కీలకపాత్ర. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పారీ్టకి ఓటేసేలా ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ఒప్పించాలని బలవంతం చేశారు. రూ. 5 కోట్లు ఆశ చూపాలని చెప్పా రు. కేసు నమోదయ్యాక పోలీసులకు దొరకకుండా నన్ను లోకేశ్ విజయవాడ తరలించారు. అత ని సన్నిహితుల సహకారంతో ఆరేడు నెలలు నిర్బంధించారు. ఈ కేసులో బాబు, లోకేశ్, ఏబీ వెంకటేశ్వరరావు సహా మరికొందరిని నిందితులుగా చేర్చి.. విచారణ చేపట్టాలి’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్కి నిందితుడు మత్తయ్య లేఖ రాశారు. చంద్రబాబు, లోకేశ్.. ఈ కేసులో చేసిన దారుణాలను వివరించారు. మంగళవారం ఆ లేఖను ఢిల్లీలోని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రిజిస్ట్రార్ (ఇన్వార్డ్)కు అందజేశారు. సుప్రీంకోర్టు లేదా మరేదైనా హైకోర్టులో కేసు విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 17 అంశాలతో రాసిన లేఖలో ఆయన పేర్కొన్న వివరాల మేరకు.. చంద్రబాబు, రేవంత్లే పంపారు.. ‘ఓటుకు కోట్లు వ్యవహారంలోకి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్లే నన్ను పంపారు. తీర్పును ప్రకటించే ముందు మరో సారి కేసుకు సంబంధించి పూర్తి వివరాలను క్షుణ్ణంగా చదవాలని కోరుతున్నా. కేసులో నా ప్రమేయంతోపాటు నేరానికి ప్రోత్సహించిన చంద్రబాబు, అతని కుమారుడు, మంత్రి లోకేశ్ ను కూడా నిందితులుగా చేర్చాలి. ఈ వ్యవహారంలో టీడీపీ నేతలు, పోలీసు అధికారులు, జడ్జీలు, న్యాయవాదులు, వారికి సహక రించిన ప్రతి ఒక్కరినీ నాతోపాటు సమగ్రంగా విచారించాలి. ఏసీబీ పోలీసుల దర్యాప్తులో అధికారిక సాక్ష్యాలు, చంద్రబాబు మాట్లాడిన రికార్డు.. దీని ఫోరెన్సిక్ నివేదిక, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ రూ. 50 లక్షల నగదుపై దర్యాప్తు జరగాలి. చంద్రబాబు, రేవంత్ ప్రోద్బలంతోనే సెబాస్టియన్ను ఒప్పించా. 2016లో జరిగిన మహానాడులో చంద్రబాబు, రేవంత్లు నన్ను పిలిపించి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై మాట్లాడారు. టీడీపీ అభ్యరి్థకి ఓటు వేసేలా రూ. 5 కోట్లకు నాటి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ఒప్పించాలన్నారు. ఈ వ్యవహారంలో నన్ను ప్రోత్సహించి, నాతో నేరం చేయించిన చంద్రబాబు, రేవంత్తోపాటు భాగ స్వాములైన వారందరిపై దర్యాప్తు చేసేలా ఆదేశాలు జారీ చేయండి’ అని మత్తయ్య విజ్ఞప్తి చేశారు. రేవంత్ను సీఎంగా తప్పించండి.. ‘ఈ కేసు విచారణ సజావుగా సాగి, నిజానిజాలు బయటకు రావాలంటే రేవంత్ను ముఖ్యమంత్రి హోదా నుంచి తప్పించాలి. నాతో సహా, నిందితులందరినీ విచారించేలా మళ్లీ విచారణకు ఆదేశించాలి. రేవంత్, వేం నరేందర్రెడ్డి, వేం కీర్తన్, ఉదయ్సింహా తదితరులు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో అధికార పదవుల్లో ఉన్నారు. వారు ఏసీబీ అధికారులను ప్రభావితం చేసే అవకాశమే ఎక్కువ. కేసులో వారి పాత్ర లేకుండా చేసేలా ఒత్తిడి తెస్తారు. దర్యాప్తులో వారి ప్రమేయం ఉండకుండా, తప్పుదోవ పట్టకుండా, ఏసీబీ అధికారులను ప్రభావితం చేయకుండా ఉండాలంటే.. ముందుగా వారిని పదవుల నుంచి తప్పించాలి. విచారణ ముగిసేదాకా పదవులకు దూరంగా ఉండేలా ఉత్తర్వులు జారీ చేయాలి. అంతేకాదు, ఈ కేసు సుప్రీంకోర్టు లేదా ఏపీ, తెలంగాణేతర హైకోర్టులకు బదిలీ చేసి విచారణ చేపట్టాలి’ అని మత్తయ్య కోరారు. లోకేశ్, అతని సన్నిహితులే నిర్బంధించారు ఈ కేసు నమోదైనప్పుడు తెలంగాణ పోలీసులకు నన్ను దొరకకుండా చేసేందుకు ప్రస్తుత ఏపీ మంత్రి నారా లోకేశ్ విశ్వప్రయత్నం చేశారు. ఆయన సన్నిహితులు కిలారి రాజేశ్, రేవంత్ అనుచరుడు జిమ్మీ బాబు, మరికొందరు కారులో నిర్బంధించారు. బలవంతంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. ఆ సమయంలో కాళ్లూ, చేతులూ కట్టేయడంతోపాటు ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా ఉండేందుకు కళ్లకు గంతలు కట్టారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో సుమారు ఆరేడు నెలలు అజ్ఞాతంలో ఉంచారు. నా భార్య, పిల్లలకు, తల్లిదండ్రులకు చూపించకుండా.. నా కుటుంబానికి దూరం చేశారు. ఏపీలోని పలు ప్రదేశాల్లో చీకటి గదిలో బంధించి, అడవుల్లో తిప్పుతూ అప్పటి పోలీసులు, లోకేశ్ సన్నిహితులు తీవ్ర వేధింపులకు గురిచేశారు. నేను ఎక్కడికీ వెళ్లకుండా కాపలాగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇంటెలిజెన్స్ నాటి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, అప్పటి డీజీపీ, టాస్్కఫోర్స్ బృందాలు, కృష్ణా జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా సహకరించారు. వారందర్నీ నిందితులుగా చేర్చి, విచారించాలి. విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై ఫోన్ ట్యాపింగ్ కేసులో నాతో బలవంతంగా ఫిర్యాదు చేయించారు. 164 స్టేట్మెంట్పై బలవంతంగా సంతకం పెట్టించారు. వందకు పైగా తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకాలు చేయించున్నారు. నా భార్యకు నామినేటెడ్ పదవి ఇస్తామని, అమరావతిలో ఇల్లు, వ్యాపారాభివృద్ధికి సహకరిస్తామని, పిల్లల చదువు, భవిష్యత్కు సహకరిస్తామని నమ్మించారు. అలా 164 స్టేట్మెంట్పై సంతకం చేయించారు. టీడీపీ న్యాయవాదులు కనకమెడల, దమ్మలపాటి, మరికొందరు ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదులు వారికి సహకరించారు. లోకేశ్ టీం, టీడీ జనార్ధన్, చంద్రబాబు పీఏ శ్రీనివాస్, కేబినెట్ మంత్రులు, అందరినీ ఈ కేసులో నిందితులుగా చేర్చి పూర్తిగా విచారణ చేయాలి. నేను ఈ లేఖలో పేర్కొన్న విషయాలన్నీ హైకోర్టులో లేదా సుప్రీంకోర్టు విచారణలో ప్రత్యక్షంగా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా. నాలుగేళ్ల క్రితం సుప్రీంకోర్టులో ‘‘పార్టీ ఇన్ పర్సన్’’గా పిటిషన్ వేశా. ఒక బాధ్యతగల పౌరుడిగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఓటుకు కోట్లు కేసు నిందితుడిగా ఉన్నాను. చేసిన తప్పుకు సిగ్గుపడి పశ్చాత్తాపపడుతున్నా. తప్పు తెలుసుకొని నిజాలు చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నా. నన్ను అప్రూవర్గా అనుమతించండి’ అంటూ మత్తయ్య సీజేఐని అభ్యరి్థంచారు. -
ఓటుకు నోట్లు కేసులో చంద్రబాబుకు మత్తయ్య షాక్
హైదరాబాద్: ఓటుకు నోట్లు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుపై దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మత్తయ్య లేఖ రాశాడు. చంద్రబాబు ప్రోత్సాహం మేరకే తాను ఓటుకు నోట్లు కేసులో తప్పు చేశానని సీజేఐకి రాసిన లేఖలో మత్తయ్య పేర్కొన్నాడు.ఓటుకు నోటు కేసులో మత్తయ్య పాత్ర పై దర్యాప్తు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం. తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో మత్తయ్య లేఖ కీలకంగా మారింది. లేఖలోని అంశాలను పిటిషన్ రూపంలో కోర్టులో ఫైల్ చేయనున్న మత్తయ్య తరఫు న్యాయవాది. -
మీ నేత విగ్రహాల కోసం ప్రజాధనమా?
సాక్షి, ఢిల్లీ: ‘‘మీ నేతలను కీర్తించేందుకు ప్రజాధనాన్ని ఎలా వినియోగిస్తారు’’ అంటూ.. తమిళనాడు డీఎంకే ప్రభుత్వాన్ని(DMK Government) సుప్రీం కోర్టు నిలదీసింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహం(Karunanidhi Statue) ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేయగా.. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిధులను కరుణానిధి విగ్రహం కోసం ఉపయోగించడంపై సుప్రీం కోర్టు(Supreme Court Karunanidhi Statue) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో.. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్లతోకూడిన ధర్మాసం తమిళనాడు ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. ‘‘అసలు విగ్రహ ఏర్పాటునకు ప్రభుత్వ నిధులను ఎందుకు ఉపయోగించాలి?. మీ మాజీ నేతలను కీర్తించడానికి ప్రభుత్వ నిధులను ఎందుకు ఖర్చు చేయాలి?’’ అని ప్రశ్నలు గుప్పించింది. ఈ క్రమంలో.. గతంలో మద్రాస్ హైకోర్టు(Madras High Court) ఇచ్చిన ఉత్తర్వును సమర్థిస్తూ ప్రభుత్వ పిటిషన్ను కొట్టేసింది. అలాగే.. రాష్ట్ర ప్రభుత్వం తన అభ్యర్థనను ఉపసంహరించుకుని మళ్లీ హైకోర్టునే ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసిందితిరునల్వేలి జిల్లాలోని వల్లియూర్ డైలీ వెజిటబుల్ మార్కెట్ ప్రధాన రహదారిలో ఉన్న పబ్లిక్ ఆర్చ్ ప్రవేశ ద్వారం వద్ద దివంగత నేత కరుణానిధి కాంస్య విగ్రహం, నేమ్ బోర్డును ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వం భావించింది. అయితే.. అది ప్రభుత్వ స్థలం. పైగా గతంలో హైకోర్టు ఈ తరహా నిర్మాణాలపై కఠినమైన మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వానికి కోర్టుల పర్మిషన్ అవసరం పడింది. అందుకే.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే.. పబ్లిక్ ప్లేసుల్లో విగ్రహాలు, నేమ్ బోర్డులు వంటి నిర్మాణాలతో ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రజలకు అసౌకర్యం, పైగా భద్రతాపరమైన సమస్యలు తలెత్తవచ్చని అభిప్రాయపడుతూ మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. అయితే అక్కడా డీఎంకే ప్రభుత్వానికి చుక్కెదురైంది. ‘‘ప్రభుత్వ నిధులు ప్రజల అవసరాలకు ఉపయోగించాలి.. వ్యక్తిగత కీర్తి కోసం కాదు. పబ్లిక్ ప్లేస్లో విగ్రహాలు ట్రాఫిక్, భద్రత, ప్రజా అసౌకర్యానికి దారితీయవచ్చు. ప్రజల హక్కులను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే’’ అని ఇటు హైకోర్టు, ఆ తీర్పును సమర్థిస్తూ సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదీ చదవండి: పరువు నష్టం కేసులు.. ఇక ఆ టైం వచ్చింది! -
పరువు నష్టం నేరం కాదు: సుప్రీం కోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసుల(Defamation Cases)ను నేరరహి తంగా చూడాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు ‘ది వైర్’అనే ఆన్లైన్ పబ్లికేషన్ సంస్థపై పరువు నష్టం కేసు వేశారు(The Wire Defamation Case). ఈ మేరకు మేజిస్ట్రేట్ కోర్టు ది వైర్కు సమన్లు జారీ చేయగా, ఢిల్లీ హైకోర్టు దానిని సమర్థించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ‘ది వైర్’వేసిన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎంఎం సుందరేశ్(Justice MM Sundaresh).. ‘ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం నేరం కాదని నిర్థారించాల్సిన సమయం వచ్చింది’ అంటూ వ్యాఖ్యానించారు. ది వైర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ దీనిని సమర్థిస్తూ సంబంధిత చట్టంలో సంస్కరణలను చేపట్టాల్సిన అవసర ముందన్నారు. భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ) లోని సెక్షన్ 499 ప్రకారం పరువునష్టం కలిగించడం నేరం కాగా, దీనినే భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) కూడా సెక్షన్ 356గా కొనసాగించింది. అయితే, న్యాయ మూర్తి సుందరేశ్ వ్యాఖ్యలు 2016లో సుబ్రమణ్య స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. పరువు నష్టం చట్టంలోని నిబంధనలకు రాజ్యాంగబద్థత ఉందని అప్పటి తీర్పులో సుప్రీంకోర్టు సమర్థించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే, గౌరవం పొందే ప్రాథమిక హక్కు కిందకు ఇది వస్తుందని తెలిపింది. ఇదీ చదవండి: కొందరు జడ్జిలు సరిగా పని చేయట్లేదు! -
కొందరు సరిగా పనిచేయట్లేదు!
న్యూఢిల్లీ: కొందరు హైకోర్టు న్యాయమూర్తులు వేగంగా కేసులను పరిష్కరించే వృత్తినైపుణ్యం ఉన్నా కూడా ఆ స్థాయిలో పనిచేయట్లేరని సర్వోన్నత న్యాయస్థానం ఆవేదన వ్యక్తంచేసింది. అలాంటి జడ్జీలపాలిట స్కూల్ ప్రిన్సిపాల్ మాదిరి హితబోధ చెప్పే ఉద్దేశం తమకు లేదని, స్వీయసమీక్ష ద్వారా ఆ జడ్జీల తమ వైఖరిని మార్చుకోవాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ల సుప్రీంకోర్టు ధర్మాసనం హితవు పలికింది. ‘‘హైకోర్టుల్లో రెండు రకాల జడ్జీలున్నారు. కొందరు జడ్జీలు పగలూరాత్రీ పనిచేస్తూ వేగంగా ఎక్కువ కేసులను పరిష్కరిస్తున్నారు. కొందరు జడ్జీలు మాత్రం దురదృష్టవశాత్తు సవ్యంగా సేవలు అందించట్లేదరు. కారణాలు మంచివైనా చెడ్డవైనా సరే పని మాత్రం సరిగా సాగట్లేదు. పరిస్థితులు ఎలాంటివనేది ఇక్కడ అప్రస్తుతం. ఒక జడ్జీ ఒక క్రిమినల్ కేసును ఆలకిస్తున్నారనుకుందాం. ఆయన రోజుకు 50 కేసులను పరిష్కరించాలని మేం అత్యాశపడట్లేదు. అలాగని ఆయన ఒక్క కేసు విచారించి గొప్ప పని చేశాననుకుంటే పద్ధతి కాదు. బెయిల్ కేసులో రోజుకు ఒకే ఒక్క కేసును విచారిస్తూ కూర్చుంటా అంటే అది ఆయన ఆత్మపరిశీలనకే వదిలేయాలి. తమ వద్ద కేసుల పెండింగ్ల కొండ పేరుకుపోకుండా జడ్జీలు చూసుకోవాలి. ఆ మేరకు స్వీయ నియంత్రణ ఉండాలి. వృత్తిపరంగా నాణ్యమైన కార్యశీలత అనేది తప్పనిసరి. రోజుకు పరిష్కరించే ఎక్కువ కేసుల సంఖ్య పెంచుకుంటూ పోవాలి. దాంతోపాటే కేసుల పరిష్కార విధానంలో అత్యున్నత న్యాయప్రమాణాలు, నియమనిబంధనలను పాటించాల్సిందే. ఈ విషయంలో హైకోర్టు జడ్జీలకు స్కూల్ ప్రిన్సిపాల్ మాదిరి పాఠాలు చెప్పే యోచన మాకు లేదు. మన ముందు ఎంతటి పెండింగ్ కేసుల భారం ఉంది, ఎంత త్వరగా ఆ భారాన్ని తగ్గించుకోవాలని అనే స్పృహ జడ్జీలకు ఉండాలి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమపై నమోదైన క్రిమినల్ కేసుల్లో వాదోపవాదనలు ముగిసి తీర్పులు జార్ఖండ్ హైకోర్టులో ఏళ్ల తరబడి రిజర్వ్లోనే ఉండిపోవడంతో విసిగిపోయిన ఆ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉదంతంలో ధర్మాసనం పై విధంగా స్పందించింది. -
దురదృష్టకరం.. బాధ్యతారాహిత్యం!
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద నివేదికలోని కొన్ని అంశాలు ముందుగానే లీకవడం ‘దురదృష్టకరం, బాధ్యతారాహిత్యం’అంటూ సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఫలితంగా ఘోర ప్రమాదానికి పైలట్ల తప్పిదాలే కారణమంటూ జూన్ 12వ తేదీన మీడియా చిలువలుపలువలుగా కథనాలు వచ్చాయని తెలిపింది. ప్రమాదంపై స్వతంత్ర, నిష్పాక్షిక సత్వర విచారణ చేపట్టాలని, బాధితుల వ్యక్తిగత గోప్యత, మర్యాదలకు భంగం కల్గించరాదని పేర్కొంటూ సోమవారం జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వంతోపాటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)కు నోటీసులు జారీ చేసింది. జూలై 12వ తేదీన ఎయిర్క్రాఫ్ట్ యాసిడెంట్ ఇన్వెసి ్టగేషన్ బ్యూరో(ఏఏఐబీ) ప్రాథమిక నివేదికలోని కొన్ని ఎంపిక చేసిన అంశాలను బహిర్గతం చేయడం దురదృష్టకరం, బాధ్యతారాహిత్యంగా అభివర్ణించింది. దీనిని ప్రత్యర్థి వైమానిక సంస్థలు స్వార్థానికి వాడుకునే ప్రమాదముందని తెలిపింది. సేఫ్టీ మ్యాటర్స్ ఫౌండేషన్ అనే సంస్థ తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలను వినిపించారు. ప్రాథమిక నివేదికలోని పైలట్ల తప్పిదముందని ఆరోపించే కేవలం ఒకే ఒక వాక్యం వల్లనే ప్రపంచవ్యాప్తంగా మీడియాలో కథనాలు వచ్చాయన్నారు. మిగతా అంశాలన్నీ మరుగున పడిపోయాయన్నారు. విషాదం చోటుచేసుకుని 100 రోజులు దాటినా ఇప్పటికీ అసలు కారణాలు వెల్లడి కాలేదని చెప్పారు. పైపెచ్చు, విచారణ కమిటీలోని ఐదుగురిలో ముగ్గురు డీజీసీఏకు చెందిన వారే ఉండటంతో నివేదికపై అనుమానాలకు తావిచ్చే అవకాశముందని తెలిపారు. విమానం ఫ్లైట్ డేటా రికార్డర్ను వెల్లడిస్తే ఘటనకు దారితీసిన కారణాలపై స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. స్పందించిన ధర్మాసనం... స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తునకు డిమాండ్ చేయడం సబబుగానే ఉన్నా, ఫ్లైట్ డేటా రికార్డర్ సమాచారాన్ని డిమాండ్ చేయడం మాత్రం ప్రశ్నార్థకమని వ్యాఖ్యానించింది. ఫ్లైట్ డేటా రికార్డర్ వెల్లడైతే పరస్పర విరుద్ధ కథనాలు వచ్చే ప్రమాదముందని పేర్కొంది. ‘ఇటువంటి సందర్భాల్లో దర్యాప్తు పూర్తి అయ్యే వరకు నివేదికలోని అన్ని అంశాలను పూర్తి స్థాయిలో గోప్యంగా ఉంచాల్సిన అవసరముంది. అప్పటి వరకు మేం ఎదురుచూస్తాం’అని ధర్మాసనం తెలిపింది. ప్రమాదంపై కేంద్రం ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీ నివేదికలోని కొన్ని అంశాలను లీకవడంతో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందంటూ వైమానిక రంగ నిపుణుడు కెప్టెన్ అమిత్ సింగ్ సారథ్యంలోని సేఫ్టీ మ్యాటర్స్ ఫౌండేషన్ సంస్థ ఈ పిటిషన్ వేసింది. ఫ్యూయల్ కటాఫ్ స్విఛ్లను ‘రన్’నుంచి ‘కటాఫ్’కు మార్చడం వల్లే ప్రమాదం జరిగిందని, ఇది పైలట్ తప్పిదమేనంటూ ఏఏఐబీ ప్రాథమిక నివేదికలోని కొన్ని అంశాలు జూలై 12వ తేదీన బయటకు రావడం తెల్సిందే. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్య
సాక్షి, ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో సోమవారం విచారణ సందర్భంగా.. సుప్రీం కోర్టు సిట్కు కీలక వ్యాఖ్య చేసింది. దర్యాప్తునకు ప్రభాకర్ రావు సహకరించడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లడంపై కోర్టు స్పందించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 ప్రభాకర్ రావుకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలంటూ సిట్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ‘‘ప్రభాకర్ రావు సిట్ దర్యాప్తుకు సహకరించడం లేదు. ఫోన్ డివైస్లలో డాటా ఫార్మట్ చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉండగానే ఫోన్ డివైస్లో సమాచారం ధ్వంసం చేశారని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) నివేదిక కూడా ఇచ్చింది. జర్నలిస్టులు, జడ్జిల ఫోన్లను కూడా ఆయన టాప్ చేశారు. ప్రభుత్వ ఫోన్లో పాస్వర్డ్ సైతం చెప్పడం లేదు. ఈ తరుణంలో ఆయనకు అరెస్టు నుంచి కల్పించిన రక్షణను తొలగించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రభాకర్రావు తరఫు న్యాయవాది దామా శేషాద్రి నాయుడు స్పందిస్తూ.. ఇప్పటికే తన క్లయింట్ చాలాసార్లు సిట్ విచారణకు హాజరయ్యాని.. సహకరించడం లేదన్నదాంట్లో వాస్తవం లేదని అన్నారు. ఈ తరుణంలో ప్రభుత్వ ఆరోపణలపై స్పందించేందుకు రెండు వారాల సమయం కోరారాయన. దీంతో.. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. తదుపరి విచారణ దాకా ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని చెబుతూ.. మధ్యంతర ఊరటను పొడిగించింది. అలాగే విచారణకు సహకరించాల్సిందేనని ప్రభాకర్రావుకు కోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో.. ఇంటరాగేట్ చేసి ఆయన నుంచి సమాచారం రాబట్టాలని సిట్కు సూచించింది. -
మధ్యవర్తిత్వానికి జాప్యం జాఢ్యం
న్యూఢిల్లీ: మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం కూడా ఆలస్యమవుతోందని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. కేసుల పరిష్కారానికి ఒకప్పుడు సత్వరమైన ప్రత్యామ్నాయంగా ఉన్న మధ్యవర్తిత్వానికి నేడు మితిమీరిన వాయిదాల జాఢ్యం అంటుకుందని వ్యాఖ్యానించారు. మధ్యవర్తిత్వం అంశంలో ప్రపంచంలోనే ప్రముఖంగా నిలవాలని భావిస్తున్న భారత్ కేవలం తీర్పుల సంఖ్యతోనే కాదు, ఆ తీర్పుల్లో తార్కికమైన ప్రమాణాలను, నిష్పాక్షికతను ప్రతిబింబించాలన్నారు. మధ్యవర్తిత్వ తీర్పుల్లో జాప్యాన్ని నివారించేందుకు ఇరుపక్షాలు కట్టుబడి ఉండాల్సిన నమూనా విధివిధానాలు వంటి సంస్థాగత పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వాయిదాలను కఠినంగా నియంత్రించడం ఈ సమస్యకు ఒక పరిష్కారమని తెలిపారు. మధ్యవర్తిత్వ విధాన సమగ్రతను కాపాడేందుకు క్రమశిక్షణ ఎంతో అవసరమని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. వాణిజ్య వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వ విధానం నేడు వెన్నెముకగా మారిందని చెప్పారు. -
ప్రజలను ప్రభుత్వం ఎలా విభజించి చూడగలదు?
న్యూఢిల్లీ: ఈ నెల 22న అట్టహాసంగా మొదలయ్యే మైసూరు దసరా ఉత్సవాలకు బుకర్ ప్రైజ్ విజేత బాను ముష్తాక్ను కర్నాటక ప్రభుత్వం ఆహ్వానించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ‘ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం. ప్రభుత్వం ప్రజలను ఏ, బీ, సీ అంటూ ఎలా విభజించి చూడగలదు? మన రాజ్యాంగ పీఠిక ఏం చెబుతోంది?’అంటూ శుక్రవారం విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం పిటిషనర్ను ప్రశ్నించింది. బాను ముష్తాక్ చేతుల మీదుగా దసరా ఉత్సవాలను ప్రారంభించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను ఈ నెల 15వ తేదీన కర్ణాటక హైకోర్టు కొట్టివేయడం తెల్సిందే. ఈ సందర్భంగా హైకోర్టు.. 2017 దసరా ఉత్సవాల వేదికపై డాక్టర్ నిస్సార్ అహ్మద్తో పిటిషనర్లలో ఒకరు వేదికను పంచుకోవడాన్ని ప్రస్తావించింది. ఇదే విషయాన్ని సుప్రీం ధర్మాసనం గుర్తు చేస్తూ.. ఇది నిజమా? కాదా? అని ప్రశ్నించింది. అయితే, ఉత్సవాలను ప్రారంభించడం, పూజల్లో పాల్గొనడమనే రెండు అంశాలున్నాయంటూ పిటిషనర్ తరఫు లాయర్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా రాజ్యాంగంలోని ఆరి్టకల్ 25 ప్రకారం మత స్వేచ్ఛకు భంగం కలుగుతోందని తెలిపారు. అలాంటప్పుడు, 2017లో భంగం కలగలేదా అని ధర్మాసనం ప్రశ్నించగా కలగలేదని లాయర్ బదులిచ్చారు. కర్నాటక ప్రభుత్వ నిర్ణయం పూర్తిగా రాజకీయపరమైందని ఆరోపించారు. గతంలో బాను ముష్తాక్ మత వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. వాదనల అనంతరం ధర్మాసనం పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.తీర్పును స్వాగతించిన సీఎం సిద్ధరామయ్య మైసూరు దసరా ఉత్సవాలకు బాను ముష్తాక్ను ఆహ్వానించాలన్న తమ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య హర్షం వ్యక్తం చేశారు. మైసూరు దసరా ఉత్సవాలను మత కోణంలో చూడరాదన్నారు. అందరినీ కలుపుకుని పోయేందుకే ప్రభుత్వం ఈ ఉత్సవాలను నిర్వహిస్తోందని ఎక్స్లో తెలిపారు. -
సుప్రీంకోర్టులో వరవరరావుకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: విరసం నేత వరవరరావు(84)కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. చికిత్స విషయంలో ఆయన వేసిన ఓ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది. భీమా కోరేగావ్ కేసులో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అరెస్టైన ఆయన.. కోర్టు షరతులతో ముంబైలో ఉండిపోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే..వయోభారం, అనారోగ్య కారణాల నేపథ్యంలో హైదరాబాద్లో చికిత్స తీసుకునేందుకు అనుమతి కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ముంబైలో చికిత్సకు అధిక ఖర్చు అవుతోందని.. హైదరాబాదులో తమ బంధువులు డాక్టర్లైన నేపథ్యంలో అక్కడ చికిత్స పొందేందుకు అనుమతించాలని ఆయన పిటిషన్లో అభ్యర్థించారు. కానీ కోర్టు ఆ అభ్యర్థను తిరస్కరిస్తూ పిటిషన్ కొట్టేసింది. భీమా కోరేగావ్ హింస కేసులో పూణే పోలీసులు వరవరరావును ఉపా చట్టం కింద 2018 ఆగస్టు 28వ తేదీన అరెస్ట్ చేసి తలోజా జైలు(మహారాష్ట్ర)కు తరలించారు. ఆపై నెలలోపే సుప్రీం కోర్టు ఆదేశాలతో హైదరాబాద్లోని నివాసానికి తరలించి గృహనిర్బంధం చేశారు. మరో రెండు నెలల తర్వాత కోర్టు అనుమతితో తిరిగి తలోజా జైలుకు తరలించారు. అయితే..2020 జులైలో ఆయనకు జైలు కరోనా సోకడంతో వరవరరావుకు ఆరోగ్య సమస్యలు తీవ్రతరం అయ్యాయి. ఈ తరుణంలో.. మహారాష్ట్ర హైకోర్టు 2021 ఫ్రిబవరిలో మెడికల్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో షరతుల మీద ఆయన ముంబైలో అద్దె నివాసంలో ఉన్నారు. అటుపై 2022లో సుప్రీం కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ.. ముంబై విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. -
కుటుంబ పింఛనుకు సవతి తల్లి అనర్హురాలు
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం(ఐఏఎఫ్) నిబంధనల ప్రకారం పింఛను ‘బహుమతి కాదు’, సవతి తల్లిని కుటుంబ పింఛనుకు అర్హురాలిగా పరిగణించలేమని కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. చట్టపరంగా, బాంధవ్యం కోణంలో చూసినప్పుడు సవతి తల్లి కన్న తల్లికి భిన్నంగా ఉండటమే ఇందుకు కారణమని వివరించింది. తల్లి అంటే కన్నతల్లి అనే అర్థంలోనే భావించాల్సి ఉంటుందని, సవతి తల్లిని కాదని తెలిపింది. నిర్వహణ, ఇతర సంక్షేమ ప్రయోజనాలపై ఉన్నత న్యాయస్థానం గతంలో వివిధ సందర్భాల్లో ఇచి్చన తీర్పులను కేంద్రం ప్రస్తావించింది. పింఛను ప్రయోజనాలను కోరుకునే వ్యక్తి, సంబంధిత చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం స్పష్టమైన అర్హతను నిరూపించుకోవాల్సి ఉంటుందని గురువారం జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనానికి కేంద్రం తెలిపింది. జోగి అనే ఉద్యోగి చిన్న తనంలోనే ఆరేళ్ల వయస్సు ఉండగా కన్నతల్లి చనిపోయింది. దీంతో, తండ్రి మరొకరిని వివాహం చేసుకున్నారు. సవతి తల్లి జయశ్రీ ఆయన్ను పెంచి పెద్ద చేశారు. జోగి 2008లో చనిపోయారు. ఆయనది ఆత్మహత్య అని ఐఏఎఫ్ తెలిపింది. కుటుంబ పింఛనుకు వచ్చే సరికి సవతి తల్లి అర్హురాలు కాదని ఐఏఎఫ్ స్పష్టం చేసింది. దీంతో, ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తల్లి స్థానంలో తనకు కుటుంబ పింఛను ఇవ్వాలని కోరారు. ఐఏఎఫ్ పింఛను నిబంధనలు–1961 ప్రకారం ఉద్యోగి చనిపోయిన పక్షంలో కుటుంబ పింఛనుకు..వితంతువు, చట్టబద్ధంగా వివాహం చేసుకున్న తండ్రి లేదా తల్లి, చట్టబద్ధ వారసుడైన కుమారుడు లేదా కుమార్తె అర్హులని స్పష్టం చేస్తోందని కేంద్రం వివరించింది. ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది. -
‘‘ఆ దేవుడినే అడగండి..’’ సీజేఐ వ్యాఖ్యలపై దుమారం
న్యూఢిల్లీ: ధ్వంసమైన ఏడడుగుల విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.మధ్యప్రదేశ్లోని ఛాతర్పూర్జిల్లాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ప్రఖ్యాత ఖజురహో ఆలయ సముదాయంలోని జవారీ ఆలయంలో విష్ణుమూర్తి విగ్రహం ధ్వంసమైంది. ఈ విగ్రహాన్ని పక్కనబెట్టి కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించేలా ఆదేశాలు ఇవ్వాలని(Khajuraho Vishnu idol case) రాకేశ్ దలాల్ అనే వ్యక్తి ఈ పిల్ వేశారు. ఈ పిల్ స్వీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రనల్ ధర్మాసనం పరిశీలించింది. ‘‘ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు. పబ్లిసిటీ ప్రయోజన వ్యాజ్యం. ఇందులో మేం చేసేది ఏం లేదు. భారత పురతత్వ విభాగం(ఏఎస్ఐ) పరిధిలో ఆలయం ఉంది. వాళ్లనే అభ్యర్థించండి. లేదంటే మీరెలాగూ విష్ణుమూర్తికి పరమభక్తుడిని అని చెబుతున్నారుగా. ఆయననే వేడుకోండి. శైవత్వానికి మీరు వ్యతిరేకులు కాకపోతే అదే ఖజురహోలో అతిపెద్ద శివలింగం ఉంది. అక్కడ కూడా మీరు విన్నవించుకోవచ్చు. విగ్రహ పునరుద్ధరణ, పునర్నిర్మాణంపై ఏఎస్ఐ తుది నిర్ణయం తీసుకుంటుంది’’ అని వ్యాఖ్యానించారు. అయితే తీర్పు సందర్భంగా సీజేఐ జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఒక వర్గం మనోభావాలు దెబ్బ తీసేలా ఆయన మాట్లాడారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అంతేకాదు.. ఆయన్ని అభిశంసించాలంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. వినీత్ జిందాల్ అనే న్యాయవాది సీజేఐ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత రాష్ట్రపతికి, సుప్రీం కోర్ట్కు ఆయన ఓ లేఖ రాశారు. ప్రతి మత విశ్వాసానికి గౌరవం ఇవ్వాలి అని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. సత్యం సింగ్ రాజ్పుత్ అనే మరో న్యాయవాది జస్టిస్ బీఆర్ గవాయ్కు బహిరంగ లేఖ రాశారు. విష్ణుమూర్తి భక్తుడిగా ఆయన వ్యాఖ్యలు నన్ను వ్యక్తిగతంగా బాధించాయి. కాబట్టి వెంటనే ఆయన వాటిని ఉపసంహరించుకోవాలి అని లేఖలో డిమాండ్ చేశారు. ప్రస్తుతం సీజేఐ వ్యాఖ్యలపై న్యాయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. -
చార్జిషీట్లు వేసిన తర్వాత మళ్లీ దర్యాప్తు ఏంటి?
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు జరిపేలా సీబీఐని ఆదేశించాలన్న వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి అభ్యర్థనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. చార్జిషీట్ దాఖలయ్యాక ఇప్పుడు దర్యాప్తు కోరడం ఏమిటంటూ ఆమెను ప్రశ్నించింది. ఒకదానివెంట ఒకటి పిటిషన్లు వేస్తుంటే విచారణ పూర్తయ్యేదెప్పుడని ప్రశ్నించింది. దర్యాప్తు పూర్తయ్యాకే కదా చార్జిషీట్లు వేసిందని ప్రశ్నించింది.మీరు ఇపుడు చేస్తున్న వాదనలను విచారణ సందర్భంగా సీబీఐ కోర్టు దృష్టికి ఎందుకు తీసుకువెళ్లలేదని నిలదీసింది. ఇదే సమయంలో వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, శివశంకర్రెడ్డి తదితరులకిచి్చన బెయిల్ను రద్దు చేసే విషయంలో ఏ విధంగానూ జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ విషయంలో తాము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయబోమంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎం.సుందరేష్, జస్టిస్ సతీష్చంద్ర శర్మ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ రద్దు, తదుపరి దర్యాప్తు కోసం సునీత పిటిషన్లు... వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి, శివశంకర్రెడ్డి, భాస్కర్రెడ్డి తదితరులకు హైకోర్టు ఇచి్చన ముందస్తు బెయిల్, బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సునీతరెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాగే తదుపరి దర్యాప్తు జరిపేలా సీబీఐని ఆదేశించాలంటూ కూడా ఆమె పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై మంగళవారం జస్టిస్ సుందరేష్ ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. వివేకానంద రెడ్డి హత్య వెనుక ఉన్న కుట్రను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ విషయాన్ని సీబీఐ పట్టించుకోవడం లేదన్నారు. తదుపరి దర్యాప్తు చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. దానిని కోర్టు పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎస్.వి. రాజు స్పందిస్తూ, ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసిందని తెలిపారు. కోర్టు ఆదేశిస్తేనే తప్ప తదుపరి దర్యాప్తు చేయపట్టబోమన్నారు. 13 లక్షల డాక్యుమెంట్లను కోర్టు ముందుంచింది... వైఎస్ అవినాష్ రెడ్డి, శివశంకర్రెడ్డి, భాస్కర్రెడ్డి తదితరుల తరఫున సీనియర్ న్యాయవాదులు రంజిత్ కుమార్, నాగముత్తు వాదనలు వినిపించారు. సీబీఐ ఇప్పటికే దర్యాప్తును పూర్తి చేసిందని తెలిపారు. భారీ స్థాయిలో చార్జిషీట్లు కూడా దాఖలు చేసిందన్నారు. 13 లక్షల పేజీల డాక్యుమెంట్లను కోర్టు ముందు ఉంచిందని తెలిపారు. ఇప్పుడు తదుపరి దర్యాప్తు అంటే కింది కోర్టు విచారణ ముందుకెళ్లే అవకాశం ఉండదన్నారు. ఇలా అయితే దశాబ్ద కాలం పడుతుంది... ఈ సమయంలో లూథ్రా ఏదో చెప్పబోతుండగా, ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, చార్జిషీట్లు దాఖలైన తరువాత ఈ కేసును తాము పర్యవేక్షించడం ఏమిటంటూ ప్రశ్నించింది. ఇలా ఒక దాని వెంట మరొక పిటిషన్ దాఖలు చేసుకుంటూ వెళుతుంటే అసలు ట్రయల్ పూర్తి కావడానికే దశాబ్ద›కాలం పడుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇప్పుడు మీరు చెబుతున్న వాదనను దర్యాప్తు సమయంలోనే సీబీఐ కోర్టు దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించింది. నిందితులపై ఇప్పటికే సీబీఐ చార్జిషీట్లు దాఖలు చేసిందని గుర్తు చేసింది. ఇంతకన్నా చేసేది ఏముంటుందని ప్రశ్నించింది. ‘దర్యాప్తు పూర్తి చేసిన తరువాతనే కదా చార్జిషీట్లు వేసేది. మరి అలాంటప్పుడు తదుపరి దర్యాప్తు కోరడం ద్వారా మీరు ఏం సాధిద్దామని అనుకుంటున్నారు’ అంటూ సునీతను ప్రశ్నించింది. తదుపరి దర్యాప్తు కోసం పిటిషన్ దాఖలు చేసి దానిని ఓ తార్కిక ముగింపునివ్వాలంది. తదుపరి దర్యాప్తు విషయాన్ని సీబీఐ కోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. తాము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయబోమంది. అలాగే నిందితుల బెయిల్ రద్దు విషయంలో కూడా జోక్యం చేసుకునేది లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను డిస్ట్రర్బ్ చేయబోమంది. తదుపరి దర్యాప్తు కోసం సీబీఐ కోర్టునే ఆశ్రయించాలని సునీతను ధర్మాసనం ఆదేశించింది. రెండువారాల్లోగా తాజా పిటిషన్ దాఖరు చేసుకోవచ్చని, ఒకవేళ పిటిషన్ దాఖలు చేస్తే దానిని 8 వారాల్లోపు తేల్చాలని సీబీఐ కోర్టుకు తేల్చిచెప్పింది. సీబీఐ తనంతట తానుగా కాకుండా సీబీఐ కోర్టు ఆదేశాలు ఇస్తేనే తదుపరి దర్యాప్తు చేపట్టాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. -
ఉన్నంతలో ఉపశమనం
వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు సోమవారం జారీచేసిన మధ్యంతర ఆదేశాలు అటు పిటిషనర్లకూ, ఇటు కేంద్ర ప్రభుత్వానికీ పాక్షిక ఉపశమనం ఇచ్చాయి. చట్టంపై మొత్తంగా స్టే విధించకపోవటం కేంద్రానికి సంతృప్తి కలిగిస్తే, కొన్ని కీలకనిబంధనల అమలును నిలిపేయటం విపక్షాలకూ, పిటిషనర్లకూ సంతోషాన్నిచ్చింది. అయితే ఈ కేసులో పిటిషనర్ అయిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ వంటివారు ఈ ఉత్తర్వులపై నిరాశ పడకపోలేదు. పిటిషనర్లలో ఒవైసీతోపాటు ఎంపీలు మహువా మొయిత్రా(టీఎంసీ), మనోజ్ కుమార్ ఝూ(ఆర్జేడీ), జియావుర్ రహమాన్(కాంగ్రెస్) ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ కూడా చట్టాన్ని సవాలు చేశాయి. మొన్న ఏప్రిల్లో పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టంపై మొత్తం 65 పిటిషన్లు దాఖలయ్యాయంటేనే ఇదెంత వివాదాస్పదమైనదో అర్థమవుతుంది. చట్టం రాజ్యాంగబద్ధమో కాదో ఈ ఉత్తర్వులు తేల్చలేదు. తుది తీర్పు ఆ అంశాన్ని పరిశీలిస్తుంది. వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగానికి గురవుతున్నాయనీ, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేటు ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నాయనీ కేంద్రం భావించింది. వాటిని చక్కదిద్దే ఉద్దేశంతోనే సవరణలు తెచ్చామని చెప్పింది. ముఖ్యంగా రిజిస్టర్ కాకపోయినా నిరాటంకంగా వక్ఫ్ అధీనంలో ఉంటే ఆ ఆస్తులు దానికే చెందుతాయన్న (వక్ఫ్ బై యూజర్) భావనను ఈ చట్టం రద్దు చేసింది. ఇకపై వక్ఫ్ ఆస్తులకు లిఖిత పూర్వక దస్తావేజు ఉండి తీరాలని నిర్దేశించింది. సుప్రీంకోర్టు ఈ నిబంధనపై స్టే విధించేందుకు నిరాకరించింది. కొన్నేళ్లుగా ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురవుతున్నాయని చట్టసభ గుర్తించి, దాన్ని నివారించాలనుకోవటం ఏకపక్ష చర్య ఎలా అవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే వక్ఫ్ ఆస్తులకు 1995 నాటి చట్టం ఒక ప్రత్యేక ప్రతిపత్తినిచ్చింది. దాని ప్రకారం వక్ఫ్ ఆస్తి దురాక్రమణకు గురైందని ఏ దశలో గుర్తించినా దాని స్వాధీనానికి వక్ఫ్ బోర్డు చర్యలు తీసుకోవచ్చు. తాజా సవరణ దీన్ని రద్దు చేయటాన్ని ధర్మాసనం సమర్థించింది. ఇతర ఆస్తులతో సమానంగా పరిగణించటం వివక్ష తొలగింపే అవుతుందని భావించింది.అన్య మతస్థులు కనీసం అయిదేళ్లుగా ఇస్లాం ఆచరణలో ఉంటేనే వక్ఫ్కు ఆస్తులు దానం చేయొచ్చన్న నిబంధనపై ధర్మాసనం స్టే విధించటం ఒక రకంగా ఊరట. ఇస్లాం ఆచరణంటే ఏమిటో చట్టం వివరించకపోవటం, దాన్ని గుర్తించటానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు చేసే నిబంధనలు, అందుకోసం ఏర్పాటయ్యే వ్యవస్థ సంగతి తేలేవరకూ ఈ నిబంధన నిలిచిపోతుంది. పౌరులు తమ ఆస్తిని ఎలా ఉపయోగించాలో నిర్ణయించుకునే హక్కు రాజ్యాంగంలోని 300వ అధికరణం ఇచ్చింది. అన్య మతస్థులు వక్ఫ్ బోర్డుకు ఆస్తులివ్వరాదన్న నిబంధన దీన్ని ఉల్లంఘించటం లేదా? తుది తీర్పులోనైనా దీన్ని పరిశీలించక తప్పదు. వివాదాస్పద ఆస్తులపై వక్ఫ్ బోర్డుకూ, ప్రభుత్వాలకూ తగువు ఏర్పడినప్పుడు కలెక్టర్ స్థాయి అధికారి నిర్ణయించవచ్చన్న నిబంధనపై ధర్మాసనం స్టే ఇచ్చింది. ఈ నిబంధనలో మరో వైపరీత్యముంది. అసలు అలాంటి విచారణ మొదలైన మరుక్షణమే అది వక్ఫ్ ఆస్తిగా పరిగణించటానికి వీల్లేదని చెబుతోంది. మొత్తానికి వివాదాలను ట్రైబ్యునల్స్ లేదా హైకోర్టులు మాత్రమే తేల్చాలనటం సరైన నిర్ణయం. అయితే వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు స్థానం కల్పించాలన్న నిబంధనను కొంత మార్పుతో అలాగే ఉంచటం సబబు కాదు. హిందూ, సిక్కు, క్రైస్తవ మతాలకు చెందిన సంస్థల్లో అన్య మతస్థులకు చోటు లేనప్పుడు, వక్ఫ్ బోర్డుల్లో మాత్రం ఎందుకుండాలి?వక్ఫ్ చట్టంలో సమస్యలున్నాయి... సరిచేయమని కోరేవారిలో ఆ మతస్థులూ ఉన్నారు. అలా చేసే ముందు ముస్లిం మతాచార్యులతో, ముస్లిం పర్సనల్ లా బోర్డుతో మాట్లాడాలి. పార్టీల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలి. పార్లమెంటులో అలజడి రేగాక బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) ఏర్పాటు చేశారు సరే... కానీ విపక్షాల అభ్యంతరాలను పట్టించుకున్నారా? సమర్థమైన, లోప రహితమైన విధానాలు తీసుకురాదల్చుకుంటే స్వాగతించాల్సిందే. కానీ ఆ విషయంలో ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించాలి. అటువంటి చర్య ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుంది. -
చట్టవిరుద్ధం అని తేలితే పక్కన పడేస్తాం: సుప్రీం
న్యూఢిల్లీ: బిహార్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ ఏమాత్రం చట్టవిరుద్ధంగా అనిపించినా మొత్తం ప్రక్రియను పక్కన పడేస్తామని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. ఎస్ఐఆర్ చట్టవిరుద్ధంగా చేపడుతున్నారంటూ దాఖలైన పిటిషన్లపై సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని హెచ్చరించింది. ‘‘ రాజ్యాంగబద్ధ సంస్థగా ఎలక్షన్ కమిషన్ ప్రతి పనినీ చట్టప్రకారమే నిర్వర్తిస్తుందని మేం మొదట్నుంచీ భావిస్తున్నాం. అయితే కొత్తగా చేపట్టిన ఎస్ఐఆర్ ఏ దశలోనైనా చట్టవిరుద్ధమని తేలితే మొత్తం విధానాన్ని రద్దుచేస్తాం. ఇప్పటికిప్పుడే ఎస్ఐఆర్పై తుది నిర్ణయానికి రాబోం. కేసులో చివరి వాదోపవాదనలను అక్టోబర్ ఏడోతేదీన ఆలకిస్తాం. ఈ కేసులో మేం ఇచ్చే తుది తీర్పు బిహార్కు మాత్రమేకాదు యావత్భారతదేశానికి వర్తిస్తుంది. ప్రస్తుతానికి ఎస్ఐఆర్లాంటి ప్రక్రియను ఇతర రాష్ట్రాల్లో ఈసీ చేపట్టినా మేం అడ్డుచెప్పబోం. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అమలుపై అభ్యంతరాలు ఉంటే పిటిషనర్లు తమ వాదనలను అక్టోబర్ ఏడో తేదీన వినిపించుకోవచ్చు. అక్టోబర్ ఏడున కేసు విచారణ ఉండబోతోంది ఆలోపే అంటే సెప్టెంబర్ 30వ తేదీన బిహార్ ఓటర్ల తుది జాబితా ముద్రణ ఉండబోతోంది. ఈ తేదీకి కేసు విచారణకు ఎలాంటి సంబంధం లేదు. ఆ తుది జాబితాలో ఏవైనా చట్టవిరుద్ధత కనిపిస్తే ఎస్ఐఆర్ ప్రక్రియను అప్పడైనా రద్దుచేస్తాం’’ అని కోర్టు స్పష్టంచేసింది. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది, పిటిషన్ వేసిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఎస్ఐఆర్ చేపట్టేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోందని, ఈ విషయంలో ఈసీని అడ్డుకోవాలని న్యాయవాది గోపాల్ వాదించారు. ‘‘ అసలు ఈ విధానంలో చట్టబద్ధతను ఇంకా తేల్చాల్సి ఉంది. రాజ్యాంగంలో ఇలాంటి విధానం నియమనిబంధనలను పరిశీలించాల్సి ఉంది. ఆలోపే ఇతర రాష్ట్రాల్లో ప్రక్రియను ఆపాలని ఈసీకి ఆదేశాలు ఇవ్వలేం’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. దేశవ్యాప్త ఎస్ఐఆర్పై ఈసీ మరింత ముందుకు వెళ్లేలోపే ఈసీని నిలువరించాలని కాంగ్రెస్సహా పలు విపక్ష పార్టీల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్సిబల్ కోర్టును కోరారు. చట్టాన్ని తుంగలోతొక్కి ఈసీ తన సొంత నిర్ణయాలను అమలుచేస్తోందని రాష్ట్రీయ జనతాదళ్ తరఫున సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదించారు. ‘‘జాబితాలో తప్పులుంటే 24 గంటల్లోపు వెబ్సైట్లో అభ్యంతరాలను అప్లోడ్చేయాలని ఈసీ చెబుతోంది. ఇది చాలా కష్టమైన పని’’ అని ఆయన వాదించారు. -
వక్ఫ్ సవరణ చట్టం: ఐదేళ్ల నిబంధన కుదరదు
న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదంగా తయారైన వక్ఫ్(సవరణ) చట్టం–2025 విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సోమవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చట్టంలోని ఒక ముఖ్యమైన నిబంధనపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల ధర్మాసనం 128 పేజీల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఒక వ్యక్తి తన ఆస్తిని వక్ఫ్ కోసం దానంగా ఇవ్వడం వంటికి చేయాలంటే కనీసం గత ఐదేళ్లుగా ఇస్లాంను ఆచరిస్తూ ఉండాలన్న నిబంధనపై అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ మేరకు వక్ఫ్(సవరణ) చట్టంలోని సంబంధిత నిబంధనపై స్టే విధించింది. ‘‘ ఐదేళ్లుగా ఇస్లామ్ను పాటించాలి అనే నిబంధనలో స్పష్టత కరువైంది. సంపూర్ణ నిర్వచనంతో, సమగ్రస్థాయిలో ఈ అంశంపై స్పష్టత వచ్చేలా నిబంధనలు తయారుచేసేవరకు ఈ ప్రొవిజన్ అమలును నిలిపేస్తున్నాం. ఏదైనా చట్టం రాజ్యాంగబద్ధంగా ఉందనే భావిస్తాం. కేవలం అరుదైన కేసుల్లో అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే జోక్యం చేసుకోవడం సబబు. వక్ఫ్ చట్టంలోని అన్ని నిబంధనల అమలుపై స్టే విధించాలన్న వాదనల్లో పసలేదు. అందుకే మొత్తం చట్టంపై స్టే విధించట్లేము. అయితే ఇరుపక్షాల వాదనలు విన్నాక రెండువైపులా సమతుల న్యాయం దక్కాలని చూస్తున్నాం. అందుకే వక్ఫ్ ఆస్తుల స్థితిని కలెక్టర్ మార్చే అధికారం అమలుకాకుండా స్టే విధిస్తున్నాం. అలాగే వక్ఫ్ బోర్డ్లలో ముస్లిమేతర సభ్యుల అంశంపై కలెక్టర్ నిర్ణయాలు తీసుకోకుండా స్టే విధిస్తున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది. మరోవైపు, ‘‘చాన్నాళ్లుగా వక్ఫ్ భూమిగా చెలామణి అయినంతమాత్రాన అది వక్ఫ్ భూమి కాబోదు. ప్రభుత్వ భూమి అయినాకూడా వక్ఫ్ ఆస్తిగా చెలామణిలో ఉన్నంత మాత్రాన అది వక్ఫ్ ఆస్తికాబోదు. వక్ఫ్ బై యూజర్ నిబంధన తొలగింపు సబబే’’ అని ధర్మాసనం మోదీ సర్కార్ చర్యను సమరి్థంచడం గమనార్హం. నాలుగు.. మూడుకు మించకూడదు ‘‘ కేంద్ర వక్ఫ్ మండలిలో ముస్లిమేతర సభ్యుల సంఖ్య నాలుగుకు మించకూడదు. మొత్తం సభ్యుల సంఖ్య 20 దాటకూడదు. అలాగే రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డ్లలో ముస్లిమేతర సభ్యుల సంఖ్య మూడుకు మించకూడదు. మొత్తం సభ్యుల సంఖ్య 11 దాటకూడదు. కనీసం ఐదేళ్లుగా ఒక వ్యక్తి ఇస్లాంను ఆచరిస్తున్నట్లు నిర్ధారించే కచ్చితమైన నిబంధనావళిని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించేదాకా ‘వక్ఫ్కు ఆస్తి ఇవ్వాలంటే ఐదేళ్లుగా ఇస్లాంను పాటించాలి’ అనే సెక్షన్3 లోని (ట) క్లాజుపై స్టే విధిస్తున్నాం. సంబంధిత అధికారి తన నివేదికను సమరి్పంచేదాకా ఏదైనా ఆస్తి ‘వక్ఫ్ ఆస్తి’ అని కొత్తగా ప్రకటించడానికి వీల్లేదు. ఏదైనా ఆస్తి ఒకవేళ ప్రభుత్వ ఆస్తి అయి ఉండవచ్చని ఆ అధికారి భావిస్తే ఆ మేరకు రెవిన్యూ రికార్డుల్లో సవరణ చేయొచ్చు, ఈ అంశాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలి అనే నిబంధనలపైనా స్టే విధిస్తున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది. ‘‘వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 3సీ కింద వక్ఫ్ ఆస్తిగా ప్రకటించని సందర్భంలో, ట్రిబ్యునల్ ఆదేశంతో సవరణ చట్టంలోని సెక్షన్ 83ని అమలుచేసి సందర్భంలో, హైకోర్టు తదుపరి ఆదేశం కోసం వేచి ఉన్న సందర్భాల్లో అలాంటి ఆస్తులను ఇక వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించకూడదు, రెవెన్యూ రికార్డుల్లో నమోదుచేయకూడదు’’ అని నిబంధనలపైనా స్టే విధిస్తున్నాం’’అని కోర్టు స్పష్టంచేసింది. వివాదాస్పద ఆస్తి ఎవరికి చెందుతుంది అనేది ట్రిబ్యునళ్లు, హైకోర్టుల్లో తేలేదాకా ఆ ఆస్తులపై మూడో పక్షానికి హక్కులు దఖలుపర్చకూడదు అని కోర్టు ఆదేశించింది. ముస్లింల వర్గానికి ఎక్స్–అఫీషియో కార్యదర్శిగా సేవలందించే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామానికి బాటలు వేసే సెక్షన్ 23పై కోర్టు ఎలాంటి స్టే విధించలేదు. చట్టంలో పేర్కొన్న ప్రకారం వక్ఫ్ అనేది ముస్లింలు ఇచ్చే విరాళం, దానం. తమ భూములు, స్థిరాస్థులను దాతృత్వ, మత సంబంధ కార్యక్రమాల కోసం దానం(వక్ఫ్)గా ఇవ్వొచ్చు. ఈ భూముల్లో మసీదులు, పాఠశాలలు, ఆస్పత్రులు, ప్రజాసంస్థలు ఏర్పాటుచేసుకోవచ్చు. వక్ఫ్గా మారిన ఆస్తిని ఇతరులకు విక్రయించకూడదు, ఇంకొకరికి బహుమతిగా ఇవ్వకూడదు, వారసత్వంగా పొందకూడదు, ఆక్రమించకూడదు. వక్ఫ్ బై యూజర్ తొలగింపులో వివాదం లేదు ‘‘ పెద్ద మొత్తంలో ప్రభుత్వభూములు ఆక్రమణకు గురై చాన్నాళ్లుగా వక్ఫ్ వినియోగంలో ఉన్నాయి. నిరాటంకంగా వక్ఫ్ అ«దీనంలో ఉంటే అవి వక్ఫ్ బై యూజర్ నిబంధన ప్రకారం వక్ఫ్ ఆస్తులుగా మారుతున్నాయి. ఇది తప్పు అని భావించి ఈ నిబంధనను ప్రభుత్వం తొలగించింది. ఈ తొలగింపులో ఎలాంటి వివాదం లేదు’’ అని సీజేఐ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు.స్వాగతించిన కాంగ్రెస్ ‘‘కీలక సెక్షన్లను నిలుపుదల చేస్తూ కోర్టు ఇచి్చన తీర్పును స్వాగతిస్తున్నాం. ఈ ఉత్తర్వు రాజ్యాంగ విలువలైన న్యాయం, సమానత్వ, సౌభ్రాతృత్వం గెలుపునకు నిదర్శనం. వాస్తవిక వక్ఫ్ చట్టాన్ని కాలరాస్తూ మోదీ సర్కార్ తీసుకొచి్చన తప్పుడు సవరణలను తొలగించేలా తుది తీర్పు వెలువడుతుందని ఆశిస్తున్నాం’’ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’లో ఒక పోస్ట్చేశారు. ‘‘ భారత్లో ఎప్పుడూ సద్దుమణిగిన అంశాలను మోదీ సర్కార్ ఎగదోస్తోంది. విద్వేషాలను పెంచేందుకు ఈ విభజన చట్టాన్ని బుల్డోజర్లా తీసుకొచి్చంది’’ అని అన్నారు. చాలావరకు ఆమోదించినట్లే: బీజేపీ‘‘మేం తెచి్చన సవరణలను కోర్టు ఆమోదించింది. మొత్తం చట్టంపై స్టే విధించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టంచేసింది. అంటే మెజారిటీ చట్టం చట్టబద్ధంగా ఉందని కోర్టే స్పష్టంచేసినట్లయింది. వక్ఫ్ బై యూజర్ మాటున ఇకపై వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల ఆక్రమణ అనేది ఇకపై ఆగుతుంది. కోర్టు నిర్ణయాలను మేం కూడా స్వాగతిస్తున్నాం’’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లీ చెప్పారు. మధ్యంతర ఉత్తర్వులోని కీలకాంశాలు → ఐదేళ్లుగా ఇస్లాంను పాటిస్తున్న వ్యక్తి మాత్రమే వక్ఫ్(దానం) ఇవ్వాలన్న సెక్షన్ 3(1)(ట)ను నిలుపుదల చేసింది→ ఐదేళ్లుగా ఇస్లాంలో కొనసాగుతున్నారో లేదో తేల్చే నిబంధనలు రూపొందేదాకా సెక్షన్ 3(1)(ట)పై స్టే అమలు→ సంబంధిత ఆఫీసర్ నివేదించాడన్న ఒకే ఒక్క కారణంగా వక్ఫ్ ఆస్తిని వక్ఫ్కాని ఆస్తిగా పనిగణించకూడదు→ అలాంటి నివేదికలను ఆధారంగా చేసుకుని వక్ఫ్ రికార్డులతోపాటు ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో సవరణలు చేయకూడదు→ హైకోర్టు ఆదేశాల మేరకు వివాదాస్పద ఆస్తులపై సెక్షన్ 83 కింద వక్ఫ్ ట్రిబ్యునళ్లు ఇచ్చే నిర్ణయాలు అమలయ్యేలోపు వక్ఫ్ బోర్డ్లు ఎలాంటి ఆస్తులను తమ ఆస్తులుగా, తమవికాని ఆస్తులుగా ప్రకటించకూడదు→ సీఈవోగా నియమించబోయే వ్యక్తిని వీలైనంత వరకు ముస్లిం వర్గం నుంచే ఎంపికచేయాలి→ ఇవన్నీ మధ్యంతర ఉత్తర్వులే. ఈ ఉత్తర్వులు ఇచి్చనంత మాత్రాన సవరణ చట్టం చట్టబద్ధతపై తమ తమ వాదనలను ఇరుపక్షాలు వాదించే అవకాశం లేదని భావించకూడదు.ముస్లిం సంస్థల హర్షం వక్ఫ్ సవరణచట్టంలో ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న కీలక నిబంధనల అమలుపై కోర్టు స్టే విధంచడంతో ముస్లిం సంఘాలు ఆనందం వ్యక్తంచేశాయి. తుది తీర్పు సైతం ముస్లింలకు అనుకూలంగా రావాలని ఆశాభావం వ్యక్తంచేశాయి. ‘‘ ఈ మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం’’ అని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్బీ) ఒక ప్రకటనలో పేర్కొంది. కొన్ని నిబంధనలకు బదులు మొత్తం సవరణ చట్టాన్నే రద్దుచేయాలని ఆలిండియా షియా పర్సనల్ లా బోర్డ్(ఏఐఎస్పీఎల్బీ) ఆశాభావం వ్యక్తంచేసింది. ‘‘ఐదేళ్లుగా ఇస్లాంను పాటిస్తేనే వక్ఫ్ అనే నిబంధనపై స్టే విధించడం పెద్ద ఊరట. ఇక వక్ఫ్ బోర్డ్లో ముస్లిమేతర సభ్యుని అంశం అలాగే ఉండిపోయింది’’అని ఏఐఎంపీఎల్బీ కార్యనిర్వాహక సభ్యుడు ఖలీద్ రషీద్ ఫరాంగీ మహాలీ అన్నారు. -
వంతారాకు ఊరట
అనంత్ అంబానీ (Anant Ambani) స్థాపించిన వంతారా (Vantara) సంస్థకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. నిబంధనలకు అనుగుణంగా వంతారాకు ఆలయ ఏనుగుల (Elephants)ను తరలిస్తే.. అందులో ఎలాంటి తప్పూ లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ క్రమంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏనుగుల తరలింపుపై సంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది.గుజరాత్ జామ్నగర్లోని వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి ఏనుగుల తరలింపును సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిపింది. ఈ క్రమంలో ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా వంతారాకు క్లీన్చిట్ ఇచ్చినట్లు జస్టిస్ పంకజ్ మిథల్, జస్టిస్ పీబీ వరాలేలతో కూడిన ధర్మాసనం గుర్తు చేసింది. ఏనుగుల తరలింపులో తప్పులేమీ లేదు, నిబంధనల ప్రకారం జరిగితే సరే. ఏనుగులు బాధపడుతున్నాయ్ అని చెప్పినప్పుడు.. దానికి ఆధారాలేమిటో కూడా పిటిషనర్ చూపించాలి కదా. ఇది దేశ గర్వంగా భావించే విషయం. కాబట్టి దీన్ని తక్కువ చేయకండి. పిటిషన్లో పేర్కొన్న ఆరోపణలు అస్పష్టమైనవిగా కనిపిస్తున్నాయి. విచారణ కొనసాగించాలంటే, పిటిషనర్లు తమ వాదనలను స్పష్టంగా, ఆధారాలతో సమర్పించాల్సిన అవసరం ఉంది అని కోర్టు అభిప్రాయపడింది.ఈ క్రమంలో.. వంతారాలో బందీలుగా ఉన్న ఏనుగులను వాటి యజమానులకు తిరిగి ఇవ్వడానికి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ జయసుకిన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను అస్పష్టమైనదిగా న్యాయస్థానం తోసిపుచ్చింది. వంతారాపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం ఈవిషయంపై వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. వంతారాలో చట్టాలను పాటించట్లేదని.. విదేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి ఏనుగులను అక్రమంగా తీసుకువస్తున్నారని ఆరోపిస్తూ.. ఇటీవల పలు వన్యప్రాణుల సంరక్షణ సంస్థలు సుప్రీంకోర్టు (Supreme Court)లో పిల్ దాఖలు చేశాయి. దీనిపై దర్యాప్తు చేయడానికి ఇటీవల సుప్రీంకోర్టు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ.. వంతారా సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలు, వన్యప్రాణుల సంక్షేమం, ఆర్థిక పారదర్శకత వంటి అంశాల్లో సవ్యంగా ఉందంటూ నివేదికను ఇచ్చింది. ఆ నివేదికను సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించింది కూడా. అయితే ఇదంతా బయటి దేశాల నుంచి జరుగుతున్న కుట్ర అని, భారత్ చేస్తున్న మంచి పనులపై జంతువుల వేటను అనుమతించే దేశాలు ఈవిధంగా అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయని.. ఈ విషయంలో దర్యాప్తునకు తాము అన్నివిధాలా సిట్కు సహకరిస్తామని వంతారా తరఫు న్యాయవాది మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. -
వక్ఫ్ చట్టంపై స్టేకి సుప్రీం కోర్టు నిరాకరణ, కానీ..
వక్ఫ్ (సవరణ) చట్టం Waqf (Amendment) Act, 2025పై దేశసర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర తీర్పును వెలువరించింది. చట్టం అమలుపై(అన్ని ప్రొవిజనల్స్)పై స్టే విధించేందుకు నిరాకరిస్తూనే.. చట్టంలో కీలక ప్రొవిజన్స్ను నిలిపివేస్తూ సోమవారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బీఆర్ గవాయ్ ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. ఇందులో.. ప్రధానంగా ఐదేళ్లు ఇస్లాం మతం ఆచరిస్తేనే వక్ఫ్ చేయాలన్న సెక్షన్ కూడా ఉంది. కనీసం ఐదేళ్లపాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న దానిని నిలిపివేసింది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్లు నిర్ణయించేలా నిబంధనలు తయారుచేసేవరకు ఇది అమల్లో ఉండదని చెప్పింది. అదే సమయంలో వక్ఫ్(సవరణ)చట్టం-2025పై మొత్తంగా స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కొన్ని సెక్షన్లకు మాత్రం కొంత రక్షణ అవసరమని వ్యాఖ్యానించింది. వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య కచ్చితంగా మెజార్టీలో ఉండాలని కోర్టు పేర్కొంది. బోర్డ్ లేదా కౌన్సిల్లో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర సభ్యులు ఉండాలని చెప్పింది. ఇక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ముస్లిమే ఉండటం మంచిదని పేర్కొంది.మధ్యంతర ఆదేశాల్లో హైలైట్స్వక్ఫ్ ఆస్తులా ? కావా ? అన్నది కోర్టులే నిర్ణయిస్తాయిప్రభుత్వ ఆస్తులను వక్ఫ్ ఆక్రమించిందా? లేదా? అనే అంశంపై నిర్ణయించే అధికారం అధికారులకు కట్టబెట్టిన సెక్షన్ పై స్టే ఐదేళ్లు ఇస్లాం మతం ఆచరిస్తేనే వక్ఫ్ చేయాలన్న సెక్షన్ పై స్టేఈ అంశంపై ప్రభుత్వం తగిన నిబంధనలు రూపొందించే వరకు స్టే విధించిన సుప్రీంవక్ఫ్ ఆస్తుల డీనోటిఫికేషన్: కోర్టు ఈ అంశంపై తాత్కాలికంగా ప్రభుత్వ చర్యలకు పరిమితి విధించింది. ఇప్పటికే వక్ఫ్గా గుర్తించబడిన ఆస్తుల స్థితిని తక్షణంగా మార్చకూడదని సూచించింది.వక్ఫ్ బోర్డుల సభ్యత్వం: ముస్లిమేతరుల నియామకంపై అభ్యంతరాలు ఉన్నా.. కోర్టు తాత్కాలిక స్టే ఇవ్వలేదు. కానీ ఈ అంశంపై వివరణాత్మక విచారణ అవసరమని పేర్కొంది.సెంట్రల్ వక్ఫ్ బోర్డులో నలుగురికి మించి ముస్లిమేతరులను నియమించవద్దుస్టేట్ వక్ఫ్ బోర్డులో ముగ్గురికి మించి ముస్లిమేతరులను నియమించవద్దుకలెక్టర్ విచారణ ద్వారా ప్రభుత్వ భూమిగా గుర్తింపు: ఈ నిబంధనపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోర్టు సూచించింది. ఆ అధికారం కలెక్టరలకు లేదని.. ట్రిబ్యూనల్స్కే ఉందని స్టే విధించింది. ఇది ఆస్తుల హక్కులపై ప్రభావం చూపే అంశంగా పేర్కొంది.సెక్షన్ 3r - ఇస్లాం ఆచరిస్తూ 5 సంవత్సరాలు కావాలి. నియమాలు రూపొందించకపోతే, అది యాదృచ్ఛిక అధికార వినియోగానికి దారి తీస్తుంది.సెక్షన్ 2(c) నిబంధన - వక్ఫ్ ఆస్తి, వక్ఫ్ ఆస్తిగా పరిగణించబడదు.సెక్షన్ 3C - రెవిన్యూ రికార్డుల్లో సవాలు చేస్తూ కలెక్టర్కు హక్కులు నిర్ణయించే అధికారం ఇవ్వడం, అధికార విభజనకు విరుద్ధం. తుది తీర్పు వచ్చే వరకు ఆస్తుల హక్కులు ప్రభావితం కావు. హక్కు నిర్ణయించకముందు, వక్ఫ్ కూడా ఆస్తి నుండి తొలగించబడదు.సెక్షన్ 23 - ఎక్స్ ఆఫీషియో అధికారి ముస్లిం సమాజానికి చెందినవారే కావాలి.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ కేసు ఏప్రిల్లో పార్లమెంట్ ఈ బిల్లును క్లియర్ చేసిన గంటల్లోనే సుప్రీంకోర్టుకు చేరింది. ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ 72 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు కాగా.. వీటన్నింటిని ఒక్కటిగా కలిపి కోర్టు విచారణ జరిపి మధ్యంతర ఆదేశాలిచ్చింది. ఈ తీర్పు చట్టాన్ని నిలిపివేయకుండా.. కీలకాంశాలపై పరిమితి విధిస్తూ సమగ్ర విచారణకు మార్గం వేసింది. అంతకు ముందు..ఈ పిటిషన్లను సీజేఐ(పూర్వపు) జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం మే 5న విచారణ చేపట్టి, తదుపరి విచారణను మే 15కి వాయిదా వేసింది. ఆపై జస్టిస్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయడంతో.. తదుపరి సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం విచారణ జరిపింది. వాదనలు పూర్తి కావడంతో మే 22వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ ఆ తీర్పును ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. అయితే ఇది మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే. రాజ్యాంగబద్ధతపై పూర్తి విచారణ ఇంకా జరగాల్సి ఉంది.వాదనలు.. వక్ఫ్ అనేది మతపరమైన అవసరం కాదు, ఇది చారిటబుల్ కాన్సెప్ట్ అని కేంద్రం వాదించింది. అయితే పిటిషనర్లు ఈ చట్టాన్ని అన్యాయమైనది, అసంవిధానమైనది, ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసిందని అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో కోర్టు.. చట్టానికి రాజ్యాంగబద్ధత ఉందని కేంద్రం చెప్పిందని, కాబట్టి పూర్తి స్టే ఇవ్వడం అనవసరం అని అభిప్రాయపడుతూ కీలక అంశాలపై మాత్రం స్టే విధించింది. -
బాణసంచాపై దేశవ్యాప్త నిషేధం ఉండాలి
న్యూఢిల్లీ: బాణసంచా వినియోగంపై దేశ రాజధాని ఢిల్లీ(ఎన్సీఆర్)లో మాత్రమే ప్రత్యేకంగా నిషేధం ఎందుకు విధించాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీలోని కొందరు ధనవంతులు మాత్రమే స్వచ్ఛమైన గాలికి అర్హులా? దేశంలోని ప్రజలంతా స్వచ్ఛమైన గాలి పీల్చుకునేందుకు అర్హులేనని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ బీఆర్ గవాయ్ సారథ్యంలోని ధర్మాసనం శుక్రవారం దేశ రాజధాని ప్రాంతంలో బాణసంచా వినియోగాన్ని నియంత్రించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది. ‘ఎన్సీఆర్ పరిధిలోని నగరాల్లో ప్రజలకు మాత్రమే పరిశుభ్రమైన గాలికి అర్హులా? మిగతా నగరాల్లోని పౌరులకు ఎందుకు కారు? ఇక్కడ ఎలాంటి విధానముందో దేశవ్యాప్తంగానూ అదే ఉండాలి. ఉన్నత పౌరులుంటున్నారనే కారణంతో ఢిల్లీకి ప్రత్యేకంగా ఒక విధానాన్ని రూపొందించలేం. గత శీతాకాలంలో అమృతసర్ వెళ్లాను. గాలి కాలుష్యం అక్కడ ఢిల్లీ కంటే దారుణంగా ఉంది. బాణసంచాపై నిషేధమే విధించాల్సి వస్తే, అది దేశమంతటా ఉండాలి’అని సీజేఐ పేర్కొన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు గ్రీన్ క్రాకర్స్ను తక్కువ రసాయనాలను వినియోగించి రూపొందించే విధానంపై నేషనల్ ఎని్వరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(నీరి) కసత్తు చేస్తోందని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం బాణసంచా తయారీ, విక్రయాల లైసెన్సులపై యథాతథ పరిస్థితిని కొనసాగించాలని పేర్కొన్న ధర్మాసనం..తదుపరి విచారణను 22వ తేదీకి వాయిదా వేసింది. -
బెయిల్ పిటిషన్పై రెండు నెలల్లోగా తేల్చాలి
న్యూఢిల్లీ: సాధారణ, ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణను దీర్ఘకాలంపాటు ఆలస్యం చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటువంటి చర్య న్యాయాన్ని నిరాకరించడమే కాదు, రాజ్యాంగ హక్కులను నిరాకరించడం కూడా అవుతుందని పేర్కొంది. బెయిల్ పిటిషన్లు దాఖలైన తేదీ నుంచి రెండు నెలల్లోగా వాటిపై నిర్ణయాన్ని వెలువరించాలని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన దరఖాస్తులను ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచలేమని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ల ధర్మాసనం తెలిపింది. తమ పరిధిలోని దిగువ కోర్టుల్లోనూ బెయిల్ పిటిషన్లపై సత్వర నిర్ణయాలు తీసుకునేలా పర్యవేక్షించాలని హైకోర్టులకు సూచించింది. దీనిపై తగు మార్గదర్శకాలను జిల్లా కోర్టులకు పంపించాలని ఆదేశించింది. దర్యాప్తు సంస్థలు కేసుల దర్యాప్తును త్వరితగతిన ముగించాలని ధర్మాసనం కోరింది. మోసం కేసులో తన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను బాంబే హైకోర్టు తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం పైవిధంగా స్పష్టతనిచి్చంది. -
‘మీరు కొంచెం మసాలా యాడ్ చేశారు’.. కంగనా రనౌత్కు సుప్రీంకోర్టు చీవాట్లు
సాక్షి,న్యూఢిల్లీ: సినీ నటి, బీజేపీ ఎంపీ కంగనా రౌనత్కు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. రైతు చట్టాల ఆందోళనపై మీరు రీట్వీట్ మాత్రమే చేయలేదు. కొంచెం మసాలా యాడ్ చేశారని మండిపడింది. 2020-21లో రైతు చట్టాలకు సంబంధించిన ఆందోళన సమయంలో కంగనారౌనత్ ఓ మహిళా రైతును ఉద్దేశిస్తూ రీట్వీట్ చేశారు. ఆ రీట్వీట్ వివాదాస్పదమైంది. దీంతో మహిళా రైతు కంగనారౌనత్పై పరువు నష్టం దావా వేశారు. తాజాగా, పంజాబ్ రాష్ట్రం బాథిండా కోర్టులో తనపై నమోదైన పరువు నష్టం దావా కేసును కొట్టి వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఆ పిటిషన్పై దేశ అత్యున్నత న్యాయ స్థానం ఇవాళ విచారణ చేపట్టింది. విచారణలో కంగనాపై నమోదైన కేసును కొట్టివేసేందుకు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. అంతేకాదు.. మహిళ రైతు గురించి మీరు ట్వీట్లు మాత్రమే కాదు మసాల్ యాడ్ చేశారు’అని వ్యాఖ్యానించింది. దీంతో ఆమె తరఫు న్యాయవాది పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు.2020-21 దేశ రాజధాని ఢిల్లీ రైతు చట్టాల్ని వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో మరో ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. అయితే, రైతులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న మహీందర్ కౌర్.. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పాల్గొన్న బిల్కిస్ బానో ఇద్దరూ ఒకటేనంటూ తాను చేసిన పోస్టును కంగనా రీట్వీట్ చేశారు. ఆ రీట్వీట్పై మహీందర్ కౌర్ కోర్టును ఆశ్రయించారు. ఆ కేసునే కొట్టేయొమని కంగాన న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తున్నారు. కంగనా ఇప్పటికే పంజాబ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించినా.. అక్కడ కూడా ఆమెకు ఊరట లభించలేదు. ఇప్పుడు సుప్రీం కోర్టు సూచన మేరకు ఆమె ట్రయల్ కోర్టులోనే న్యాయపరమైన పరిష్కారం కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది. -
రాజ్యాంగానికి కాపలాదారులం
న్యూఢిల్లీ: రాజ్యాంగానికి తాము కాపలాదారులమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. గవర్నర్లు విధులు నిర్వర్తించడంలో విఫలమైతే తాము నిశ్శబ్దంగా చూస్తూ కూర్చోవాలా? అని ప్రశ్నించింది. పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభల్లో ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలియజేసే విషయంలో రాష్ట్రపతి/గవర్నర్లకు గడువు నిర్దేశించే అధికారం న్యాయస్థానాలకు ఉందా? అనే అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తమ తీర్పును రిజర్వ్ చేసింది. ఈ వ్యవహారంపై 10 రోజులపాటు కొనసాగిన విచారణ గురువారం ముగిసింది. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, డీఎంకే ప్రభుత్వం మధ్య తలెత్తిన వివాదంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పార్లమెంట్ లేదా శాసనసభల నుంచి వచ్చిన బిల్లులపై రాష్ట్రపతి/గవర్నర్లు మూడు నెలల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 8న తీర్పు వెలువరించింది. దీనిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సందేహాలు లేవనెత్తారు. రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవుల్లో ఉన్న రాష్ట్రపతి/గవర్నర్లకు గడువు విధించే అధికారం కోర్టులకు ఉందా? అని ప్రశ్నించారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని సూచించారు. కోర్టును ప్రశ్నించడానికి ఆర్టికల్ 143(1) కింద తనకున్న అధికారాలను వాడుకున్నారు. సుప్రీంకోర్టుకు మొత్తం 14 ప్రశ్నలు సంధించారు. బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాజ్యాంగంలోని ఆరి్టకల్ 200, 201 కింద రాష్ట్రపతి/గవర్నర్లకు ఉన్న అధికారాలపై అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రిఫరెన్స్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 19వ తేదీన ప్రత్యేక విచారణ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల తరఫున సీనియర్ లాయర్లు వాదించారు. వ్యతిరేకించిన విపక్ష పాలిత రాష్ట్రాలు రాష్ట్రపతి రిఫరెన్స్ను విపక్ష పాలిత తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక, తెలంగాణ, పంజాబ్, హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. అసెంబ్లీలో ఆమోదించి పంపించిన బిల్లులపై రాష్ట్రపతి/గవర్నర్లు నిర్ణీత గడువులోగా సమ్మతి తెలియజేయడమో లేక వెనక్కి పంపించడమో జరగాల్సిందేనని పేర్కొన్నాయి. బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగా దీర్ఘకాలం పెండింగ్లో పెట్టడం సరైంది కాదని స్పష్టంచేశాయి. రాష్ట్రపతి రిఫరెన్స్ను తిరస్కరించాలని ధర్మాసనాన్ని కోరాయి. కానీ, రాష్ట్రపతి అభ్యంతరాలను బీజేపీ పాలిత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, గోవా, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు సమరి్థంచాయి. కేరళ, తమిళనాడు ప్రభుత్వాల తరఫున కె.కె.వేణుగోపాల్, కపిల్ సిబల్ సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. రాష్ట్రపతి అభ్యంతరాలను వ్యతిరేకించారు. ఏప్రిల్ 8న ఇచ్చిన తీర్పుతోపాటు గతంలో ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. గడువు నిర్దేశించే అధికారం కోర్టులకు ఉందని తేల్చిచెప్పారు. ఆ అధికారం కోర్టులకు లేదు: తుషార్ మెహతా రాజ్యాంగం ప్రకారం.. వేర్వేరు వ్యవస్థలకు వేర్వేరు ప్రత్యేక అధికారాలు ఉంటాయని తుషార్ మెహతా గురువారం ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రపతి/గవర్నర్లకు రాజ్యాంగం ప్రత్యేక అధికారాలు ఇచ్చిందని, రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో అదొక భాగమని స్పష్టంచేశారు. గవర్నర్ల విచక్షణాధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని పేర్కొన్నారు. వారికి టైమ్లైన్ విధించే అధికారం కోర్టులకు లేదని స్పష్టంచేశారు. దీనిపై సీజేఐ జస్టిస్ గవాయ్ స్పందించారు. ‘‘రాజ్యాంగానికి మేము కాపలాదారులం. రాజ్యాంగం ప్రకారం వేర్వేరు వ్యవస్థలకు వేర్వేరు అధికారాలు ఉంటాయన్న విషయం నిజమే. న్యాయ వ్యవస్థ కూడా తనకున్న అధికారాలతో చురుగ్గా వ్యవహరిస్తోంది. అదేసమయంలో జ్యుడీíÙయల్ టెర్రరిజం, అడ్వెంచరిజం ఉండాలని మేము చెప్పడం లేదు. కానీ, ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ సక్రమంగా విధులు నిర్వర్తించడంలో విఫలమైతే రాజ్యాంగ కాపలాదార్లు ని్రష్కియాత్మకంగా ఉండిపోవాలా? అధికారాలు ఉపయోగించుకోకుండా చూస్తూ కూర్చోవాలా?’’అని ప్రశ్నించారు. దీనిపై తుషార్ మెహతా బదులిచ్చారు. కేవలం కోర్టులే కాకుండా శాసన(లెజిస్లేచర్), కార్యనిర్వాహక వర్గం(ఎగ్జిక్యూటివ్) కూడా ప్రజల ప్రాథమిక హక్కులకు కాపలాదారులేనని స్పష్టంచేశారు. ఒక వ్యవస్థ అధికారాల్లో మరో వ్యవస్థ జోక్యం చేసుకోవడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ నిర్మాణాన్ని ఉల్లంఘించేలా ఎవరూ వ్యవరించకూడదని చెప్పారు. మంత్రిమండలి సలహా ప్రకారమే గవర్నర్ నడుచుకోవాలన్న వాదనను తుషార్ మెహతా ఖండించారు. భారతదేశంలో తాము అంతర్భాగం కాదంటూ ఏదైనా ఒక రాష్ట్ర అసెంబ్లీలో బిల్లును ఆమోదిస్తే దానికి కూడా గవర్నర్ సమ్మతి తెలియజేయాలా? అని ప్రశ్నించారు. అలాంటి సందర్భాల్లో బిల్లును పెండింగ్లో పెట్టడం తప్ప గవర్నర్కు మరో మార్గం ఉండదన్నారు. -
మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నాం
న్యూఢిల్లీ: బలహీన ప్రజాస్వామ్య పునాదులపై నిర్మితమైన రాజ్యాలు కుప్పకూలుతున్నాయని, బలీయమైన మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. శాసనసభల ఆమోదం పొంది తమ వద్దకు వచి్చన బిల్లులను నిరీ్ణత కాలపరిమితిలోపు గవర్నర్లు, రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది. దీనిపై సుప్రీంకోర్టును రాష్ట్రపతి అభిప్రాయం కోరిన అంశంలో వాదోపవాదనలు జరుగుతున్న కేసు విచారణ సందర్భంగా బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం పైవ్యాఖ్యలు చేసింది. ‘‘పౌరులు ప్రభావితమయ్యే అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునేముందు సుప్రీంకోర్టును రాష్ట్రపతి సలహాలు కోరవచ్చు అని మన భారత రాజ్యాంగం ఉద్భోదిస్తోంది. ఇలాంటి సమగ్రతను సంతరించుకున్న మన రాజ్యాంగాన్ని చూసి గరి్వస్తున్నాం. పొరుగుదేశాల్లో ఏం జరుగుతుందో చూడండి. నేపాల్లో ఇప్పుడు ఎలాంటి దారుణ పరిస్థితి ఉందో మనందరం చూస్తూనే ఉన్నాం’’అని సీజేఐ గవాయ్ అన్నారు. బంగ్లాదేశ్లోనూ అదే పరిస్థితులు ఉన్నాయని మరో న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ గుర్తుచేశారు. ధర్మాసనంలో జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ ఎ.ఎస్.చందూర్కర్ సైతం సభ్యులుగా ఉన్నారు.నేపాల్లో.. తమ వద్ద గడువులోపు సమగ్రస్థాయిలో రిజిస్ట్రేషన్ చేసుకోలేదన్న సాకుతో సోషల్ మీడియా యాప్లపై పూర్తిస్థాయి నిషేధం విధించి నేపాల్ ప్రభుత్వం విద్యార్థుల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటనను ఎదుర్కొంది. చివరకు ప్రధాని ఓలీ తన పాలనావైఫల్యాన్ని అంగీకరిస్తూ గద్దె దిగారు. అయినాసరే జెన్ జెడ్, ఇతర విద్యార్థి సంఘాల ఆందోళన ఆగకపోగా మరింత హింసాత్మకంగా మారి చివరకు 30 మంది ప్రాణాలను బలిగొంది. పార్లమెంట్, దేశాధ్యక్షుని కార్యాలయం, ప్రధాని నివాసం, సుప్రీంకోర్టు భవనం, ప్రధాన రాజకీయ పారీ్టల హెడ్ఆఫీస్లు, సీనియర్ నేతల ఇళ్లు, మీడియా కార్యాలయాలు ఇలా దేశంలోని కీలక భవంతులన్నీ ఆందోళనకారుల తగలబెట్టారు. కొన్నింటిని ధ్వంసంచేశారు. మాజీ ప్రధాని షేర్బహదూర్ దేవ్బా ఇంటిని చుట్టుముట్టి దేవ్బా, భార్య అర్జు రాణాలపై దాడిచేశారు. ప్రజల ఆస్తుల విధ్వంసం యథేచ్చగా సాగింది. బంగ్లాదేశ్లో.. భారత్కు తూర్పు వైపున్న మరో పొరుగుదేశం బంగ్లాదేశ్ సైతం ఉద్యమ సెగకు బలైంది. 1971 విమోచన ఉద్యమకారుల వారసులకు సివిల్సరీ్వసెస్ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కలి్పంచడంతో అక్కడి నిరుద్యోగ యువతలో ఆగ్రహం కట్టలుతెంచుకుంది. అది హఠాత్తుగా గత ఏడాది జులైలో మహోగ్రరూపం దాల్చి దేశవ్యాప్తంగా అల్లర్లు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం చేతులెత్తేసింది. చివరకు దేశ మహిళా ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రాణభయంతో రాజధాని ఢాకాను వీడి ఢిల్లీకి చేరుకున్నారు. అప్పట్నుంచి ఆమె ఢిల్లీలోనే తలదాచుకుంటున్నారు. నోబెల్ గ్రహీత మొహమ్మద్ యూనుస్ ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతున్నా అది సుస్థిర పాలనను అందివ్వలేక ఆపసోపాలు పడుతోంది. -
గుర్తింపు కార్డుగా ఆధార్
న్యూఢిల్లీ: బిహార్లో ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) అంశంలో ఆధార్ గుర్తింపు కోసం పోరాడుతున్న విపక్ష పార్టీలకు అనుకూలంగా సర్వోన్నత న్యాయస్థానంలో ఉత్తర్వులొచ్చాయి. ఎస్ఐఆర్ ప్రక్రియలో గుర్తింపు కార్డ్గా ఆధార్నూ పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగీ్చల సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం సూచించింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ధృవీకరణ పత్రాల జాబితాలో 12వ గుర్తింపు డాక్యుమెంట్గా ఆధార్ను పరిగణించాలని ఈసీని న్యాయస్థానం ఆదేశించింది. ‘‘బిహార్ కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్ గుర్తింపు విషయంలో ఆధార్నూ అనుమతించండి. అయితే ఆ ఆధార్ అనేది పౌరసత్వ గుర్తింపునకు రుజువుగా భావించాలని మేం చెప్పట్లేదు. ఎస్ఐఆర్లో ఇకపై ఆధార్ను సైతం అంగీకరిస్తున్నట్లు స్పష్టంగా పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల అధికారులకు మీరు అవసరమైన ఆదేశాలను జారీచేయండి. మా ఆదేశాలను సెపె్టంబర్ 9వ తేదీలోపు అమలుచేయండి’’అని ధర్మాసనం ఈసీని ఆదేశించింది. ‘‘అక్రమ వలసదారుల పేర్లు ఓటర్ల జాబితాలో కలపాలని ఎవరూ కోరుకోరు. కేవలం నిజమైన భారతీయ పౌరులను మాత్రమే ఓటు వేసేందుకు అనుమతించాలి. తప్పుడు డాక్యుమెంట్లను సమర్పించిన వారిని గుర్తించి ఓటర్ల జాబితా నుంచి తొలగించాలి’’అని కోర్టు వ్యాఖ్యానించింది. ఓటర్ల ఆధార్ కార్డ్ను ఎందుకు ఆమోదించట్లేదో సంజాయిషీ ఇవ్వాలని గతంలో ఆదేశించిన నేపథ్యంలో ఈసీ ఇచ్చిన వివరణను కోర్టు సోమవారం ఆలకించింది. ఈ సందర్భంగా ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది వాదించారు. ‘‘ముసాయిదా జాబితాలోని 7.24 కోట్ల మంది ఓటర్లలో 99.6 శాతం మంది తమ పేర్లు తుది ఓటర్ల జాబితాలో చేర్చాలంటూ సంబంధిత డాక్యుమెంట్లను ఇప్పటికే సమర్పించారు. ఇక 12వ ధృవీకరణ పత్రంగా ఆధార్ను అనుమతించాలంటూ పలువురు పిటిషన్లు ఇచ్చారు. అయితే ఇందులో ఆధార్ను ఒక రుజువుగా అంగీకరిస్తామని ఈసీ గతంలోనే పేర్కొంది. అయినాసరే ఆధార్ను కచ్చితంగా 12వ ధ్రువీకరణ పత్రంగా చేర్చాలని కోరడంలో అర్థంలేదు’’అని ఆయన వాదించారు. దీంతో ధర్మాసనం జోక్యంచేసుకుంది. ‘‘ప్రజాప్రతినిధుల చట్టం–1950లోని 23(4) సెక్షన్, ఆధార్ చట్టం–2016లోని నియమ,నిబంధనల ప్రకారమే ఓటరు గుర్తింపు కోసం ఆధార్ను పరిగణించవచ్చని నిర్ధారించాం. అయితే ఆధార్ అనేది పౌరసత్వాన్ని రుజువుచేయబోదు’’అని ధర్మాసనం స్పష్టంచేసింది.ఎస్ఐఆర్పై తగ్గుతున్న నమ్మకం! ‘‘ఎస్ఐఆర్ క్రతువుపై పిటిషన్దారులు, విపక్షాల్లో నమ్మకం తగ్గుతున్నట్లుగా తోస్తోంది. ఈ నమ్మకాన్ని నిలబెట్టేందుకు రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ రంగంలోకి దిగాలి. రాజకీయ పార్టీలు, ఓటర్లకు పారాలీగల్ వలంటీర్లు సాయపడాలి. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, మార్పులు చేర్పులపై చేసే దరఖాస్తుల విషయంలో వలంటీర్లు సాయం అందించాలి’’అని కోర్టు ఆదేశించింది. తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 30వ తేదీన ముద్రించనున్నారు. ఈసీ సిగ్గుపడాలి: కాంగ్రెస్ సుప్రీంకోర్టు ఎన్నిసార్లు ఆదేశించినా ఆధార్ను ధృవీకరణ జాబితాలో చేర్చకుండా నిర్లక్ష్యవైఖరిని అవలంభిస్తున్న ఈసీ సిగ్గుపడాలని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ సోమవారం తన సామాజికమాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ఓటర్ల నమోదుకోసం ఆధార్నూ గుర్తింపు పత్రంగా పరిగణించాలని కోర్టు ఇప్పటికి మూడుసార్లు ఆదేశించింది. అయినా కోర్టు ఆదేశాలను ఈసీ పెడచెవినపెట్టింది. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఈసీ ఈ విషయంలో సిగ్గుపడాలి. విపక్ష రాజకీయ పార్టీలు నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లనూ ఈసీ గుర్తించట్లేదు. ఇవన్నీ ఈసీ సారథి సొంత నిర్ణయాల్లా కనిపిస్తున్నాయి. ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్కుమార్ను, కేంద్ర ఎన్నికల సంఘాన్ని చరిత్ర క్షమించదు’’అని ఆయన అన్నారు. -
అక్రమ నిర్బంధం: ఆ ఖైదీకి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వండి: సుప్రీంకోర్టు
న్యాయం దక్కడం ఆలస్యం ఐతే అసలు అది న్యాయమే కాదు.. అది దక్కినట్లే కాదన్నది భారత న్యాయ సూత్రం.. బాధితులు.. పీడితులు.. ఎవరైనా సరే వారికి సమయాన్ని బట్టి న్యాయం అందాల్సిందే.. లేకుంటే వారికి జరిగే నష్టానికి ప్రభుత్వమే పరిహారం చెల్లించాల్సి ఉంటుందని గతంలో ఎన్నోసార్లు సుప్రీం కోర్టు పేర్కొంది. ఇప్పుడు అదే క్రమంలో ఒక కేసు విషయంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఒక ముద్దాయికి న్యాయం సరిగా అందనందుకు ఏకంగా రూ. 25 లక్షల పరిహారం చెల్లించేలా ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది.తన శిక్షా కలం పూర్తయినా విడుదల కాకుండా నాలుగేళ్ల ఏడు నెలలు అదనంగా జైల్లో మగ్గిపోయిన ఒక ఖైదీకి సుప్రీంకోర్టు న్యాయం చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆ నేరస్తుడికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2005లో జరిగిన అత్యాచార కేసులో సోహన్ సింగ్కు కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే, 2017లో మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు మార్చి, సాక్ష్యాలలో లోపాలు ఉన్నందున అతని శిక్షను కేవలం 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షగా తగ్గించింది.అయినప్పటికీ, హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో సింగ్ జూన్ 2025 వరకు జైల్లోనే ఉండిపోయాడు. బెయిల్ కాలాన్ని పరిగణనలోకి తీసుకున్నా, అతను నాలుగేళ్ల ఏడు నెలలు ఎక్కువ శిక్ష అనుభవించినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.జస్టిస్ జె.బి. పార్డివాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం మధ్యప్రదేశ్ రాష్ట్ర నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఈ కేసు దర్యాప్తు సమయంలో ప్రాసిక్యూషన్ తరఫున వకీళ్లు తప్పుడు అఫిడవిట్లు సమర్పించడం పైనా కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ నిర్లక్ష్యం ప్రజల ప్రాథమిక హక్కులకు భంగకరంగా వ్యాఖ్యానించింది.అలాగే, రాష్ట్రంలోని అన్ని జైళ్లను సమగ్రంగా పరిశీలించి, మరెవరూ ఇలాంటి అక్రమ నిర్బంధానికి గురికాకుండా చూడాలని మధ్యప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయన జైల్లో కోల్పోయిన జీవిత కాలాన్ని ఎవరూ తిరిగి తెచ్చివ్వలేరని పేర్కొంటూ ప్రభుత్వం ఆయనకు పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది.. ఈ క్రమంలో ఆయనకు రూ. 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని మధ్య ప్రదేశ్ రాష్ట్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే ఈ తీర్పును ఒక మైలు రాయిగా న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణ దిశగా సుప్రీం కోర్టు వేసిన అడుగు ఒక గొప్ప ముందడుగు అని వారు అంటున్నారు.. , సిమ్మాదిరప్పన్న -
తెలంగాణ బీజేపీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు
సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ బీజేపీకి చుక్కెదురైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా దాఖలైన పరువు నష్టం దావా కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో రాష్ట్ర బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.వివరాల ప్రకారం.. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తున్నారని, రిజర్వేషన్లను ఎత్తివేస్తారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రేవంత్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ.. సుప్రీంకోర్టులో పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా బీజేపీ పిటిషన్పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్. గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు కోర్టులను వేదికగా చేసుకోవద్దు అని హితవు పలికారు. రాజకీయ నాయకులు వీటిని గట్టిగా ఎదుర్కోవాలి. రాజకీయపరమైన వ్యాఖ్యలు రాజకీయ స్ఫూర్తితోనే ఎదుర్కోవాలి అని వ్యాఖ్యానించారు. చివరగా.. పది లక్షల జరిమానా విధిస్తామని బీజేపీని హెచ్చరించారు. అనంతరం, పిటిషన్ను కొట్టివేశారు.ఇదిలా ఉండగా.. గతంలో ఇదే విషయంపై బీజేపీ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు సైతం కొట్టివేసింది. దీంతో, రాష్ట్ర బీజేపీ.. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా మరోసారి బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. -
పోలీస్ స్టేషన్లలో సీసీటీవీలు పనిచేయడం లేదా?
న్యూఢిల్లీ: రాజస్తాన్లోని పోలీస్ స్టేషన్లలో కెమెరాలు పనిచేయడం లేదని, కస్టడీ మరణాల కేసుల్లో సీసీటీవీ ఫుటేజీని పోలీసులు ఇవ్వడం లేదంటూ మీడియాలో వచ్చిన కథనాన్ని సుప్రీంకోర్టు గురువారం సుమోటోగా స్వీకరించింది. పిల్ వేయాలని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం ఆదేశించింది. గత 8 నెలల్లో పోలీసు కస్టడీలో 11 మరణాలు సంభవించాయని హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ వార్తను ధర్మాసనం ప్రస్తావించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రికార్డింగ్ను కనీసం ఏడాదిపాటు ఉంచాలని 2020లో ఇచ్చిన తీర్పును గుర్తు చేసింది. పోలీస్ స్టేషన్ల తరహాలోనే ఇంటెలిజెన్స్, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్, విచారణలు నిర్వహించే, అరెస్టు చేసే అధికారం ఉన్న ఇతర ఏజెన్సీ కార్యాలయాల్లోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. స్టేషన్లోని ఏ విభాగాన్ని కూడా బయట నిర్వహించరాదని, అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద కెమెరాలు తప్పనిసరని తెలిపింది. రాత్రి పూట దృశ్యాలను సైతం వీక్షించగలిగేలా అమర్చాలని, వీడియో, ఆడియో రెండింటినీ రికార్డు చేయాలని కోర్టు పేర్కొంది. పరమ్వీర్ సింగ్ సైని అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై ఈ తీర్పు వెలువరించింది. అంతకుముందు, 2015లో డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులోనూ మానవ హక్కుల ఉల్లంఘనలను తనిఖీ చేయడానికి అన్ని పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీటీవీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కానీ, ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి నివేదిక కోరగా.. కేవలం 14 మాత్రమే స్పందించాయి. వాటిలోనూ పోలీస్ స్టేషన్లలో సీసీటీవీల ఏర్పాటు, పనితీరు గురించిన సరైన వివరాలు లేకపోవడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
చెట్ల నరికివేతతోనే చేటు!
న్యూఢిల్లీ: వరద విలయంలో తరచూ ఉత్తరాది రాష్ట్రాలు చిక్కుకుపోతున్న ఘటనలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తంచేసింది. విపరీతంగా, విచ్చలవిడిగా వృక్షాలను నేలకూల్చడమే ఈ ప్రకృతివినాశనానికి అసలు కారణమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ల సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. వరద నీటిని బలంగా ఎదుర్కొనే భారీ వృక్షాలను విపరీతంగా నరికేయడం వల్లే వరదల ప్రభావం అత్యధిక స్థాయిలో ఉంటోందని, చెట్ల అక్రమ నరికివేత పర్వానికి ఇకనైనా ముగింపు పలకాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వరదల బారినపడి అవస్థలు పడుతున్న హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, పంజాబ్ ప్రభుత్వాలతోపాటు కేంద్ర పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పులు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. చెట్ల నరికివేతను అడ్డుకునేలా ఏమేం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ సంజాయిషీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇటీవల హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్లో కొండచరియలు విరిగిపడటం, వరదల విలయం సర్వసాధారణంగా మారిన విషయం తెల్సిందే. దీంతో కొండప్రాంతాల్లో చెట్ల అక్రమ నరికివేత కారణంగానే వరద ప్రభావం అధికమైందని, ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేయాలంటూ అనామికా రాణా వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారం విచారణచేపట్టింది. ఈ సందర్భంగా వరద విలయంపై కోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘ ఉత్తరాఖండ్, హిమాచల్, పంజాబ్లో కొండచరియలు పడటం, వరదల వార్తలు మనందరం చూస్తూనే ఉన్నాం. వరద నీటిలో ఎన్నడూలేనంతటి భారీ స్థాయిలో పెద్ద దుంగలు కొట్టుకుపోవడం మీడియా కథనాల్లో గమనించాం. ఇన్ని దుంగలు ఎక్కడి నుంచి కొట్టుకొస్తున్నాయి? అక్రమంగా భారీ చెట్లను నరికివేసి ప్రకృతి విలయానికి కారణమవుతున్నారు. ఈ విషయంలో బాధిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం తక్షణం స్పందించాల్సిందే’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీరియస్గా తీసుకోండి వేరే కేసు విచారణ నిమిత్తం అదే కోర్టు హాల్లో ఉన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు కేంద్రం సూచనలు చేసింది. కేంద్రం తగు చర్యలు తీసుకునేలా చూడాలని ఆయనను ఆదేశించింది. ‘‘ ఇది చాలా తీవ్రమైన అంశం. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ప్రధానంగా దృష్టిసారించాలి. చెట్లను నరికేస్తుండటంతో ఆ దుంగలన్నీ వరద ప్రవాహంలో దిగువకు కొట్టుకొస్తున్నాయి. పంజాబ్లో వరదనష్టానికి సంబంధించిన ఫొటోలను చూశాం. లక్షల ఎకరాల్లో పంట పాడైంది. కొండప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాల్సిందే. కానీ పర్యావరణం పాడవకుండా అభివృద్ధిని సుసాధ్యంచేయాలి. పర్యావరణానికి, అభివృద్ధికి మధ్య సమతుల్యత దెబ్బతినకుండా చూడాలి’’ అని మెహతాకు కోర్టు సూచించింది. దీంతో మెహతా స్పందించారు. ‘‘ ప్రకృతితో మనం అనవసరంగా అతిగా జోక్యం చేసుకున్నాం. అందుకే ప్రకృతి మన విషయాల్లోనూ జోక్యం చేసుకుంటోంది. ఇలాంటి విలయాలను సాధ్యమైనంతమేరకు నివారించేందుకు ప్రయతి్నస్తాం. ఈరోజే నేను కేంద్ర పర్యావరణ మంత్రికి విషయాన్ని వివరిస్తా. బాధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతోనూ మాట్లాడతా’’ అని మెహతా కోర్టుకు హామీ ఇచ్చారు. పిటిషనర్ అనామికా రాణా తరఫున న్యాయవాదులు ఆకాశ్ వశిష్ట, శుభం ఉపాధ్యాయ్ వాదించారు. ‘‘ఆకస్మిక వరదల కారణంగా కొందరు సొరంగమార్గాల వద్ద చిక్కుకుపోతున్నారు. మరికొందరి పరిస్థితి ప్రాణసంకటంగా మారింది. ఈ అంశంలో ప్రభుత్వాలు వెంటనే కార్యాచరణతో ముందుకురావాలి. విపత్తులు సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. బాధిత పౌరులకు నష్టపరిహారం, పునరావాసం, సాయం అందించాలి’’ అని న్యాయవాదులు వాదించారు. వీరి వాదనలపై కోర్టు స్పందించింది. సీరియస్ విషయం కాబట్టే ఈ కేసును మరో రెండువారాల్లో మళ్లీ విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. Timber mafia knows no borders! 🌲💰In Himachal Pradesh, floods carried away illegally felled trees reminding many of a scene straight out of Pushpa. Nature always exposes the greed of mafias! 🌊⚡#HimachalPradesh #Floods #TimberMafia #Pushpa #ClimateCrisis #IllegalLogging#DAAR… pic.twitter.com/eymf6tTGjX— Daar News (@DaarNews) September 3, 2025 -
‘సర్’పై నమ్మక లోపం వల్లే ఇంత పెద్ద అనిశ్చితి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బీహార్లో ఓటర్ల జాబితా సవరణ అంశానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఏర్పాటు చేసిన స్సెషల్ ఇన్సిటివ్ రివిజన్(సర్)పై గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 1వ తేదీ) సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఓటర్ల ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించడానికి సీఈసీ విధించిన డెడ్లైన్ గడువు సెప్టెంబర్ 1 తేదీని పొడిగించాలంటూ బీహార్ రాజకీయ నాయకులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఏర్పాటు చేసిన ‘సర్’ నమ్మక లోపం వల్లే ఇంత పెద్ద అనిశ్చితి ఏర్పడిందని వ్యాఖ్యానించింది. ‘సర్’ అంశానికి సంబంధించి గందరగోళ పరిస్థితులు చక్కబడాలంటే రాజకీయం పార్టీలు తమను తాము యాక్టివేట్ చేసుకుని సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయాలని సూచించింది. అభ్యర్థనలు, ఫిర్యాదులకు డెడ్లైన్ అనేది అవసరం లేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. అభ్యర్థనలకు సెప్టెంబర్1 వ తేదీ చివరి తేదీగా ఉన్నప్పటికీ క్లెయిమ్లు, అభ్యంతరాలు, దిద్దుబాట్లను దాఖలు చేయడం వంటి అంశాలకు సంబంధించి ఈసీ నిర్దేశించిన డెడ్లైన్ ముగింపు తేదీ తర్వాత కూడా పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తమ ఉత్తర్వులో పేర్కొంది. ఇందుకోసం ప్రత్యేకంగా డెడ్లైన్ పొడిగింపు తేదీ అంటూ ఏమీ అవసరం లేదని తెలిపింది. ఫలితంగా అభ్యంతరాలను యథావిధిగా స్వీకరిస్తామని కోర్టుకు ఈసీ హామీ ఇచ్చింది. నామినేషన్ చివరి తేదీ వరకూ కూడా అభ్యంతరాలను స్వీకరిస్తామని సుప్రీంకోర్టుకు సీఈసీ తెలిపింది. అదే సమయంలో పారా లీగల్ వాలంటీర్లను నియమించాలని బీహార్ లీగల్ సర్వీసెస్ అధారిటీకి కోర్టు ఆదేశించింది. ఓటర్లకు సహాయం చేసే క్రమంలో పారా లీగల్ వాలంటీర్లను నియమించడమే సరైనదిగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పారా లీగల్ వాలంటీర్లు ఇచ్చే రిపోర్ట్ను జిల్లా స్థాయి జడ్జిలు సమీక్షించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫిర్యాదులకు ఆధార్ను ఐడెంటిటీ ఫ్రూఫ్గా ఉపయోగించవచ్చని, కానీ అది పౌరసత్వం నిర్ధారణకు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా, బీహార్లో ‘సర్’ తొలగించిన 65లక్షల ఓట్లతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం హీటెక్కింది. దీన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం కుట్రగా అభివర్ణించింది. ఇది ఎన్నికల కమిషన్తో కలిసి కేంద్రం చేస్తున్న ఓట్ చోరీ అంశంగా ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఓట్ అధికార్ యాత్ర పేరుతో ఇప్పటికే బీహార్లో రాహుల్ గాంధీ యాత్ర చేశారు. మరొకసారి ఇదే అంశానికి సంబంధించి ఇండియా కూటమి పెద్ద ఎత్తున నిరసనకు సిద్ధమైంది. నేడు ఓట్ అధికార్ యాత్ర పాట్నాలో ప్రారంభమైంది. ‘సర్’లో ఎన్నో అవకతవకలు ఉన్నాయని, దానిని తిరిగి నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. -
‘వీధికుక్కల కేసుతో నేనిప్పుడు వరల్డ్ ఫేమస్’
తిరువనంతపురం: దేశ వ్యాప్తంగా చర్చాంశనీయమైన సుప్రీంకోర్టులో వీధి కుక్కల కేసు తనని వరల్డ్ ఫేమస్ చేసిందంటూ జస్టిస్ విక్రమ్ నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా పౌర సమాజం తనకు శుభాకాంక్షలు చెప్పడం మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందని అన్నారు.కేరళ రాజధాని తిరువనంతపురంలో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ (ఎన్ఎస్ఎల్ఏ) నిర్వహించిన సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.చిన్న చిన్న పనులు కారణంగా నేను న్యాయవాద వర్గాల్లో ప్రసిద్ధి చెందాను. కానీ వీధికక్కల కేసు కారణంగా ఈ దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొత్తం పౌర సమాజంలో నాకు గుర్తింపు ఇచ్చినందుకు వీధి కుక్కలకు కూడా నేను కృతజ్ఞుడను. ఈ కేసును నాకు అప్పగించినందుకు మా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గువాయ్కి నా కృతజ్ఞతలు. సుప్రీం తీర్పును సవరించడంతో జంతు ప్రేమికులతో పాటు శునకాల నుంచి కూడా తనకు శుభాకాంక్షలు, ఆశీస్సులు అందుతున్నట్లు సందేశాలు వచ్చాయన్నారు.వీధి కుక్కల దాడులు, రేబిస్ బారినపడి పలువురు మరణించిన ఘటనలపై మీడియాలో వచ్చిన కథనాలను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలో.. ఢిల్లీ ఎన్సీఆర్ లో వీధి కుక్కలన్నింటినీ డాగ్ షెల్టర్స్ కి తరలించాలని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 11న తీర్పు ఇచ్చింది. ఇందుకు ఆరు నుంచి ఎనిమిది వారాల గడువును ఢిల్లీ ప్రభుత్వానికి విధించిన సుప్రీం కోర్టు.. అవి మళ్లీ జనావాసాల్లోకి వస్తే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఆదేశించింది.అదే సమయంలో శునకాల తరలింపును గనుక అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవంటూ జంతు ప్రేమికులను హెచ్చరించిది కూడా. ఈ నేపథ్యంలో ఈ తీర్పు సమంజసం కాదంటూ జంతు ప్రేమికులు ఆందోళనకు దిగారు. కొందరు(వీళ్లలో రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు) సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. మరికొందరు నేరుగా కోర్టును ఆశ్రయించారు. దీనితో ఆదేశాలను పునఃపరిశీలిస్తానని హామీ ఇచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్.. ఈ పిటిషన్ను ముగ్గురు జడ్జిలతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు.జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి.అంజరియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీన్ని విచారించింది.రేబిస్ లక్షణాలు లేదా విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలు మినహా ఇప్పటివరకు షెల్టర్లకు తరలించిన వాటిని విడుదల చేయాలని ఆదేశించింది. వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసిన తర్వాత వాటిని ఎక్కడ నుంచి తీసుకొచ్చారో అక్కడే విడిచిపెట్టాలని పేర్కొంది. ఇందుకు సంబంధించి ఆగస్టు 11న ఇచ్చిన తీర్పును సవరించింది. -
సర్కారుకు ‘సుప్రీం’ షాక్! తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఓ వ్యక్తిని ఎలా అడ్డుకుంటారు..?
సాక్షి, అమరావతి: అధికార దుర్వినియోగం, కక్షపూరిత రాజకీయాలే లక్ష్యంగా సాగుతున్న టీడీపీ కూటమి సర్కారుకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి అడుగులకు మడుగులొత్తుతూ.. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఊర్లోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్న పోలీసులకు దిమ్మతిరిగే షాక్నిచ్చింది. తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘‘ఓ వ్యక్తిని తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారు..?’’ అని పోలీసులను ఘాటుగా ప్రశ్నించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఖర్చును భరించాలని పెద్దారెడ్డికి సూచించింది. పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చి ఉండేందుకు వీలుగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా పక్కన పెట్టింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై పోలీసులు దాఖలు చేసిన అప్పీల్ను తేల్చాలని ధర్మాసనానికి స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మాసనం ఉత్తర్వులపై సుప్రీంను ఆశ్రయించిన పెద్దారెడ్డి... తన నియోజకవర్గమైన తాడిపత్రిలోకి వెళ్లేందుకు, అలాగే తన ఇంటిలో ఉండేందుకు పోలీసులు అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ నూనెపల్లి హరినాథ్.. తాడిపత్రిలోని ఇంటికి వెళ్లి నివసించే నిమిత్తం పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించారు. అయితే వీటిని పోలీసులు బేఖాతరు చేయడంతో కోర్టు ధిక్కార పిటిషన్ను పెద్దారెడ్డి దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ హరినాథ్... తాడిపత్రిలోని ఇంటికి వెళ్లి ఉండేందుకు వీలుగా పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించారు. దీన్ని సవాలు చేస్తూ పోలీసులు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్పై విచారణ జరిపిన ధర్మాసనం పెద్దారెడ్డికి భద్రత కల్పించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పోలీసులు పదే పదే అడ్డుకున్నారుపెద్దారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ దవే, పొన్నవోలు సుధాకర్రెడ్డి, న్యాయవాది అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు. ఈ కేసు ఓ పౌరుడి ప్రాథమిక హక్కులతో ముడిపడి ఉన్న వ్యవహారమని నివేదించారు. పిటిషనర్ను తన సొంత నియోజకవర్గానికి, సొంత ఇంటికి రాకుండా పోలీసులు పదే పదే అడ్డుకుంటున్నారని, ఇది రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. పిటిషనర్ మాజీ ఎమ్మెల్యే అని, ఆయన్నే పోలీసులు అడ్డుకుంటున్నారంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలని సుప్రీంకోర్టును అభ్యరి్థంచారు. ఓ వ్యక్తి తనకు నచ్చిన విధంగా, స్వేచ్ఛగా సంచరించే హక్కును రాజ్యాంగం ఇచ్చిందన్నారు. పెద్దారెడ్డి తన ఇంటికి వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని చెబుతున్నారని, వాస్తవానికి వాటి పరిరక్షణ బాధ్యత పోలీసులదేనన్నారు. భద్రత ఖర్చును భరించేందుకు సిద్ధంపెద్దారెడ్డికి భద్రత కల్పించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సైతం పోలీసులు అమలు చేయలేదని పెద్దారెడ్డి తరఫు న్యాయవాదులు తెలిపారు. దీంతో పోలీసులపై పిటిషనర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందన్నారు. ఆ ధిక్కార పిటిషన్లో సైతం సింగిల్ జడ్జి పిటిషనర్ పెద్దారెడ్డికి భద్రత కల్పించాలంటూ ఆదేశాలు ఇచ్చారన్నారు. పోలీసులు ఈ ఉత్తర్వులు మొత్తాన్ని సవాలు చేయకుండా, కొంత భాగాన్నే ఎంపిక చేసుకుని అప్పీల్ దాఖలు చేశారని దవే, సుధాకర్రెడ్డి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ అప్పీల్కు ఎలాంటి విచారణార్హత లేదన్నారు. తన భద్రతకయ్యే ఖర్చును భరించేందుకు పెద్దారెడ్డి సిద్ధంగా ఉన్నారని ధర్మాసనానికి దవే తెలిపారు. తాడిపత్రిలోని ఇంటికి వచ్చేందుకు పెద్దారెడ్డికి అనుమతినివ్వాలని కోర్టును కోరారు. సొంత భద్రత లేకుంటే అందుకయ్యే వ్యయాన్ని ఆయనే భరించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. అయినా ప్రభుత్వం పెద్దారెడ్డికి భద్రత కల్పిస్తుందనుకోవడం లేదని దవే నివేదించారు. అధికార పార్టీ పెద్దఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, కోర్టు ధిక్కార వ్యాజ్యంలో సింగిల్ జడ్జి ఆదేశాల మేరకు పెద్దారెడ్డికి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకయ్యే వ్యయాన్ని భరించాలని పెద్దారెడ్డికి సూచించింది.ఏపీలో దారుణ పరిస్థితులు...!» ఓ పౌరుడికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను పోలీసులు కాలరాస్తున్నారు» పెద్దారెడ్డిని సొంత నియోజకవర్గానికి, ఇంటికి రాకుండా పదే పదే అడ్డుకుంటున్నారు» న్యాయస్థానం ఆదేశాలను సైతం పోలీసులు అమలు చేయలేదు..» మాజీ ఎమ్మెల్యేనే అడ్డుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఊహించండి..» అధికార పార్టీ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది» సుప్రీంకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ దవే, పొన్నవోలు -
ఎట్టకేలకు న్యాయం గెలిచింది.. ‘సుప్రీం’ తీర్పుపై పెద్దారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ/అనంతపురం: వైఎస్సార్సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి భారీ ఊరట(Big Relief For Kethireddy Pedda Reddy) లభించింది. నియోజకవర్గంలో అనుమతి పెట్టేందుకు ఆయనకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలోకి నిరభ్యంతరంగా వెళ్లొచ్చని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది.తాడిపత్రిలోకి తనను అనుమతించడం లేదంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తన సొంత నియోజకవర్గంలోకి అనుమతించకుండా టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ పిటిషన్లో పేర్కొన్నారాయన. ఈ పిటిషన్ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. ‘‘మీ నియోజకవర్గంలోకి వెళ్లకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతారు?’’ అంటూ పెద్దారెడ్డిని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ.. తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి అవసరమైన భద్రత కల్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఒకవేళ అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెట్టుకోవచ్చని పెద్దారెడ్డికి కోర్టు సూచించింది. ఈ క్రమంలో.. పోలీసు సెక్యూరిటీ అవసరమైన ఖర్చు భరించేందుకు పెద్దారెడ్డి తరపు న్యాయవాదులు అంగీకరించారు.14 నెలలుగా దూరంఏపీలో కిందటి ఏడాది అసెంబ్లీ ఎన్నికల వేళ.. తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలింగ్ తర్వాత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి వర్గీయులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసి టీడీపీ జెండా ఎగరేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి అంటే దాదాపు 14 నెలలుగా.. ఆయన తాడిపత్రిలో అడుగుపెట్టలేకపోతున్నారు.తాడిపత్రి వెళ్లాలనుకున్న ప్రతీసారి పోలీసులు పెద్దారెడ్డిని అడ్డుకుంటూ వస్తున్నారు. జేసీ ఒత్తిళ్ల వల్లే పోలీసులు తనను అడ్డుకుంటున్నారని పెద్దారెడ్డి, ఇటు వైఎస్సార్సీపీ విమర్శిస్తూ వస్తోంది. ఈ క్రమంలో.. హైకోర్టులో పెద్దారెడ్డికి భారీ ఊరట లభించింది. తాడిపత్రికి వెళ్లేందుకు నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ పోలీసులు ఆయనకు సహకరించకుండా వచ్చారు.దీంతో పెద్దారెడ్డి హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు పోలీసుల నుంచి వివరణ కోరింది. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే పెద్దారెడ్డిని రానివ్వడం లేదని అనంత ఎస్పీ పిటిషన్ వివరణ ఇచ్చుకున్నారు. దీంతో.. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన అనుమతిని ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. పెద్దారెడ్డి తాడిపత్రి అనుమతిని రద్దు చేస్తూ విచారణ వాయిదా వేసింది. ఈ పిటిషన్ విచారణలో ఉండగానే.. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించి ఇప్పుడు ఊరట దక్కించుకున్నారు. పెద్దారెడ్డి రియాక్షన్సుప్రీం కోర్టు తీర్పుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘‘నేను తాడిపత్రి వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో న్యాయం గెలిచింది. సుప్రీంకోర్టు తీర్పు కాపీలను ఎస్పీ కి అందజేస్తా.. త్వరలో తాడిపత్రి వెళ్తాను. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా.. సేవ చేస్తా. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు పోలీసులకు సహకరిస్తాను అని అన్నారాయన. -
మాజీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట
సాక్షి, ఢిల్లీ: మాజీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఓబులాపురం మైనింగ్ కేసులో తెలంగాణ హైకోర్టు ఆర్డర్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇదే సమయంలో ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.వివరాల ప్రకారం.. ఓబులాపురం మైనింగ్ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి.. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె పిటిషన్పై జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్కే సింగ్ ధర్మాసనం విచారణ జరిపింది. అనంతరం, తెలంగాణ హైకోర్టు ఆర్డర్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు విచిత్రమైన ఆర్డర్ ఇచ్చిందని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. అంతకుముందు ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి పేరు డిశ్చార్జ్ చేయడాన్ని తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. -
కొన్నోళ్లే కన్నోళ్లు!
సాక్షి, న్యూఢిల్లీ: ‘కొనుగోలు చేసిన తల్లిదండ్రులకే ఆ పిల్లలను తిరిగి ఇచ్చేయండి’ అంటూ సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దత్తత పేరుతో పిల్లలను తీసుకుని పెంచిన ఆ తల్లిదండ్రులది కడుపుకోతనే అని చెప్పింది. పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులకే ఇవ్వమని కొద్దిరోజుల క్రితం ఆదేశాలు జారీ చేసినా.. ఇవ్వకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను పాటించకపోతే కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులను హెచ్చరించింది. మంగళవారం ఉదయం 11 గంటలకల్లా పిల్లలను ఆ తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశిస్తూ.. సెప్టెంబర్ 2న వర్చువల్గా సంబంధిత అధికారులంతా తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు..: తమ పిల్లల్ని తమకు ఇవ్వాలని కొనుగోలు చేసిన 9 మంది తల్లిదండ్రులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో కొనుగోలు చేసిన తల్లిదండ్రులకు అనుకూలంగా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ.. మాతా, శిశు సంక్షేమ శాఖ డివిజన్ బెంచ్కు అప్పీల్కు వెళ్లింది. ఇందులో డివిజన్ బెంచ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో గత ఫిబ్రవరిలో పిల్లలను కొనుగోలు చేసిన దాసరి అనిల్ కుమార్ కుటుంబంతోపాటు మరో ముగ్గురు దంపతులు సుప్రీంకోర్టులో అప్పీల్చేశారు. ఈ పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం.. కొనుగోలు చేసిన తల్లిదండ్రులకే 14వ తేదీలోగా పిల్లల్ని ఇవ్వాలని ఈ నెల 12న తుది తీర్పును వెలువరించింది. అయితే, సుప్రీం తీర్పును అధికార యంత్రాంగం పాటించడం లేదంటూ ఆ తల్లిదండ్రులు ఈనెల 18న ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను సోమవారం జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. తాము ఇటీవల ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంపై జస్టిస్ నాగరత్న అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు (సోమవారం) సాయంత్రం 5 గంటల లోపు కొనుగోలు చేసిన తల్లిదండ్రులకు పిల్లలను ఇచ్చేయాలని ధర్మాసనం అధికారులను ఆదేశించింది. అయితే, తమకు మంగళవారం ఉదయం 11గంటల వరకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపు ఏఎస్జీ కోరారు. ‘సరే ఈ ఒక్కసారికి అవకాశమిస్తున్నాం, మంగళవారం ఉదయం 11గంటలకల్లా తల్లిదండ్రుల చేతిలో ఆ పసికందులు ఉండాలి’అని జస్టిస్ నాగరత్న ఆదేశించారు. ఇదిలాఉండగా.. సోమవారం సాయంత్రంలోపే పిల్లలను ఆ తల్లిదండ్రులకు అధికారులు అప్పగించడం గమనార్హం. ఇదీ జరిగింది.. గత ఏడాది మేలో మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో పిల్లల అక్రమ రవాణా, విక్రయం వ్యవహారం బట్టబయలైంది. మహిళా ఆర్ఎంపీ ఈ తతంగాన్ని నడుపుతున్నట్లు గుర్తించి పోలీసులు 11 మందిని అరెస్ట్చేశారు. వారు మొత్తం 16 మంది చిన్నారులు (నలుగురు మగ, 12 మంది ఆడ పిల్లల్ని) అమ్మినట్లు గుర్తించారు. ఏడుగురు చిన్నారులను అమ్మకం దశలోనే పట్టుకోగా, మరో 9 మందిని కొనుగోలు చేసిన తల్లిదండ్రుల నుంచి తీసుకొని మాతా, శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. వీరిని సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) ద్వారా ప్రభుత్వం దత్తత ప్రక్రియలో పెట్టింది. వీరిలో అమ్మకం దశలో దొరికిన ఆరుగురు చిన్నారులను పేరెంట్స్ దత్తత తీసుకున్నారు. అలాగే కొనుగోలు చేసిన తల్లిదండ్రుల నుంచి తీసుకొచ్చిన 9 మంది చిన్నారులను కూడా పిల్లలు లేని తల్లిదండ్రులు ఎంపిక చేసుకొని, తదుపరి రోజు తీసుకోవాల్సి ఉండగా, హైకోర్టు ఆదేశాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటి నుంచి ఈ కేసు కొనసాగుతోంది. ఇందులో నలుగురు మాత్రమే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరికి మాత్రమే తాజా తీర్పు వర్తిస్తుందని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు. మిగిలిన ఐదుగురికి సంబంధించిన కేసు ఈ నెల 28న హైకోర్టు ముందుకు రానుంది. -
జోకులపై సుప్రీం కోర్ట్ సీరియస్
-
ఆ తీర్పు నా ఒక్కడిది కాదు
న్యూఢిల్లీ: సాయుధ సల్వాజుడుం వ్యవస్థను సుప్రీంకోర్టు వ్యతిరేకించడం వల్లే నక్సలిజం ఇంకా ఉనికిలో ఉందని, దీనికి పరోక్షంగా సుదర్శన్రెడ్డి కారణమని కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్షా చేసిన విమర్శలపై విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్రెడ్డి విభేదించారు. శనివారం పీటీఐకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. ‘‘సిద్ధాంతాలకు అతీతంగా ప్రజలందరి ప్రాణాలు, ఆస్తులు కాపాడే హోం మంత్రి అమిత్ షాతో నేరుగా వాగ్వాదం పెట్టుకోదల్చుకోలేదు. 2011 డిసెంబర్లో సల్వాజుడుంను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగా ఆ తీర్పు కాపీని నేనే రాశాను. కానీ ఆ అభిప్రాయం నాది కాదు. అది సుప్రీంకోర్టు అభిప్రాయం. తీర్పు పూర్తిపాఠం అమిత్ షా చదవి ఉండకపోవచ్చు. అందుకే ఆయన నన్ను విమర్శిస్తున్నారు. 40 పేజీల ఆ తీర్పు మొత్తాన్నీ చదివితే సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఆయనకు ఖచ్చితంగా అవగతమవుతుంది. ఇంతకు మించి నేనేమీ చెప్పదల్చుకోలేదు. ఇంతటితో ఈ అంశంపై చర్చ ముగిస్తే బాగుంటుంది’’అని సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నక్సలిజాన్ని అంతంచేయాలనే ఏకైక లక్ష్యంతో ఆనాటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గిరిజన యువతకు తుపాకులిచ్చి సల్వా జుడుం(కోయ కమెండోలు) పేరితో సాయుధ వ్యవస్థను అమలుచేయగా, ఇది చట్టవిరుద్ధమని ఈ సాయుధ పౌర మిలటరీ వ్యవస్థను వెంటనే నిర్విర్యంచేయాలని సుప్రీంకోర్టు ఆనాడు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉన్నారు. దీంతో నక్సలిజం పట్ల సుదర్శన్ రెడ్డికి సానుభూతి ఉందని, అందుకే అలా తీర్పిచ్చారని అమిత్ షా శుక్రవారం ఆరోపించడం తెల్సిందే. ప్రజాస్వామ్యంలో లోటు ‘‘రాజ్యాంగం సవాళ్లను ఎదుర్కొంటోంది. సవాళ్లతో సతమతమవుతున్న ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తా. పార్లమెంట్లో సభ్యుల నిరసన కారణంగా సభా కార్యకలాపాలకు తరచూ అంతరాయం కలగడం సహజం. నిరసన అనేది అత్యావశ్యకం. కానీ అదే పనిగా నిరసన తెలపడం అనేది సమస్యాత్మకంగా మారుతుంది. గతంలో వాణిజ్యలోటు గురించి జనం మాట్లాడుకునేవాళ్లు. ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో సైతం లోటు కన్పిస్తోంది. మొదట్నుంచీ భారత్ రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంగా పరిఢవిల్లినప్పటికీ నేడు కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇలాంటి సందర్భాల్లో రాజ్యాంగంపై దాడి అనే అంశంపై ఖచ్చితంగా చర్చించాల్సిందే. ప్రజాస్వామ్యం అంటే వ్యక్తుల మధ్య పోటీ కాదు. సిద్ధాంతాల మధ్య పోటీ మాత్రమే. ఎప్పుడైనా సరే ప్రభుత్వం, విపక్షం మధ్య సఖ్యత చెడిపోకూడదు. జాతి ప్రయోజనాల దృష్ట్యా అది చాలా ముఖ్యం. విపక్షాలు ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతి అభ్యరి్థని ఎన్నుకోవడం నిజంగా నాకు దక్కిన గొప్ప గౌరవం. నా ఎంపిక అనేది మూడు అంశాలను స్పష్టంచేస్తుంది. ఒకటి వైవిధ్యం. విపక్షంలోని వివిధ పారీ్టలు నన్ను ఎన్నుకున్నాయి. రెండో ఏకగ్రీవ ఎన్నిక. ఇక మూడోది దీటైన ఓటింగ్ సామర్థ్యం. ఒకరంగా విశ్లేషిస్తే దేశ జనాభాలో దాదాపు 63 శాతం జనాభాకు ఈ పారీ్టలు ప్రాతినిధ్యంవహిస్తున్నాయి. ఇంతకుమించిన గౌరవం ఏముంటుంది’’అని ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘ఉపరాష్ట్రపతి పదవికి దేశంలో ఎలాంటి పోటీ లేకుండా ఎకగ్రీవంగా ఎన్నిక పూర్తవ్వాలి. కానీ రాజకీయాల్లో విబేధాలు సహజం. అందుకే అధికార, విపక్షాల మధ్య ఇలా పోటీ అనివార్యమైంది’’అని అన్నారు. ‘‘కులగణనకు మద్దతిస్తా. ఎందుకంటే ఎవరైతే వెనుకబడ్డారో, అభ్యున్నతికి నోచుకోలేదో వాళ్లను గుర్తించి ఎదిగేందుకు సాయపడాలంటే కులగణన చేయాల్సిందే’’అని ఆయన వ్యాఖ్యానించారు. -
బిహార్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై సుప్రీంకోర్టు విచారణ
-
ఫిర్యాదులకు ‘ఆధార’మే
న్యూఢిల్లీ: బిహార్లో ఓటర్ల జాబితా నుంచి తొలగింపునకు గురైన వాళ్లు దాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసే ఫిర్యాదులకు మద్దతుగా ఆధార్ను కూడా సమర్పించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయమై ఎన్నికల సంఘం పేర్కొన్న 11 డాక్యుమెంట్లతో పాటు ఆధార్ కూడా చెల్లుబాటవుతుందని స్పష్టం చేసింది. ఎన్నికల జాబితా ముసాయిదాపై సకాలంలో అభ్యంతరాలు లేవనెత్తడంలో బిహార్లోని 12 రాజకీయ పార్టీలూ విఫలమయ్యాయంటూ గట్టిగా తలంటింది. ఈ విషయంలో వాటిది పూర్తిగా చేతగానితనమేనంటూ ఆక్షేపించింది. బిహార్లో తాము చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) సందర్భంగా ముసాయిదాపై ఒక్క పార్టీ కూడా తమవద్ద అభ్యంతరాలు దాఖలు చేయలేదన్న కేంద్ర ఎన్నికల సంఘం అఫిడవిట్ను ఉటంకిస్తూ ఈ మేరకు పార్టీలను గట్టిగా మందలించింది. పైపెచ్చు ఓటర్ల జాబితా నుంచి తొలగింపునకు గురైన పౌరులకు కనీసం ఈసీ వద్ద అభ్యంతరాలు దాఖలు చేయడంలో ఒక్క పార్టీ కూడా చురుగ్గా వ్యవహరించి సాయం చేయలేదంటూ తీవ్రంగా ఆక్షేపించింది. ప్రజలతో ఇంతటి దూరం ఎందుకు ఏర్పడిందంటూ ప్రశ్నించింది. ఈ విషయమై పార్టీలన్నీ ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ ఉద్బోధించింది. ఎస్ఐఆర్ కసరత్తును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ఇద్దరు సభ్యుల ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ‘‘ఓటర్ల ముసాయిదాలో పేర్లు గల్లంతైన వారికి ఫారం–6 సాయంతో ఈసీ వద్ద ఫిర్యాదులు చేయడంలో పూర్తిస్థాయిలో సహకరించండి. ఆ మేరకు మీ పార్టీల కార్యకర్తలందరికీ స్పష్టమైన ఆదేశాలివ్వండి’’ అంటూ బిహార్లోని 12 పార్టీల నూ ఆదేశించింది. వ్యక్తిగతంగా అభ్యంతరా లను ఆన్లైన్లో దాఖలు చేసేందుకు వీలు కల్పించాల్సిందిగా ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఐఆర్ కసరత్తు గడువు విషయమై ఈ దశలో ఎలాంటి మార్పుచేర్పులూ చేయలేదని స్పష్టం చేసింది. బూత్ ఏజెంట్లు ఏం చేస్తున్నట్టు?బిహార్లో ఏకంగా 1.68 లక్షల మంది బూత్ స్థాయి ఏజెంట్లున్నట్టు ఈసీ నివేదించింది. అలాంటప్పుడు ఓటర్ల జాబితా నుంచి తొలగింపులకు సంబంధించి ఇప్పటిదాకా కేవలం రెండంటే రెండే అభ్యంతరాలు దాఖలవడంపై ధర్మాసనానికి విస్మయం వ్యక్తం చేసింది. ఈ విషయంలో పార్టీలు, అవి నియమించిన బూత్ స్థాయి ఏజెంట్లు ఏం చేస్తున్నట్టని ప్రశ్నించింది. ‘‘తొలగించిన 65 లక్షల ఓటర్లు మరణించారా, నివాసాలు మార్చారా, మరేమైనా జరిగిందా అన్నది తేలాలి. ఈ దిశగా అన్ని పార్టీల ఏజెంట్లు పూర్తి స్థాయిలో తనిఖీలు జరపాలి’’ అని ఆదేశించింది. -
స్టెరిలైజేషన్ తర్వాత వదిలేయాల్సిందే
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కల సమస్యపై అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 8వ తేదీన ఇచ్చిన ఉత్తర్వు పట్ల జంతు ప్రేమికుల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తడంతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు అభ్యంతరం వ్యక్తంచేయడంతో.. ఆ ఉత్తర్వులో మార్పులు చేస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. కుక్కలకు స్టెరిలైజేషన్(పిల్లలు పుట్టకుండా శస్త్రచికిత్స) పూర్తి చేసిన తర్వాత ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే వదిలేయాలని తేల్చిచెప్పింది. రేబిస్ వంటి వ్యాధులు, ఆవేశపూరిత, విపరీత ప్రవర్తన ఉన్న కుక్కలను మాత్రం స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ అనంతరం ప్రత్యేక షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. ఈ నెల 8న ఇచ్చిన ఉత్తర్వు అత్యంత కఠినంగా ఉన్న మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు అంగీకరించింది. వీధి కుక్కల బెడద దేశమంతటా ఉన్నట్లు గుర్తుచేసింది. ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రాణాలు సైతం కోల్పోతున్నారని, అందుకే దేశవ్యాప్తంగా వీధి కుక్కల నియంత్రణకు ఒక జాతీయ విధానం తీసుకొచ్చే విషయం ఆలోచించాలని ప్రభుత్వానికి సూచించింది. ఢిల్లీలో వీధి కుక్కల వ్యవహారంపై ఈనెల 8న ఇచ్చిన ఉత్తర్వుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కుక్కలన్నింటినీ 8 వారాల్లోగా బంధించి, షెల్టర్లకు తరలించాలంటూ జస్టిస్ పార్దివాలా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను జంతు ప్రేమికులు తప్పుబట్టారు. దాంతో ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ త్రిసభ్య ధర్మాసనానికి ఇప్పగించారు. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం మళ్లీ విచారణ చేపట్టింది. తగిన మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేదో తెలుసుకోకుండా అన్ని కుక్కలను బంధించి, షెల్టర్కు తరలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు ఏమిటంటే.. → వీధి కుక్కలకు బహిరంగ ప్రదేశాల్లో ఆహారం పెట్టడం నేరం. ఉల్లంఘించినవారికి శిక్ష తప్పదు. → వాటికి ఆహారం అందించడానికి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వీధుల్లో ఇళ్ల ముందు కుక్కలకు అన్నం పెట్టినవారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. → వీధి కుక్కలను జంతు ప్రేమికులు దత్తత తీసుకోవచ్చు. వాటిని వారు సరిగ్గా సంరక్షించాలి. మళ్లీ వీధుల్లోకి వదిలేయకూడదు. → ఢిల్లీలో వీధి కుక్కలను కాపాడాలంటే పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి రూ.25,000, ఎన్జీఓలు రూ. 2 లక్షల చొప్పున కోర్టులో డిపాజిట్ చేయాలి. → కుక్కల సమస్యకు సంబంధించిన హైకోర్టుల్లో ఉన్న పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తున్నాం. ఒక జాతీయ పాలసీని రూపొందించే దిశగా విచారణ చేపడతాం. → వీధి కుక్కల కేసులో కేవలం ఢిల్లీని మాత్రమే కాకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సైతం భాగస్వామ్య పక్షాలుగా చేరుస్తున్నాం. → సుప్రీంకోర్టు తాజా తీర్పు పట్ల జంతు ప్రేమికులు హర్షం వ్యక్తంచేశారు. -
ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల స్థానికతపై సుప్రీంకోర్టులో నేడు విచారణ
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థుల ‘స్థానికత’ వివాదంపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరపనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ల ధర్మాసనం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టనుంది. ఏపీ వెలుపల ఇంటర్ విద్యను అభ్యసించినప్పటికీ తామంతా రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్నామని, అందువల్ల తమను ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో ‘స్థానిక’ అభ్యర్థులుగా పరిగణించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పలువురు అభ్యర్థులు ఇటీవల హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు దర్మాసనం.. సుదీర్ఘ వాదనల అనంతరం ఈ వ్యాజ్యాలన్నింటినీ కొట్టేసింది. స్థానికత విషయంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం గతంలోనే చాలా స్పష్టమైన తీర్పునిచి్చందని, ఇప్పుడు తాము అందుకు భిన్నంగా చెప్పాల్సింది ఏమీ లేదని తన తీర్పులో పేర్కొంది. ప్రవేశాలు కోరుతున్న విద్యార్థి, తాను ఏ లోకల్ ఏరియా (ఎస్వీ యూనివర్సిటీ లేదా ఆంధ్రా యూనివర్సిటీ పరిధి)లో చదివానని చెబుతున్నారో, ఆ అభ్యర్థి ఆ ప్రాంతంలో వరుసగా నాలుగేళ్లు చదివి ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ నాలుగేళ్లను క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ (+2 అంటే ఇంటర్)తో ముగించి ఉండటం తప్పనిసరి అని తేల్చి చెప్పింది. అలాగే ఆ అభ్యర్థి ఆ ప్రాంతంలో ఏ విద్యా సంస్థలోనూ చదవకపోయినప్పటికీ క్వాలిఫైయింగ్ పరీక్ష రాసే నాటికి వరుసగా నాలుగేళ్ల పాటు ఆ లోకల్ ఏరియాలో నివాసం ఉన్నా కూడా ఆ అభ్యర్థి స్థానిక అభ్యర్థే అవుతారని స్పష్టం చేసింది. రాష్ట్రం వెలుపల క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కు ముందు +2 చదివిన విద్యార్థులను స్థానిక అభ్యర్థులుగా పరిగణించలేమని తేల్చి చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ 53 మంది అభ్యర్థులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది విపిన్ నాయర్ సుప్రీంను కోరారు. అంగీకరించిన సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. -
ఢిల్లీ సీఎంపై దాడి ఘటనలో కొత్త ట్విస్ట్
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి ఘటన కొత్త మలుపు తిరిగింది. నిందితుడిని గుజరాత్కు చెందిన రాజేష్ సాకరియా(41) నిర్ధారించారు. అతను ఎందుకు దాడి చేశాడనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు.. రాజ్కోట్లోని రాజేష్ ఇంటికి చేరుకున్న పోలీసులు నిందితుడి కుటుంబ సభ్యుల్ని విచారించారు. ఈ క్రమంలో అతని తల్లి చెప్పిన సమాధానంతో పోలీసులు విస్తుపోయారు.రాజేష్ ఎందుకు అలా చేశాడో మాకు తెలియదు. అతనికి కుక్కలంటే చాలా ఇష్టం. అలాంటిది సుప్రీం కోర్టు వీధికుక్కలపై తీర్పు ఇచ్చినప్పటి నుంచి ముభావంగా ఉంటున్నాడు. బహుశా ఈ నేపథ్యంతోనే దాడి చేసి ఉండొచ్చు అని ఆమె అంటున్నారు. స్థానికులు సైతం రాజేష్ డాగ్ లవర్ అనే విషయాన్ని ధృవీకరించారు. అయితే.. అరెస్టైన తన బంధువును విడిచిపించే విషయంలో రాజేష్ ఢిల్లీ సీఎం సాయం కోరాడని.. బహుశా ఆ వ్యవహారంలోనే ఆమెపై దాడికి పాల్పడి ఉంటాడని మరికొందరు చెబుతున్నారు. సీఎంపై సదరు వ్యక్తి ఎందుకు దాడి చేశాడనే విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.ఢిల్లీ ఘటనలో..ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. కొన్ని చేతిలో కొన్నిపేపర్లతో రాజేష్ ఢిల్లీ సీఎం రేఖాగుప్తా దగ్గరకు వచ్చాడు. వాళ్లు మాట్లాడుకుంటున్న టైంలోనే.. అరుస్తూ ఆమెపై దాడికి తెగబడ్డాడు. అయితే మరికొందరు మాత్రం రాజేష్ తాగి వచ్చాడని చెబుతున్నారు. ప్రస్తుతం నిందితుడు ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నాడు. కోర్టు తీర్పు.. ఢిల్లీ సీఎం స్పందనఢిల్లీ, ఎన్సీఆర్ రీజియన్లలో కుక్క కాటు ఘటనలు, రేబిస్ మరణాలపై మీడియా కథనాల ఆధారంగా సుమోటోగా విచారణ జరిపింది సుప్రీం కోర్టు. ఈ క్రమంలో ఆగష్టు 11వ తేదీన ఎనిమిది వారాల్లో ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వీధికుక్కలన్నింటిని షెల్టర్లకు తరలించాలని, మూగజీవాల ప్రేమికులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అదే సమయంలో.. జంతు ప్రేమికుల అభ్యంతరాలతో ఈ తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈలోపు.. ఈ ఆదేశాలను నిలిపివేయాలంటూ మరో పిటిషన్ దాఖలు కాగా విచారణ జరిపిన విస్తృత ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.ఈ తీర్పుపై ఢిల్లీ ప్రభుత్వం అధికారికంగా ఏం ప్రకటన చేయలేదు. కానీ, సీఎం రేఖా గుప్తా మాత్రం స్పందించారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులు వచ్చేదాకా తొందరపాటు చర్యలు తీసుకోబోమని స్పష్టం చేశారు. జంతు ప్రేమికుల మనోభావాలను తాము పరిగణనలోకి తీసుకుంటామని అన్నారామె. మరోవైపు.. ఢిల్లీ అధికార యంత్రాంగం మాత్రం సుప్రీం ఆదేశాలు ఆచరణ సాధ్యం కావడం కాస్త కష్టమేనంటోంది. ఢిల్లీలో 3 లక్షలకు పైగా వీధికుక్కలు ఉన్నాయని జంతు హక్కుల కార్యకర్త, మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ తెలిపారు. వీధికుక్కలను తరలించడం, వాటికి షెల్టర్లు ఏర్పాటు చేయడం, మెయింటెనెన్స్.. మొత్తం ఏడాదికి రూ. 15 వేల కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తోంది. అయినప్పటికీ కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రాథమిక చర్యలు ప్రారంభించింది. ఉలిక్కిపడ్డ దేశం.. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఈ ఉదయం ఓ వ్యక్తి బహిరంగంగా దాడికి పాల్పడడంతో.. దేశం మొత్తం ఉలిక్కిపడింది. సివిల్ లైన్స్లోని తన అధికారిక నివాసంలో జన్ సునాయ్ కార్యక్రమంలో భాగంగా.. ప్రజల నుంచి సీఎం వినతులు స్వీకరిస్తున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఒక కాగితాన్ని అందించాడు. వెంటనే గట్టిగా అరుస్తూ, దుర్భాషలాడుతూ ఆమె చెంపపై కొట్టాడు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్న వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. తక్షణమే స్పందించిన భద్రతా సిబ్బంది, దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తర్వాత సీనియర్ పోలీసు అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు.. ముఖ్యమంత్రి సురక్షితంగా ఉన్నారని సీఎం కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. కేంద్ర హోంశాఖకు ఘటన తాలుకా వివరాలను ఢిల్లీ పోలీసులు నివేదించారు.పొలిటికల్ రియాక్షన్స్ఈ దాడి ఘటనపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ‘ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ముఖ్యమంత్రికే రక్షణ లేకపోతే, ఇక సామాన్య మహిళల భద్రత పరిస్థితి ఏంటి?‘ అని ఆయన ప్రశ్నించారు. ఈ దాడి రాజధానిలో మహిళల భద్రత ఎంత దయనీయంగా ఉందో తెలియజేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా కూడా ఈ దాడిని ఖండించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలు వింటున్న సమయంలో ఈ ఘటన జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని.. ఈ సంఘటనతో ముఖ్యమంత్రి భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
వాహనదారులపై టోల్ బాదుడు.. NHAIపై సుప్రీంకోర్టు ఆగ్రహం
సాక్షి,న్యూఢిల్లీ: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. టోల్ప్లాజాల వద్ద గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుంటే టోల్ ఎందుకు చెల్లించాలి? అని ప్రశ్నించింది. వాహనదారులు నాలుగు వారాల పాటు టోల్ చెల్లించాల్సిన అవసరం లేదంటూ కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాలు చేస్తూ ఎన్హెచ్ఏఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ను గతవారం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల కేరళలోని త్రిసూర్ జిల్లా ఎడప్పల్లి - మన్నుత్తి 544 జాతీయ రహదారిలో ట్రాఫిక్ జామ్తో వాస్తవానికి 64 కిలోమీటర్లు దూరం గంటలో చేరుకోవచ్చు. కానీ ఆ గంట దూర ప్రయాణం కాస్తా..12 గంటల సమయం పట్టింది. దీనిపై స్థానిక మీడియా సైతం పెద్ద ఎత్తున కథనాలు ప్రచురించాయి. ట్రాఫిక్కు సంబంధించిన వీడియోలో, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి. ట్రాఫిక్ను కేరళ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. వాహనదారులు నాలుగు వారాల పాటు టోల్ చెల్లించ వద్దని తీర్పును వెలువరించింది. పైగా.. వాహనదారులకే ఎన్ఎహెచ్ఏఐ నష్ట పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది.ఎన్హెచ్ఏఐపై ఆగ్రహంకేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా సీజేఐ బీఆర్ గవాయ్, న్యాయమూర్తులు కే. వినోద్ చంద్రన్, ఎన్వీ అంజరియాల ధర్మాసనం చేసిన ట్రాఫిక్ జామ్లో ప్రయాణికులు ఇబ్బందుల్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఎన్హెచ్ఏఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ఎడప్పల్లి-మన్నుత్తి 544 జాతీయ రహదారిలో 12 గంటల ట్రాఫిక్ జామ్ అంటూ మీడియా కథనాల్ని హైలెట్ చేసింది. వాహనదారుడు 12గంటల పాటు ట్రాఫిక్లో చిక్కుకుంటే టోల్ ఎందుకు చెల్లించాలని ప్రశ్నించింది. అందుకు ఎన్హెచ్ఏఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఇది యాక్ట్ ఆఫ్ గాడ్.. టోల్ ప్లాజావద్ద ట్రక్కు బోల్తా పడిందని, కాబట్టే ట్రాఫిక్ జామైందని తన వాదనలు వినిపించారు.ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు..రోడ్డు గుంతలేమెహతా వాదనలకు.. ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు. రోడ్డు గుంతల కారణంగా వాహనం బోల్తా పడి ప్రమాదం జరిగింది. దానికి బాధ్యులు ఎవరు? అని జస్టిస్ చంద్రన్ రోడ్డు దుస్థితిని ఎత్తి చూపారు. అండర్పాస్లు నిర్మిస్తున్న ప్రదేశాలలో సర్వీస్ రోడ్లు ప్రత్యామ్నాయ మార్గాలను అందిస్తాయని, కానీ వర్షాకాలం రోడ్డు నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడిందని తుషార్ మెహతా అన్నారు. అలా ఎలా వసూలు చేస్తారుఆ సమయంలో ఎడప్పల్లి-మన్నుత్తి 544 టోల్ ప్లాజా వద్ద టోల్ విధింపుపై ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ ఆరా తీశారు. ట్రాఫిక్ లేకుండా 65 కిలోమీటర్ల రహదారి మార్గం ఒక గంట మాత్రమే పట్టే సమయం కాస్తా.. 12గంటల సమయం పట్టింది. అయినా సరే ఒక్కో వాహన దారుడు రూ.150 టోల్ ఛార్జీ ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు. సొలిసిటర్ జనరల్ తన వాదనల్లో సొలిసిటర్ జనరల్ తన వాదనల్లో గతంలో ఓ కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం టోల్ఛార్జీలపై చేసిన కామెంట్స్ను ప్రస్తావించారు. ఓ సందర్భంలో వాహనదారులు చెల్లించిన టోల్ ఫీజును తిరిగి చెల్లించకుండా..టోల్ ఛార్జీలను తగ్గించడమే సరైన పరిష్కారం అంటూ కోర్టు ఇప్పిన తీర్పును ఉదాహరించారు. అందుకు జస్టిస్ చంద్రన్ స్పందిస్తూ.. 12 గంటల పాటు ట్రాఫిక్లో చిక్కుకున్న వాహనదారుడికి ఎన్హెచ్ఏఐ చెల్లించాలి. ట్రాఫిక్ లేకపోతే.. 65 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించేందుకు గంట సమయం పడుతుంది. ట్రాఫిక్ ఉంటే, గరిష్టంగా మూడు గంటలు పడుతుంది. కానీ ఇక్కడ 12 గంటల సమయం పట్టింది. ఈ ఘటనకు మీరు ఉదహరించిన ఘటనకు పొంతనలేదు’ పునరుద్ఘాటించారు. జోక్యం చేసుకోలేంఇదే కేసు విచారణకు హాజరైన న్యాయవాదులు ఢిల్లీలో స్థానిక సంఘటనను ప్రస్తావిస్తూ.. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ఈ గేట్ ద్వారా కోర్టుకు చేరుకోవడానికి దాదాపు గంట సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆందోళనకు సీజేఐ స్పందిస్తూ ‘ఢిల్లీలో ఏం జరుగుతుందో మాకు తెలుసు. రెండు గంటలు వర్షం పడితే, మొత్తం నగరం స్తంభించి పోతుందన్నారు. చివరకు కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో తాము జోక్యం చేసుకోలేమంటూ తీర్పును రిజర్వ్ చేసింది దేశ అత్యున్నత న్యాయ స్థానం.కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. కేరళ ఎడప్పల్లి-మన్నుత్తి జాతీయ రహదారి (NH-544) చాలా దారుణంగా ఉంటుంది. గుంతల కారణంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. వర్షం పడినప్పుడో లేదంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడో ఈ రహదారి మార్గంలో ప్రయాణించాలంటే వాహనదారులకు నిత్య నరకమే. అలాంటి రహదారిపై ఇటీవల భారీ ట్రాఫిక్ జామ్ తలెత్తింది. గంట ప్రయాణం కాస్తా.. 12గంటలు పట్టింది. ఇవేం పట్టించుకోని టోల్ నిర్వాహకులు వాహనదారుల నుంచి ముక్కుపిండి టోల్ ఛార్జీలు వసూలు చేశారు. ఈ వసూళ్లపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్లు అధ్వాన్నంగా ఉంటే టోల్ ఛార్జీలు ఎలా వసూలు చేస్తారని టోల్ యాజమాన్యాన్ని ప్రశ్నించించింది. నాలుగు వారాల పాటు టోల్ వసూలు చేయొద్దని సూచించింది. కేరళ హైకోర్టు తీర్పుపై జాతీయ రహదారుల నిర్వహణ బాధ్యతలు చూసే ఎన్హెచ్ఏఐ.. నేషనల్ హైవే-544 టోల్ గేట్ సర్వీసులు నిర్వహించే గురువాయిర్ ఇన్ఫ్రాలు సుప్రీం కోర్టులో సవాలు చేశారు. ‘మేం ఒప్పందం ప్రకారం పని చేస్తున్నాం. రహదారి నిర్వహణ మా బాధ్యతే అయినా, ప్రజలు టోల్ చెల్లించకపోతే మాకు నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని ఎన్హెచ్ఏఐ భరించాలని వాపోయాయి. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. కేరళ హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకునేందుకు విముఖత వ్యక్తం చేసింది. అదే సమయంలో కోర్టులో పిటిషన్లు దాఖలు చేసి సమయం వృదా చేసే బదులుగా, రోడ్డు దుస్థితి గురించి నేషనల్ హైవే ఏదైనా చేయాలని కోర్టు పేర్కొంది. అటువంటి రద్దీ సమయంలో అంబులెన్స్లు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటాయని ఎత్తి చూపింది. -
పారదర్శకతకు ‘సుప్రీం’ పట్టం
ప్రజాస్వామ్యంలో పారదర్శకతకు ప్రత్యామ్నాయం ఏమీ ఉండదని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)కి సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతోనైనా అర్థమై ఉండాలి. బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆ సంఘం ఆదరా బాదరాగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ఓటర్ల జాబితా సవరణ మొదలెట్టింది. ఎందరు ఎన్ని అభ్యంతరాలు చెబుతున్నా బేఖాతరు చేసింది. అసలు ఈ సవరణ తీరే వేరు. ఇంటింటికీ వెళ్లి కొత్త ఓటర్లను నమోదు చేసుకోవటం, జాబితాలో అప్పటికే ఉన్నవారిని సరిపోల్చుకోవటం, చిరునామాలో లేనివారిని తొలగించటం సాగిపోయేది. కానీ ఇప్పుడు ఆఖరుసారి ఓటర్ల జాబితా పూర్తి స్థాయి సవరణ జరిగిన 2003 జనవరి 1ని ప్రాతిపదికగా తీసుకుని, ఆ తర్వాత జాబితాల్లోకి ఎక్కినవారిని ఈసీ సంశయ ఓటర్లుగా పరిగణిస్తోంది. వారినుంచి రకరకాల ధ్రువపత్రాలు అడుగుతోంది. ఇవన్నీ 1955 నాటి జాతీయ పౌరసత్వ చిట్టా (ఎన్ఆర్సీ)లో నిర్దేశించిన పత్రాలు. సారాంశంలో ఈ ఓటర్లంతా ముందుగా దేశ పౌరులమని నిరూపించుకోవాలి. తమ పుట్టుకకు సంబంధించిన ధ్రువీకరణ పత్రా లతోపాటు తల్లిదండ్రుల జనన ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి. ఆధార్, గతంలో ఈసీయే జారీచేసిన ఓటరు గుర్తింపు కార్డు కూడా పనికిరాదట. పనికొచ్చే పత్రాల్లో పాస్పోర్టు ఉంది. కానీ ఆ పాస్పోర్టు సాధించటానికి పౌరులు ఆధార్ కార్డే చూపుతారని ఈసీ మరిచింది. ఒకపక్కఆందోళనలు సాగుతుండగానే సాగిన ఈ ‘సర్’ ప్రక్రియ తర్వాత ప్రకటించిన ఓటర్ల జాబితా ముసాయిదాలో ఏకంగా 65 లక్షలమంది పేర్లు గల్లంతయ్యాయి. 22 లక్షలమంది మరణించారని తేలిందని, రెండు చోట్ల ఓటుహక్కున్నవారు 7 లక్షల మంది కాగా, వలసపోవటం వల్లనో, ఇతర కారణాల వల్లనో 35 లక్షలమంది జాడలేదని అంటున్నది. అలాంటివారి పేర్లు తొలగించామని చెబుతోంది. నోటీసులిచ్చి, వాదనలు విని తొలగించామంటోంది. నిరుడు జూలై నుంచి డిసెంబర్ వరకూ ఓటర్ల జాబితాలను సరిచూసి, అవసరమైన సవరణలు చేసి ఈ ఏడాది జనవరిలో ఈసీ తుది జాబితా ప్రకటించింది. అందులో 7.90 కోట్లమంది ఓటర్లుండగా, తాజా ముసా యిదాలో 7.24 కోట్లమంది పేర్లున్నాయి. ఈ ఆర్నెల్లలో 22 లక్షల మరణాలు, మరో 35 లక్షల మంది వలసలు లేదా ఆచూకీ లేకపోవటం మాయాజాలం అనిపించటం లేదా? పైగా ఈసారి కేవలం నెల్లాళ్ల వ్యవధిలో... అంటే జూన్ 24న మొదలై జూలై 25 వరకే ఈ ప్రక్రియ సాగింది. ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని కోట్లమంది అర్హతల్ని తేల్చిపారేయటం ఎలా సాధ్యమైందన్న సంశయాలు చాలామందికొచ్చాయి. ఈ విషయంలో నిందలు పడుతున్నా ఈసీ గంభీర వదనంతో ‘మీ దగ్గర ఆధారాలున్నాయా?’ అని ఎదురు ప్రశ్నించటం మరిన్ని సంశయాలకు దారి తీసింది. ఇది ఈసీకీ, ఆరోపణలు చేస్తున్న నేతలకూ మధ్య పంచాయతీ కాదు. ఆ ఆరోపణలు అవాస్తమని రుజువు చేస్తే ఈసీ విశ్వసనీయతే పెరుగుతుంది. లేనట్టయితే విపక్షాలు చేసే ‘ఓట్ చోరీ’ ఆరోపణను జనం నమ్ముతారు. సుప్రీంకోర్టు గురువారం చెప్పింది కూడా ఇదే! తొలగించినవారి పేర్ల ఎదురుగా కారణమేమిటో పేర్కొంటూ జాబితా విడుదల చేయాలనీ, పేరు లేదా ఓటర్ క్రమ సంఖ్య టైప్ చేయగానే వివరాలు కనబడేలా ఆ జాబితా ఉండాలనీ ధర్మాసనం ఆదే శించింది. నిజానికి ‘ఓట్ చోరీ’ ఆరోపణ రాకముందు అలాంటి సదుపాయం ఉంది. అటు తర్వాత మాయమైందంటే ఏమనుకోవాలి? ఈ వివరాలతో పార్టీలకు జాబితా అందించామన్న ఈసీ వాదనలో పస లేదు. ఓటుహక్కు కోల్పోయినవారు కారణం తెలుసుకోవటానికి పార్టీల చుట్టూ తిరగాలా? జాబితా వెల్లడైతే ఓటర్ల గోప్యత హక్కుకు విఘాతం కలుగుతుందన్న సాకు అర్థరహితం. చనిపోయినవారి, ఆచూకీ లేనివారి హక్కులకై ఈసీకి ఎందుకంత తాపత్రయం?‘సర్’ వల్ల ఎలాంటి పర్యవసానాలుంటాయో ఆ సంస్థకు అర్థమైనట్టు లేదు. బిహార్లోని 40 లోక్సభ స్థానాల్లో ఒక మీడియా సంస్థ తాజా ముసాయిదా ఆధారంగా విశ్లేషించగా దిగ్భ్రాంతి కరమైన అంశాలు వెల్లడయ్యాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో 24 చోట్ల నెగ్గినవారి మెజారిటీ కన్నా ఇప్పుడు తొలగించిన ఓటర్ల సంఖ్య అధికం! ఉదాహరణకు బెగుసరాయ్లో విజేత మెజారిటీ 81,480. కానీ అక్కడ తొలగించిన ఓటర్లు 1,23,178 మంది. షోహర్ స్థానంలో తొలగించిన వారు 1,09,723 అయితే, ఆ ఎన్నికల్లో విజేత మెజారిటీ 29,143! ఏ ఎన్నికల్లోనైనా అధిక ధరలు, నిరుద్యోగం వంటివి చర్చకొస్తాయి. ఈసీ నిర్వాకంతో రాగల బిహార్ ఎన్నికల్లో ఓటర్ల జాబితా తిరకాసే ప్రధాన అంశం కాబోతోంది. ఇది ఎన్డీయే కూటమికి మంచి పరిణామమైతే కాదు.ఓటర్ల జాబితాలో పేరు తొలగించటమంటే పోటీ చేయటానికిగల హక్కును నిరాకరించటం కూడా. ఇది బిహార్తో ఆగదు. ఎన్నికలు జరగనున్న కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళ నాడులకు కూడా విస్తరిస్తుంది. ఇంత అస్తవ్యస్తంగా, ఇంత గోప్యంగా ఉండే ప్రక్రియ ద్వారా ఇంతకూ ఈసీ సాధించదల్చుకున్నదేమిటి? -
తొలగించిన 65 లక్షల ఓటర్ల జాబితాను బహిర్గతం చేయండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై మరోసారి సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం ఏదైతే ఓటర్లను తొలగించామని చెప్పిందో.. ఆ 65లక్షలకు పైగా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో వారిని ఎందుకు తొలగించారో పేర్కొంటూ వివరణతో కూడిన ఆ లిస్టును పబ్లిక్లోకి తీసుకురావాలని పేర్కొంది ధర్మాసనం. ఈ అంశానికి సంబంధించి గురువారం(ఆగస్టు 14వ తేదీ) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. 22 లక్షల మందిని చనిపోయారన్న కారణంతో తొలగించడాన్ని సైతం ప్రశ్నించింది. బూత్ లెవెల్ స్థాయిలో దీనిని ఎందుకు బహిర్గతం చేయలేదని నిలదీసింది. పౌరుల హక్కు రాజకీయ పార్టీలపై ఆధారపడటం మాకు ఇష్టం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘భారత ఎన్నికల కమిషన్ వాదనలను మేము పూర్తిగా విన్నాం. విచారణ సమయంలో, ఈ క్రింది దశలను అంగీకరించారు. 2025 జాబితాలో పేర్లు కనిపించినప్పటికీ, తాజాగా జాబితాలో చేర్చబడని 65 లక్షల మంది ఓటర్ల జాబితాను జిల్లా స్థాయి వెబ్సైట్లలో ప్రదర్శించాలి’ అని సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.కాగా, బీహార్లో ఎన్నికల సంఘం హడావుడిగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణను ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. మరోవైపు ఈ జాబితా సవరణలోని లోపాలు ప్రతీ రోజూ బయటపెడుతూనే ఉన్నాయి. వీటిపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయ.మరొకవైపు ఈసీ తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ, అనర్హులైన ఓటర్లను తొలగిస్తూ, ఓటర్ల జాబితాను శుద్ధి చేసేందుకే ఈ ప్రక్రియ చేపట్టినట్లు వివరణ ఇస్తూ వస్తోంది.. అయితే ప్రతిపక్షాలు ఈ ఓటర్లు జాబితా సవరణ ప్రక్రియపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఇంతలో లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మహారాష్ట్ర, కర్నాటకలలో ఓటర్ల జాబితాలో ఓట్ల చోరీని ఆధారాలతో సహా బయటపెట్టడంతో పాటు బీహార్ లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపైనా పలు విమర్శలు గుప్పిస్తున్నారు.ఇదీ కూడా చదవండి'దేశ'మంత మందికి ఓటుండదా? -
కొమ్మినేనికి భారీ ఊరట
సాక్షి, ఢిల్లీ: సాక్షి టీవీ డిబేట్ కేసులో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు భారీ ఊరట లభించింది. గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ను సుప్రీం కోర్టు తాజాగా పర్మినెంట్ బెయిల్గా మారుస్తూ గురువారం తీర్పు ఇచ్చింది. అదే సమయంలో గతంలో లైవ్ షో విషయంలో ఇచ్చిన ఆదేశాలనూ సవరించింది. దీంతో ఈ కేసు విచారణ ముగిసినట్లయ్యింది. సాక్షి చానెల్లో ఓ గెస్ట్ చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో ఎలాంటి విచారణ చేయకుండానే కొమ్మినేని శ్రీనివాసరావును జూన్ 9వ తేదీన ఏపీ పోలీసులు నేరుగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో.. జూన్ 13వ తేదీన కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో సాక్షి టీవీ డిబేట్ కేసులో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం గురువారం తొలగించింది. టీవీ షో లో గెస్టు చేసే పరువు నష్టం వ్యాఖ్యలను అనుమతించవద్దంటూ మధ్యంతర బెయిల్ సమయంలో సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే లైవ్లో చేసే గెస్ట్లు చేసే వ్యాఖ్యలను ఎలా కంట్రోల్ చేయగలమన్న కొమ్మినేని తరపు న్యాయవాది అభ్యర్థించారు. దీంతో ఆ ఆదేశాలను జస్టిస్ బీవీ నాగరత్న, కేవీ విశ్వనాథ్ ధర్మాసనం సవరించింది. అదే సమయంలో.. అరెస్ట్ విషయంలో ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ తప్పనిసరిగా పాటించాలని, ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో ముందుగా 41 ఏ నోటీసు ఇచ్చి ప్రాథమిక విచారణ చేయాలని ఏపీ పోలీసులకు సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో కొమ్మినేని తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే, న్యాయవాది అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు.మధ్యంతర బెయిల్ తీర్పు సమయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. గెస్ట్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే.. యాంకర్ను ఎలా బాధ్యుడ్ని చేస్తారు?. కేవలం టీవీ డిబేటలో నవ్వినంత మాత్రానా అరెస్ట్ చేస్తారా? అలాగైతే కోర్టులో విచారణ సందర్భంగా చాలాసార్లు మేం నవ్వుతాం. వాక్ స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. కొమ్మినేనిని తక్షణమే విడుదల చేయాలి అని సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే సెలవుల కారణంగా మూడు రోజుల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. -
జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా.. ‘పహల్గాం’ దాడిని ప్రస్తావించిన సుప్రీంకోర్టు
ఢిల్లీ: జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించే విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించే ముందు స్థానికంగా ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముంది అంటూ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఇటీవల పహల్గాంలో జరిగిన దాడిని ప్రస్తావించింది.జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం.. రాష్ట్ర హోదా కల్పించే ముందు స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముంది. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని నొక్కి చెప్పింది. ఇటీవల పహల్గాంలో జరిగి దుర్ఘటనను విస్మరించలేమని వ్యాఖ్యానించింది. అనంతరం, రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలన్న పిటిషన్పై ఎనిమిది వారాల్లోగా సమాధానం దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.Supreme Court, while hearing pleas seeking direction to restore the statehood of the Union Territory of Jammu and Kashmir, observes that in granting statehood, the ground situation has to be taken into consideration.“You cannot ignore what happened in Pahalgam," says CJI BR… pic.twitter.com/qIYliZOsVU— ANI (@ANI) August 14, 2025ఇదిలా ఉండగా.. జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ గతేడాది విద్యావేత్త జహూర్ అహ్మద్ భట్, సామాజిక-రాజకీయ కార్యకర్త ఖుర్షాయిద్ అహ్మద్ మాలిక్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో.. రాష్ట్ర హోదాను పునరుద్ధరించడంలో మరింత ఆలస్యం జరిగితే జమ్ముకశ్మీర్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతింటుంది. ఇది భారత రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో భాగమైన సమాఖ్య సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది. జమ్ముకశ్మీర్లో ఎటువంటి హింసాత్మక ఘటనలు, భద్రతాపరమైన సమస్యలు లేకుండా ఎన్నికల జరిగాయి. రాష్ట్ర హోదా కల్పించకపోవడంతో అభివృద్ధికి అనేక అడ్డంకులు ఏర్పడుతున్నాయి. పౌరుల ప్రజాస్వామ్య హక్కులను ప్రభావితం చేసింది అని పేర్కొన్నారు. -
వీధి కుక్కల తీర్పు వివాదం.. అత్యవసర స్టేకి నిరాకరణ
న్యూఢిల్లీ: రాజధాని రీజియన్లోని జనావాసాల నుంచి వీధికుక్కలను తొలగించాలనే ఆదేశాలను వెనక్కి తీసుకోవాలన్న పిటిషన్లపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన ఆదేశాలపై అత్యవసరంగా నిలుపుదల చేయాలని పిటిషనర్లు కోరగా.. అందుకు ధర్మాసనం తిరస్కరించింది.👉జంతు పరిపరక్షణ విభాగాల తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ వాదిస్తూ.. ‘‘వీధి కుక్కలను తరలించడానికి సరిపడా షెల్టర్ హోమ్స్ లేవు. అలాంటప్పుడు వాటిని ఎక్కడికి తరలిస్తారు? ఎక్కడ ఉంచుతారు?. పోనీ ఒకవేళ ఒకే దగ్గర అన్నేసి కుక్కలను ఉంచితే.. అవి తిండి కోసమో లేదంటే మరేయితర సందర్భాల్లో పరస్పరం దాడి చేసుకుంటాయి. అంతేకాదు.. ప్రాణాంతక అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఇలా ఎలా చూసుకున్నా.. గతంలో ఇచ్చిన ఆదేశం అమలు చేయలేనిది. కాబట్టి ఇంతకు ముందు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయండి అని కోరారు. మరో సీనియర్ లాయర్ అభిషేక్ సింఘ్వీ వాదిస్తూ.. ఆదేశాలు అమలు చేయడానికి అవసరమైన వసతులు లేవు. ఇదెలా ఉందంటే.. గుర్రానికి ముందు బండిని కట్టేసినట్లు ఉంది. అలాగని వీధికుక్కల దాడులు.. కుక్క కాటు ఘటనలు తీవ్రమైనవనే పిటిషనర్లు భావిస్తున్నారు. అలాగని పరిష్కారం హింసాత్మకంగా ఉండకూడదు’’ అని వాదించారు.👉ఢిల్లీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ‘‘జంతువులను ఎవరూ ద్వేషించడం లేదు. వీధికుక్కల దాడుల్లో ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం స్టెరిలైజేషన్ (సంతానరహిత క్రియ) అనేది రేబిస్ను ఆపదు. కిందటి ఏడాది 37 లక్షల కుక్కకాటు కేసులు నమోదు అయ్యాయి. పిల్లలు స్వేచ్ఛగా వీధుల్లో ఆడలేని.. అమ్మాయిలు తిరగలేని పరిస్థితి. దీనిపై వివాదం కాదు.. సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మాంసాహారం తినేవారే జంతు ప్రేమికులమని ప్రకటించుకుంటున్నారు. ఇక్కడ కుక్కలను చంపాల్సిన అవసరం లేదు. వాటిని జనావాసాల నుంచి వేరు చేయడమే ఉద్దేశం’’ అని వాదించారు. 👉అయితే.. సుప్రీం కోర్టు ఇంతకు ముందు ఇచ్చిన ఆదేశాలు జనాల్లోకి చేరకముందే.. కొన్ని ప్రాంతాల్లో అధికారులు కుక్కలను పట్టుకోవడం పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే.. ‘‘పార్లమెంట్ చట్టాలు చేస్తుంది. నిబంధనలు రూపొందిస్తుంది. కానీ, అధికారుల బాధ్యాతారాహిత్యం వల్ల క్షేత్ర స్థాయిలో అవి అమలు కావడం లేదు. Animal Birth Control (ABC) నిబంధనలను అధికారులు సక్రమంగా అమలు చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు’’ కోర్టు వ్యాఖ్యానించింది. ఓ మనుషులు పడుతున్న బాధ.. మరోవైపు జంతు ప్రేమికుల ఆందోళన.. ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో గత ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజరియాలతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఆదేశం ఇలా..వీధి కుక్కల దాడులు, రేబిస్ బారినపడి పలువురు మరణించిన ఘటనలపై మీడియాలో వచ్చిన కథనాలను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలో.. ఢిల్లీ ఎన్సీఆర్ లో వీధి కుక్కలన్నింటినీ డాగ్ షెల్టర్స్ కి తరలించాలని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 11న తీర్పు ఇచ్చింది. ఇందుకు ఆరు నుంచి ఎనిమిది వారాల గడువును ఢిల్లీ ప్రభుత్వానికి విధించిన సుప్రీం కోర్టు.. అవి మళ్లీ జనావాసాల్లోకి వస్తే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఆదేశించింది. అదే సమయంలో శునకాల తరలింపును గనుక అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవంటూ జంతు ప్రేమికులను హెచ్చరించిది కూడా. ఈ నేపథ్యంలో ఈ తీర్పు సమంజసం కాదంటూ జంతు ప్రేమికులు ఆందోళనకు దిగారు. కొందరు(వీళ్లలో రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు) సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. మరికొందరు నేరుగా కోర్టును ఆశ్రయించారు. దీనితో ఆదేశాలను పునఃపరిశీలిస్తానని హామీ ఇచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్.. ఈ పిటిషన్ను ముగ్గురు జడ్జిలతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు. -
దర్శన్కు సిగరెట్లు, మందు అందిస్తే ఊరుకునేది లేదు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: కన్నడ స్టార్ నటుడు దర్శన్ తూగుదీపకు భారీ షాక్ తగిలింది. కర్ణాటక హైకోర్టు ఆయనకు జారీ చేసిన బెయిల్ను సుప్రీం కోర్టు గురువారం రద్దు చేసింది. తక్షణమే ఆయన్ని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. తన అభిమాని అయిన రేణుకాస్వామిని హత్య కేసులో అరెస్టైన దర్శన్.. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న సంగతి తెలిసిందే.‘‘మేము బెయిల్ మంజూరు, రద్దు ఈ రెండు అంశాలను పరిశీలించాం. హైకోర్టు ఉత్తర్వు యాంత్రికంగా అధికారాన్ని వినియోగించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బెయిల్ మంజూరు చేయడం విచారణపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు’’ అని బెయిల్ రద్దు చేస్తూ తీర్పు సందర్భంగా జస్టిస్ మహదేవన్ వ్యాఖ్యానించారు. ఈ తీర్పుపై బెంచ్లోని మరో న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దీవాలా హర్షం వ్యక్తం చేశారు. ‘‘జే మహదేవన్ వర్ణించలేనంత గొప్ప తీర్పును ప్రకటించారు. నిందితులు ఎంతటి వాళ్లైనా.. చట్టానికి అతీతులేం కాదు అనే ఓ స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది’’ అని జస్టిస్ జేబీ పార్దీవాలా అన్నారు. ప్రస్తుతం దర్శన్ తమిళనాడులో ఉన్నట్లు సమాచారం. సుప్రీం కోర్టు ఉత్తర్వుల కాపీని ట్రయల్ కోర్టుకు అందించి.. ఆపై వారెంట్ ద్వారా దర్శన్ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీర్పు సందర్భంగా ద్శిసభ్య ధర్మాసనం.. ‘‘బెయిల్ మంజూరు చేయడానికి చట్టపరమైన కారణం లేదు. దర్శన్కు బెయిల్ ద్వారా లభించిన స్వేచ్చ.. న్యాయ వ్యవస్థను దెబ్బతీయే ప్రమాదంలోని నెట్టింది’’ అని అభిప్రాయపడింది. ఈ క్రమంలో.. గతంలో జైలులో దర్శన్కు ప్రత్యేక వసతులు అందిన విషయాన్ని జస్టిస్ పార్దీవాలా ప్రస్తావించారు. ‘‘జైల్లో నిందితుడికి ఫైవ్స్టార్ హోటల్ ట్రీట్మెంట్ అందిన విషయం మా దృష్టికి వచ్చింది. జైలు ప్రాంగణంలోనే నిందితుడు సిగరెట్లు, మందు తాగిన విషయం మాకు తెలిసింది. ఈ వ్యవహారంలో జైలు సూపరింటెండెంట్ను సస్పెండ్ చేస్తాం. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవు’’ అని కర్ణాటక పోలీసు, జైళ్ల శాఖను జస్టిస్ పార్దీవాలా హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ చట్టం సమానంగా వర్తించాలి అని పునరుద్ఘాటిస్తూ.. దర్శన్పై ఉన్న ఆరోపణలు, అలాగే ఫోరెన్సిక్ ఆధారాలు.. బెయిల్ రద్దు చేయాల్సిన అవసరాన్ని బలపరిచాయని పేర్కొంది. ఈ విషయంలో మేము మా అసాధారణ అధికారాన్ని వినియోగించేందుకు సంతృప్తిగా ఉన్నాం అని కోర్టు ఉత్తర్వులో పేర్కొంది.కేసు నేపథ్యం.. పోలీసుల అభియోగాల ప్రకారం.. చాలెంజింగ్ స్టార్ దర్శన్కు వీరాభిమాని అయిన రేణుకాస్వామి నటి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. 2024 జూన్లో దర్శన్, అతని సహచరులు రేణుకాస్వామిని అపహరించి, బెంగళూరులోని షెడ్లో మూడు రోజుల పాటు హింసించారు. అనంతరం అతని శవాన్ని డ్రెయిన్లో పడేశారు. ఈ కేసులో దర్శన, పవిత్రగౌడ, మరో 15 మంది అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో వాళ్లకు అందిన వీఐపీ ట్రీట్మెంట్పైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో దర్శన్ను మరో జైలుకు మార్చారు. ఆపై వాళ్లు బెయిల్ మీద బయటకు వచ్చారు. 2024 డిసెంబర్ 13న కర్ణాటక హైకోర్టు దర్శన్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక ప్రభుత్వం ఏడుగురి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. అయితే విచారణలో దర్శన్కు హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై సర్వోన్నత న్యాయస్థానం మొదటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చింది. తాజాగా సుప్రీం కోర్టులో బెయిల్ రద్దు కావడంతో దర్శన్ మళ్లీ అరెస్ట్ కానున్నాడు. కేసు టైమ్లైన్2024 జూన్ 8: రేణుకాస్వామి హత్య.. బెంగళూరులోని కామాక్షిపాళ్య ప్రాంతంలోని కాలువ ప్రాంతంలో దొరికిన మృతదేహాం2024 జూన్ 11: నటుడు దర్శన్ అరెస్ట్2024 జూన్: రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయ్యారు. 2024 సెప్టెంబర్ 21: అనారోగ్య కారణంగా బెయిల్ కోసం సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.2024 అక్టోబర్ 31: కర్ణాటక హైకోర్టు ఆరు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.2024 డిసెంబర్ 13: హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.2025 జనవరి 24: దర్శన్ బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టులో కర్ణాటక ప్రభుత్వం పిటిషన్2025 ఆగస్టు 14: దర్శన్ బెయిల్ రద్దు చేసిన సుప్రీం కోర్టు -
ఈవీఎం గోల్మాల్ రివీల్.. సుప్రీంకోర్టులో రీకౌంటింగ్.. ఓడిన అభ్యర్థి గెలుపు
ఈవీఎంల పనితీరుపై గత లోక్సభ సార్వత్రిక ఎన్నికల సమయంలో.. అలాగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలోనూ తీవ్ర చర్చ నడిచింది. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చంటూ ప్రపంచ అపరకుబేరుడు ఎలాన్ మస్క్ సైతం అభిప్రాయం వ్యక్తం చేయడం చూశాం. ఏపీలో ఎన్డీయే కూటమిది ఈవీఎంల గెలుపేనంటూ చెబుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్.. చాలా దేశాలు ఈవీఎంల నుంచి బ్యాలెట్ పేపర్ల వైపు మళ్లడాన్ని ప్రముఖంగా ప్రస్తావించడం చూశాం. ఈ క్రమంలో.. ఈవీఎంల గుట్టురట్టు అయిన ఘటన ఒకటి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.ఓట్ చోరీ వ్యవహారం వార్తల్లోకెక్కిన వేళ.. హర్యానాలోని ఓ కుగ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు కారణమవుతోంది. కొన్నేళ్ల క్రితం ఆ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలూ వచ్చాయి. కానీ.. ఓడిపోయిన వ్యక్తి వేసిన కేసు.. న్యాయస్థానాల్లో నలిగి చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం అసాధారణ రీతిలో సర్పంచ్ ఎన్నికలకు ఉపయోగించిన ఈవీఎంలను తెప్పించుకుంది. ఓట్ల లెక్కింపు మరోసారి జరిపించింది. ఆశ్చర్యకరంగా.. అప్పుడు ఓడిన వ్యక్తి.. ఇప్పుడు సుప్రీంకోర్టులో గెలిచాడు! ఈ నాటకీయ పరిణామాలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.జరిగింది ఇదీ..హర్యానాలోని బవునా లఖూ.. ఓ చిన్న గ్రామం. 2022 నవంబరులో ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఈవీఎంల ద్వారా జరిగిన ఈ ఎన్నికల్లో కులదీప్ సింగ్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే, మోహిత్ సింగ్ అనే అభ్యర్థి ఈ ఫలితాలను సవాల్ చేశాడు. ఎన్నికల ట్రైబ్యునల్ బూత్ నెంబరు-69లో రీపోలింగ్ నిర్వహించారు. కానీ.. హర్యానా హైకోర్టు ఈ ఆదేశాలను రద్దు చేసింది. దీంతో మోహిత్ కుమార్ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాడు. కేసు విచారించిన సుప్రీంకోర్టు గత నెల 31న గ్రామంలోని ఒక పోలింగ్ బూత్ కాకుండా 65 నుంచి 70వ నెంబరు బూత్లన్నింటిలోని ఓట్లను మళ్లీ లెక్కపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది.Vote Theft Claims via EVMs in India: Haryana CaseAllegations of #votechori (vote theft) via Electronic Voting Machines (EVMs) resurfaced after a 2022 sarpanch election in Buana village, Panipat, Haryana. Initially, Kuldeep Singh won with 1,000 votes, but Mohit Kumar’s challenge… pic.twitter.com/tp7m65v7Wk— Adv. Avtaar S Turka / अवतार तुरका 🇮🇳 (@AvtaarTurka) August 14, 2025ఈ రీకౌంటింగ్ కూడా సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో ఆగస్టు ఆరో తేదీన ఇరుపక్షాల సమక్షంలో జరిగింది. మొత్తం ప్రక్రియను వీడియో తీశారు. రీకౌంటింగ్ ఫలితాలు ఎలా ఉన్నాయంటే.. 2022లో గెలిచిన కుల్దీప్ సింగ్కు 1000 ఓట్లు దక్కితే.. ఓడిన మోహిత్ సింగ్కు 1051 ఓట్లు వచ్చాయి. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ఈ ఫలితాలను ధ్రువీకరించి నివేదిక సమర్పించడంతో సుప్రీంకోర్టు ఆగస్టు 11న మోహిత్ కుమార్ను విజేతగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల్లోగా ఈ ఫలితాన్ని నోటిఫై చేయాల్సిందిగా కూడా స్పష్టం చేసింది. ఈ ఎన్నికకు సంబంధించి ఇతర అభ్యంతరాలు ఏవైనా ఉంటే ఎన్నికల ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చునని, రీకౌంటింగ్ ఫలితాలు మాత్రం మారవని స్పష్టం చేసింది.ఇదిలా ఉండగా.. ఈవీఎంల విషయంలో దేశంలో పలు రాష్ట్రాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించడం పలు అనుమానాలకు తావిచ్చింది ఫలితాలు వెలువడినప్పటి నుంచే వైఎస్సార్సీపీ ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈవీఎంలకు బదులు బాలెట్ పేపర్లను ఎన్నికల్లో తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఈవీఎంలపై అనుమానాలతో ఒంగోలు ఓట్ల గోల్మాల్ వ్యవహారంపై ఆయన కోర్టును సైతం ఆశ్రయించారు. అంతెకాదు.. తాజాగా నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన ప్రస్తావించిన అంశం ఆసక్తికర చర్చకు దారి తీసింది. పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజుకు మధ్య ఓట్ల శాతంలో తేడాను, భారీ ఓట్ల చోరీని(48 లక్షల ఓట్లు) ఆయన ప్రస్తావించారు. ఓట్ల చోరీపై పోరాటం అంటున్న రాహుల్ గాంధీ.. ఏపీ ఫలితాలపై ఎందుకు మాట్లాడరంటూ సూటిగా ప్రశ్నించారు. -
సమగ్ర సవరణ సబబే
న్యూఢిల్లీ: విపక్ష పార్టీల విమర్శలు, అత్యంత అభ్యంతరాలతో వివాదాస్పదంగా మారిన బిహార్లో ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్–సర్)) సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలుచేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఓటరు జాబితాలో మార్పు లు, చేర్పులు, సవరణలు చేపట్టడం సరైన ప్రక్రియేనని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జో య్మాల్య బాగ్చీల సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘ఓటర్ల జాబితా ఎప్పు డూ స్థిర సంఖ్యతో కొనసాగడం సహే తుకం అనిపించుకోదు. కాలానుగుణంగా అందులో సవరణలు తప్పనిసరి. గతంలో ఓటరుగా నిరూపించుకోవడానికి ఏడు రకాల ధ్రువీక రణ పత్రాలను ఈసీ అనుమతించేది. ఇప్పు డు ఏకంగా 11 రకాల ధ్రువీకరణ పత్రా లను అనుమతిస్తున్నారు. గతంతో పోలిస్తే ఎక్కువ ధ్రువపత్రాలను అనుమతించడం చూస్తుంటే ఈ ప్రక్రియ మరింతగా ఓటరుకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఓటర్లను జాబితా నుంచి తప్పించేలా ఇది కనిపించట్లేదు’’ అని ధర్మాసనం అభిప్రాయ పడింది. ఎస్ఐఆర్ తప్పులతడకగా ఉందని, దీన్ని వెంటనే ఆపాలంటూ విపక్షాలు ఆందోళన బాట పట్టిన వేల సుప్రీంకోర్టు ఈసీ అనుకూ ల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘అవస రమై నప్పుడు ఓటరు జాబితాకు సవరణలు చేసే సర్వాధికారం ఈసీకి ఉంది. చట్టానికి వ్యతిరే కంగా ఎస్ఐఆర్ చేపడుతు న్నారని, దీనిని ఆపేయాలన్న పిటిషనర్ వాదనలను కోర్టు తోసి పుచ్చింది. బిహార్లో ఎస్ఐఆర్ను వ్యతి రేకిస్తూ రాష్ట్రీయలోక్దళ్, కాంగ్రెస్ నేత లు సహా రాజకీయ సంస్కరణ సంస ్థ(ఏడీ ఆర్) సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే.సవరణ లేకుండా ఎలా?‘‘బిహార్లో మొదలెట్టిన ఎస్ఐఆర్ను దేశ వ్యాప్తంగా విస్తరించకుండా అడ్డుకోవాలి. ఎస్ఐఆర్లాంటి ప్రక్రియను ఈసీ గతంలో ఏనాడూ చేపట్టలేదు. అసలు ఇది ఎక్కడ ముగుస్తుందో దేవుడికే తెలియాలి’’ అని ఏడీఆర్ తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ అన్నారు. దీంతో కోర్టు స్పందించింది. ‘‘ మీ తర్కం ప్రకారం ప్రత్యేకంగా ఓటరు సమగ్ర సవరణ చేపట్ట కూడదు. మొట్టమొదటిసారిగా దశాబ్దాల క్రితం సేకరించిన వాస్తవిక ఓటర్ల జాబితాను మాత్రమే కొనసాగించాలంటున్నారు. మా అభిప్రాయం ప్రకారం ఓటరు జాబితా అనేది ఎలాంటి సవరణలు జరపకుండా అలాగే కొనసాగించడం సబబు కాదు. ఈ జాబితా ఎప్పటికప్పుడు సవరణకు బద్దమై ఉండాల్సిందే. సవరణ చేయకుంటే చనిపోయిన వారి పేర్లను తొలగించేదెలా? వేరే రాష్ట్రానికి వలసవెళ్లిన ఓటర్లు, మరో నియోజకవర్గంలో స్థిర నివాసం ఏర్పర్చు కున్న వారి పేర్లను పాత నియోజక వర్గంలో తొలగించొద్దా?’’ అని ధర్మాసనం సూటి ప్రశ్నలు వేసింది. ‘‘ దృవపత్రంగా ఆధార్ను అంగీకరించట్లేదని మాకు అర్థమవుతోంది. కానీ ఏకంగా 11 ఇతర రకాల దృవపత్రాలను అంగీకరిస్తు న్నారుగా?’’ అని పిటిషనర్ల తరఫున హాజరైన మరో న్యాయవాది అభిషేక్ సింఘ్వీని కోర్టు ప్రశ్నించింది. దీనితో పిటిషనర్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ విభేదించారు. ‘‘ధ్రువపత్రాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ అవి పూర్తిస్తాయిలో ఇప్పుడు అందరికీ అందుబాటులో లేవు. ధ్రువపత్రాల్లో ఒకటైన పాస్పోర్టు విషయానికే వస్తే రాష్ట్రంలో కేవలం ఒకటి, రెండు శాతం మంది దగ్గర మాత్రమే ఇవి ఉన్నాయి’’అని వాదించారు. దీనిపై కోర్టు స్పందించింది. ‘‘ రాష్ట్రంలో 36,00,000 మందికి పాస్పోర్టు ఉంది. ఇది మంచి సంఖ్య మాదిరిగానే కనిపిస్తోంది’’ అని కోర్టు గుర్తుచేసింది. వాటి మధ్య యుద్ధంలా తయారైంది‘‘ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 21(3) ప్రకారం ఓటరు జాబితాలో ఇప్పుడు సవరణలు అవసరమని ఈసీ భావిస్తే అప్పుడు వెంటనే ప్రత్యేక సవరణ మొదలెట్టే సర్వాధికారం ఈసీకి దఖలుపడింది. వాస్తవానికి ఈ అంశం రాజ్యాంగబద్ధ హక్కుకు, రాజ్యాంగం ద్వారా దఖలుపడిన అధికారానికి మధ్య పోరాటంలా తయారైంది’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు అభిప్రాయంతో లాయర్ శంకరనారాయణన్ విబేధించారు. చట్టప్రకారం రాష్ట్రంలో ఏదైనా కేవలం ఒక నియోజకవర్గంలో లేదంటే ఒక నియోజకవర్గంలోని కొంత భాగంలో మాత్రమే జాబితా సవరణ చేపట్టాలి. అంతేగానీ ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సవరణ చేపట్టకూడదు’’ అని వాదించారు. దీనిపై జడ్జి మళ్లీ స్పందించారు. ‘‘ రాజ్యాంగంలోని 324వ అధికరణం ద్వారా ఈసీకి సవరణ అధికారాలు దఖలుపడ్డాయి’’ అని జడ్జి వ్యాఖ్యానించారు. వెతికే అవకాశం లేకుండా చేశారు‘‘ముసాయిదా జాబితాలో సెర్చ్ ఆప్షన్ను ఈసీ దురుద్దేశంతో తొలగించింది. దీంతో గత జాబితాతో పోలిస్తే ముసాయిదా లిస్ట్లో ఎవరి పేర్లను తొలగించారో తెలియకుండా పోయింది. తొలగించిన, మరణించిన, వలసవెళ్లిన వాళ్ల జాబితా తెలీకుండా దాచిపెట్టేందుకే ఈసీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. బెంగళూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలో లక్ష నకిలీ ఓట్లను గుర్తించామని రాహుల్గాంధీ మీడియా సమావేశంలో ప్రకటించిన మరుసటి రోజే ఈ సెర్చ్ ఆప్షన్ తీసేశారు’’ అని ఎన్జీఓ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. -
సుశీల్ మళ్లీ జైలుకు...
న్యూఢిల్లీ: భారత ప్రముఖ రెజ్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్పై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. హత్య కేసులో నిందితుడైన సుశీల్కు ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చి న బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన బెంచ్ ఈ తీర్పునిచ్చి ంది. వారం రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలని ఆదేశించడంతో సుశీల్ మళ్లీ జైలుపాలు కానున్నాడు. యువ రెజ్లర్ సాగర్ ధన్కర్ హత్య కేసులో జైల్లో ఉన్న సుశీల్కు ఐదు నెలల క్రితం బెయిల్ లభించగా... దీనిని వ్యతిరేకిస్తూ సాగర్ తండ్రి అశోక్ ధన్కర్ కోర్టుకెక్కడంతో సుప్రీంకోర్టు స్పందించింది. ఆటగాడిగా సుశీల్ స్థాయి, ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచిన అతను ఘనతలను కూడా ప్రత్యేకంగా ఉదహరిస్తూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరారీ తర్వాత లొంగిపోయి... కేసు వివరాల్లోకెళితే... 2021 మే నెలలో సుశీల్ కుమార్తో పాటు పలువురు రెజ్లర్లు సాధన చేసే ఛత్రశాల్ స్టేడియం ముందు ఈ ఘటన జరిగింది. ఒక ఆస్తి వివాదానికి సంబంధించిన వ్యవహారంలో సుశీల్ తదితరులు కలిసి సాగర్ ధన్కర్, అతని మిత్రులపై తీవ్ర దాడికి పాల్పడ్డారు. గాయాలతో ఆ తర్వాత సాగర్ మృతి చెందాడు. దాంతో సుశీల్పై కేసు నమోదైంది. దాదాపు ఇరవై రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత చివరకు సుశీల్ పోలీసుల ముందు లొంగిపోయాడు. దీనిపై ట్రయల్ కోర్టు విచారణ సందర్భంగా హత్యతో పాటు అక్రమంగా ఆయుధాలను కలిగి ఉండటం తదితర అంశాలతో పోలీసులు ఛార్జ్ïÙట్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సుశీల్ను తీహార్ జైలుకు పంపించారు. అయితే ఈ నాలుగేళ్ల కాలంలో వేర్వేరు కారణాలతో అతను ఐదుసార్లు స్వల్పకాలిక బెయిల్ పొందాడు. హైకోర్టు తప్పు చేసింది... సుశీల్కు గత మార్చిలో ఢిల్లీ కోర్టుపై బెయిల్ మంజూరు చేయడం తనకు తీవ్ర వేదన కలిగించిందని, తనకు న్యాయం చేయాలంటూ ఢిల్లీ పోలీసు విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న సాగర్ తండ్రి అశోక్ ధన్కర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. సుశీల్కు బెయిల్ ఇచ్చిన ప్రతీసారి అతను సాక్షులను ప్రభావితం చేశాడని... 35 మంది సాక్షుల్లో 28 మంది ఇప్పుడు గతంలో తాము ఇచ్చిన సాక్ష్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పిటిషనర్ ఆరోపించారు. అనంతరం కేసుపై కోర్టు తమ అభిప్రాయాలు వెల్లడించింది. ‘నిందితుడు అగ్రశ్రేణి రెజ్లర్. ప్రపంచ స్థాయిలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. కాబట్టి సమాజంలో కూడా వ్యక్తిగతంగా కూడా ఎంతో గుర్తింపు ఉన్న వ్యక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి అతను సాక్షులను, విచారణను ప్రభావితం చేయవచ్చు. ఎఫ్ఐఆర్ తర్వాత కూడా అతను పరారీలో ఉన్న విషయంలో మర్చిపోవద్దు. అతనిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.కేసు తీవ్రత తగ్గించే విధంగా బెయిల్ ఉండరాదు. సత్ప్రవర్తనలాంటి అంశాలను ఇలాంటి కేసుల్లో పరిగణలోకి తీసుకోవద్దు. ఈ కేసులో బెయిల్ ఇచ్చి న ఢిల్లీ హైకోర్టు తప్పుగా వ్యవహరించింది’ అని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. అయితే బెయిల్ ఇచ్చిన కారణాలను తప్పుగా చూపిస్తూ దీనిని రద్దు చేసిన సుప్రీంకోర్టు... మున్ముందు సుశీల్ కుమార్కు కొత్తగా మళ్లీ బెయిల్కు అప్పీల్ చేసుకునే అవకాశం మాత్రం ఇచ్చి ంది. -
వారి సభ్యత్వాలు రద్దు!
సాక్షి, న్యూఢిల్లీ: గవర్నర్ కోటాలో తెలంగాణ శాసనమండలికి ఎన్నికైన ఫ్రొఫెసర్ కోదండరాం, అమేర్ అలీఖాన్ల సభ్యత్వాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. గతేడాది ఆగస్టు 14న సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును ధర్మాసనం తాజాగా సవరించింది. మధ్యంతర ఉత్తర్వు మేరకు తీసుకున్న చర్యలు ఏవైనా రద్దయినట్టేనని పేర్కొంది. మధ్యంతర ఉత్తర్వులోని.. ‘తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తున్నాం..’ అనే వాక్యాన్ని తొలగిస్తున్నట్లు తెలిపింది. దీంతో 2024 ఆగస్టు 16న ప్రొఫెసర్ కోదండరాం, అమేర్ అలీఖాన్లు ఎమ్మెల్సీలుగా చేసిన ప్రమాణ స్వీకారాలు రద్దయినట్టయ్యింది. గవర్నర్ కోటాకు సంబంధించి భవిష్యత్తులో జరిగే నామినేషన్లు సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. కోదండరాం, అమేర్ అలీఖాన్ల నామినేషన్ను సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్కుమార్, కుర్రా సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్పై తాజాగా విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం మధ్యంతర తీర్పు ఇచ్చింది. వారు ఎమ్మెల్సీలుగా మండలిలో తిరిగి ప్రవేశించాలంటే మళ్లీ సిఫారసు చేయబడాలని జస్టిస్ విక్రమ్నాథ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండకూడదనే వాదనను తిరస్కరిస్తూ, ‘అప్పట్లో పిటిషనర్ల పేర్లు తిరస్కరించినప్పుడు కూడా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి..’ అని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది. సిఫారసులు.. తిరస్కరణ.. సిఫారసులు 2023 జూలైలో అప్పటి సీఎం కె.చంద్రశేఖర్రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం, దాసోజు శ్రవణ్కుమార్, కుర్ర సత్యనారాయణల పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సిఫారసు చేసింది. అయితే సెప్టెంబర్లో అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. వారికి రాజకీయ నేపథ్యం ఉండటాన్ని ప్రస్తావించడంతో పాటు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5)కు అనుగుణంగా వారి నియామకాలు లేవని పేర్కొంటూ వారి నామినేషన్లను తిరస్కరించారు. కాగా 2023 చివర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరిలో ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమేర్ అలీ ఖాన్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. ఈ నామినేషన్లతో పాటు, గవర్నర్ తమ నామినేషన్లను తిరస్కరించడాన్ని దాసోజు, కుర్ర హైకోర్టులో సవాలు చేశారు. ఈ నేపథ్యంలో 2024 మార్చిలో హైకోర్టు.. గవర్నర్ తిరస్కరణను రద్దు చేయడంతో పాటు కొత్త నామినేషన్లను కూడా కొట్టివేసింది. గవర్నర్ మంత్రివర్గ సలహా మేరకే వ్యవహరించాలని, సవరణలు కోరే హక్కు మాత్రమే ఉందని కోర్టు స్పష్టం చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లగా, 2024 ఆగస్టు 14న ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వుపై స్టే ఇచ్చింది. కోదండరాం, అమేర్ అలీ ఖాన్లు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసుకోవడానికి అనుమతించింది. అయితే వారి నామినేషన్లు తుది తీర్పుకు లోబడి ఉంటాయని తెలిపింది. తాజాగా బుధవారం జరిగిన వాదనల అనంతరం మధ్యంతర ఉత్తర్వును సవరించింది. మధ్యంతర ఉత్తర్వు ఆధారంగా తీసుకున్న అన్ని చర్యలు, అందులో ప్రమాణ స్వీకారాలు కూడా రద్దు అవుతాయని స్పష్టం చేసింది. ఇకపై ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం జరిగే ఏ కొత్త నామినేషన్లు అయినా, సెప్టెంబర్ 17న జరిగే విచారణ తర్వాత వచ్చే తుది తీర్పుపైనే ఆధారపడి ఉంటాయని తెలిపింది. కాగా గవర్నర్ తరఫున వాదించిన అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సిఫారసు మేరకే గవర్నర్ ఆమోదం తెలిపారని వాదించారు. పిటిషనర్లు తమ నామినేషన్ల అమలును కాదు, గవర్నర్ తిరస్కరణను సవాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గవర్నర్ పూర్తిగా రాజ్యాంగపరమైన విధానాన్నే అనుసరించారని చెప్పారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది రంజిత్కుమార్ వాదించారు. గవర్నర్.. ‘హైకోర్టుకు నేనుజవాబు చెప్పాల్సిన అవసరం లేదు..’ అని చెప్పారని తెలియజేయగా, ‘చాలా దురదృష్టకరం’ అని జస్టిస్ విక్రమ్నాథ్ వ్యాఖ్యానించారు. -
పంజరంలో బంధిస్తామంటే ఎలా?: రితికా భావోద్వేగం.. మనసు కరిగేలా..
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సతీమణి రితికా సజ్దే (Ritika Sajdeh) తీవ్ర భావోద్వేగానికి లోనైంది. దేశ రాజధాని ప్రాంతం నుంచి వీధి కుక్కలను తొలగించాలంటూ సుప్రీం ఇచ్చిన ఆదేశాలపై స్పందిస్తూ ఉద్వేగపూరిత నోట్ రాసింది.మా హృదయ స్పందన‘‘వాళ్లు వీటిని ప్రమాదకారులు అంటున్నారు. మేము మాత్రం ఇవే మా హృదయ స్పందన అంటాము. ఢిల్లీ- ఎన్సీఆర్ ప్రాంతంలోని వీధి కుక్కలన్నింటినీ బంధించి.. అక్కడి నుంచి పంపించి వేయాలని సుప్రీం కోర్టు అంటోంది.నైట్ గార్డుల్లా సూర్యోదయం లేదు.. స్వేచ్ఛా లేదు.. వాటిని ప్రతి ఉదయం పలకరించే ముఖాలు కూడా కనబడవు. అయినా.. ఇవి కేవలం ‘వీధి కుక్కలు’ మాత్రమే కాదు. ఒక్క బిస్కెట్ కోసం టీ స్టాల్ దగ్గర పడిగాపులు పడుతూ ఉంటాయి. రాత్రుళ్లు షాప్కీపర్లకు సాయంగా నైట్ గార్డుల్లా చెప్పకుండానే డ్యూటీ చేస్తాయి.స్కూల్ నుంచి పిల్లలు తిరిగి వస్తుంటే వారిని చూసి ప్రేమగా తోక ఊపుతాయి. చలిలో.. తమను పట్టించుకోని సిటీకి కాపలా కాస్తుంటాయి. అవును.. కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమే. కుక్కకాట్లు, వాటి వల్ల కలిగే నష్టం కూడా ఉంది.పంజరంలో బంధిస్తామంటే ఎలా?అంతమాత్రాన జాతి మొత్తాన్ని పంజరంలో బంధిస్తామంటే ఎలా? ఇదెలాంటి పరిష్కారం? అసలు స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారా? రెగ్యులర్గా వాక్సినేషన్లు వేస్తున్నారా? కమ్యూనిటీ ఫీడింగ్ జోన్లు ఉన్నాయా. దత్తత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా?.. వీటి ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చు.నోరులేని మూగజీవాలు.. పాపంఅప్పుడు వాటిని శిక్షించాల్సిన పని ఉండదు. బంధించాల్సిన అవసరమూ ఉండదు. నోరులేని మూగజీవాలను కాపాడలేని సమాజం.. తన ఆత్మనే కోల్పోతుంది. ఈరోజు ఈ కుక్కలు.. రేపు మరోటి? ఇప్పటికైనా అందరూ గొంతెత్తండి. ఎందుకంటే పాపం వాటికి నోరు లేదు. ఈ సందేశాన్ని వ్యాప్తి చేయండి’’ అంటూ రితికా సజ్దే తీవ్ర భావోద్వేగానికి లోనైంది.కాగా దేశ రాజధాని ప్రాంతంలో ఇటీవలి వీధి కుక్కల వరుస దాడుల వల్ల పసిపిల్లలు, వృద్ధులు పడుతున్న బాధలు, రేబిస్ బారిన పడి మరణించిన వ్యక్తుల గురించి మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. వీటిని సుమోటోగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టి.. 8 వారాల్లోపు వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.ప్రజల మేలు కోసమే..అంతేకాదు.. ఈ చర్యలను అడ్డుకోవాలని చూస్తే జంతు ప్రేమికులుగా చెప్పుకొనే వాళ్లు కూడా తీవ్ర పరిణామాలు చవిచూడక తప్పదని హెచ్చరించింది. ప్రజల మేలు కోసం చేసే పనులను అడ్డుకోవడం సరికాదని పేర్కొంది. ఈ నేపథ్యంలో జంతు ప్రేమికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నోరులేని మూగజీవాల పట్ల ఇంత కఠినంగా ఉండవద్దని న్యాయస్థానానికి విన్నవిస్తున్నారు. ఈ క్రమంలో రితికా సజ్దే సైతం సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకుంది.చదవండి: వీధి కుక్కల తీర్పుపై సుప్రీం కోర్టు యూటర్న్? -
సాక్షి TV ప్రసారాల నిలిపివేతపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
-
సాక్షి ప్రసారాలు నిలిపివేత.. ఏపీ సర్కార్కు సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, ఢిల్లీ: ఏపీలో ‘సాక్షి’ టీవీ ప్రసారాల నిలిపివేత కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఏపీ ఫైబర్ నెట్ సహా పలు ఎంఎస్వోలకు కోర్టు నోటీసులు ఇచ్చింది. దీనిపై మూడు వారాల్లోగా జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం.. కేబుల్ టీవీ నిబంధనలను ఉల్లంఘించి సాక్షి టీవీ ప్రసారాలను అడ్డుకుంది. ఏపీ ఫైబర్ నెట్, ఎంఎస్వోలు సాక్షి టీవీ ప్రసారాలను అక్రమంగా నిలిపివేయడంపై యాజమాన్యం.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ పీఎస్.నరసింహ, జస్టిస్ ఎ.ఎస్. చందూర్కర్ విచారణ జరిపింది. నిబంధనలను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వమే సాక్షి టీవీ ప్రసారాలను అడ్డుకుంటున్న వైనాన్ని సుప్రీంకోర్టు దృష్టికి సీనియర్ న్యాయవాదులు నిరంజన్రెడ్డి, వి.గిరి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ‘సాక్షి’ టీవీ ప్రసారాల నిలిపివేతపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. పిటిషన్లోని కీలక అంశాలు..టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏపీ ఫైబర్ నెట్ చానెల్స్ ప్యాకేజీ నుంచి సాక్షి టీవీని తొలగించారుసాక్షి టీవీ ప్రసారాలు ఆపి స్వతంత్ర జర్నలిజం గొంతు నొక్కుతున్నారురాష్ట్రంలోని మేజర్ ఎంఎస్వో ఆపరేటర్స్ను అధికారులు తీవ్రంగా బెదిరించారుసాక్షి టీవీని తొలగించాలని ఆదేశాలు జారీ చేశారుతమ మాట వినని ఎంఎస్వోలకు కరెంటు కట్ చేస్తున్నారురాజకీయ ప్రయోజనాలతో సాక్షిటీవీని బ్లాక్ చేస్తున్నారని.. దీని వల్ల తమకు ఆర్థికంగా నష్టం జరుగుతోందని ఎంఎస్వోలు అంటున్నారుఈ చర్యలతో రాష్ట్ర ప్రభుత్వమే మీడియా స్వేచ్చను హరిస్తోందిరాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19(1)(ఎ) ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నారుఏపీ ఫైబర్ నెట్ నుంచి సాక్షి టీవీని తొలగించడం చట్ట విరుద్ధంఇది టెలికమ్యూనికేషన్స్ నియంత్రణ చట్టం 2017, క్లాజ్ 17కు విరుద్ధంఏదైనా చానల్ను తొలగించాలంటే 21 రోజుల ముందు నోటీసు ఇవ్వడం తప్పనిసరి, కానీ దీన్ని పాటించలేదుఇదే తరహాలో మల్టీసిస్టం ఆపరేటర్స్ (ఎంఎస్ఓ)లపై ఒత్తిడి తెచ్చి సాక్షి టీవీని తొలగించారుసాక్షి టీవీని తిరిగి ప్యాకేజీ చానల్స్లో పెట్టాలని ఢిల్లీ హైకోర్టు, టీడీ శాట్ ఇచ్చిన ఆదేశాలను ఏపీ ఫైబర్నెట్ అమలు చేయలేదుఅన్ని అంశాలను పరిశీలించి సాక్షి టీవీ ప్రసారాలను అన్ని ప్లాట్ఫాంలలో పునరుద్ధరించాలిమీడియా స్వేచ్ఛను హరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ వైఖరిని నియంత్రించాలి. -
వీధి కుక్కల తీర్పుపై సుప్రీం కోర్టు యూటర్న్?
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతం నుంచి వీధి కుక్కలన్నింటినీ తొలగించాలంటూ వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టు యూటర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. చాలామంది ఈ తీర్పును సమర్థించగా.. కొన్ని వర్గాల నుంచి మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ తరుణంలో.. ఈ అంశాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ముందు కొందరు న్యాయవాదులు లేవనెత్తారు. అయితే అభ్యంతరాల నేపథ్యంలో ఆ తీర్పును పునపరిశీలిస్తానని బుధవారం స్పష్టం చేశారు. దీంతో తీర్పు వెనక్కి తీసే అవకాశాలు ఉండొచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జంతు ప్రేమికులు.రాజధాని రీజియన్లో పసికందులు, వృద్దులుపై వీధి కుక్కల దాడుల ఘటనలపై పలు మీడియా సంస్థలు ఇచ్చాయి. అందులో ఘటనలతో పాటు రేబిస్ బారిన పడి మరణించిన దాఖలాలను ప్రస్తావించాయి. ఈ కథనాలను సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. వీధి కుక్కలను నివాస ప్రాంతాల్లో సంచరించడం ఏమాత్రం యోగ్యం కాదని, వాటిని పట్టుకుని షెల్టర్లకు తరలించాలని, ఇందుకు 8 వారాల గడువు విధిస్తూ ఢిల్లీ సర్కార్కు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం (ఆగస్టు 11వ తేదీ) ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో..ఏదైనా సంస్థలు ఈ చర్యలను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని, ఇది ప్రజల మేలు కోసం చేస్తున్నది స్పష్టం చేసింది. అయితే వీధి కుక్కల కోసం షెల్టర్లు నిర్మించడం, తరలించడం ఆచరణ సాధ్యం కాకపోవచ్చని ఢిల్లీ అధికార యంత్రాంగం అంటోంది. అదే సమయంలో రాజకీయ, సినీ, ఇతర ప్రముఖుల నుంచి సుప్రీం కోర్టు తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. -
మెడికల్ కౌన్సెలింగ్ మరింత ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జూలై చివరి నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా, పలు సాంకేతిక కారణాలు, కోర్టు కేసుల నేపథ్యంలో ఇంకా రిజిస్ట్రేషన్ల దగ్గరే ఆగిపోయింది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ఆల్ ఇండియా కోటా (ఏఐక్యూ) కౌన్సెలింగ్ షెడ్యూళ్లను పలుమార్లు మార్చడం, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ స్థానికత అంశంపై సుప్రీంకోర్టు తుది తీర్పు కోసం వేచి చూస్తుండడంతో రాష్ట్ర కోటా అడ్మిషన్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉందని వర్సిటీ అధికారులు అంచనా వేస్తున్నారు. కౌన్సెలింగ్కు సన్నద్ధం‘స్థానికత’అంశంపై రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 33పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. కాళోజీ వర్సిటీ తొలి విడత కౌన్సెలింగ్ ఈ నెల 9వ తేదీ నుంచి నిర్వహించాలని భావించినప్పటికీ.. తీర్పు రాకపోవడంతో షెడ్యూల్ను ప్రకటించలేదు. కాగా, కాళోజీ వర్సిటీ 33 జీవోకు అనుగుణంగా 9, 10వ తరగతులతోపాటు ఇంటర్మీడియెట్ తెలంగాణలో చదివిన వారిని స్థానికులుగా పరిగణిస్తూ ఒక ర్యాంకర్ల జాబితా రూపొందించాలని నిర్ణయించింది. ఇంటర్మీడియెట్ ఇతర ప్రాంతాల్లో చదివిన విద్యార్థులను కూడా కలుపుకొని మరో ర్యాంకర్ల జాబితా రూపొందించాలని భావిస్తోంది. ఎంసీసీ కౌన్సెలింగ్ సైతం ఆలస్యమే!ఎంసీసీ ఆధ్వర్యంలో జరగాల్సిన ఆల్ ఇండియా కోటా (ఏఐక్యూ) మొదటి రౌండ్ కౌన్సెలింగ్లో చాయిస్ ఫిల్లింగ్, లాకింగ్ ప్రక్రియలో సాంకేతిక లోపాలు తలెత్తాయని తెలిసింది. వెబ్సైట్ స్తంభించడం, ఆప్షన్లను సబ్మిట్ చేసే సమయంలో లోపాలు రావడంతో ఇప్పటివరకు నాలుగుసార్లు షెడ్యూల్ను పొడిగించారు. జూలై 21 నుంచి 30 వరకు తొలి విడత కౌన్సెలింగ్ జరగాల్సి ఉండగా, పలు వాయిదాల తరువాత ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించారు. కాగా, పీడబ్ల్యూడీ, ఎన్సీసీ కోటా విద్యార్థులకు బోనస్ మార్కులు కలిపే అంశంపై వర్సిటీ కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రం నుంచి 79 మంది పీడబ్ల్యూడీ కోటాలో ఉండగా, వీరికి నిమ్స్, సరోజినీ దేవి ఆస్పత్రుల్లో సోమ, మంగళవారాల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎన్సీసీ కేటగిరీలో 467 మంది ఉండగా, వీరికి సర్టిఫికేట్ల వెరిఫికేషన్, బోనస్ మార్కులు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ర్యాంకర్ల జాబితా తుది రూపు దాల్చిన తర్వాతే వెబ్ ఆప్షన్లు, సీటు కేటాయింపు షెడ్యూల్ ప్రకటించనున్నట్లు వర్సిటీ తెలిపింది. -
సీబీఐకి ‘గట్టు’ దంపతుల హత్యకేసు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచి్చంది. ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. వామనరావు తండ్రి గట్టు కిషన్రావుకు భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తన కుమారుడు, కోడలి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కిషన్రావు 2021 సెప్టెంబర్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్.కె. సింగ్లా ధర్మాసనం సీబీఐ విచారణకు ఆదేశించింది. కిషన్రావు తరఫున సీనియర్ న్యాయవాదులు మేనక గురుస్వామి, చంద్రకాంత్లు వాదనలు వినిపించారు. నడిరోడ్డుపై హత్య: పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని కల్వచర్ల వద్ద కారులో వెళ్తున్న వామనరావు, నాగమణి దంపతులను 2021 ఫిబ్రవరి 17న దుండగులు అడ్డగించి నడిరోడ్డుపైనే కత్తులతో నరికి చంపారు. మొదట ఈ కేసును స్థానిక పోలీసులు దర్యాప్తు చేశారు. దానిని సీబీఐకి అప్పగించాలని కిషన్రావు అదే ఏడాది సెపె్టంబర్లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారణలో భాగంగా హత్యకు సంబంధించిన వీడియోలు, పత్రాలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గతంలో కోర్టు ఆదేశించింది. చనిపోయే ముందు వామనరావు ఇచ్చిన మరణ వాంగ్మూలం వీడియోపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఎఫ్ఎస్ఎల్కి పంపించగా, అది అసలుదేనని ల్యాబ్ నివేదిక తేల్చింది. ఈ నివేదికతోపాటు అన్ని రికార్డులు పరిశీలించిన సుప్రీంకోర్టు.. కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది. సీబీఐ దర్యాప్తుపై ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలియచేసింది.వామన్రావు కేసులో దోషులను శిక్షించాలి: మంత్రి శ్రీధర్బాబు సాక్షి, హైదరాబాద్: గట్టు వామన్రావు దంపతుల హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి శ్రీధర్ బాబు స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పు న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరికీ నమ్మకం కలిగించిందని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో అసలు దోషులు, వారికి సహకరించిన అప్పటి ప్రభుత్వ పెద్దలకు శిక్ష పడితేనే వామన్రావు కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. -
భౌ.. భౌ..!
వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి.. పిచ్చి కుక్క కరిచి పది మందికి గాయాలు.. ఇలాంటి వార్తలు నిత్యం మనకు కనిపిస్తుంటాయి, వినిపిస్తుంటాయి. వీధి కుక్కల ముప్పు ఒక్క ప్రాంతానికో, నగరానికో పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. కుక్కకాటు సంఘటనలు మూడేళ్లలో 70 శాతం పెరిగాయంటే సమస్య తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్ సీఆర్) పరిధిలోని అన్ని కుక్కలను ఎనిమిది వారాల్లోగా షెల్టర్లకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చకు వచ్చింది. – సాక్షి, స్పెషల్ డెస్క్చాలామంది రాత్రుళ్లు వీధుల్లో నడవడానికి, బైక్మీద వెళ్లడానికి భయపడతారు. ఉదయం మార్నింగ్ చేసేటప్పుడు చాలామంది కర్రలు పట్టుకుంటారు. వీటన్నింటికీ కారణం.. గ్రామ సింహాలు. బైక్ మీద వేగంగా వెళ్తుంటే కుక్కలు వెంటపడి, కరిచి లేదా వారు కిందపడి ఎంతో మంది గాయపడిన సంఘటనలు ఉన్నాయి. మనదేశంలో కుక్కల ప్రతాపం చవిచూడని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు. సుమారు 70 శాతం పెరిగాయికుక్కకాటు సంఘటనలు 2024లో దేశంలో 37 లక్షలకుపైగా నమోదయ్యాయి. మూడేళ్లలో ఈ ఘటనలు 69.6 శాతం పెరిగాయి. ఈ ఏడాది జనవరిలోనే 4.29 లక్షల కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశవ్యాప్తంగా రేబీస్ అనుమానిత కేసులు భారీగా తగ్గుతూ వచ్చాయి. 2022తో పోలిస్తే గత ఏడాది ఈ కేసులు 78 శాతం క్షీణించాయి. కానీ మరణాలు మాత్రం ఊహించని స్థాయిలో అధికం అయ్యాయి. రెండేళ్లలో ఎనిమిది రెట్లకుపైగా పెరిగి జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. గత ఏడాది వీధి కుక్కల దాడి కారణంగా రేబీస్తో భారత్లో 180 మంది మరణించగా.. వీరిలో అత్యధికంగా మూడింట రెండొంతులు దక్షిణాది రాష్ట్రాల నుంచే ఉండడం గమనార్హం. 11 సెకన్లకు ఒకటి..భారతదేశంలో 6 కోట్లకు పైగా వీధి కుక్కలు ఉన్నాయని అంచనా. వీటిలో చాలా తక్కువ మాత్రమే సహజ మరణాలకు గురవుతాయని నిపుణులు చెబుతున్నారు. అంటే వ్యాధులతో మరణించేవే అధికం అన్నమాట. దేశంలో ప్రతి 11 సెకన్లకు ఒకరిని కుక్క కరిచిన సంఘటనలు నమోదవుతున్నాయి. దాదాపు 5,000 ఘటనలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. కుక్కల ద్వారా ప్రజలకు 60కి పైగా వ్యాధులు వ్యాపిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం కుక్కల దాడి వల్ల రేబీస్ సోకి గత ఏడాది 180 మంది ప్రాణాలను బలిగొంది. ఈ వీధి కుక్కలు భారతీయ రోడ్లు, పొలాల్లో రోజూ 15,000 టన్నులకు పైగా మలం, 8 మిలియన్ గ్యాలన్ల మూత్రం విడుదల చేస్తున్నాయి. ఇది ఒక ప్రధాన ఆరోగ్య, పర్యావరణ సమస్య అన్నది వైద్యుల మాట. ఇక, పెంపుడు కుక్కలు దేశంలో 3 కోట్లకుపైచిలుకు ఉంటాయని నివేదికలు చెబుతున్నాయి.» భారతదేశంలో 6 కోట్లకు పైగా వీధి కుక్కలు ఉన్నాయని అంచనా.» దేశంలో ప్రతి 11 సెకన్లకు ఒకరిని కుక్క కరిచిన సంఘటనలు నమోదవుతున్నాయి.» దాదాపు 5,000 ఘటనలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. » కుక్కల ద్వారా ప్రజలకు 60కి పైగా వ్యాధులు వ్యాపిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా కుక్క కాటు సంఘటనలు2022 21,89,909 2023 30,52,5212024 37,15,713 -
సీబీఐ చేతికి గట్టు వామనరావు దంపతుల కేసు
సాక్షి, న్యూఢిల్లీ: గట్టు వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మంగళవారం ఆదేశించింది. ఈ క్రమంలో.. హత్య కేసును తిరిగి విచారణ జరపాలని, పిటిషనర్కు భద్రత కల్పించాలని సీబీఐకి సూచించింది.హైకోర్టు లాయర్లైన వామనరావు, ఆయన సతీమణి నాగమణి దంపతులను పెద్దపల్లి జిల్లా మంథనిలో 2021 ఫిబ్రవరి 17వ తేదీన రోడ్డుపైనే కొందరు దారుణంగా హతమార్చారు. ఈ జంట హత్య తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేయగా.. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వామనరావు తండ్రి కిషన్ రావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎంఎం సుందరేశ్ , జస్టిస్ ఎన్ కె. సింగ్ల ధర్మాసనం పిటిషన్ను విచారించి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే హత్యకు సంబంధించిన వీడియోలు, పత్రాలు అందజేయాలని ఆదేశించింది. సీబీఐ విచారణ అవసరమా? అనే అంశంపై రికార్డులు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.ఈలోపు.. కేసును సీబీఐకి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలిపారు. దీంతో.. సీబీఐకి కేసును బదిలీ చేస్తున్నట్లు సుప్రీం కోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. -
అడ్డుకుంటే ఊరుకునేది లేదు.. జంతు ప్రేమికులకు సుప్రీం కోర్టు తీవ్ర హెచ్చరికలు
దేశంలో కుక్క కాటు ఘటనలు, రేబిస్ మరణాలు పెరిగిపోతున్న వేళ.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జనావాస ప్రాంతాల్లో వీధి కుక్కలు సంచరించడం ఎంతమాత్రం సురక్షితం కాదని అభిప్రాయపడింది. దేశ రాజధాని రీజియన్ నుంచి వీధి శునకాలను షెల్టర్లకు తరలించాలని ఆదేశిస్తూ.. ఈ క్రమంలో జంతు ప్రేమిక సంఘాలను తీవ్రంగా హెచ్చరించింది కూడా. రాజధాని రీజియన్లో పసికందులు, వృద్దులుపై వీధి కుక్కల దాడుల ఘటనలపై పలు మీడియా సంస్థలు ఇచ్చాయి. అందులో ఘటనలతో పాటు రేబిస్ బారిన పడి మరణించిన దాఖలాలను ప్రస్తావించాయి. ఈ కథనాల ఆధారంగా.. జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. వీధి కుక్కలను నివాస ప్రాంతాల్లో సంచరించడం ఏమాత్రం యోగ్యం కాదని, వాటిని పట్టుకుని షెల్టర్లకు తరలించాలని, ఇందుకు 8 వారాల గడువు విధిస్తూ అధికార యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో.. ఏదైనా సంస్థలు ఈ చర్యలను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అంతేకాదు ఈ వ్యవహారంలో కేవలం కేంద్రం తరఫున వాదనలు మాత్రమే తాము వినదల్చుకుంటున్నామని, శునక ప్రియులు.. జంతు ప్రేమిక సంఘాల నుంచి పిటిషన్లను స్వీకరించబోమని స్పష్టం చేసింది. వీధికుక్కలను వీలైనంత త్వరగా పట్టుకుని సుదూర ప్రాంతాల్లో వదిలేయండి అని ఈ కేసులో అమీకస్ క్యూరీ అయిన గౌరవ్ అగర్వాలకు కోర్టు సూచించింది. ఈ క్రమంలో చర్యలను జంతు సంఘాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.కుక్క కాటుకు గురైన వాళ్ల కోసం, రేబిస్ బారిన మరణిస్తున్నవాళ్ల కోసం ఈ జంతు సంఘాలు ఏమైనా చేస్తున్నాయా? చనిపోయిన వాళ్లను బతికించి తెస్తున్నాయా?. ఇదేం మా కోసం చేస్తున్నది కాదు. ప్రజల కోసం చేస్తున్నది. కాబట్టి ఇందులో ఎలాంటి సెంటిమెంట్కు చోటు ఉండబోదు. ఈ ఆదేశాలను ప్రతిఘటించాలని చూస్తే సత్వర చర్యలు ఉంటాయి జాగ్రత్త’’ అని జస్టిస్ పార్దీవాలా వ్యాఖ్యానించారు. అదే సమయంలో వాటిని దత్తత తీసుకునే ప్రయత్నాలను అంగీకరించబోమని తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. ఇదిలా ఉంటే.. ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లోని ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ పరిధిలోని అధికార యంత్రాగాలకు దూరంగా డాగ్ షెల్టర్లను నిర్మించాలని, వీధి కుక్కలను వెంటనే అక్కడికి తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. -
టోర్నీ నిర్వహణపై సందిగ్దం.. సమస్యను ‘సుప్రీం’ దృష్టికి తీసుకురండి!
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎస్) ఫుట్బాల్ టోర్నీ నిర్వహణపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఐఎస్ఎల్ జట్ల యాజమాన్యాల్లో కూడా ఆందోళన పెరుగుతోంది. దీని సత్వర పరిష్కారానికి తగిన చర్య తీసుకోవాలని వారు అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్)ను కోరుతున్నారు. ఈ క్రమంలో ఐఎస్ఎల్ తాజా పరిస్థితిని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేశారు.మొత్తం 13 క్లబ్లలో మోహన్బగాన్ సూపర్ జెయింట్, ఈస్ట్ బెంగాల్ మినహా మిగతా 11 క్లబ్ల ప్రతినిధులు ఏఐఎఫ్ఎఫ్కు రాసిన లేఖపై సంతకం చేశారు. ఐఎస్ఎల్ నిర్వహణ హక్కులు ఉన్న ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ (ఎఫ్ఎస్డీఎల్)కు, ఏఐఎఫ్ఎఫ్కు మధ్య 2010లో ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఏడాది డిసెంబర్లో ముగిసే ఈ ఎంఓయూను పునరుద్ధరించుకునే విషయంలో స్పష్టత రాకపోవడంతో టోర్నీని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ఎఫ్ఎస్డీఎల్ ప్రకటించింది.ఈ ఒప్పంద పునరుద్ధరణ అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉంది. తాము తుది ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి ఎంఓయూ కుదుర్చుకోరాదని సుప్రీం ఇప్పటికే ఆదేశించింది. న్యాయపరంగా ఎంఓయూలో తాము భాగం కాదు కాబట్టి నేరుగా ఈ కేసులో జోక్యం చేసుకోలేకపోతున్నామని... సుప్రీం కోర్టులో సమస్యను వివరించి ఫుట్బాల్ను కాపాడమంటూ ఐఎస్ఎల్ టీమ్లు విజ్ఞప్తి చేశాయి.‘న్యాయపరమైన చిక్కులు ఇప్పుడు భారత ఫుట్బాల్ను బాగా నష్టపరుస్తున్నాయి. ఐఎస్ఎల్ క్లబ్లలో పెట్టుబడులు, వాణిజ్యపరమైన కాంట్రాక్ట్లు గందరగోళంలో పడటంతో ఆటగాళ్లు, సిబ్బంది, ఇతర భాగస్వాముల భవిష్యత్తును ప్రమాదంలో పడేశాయి. దీని వల్ల దేశంలో ఆట ఆగిపోతుంది. కాబట్టి సుప్రీం దృష్టికి దీనిని తీసుకురండి’ అని ఐఎస్ఎల్ ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. ఐఎస్ఎల్ భవిష్యత్తుపై అనిశ్చితి కారణంగా చెన్నై, బెంగళూరు జట్ల యాజమాన్యాలు కూడా ఇప్పటికే తమ సిబ్బందికి జీతాలు ఆపేయడంతో పాటు టీమ్ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లుగా కూడా స్పష్టం చేశాయి. -
ఆయన్ని అవమానించడం మా ఉద్దేశం కాదు: సుప్రీం కోర్టు
అలహాబాద్ హైకోర్టు జడ్జిపై సుప్రీం కోర్టు విధించిన ఆంక్షలు న్యాయ వివాదానికి దారి తీశాయి. ఈ నేపథ్యంలో దేశసర్వోన్నత న్యాయస్థానం వెనక్కి తగ్గింది. సదరు జడ్జి క్రిమినల్ కేసు విచారించకుండా గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుంది.న్యూఢిల్లీ: అలహాబాద్(యూపీ) హైకోర్టు జడ్జిపై ఆంక్షల విషయంలో సుప్రీం కోర్టు వెనక్కి తగ్గింది. సదరు జడ్జి క్రిమినల్ కేసులు విచారించకుండా గతంలో ఉత్తర్వులు వెలువరించిన సుప్రీం కోర్టు.. శుక్రవారం ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. ఈ ఆంక్షలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడం, అదే సమయంలో చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ విజ్ఞప్తి మేరకు ఈ ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ పార్దీవాలా తెలిపారు. అదే సమయంలో ఈ కేసును రీలిస్టింగ్కు రిజిస్ట్రీని ఆదేశించారాయన. మేము ఆ న్యాయమూర్తిని అవమానించాలనుకోలేదు. అలాంటి ఉద్దేశాలు మాకు లేవు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తే మాస్టర్ ఆఫ్ రోస్టర్. కేసుల కేటాయింపు ఆయన అధీనంలో ఉంటుంది అని జస్టిస్ పార్దీవాలా స్పష్టం చేశారు. ‘‘న్యాయవ్యవస్థలో అంతర్భాగమైనప్పటికీ సుప్రీం కోర్టు సాధారణంగా హైకోర్టుల పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. అయితే, ఒక సందర్భం ఒక పరిమితిని దాటి.. సంస్థ గౌరవం ప్రమాదంలో పడినప్పుడు దానిని కాపాడేందుకు అవసరమైన చర్యగా ఈ కోర్టు తన రాజ్యాంగ బాధ్యతను(ఆర్టికల్ 136 ప్రకారం) నిర్వర్తించాల్సి వస్తుంది’’ అని అన్నారాయన. ఒక సివిల్ పరిష్కారానికి ఆస్కారం ఉన్న వివాదంలో క్రిమినల్ చర్యలకు అనుమతినిస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఆదేశాలు జారీ చేయడం ఈ వివాదానికి కారణమైంది. ‘‘కేవలం సివిల్ పరిష్కారం జరిగిందని చెప్పి, నేరాన్ని మాఫీ చేయడం రాజ్యాంగబద్ధంగా కాదు. న్యాయవ్యవస్థకు ఇది ప్రమాదకరం. ’’ అని వ్యాఖ్యానించారాయన. ఈ ఆదేశాలపై జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మహదేవన్లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. జస్టిస్ ప్రశాంత్ కుమార్కు రిటైరయ్యేంత వరకూ ఎలాంటి క్రిమినల్ కేసులు అప్పగించవద్దని ఈ నెల 4న ఆదేశించింది.అయితే.. ఈ వ్యవహారం న్యాయ వివాదానికి తెరతీసింది. సుప్రీంకోర్టు ఆదేశంలోని కొన్ని అంశాలు అమలు కాకుండా నిరోధించేందుకు ఫుల్ కోర్టును సమావేశపరచాలంటూ అలహాబాద్ హైకోర్టుకు చెందిన 13 మంది న్యాయమూర్తులు కోరారు. ఈ మేరకు జడ్జీలు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ కూడా రాశారు కూడా. అలహాబాద్ హైకోర్టుకు చెందిన జస్టిస్ ఆరిందం సిన్హా.. హైకోర్టు నియమానుసారం ఈ లేఖ రాయగా దానిపై మరో 12 మంది న్యాయమూర్తులు సంతకాలు చేశారు. హైకోర్టులపై పాలనాపరమైన పర్యవేక్షణ అధికారం సుప్రీంకోర్టుకు లేదని, అందుకే ఆగస్టు 4నాటి సుప్రీం ఆదేశాల్లో 24వ, 26వ పేరాల్లోని నిర్దేశాలను అమలు చేయరాదని ఫుల్కోర్టు తీర్మానించాలని జడ్జీలు కోరారు. సుప్రీం ధర్మాసనం మాటల్లోని తీవ్రతను ఫుల్ కోర్టు తీర్మానం తప్పు పట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయా పేరాల్లోని ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఇవాళ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. -
రూ.23వేల కోట్ల హవాలా సొమ్మును బాధితులకు ఈడీ అందజేసింది
న్యూఢిల్లీ: అక్రమంగా సంపాదించిన రూ.23 వేల కోట్ల డబ్బును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్వాధీనం చేసుకుని ఆయా నేరాల బాధితులకు అందజేసిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్(బీపీఎస్ఎల్) ఆస్తుల విక్రయానికి అనుమతిస్తూ మేలో జారీ చేసిన ఉత్తర్వులను సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఓ న్యాయవాది బీపీఎస్ఎల్పై ఈడీ కేసు గురించి ప్రస్తావించగా సీజేఐ గవాయ్..ఇక్కడ కూడా ఈడీ ఉందా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ..‘ఇక్కడో వాస్తవ చెప్పాలి. ఇప్పటి వరకు ఈడీ మనీలాండరింగ్ కేసుల దర్యాప్తులో భాగంగా రూ.23 వేల కోట్లను స్వాధీనం చేసుకుంది. దీని ఆర్థిక నేరాల బాధితులకు చెల్లించింది’అని అన్నారు. -
తురకా కిషోర్ అరెస్టుపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ నేత, మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ అరెస్టుపై ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తురకా కిషోర్ను వెంటనే విడుదల చేయాలని న్యాయ స్థానం ఆదేశించింది. కిషోర్ రిమాండ్ రిపోర్టును సస్పెండ్ చేసింది.తురకా సురేఖ హెబియస్ కార్పస్ పిటిషన్గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త తురకా కిషోర్ను పల్నాడు జిల్లా, రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్భంధించారని, తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తురకా సురేఖ గతవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్మోషన్ రూపంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై హైకోర్టు వరుసగా విచారణ చేపట్టింది. ఇవాళ జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు కిషోర్ అరెస్టుపై తీవ్రంగా స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా తురకా కిషోర్ను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన సమయంలో పాటించాల్సిన నిబంధనల్ని పూర్తిగా తుంగలోకి తొక్కారు. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ను కూడా పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తురకా కిషోర్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రెంటచింతల పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం తురకా కిషోర్పై నమోదు చేసిన కేసుకు సంబంధించిన రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని రెంటచింతల పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే.బెయిల్ పిటిషన్ వేయకుంటే రిమాండ్ విధించేస్తారా..? బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, తురకా కిషోర్పై నమోదు చేసిన కేసుకు సంబంధించిన రికార్డులను పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) టి.విష్ణుతేజ ధర్మాసనం ముందుంచారు. వీటిని ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించింది. అలాగే కిషోర్ను రిమాండ్కు పంపుతూ మేజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వులనూ మరోసారి పరిశీలించింది. అరెస్టయిన కిషోర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు కాబట్టి, తాను రిమాండ్ విధిస్తున్నట్లు మేజిస్ట్రేట్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారని తెలిపింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేయకుంటే, రిమాండ్ విధించేస్తారా? మిగిలిన అంశాలను పరిగణనలోకి తీసుకోరా? అంటూ మేజిస్ట్రేట్ తీరును ప్రశ్నించింది.పరస్పర విరుద్ధమైన వాదనలేంటి..? ‘రిమాండ్ రిపోర్ట్ తీసుకునేందుకు కిషోర్ తిరస్కరించారని మీరు (పోలీసులు) చెబుతున్నారు. కానీ మేజిస్ట్రేట్ తన ఉత్తర్వుల్లో దీని గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. మీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింది కోర్టులో కిషోర్ ఏ కాగితాలను తీసుకోలేదని చెబుతారు. మరోవైపు తీసుకున్నట్లు కిషోర్ సంతకం చేసినట్లు చెబుతారు. ఏంటీ పరస్పర విరుద్ధమైన వాదనలు? నేరాంగీకార వాంగ్మూలంపై కిషోర్ సంతకం చేయలేదని అంటున్నారు. మీరు చెబుతున్నట్లు అతను కరడుగట్టిన నేరస్తుడే అనుకున్నా, అన్ని నేరాలూ చేసేశానంటూ ఒప్పేసుకుని సంతకం చేస్తారా?’ అని ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.నిర్బంధం అక్రమమైనప్పుడు ఆ వ్యక్తిని ఒక్క క్షణం కూడా జైల్లో ఉంచకూడదు ఒక వ్యక్తి నిర్బంధం అక్రమమైనప్పుడు ఆ వ్యక్తి ఒక్క క్షణం కూడా జైల్లో ఉండటానికి వీల్లేదు.. అంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని, విచారణను సోమవారానికి వాయిదా వేయాలని ఎస్జీపీ విష్ణుతేజ కోరగా.. ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యానించింది. అప్పటి వరకు కిషోర్ను జైల్లోనే ఉంచమంటారా?అప్పటి వరకు కిషోర్ను జైల్లోనే ఉంచమంటారా? అంటూ ఘాటుగా ప్రశ్నించింది. పలు కేసుల్లో కిషోర్ను అరెస్ట్ చేయాల్సి ఉందని విష్ణుతేజ చెప్పగా, వాటితో తమకు సంబంధం లేదని, తమ ముందున్న కేసుతోనే తమకు సంబంధమని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఎప్పుడో ఆరేళ్ల క్రితం ఘటన జరిగితే, ఇప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా.. అంటూ ప్రశ్నించింది.అలాగే రెండు, మూడేళ్ల క్రితం ఘటనలు జరిగితే ఇప్పుడు అరెస్ట్లు చూపారంది. కిషోర్ అరెస్ట్, రిమాండ్ విషయంలో చట్ట నిబంధనలను అనుసరించలేదనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది. అందువల్ల కిషోర్ విడుదలకు ఆదేశాలిస్తామంది. విష్ణుతేజ జోక్యం చేసుకుంటూ, పిటిషనర్ రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేయలేదని తెలిపారు.అలా అయితే రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రధాన పిటిషన్లో సవరణ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డికి సూచించింది. దీంతో కిషోర్ అరెస్ట్ను, రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ తురకా సురేఖ ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అనుబంధ పిటిషన్ మధ్యాహ్నం విచారణకు రాగా, దీనిపై గురువారం విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేస్తూ ఆ మేర విచారణను వాయిదా వేసింది.జైలు నుంచి విడుదల కానున్న తురకా కిషోర్ అయితే ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు తురకా కిషోర్ అరెస్టులో పోలీసుల వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం నిబంధనల్ని సైతం తుంగలో తొక్కారని వ్యాఖ్యానిస్తూ కిషోర్ను తక్షణమే విడుదల చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక హైకోర్టు ఆదేశాలతో తురకా కిషోర్ జైలు నుంచి విడుదల కానున్నారు. -
Cash Row: జస్టిస్ యశ్వంత్ వర్మకు ఎదురుదెబ్బ
నోట్ల కట్టల వ్యవహారంతో వార్తల్లోకి ఎక్కిన జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసిన త్రిసభ్య కమిటీ నివేదికను సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్ను గురువారం సర్వోన్నత న్యాయస్థానం కొట్టిపారేసింది. నోట్ల కట్టల వ్యవహారంలో తన అభిప్రాయాన్ని విచారణ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదని, తనను తొలగించాలన్న ఆ కమిటీ నివేదిక చెల్లదని జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. జస్టిస్ యశ్వంత్ వర్మ ప్రవర్తన విశ్వాసాన్ని మార్చలేదని తెలిపిన సుప్రీం కోర్టు.. అప్పటి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా రాష్ట్రపతి, ప్రధానికి లేఖలు రాయడం రాజ్యాంగ వ్యతిరేకమేమీ కాదని వ్యాఖ్యానించింది.‘‘భారత ప్రధాన న్యాయమూర్తి, ఇన్హౌజ్ కమిటీ యధావిధిగా తమ ప్రక్రియను అనుసరించారు. అయితే ఈ కేసులో ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేయకపోవడం అవసరం లేనిదే. అయితే అప్పట్లోనే మీరు దీనిని సవాల్ చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు చేసినా దాని ప్రభావం లేకుండా పోయింది. ఇన్ హౌజ్ విచారణ అనేది రాజ్యాంగానికి విరుద్ధమైనది ఏం కాదు. ఇది న్యాయ వ్యవస్థలో నైతికతను కాపాడేందుకు రూపొందించబడింది. భారత ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఒక పోస్ట్ ఆఫీస్ కాదు.. చర్యలకు తీసుకునే బాధ్యత సీజేఐకి ఉంటుంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే.. ఈ పిటిషన్లో జస్టిస్ యశ్వంత్ వర్మ.. పిటిషన్ను అజ్ఞాత పేరుతో దాఖలు చేశారు. అలాగే దర్యాప్తు కమిటీ తనను సరిగా విచారించలేదని, తన వాదనలకు అవకాశం ఇవ్వలేదని కోర్టు ఎదుట వాదనలు వినిపించారు. ఈ విషయంలో న్యాయ ప్రక్రియ ఉల్లంఘించబడిందని, తాను మీడియా ట్రయల్కు(మీడియా కథనాలపై) లోనయ్యాను అని పిటిషన్లో తెలిపారు. జస్టిస్ వర్మ తరఫున కపిల్ సిబాల్తో పాటు ముకుల్ రోహత్గి, రాకేష్ ద్వివేది, సిద్ధార్థ్ లూథ్రాలాంటి ప్రముఖ లాయర్లు వాదనలు వినిపించడం గమనార్హం. అదే సమయంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా(మాజీ సీజేఐ) నేతృత్వంలో జరిగిన విచారణలో భాగం కావడంతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఈ పిటిషన్ విచారణ నుంచి వైదొలిగి మరో బెంచ్కు బదిలీ చేశారు.కేసు నేపథ్యం:2025 మార్చి 14: ఢిల్లీలోని జస్టిస్ వర్మ అధికారిక బంగ్లాలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పే సమయంలో నోట్ల కట్టలు కాలిన స్థితిలో ఓ రూమ్లో బయటపడ్డాయిసుప్రీం కోర్టు స్వయానా విడుదల చేసిన వీడియోలో నగదు ముద్దలు కాలిపోతున్న దృశ్యాలు కనిపించాయి.న్యాయవ్యవస్థపై అవినీతి విమర్శలు రావడంతో తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు నాటి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా.. త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయించి విచారణ జరిపించారు. ఈ కమిటీ మే 3న నివేదిక అందించగా.. మే 4న నివేదికను రాష్ట్రపతికి పంపించిన చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా.. వర్మ తొలగింపు సిఫార్సు చేశారు.అభిశంసన ఇప్పట్లో కష్టమే!అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడుతున్నాయి. ఆగష్టు 21వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ తరుణంలో విచారణ జరగడం ఆలస్యం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ సెషన్లో ఆయన్ని తొలగించడం సాధ్యం కాకపోవచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
బిహార్లో తొలగించిన ఓటర్ల వివరాలివ్వండి
న్యూఢిల్లీ: బిహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ వ్యవహారం సుప్రీంకోర్టుకెక్కింది. ఈ ప్రక్రియలో భాగంగా తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలు ఈ నెల 9వ తేదీలోగా సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. బిహార్లో ఎస్ఐఆర్ చేపట్టాలని జూన్ 24న ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ(ఏడీఆర్) అనే ఎన్జీఓ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. తొలగింపునకు గురైన 65 లక్షల ఓటర్ల వివరాలు ప్రచురించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. వారు మరణించారా? లేక వలస వెళ్లారా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది తెలియజేయాలని కోరింది. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల సమాచారం అందజేయాలని, ఒక కాపీని ఏడీఆర్కు ఇవ్వాలని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదికి సూచించింది. -
సీఎంల పేర్లు, ఫొటోలను పథకాలకు ఉపయోగించుకోవచ్చు
న్యూఢిల్లీ: తమిళనాడులో ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే రాష్ట్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం నుంచి భారీ ఊరట లభించింది. మీకు అండగా స్టాలిన్( విత్ యూ స్టాలిన్) పేరిట తమిళనాట డీఎంకే సర్కార్ అమలుచేస్తున్న సంక్షేమ పథకం పేరులో ముఖ్యమంత్రి(స్టాలిన్), ఇతర మంత్రుల పేర్లు ఉండటాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. సంక్షేమ పథకంలో స్టాలిన్ పేరు ఉండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ అన్నాడీఎంకే నేత సీవీ షణ్ముగం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేయగా ఆయనకు అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వు వచ్చింది. దీంతో మద్రాస్ హైకోర్టు తీర్పును డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్చేయగా బుధవారం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజారియాల సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్ షణ్ముగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దురుద్దేశంతో పిటిషన్ వేశారని మండిపడుతూ షణ్ముగంపై రూ.10 లక్షల జరిమానా విధించింది. ‘‘పిటిషనర్ షణ్ముగం అత్యుత్సాహాన్ని మేం ఏమాత్రం ప్రోత్సహించట్లేము. ఆయన కేవలం ఒకే ఒక్క రాజకీయ పార్టీని లక్ష్యంగా చేసుకుని పిటిషన్ వేశారు. రాజకీయ పారీ్టలు ప్రభుత్వ నిధులను నాయకుల పేర్లతో వృథాగా ఖర్చుచేస్తున్నారన్న స్పృహ ఆయనకు నిజంగా ఉంటే ఆయన దేశంలో ఇలాంటి అన్ని రాజకీయ పారీ్టలు అమలు చేస్తున్న అన్నీ పథకాలను ఆయన సవాల్చేయాలి. వాస్తవానికి దేశవ్యాప్తంగా ఇలా ముఖ్యమంత్రుల పేర్లను ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఉపయోగిస్తున్నారు. రాజకీయ నాయకుల పేర్లతో పథకాలు ఉండొద్దనే న్యాయబద్ధమైన నిషేధాజ్ఞలు లేవు’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ రాజకీయ యుద్ధాలను ఎన్నికల్లో తేల్చుకోవాలి. రాజకీయ యుద్ధాల కోసం కోర్టులను ఉపయోగించుకోవద్దు’’ అని ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది. ‘‘షణ్ముగం వేసిన పిటిషన్ న్యాయబద్ధంగా లేదు. చట్టప్రకారం లేదు. అందుకే ఆయనకు అనుకూలంగా గతంలో వచి్చన తీర్పును పక్కనబెడుతున్నాం. ఈమేరకు హైకోర్టు తీర్పును పక్కనబెట్టేందుకు ఉద్దేశించిన స్పెషల్ లీవ్ పిటిషన్ను అనుమతిస్తున్నాం’’ అని కోర్టు తెలిపింది. -
వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తి
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తోందా.. రాష్ట్ర ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై సీబీఐ అభిప్రాయమేంటి.. కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏక కాలంలో కొనసాగించే అవకాశం ఉందా..’అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం మరోసారి జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వివేకా హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తయిందని సుప్రీం కోర్టుకు సీబీఐ వివరించింది. పిటిషనర్ తరఫున వాదనలేంటని ధర్మాసనం ప్రశ్నించగా.. సునీతారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది మరో కోర్టులో ఉన్నారని, వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నందున పాస్ ఓవర్ ఇవ్వాలని మరో న్యాయవాది ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం తర్వాత బెంచ్ కూర్చోవడం లేదు కాబట్టి మరో రోజు వాదనలు వింటామని స్పష్టం చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది. -
రెండేళ్లు బయట చదివితే స్థానికులు కాదా?
సాక్షి, న్యూఢిల్లీ: విద్యార్థి కేవలం రెండేళ్లు వేరే రాష్ట్రంలో చదువుకోవడానికి వెళితే తప్పు ఏంటని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉన్నత చదువుల కోసమో.. తల్లిదండ్రుల బదిలీ కారణంగానో రెండేళ్లపాటు రాష్ట్రం బయట చదివితే వారిని స్థానికత కోటా నుంచి తప్పించడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. వచ్చే శుక్రవారంలోపు స్థానికత అంశంపై లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. మెడికల్ సీట్ల భర్తీలో స్థానికత అంశంపై రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 11న దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం వాదనలు ముగించి, తీర్పును రిజర్వ్ చేసింది. 2028లో ఎందుకు అమలు చేయకూడదు?తెలంగాణ విద్యార్థుల ప్రయోజనం కోసమే రాష్ట్ర ప్రభుత్వం జీఓ 33ను తీసుకొచ్చిందని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ తెలిపారు. ప్రస్తుత విధానం రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డి) ప్రకారం ఉందని చెప్పారు. ఏపీ విభజన చట్టంలో ఏపీ విద్యార్థులకు కల్పించిన గడువు ముగిసిపోవటంతో ఈ జీఓ తెచ్చినట్లు వివరించారు. దీని ప్రకారం సివిల్ సర్వీసెస్ (ఐఏఎస్, ఐపీఎస్), ఇతర ఉద్యోగాల్లో తల్లిదండ్రులు డిప్యుటేషన్పై వెళితే, ఇతర రాష్ట్రాల్లో చదువుకొన్న వారి పిల్లలకు మినహాయింపు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశాన్ని కొన్ని ప్రత్యేక కేసులతో ముడి పెట్డకుండా లక్షలాది మంది తెలంగాణ స్థానిక విద్యార్థుల దృష్టితో ఆలోచించాలని కోరారు. ఈ సమయంలో కలగజేసుకున్న సీజేఐ జస్టిస్ గవాయ్.. పదేళ్లు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, 2028లో జీఓ 33ను ఎందుకు అమలు చేయకూడదు అని ప్రశ్నించారు. పదేళ్ల గడువు ముగిసినంత మాత్రాన అందరికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డీ)లోని అంశాలు తెలియవని అభిప్రాయపడ్డారు. 2028లో కొత్త నిబంధనలు తీసుకువస్తే వచ్చే నాలుగేళ్లలో స్థానికంగా చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. కాళోజీ వర్సిటీ తరపు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ వాదనలు వినిపిస్తూ ఆంధ్రప్రదేశ్తోపాటు మహారాష్ట్ర, తమిళనాడులోనూ ఇలాంటి స్థానికత అమలులో ఉందని గుర్తుచేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఉన్న పదేళ్ల గడువు ముగిసినందున తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు రూపొందించిందని తెలిపారు. దీంతో జస్టిస్ చంద్రన్ స్పందిస్తూ.. ‘తెలంగాణలో వరుసగా నాలుగేళ్లు విద్యనభ్యసించి ఉండాలని రూల్ తెస్తున్న విషయం స్థానిక ప్రజలందరికీ తెలుసు అని భావించడం సరికాదు’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రతి విద్యార్థి ఆర్టికల్ 371 (డి) గురించి తెలుసుకోవాలని అన్నట్లుగా మీ వాదన ఉంది. 8వ తరగతిలోనే రాజ్యాంగాన్ని చదువుకోవాలన్నట్లు మాట్లడటం సరికాదు. చదువురాని తల్లిదండ్రులు కూడా ఉంటారు కదా’ అని ప్రశ్నించారు.పదేళ్లు చదివినానాన్ లోకల్ అవుతున్నాంప్రభుత్వం తరఫున సుదీర్ఘ వాదనల అనంతరం విద్యార్థుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. తెలంగాణలో పుట్టి 10వ తరగతి వరకు రాష్ట్రంలోనే చదివినా జీఓ 33 కారణంగా స్థానిక కోటా దక్కడం లేదని తెలిపారు. 11, 12వ తరగతులు చదవని కారణంగా నీట్లో స్థానిక కోటా దక్కక నష్టపోతున్నట్లు నివేదించారు. దాదాపు 2 గంటలపాటు సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం ఇంక ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలని సూచిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది. -
అందుకు శ్రీకృష్ణ భగవానుడే తొలి మధ్యవర్తి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: 150 ఏళ్లకు పైగా చరిత్ర కల్గిన పురాతన బాంకే బిహారీ ఆలయానికి సంబంధించి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం-ఆలయ ట్రస్టుల మధ్య నెలకొన్న వివాదాన్ని ఉన్నత స్థాయి కమిటి మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. బృందావన్లో ఉన్న బాంకే బిహారీ కృష్ణ దేవాలయం అంశానికి సంబంధించి ఈరోజు(సోమవారం, ఆగస్టు 4వ తేదీ) జస్టిస్ సూర్యకాంత్, జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రధానంగా రూ. 500 కోట్లను ఆలయ నిధులతో దేవాలయ అభివృద్ధి పనులను చేపట్టడానికి యూపీ ప్రభుత్వం సిద్ధం కాగా, ఆలయ ట్రస్టు అభ్యంతరం వ్యక్తం చేయడంపై ఇది సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఆలయ నిధులను అభివృద్ధికి వాడటానికి మే 15వ తేదీన సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వగా, తాజా తీర్పులో ఆ వివాదాన్ని ఓ కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా సెటిల్ చేసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. అదే సమయంలో గత తీర్పును ఉపసంహరించుకోవాలని ధర్మాసనం మౌఖికంగా ప్రతిపాదించింది ప్రస్తుత ధర్మాసనం.తొలి మధ్యవర్తి శ్రీకృష్ణ భగవానుడే..బాంకే బిహారీ ఆలయం-యూపీ ప్రభుత్వం వివాదంపై జస్టిస్ సూర్యకాంత్, జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన సుప్రీంకోర్టు ఇలా వ్యాఖ్యానించింది. ‘ బృందావన్లోని బాంకే బిహారీ టెంపుల్కు తొలి మధ్యవర్తి శ్రీకృష్ణ భగవానుడే. ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా సెటిల్ చేసుకోండి. సమస్య పరిష్కారం కోసం ఓ కమిటీని ప్రతిపాదిస్తున్నాం. ఆ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆలయ ట్రస్టు బోర్డుకు మధ్యవర్తిత్వం వహిస్తుంది. గత సుప్రీంకోర్టు తీర్పులో కొంత భాగాన్ని నిలుపుదల చేద్దాం. హైకోర్టు మాజీ న్యాయమూర్తి లేక సీనియర్ రిటైర్డ్ జిల్లా జడ్జి ఇరు పక్షాలకు ధర్మకర్తగా ఉంటారు’ అని స్పష్టం చేసింది. ఇదీ ఆలయ చరిత్ర..1862లో నిర్మించబడిన ఈ ఆలయం రాజస్తానీ శైలిలో నిర్మించబడిందిఉత్తరప్రదేశ్లోని బాంకే బిహారీ ఆలయం బృందావన్లో ఉన్న శ్రీకృష్ణ భక్తులకు అత్యంత పవిత్రమైన స్థలాలలో ఒకటి.ఆధ్యాత్మికతతో నిండిన ప్రదేశం.ఇక్కడ శ్రీ బాంకే బిహారీగా పూజించబడే కృష్ణుడు, బాలరూపంలో దర్శనమిస్తాడు.ప్రత్యేకత: ఈ ఆలయంలో గంటలు మోగించరు, హారతులు ఇవ్వరుఇది భక్తి శ్రద్ధలకు అడ్డురాకుండా ఉండేందుకు అనాదిగా వస్తున్న ఆచారం.ఏడాదిలో ఒక్కసారి మాత్రమే, అక్షయ తృతీయ రోజున మాత్రమే భక్తులు దేవుని పాదాలను దర్శించగలుగుతారు.వివాదం ఇలా.. ఆలయ అభివృద్ధికి సంబంధించి యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం ఆలయ ట్రస్ట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై గత మే నెలలో సుప్రీంకోర్టు తీర్పును వెలువరిస్తూ.. రూ. 500 కోట్లను కారిడార్ ప్రాజెక్ట్ కింద ఆలయ అభివృద్ధి కోసం వాడుకోవచ్చని స్పష్టం చేసింది. యూపీ ప్రభుత్వంతో బాంకే బిహారీ టెంపుల్ ట్రస్టు మధ్య వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదానికి కారణం రూ. 500 కోట్ల కారిడార్ ప్రాజెక్ట్. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ ప్రణాళికను తీసుకురాగా, ఆలయ ట్రస్ట్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. గత తీర్పును మౌఖికంగా నిలుపుదల చేస్తూ దీనిపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదించింది. దీన్ని హైకోర్టు లేదా, జిల్లా కోర్టు మాజీ జడ్జిల ద్వారా ఓ కమిటీ ఏర్పాటు చేసి మధ్యవర్తిత్వంతో వివాదాన్ని పరిష్కరించడమే సరైన మార్గంగా పేర్కొంది. ఆలయ వారసత్వం దెబ్బతింటుందనే..యూపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆలయ అభివృద్ధి-నిధులు ఆర్డినెన్స్పై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఒకవైపు ఆలయ ట్రస్ట్ అభ్యంతరంతో పాటు స్థానిక ప్రజలు కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధి పేరుతో మరమ్మత్తులు చేపడితే ఆలయ వారసత్వం, వాస్తవికత దెబ్బతింటుందని అభిప్రాయం వ్యక్తమైంది. ఇది సున్నితమైన అంశం కావడంతో పాటు ఆధ్యాత్మిక వైభవం, సంప్రదాయాల సమతుల్యతలపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. -
చిన్నారితోపాటు దేశం విడిచి వెళ్లిన రష్యా మహిళ..
న్యూఢిల్లీ: భర్త నుంచి విడిపోయిన రష్యా మహిళ, చిన్నారితోపాటు దేశం విడిచి వెళ్లిపోవడంపై సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులకు తలంటింది. పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని మండిపడింది. మైనర్ను రష్యా నుంచి తిరిగి తీసుకువచ్చేందుకు అక్కడి భారత ఎంబసీతో సంప్రదింపులు జరపాలని ఆదేశించింది. చిన్నారి కస్టడీ విషయంలో రష్యా మహిళ కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగి్చల ధర్మాసనం మే 22వ తేదీన ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. అయినప్పటికీ, ఆమె దేశం విడిచి నేపాల్ మీదుగా రష్యా వెళ్లిపోయినట్లుగా తెలవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ పోలీసుల పూర్తి నిర్లక్ష్యం, వైఫల్యమని పేర్కొంది. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులతోపాటు విదేశాంగ శాఖ కూడా దీన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారని వ్యాఖ్యానించింది. కానీ, చిన్న వివాదం ఏమాత్రం కాదని పేర్కొంది. ‘ఆ బిడ్డను ఈ కోర్టు కస్టడీ నుంచి తల్లి తీసుకుంది. ఇది పిల్లలు తల్లిదండ్రుల మధ్య కస్టోడియల్ వివాదం కేసు కాదు. ఆ బాలుడి సంరక్షణ బాధ్యతను తండ్రికి, తల్లికీ కూడా అప్పగించలేదు. దేశం తరఫున అతడి సంరక్షకుడిగా ఉంటూ సమస్యను పరిష్కరించేందుకు ప్రయతి్నస్తున్నాం. ఆ పిల్లవాడు ప్రస్తుతం కోర్టు కస్టడీలో ఉన్నాడు’అని ధర్మాసనం వెల్లడించింది. ఈ పరిణామానికి కారణమైన స్థానిక స్టేషన్ హౌస్ అధికారి(ఎస్హెచ్వో), డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ)లనే కాదు, అవసరమైతే పోలీస్ కమిషనర్కు సైతం సమన్లు జారీ చేస్తామని తీవ్ర స్వరంతో హెచ్చరించింది. ‘తల్లి కదలికలపై కన్నేసి ఉంచేందుకు మహిళా పోలీసు అధికారులను నియమించాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే, స్థానికుల సాయంతో, పారదర్శకతతో వ్యవహరిస్తూ ఆ మహిళ ఇంట్లోకి ప్రవేశించడానికి సైతం అనుమతిచ్చాం. అయినప్పటికీ ఆమె బిడ్డతోపాటు ఇంటిని ఎలా వదిలి వెళ్లగలిగింది?’అని ఢిల్లీ పోలీసుల తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని ధర్మాసనం ప్రశ్నించింది. నేపాల్, యూఏఈ, రష్యా వైమానిక సంస్థలను సంప్రదించగా వారు వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశమంటూ ఎలాంటి సమాచారమూ తమకు ఇవ్వలేదని ఐశ్వర్య భాటి తెలిపారు. ‘నేర పూరిత చర్యలకు వ్యక్తిగత గోప్యతనేది వర్తించదు. ఢిల్లీ నుంచి బిహార్ ద్వారా అతి కష్టమైన రోడ్డు మార్గం ద్వారా నేపాల్కు చేరుకుంది. అక్కడ నాలుగు రోజు లు మకాం వేసింది. అయినా ఢిల్లీ పోలీసులు పట్టించుకోలేదు. కోర్టు వద్ద అసలైన పత్రాలుండటంతో ఆమె ఫోర్జరీ పత్రాలతో నేపాల్ వెళ్లినా ఢిల్లీ పోలీసులు అడ్డుకోలేదు’అంటూ ధర్మాసనం మండిపడింది. ఈ విషయంలో ఇంటర్పోల్ సాయం తీసుకోవాలని, అవస రమైన ఆదేశాలను తాము జారీ చేస్తామని ఐశ్వర్య భాటికి తెలిపింది. చిన్నారిని వెనక్కి తీసుకువచ్చే విషయంలో తీసుకున్న చర్యల పురోగతిపై పది రోజుల్లో నివేదికను అందించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. రష్యా మహిళ చిన్నారి సహా దేశం విడిచి నేపాల్, షార్జాల మీదుగా వెళ్లిపోయి ఉంటుందని జూ లై 21న జరిగిన విచారణ సందర్భంగా కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. నేపథ్యమిదీ..భారత్కు చెందిన వ్యక్తి రష్యా మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆమె 2019 నుంచి ఎక్స్–1 వీసాపై ఢిల్లీలోనే ఉంటోంది. కుమారుడు పుట్టాక వారి మధ్య విభేదాలొచ్చాయి. కోర్టు సూచన మేరకు బాలుడి సంరక్షణ బాధ్యతను వారంలో చెరి సగం పంచుకున్నారు. కొన్నాళ్లు సరిగానే ఈ వ్యవహారం నడిచినా అకస్మాత్తు గా ఆ మహిళ, చిన్నారి సహా కనిపించకుండా పోవడంతో ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది తుహిన్ కుమార్ గేదెల నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి పోస్టుకు తుహిన్ కుమార్ పేరును సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం గత నెల 2న తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ సిఫారసుకు రాష్ట్రపతి తాజాగా ఆమోదముద్ర వేశారు. తుహిన్ కుమార్ నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ వచ్చే వారం ప్రమాణం చేసే అవకాశం ఉంది.ఇదీ తుహిన్ నేపథ్యం..తుహిన్ కుమార్ది పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కత్తులకవిటి గ్రామం. తల్లిదండ్రులు.. సరోజిని నాయుడు, కృష్ణమూర్తి నాయుడు. ఆయన పాఠశాల విద్యాభ్యాసం విశాఖపట్నంలో జరిగింది. కృష్ణా కాలేజీలో ఇంటర్, విశాఖ ఎన్బీఎం న్యాయ కళాశాల నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1994లో హైకోర్టు న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2000–2004 మధ్య ఆయన హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏజీపీ)గా పనిచేశారు. 2010–14 మధ్య కాలంలో గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ తరఫున హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్గా వ్యవహరించారు. 2016–17లో హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. -
ఫిరాయింపుల జాడ్యం ఆగేనా?!
చట్టాలు కాగితాలకూ... ఆదర్శాలు ఉపన్యాసాలకూ పరిమితమవుతూ రాజ్యాంగ విలువలకు గ్రహణం పడుతున్న వేళ సర్వోన్నత న్యాయస్థానం ఒక విలువైన తీర్పునిచ్చింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ తెలంగాణ శాసనసభ స్పీకర్ను ఆదేశించింది. అదే సమయంలో అటువంటి ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్కే ఉంటుందని తెలియజేసింది. పదో షెడ్యూల్ 6(1) పేరా చెప్తున్నదాని ప్రకారం ఇలాంటి అంశాలపై నిర్ణయం తీసుకునేటప్పుడు స్పీకర్ ఒక ట్రిబ్యునల్గా వ్యవహరిస్తున్నట్టేనని, అందువల్ల రాజ్యాంగ అధికరణలు 226, 227 ప్రకారం హైకోర్టులూ, 136 అధికరణ ప్రకారం సుప్రీంకోర్టూ స్పీకర్ చర్యల్ని సమీక్షించవచ్చని ధర్మాసనం చెప్పటం విశేషం. ఈ విషయంలో 122, 212 అధికరణల కింద స్పీకర్లకు రాజ్యాంగపరమైన రక్షణ ఉండబోదని కూడా తేల్చింది. అసెంబ్లీలు మొదలుకొని పార్లమెంటు వరకూ ఫిరాయింపుల జాడ్యం ఇటీవలి కాలంలో బాగా ముదిరింది. కమ్యూనిస్టులు, వైఎస్సార్ కాంగ్రెస్ వంటి ఒకటి రెండు పక్షాలూ తప్ప ఈ జాడ్యానికి దూరంగా ఉన్న పార్టీలు అతి స్వల్పం. స్వల్ప మెజారిటీతో గద్దెకెక్కినా, సంఖ్యాబలానికి అంతో ఇంతో తక్కువున్నా ఫిరాయింపుల్ని ప్రోత్సహించటం అలవాటైపోయింది. రాజీవ్ గాంధీ ప్రధానిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో ఫిరాయింపుల నిరోధక చట్టం అమల్లోకొచ్చింది. అయితే ఆచరణలో అది ప్రభావవంతంగా లేదని గ్రహించి 2003లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉండగా 91వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని పటిష్ఠపరిచారు. చిత్రమేమంటే దేశంలో మూడొంతుల ముప్పాతిక ఫిరాయింపులకు ఈ రెండు పార్టీలే కారణం. అందుకు మణిపుర్ మొదలుకొని కర్ణాటక, మహారాష్ట్రల వరకూ ఎన్నయినా ఉదాహరణలు చూపించొచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కేసు తెలంగాణలో బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యే లకు సంబంధించింది. ఆ ఫిరాయింపుల్ని సవాలు చేసిన బీఆర్ఎస్, అధికారంలో ఉండగా తానూ అదే పని చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ దిగజారుడు తనాన్ని ప్రోత్సహించటంలో ఆరితేరినవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక తెలంగాణలో తన పార్టీ తరఫున నెగ్గినవారిని పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులిచ్చా రని ఆవేశంతో రెచ్చిపోయి మాట్లాడిన బాబు... ఒకటి రెండు నెలలయ్యేసరికి ఏపీలో తానూ అదే పని నిస్సిగ్గుగా చేశారు. అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున నెగ్గిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఈమధ్య వైఎస్సార్ కాంగ్రె స్కు చెందిన రాజ్యసభ, శాసనమండలి సభ్యులు కొందరిని లోబర్చుకుని పార్టీకీ, చట్ట సభల సభ్యత్వానికీ రాజీనామా చేయించారు. విలువల గురించి అతిగా మాట్లాడే అలవాటున్న బీజేపీ ఇందుకు తోడ్పడటమేకాక... తానూ లాభపడింది. ఏపీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ సంస్థల్లో ప్రజాస్వామ్యం ఎలా ఖూనీ అవుతున్నదో అందరూ గమనిస్తూనే ఉన్నారు. చట్టసభలను కేవలం శాసనాలు చేసే వేదికలుగా మాత్రమే పరిగణించటం సరికాదు. అయి దేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు, వారి ఆకాంక్షలు ఆ చట్టసభల పనితీరులో ప్రతిఫలించాలి. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శప్రాయులుగా ఉండాలి. అధికారం వచ్చింది మొదలు ప్రతిపక్షాన్ని బలహీనపరచటం ఎలా, కక్ష తీర్చుకోవటం ఎలా అనే అంశాలే నిత్యకృత్యమైతే అందువల్ల అంతిమంగా ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడుతుంది. ఈ విషయంలో సభాధ్య క్షుల పాత్ర ఎంతో కీలకమైనది. వారు తటస్థంగా, సమర్థంగా వ్యవహరిస్తే చాలావరకూ ఈ జాడ్యం పోతుంది. చట్టసభల ఔన్నత్యం పెరుగుతుంది. చాలా సందర్భాల్లో వారు పాలకపక్షాలకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. పార్లమెంటు మొదలుకొని అసెంబ్లీల వరకూ సమా వేశాల ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులో కొచ్చాయి గనుక ఇప్పుడేదీ రహస్యం కాదు. అధ్యక్ష స్థానంలో ఉన్నవారి వ్యవహార శైలి ఎలా ఉంటున్నదో అందరూ ఆ క్షణంలోనే పసిగడుతున్నారు. సభాధ్యక్షులు తలుచుకుంటే ఫిరాయింపుల సమస్య పరిష్కారం పెద్ద కష్టం కాదు. కానీ అది సజావుగా సాగటం లేదు. 2014లో తమ పార్టీ నుంచి ఫిరాయించినవారిపై అటు లోక్సభ లోనూ, ఇటు అసెంబ్లీలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తే రెండు చోట్లా స్పందన ఒకేలా ఉంది. ఆ చట్టసభల గడువు ముగిసే సమయానికి కూడా స్పీకర్లు నిర్ణయం ప్రకటించలేక పోయారు. ఇలాంటి పరిస్థితులున్నప్పుడు రాజ్యాంగ న్యాయస్థానాలు కళ్లు మూసుకుని ఉండ గలవా? ఫిరాయింపుదార్లపై చర్య తీసుకునే విషయంలో స్పీకర్లకున్న నిర్ణయాధికారాన్ని పార్లమెంటు సమీక్షిస్తే మంచిదని ధర్మాసనం అభిప్రాయపడింది. కానీ ఆ చట్టంలోని లొసుగులతో అందరూ లాభపడుతున్నప్పుడు దీన్ని ఆశించటం అత్యాశేనేమో! -
సభాపతులకు 'సుప్రీమ్' పాఠం
పార్టీ మార్పిళ్ల నిరోధక చట్టానికి సుప్రీం కోర్టు తాజా తీర్పు పదును తెచ్చింది. తెలంగాణలో పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల అనర్హతపై పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను, ఎట్టి పరిస్థితుల్లో మూడు నెలలు దాటకుండా పరిష్కరించాలని స్పీకర్కు గడువు నిర్దేశిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. చాలా కాలంగా ఏర్పడిన ఒక రాజ్యాంగ ప్రతిష్టంభన దీంతో తొలగిపోయినట్టయింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్పీకర్లు,మండలి చైర్మన్ల నిర్ణయ జాప్యం, తాత్సారం వల్ల చట్టం స్ఫూర్తికి ఇన్నాళ్లూ తూట్లు పడుతూ వచ్చింది. తాజా తీర్పుతో పార్టీ మార్పిళ్ల నిరోధక చట్టానికి జవం, జీవం వచ్చినట్టయింది. ఇప్పుడిక, తెలంగాణలో పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదా? అదే జరిగితే బీఆర్ఎస్ ఆశిస్తున్నట్టు ఉప ఎన్నికలు తప్పవా? ఆ ఉప ఎన్నికలను తమ ఏడాదిన్నర పాలనకు రెఫరెండమ్గా స్వీకరించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందా?ఇదివరకటి రాజ్యాంగ ధర్మాసనాలు ఇదే అంశంపై వెల్లడించిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, భారత అత్యున్నత న్యాయస్థానం వెల్లడించిన తాజా తీర్పు పార్టీ మారిన పదిమంది తెలంగాణ శాసన సభ్యులను కలతకు గురిచేసేదే! శాసన వ్యవస్థ గొడుగు కింద రాజ్యాంగం తమకు కల్పించిన విశేష రక్షణ (ఇమ్యూనిటీ) ఈ విషయంలో వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన అన్వయం స్పీకర్లకు పాఠమే! ‘అనర్హత పిటిషన్ల విషయంలో ఎప్పటిలోగా నిర్ణయం ప్రకటించాలో న్యాయస్థానాలు తమకు గడువు విధించజాలవు’ అన్న స్పీకర్ల వాదన ఇక నిలువదు. ఎన్నికలు ముగిసిన స్వల్ప కాలంలోనే బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), దానం నాగేందర్ (ఖైరతాబాద్) లను పార్టీ మార్పిళ్ల నిరోధక చట్టం (1985) కింద అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి (హుజూరా బాద్), కె.పి.వివేకానంద (కుత్బుల్లాపూర్) స్పీకర్కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ స్పందించక పోవడంతో వారు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఒక పార్టీ నుంచి గెలిచి, కనీసం ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీ తరఫున దానం నాగేందర్ సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి పోటీ చేయడాన్ని తప్పుపడుతూ బీజేపీ శాసన సభాపక్ష నేత అయిన మహేశ్వరరెడ్డి విడిగా న్యాయ స్థానంలో మరో పిటిషన్ వేశారు. అదే క్రమంలో మరో ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి (బాన్సువాడ), ఎం. సంజయ్ కుమార్ (జగిత్యాల), కాలె యాదయ్య (చేవెళ్ల), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్చెరు), టి.ప్రకాశ్ గౌడ్ (రాజేంద్ర నగర్), ఆరెకపూడి గాంధీ (శేరిలింగం పల్లి) కూడా విపక్ష బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ శిబిరం చేరారు. చట్టంలోని ఒక నిబంధన ప్రకారం ఒక రాజకీయ పార్టీలోని ప్రజాప్రతినిధుల్లో మూడింట రెండొంతుల మంది వేరొక పార్టీలో చేరితో దాన్ని ‘విలీనం’ కింద ప్రకటించుకోవచ్చు. అప్పుడు వారికి అనర్హత వర్తించదు. అంటే, 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (ఎన్ని కైన 39లో మూడోవంతు) కాంగ్రెస్లోకి మారితే అది ‘విలీనం’ అవుతుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్లో తగ్గిన సంఖ్య తర్వాత అది 25కి తగ్గుతుందన్నా మరో 15 మంది (ఇప్పటికే పార్టీ మారిన పదిమందికి తోడు) మారాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అయ్యే పని కాదు. పార్టీ మారిన పదిమందిని అనర్హులుగా ప్రకటించకుండా స్పీకర్ ముందు మరే ప్రత్యామ్నాయమైనా ఉందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్ను తిరస్కరించవచ్చు. ఆ నిర్ణయం ఆధారంగా వారు మళ్లీ న్యాయస్థానాన్ని సంప్రదిస్తారు. అప్పుడది కోర్టుల న్యాయ సమీక్షకు నిలబడాలి. ఒక్క నాగేందర్ తప్ప మిగతా సభ్యులు, తాము పార్టీ మారనే లేదు, ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామని, స్పీకర్ తమను వ్యక్తి గతంగా సంప్రదించినపుడు చెప్పొచ్చు. తనపై లేనిపోని దుష్ప్రచా రాలు చేస్తున్నారు తప్ప, తాను పార్టీయే మారలేదని కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల) ఇదివరకు ఇలా ప్రకటించారు.ఎవరి ఎత్తుగడ ఏముంటుందో?ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక తెచ్చి తీరాలని విపక్ష నేత కె. చంద్రశేఖర రావు పట్టుదలగా ఉన్నారు. పదిమంది పార్టీ మారి కాంగ్రెస్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు, తమ పార్టీ విప్ను ధిక్క రించినట్టు నిరూపించే ఆధారాలను స్పీకర్కు సమర్పించవచ్చు. పార్టీ మార్పిళ్ల నిరోధక చట్టంలో గతంలో మూడింట ఒక వంతు సభ్యులు బయటకు వచ్చి ఇతర పార్టీలో చేరినా వారిని ‘చీలిక’ వర్గంగా గుర్తించే వెసులుబాటుండేది. కానీ 2003లో జరిగిన ఒక రాజ్యాంగ సవరణ ద్వారా ఆ నిబంధనను తొలగిస్తూ, చట్ట సవరణ చేశారు. దాంతో ‘చీలిక’ను గుర్తించే వీలు లేదు. పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల అనర్హత కోరిన పిటీషన్లను స్పీకర్ తిరస్కరించే సాహసా నికి పార్టీ నాయకత్వం ఒడిగడుతుందా? అన్నది అనుమానమే! సుప్రీం కోర్టు తాజా తీర్పు, సమయ, నిర్బంధం దృష్ట్యా దేశ వ్యాప్తంగా అందరి దృష్టీ తెలంగాణ స్పీకర్ నిర్ణయంపైనే ఉంటుంది.ప్రజా న్యాయస్థానాల్లో పార్టీ ఫిరాయింపుదారులకు ఎప్పుడూ చుక్కెదురే! 2014, 2018 ఎన్నికల్లో ఇతర పార్టీలో గెలిచి, తన పార్టీ లోకి వచ్చిన ఎందరో ఎమ్మెల్యేలకు కేసీఆర్ తర్వాత ఎన్నికల్లో టిక్కె ట్లిచ్చినా, వారిని ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఏపీలో ప్రత్యర్థి వైఎస్సార్సీపీలో గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్ని చంద్రబాబు నాయుడు తన పార్టీలోకి తీసుకొని తర్వాత ఎన్నికల్లో టిక్కెట్లిచ్చినా, వారికీ ప్రజాకోర్టుల్లో ఘోరంగా చుక్కెదురైంది. స్పీకర్లు ఇంకా రోగుల్ని చంపలేరేమో?‘వీలయినంత త్వరగా మూడు నెలలు మించకుండా పిటిషన్లను పరిష్కరించాల్సిందే’ అని తీర్పిస్తూ సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ పరిస్థితుల్లో మేం ఏ నిర్దేశం ఇవ్వకుంటే రాజ్యాంగంలో పదో షెడ్యూల్ పొందుపరిచిన లక్ష్యమే చిన్నబోతుంది’’ అని వ్యాఖ్యానించింది. ‘‘తాము ఏ నిర్దేశమూ ఇవ్వకుంటే, ‘చికిత్స విజ యవంతమైంది, కానీ, రోగి చచ్చాడు’ అన్న పంథాలో స్పీకర్లు/ చైర్మన్లు సాగించే ప్రక్రియను మేం అనుమతించినట్టవుతుంది’’ అని కూడా అన్నది. తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు సముచితంగా ఉండిందని, హైకోర్టు ధర్మాసనమే సదరు తీర్పులో కల్పించు కోవాల్సిన అవసరమే లేకుండిందని పేర్కొంది. చట్ట సభాపతుల నిర్ణయాలకు కాలపరిమితి విధించవచ్చో? లేదో అన్న ఇన్నినాళ్ల సందేహాలను పటాపంచలు చేస్తూ ఒక అంశం వెల్లడించింది. అన ర్హత పిటిషన్లను పరిష్కరించే క్రమంలో స్పీకర్/చైర్మన్లు న్యాయా ధికారులుగా, రాజ్యాంగ పదో షెడ్యూల్, పేరా 6(1) ప్రకారం, ట్రిబ్యునల్ హోదాతో, అధికరణం 226, 227 కింద, హైకోర్టు పరిధి లోకి, అధికరణం 136 కింద సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తారని స్పష్టం చేసింది. ‘రాజేంద్రసింగ్ రాణా’ కేసుతో సహా పలు కేసుల్లో రాజ్యాంగ ధర్మాసనాలు వెల్లడించిన అభిప్రాయాల ప్రకారం న్యాయా ధికారులుగా వ్యవహరించేటప్పుడు స్పీకర్లు/చైర్మన్లకు రాజ్యాంగంలోని అధికరణాలు 122, 212 కింద రక్షణ లభించదనీ స్పష్టం చేసింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అనుచిత జాప్యాలకు కారణ మవుతున్న సభాపతులకు సుప్రీం తాజా తీర్పు గట్టి పాఠమే!దిలీప్ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రిసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
3 నెలల్లో తేల్చండి
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుకు సంబంధించి స్పీకర్కు ఆదేశాలు జారీచేయడం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ లక్ష్యాన్ని నీరుగార్చుతుంది. అలాగని మేం ఇప్పుడు ఏ ఆదేశాలూ జారీ చేయకపోతే.. ‘ఆపరేషన్ సక్సెస్–పేషెంట్ డెడ్’ అన్నట్లుగా ఉంటుంది. స్పీకర్ తన ప్రస్తు త వైఖరిని పునరావృతం చేయడానికి దోహదపడినట్లు అవుతుంది.. – సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం శాసనసభ స్పీకర్కే ఉందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తెలంగాణలో పార్టీ మారి అనర్హత పిటిషన్లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయంలో తీర్పు వెలువరించిన రోజు నుంచి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ సభాపతి కార్యాలయానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఎవరూ విచారణను ఆలస్యం చేయడాన్ని అనుమతించకూడదని పేర్కొంది. విచారణను ఆలస్యం చేసేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణించాలని చెప్పింది. మరోవైపు అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ పునః పరిశీలించాలని సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఏడు నెలలు.. 9 సార్లు విచారణ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై త్వరగా చర్యలు తీసుకునేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ ఈ ఏడాది జనవరి 15న బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కేపీ వివేకానంద్లు స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పి) దాఖలు చేశారు. మిగిలిన ఏడుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎం.సంజయ్కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లు దాఖలైన తర్వాత దాదాపు ఏడు నెలల్లో తొమ్మిది సార్లు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, మోహిత్ రావు, స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, తదితరులు వాదనలు వినిపించారు. గత ఏప్రిల్ 3న విచారణ ముగించి తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం.. గురువారం తీర్పు వెలువరించింది. ఎంత సమయం కావాలని ముందే అడిగాం.. ‘2025 జనవరి 15న సుప్రీంకోర్టు ముందు కేసు దాఖలైన తర్వాత 16న తొలిసారిగా మేం కొందరికి నోటీసులు జారీ చేశాం. ఫిబ్రవరి 3న జరిగిన విచారణ సందర్భంగా.. ఫిబ్రవరి 4న మరికొందరికి నోటీసులు జారీ చేశాం. జనవరి 31న తొలుత ఈ కేసు విచారణకు వచ్చినప్పుడే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్కు ఎంత సమయం అవసరమో తెలుసుకోవాల్సిందిగా మేము సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గికి సూచించాం..’ అని ధర్మాసనం తెలిపింది. ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ నాట్ డెడ్’లా ఉండాలి ‘10 షెడ్యూల్ కింద స్పీకర్ ట్రిబ్యునల్గా పని చేస్తున్నప్పటికీ, ఆయన ఎటువంటి రాజ్యాంగపరమైన రక్షణ (కానిస్టిట్యూషనల్ ఇమ్యూనిటీ)ను పొందలేరు. నిజానికి ఈ కేసును విచారించిన సింగిల్ జడ్జి అనర్హత పిటిషన్లపై విచారించేందుకు సమయాన్ని నిర్ణయించమని స్పీకర్కు సూచించారు. అందుకు నాలుగు వారాల గడువిచ్చారు. అంతేకానీ పిటిషన్లపై నిర్ణయం తీసుకోమని ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. అయినప్పటికీ.. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకుని సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పడం ద్వారా డివిజన్ బెంచ్ తప్పిదానికి పాల్పడింది. ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు లేకపోయినా తెలంగాణ శాసనసభ కార్యదర్శి సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేయడం సరైంది కాదు. ఇకపై ఈ కేసు ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ నాట్ డెడ్’ లా ఉండాలి..’ అని సుప్రీంకోర్టు (నవ్వుతూ) వ్యాఖ్యానించింది. విచారణను పొడిగించేందుకు అనుమతి వద్దు ‘అనర్హత పిటిషన్లను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణను పొడిగించడానికి స్పీకర్ అనుమతించకూడదు. స్పీకర్ నిర్ణయాలపై న్యాయ సమీక్షకు అధికారాలు (కిహోటో హోల్లొహన్ (10వ షెడ్యూల్ సమర్థించిన) కేసులో తీర్పు నిష్పత్తిని ప్రస్తావిస్తూ) ఇరుకైన పరిధిలో (న్యారో కంపాస్) ఉన్నాయి. అలాగే స్పీకర్ నిర్ణయాలు న్యాయ సమీక్షకు పూర్తిగా అతీతం కాదు. స్పీకర్లు అనర్హత పిటిషన్లను ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచే పరిస్థితిని రాజ్యాంగ ధర్మాసనం ఊహించి ఉండకపోవచ్చు. అనర్హత పిటిషన్లను స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయించాలని కీషమ్ మేఘచంద్ర సింఘ్ కేసులో తీర్పు ఉంది. శివసేన, ఎన్సీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల పిటిషన్లను నిరీ్ణత సమయంలోగా నిర్ణయించాలని మహారాష్ట్ర స్పీకర్కు జారీ అయిన ఆదేశాలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది..’ అని న్యాయమూర్తులు తెలిపారు. జాతీయ ఆందోళనకు సంబంధించిన అంశం ‘అనర్హత పిటిషన్లపై నిర్ణయాధికారం స్పీకర్కే ఇచ్చాం. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో స్పీకర్ తగిన సమయంలో స్పందించాల్సిన అవసరం ఉంది. అయితే అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ పునఃపరిశీలించాలి. రాజకీయ ఫిరాయింపులు అనేవి జాతీయ ఆందోళనకు సంబంధించిన అంశం. మనం దీనిని ఎదుర్కొనకపోతే ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది..’ అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. అనర్హతల విషయంలో స్పీకర్ నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ పునః పరిశీలించాలి. రాజకీయ ఫిరాయింపులు అనేవి జాతీయ ఆందోళనకు సంబంధించిన అంశం. వీటిని ఎదుర్కొనకపోతే మన ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. 10 షెడ్యూల్ కింద స్పీకర్ ట్రిబ్యునల్గా వ్యవహరిస్తున్నప్పటికీ..ఆయన ఎటువంటి ‘‘రాజ్యాంగపరమైన రక్షణ’’ని పొందలేరు. అనర్హత పిటిషన్లను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ పొడిగించుకుంటూ పోవడానికి వీల్లేదు..– సుప్రీంకోర్టు ధర్మాసనంబీఆర్ఎస్ నేతల అభ్యర్థన తోసిపుచ్చిన ధర్మాసనం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు చేసిన అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. కిహోటో హోల్లోహన్, సుభాష్ దేశాయ్ తదితరుల కేసులకు సంబంధించి రాజ్యాంగ బెంచ్ తీర్పును ప్రస్తావించింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్కే ఉందని స్పష్టం చేసింది. ‘అయితే, ఫిరాయింపులు జరిగినప్పుడు అనర్హత అంశాన్ని తేల్చే ముఖ్యమైన బాధ్యతను స్పీకర్కు లేదా చైర్మన్కు అప్పగించే యంత్రాంగం వల్ల రాజకీయ ఫిరాయింపులను సమర్థవంతంగా అరికట్టగలుగుతున్నామా.. లేదా? అనే అంశాన్ని మాత్రం పార్లమెంట్ పరిశీలించాలి. ప్రజాస్వామ్య పునాదులు బలంగా ఉండాలంటే, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలంటే ప్రస్తుత యంత్రాంగం సరిపోతుందా? లేదా? అనే విషయం కూడా పార్లమెంటే తేల్చాలి..’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. అనర్హత పిటిషన్లపై తేల్చే అత్యంత ముఖ్యమైన బాధ్యతను పార్లమెంట్ స్పీకర్కు అప్పగించినప్పుడు ఆ హోదాలో ఉన్నవారు ఎంతవేగంగా చర్యలు తీసుకున్నారనేది ప్రధానమని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. షెడ్యూల్ 10 ఏం చెబుతోంది..ఇది పార్టీల నుంచి ఫిరాయింపులను నిరోధించడానికి రూపొందించింది. దీన్ని ఫిరాయింపుల నిరోధక చట్టం అని కూడా అంటారు. రాజకీయ స్థిరత్వం, ప్రజాస్వామ్య ప్రక్రియ పరిరక్షణ, విలువలను కాపాడటం కోసం దీన్ని ఉద్దేశించారు. ప్రజాప్రతినిధులు పార్టీలు ఫిరాయించకుండా నిరోధించడం దీని ముఖ్య ఉద్దేశం. దీని ప్రకారం..పార్టీ ఆదేశాలు చట్టసభల సభ్యులు పాటించాలి. పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటు వేసినా లేదా పార్టీ నుంచి వైదొలిగినా చట్టసభల సభ్యులను అనర్హులుగా ప్రకటించవచ్చు. ఫిరాయింపుల అంశాల్లో కోర్టులకు అధికార పరిధి ఉండదు. స్పీకర్ లేదా చైర్మన్ నిర్ణయమే అంతిమం. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరితే సభలో సభ్యుడిగా ఉండటానికి అనర్హుడు. ఒకవేళ ఒక పార్టీ మరో పార్టీలో పూర్తిగా విలీనమైతే అనర్హత వర్తించదు. సభ్యుని అనర్హతపై ఏ కోర్టుకు అధికార పరిధి ఉండదు. -
ధన్ఖడ్ ఏమన్నారో అందరికీ తెలుసు.. ‘సుప్రీం’ తీర్పుపై తెలంగాణ స్పీకర్
సాక్షి, హైదరాబాద్: ఫిరాయింపుల ఎమ్మెల్యేల వ్యవహారంలో ఇవాళ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందించారు. తనకు మూడు నెలల గడువు విధించడంపై న్యాయ నిపుణులతో చర్చించాకే తదుపరి నిర్ణయానికి వెళ్తామని అన్నారాయన. ఈ క్రమంలో ధన్ఖడ్ వ్యాఖ్యల ప్రస్తావన తెచ్చారు.‘‘సుప్రీంకోర్టు తీర్పు పై న్యాయ నిపుణులతో చర్చిస్తా. మాజీ ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ ఏం మాట్లాడారో అందరూ చూశారు. వాటిని కూడా మేము పరిశీలిస్తున్నాం. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం. సుప్రీం కోర్టు తీర్పును పరిశీలించాకే అన్ని వివరాలు త్వరలో చెప్తా’’ అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. పార్టీ మారిన పది మందిపై తొలుత తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఆ సమయంలో.. విచారణ షెడ్యూల్ కోసం సింగిల్ బెంచ్ జడ్జి తెలంగాణ స్పీకర్కు నాలుగు వారాల గడువు విధించారు. అయితే డివిజనల్ బెంజ్ దానిని కొట్టేసింది. ఇక ఇవాళ్టి తీర్పులో ఫిరాయింపులపై చర్యల విషయంలో స్పీకర్కు సుప్రీం కోర్టు మూడు నెలల కాలపరిమితి విధించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధిస్తూ సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పు వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఉప రాష్ట్రపతి హోదాలో ఓ కార్యక్రమానికి హాజరైన ధన్ఖడ్.. సుప్రీం కోర్టుపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. పార్లమెంటే సుప్రీం అని. ఎన్నికైన ప్రజాప్రతినిధులే రాజ్యాంగ ప్రకారం అల్టిమేట్ మాస్టర్స్ అని అన్నారాయన. ‘‘సుప్రీం కోర్టు రాష్ట్రపతికి గడువు విధించడం తగదు. ఇప్పుడు జడ్జీలు శాసనాలు చేస్తారు, కార్యనిర్వాహక విధులు నిర్వర్తిస్తారు, సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తారు’’ అని విమర్శించారు. న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్య శక్తులపై అణుక్షిపణి ప్రయోగించకూడదు అని తీవ్ర వ్యాఖ్య చేశారాయన. అయితే.. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలన్న పిటిషన్ విచారణ సమయంలో సుప్రీం కోర్టు పరోక్షంగా ధన్ఖడ్ వ్యాఖ్యలపై స్పందించింది. ఇప్పుడు మేమే కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేస్తున్నామన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా? అంటూ ఆ పిటిషన్ను తోసిపుచ్చింది.సంబంధిత వార్త: ఆలస్యం చేసే ఎత్తుగడలు సరికావు.. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ -
తెలంగాణ ‘ఫిరాయింపుల’ కేసులో కీలక తీర్పు వెల్లడించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు వెల్లడించింది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని తెలంగాణ స్పీకర్ను ఆదేశించింది. గతంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. అలాగే.. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి(మూడు నెలలు) విధిస్తున్నట్లు పేర్కొంది.ఏళ్ల తరబడి ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లు పెండింగ్లో ఉంచడం సరికాదన్న భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్.. ఆ పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిందే అని తీర్పు వెల్లడించారు. అదే సమయంలో న్యాయస్థానమే వేటు వేయాలని పిటిషనర్లు చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. ‘అపరేషన్ సక్సెస్.. పేషెంట్ డైడ్’ అనే సూత్రం వర్తించకూడదని వ్యాఖ్యానించింది. పార్టీ ఫిరాయింపులకు ఫుల్ స్టాప్ పెట్టే అంశంపై పార్లమెంట్ ఆలోచించాలి. న్యాయస్థానం విచారణ మొదలుపెట్టాకే.. ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. మేము జోక్యం చేసుకునేంత వరకు స్పీకర్ నోటీసులు ఇవ్వకపోవడం సమంజసం కాదు. పదో షెడ్యూల్ ఉద్దేశాలు నెరవేరుతున్నాయా ? లేదా అని ఆలోచించాలి. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేసే ఎత్తుగడలు మంచివి కావు అని సీజేఐ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఒకవేళ విచారణను పొడిగించడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే.. స్పీకర్ తగు నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేశారాయన.2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై విజయం సాధించిన ఎమ్మెల్యేలు.. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్.. అటుపై అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని పలువురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ ను కోరారు. అయినా, స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతో.. పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ న్యాయస్థానాలను ఆశ్రయించింది. హైకోర్టులో ఎదురుదెబ్బ టు సుప్రీం కోర్టు తీర్పు దాకా.. అనర్హత పిటిషన్ల టైం లైన్2024 ఏప్రిల్లో.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు పది మందిని అనర్హులుగా ప్రకటించాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు09.09.2024.. నాలుగు వారాల్లో విచారణ షెడ్యూల్ ఇవ్వాలని స్పీకర్ కార్యాలయానికి జస్టిస్ బి విజయ్సేన్ రెడ్డి బెంచ్ ఆదేశం.22.11.2024.. హైకోర్టు డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ ఆదేశాలను రద్దు చేస్తూ.. స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం.. రీజనబుల్ టైం కావాలంటూ వ్యాఖ్య. స్పీకర్కు షెడ్యూల్ ఖరారు చేయాల్సిన అవసరం లేదని స్పష్టీకరణజనవరి 2025.. హైకోర్డు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, వివేకానంద10.02.2025.. పార్టీల హక్కులు నిర్లక్ష్యం చేయబడకూడదు అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానిస్తూ.. స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన ‘రీజనబుల్ టైం’ అంటే ఎంత? అని ప్రశ్నించింది.18.02.2025.. సుప్రీం కోర్టు తదుపరి విచారణకు తేదీ నిర్ణయించింది, స్పీకర్ సమాధానం కోసం వేచి చూసింది.2025 మార్చి 4 – కోర్టు స్పీకర్, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.03.04.2025.. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై వాదనలు ముగిశాయి. సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.31.07.2025.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పీకర్కు కాలపరిమితి విధిస్తూ మరీ సుప్రీం కోర్టు తుది తీర్పు -
సుప్రీంకోర్టు సంశయించకూడదు!
బిహార్లో ఓటర్ల జాబితాలపై ప్రత్యేక సునిశిత సవరణ (ఎస్.ఐ.ఆర్.–సర్) నిర్వ హించాలన్న భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు వాదోపవాదాలను వింటోంది. ఈలోగా, ఆ తతంగానికి సంబంధించిన మొదటి దశ ఇటీవలే పూర్తయింది.రాష్ట్రంలో రాబోయే ఎన్నికల లోగా జాబితా లను మెరుగుపరచాలని ‘సర్’ లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశ పూర్తయ్యేనాటికి జాబితాలో చేర్చాలని కోరుతూ 7.24 కోట్ల దర ఖాస్తులు వచ్చాయని కమిషన్ వెల్లడించింది. జాబితాల సవరణ మొదలుపెట్టిన జూన్ 24 నాటికి రాష్ట్రంలో నమోదై ఉన్న ఓటర్లసంఖ్య కన్నా అది 65 లక్షలు తక్కువ. పిటిషనర్ల ఆగ్రహానికి కారణాలు1950 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 21వ సెక్షన్ కింద ఓటర్ల జాబితాలను సవరించే అధికారం ఎన్నికల కమిషన్కు ఉంది. కానీ, రెండు ముఖ్యమైన అంశాలు పిటిషనర్లకు కోపం తెప్పించాయి. ఒకటి – 2003 తర్వాత నమోదైన ఓటర్లు అందరూ తిరిగి తమ పేర్లను నమోదు చేసుకోవాలనీ, అందుకు తగిన అర్హతను చూపాలనీ కోరడం. రెండు – వారు ఆ పని చేయడానికి ఒక నెల వ్యవధి మాత్రమే ఇవ్వడం. తిరిగి పేరు నమోదు చేసుకునేందుకు తక్కువ వ్యవధినివ్వడం, వేగంగా సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చూడటం వల్ల ఈ విధానం అపారదర్శకంగా తయారైంది. మూకుమ్మడిగా పేర్లు తొల గింపునకు గురవుతాయనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయినా, ఈ కార్యక్రమాన్ని నిలిపివేసేందుకు కోర్టు తిరస్కరించింది. ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డులను కూడా ‘పరిగణన’లోకి తీసుకోవలసిందని మాత్రమే కోర్టు కోరింది. ఆ విధంగా చాలా మందిని అనర్హులుగా చేయనున్నారనే విమర్శలకు తావు ఇవ్వకుండా ప్రయత్నించింది. ఓటర్ల జాబితా ఎందుకు కీలకం?భారతదేశంలో ప్రజాస్వామ్య హృదయాన్ని పదిలపరచేది ఓటు హక్కేనని, దాన్ని వినియోగించుకోవడంలోని ప్రాధాన్యాన్ని వివరిస్తూ గతంలో కొన్ని తీర్పులు వెలువడ్డాయి. అయితే, ఓటు హక్కు చట్ట పరమైన హక్కుగానే మిగిలిపోయింది. దాని అస్తిత్వం ఒక ప్రత్యేక శాసనంతో ముడిపడి ఉంది. దానివల్ల వచ్చిన చిక్కేమిటంటే, ఆ హక్కు విషయంలో జోక్యం చేసుకోవచ్చు లేదా అది కొన్ని షరతులకు లోబడి ఉండేటట్లు చేయవచ్చు. నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారికి మాత్రమే ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని 1951 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 62వ సెక్షన్ పేర్కోంటోంది. ఫలితంగా, అర్హులైన ఓటర్లను గుర్తించడంలో ఓటర్ల జాబితాలను రూపొందించడం లేదా సవరించడం ముఖ్యమైన ప్రక్రియగా మారింది. గడువు ముగిసిన తర్వాత ఓటర్ల జాబితాలను సవరించడానికి అనుమతించబోమని ఒకసారి బిహార్ విషయంలోనే బైద్యనాథ్ పంజియార్ వర్సెస్ సీతారామ్ మహతో (1969) కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.నమోదుకు కడపటి తేదీ ముగిసిన తర్వాత, ఓటర్ల జాబితా లకు సవరణ తేవడం, చేర్చడం లేదా తొలగించడం, ఒకచోటు నుంచి ఇంకో చోటుకు మార్చడం చేయకుండా 1960 నాటి నిబంధనలు నివారిస్తున్నాయి. జాబితాల సవరణపై స్టే విధించడానికి సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించడం బట్టి, ప్రస్తుత కేసులో పిటిషనర్లకు అనుకూలంగా ఫలితం వస్తుందని ఆశించడానికి అటువంటి పూర్వ ప్రమాణాలు, నిబంధనలు స్ఫూర్తినిచ్చేవిగా లేవు. పైగా, సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను రెండు కారణాల రీత్యా తోసిపుచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకటి– అటువంటి కేసులను సమీక్షించడానికి సుప్రీంకోర్టుకు ఉన్న పరిధులు పరిమితం. రెండు– ఎన్నికలను జాప్యం చేసేందుకే అలాంటి కేసులు పెట్టే ఎత్తుగడ అనుసరిస్తూ ఉంటారని సుప్రీంకోర్టుకు ఎప్పుడూ ఒక సందేహం ఉంటుంది. ఫిర్యాదులు చేయడం సాధ్యమేనా?ఫిర్యాదులు చేసేందుకు లేదా సమస్యలు పరిష్కరించాలని కోరేందుకు వీలుగా ఒక ఆంతరంగిక సమీక్షా యంత్రాంగాన్ని 1950 నాటి చట్టం సమకూరుస్తోంది. ఎన్నికల అధికారులపై ఎవరైనా అభ్యంతరాలు లేవనెత్తవచ్చు. తదుపరి ఆదేశాలు జారీ చేయవలసిందిగా కమిషన్ను కోరవచ్చు. కోర్టులను ఆశ్రయించడానికి ముందు ఆ మార్గాలను అనుసరించవలసిందిగా కోర్టు గతంలో పలుమార్లు స్పష్టం చేసింది. ఉత్తర ప్రదేశ్కు సంబంధించి ఎన్నికల జాబితాలను రూపొందించడం, మార్పు చేర్పులు చేయడంలో అవకతవకలు జరిగాయని, జోక్యం చేసుకోవలసిందని కోరుతూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం (1996)పై అనురాగ్ నారాయణ్ సింగ్ పెట్టిన కేసులో తలదూర్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. బిహార్ సవరణ ప్రక్రియలోని న్యాయ బద్ధతను విశ్లేషించేటపుడు కోర్టు ఈసారి కూడా అదే రీతిలో, ఫిర్యాదు దారులందరినీ ఆ యా చట్టపరమైన ప్రక్రియల వైపు మళ్ళవలసిందిగా సూచించి చేతులు దులుపుకోవచ్చు. ఈ ఆంతరంగిక పరిష్కార యంత్రాంగాలలో వేళ్ళూనుకు పోయిన సమస్యలు చాలా ఉన్నాయని గతంలో వచ్చిన కేసులు చెబు తున్నాయి. ఫిర్యాదులతో వెళ్ళడం అధికారులకు రుచించకపోవడం వల్ల, వారు తమ అభ్యంతరాలను చెవికెక్కించుకున్నది లేదనికొందరు వాపోయిన సందర్భాలున్నాయి. పైగా, మురికివాడనివాసుల వంటి బలహీన వర్గాల పౌరులలో కొన్ని వర్గాలకు ఈ ప్రక్రియ అందని మావిపండుగానే ఉంది. ఓటరుగా అనర్హుడవని వచ్చిన నోటీసులను చదువు సంధ్యలు లేనివారు అర్థం చేసుకోగలరా? ఎన్నికల అధికారి ముందుకు వెళ్ళడం కోసమని దినసరి వేతన కార్మికుడు ఒక రోజు పనిని వదులు కోగలడా? న్యాయ పరిరక్షణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత బిహార్ ‘సర్’ కేసులో సుప్రీంకోర్టు గణనీయంగా కల్పించుకుని సరైన తీర్పరిగా వ్యవహరించవలసి ఉంది. ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో...లక్ష్మీ చంద్రసేన్ వర్సెస్ ఏ.కె.ఎం. హసన్ (1985) కేసులో ఓటర్ల జాబితాలను సవరించాలని ఆదేశించడానికి సుప్రీంకోర్టు వెనుకాడింది. అది ఎన్నికలపై న్యాయవ్యవస్థ అవాంఛనీయ జోక్యానికి కార ణమవుతుందనీ, ఒక్కోసారి ఎన్నికల నిరవధిక వాయిదాకు దారి తీస్తుందనీ కోర్టు కలవరపడింది. ఎన్నికలు ఎంత ఎక్కువగా అనివా ర్యమైతే, దానిలో జోక్యం చేసుకునేందుకు కోర్టు అంత ఎక్కువగా విముఖత చూపుతుందన్న అప్రకటిత సూత్రం ఒకటి ఉంది. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు, అక్రమాలు చోటుచేసుకుంటే మాత్రం, అది మొత్తం ఎన్నికలను విషపూరితం చేసే అవకాశం ఉంటుంది కనుక కోర్టు ఆ బాధ్యతను భుజాలకు ఎత్తుకుంటుంది. దాన్ని పరిష్క రించేందుకు తదనంతరం, కోర్టు ఒక ప్రత్యేక ట్రైబ్యునల్ను ఏర్పాటు చేయవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్లు అవుతుందనే సాకుతో బిహార్ విషయంలో తలదూర్చేందుకు కోర్టు మొదట తిరస్కరించవచ్చు. ఓటర్ల జాబితాల సవరణ అక్రమమని ఒకవేళ కోర్టు భావించినా కూడా ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడం కానీ, అనర్హులుగా చేసే విధానాన్ని నివారించడం కానీ చేయకపోవచ్చు. భారతీయ ప్రజాస్వామ్యానికి కించిత్తు హాని జరుగుతుందని తలచినా అప్రమ త్తంగా ఉండే కాపలాదారు పాత్రనే సుప్రీంకోర్టు చాలా సందర్భాలలో నిర్వహిస్తూ వచ్చింది. ఓటు వేసేందుకు ప్రజలకు ఉన్న హక్కు ప్రజా స్వామ్యానికి ప్రాథమిక పునాది కనుక ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను సుప్రీం కోర్టు చేపట్టడం ఇప్పుడు చాలా ముఖ్యం.-వ్యాసకర్త ‘విధి సెంటర్ ఫర్ లీగల్ స్టడీస్’ రిసెర్చ్ ఫెలో(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-అంశుల్ డాల్మియా -
భారీగా ఓట్లను తొలగిస్తే మేం జోక్యం చేసుకుంటాం
న్యూఢిల్లీ: బిహార్లో ఓటర్ల జాబితాలో సమూల ప్రక్షాళన ధ్యేయంగా జరుగుతున్న ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భారీ స్థాయిలో ఓట్లను తొలగిస్తే మాత్రం తాము కచి్చతంగా జోక్యంచేసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఓటర్ల గుర్తింపును తనిఖీచేసే ప్రక్రియలో ఆధార్ కార్డ్, ఓటర్ కార్డులను చేర్చాలన్న పిటిషన్పై మంగళవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగీ్చల సుప్రీంకోర్టు ధర్మాసనం వాదోపవాదనలను ఆలకించింది. చట్టప్రకారం ఓటర్ల జాబితాలో సవరణలు, మార్పులు, చేర్పులు చేసే అసాధారణ అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. ‘‘తమకు ఇప్పటికే ఓటు ఉందని తెలియజేస్తూ ఎనుమరేషన్ దరఖాస్తును 65 లక్షల మంది సమరి్పంచలేదు. అంతమాత్రం చేత వీళ్లందరి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తారా? వీళ్లంతా ఎవరో ఈసీకి తెలియదా?’’ అని పిటిషనర్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా తరఫున సీనియర్ న్యాయవాది కపిల్సిబల్ వాదించారు. దీంతో ధర్మాసనం జోక్యంచేసుకుంది. ‘‘ చట్టప్రకారం చర్యలు తీసుకునే అధికారం ఈసీకి ఉంది. ఓటరు ముసాయిదా జాబితాలో ఏవైనా తప్పులుంటే మా దృష్టికి తీసుకుని రండి. ముసాయిదాలో పేర్లు లేకపోవడం కారణంగా ఓట్లను కోల్పోతున్న ఒక 15 మందిని తీసుకొచ్చి మా ముందు నిలబెట్టండి. దరఖాస్తు ఇవ్వనంత మాత్రాన చనిపోయారని ఆ జాబితా నుంచి ఎవరి పేర్లయితే తీసేశారో వాళ్ల వివరాలు మాకు ఇవ్వండి. అలాగే దరఖాస్తు ఇవ్వని కారణంగా జాబితాలో పేరు గల్లంతైన వారి వివరాలూ సమర్పించండి’’ అని సిబల్కు ధర్మాసనం సూచించింది. -
న్యాయవ్యవస్థను మోసం చేస్తోంది
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీపై ఉన్న ‘క్యాష్ ఫర్ జాబ్స్’ఆరోపణల కేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యమయ్యేలా చేస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అందుకే ఈ కేసులో నిందితులంటూ 2,300 మంది పేర్లను చేర్చిందని ఆరోపించింది. ఈ ప్రయత్నం న్యాయవ్యవస్థను మోసం చేయడమేనని జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం అభివరి్ణంచింది. బాలాజీపై ఉన్న కేసుల పూర్తి వివరాలను తమ ఎదుట ఉంచాలని, బుధవారం విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ‘ఈ మొత్తం వ్యవహారంలో మంత్రితోపాటు మధ్యవర్తులుగా వ్యవహరించిందెవరు? మంత్రి సిఫారసులకు అనుకూలంగా పనులు చేసిన అధికారులెవరు? ఉద్యోగాల ఎంపిక కమిటీ సభ్యులెవరు? నియామక ఉత్తర్వులు వెలువరించిన అధికారులెవరు? వంటి వివరాలను తెలపాలని ధర్మాసనం కోరింది. బాలాజీ జీవిత కాలంలో కూడా విచారణ పూర్తి కాకుండా చేయడమే ప్రభుత్వం ఉద్దేశంగా కనిపిస్తోందని పేర్కొంది. మాజీ మంత్రి, ఆయన అనుచరులు ఉద్యోగాల కోసం డబ్బు చెల్లించమని బలవంతం చేసిన పేదలను లంచం ఇచ్చేవారిగా, ఈ కుంభకోణం కేసులో నిందితులుగా చేర్చారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘క్యాష్ ఫర్ జాబ్స్’కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ వేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టుకొట్టివేయడంతో వై.బాలాజీ అనే వ్యక్తి వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం తీరును ఎండగట్టింది. ఏఐఏడీఎంకే హయాంలో 2011–2015 మధ్య కాలంలో మంత్రిగా పనిచేసిన సెంథిల్ బాలాజీ ఉద్యోగాలను అమ్ముకున్నారంటూ బాధితులు ఫిర్యాదు చేయడంతో తమిళనాడు పోలీసులు 2018లో మూడు కేసులు నమోదు చేశారు. దీనిపై 2021 ఈడీ మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసి, 2023 జూన్లో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేసింది. 2024 ఫిబ్రవరిలో మంత్రి పదవికి రాజీనామా చేశారు. 15 నెలలపాటు జైలులో ఉన్న బాలాజీకి సుప్రీంకోర్టు 2024 సెపె్టంబర్లో బెయిలిచ్చింది. అదే నెలలో బాలాజీ మళ్లీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా ప్రమాణం చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, బెయిల్ కావాలో పదవి కావాలో తేల్చుకోవాలని కొరడా ఝళిపించడంతో గతేడాది ఫిబ్రవరిలో పదవి నుంచి వైదొలిగారు. -
సుప్రీం కోర్టులో రేవంత్రెడ్డికి ఊరట.. పెద్దిరాజుపై సీజేఐ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. గోపనపల్లి ప్రైవేట్ భూ వివాదం కేసులో రేవంత్కి వ్యతిరేకంగా, ఎన్ పెద్దిరాజు దాఖలు చేసిన ట్రాన్స్ఫర్ పిటిషన్ను చీఫ్ జస్టిస్ బెంచ్ సోమవారం డిస్మిస్ చేసింది. అదే సమయంలో.. పిటిషన్లో హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై పిటిషనర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గమనించిన సీజేఐ ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. పిటిషన్ రాసిన న్యాయవాది, సంతకం పెట్టిన ఏవోఆర్పై చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు జడ్జిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తూనే.. పెద్దిరాజు, ఆయన అడ్వకేట్ రితేష్ పాటిల్, ఏవోఆర్కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణకు పిటిషనర్ పెద్దిరాజు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే.. పిటిషనర్ తరఫు న్యాయవాది రితీష్ పాటిల్ క్షమాపణ కోరుతూ.. కేసు విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలంటూ నోటీసులు సీజేఐ గవాయ్ నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై తదుపరి విచారణ ఆగస్టు 11కు వాయిదా వేశారు.ఏం జరిగిందంటే.. గోపన్పల్లి గ్రామం సర్వే నంబర్ 127లోని సొసైటీకి సంబంధించిన భూమిని ఆక్రమించడంతో పాటు నిర్మాణాలను జేసీబీతో కూల్చేశారంటూ గచ్చిబౌలి పీఎస్లో 2016లో కేసు నమోదైంది. పెద్దిరాజు ఫిర్యాదు మేరకు.. ఈ కేసులో ఏ-1గా కొండల్ రెడ్డి(రేవంత్ సోదరుడు), ఏ-2గా ఈ.లక్ష్మయ్య, ఏ-3గా రేవంత్ రెడ్డిని చేర్చారు. ఎల్బీ నగర్లోని రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును కొట్టేయాలని రేవంత్ రెడ్డి 2020లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. వాదనలు విన్న జస్టిస్ మౌషమీ భట్టాచార్య ధర్మాసనం.. రేవంత్ రెడ్డి ఘటనా స్థలంలో లేరనే విషయాన్ని ఫిర్యాదుదారు సైతం అంగీకరించారని పేర్కొంది. తాను లేను కాబట్టి తనపై కేసు కొట్టేయాలని అడుగుతున్నారని, మిగతా వారిపై కేసుకొట్టేయాలని అడగటం లేదని వ్యాఖ్యానించింది. రేవంత్రెడ్డి ఆదేశాలమేరకే దూషించారనే ఆరోపిస్తున్నా ఆధారాలు లేవని తెలిపింది. ఇదే భూమికి సంబంధించి ఇదే ఆరోపణలతో గచ్చిబౌలి పీఎస్లో 2014లో సైతం కేసు నమోదైందని, నిందితులు-సొసైటీకి మధ్య సివిల్ వివాదమని తేలడంతో తప్పుడు కేసుగా మూసేశారని గుర్తుచేసింది. దీనిపై ఫిర్యాదుదారు పెద్దిరాజు మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించగా.. కోర్టు దాన్ని కొట్టేసిందని, దానిపై క్రిమినల్ రివిజన్ పెండింగ్లో ఉందని పేర్కొంది. ఈ క్రమంలో.. జులై 18వ తేదీన రేవంత్రెడ్డిపై నమోదు అయిన కేసును కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. -
ఎస్ఐఆర్పై స్టే ఇవ్వలేం
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియపై ఇప్పటికిప్పుడు మధ్యంతర స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పిన అత్యున్నత న్యాయస్థానం.. ఓటరు జాబితా సవరణకు ఆధార్తోపాటు ఓటరు గుర్తింపు కార్డును పరిగణనలోకి తీసుకోవాలని ఈసీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు ధ్రువీకరణలను వాస్తవమై నవిగా భావిస్తున్నామంది. ‘రేషన్ కార్డులకు సంబంధించి చూస్తే వీటిని తేలిగ్గా ఫోర్జరీ చేయొచ్చు. కానీ, ఆధార్, ఓటర్ కార్డులను వాస్తవమైనవిగా భావించొచ్చు. ఈ రెండు ధ్రువీకరణలను అనుమతించండి’అని జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో తుది విచారణను ఈ నెల 29వ తేదీన చేపడతామని తెలిపింది. పిటిషనర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ అనే ఎన్జీవో తరఫున సీనియర్ లాయర్ గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపించారు. ఇప్పటికిప్పుడే మధ్యంతర జాబితాను ఖరారు చేయవద్దని, ఆగస్ట్ ఒకటో తేదీన ఈసీ ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించకుండా మధ్యంతర స్టే ఇవ్వాలని కోరారు. అయితే, దీనివల్ల మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియే నిలిచిపోతుందని పేర్కొన్న ధర్మాసనం ఆయన వాదనను తోసిపుచ్చింది. ‘న్యాయస్థానం అధికారాన్ని తక్కువగా చూడకండి. ఈ ప్రక్రియ చట్ట వ్యతిరేకమని తేలిన పక్షంలో మీ వాదనను అంగీకరిస్తాం. అప్పుడే ఎస్ఐఆర్ ప్రక్రియ ఆసాంతంగా రద్దు చేసేస్తాం’అని ధర్మాసనం కరాఖండిగా చెప్పింది. బిహార్లో చేపట్టిన ఎస్ఐఆర్కు ఆధార్తోపాటు ఓటరు ఐడీని అంగీకరించాలంటూ ఈసీని ఈ నెల 10వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. ఈ మేరకు ప్రాథమికంగా అంగీకరిస్తూ ఈసీ దాఖలు చేసిన అఫిడవిట్ను సోమవారం ధర్మాసనం పరిశీలించి, పై వ్యాఖ్యలు చేసింది. ఆధార్, ఓటరు కార్డును అంగీకరిస్తూ ఈసీ అఫిడవిట్ వేసినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయని ఈ సందర్భంగా లాయర్ శంకరనారాయణన్ తెలపగా.. ఎస్ఐఆర్ కోసం అంగీకరిస్తున్న 11 ధ్రువీకరణలతోపాటు ఆధార్, ఓటరు ఐడీ కూడా ఉంటాయని జస్టిస్ సూర్య కాంత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈసీ తరఫున సీనియర్ లాయర్ రాకేశ్ ద్వివేది..ఆధార్ పౌరసత్వానికి రుజువు కాదని, అదేవిధంగా, ఓటరు ఐడీని ఓటరు సవరణ ప్రక్రియలో నమ్మకమైందిగా భావించలేమన్నారు. ఓటరు ఐడీని పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం ప్రక్రియతో ఎటువంటి లాభం ఉండదని పేర్కొన్నారు. స్పందించిన ధర్మాసనం.. ‘ఈ ప్రపంచంలో ఏ ధ్రువీకరణ పత్రాన్నైనా ఫోర్జరీ చేయొచ్చు. ఫోర్జరీ కేసుల విషయాన్ని ఈసీ చూసుకోవాలి. అన్ని పేర్లను తొలగించడానికి బదులుగా అందరినీ జాబితాలో చేర్చేలా చూడాలి. -
న్యాయస్థానం సహనాన్ని పరీక్షిస్తున్నారు..!
న్యూఢిల్లీ: భారత ఆర్మీ అధికారి కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మధ్యప్రదేశ్ మంత్రి కువ్వర్ విజయ్ షా తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బహిరంగ క్షమాపణలు చెప్పకుండా న్యాయస్థానం సహనాన్ని పరీక్షిస్తున్నారంటూ తలంటింది. జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చి సోమవారం ఈ కేసు విచారణ సందర్భంగా మంత్రి ప్రవర్తనను, వ్యాఖ్యల వెనుక ఆయన ఉద్దేశాన్ని అనుమానించాల్సి వస్తోందని పేర్కొంది. ‘ఈ విధంగా క్షమాపణ చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏమిటి? బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెబుతున్నాం. ఏది? ఎక్కడ చెప్పారు? మా సహనాన్ని ఆయన పరీక్షిస్తున్నారు’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మంత్రి షా చెప్పిన బహిరంగ క్షమాపణలను ఆన్లైన్లో షేర్ చేశామని ఆయన తరఫు లాయర్ కె.పరమేశ్వర్ తెలపగా.. ‘క్షమాపణలను ఆన్లైన్లో చెప్పడమేంటి? ఆయన తీరు, ఉద్దేశాలపై మాకు అనుమానాలు కలుగుతున్నాయి. క్షమాపణ చెప్పినట్లుగా రికార్డు చేయండి. మేం దాన్ని చూడాల్సి ఉంది’అంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. మంత్రి షా ప్రకటనలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆగస్ట్ 13వ తేదీలోగా నివేదికను తమకు అందజేయాలంది. ఈ సందర్భంగా సిట్ అధికారి ఒకరు 27 మంది ఇచ్చిన వాంగ్మూలాలను సీల్డ్ కవర్లో అందజేశారు. వీటిపై తాము దర్యాప్తు చేపట్టినట్లు ఆ అధికారి చెప్పారు. షా ప్రకటనలు కాకుండా ఇదే విషయంలో ఇతరులు చేసిన అనుచిత ప్రకటనలను రికార్డు చేయాలని ధర్మాసనం సిట్ను ఆదేశించింది. కున్వర్ విజయ్ షాను మంత్రిపదవికి రాజీనామా చేయించాలంటూ కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ వేసిన పిటిషన్ను ధర్మాసనం తోసిపుచ్చింది. షా గతంలో చేసిన ఇటువంటి అనుచిత ప్రకటనలపైనా సిట్ దర్యాప్తు చేస్తుందని పేర్కొంటూ తదుపరి విచారణను ఆగస్ట్ 18వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మేలో కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లు మీడియాకు జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు మీడియాకు వెల్లడిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించారు. వీరిపై మంత్రి కున్వర్ విజయ్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదైంది. -
భూమ్మీద దేన్నైనా ఫోర్జరీ చేస్తారు కదా?: ఈసీకి ‘సుప్రీం’ ప్రశ్న
బీహార్ ఓటరు జాబితా సవరణలో.. ఆధార్ కార్డుకు పౌరసత్వ గుర్తింపుకార్డుల జాబితా నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తీవ్రంగా పరిగణించింది. ఆధార్తో పాటు ఓటర్ ఐడీ ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డు(EPIC)ని చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్ల కింద పరిగణించాల్సిందేనని కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది.బీహార్ ఓటర్ లిస్ట్ రివిజన్లో భాగంగా ఆధార్ను గుర్తింపుకార్డుగా ఈసీ పరిగణించడం లేదు. తద్వారా ఓట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం ఈసీని ఉద్దేశించి కీలక వ్యాఖ్య చేసింది. ‘‘భూమ్మీద దేనినైనా ఫోర్జరీ చేస్తారు కదా?’’ అని కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరాలపై సూటిగా ప్రశ్నను సంధించింది. ఈ క్రమంలో..ఆధార్ను తిరస్కరిస్తూ.. బీహార్ ఓటర్ల రివిజన్ ప్రక్రియలో ఓట్లను తొలగిస్తూ వస్తోంది ఎన్నికల సంఘం. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. జులై 10వ తేదీ నాటి విచారణ సందర్భంగా బీహార్ ఓటర్ లిస్ట్ రివిజన్ సబబేనన్న సుప్రీం ధర్మాసనం.. అదే సమయంలో ఆధార్, ఎపిక్, రేషన్ కార్డులనూ పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని ఈసీకి స్పష్టం చేసింది. అయితే.. ఇవాళ్టి వాదనల సందర్భంగా ఆధార్ను ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్గా పరిగణించడం కుదరదని, రేషన్ కార్డులు నకిలీవి సృష్టించే అవకాశం లేకపోలేదని.. కాబట్టి వాటి మీద ఆధారపడలేమని ఈసీ వాదనలు వినిపించింది. అలాగే ఓటర్ నమోదు ప్రక్రియలో ఆధార్ను కేవలం ఐడెంటిటీ ఫ్రూఫ్గా మాత్రమే పరిగణిస్తామని పేర్కొంది.దీనిపై సుప్రీం కోర్టు స్పందించింది. ఈ భూమ్మీద ఏ డాక్యుమెంట్ను ఫోర్జరీ చేయలేరో చెప్పాలంటూ ఈసీని ప్రశ్నించింది. ఓటర్ నమోదు సమయంలో ఆధార్ ప్రస్తావన ఉంటున్నప్పటికీ.. ఓటరు జాబితా గుర్తింపు కోసం ఎందుకు పరిగణించడం లేదని మరోసారి నిలదీసింది. ఈ క్రమంలో.. ఆధార్, ఎపిక్ని బీహార్ ఓటర్ రోల్ రివిజిన్కు చేర్చాలంటూ ఆదేశించింది.ఎన్నికల సంఘం (EC) జాబితాలోని ఏదీ నిర్ణయాత్మక పత్రం కాదు కదా. ఆధార్, ఎపిక్ విషయాల్లో మీరు ఎత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటే గనుక రేపు మీరు అంగీకరించిన ఇతర పత్రాలు కూడా ఫోర్జరీ జరిగితే.. దాన్ని నిరోధించే వ్యవస్థ ఎక్కడ? అని ఈసీకి ప్రశ్న ఎదురైంది. అదే సమయంలో.. ఆగస్టు 1వ తేదీన ఈసీ ప్రచురించబోయే బీహార్ ఓటర్ల డ్రాఫ్ట్ లిస్ట్పై మధ్యంతర స్టే విధించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది గోపాల్ శంకర్నారాయణన్ కోరారు. అయితే.. రేపటి విచారణలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని బెంచ్ స్పష్టం చేసింది. -
తల్లా? పెళ్లామా?
తల్లా? పెళ్లామా? అనే పరిస్థితిలో.. ఎవరి మాటకు విలువ ఇవ్వాలో తెలియక మదనపడే వాళ్లే మన మధ్యే కనిపిస్తుంటారు. అయితే అలాంటి మానసిక సంఘర్షణలో నలిగిపోతున్న ఓ వ్యక్తికి.. భారత సర్వోన్నత న్యాయస్థానం హితబోధ చేసింది.ఆ భార్యభర్తలిద్దరూ.. మనస్పర్థలతో దూరంగా ఉంటున్నారు. భర్త అమెరికాలో ఉండగా.. పెద్ద కూతురు అతని తల్లి(నాన్నమ్మ) దగ్గర, మైనర్ కొడుకు మాత్రం భార్యతో ఉంటున్నాడు. ఈ తరుణంలో కలిసి ఉండడం కుదరని భావించిన ఆ జంట కోర్టును ఆశ్రయించింది. శుక్రవారం.. జస్టిస్ బీవీ నాగరత్న, కేవీ విశ్వనాథన్ ఈ పిటిషన్ను విచారించారు. ఈ క్రమంలో వర్చువల్ విచారణకు హాజరైన ఆ దంపతులు ధర్మాసనం సమక్షంలోనే వాదులాడుకున్నారు.తనపై తన భార్య తప్పుడు క్రిమినల్ కేసు పెట్టిందని ఆ భర్త, తన భర్త తనను పట్టించుకోవడం మానేశాడని ఆ భార్య పరస్పరం ఆరోపించుకున్నారు. ఈ తరుణంలో బెంచ్ జోక్యం చేసుకుంది.మధ్యవర్తిత్వం ద్వారా మాట్లాడుకుని పిల్లల కోసం కలిసి జీవించాలని ధర్మాసనం ఆ జంటకు సూచించింది. అయితే పదే పదే ఆ వ్యక్తి తన తల్లి ప్రస్తావన తీసుకురావడాన్ని గమనించిన జస్టిస్ నాగరత్న.. కుటుంబాల్లో గొడవలు భార్యల మాటల్ని భర్తలు పెడచెవిన పెట్టినప్పుడే మొదలవుతాయని వ్యాఖ్యానించారు.‘‘తమ మాట కంటే తల్లుల మాటకు భర్తలు ఎక్కువ విలువ ఇచ్చినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. అలాగని తల్లిని పక్కనపెట్టాలని మేం అనడం లేదు. భార్యలు చెప్పేది కూడా వినాలి. భర్తలు భార్యల భావాల్ని గౌరవించాల్సిందే’’ అని జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో భర్త తన కుమారుడిని చూడలేదని చెప్పడంతో, కోర్టు ఆ భార్య తీరును తప్పుబట్టింది. ఒక పిల్లవాడు తన తండ్రి, సోదరిని చూడకుండా ఉండడం సరికాదని అభిప్రాయపడింది. మధ్యవర్తిత్వ సమయంలోనైనా ఆ పిల్లాడి చూపించాలని, పిల్లల శ్రేయస్సు కోసం సమస్యలు పరిష్కరించుకుని కలిసి జీవించాలని మరోసారి ఆ జంటకు సూచిస్తూ కేసు వాయిదా వేసింది.మరో కేసులో.. విభేదాలను పక్కనపెట్టి ముందుకు సాగండని ఓ జంటకు సుప్రీం కోర్టు సూచించింది. భార్య, ఆమె తల్లిదండ్రులు తనను వేధిస్తున్నారని బాలాకోట్ దాడుల్లో పాల్గొన్న యుద్ధ విమాన పైలట్ ఒకరు కోర్టును ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుతో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కోరారాయన. అయితే.. జీవితం అంటే ప్రతీకారం తీర్చుకోవడం కాదని, సర్దుకుపోయి ముందుకు సాగాలని ఆ జంటకు ధర్మాసనం సూచించింది. -
జువెనైల్ జస్టిస్ బోర్డుకు వెళ్లండి..!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తాజాగా ఓ అరుదైన కేసును విచారించింది. ఈ కేసులో నిందితుడు 1988లో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష సైతం అనుభవించాడు. 2024లో ఇందుకు సంబంధించి దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు నిలిపివేసింది. నిందితుడు సుప్రీంకోర్టుకు వెళ్లాడు. నేరానికి పాల్పడినట్లు చెబుతున్న సమయంలో తన వయస్సు 16 ఏళ్లేనంటూ రుజువులు చూపాడు. దీంతో, అతడిని తిరిగి జువెనైల్ జస్టిస్ బోర్డుకు వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశించడం గమనార్హం. రాజస్తాన్కు చెందిన ఓ వ్యక్తి 1988లో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విచారించిన కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అతడు రాజస్తాన్ హైకోర్టులో సవాల్ చేయగా శిక్షను నిలుపుదల చేస్తూ 2024లో ఆదేశాలిచ్చింది. అనంతరం నిందితుడు సుప్రీంకోర్టుకు వెళ్లాడు. ఘటన జరిగిన సమయంలో తన వయస్సు 16 ఏళ్లు మాత్రమేనంటూ అతడు స్కూలు రికార్డులను రుజువులుగా చూపాడు. 1972 జూలై ఒకటో తేదీ పుట్టిన తేదీ అయినందున నేరానికి పాల్పడినప్పటికి తనింకా మైనర్నే అంటూ వాదించాడు. ఈ నెల 23న కేసు విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ మసీహ్ల ధర్మాసనం..వైద్య పరీక్షలు, బాధితురాలు, సాకు‡్ష్యల వాంగ్మూలాలు సరిగ్గానే ఉన్నాయని పేర్కొంది. అయితే, నిందితుడు అందజేసిన ధ్రువీకరణ పత్రాల ఆధారంగా అతడు మైనరేనని నిర్థారణయిందని పేర్కొంది. ఇన్నేళ్ల తర్వాత అతడిని మైనర్గా పేర్కొనడం సరికాంటూ రాజస్తాన్ ప్రభుత్వ న్యాయవాది వాదించగా చట్ట ప్రకారం సరైందేనని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో తగు ఆదేశాల కోసం అజ్మీర్లోని జువెనైల్ జస్టిస్ బోర్డును ఆశ్రయించాలని పిటిషనర్కు సూచించింది. నిబంధనల ప్రకారం జువెనైల్ జస్టిస్ బోర్డు దోషిని గరిష్టంగా మూడేళ్లపాటు ప్రత్యేక షెల్టర్కు పంపించే అవకాశముంది.జువెనైల్ జస్టిస్ చట్టం ఏం చెబుతోంది? జువెనైల్ జస్టిస్(కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్)చట్టం–2015 ప్రకారం నేరం జరిగినప్పటికి ఆ వ్యక్తి వయస్సు 18 ఏళ్లు లోపు ఉండాలి. ఈ కేసుల్లో నిందితులను జువెనైల్ జస్టిస్ బోర్డులే విచారించాలి. సాధారణ కోర్టులు కాదు. వీరికి జీవిత కారాగారం, మరణ శిక్ష వంటివి విధించరాదు. ఈ చట్టంలోని సెక్షన్ 18ని అనుసరించి దోషులుగా తేలిన వారిని కౌన్సెలింగ్ చేయడం లేదా గరిష్టంగా మూడేళ్లపాటు జువెనైల్ హోంలో ఉంచడం వంటి చర్యలు చేపట్టవచ్చు. అయితే, నేరం జరిగిన సమయంలో అమల్లో ఉన్న జువెనైల్ జస్టిస్ చట్టం–1986ను అనుసరించి 16 ఏళ్లలోపు వారిని బాలురనీ, బాలికలైతే 18 ఏళ్లుగా నిర్వచించారు. 2015 చట్టం ప్రకారం సుప్రీంకోర్టు బాలబాలికల వయస్సును సమానంగా 18 ఏళ్లుగా నిర్ణయించింది. నిందితుడి ప్రస్తుత వయస్సు, గడిచిన సమయంతో సంబంధం లేకుండా బాల నేరస్థుల వాదనలు చెల్లుబాటు అవుతాయని తాజా కేసు తెలియజేస్తోంది. తీవ్రమైన నేరాల కేసుల్లో సైతం బాల నేరస్తులను భిన్నంగా చూడాలనే సూత్రానికి ఇది బలం చేకూరుస్తోంది. -
డీలిమిటేషన్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచేలా నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)కు కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. శుక్రవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ‘ఈ పిటిషన్లో చట్టబద్ధత ఏదీ కనబడలేదు. అందుకే దీన్ని డిస్మిస్ చేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. 2014 నాటి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26ను అమలు చేయాలని... దాని ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచేందుకు డీలిమిటేషన్ ప్రక్రియను కేంద్రం ప్రారంభించేలా ఆదేశించాలని ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు.కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన జమ్మూ–కశ్మీర్లో నియోజకవర్గాల పునర్వీభజన కోసం నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం.. ఇదే విషయంలో ఏపీ, తెలంగాణను మినహాయించడం వివక్షేనని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని పురుషోత్తంరెడ్డి పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం జమ్మూ–కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కోసం జారీ చేసిన నియోజకవర్గాల పునర్వీభజన నోటిఫికేషన్ నుంచి ఏపీ, తెలంగాణను మినహాయించడం రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3)కి లోబడే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ఉందని, దాని ప్రకారం 2026 తర్వాత నిర్వహించే తొలి జనాభా లెక్కల అనంతరమే నియోజకవర్గాల పునర్వీభజన ప్రక్రియను చేపట్టడం సాధ్యమవుతుందని తేల్చిచెప్పింది. అనుమతిస్తే ఇక పిటిషన్ల వరద: సుప్రీం ధర్మాసనం జమ్మూ–కశ్మీర్లో ఇప్పటికే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడంపై పిటిషనర్ చేసిన వివక్ష వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు మధ్య నియోజకవర్గాల పునర్విభజనలో వర్తించే నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయని, అందుకే జమ్మూకశ్మీర్కు జారీ చేసిన నోటిఫికేషన్ను రాష్ట్రాల పరిస్థితులతో సరిపోల్చడం తగదని వ్యాఖ్యానించింది. ఇలాంటి విజ్ఞప్తులను స్వీకరిస్తే దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి పిటిషన్లు వరదలా కోర్టులను ముంచెత్తే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. అలాంటి పరిణామాలకు తాము తలవంచలేమని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది. -
విద్యార్థుల ఆత్మహత్యలు వ్యవస్థాగత లోపమే: సుప్రీం
న్యూఢిల్లీ: యువత, ముఖ్యంగా విద్యార్థుల బలవన్మరణాలు పెరిగిపోతుండటం ఆందోళనకరమని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘‘ఇది వ్యవస్థాగత లోపానికి నిదర్శనం. ఈ జాఢ్యాన్ని నిర్లక్ష్యం చేయలేం’’అని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. విశాఖపట్నానికి చెందిన ఓ 17 ఏళ్ల నీట్ విద్యార్థి ఆత్మహత్య కేసు విచారణను సీబీఐకి బదలాయించాలన్న పిటిషన్ను శుక్రవారం విచారించింది. ఈ అంశంపై 15 మార్గదర్శకాలు జారీ చేసింది. ‘‘విద్యా సంస్థల్లో విద్యార్థి–కౌన్సెలర్ నిష్పత్తిని గరిష్ట సంఖ్యకు పెంచాలి. ముఖ్యంగా పరీక్షలు, కౌన్సెలింగ్ తదితరాల వేళ వీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. సూసైడ్ హెల్ప్లైన్ నంబర్లు, టెలీ–మానస్ తదితర జాతీయ సేవల చిరునామా, ఫోన్ నంబర్లను విద్యా సంస్థలు, హాస్టళ్లు, తరగతి గదులతో పాటు వెబ్సైట్లలో కూడా ప్రముఖంగా కనిపించేలా ఉంచాలి. బోధన, బోధనేతర సిబ్బంది అందరూ ఏటా కనీసం రెండుసార్లు తప్పనిసరి మానసిక శిక్షణ తీసుకోవాలి. సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్ చేయగలిగి ఉండాలి. విద్యార్థుల్లో ఆత్మహత్యకు సంబంధించిన ధోరణులను తొలి దశలోనే గుర్తించి, సరిగా స్పందించగలిగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మానసిక ఆరోగ్య అక్షరాస్యత, భావోద్వేగాలను నియంత్రించుకోవడం, జీవ కళా విద్య వంటివాటికి తరగతి గదుల్లో చోటివ్వాలి. విద్యాపరమైన ఒత్తిళ్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ విద్యా సంస్థలే నివారణ చర్యలు చేపట్టాలి’’అని పేర్కొంది. ‘‘2022లో భారత్లో 1.7 లక్షల పైచిలుకు ఆత్మహత్యలు నమోదయ్యాయి. వాటిలో 7 శాతానికి పైగా, అంటే 13,044 విద్యార్థుల ఆత్మహత్యలే. వీటిలోనూ 2,248 ఆత్మహత్యలు నేరుగా పరీక్షల ఫలితాలతో సంబంధమున్నవే కావడం మరింత బాధాకరం’’అంటూ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలను ఉటంకిస్తూ ధర్మాసనం పేర్కొంది. ‘‘స్కూళ్లు, కోచింగ్ సెంటర్లు, కాలేజీలు, శిక్షణ కేంద్రాల వంటివాటిలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఇది ఒక రకంగా మానసిక ఆరోగ్య సంక్షోభం. ఇదే విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మానసిక ఆరోగ్యం రాజ్యాంగం కల్పించే జీవించే హక్కులో భాగం’’అని గుర్తు చేసింది. దీనిపై 90 రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. -
అరకోటి మంది ఓటర్లెక్కడ?
బిహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా నవీకరణ సుప్రీంకోర్టులో విచారణ దశలోనే వున్నా, పార్లమెంటులో అలజడి రేగుతున్నాఆ ప్రక్రియ తన దోవన తాను ముందుకెళ్తున్నది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ గురువారం ఆ వ్యవహారం గురించి వెల్లడించిన వివరాల ప్రకారం, లక్షమందికి పైగా ఓటర్ల ఆచూకీ లేదు. 21.6 లక్షల మంది మరణించారు. మరో 31.5 లక్షల మంది శాశ్వతంగా వేరే చోటుకు వలసపోయారు. పోలింగ్ కేంద్రం స్థాయి అధికారులు (బీఎల్ఓలు) అడుగుతున్నా, మరో ఏడు లక్షల మంది ఇంతవరకూ తమ పత్రాలు దాఖలు చేయలేదు. తాము ఫలానా చోట ఉంటు న్నామని రుజువులు చూపక పోయినా, బతికే ఉన్నామని చెప్పకపోయినా లేదా తగిన పత్రాలుఅందజేయక పోయినా ఈ 61 లక్షల మంది ఓటర్లు జాబితా నుంచి శాశ్వతంగా కనుమరుగవుతారు. రాష్ట్ర ఓటర్లలో వీరు 7.7 శాతం. శుక్రవారం సాయంత్రంతో వీరందరికీ గడువు ముగిసిపోయింది. సవరించిన ఓటర్ల జాబితా ఆగస్టు 1న విడుదలవుతుంది. అయితే సెప్టెంబర్ 1లోగా ఎవరైనా జాబితాలో తమ పేరు లేదని ఫిర్యాదు చేస్తే పరిశీలించి, తగిన పత్రాలున్న పక్షంలో వారిని చేర్చి తుది జాబితా విడుదల చేస్తారు. నకిలీ లేదా విదేశీయులుగా గుర్తించిన వారిని తొలగించటం కోసం ప్రారంభించిన ఈ ప్రక్రియ దేశ చరిత్రలోనే మొట్టమొదటిది. ‘పరిశుద్ధమైన’ ఓటర్ల జాబితా రూప కల్పనే తమ లక్ష్యమని జ్ఞానేశ్ చెబుతున్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని స్వాగతించాల్సిందే. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా నడవాలంటే మెజారిటీ ఆమోదం పొందిన ప్రభుత్వాలు ఏర్పడాలి.ప్రజల ఆదరణ ఉన్నవారే పాలకులు కావాలి. నకిలీ ఓటర్లు లేదా ఈ దేశ పౌరులు కానివారు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే స్థితి ఉంటే ఆ ఎన్నికలే ప్రహసన ప్రాయమవుతాయి. ఎన్నికలు సజావుగా పూర్తవుతున్నాయన్న భావన వల్లే ఫలితాలు వెలువడ్డాక అధికార మార్పిడి శాంతియుతంగా పూర్తవుతోంది. గత దశాబ్దాలతో పోలిస్తే ఎన్నికల హింస గణనీయంగా తగ్గింది. ఇలాంటి కారణాల వల్లే విదేశాల ఎన్నికలకు మన ఈసీ అధికారులు పరిశీలకులుగా వెళ్తున్నారు. వారు సూచిస్తున్న మార్పులకు ఎంతో విలువ ఉంటున్నది. కానీ గత ఏడాది, రెండేళ్లుగా ఈసీ వ్యవహార శైలిపై విమర్శలూ, ఆరోపణలూ వెల్లువెత్తు తున్నాయి. వాటిపై అసలే స్పందించకపోవటం లేదా మరిన్ని సందేహాలు కలిగే రీతిలో జవాబీ యటం రాజకీయ పక్షాలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. బిహార్ ఎన్నికల జాబితా సంగతే తీసుకుంటే సుప్రీంకోర్టు సూచించిన ఆధార్, రేషన్ కార్డు వగైరాలు పరిశీలనకు పనికి రావని అది ఎందుకు తిరస్కరించిందో అంతుపట్టదు. ఆధార్ను ప్రారంభించినప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ కార్డే ఇకపై సర్వస్వమని, దాని ఆధారంగానే పథకాల వర్తింపు అయినా, పౌరుల గుర్తింపయినాఉంటుందన్నారు. కానీ జరుగుతున్నది అందుకు విరుద్ధం. మరి విశ్వసనీయత లేని ఆధార్ను అన్నిటికీ అనుసంధానం చేయటం ఎందుకు? ఇప్పటికీ ఆ కార్డు సంపాదించటానికి సాధారణ పౌరులు తలకిందులవుతున్నారు. పుట్టిన చోటే నవజాత శిశువులకు ఆధార్ అందేలా తాజాగా కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అటువంటి కార్డు ఓటరు గుర్తింపునకు పనికిరాదని ఈసీ ఎలా చెబుతుందో అర్థంకాని విషయం. పౌరుల్ని గుర్తించటమనే ప్రక్రియ అన్యులకు ఆసాధ్యమని, కేవలం తామే సమర్థులమని ఆ సంస్థ చెప్పదల్చుకుంటే దాన్నెవరూ అంగీకరించరు.ఎన్నికల విశ్వసనీయతపై సందేహాలు తలెత్తటంపై ఆంధ్రప్రదేశ్ మొదలుకొని మహారాష్ట్ర, హరియాణాల వరకూ ఎన్ని ఉదాహరణలైనా చూపొచ్చు. ఏపీ సంగతే తీసుకుంటే... అక్కడ ఓటింగ్కు గడువు ముగిసి కేవలం ప్రాంగణంలో ఉన్న వారితో పోలింగ్ పూర్తి చేయటానికి అర్ధరాత్రి వరకూ సమయం పట్టింది. అలా వేచివున్నవారి సంఖ్య ఏకంగా 51 లక్షలు! ఇది నమ్మేలా ఉందా? ఇక పోలింగ్ శాతంపై మొదటి, చివరి ఈసీ ప్రకటనల్లోని అంకెల మధ్య 12.5 శాతం తేడావచ్చింది. ఇది గతంలో ఎప్పుడూ ఒక శాతం మించిలేదు. ఇందువల్ల సగటున ఒక్కో అసెంబ్లీ స్థానంలో అదనంగా 28,000 ఓట్లు, లోక్సభ స్థానంలో 1.96 లక్షల ఓట్లు అమాంతం పెరిగి పోయాయి. తటస్థ సంస్థల లెక్కల ప్రకారం ఇది 87 అసెంబ్లీ స్థానాల గెలుపోటముల్ని తారుమారు చేసింది! వేరే రాష్ట్రాల్లోనూ ఇలాంటి ధోరణే కనబడిందని అక్కడి విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ సందేహాలకు సక్రమమైన జవాబు చెబితే బిహార్లో చేపట్టిన ‘సర్’పై పెద్దగా అభ్యంతరాలు వచ్చేవి కాదేమో! కానీ ఆ సంస్థ తనకు తోచినప్పుడు మాట్లాడటం తప్ప జవాబుదారీతనాన్నీ, బాధ్యతాయుత వర్తననూ కనబరచటం లేదు. సందేహాలు పటాపంచలు చేద్దామన్న పట్టుదలను ప్రదర్శించటం లేదు. ఈసీ న్యాయబద్ధంగానే వ్యవహరిస్తున్నాననుకోవచ్చు. కానీ అలా అందరూ అనుకునేలా తన వ్యవహార శైలి వుండాలి. ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థకైనా ఇది తప్పనిసరి.అందునా ప్రభుత్వాల తలరాతలను మార్చే కీలకమైన వ్యవస్థగా ఉన్న ఈసీకి ఇది మరింత ప్రాణప్రదం. దేశంలో ఉత్తరప్రదేశ్, బిహార్ల నుంచి వలసలు ఎక్కువుంటాయి. అలాంటిచోటఇంత తక్కువ వ్యవధిలో ఎక్కడెక్కడినుంచో పనులు మానుకుని వచ్చి ఓటర్లుగా నమోదు చేసు కోవటానికి అవసరమైన పత్రాలు సేకరించి సమర్పించటం బడుగు జీవులకు సాధ్యమేనా? అందుకే సర్వోన్నత న్యాయస్థానం సూచించిన ఇతర ప్రత్యామ్నాయాల గురించి కూడా ఈసీ పరిశీలించాలి. ఈ మాదిరి సవరణకు దేశవ్యాప్త ఆదరణ లభించాలంటే ఇది తప్పనిసరి. -
ఏపీ, తెలంగాణలో డీలిమిటేషన్ ఇప్పట్లో కుదరదు: సుప్రీంకోర్టు
సాక్షి, ఢిల్లీ: ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. రాజ్యాంగం పరిధికి లోబడే ఏపీ విభజన చట్టం సెక్షన్లు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం తీర్పును వెలువరించింది.ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో డీలిమిటేషన్ చేయాలని సుప్రీంకోర్టులో ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పిటిషనర్.. జమ్ముకశ్మీర్లో డీలిమిటేషన్ చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఆయన పిటిషన్ను కొట్టివేసింది.రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కి లోబడి మాత్రమే ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్-26ను ప్రత్యేకంగా వేరుగా చూడలేం. ఆర్టికల్ 170 ప్రకారం 2026 తర్వాత అందుబాటులోకి వచ్చే జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ ఉంటుంది. రాజ్యాంగం పరిధికి లోబడే ఏపీ విభజన చట్టం సెక్షన్లు ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. రాజ్యాంగం పరిధిలోనే డీలిమిటేషన్ జరగాలి. లేకుంటే ఇలాంటి డిమాండ్లకు వరద గేట్లు ఎత్తినట్లే అవుతుంది. జమ్ముకశ్మీర్తో పాటు ఏపీ, తెలంగాణ డీలిమిటేషన్ను కలిపి చూడలేం అని స్పష్టం చేసింది. -
నటుడు దర్శన్.. మళ్లీ జైలుకేనా?
కన్నడ అగ్రనటుడు దర్శన్ తూగుదీప బెయిల్ వ్యవహారంపై సుప్రీం కోర్టు మళ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో న్యాయాధికారం దుర్వినియోగమైందంటూ తీవ్ర వ్యాఖ్యలే చేసింది. దర్శన్ బెయిల్ రద్దు పిటిషన్పై వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నాలుగు నెలలపాటు జైలులో గడిపాడు నటుడు దర్శన్. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్తో ఉపశమనం పొందిన సంగతి తెలిసిందే. అయితే.. దర్శన్తో సహా మరో ఏడుగురి బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ కర్నాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. జస్టిస్ పార్థీవాలా, జస్టిస్ మహదేవన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్పై వాదనలు వింది. ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి CCTV ఫుటేజ్, ఫోటోలు, రేణుకాస్వామిపై జరిగిన హింసకు సంబంధించిన ఆధారాలు చూపిస్తూ, బెయిల్ రద్దు అవసరం ఉందని లూథ్రా వాదించారు. ఇది అత్యంత క్రూరమైన హత్యగా పేర్కొంటూ, రేణుకాస్వామి శరీరంపై గాయాలు, అంగవైకల్యం, రక్తస్రావం వంటి అంశాలను వివరించారు. ఇక దర్శన్ తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబాల్, సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. అయితే.. జులై 17నాటి విచారణ సందర్భంగా జస్టిస్ పార్థీవాలా దర్శన్ తరఫు లాయర్ కపిల్ సిబాలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘హైకోర్టు తీర్పు చదివితే, వాళ్లు నిందితులను ఎలా విడుదల చేయాలో చూస్తున్నట్టు ఉంది. ఈ కేసులో సుప్రీం కోర్టు ఎందుకు జోక్యం చేసుకోకూడదని భావిస్తున్నారో వివరించాంలి’’ అని సిబాల్ను కోరారు. దానికి కపిల్ సిబాల్ స్పందిస్తూ.. హైకోర్టు తీర్పును పక్కన పెట్టి, సాక్షుల స్టేట్మెంట్లను పరిశీలించాలంటూ కోరారు. ఈ తరుణంలో ఇవాళ్టి విచారణ సందర్భంగానూ సుప్రీం కోర్టు దర్శన్ బెయిల్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇది న్యాయ అధికార వికృత వినియోగం అని వ్యాఖ్యానించింది. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించిన తెలిపిన బెంచ్.. పదిరోజుల్లో తీర్పు ఏంటన్నది వెల్లడిస్తామంది.కేసు ఏంటంటే..రేణుకాస్వామి అనే అభిమాని, దర్శన్ ప్రేయసి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. 2024 జూన్లో దర్శన్, అతని సహచరులు రేణుకాస్వామిని అపహరించి, బెంగళూరులోని షెడ్లో మూడు రోజుల పాటు హింసించారు. అనంతరం అతని శవాన్ని డ్రెయిన్లో పడేశారు. ఈ కేసులో దర్శన, పవిత్రగౌడ, మరో 15 మంది అరెస్ట్ అయ్యారు. ఆపై వాళ్లు బెయిల్ మీద బయటకు వచ్చారు. 2024 డిసెంబర్ 13న కర్ణాటక హైకోర్టు దర్శన్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక ప్రభుత్వం ఏడుగురి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. అయితే విచారణలో దర్శన్కు హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చింది. ఒకవేళ సుప్రీం కోర్టులో బెయిల్ రద్దు అయితే, దర్శన్ మళ్లీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. కేసు టైంలైన్2024 జూన్: రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయ్యారు. 2024 సెప్టెంబర్ 21: అనారోగ్య కారణంగా బెయిల్ కోసం సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.2024 అక్టోబర్ 31: కర్ణాటక హైకోర్టు ఆరు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.2024 డిసెంబర్ 13: హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. -
ముంబై పేలుళ్ల కేసులో.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే
న్యూఢిల్లీ: ముంబై రైళ్లలో పేలుళ్ల కేసులో ఇటీవలే బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులో 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును గురువారం అత్యున్నత న్యాయస్థానం నిలిపేసింది. ప్రభుత్వ పిటిషన్పై వాదనలు విన్న చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్.వి.అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. నిర్దోషులుగా విడుదలైన 12 మందిని తిరిగి అరెస్ట్ చేయాలని చెప్పలేమంది. ‘ఈ కేసులో ప్రతివాదులందరినీ విడుదల చేశారు. మళ్లీ వారిని జైలుకు తీసుకొచ్చే ప్రశ్నే లేదు. అయితే, ఈ అభ్యంతరకరమైన తీర్పును మరే ఇతర కేసులలోనూ ఉదాహరణగా పరిగణించరాదు. హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తున్నాం’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కింద ఉన్న ఇతర కేసులను హైకోర్టు తీర్పు ప్రభావితం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొనడంతో సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 189 మంది ప్రాణాలు తీసిన 2006 ముంబై రైలు పేలుళ్ల కేసులో 12 మంది దోషులను నిర్దోషులుగా ప్రకటిస్తూ సోమవారం బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం గురువారం విచారించింది.ముంబై పేలుళ్ల కేసు.. టైం లైన్2006 జూలై 11న ముంబై వెస్ట్రన్ రైల్వే లైన్లో 7 రైళ్లలో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల్లో 189 మంది మరణించగా, 827 మంది గాయపడ్డారు.2015లో ప్రత్యేక కోర్టు 5 మందికి మరణశిక్ష, 7 మందికి జీవిత ఖైదు విధించింది.జూలై 21, 2025.. హైకోర్టు విచారణలో ఆరోపణలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైంది అని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చంద్రక్ పేర్కొన్నారు.కన్ఫెషన్ స్టేట్మెంట్లు, సాక్షుల వాంగ్మూలాలు, గుర్తింపు పరేడ్ వంటి ఆధారాలు నమ్మదగినవిగా లేవని కోర్టు అభిప్రాయపడింది.తీర్పు ప్రకారం, వారు ఇతర కేసుల్లో అవసరం లేకపోతే వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.జులై 24.. బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే -
అరెస్ట్.. రిమాండ్.. ఇష్టా‘రాజ్యం’కాదు
అరెస్టు అనేది ఒక వ్యక్తికి అవమానం కలిగించేది. స్వేచ్ఛను హరించేది. జీవితాంతం అరెస్ట్కు సంబంధించిన జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. ఇది జీవితాంతం ఒక మాయని మచ్చలా మిగిలిపోతుంది. ఇది చట్టసంస్కర్తలకూ, పోలీసులకూ తెలుసు. చట్టసంస్కర్తలకు – పోలీసులకు మధ్య ఈ విషయమై ఓ పోరాటం నడుస్తోంది.కానీ పోలీస్ వ్యవస్థ ఇప్పటికీ తన పాఠాన్ని నేర్చుకోలేదు. ఆ పాఠం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లో స్పష్టంగా ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినప్పటికీ, పోలీసులు ఇంకా తమ వలస పాలన తరహా మానసిక స్థితి నుంచి బయటపడలేదు. పోలీస్ వ్యవస్థను ఇంకా ప్రజలకు మిత్రుడిగా కాకుండా వేధింపులకు, అణచివేతకు హేతువుగా భావిస్తున్నారు. అరెస్టు అనే తీవ్రమైన అధికారాన్ని వినియోగించడంలో జాగ్రత్త అవసరమని కోర్టులు ఎన్నిసార్లు హెచ్చరించినా, అది అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు.అరెస్టు చేసే అధికారం పోలీసుల వ్యవస్థకు ఒక లెక్కలేని తనాన్ని కలిగిస్తోంది. అదే విధంగా మేజిస్ట్రేట్ వ్యవస్థ విఫలమవడం కూడా దీనికి సహకరిస్తోంది. అరెస్టు అధికారం పోలీస్ అవినీతికి ఒక లాభదాయకమైన వనరుగా మారింది. ముందు అరెస్టు చేసి, తర్వాత విచారణ జరపాలనే దురదృష్టకర ధోరణి పెరిగిపోతోంది. మానవత్వాన్ని అర్థం చేసుకోలేని పోలీస్ అధికారులకు, ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టానుసారం పనిచేసే వారికి ఒక ఆచరణ సాధనంగా అరెస్టుల ప్రక్రియ మారిపోయింది.లా కమిషన్లు, పోలీసు కమిషన్లు, ఈ కోర్టు ఎన్నో తీర్పుల్లో అరెస్టు అధికారాన్ని వినియోగించేటప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ– సమాజ శాంతి మధ్య సమతౌల్యాన్ని కాపాడాల్సిన అవసరాన్ని పదే పదే గుర్తుచేశాయి. పోలీసు అధికారులు తాము అరెస్టు చేసే అధికారాన్ని కలిగి ఉన్నామని భావిస్తూ అరెస్టు చేస్తుంటారు. అరెస్టు వ్యక్తి స్వేచ్ఛను హరిస్తుంది. అవమానాన్ని కలిగిస్తుంది. కనుక మేము దీనిని భిన్నంగా భావిస్తాం. కేవలం ఒక నాన్–బెయిలబుల్ అలాగే గుర్తింపు ఇవ్వదగిన నేరం (నాన్–బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్– తీవ్రమైన) జరిగిందని పోలీసులు నమ్మడమే ఆధారంగా అరెస్టు చేయకూడదు. అరెస్టు చేయగల అధికారాన్ని కలిగి ఉండటం ఒక విషయం. అయితే, ఆ అధికారాన్ని వినియోగించడానికి న్యాయసమ్మతమైన కారణం కలిగి ఉండటం ఇంకొక విషయం.పోలీస్ అధికారుల వద్ద అరెస్టు చేసే అధికారంతో పాటు, ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో తెలుపగల న్యాయసమ్మతమైన కారణాలు ఉండాలి. కేవలం ఎవరో ఒకరు చేసిన ఆరోపణల ఆధారంగా ఒక వ్యక్తిని యాదృచ్ఛికంగా అరెస్టు చేయడం అనేది చెల్లదు. ఆరోపణల ప్రామాణికతపై కొంత విచారణ చేసిన తర్వాత పోలీసు అధికారికి న్యాయమైన సంతృప్తి వచ్చినపుడే అరెస్టు చేయడం సమంజసం, ఇది ఒక సరైన, సముచిత నిర్ణయం అవుతుంది. ఇలాంటి స్పష్టమైన న్యాయపరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అరెస్టుల విషయంలో పరిపక్వత కనబడడంలేదు. అరెస్టుల సంఖ్య తక్కువ కావడంలేదు.చివరకు పార్లమెంట్ రంగంలోకి దిగి, లా కమిషన్ 2001లో సమర్పించిన 177వ నివేదిక సిఫార్సులకు అనుగుణంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లోని సెక్షన్ 41ను ప్రస్తుత రూపంలో అమలు చేసింది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే లా కమిషన్ ఇదే సిఫార్సును 1994లో ఇచ్చిన 152,154వ నివేదికలలోనూ చేసింది. అరెస్టు చేసే విషయంలో చట్టంలో చేసిన సవరణలను పూర్తి పారదర్శకత (ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ) ఆధారంగా రూపొందించడం జరిగింది. అంటే చిన్న నేరం చేశారన్న కారణంతోనే ఒకరిని వెంటనే అరెస్టు చేయకూడదు. నేరం తీవ్రత, వ్యక్తి నుంచి వచ్చే ముప్పు, విచారణకు సహకరిస్తాడా లేదా వంటి అంశాలన్నిటిని పరిగణనలోకి తీసుకుని అరెస్టు చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాలి.వారెంటు లేకుండా పోలీసులు అరెస్టు చేసిన నిందితుడిని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(2) అలాగే సీఆర్పీసీ సెక్షన్ 57 ప్రకారం అవసరమైన ప్రయాణ సమయాన్ని మినహాయించి, ఎట్టి పరిస్థితుల్లోనూ 24 గంటల లోపల మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలి. ఇది నిందితుని హక్కు. ఒక కేసు దర్యాప్తు సమయంలో 24 గంటల కంటే ఎక్కువగా నిందితుడిని పోలీసు కస్టడీలో ఉంచాలంటే, అది సీఆర్పీసీ సెక్షన్ 167 ప్రకారం మేజిస్ట్రేట్ అనుమతితో మాత్రమే సాధ్యమవుతుంది. ఈ కస్టడీ అనుమతిని మంజూరు చేయడం అనేది చాలా బాధ్యతగల, సున్నితమైన న్యాయపరమైన కార్యం. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభావితం చేస్తుంది కాబట్టి దీన్ని అత్యంత జాగ్రత్తతో ఉపయోగించాలి. అయితే అనుభవంలో చూస్తుంటే, పలుమార్లు మేజిస్ట్రేట్లు ఈ అనుమతిని నిర్లక్ష్యంగా, మామూలుగా, అషామాషీగా మంజూరు చేస్తున్నారు.మేజిస్ట్రేట్ సీఆర్పీసీ సెక్షన్ 167 ప్రకారం నిందితుడిని రిమాండు చేయాలంటే ముందుగా ఆ అరెస్ట్ చట్టబద్ధమైనదా? రాజ్యాంగ హక్కులను పాటించడం జరిగిందా? అనే విషయాలపై సంతృప్తి చెందాలి. పోలీసు అధికారి చేసిన అరెస్ట్ సీఆర్పీసీ సెక్షన్ 41 లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా లేకపోతే, మేజిస్ట్రేట్ అతనికి రిమాండు విధించకుండా విడుదల చేయాలి. అంటే, ఒక నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచినప్పుడు, పోలీసు అధికారి అరెస్ట్ చేసిన కారణాలు, ఆధారాలు అలాగే తాను ఆ మేరకు తీసుకున్న నిర్ణయాలను మేజిస్ట్రేట్కు వివరించాలి. మేజిస్ట్రేట్ ఆ వివరాలన్నింటినీ పరిశీలించి, న్యాయపరమైన సంతృప్తి పొందిన తరువాత మాత్రమే రిమాండ్ అనుమతించాలి. మేజిస్ట్రేట్ తన ‘సంతృప్తి’ని తన ఆదేశంలో స్పష్టంగా (చిన్నగా అయినా సరే) నమోదు చేయాలి. ఇది కేవలం పోలీస్ అధికారి చెప్పిన మాటల ఆధారంగా కాకూడదు.ఉదాహరణకు, ఒక నిందితుడిని మరో నేరాన్ని చేయకుండా అడ్డుకోవడానికి, సాక్ష్యాలను ధ్వంసం చేయకుండా నిలువరించడానికి లేదా ఇతరులను బెదిరించకుండా నివారించడానికి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని పోలీస్ భావిస్తే, అలాంటి నిర్దిష్ట కారణాలు, ఆ ఆధారాలను మేజిస్ట్రేట్ ముందు సమర్పించాలి. మేజిస్ట్రేట్ వాటిని పరిశీలించి, తాను ఆయా అంశాల పట్ల సంతృప్తి పొందుతున్నట్లు లిఖితపూర్వకంగా నమోదు చేసిన తరువాత మాత్రమే రిమాండ్ విధించాలి.దోషిగా ఆరోపణలు ఉన్న వ్యక్తి శిక్షార్హత గల నేరాన్ని (శిక్ష ఏడేళ్ల కన్నా తక్కువ లేదా ఏడేళ్ల వరకు ఉండవచ్చు జరిమానాతో కలిపి లేదా కాకుండా) చేసాడని పోలీసు అధికారికి అనిపించినంత మాత్రాన, అదే ఏకైక కారణంగా అతడిని అరెస్టు చేయ కూడదు. అలాంటి సందర్భాల్లో, పోలీసు అధికారి అరెస్టు అవసరమనే విషయంలో మరింత సంతృప్తి పొందాలి. అంటే..ఆ వ్యక్తి మరిన్ని నేరాలు చేయకుండా నివారించడానికి,కేసు సమగ్రంగా దర్యాప్తు చేయడానికి,నేరానికి సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేయకుండా అడ్డుకోవడానికి,సాక్ష్యులను మోసం చేయకుండా నిరోధించడానికినిజాలు చెప్పదలచిన సాక్షులను భయపెట్టి, ప్రలోభ పెట్టి లేదా బెదిరించి నిజాలు బయటపెట్టకుండా చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికి,లేదా అతన్ని అరెస్టు చేయకపోతే కోర్టులో అవసరమైనప్పుడు అతని హాజరు విషయంలో విఫలమవుతామని భావించినప్పుడు.. మాత్రమే.. అరెస్టు చేయవచ్చు. అయితే పోలీసు అధికారి ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని తన నిర్ణయం వెనుక ఉన్న కారణాలను రాతపూర్వకంగా నమోదు చేయాలి. అంతే కాదు, అరెస్టు చేయకపోతే కూడా, ఎందుకు అరెస్టు చేయలేదన్న కారణాలను కూడా లిఖితపూర్వకంగా నమోదు చేయాల్సిన బాధ్యత ఉంది. మరింత వివరంగా చెప్పాలంటే, పోలీసు అధికారి తనను తాను ఇలా ప్రశ్నించుకోవాలి:ఎందుకు అరెస్టు? నిజంగా అరెస్టు అవసరమా? అది ఎలాంటి ప్రయోజనం ఇస్తుంది? ఏ లక్ష్యాన్ని సాధిస్తుంది?ఈ ప్రశ్నలకు సమాధానాలు తీసుకుని, పైన పేర్కొన్న నిబంధనల్లో కనీసం ఒక నిబంధన విషయంలో సంతృప్తి పొందినప్పుడే అరెస్టు అధికారం వినియోగించాలి. ఇందుకు సంబంధించిన సమాచారం, సాక్ష్యాలకు ప్రామాణికత ఉండాలి. పోలీసులు ఎవ్వరినైనా అరెస్ట్ చేయాలంటే, కేవలం ఆ వ్యక్తి నేరం చేశారని అనిపిస్తే చాలదు. సీఆర్పీసీ 41 (ఏ)లో సబ్–క్లాజ్ (ఏ) నుండి (ఈ) వరకూ పేర్కొన్న పరిస్థితులు (అంశాల్లో) ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అంశాల్లో సంతృప్తి పొందుతున్నామా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించుకుని, అరెస్ట్ అవసరం అని తార్కికంగా తేల్చుకున్నప్పుడే అరెస్ట్ జరగాలి.ఇంకొక ముఖ్యమైన నిబంధనగా భావించదగిన సీఆర్పీసీ సెక్షన్ 41ఏ.. అనవసరమైన అరెస్టులను నివారించేందుకు, అరెస్ట్కు గురవుతాయన్న భయాన్ని తగ్గించేందుకు ఉద్దేశించినది. ఈ నిబంధనను చైతన్యవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ చట్టం, 2008 (యాక్ట్ 5 ఆఫ్ 2009) ద్వారా సెక్షన్ 6 కింద అనుసంధానమైన ఈ కీలక సెక్షన్ 41ఏ ఏమి చెబుతోందో ఈ సందర్భంగా చర్చించుకోవడం సందర్భోచితం.41ఏ. పోలీసు అధికారి ముందు హాజరు కావాలనే నోటీసు :–(1) సెక్షన్ 41(1) ప్రకారం ఒక సమంజసమైన ఫిర్యాదు లేదా విశ్వసనీయ సమాచారం అందిన మీదట, ఆ వ్యక్తి కాగ్నిజబుల్ అఫెన్స్ (గుర్తింపదగిన తీవ్ర నేరం) చేశాడనే సమంజసమైన అనుమానం ఉండి, సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేని ప్రతి సందర్భంలో పోలీసు అధికారి ఆ వ్యక్తిని తాను పేర్కొన్న స్థలానికి హాజరు కావాలంటూ నోటీసు జారీ చేయాలి. ఈ నోటీసులో హాజరు కావాల్సిన తేదీ, సమయం, స్థలాన్ని స్పష్టంగా పేర్కొనాలి. ఈ విధంగా, పోలీసు అధికారికి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేని పరిస్థితుల్లో నేరుగా అరెస్ట్ చేయకుండా, ముందుగా వ్యక్తికి హాజరు కావాలనే నోటీసు జారీ చేయడం తప్పనిసరి.(2) అలాంటి నోటీసు ఎవరైనా వ్యక్తికి జారీ అయినప్పుడు, ఆ వ్యక్తి ఆ నోటీసులో పేర్కొన్న నిబంధనలకు లోబడిన విధంగా సహకరించాలి. దీనిని ఒక బాధ్యతగా పరిగణించాలి.(3) అట్టి వ్యక్తి నోటీసులో అంశాలను తూ.చా. తప్పకుండా పాటిస్తూ, ఇదే విధానాన్ని కొనసాగిస్తే, ఆ నోటీసులో పేర్కొన్న నేరానికి సంబంధించి అతడిని అరెస్టు చేయరాదు. అయితే, ఆ వ్యక్తిని అరెస్టు చేయవలసిన అవసరం ఉందన్న అభిప్రాయం పోలీసు అధికారి కలిగి ఉంటే, దానికి సంబంధించిన కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ లిఖితపూర్వక కారణాల ప్రాతిపదికనే అతడిని అరెస్టు చేయవచ్చు.(4) ఒక వ్యక్తి నోటీసులో పేర్కొన్న నిబంధనలను ఎప్పుడైనా పాటించకపోతే లేదా అతను తనకు తాను పోలీసుల ముందు హాజరుకావడానికి ఇష్టపడకపోతే, అటువంటి సందర్భాల్లో, సంబంధిత నోటీసులో పేర్కొన్న నేరానికి సంబంధించి, ఒక అర్హత కలిగిన న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులకు లోబడే, పోలీసులు అతడిని అరెస్టు చేయవచ్చు. పై విధానాన్ని బట్టి, సీఆర్పీసీ సెక్షన్ 41(1) ప్రకారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం అవసరం లేని అన్ని సందర్భాల్లో, పోలీసు అధికారి తప్పనిసరిగా నిందితుడికి ఒక నోటీసు జారీ చేయాలి. అందులో పోలీసు అధికారిని ఎక్కడ, ఎప్పుడు కలవాలో స్పష్టంగా పేర్కొనాలి. చట్టం ప్రకారం, నిందితుడు ఆ నోటీసు నిబంధనలను పాటించి పోలీసు అధికారిని కలవాలి. ఇకపోతే, నిందితుడు ఆ నోటీసు నిబంధనలను పాటిస్తే, సాధారణంగా అతన్ని అరెస్ట్ చేయకూడదు. అయితే, అరెస్టు అవసరమని పోలీసులు భావిస్తే, దానికి కారణాలు రాసి ఉంచాలి. ఈ దశలో కూడా, అరెస్టు చేయడానికి ముందు, సీఆర్పీసీ సెక్షన్ 41 లో పేర్కొన్న షరతులను పాటించాలి. న్యాయమూర్తి సమీక్షకు అది తప్పనిసరిగా లోబడి ఉండాలి.మా అభిప్రాయం ప్రకారం, మేజిస్ట్రేట్ ఉత్తర్వులు లేకుండా అలాగే వారెంట్ లేకుండా నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోలీసు అధికారికి అధికారం కల్పించిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 41 లోని నిబంధనలు నిజాయితీగా అమలయితే, పోలీసులు ఉద్దేశపూర్వకంగా లేదా తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు. ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వచ్చే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. మేము ప్రత్యేకంగా చెప్పదలచుకున్న విషయం ఏమిటంటే, సీఆర్పీసీ సెక్షన్ 41లో పేర్కొన్న కారణాలను కేసు డైరీలో యాంత్రికంగా పునరావృతం చేయడం అనే ఆచారాన్ని నిరుత్సాహ పర్చాలి. విడనాడాలి.ఈ తీర్పులో మా ప్రయత్నం ఏమిటంటే, పోలీసులు అనవసరంగా నిందితులను అరెస్ట్ చేయకుండా, మేజిస్ట్రేట్లు కూడా అనాలోచితంగా లేదా యాంత్రికంగా శిక్షించకుండా (రిమాండ్లు విధించకుండా) ఉండాలనే లక్ష్యంతోనే మేము ఈ వ్యాఖ్యలు చేస్తూ, ఆయా అంశాల అమలుకు మేము కింద సూచనలు ఇస్తున్నాము. ప్రతి పోలీస్ అధికారికి, సెక్షన్ 41(1)(బీ)(ఐఐ) కింద పేర్కొన్న నిర్దిష్ట ఉపఖండాలతో కూడిన తనిఖీ జాబితా (చెక్లిస్ట్) అందించాలి. ఈ చర్య, అరెస్టు చేసే సమయంలో అవసరమైన ప్రమాణాలను పోలీసులు గుర్తించేందుకు దోహదపడుతుంది. పోలీసు అధికారి నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నప్పుడు లేదా రిమాండ్ను కోరుతున్నప్పుడు అరెస్ట్ అవసరం అయిన కారణాలు అలాగే ఆధారాలను స్పష్టంగా వివరించాలి. అంతేకాకుండా, తనిఖీ జాబితాను సమర్పించి, దాన్ని సరిగ్గా నింపినట్టు చూపించాలి.నిందితుడిని రిమాండ్కు పంపేందుకు అనుమతి ఇచ్చే ముందు ‘పై విధంగా’ పోలీసు అధికారి సమర్పించిన నివేదికను మేజిస్ట్రేట్ పరిశీలించాలి. ఆ నివేదిక ఆధారంగా తగిన సంతృప్తిని వ్యక్తపరచి, లిఖితపూర్వకంగా నమోదుచేసిన తరువాత మాత్రమే, నిందితునికి రిమాండ్ విధించాలి. నిందితుడిని అరెస్ట్ చేయకూడదని తీసుకున్న నిర్ణయం, కేసు దాఖలైన తేదీ నుంచి రెండు వారాల్లోగా మేజిస్ట్రేట్కు పంపించాలి. అలాగే, ఒక నకలును మేజిస్ట్రేట్కి అందించాలి. అవసరమైతే, జిల్లాకు చెందిన పోలీసు సూపరింటెండెంట్ లిఖిత రూపంలో కారణాలు నమోదు చేసి, ఆ గడువును పొడిగించవచ్చు.కేసు దాఖలు చేసిన తేదీ నుంచి రెండు వారాల వ్యవధిలోగా నిందితుడికి సీఆర్పీసీ సెక్షన్ 41ఏ ప్రకారం హాజరుకై నోటీసు జారీ చేయాలి. ఈ గడువును, అవసరమైతే, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) లిఖితపూర్వకంగా కారణాలు నమోదు చేసి పొడిగించవచ్చు.పై సూచనలను పాటించడంలో వైఫల్యం ఉన్నట్లయితే, సంబంధిత పోలీసు అధికారులు శాఖాపరమైన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. దీనితోపాటు సంబంధిత న్యాయ పరిధి (జ్యూరిస్డిక్షన్) కలిగిన హైకోర్టులో దాఖలయ్యే కోర్టు ధిక్కరణ కేసులో శిక్షకు గురయ్యే అవకాశమూ ఉంటుంది.సంబంధిత కారణాలను రికార్డు చేయకుండా నిందితునికి రిమాండ్ విధిస్తే, సంబంధిత రాష్ట్ర హైకోర్టు ద్వారా సంబంధిత జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కూడా శాఖాపరమైన చర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ తీర్పు ప్రతిని రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, పోలీస్ డైరెక్టర్ జనరల్స్కు, అలాగే అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్కు పంపించాలని మేము ఆదేశిస్తున్నాము. తద్వారా వారు దీన్ని ఇతరులకు పంపించి, అమలులోకి తీసుకురాగలుగుతారు.1. అరెస్టు అనేది ఒక వ్యక్తికి అవమానం కలిగించేది. స్వేచ్ఛను హరించేది. జీవితాంతం అరెస్ట్కు సంబంధించిన జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. ఇది జీవితాంతం ఒక మాయని మచ్చలా మిగిలిపోతుంది. ఇది చట్టసంస్కర్తలకూ, పోలీసులకూ తెలుసు. చట్టసంస్కర్తలకు– పోలీసులకు మధ్య ఈ విషయమై ఓ పోరాటం నడుస్తోంది. కానీ పోలీస్ వ్యవస్థ ఇప్పటికీ తన పాఠాన్ని నేర్చుకోలేదు. ఆ పాఠం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లో స్పష్టంగా ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినప్పటికీ, పోలీసులు ఇంకా తమ వలస పాలన తరహా మానసిక స్థితి నుంచి బయటపడలేదు.2. అరెస్టు చేసే అధికారం పోలీసుల వ్యవస్థకు ఒక లెక్కలేని తనాన్ని కలిగిస్తోంది. అదే విధంగా మేజిస్ట్రేట్ వ్యవస్థ విఫలమవడం కూడా దీనికి సహకరిస్తోంది. అరెస్టు అధికారం పోలీస్ అవినీతికి ఒక లాభ దాయకమైన వనరుగా మారింది. ముందు అరెస్టు చేసి, తర్వాత విచారణ జరపాలనే దురదృష్టకర ధోరణి పెరిగిపోతోంది. మానవత్వాన్ని అర్థం చేసుకోలేని పోలీస్ అధికారులకు, ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టానుసారం పనిచేసే వారికి ఒక ఆచరణ సాధనంగా అరెస్టుల ప్రక్రియ మారిపోయింది.3. పోలీస్ అధికారుల వద్ద అరెస్టు చేసే అధికారంతో పాటు, ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో తెలుపగల న్యాయసమ్మతమైన కారణాలు ఉండాలి. కేవలం ఎవరో ఒకరు చేసిన ఆరోపణల ఆధారంగా ఒక వ్యక్తిని యాదృచ్ఛికంగా అరెస్టు చేయడం అనేది చెల్లదు.4. దోషిగా ఆరోపణలు ఉన్న వ్యక్తి శిక్షార్హత గల నేరాన్ని (శిక్ష ఏడేళ్ల కన్నా తక్కువ లేదా ఏడేళ్ల వరకు ఉండవచ్చు జరిమానాతో కలిపి లేదా కాకుండా) చేశాడని పోలీసు అధికారికి అనిపించినంత మాత్రాన, అదే ఏకైక కారణంగా అతడిని అరెస్టు చేయకూడదు. 5. ఒక నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచినప్పుడు, పోలీసు అధికారి అరెస్ట్ చేసిన కారణాలు, ఆధారాలు అలాగే తాను ఆ మేరకు తీసుకున్న నిర్ణయాలను మేజిస్ట్రేట్కు వివరించాలి. మేజిస్ట్రేట్ ఆ వివరాలన్నింటినీ పరిశీలించి, న్యాయపరమైన సంతృప్తి పొందిన తరువాత మాత్రమే రిమాండ్ అనుమతించాలి. మేజిస్ట్రేట్ తన ‘సంతృప్తి’ని తన ఆదేశంలో స్పష్టంగా (చిన్నగా అయినా సరే) నమోదు చేయాలి. ఇది కేవలం పోలీస్ అధికారి చెప్పిన మాటల ఆధారంగా కాకూడదు.6. మా అభిప్రాయం ప్రకారం, మేజిస్ట్రేట్ ఉత్తర్వులు లేకుండా, అలాగే వారెంట్ లేకుండా నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోలీసు అధికారికి అధికారం కల్పించిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 41 లోని నిబంధనలు నిజాయితీగా అమలయితే, పోలీసులు ఉద్దేశపూర్వకంగా లేదా తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు.7. ఈ తీర్పులో మా ప్రయత్నం ఏమిటంటే, పోలీసులు అనవసరంగా నిందితులను అరెస్ట్ చేయకుండా, మేజిస్ట్రేట్లు కూడా అనాలోచితంగా లేదా యాంత్రికంగా శిక్షించకుండా (రిమాండ్లు విధించకుండా) ఉండాలనే లక్ష్యంతోనే మేము ఈ వ్యాఖ్యలు చేస్తూ, ఆయా అంశాల అమలుకు కింద సూచనలు ఇస్తున్నాము.8. మా సూచనలను పాటించడంలో వైఫల్యం ఉన్నట్లయితే, సంబంధిత పోలీసు అధికారులు శాఖాపరమైన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. దీనితోపాటు సంబంధిత న్యాయ పరిధి (జ్యూరిస్డిక్షన్) కలిగిన హైకోర్టులో దాఖలయ్యే కోర్టు ధిక్కరణ కేసులో శిక్షకు గురయ్యే అవకాశమూ ఉంటుంది. – సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా -
రాత్రికి రాత్రే అడవులపై బుల్డోజర్లు ఎందుకు?: సుప్రీంకోర్టు
రాత్రికి రాత్రి 30–40 బుల్డోజర్లను పెట్టి అడవుల్లో చెట్లను నరికించేయాల్సిన అవసరం ఏమొచ్చింది?. అభివృద్ధి కోసం అడవులను నరకడం సమంజసం కాదు. అడవులను సంరక్షించాలా? లేదా మీ అధికారులను జైలుకు పంపాలా? అనే దానిపై నిర్ణయం తీసుకోండి. ..: సీజేఐ జస్టిస్ గవాయ్ :.. సాక్షి, న్యూఢిల్లీ: రాత్రికి రాత్రి 30–40 బుల్డోజర్లను పెట్టి అడవుల్లో చెట్లను నరికించేసి సుస్థిర అభివృద్ది కోసమేనని సమర్థించుకోలేరని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఉన్న అటవీ భూమిని అంత అత్యావశ్యకంగా ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అటవీ సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటూ సున్నితంగా హెచ్చరించారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలో జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ జోమలయ బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ, మేనక గురుస్వామి, బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, పి.మోహిత్రావు, మరో పిటిషనర్ తరపున ఎస్.నిరంజన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. తాజా నివేదికను దాఖలు చేశాం ప్రస్తుతం కంచ గచ్చిబౌలిలో అన్ని పనులను నిలిపివేసినట్లు ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ ధర్మాసనానికి తెలిపారు. అక్కడ ఎటువంటి పనులు జరగట్లేదని, కోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి సమగ్ర అంశాలతో కూడిన నివేదికను కోర్టులో దాఖలు చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఈ అఫిడవిట్ను పరిశీలించేందుకు తమకు సమయం కావాలని అమికస్ క్యూరీ పరమేశ్వర్, దామా శేషాద్రి నాయుడు, పి.మోహిత్రావు, ఎస్.నిరంజన్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. దీంతో వచ్చే వారం వాదనలు వింటామని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. దీనిపై స్పందించిన... ప్రతివాదులు మరింత సమయం కావాలని కోరగా.. ఆగస్టు 13కు తదుపరి విచారణను వాయిదా వేశారు. పర్యావరణ అంశాలపై సుప్రీంకోర్టుకు సహాయం చేసేందుకు కేంద్ర సాధికారక కమిటీ (సీఈసీ) స్వయంగా ఆ ప్రదేశాన్ని సందర్శించి తమకు నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. మేం అడవులను కాపాడాం ‘సరే ప్రస్తుతానికైతే అటవీ భూమిని కాపాడారు కదా?’అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ధర్మాసనం అడిగింది. అది అటవీ భూమా.. కాదా?’అనే అంశంపై మరోసారి విచారణ జరగాల్సిన అవసరం ఉందని సింఘ్వీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ.. ‘ఏదేమైనా సరే ప్రస్తుతానికి ఆ స్థలంలో చెట్లు సంరక్షించబడ్డాయి. అభివృద్ధి కోసం అడవులను నరకడం అనేది సమంజసం కాదు. సుస్థిర అభివృద్ధిని నేను వ్యక్తిగతంగా సమర్థిస్తాను. అంటే దానర్థం రాత్రికిరాత్రి 30–40 బుల్డోజర్లను పెట్టి మొత్తం అడవిని ధ్వంసం చేయడాన్ని సమర్థిస్తానని మాత్రం కాదు’అని అన్నారు. అటవీ భూమిని కాపాడకపోతే అధికారులను అక్కడే టెంపరరీ జైలుకు పంపుతామని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అడవులను సంరక్షించాలా లేదా మీ అధికారులను జైలుకు పంపాలా అనే దానిపై నిర్ణయం తీసుకోండి అని అని జస్టిస్ గవాయ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
దర్యాప్తు ప్రశ్నార్థకం కారాదు!
అంతా ఎప్పటిలాగే గడిచిపోతున్నదనుకునే వేళ హఠాత్తుగా సంభవించిన పేలుడు జనాన్ని భయకంపితుల్ని చేస్తుంది. తేరుకున్న వెంటనే అది మిగిల్చిన ప్రాణనష్టాన్నీ, విధ్వంసాన్నీ కళ్లారా చూశాక ఆ భయాందోళనలు ఎన్నో రెట్లు పెరుగుతాయి. తీవ్ర గాయాలై కాళ్లూ చేతులూ తెగిపడినవారి ఆర్తనాదాలు మిన్నంటుతాయి. సమాజంలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతాయి. నేరగాళ్లను పట్టి బంధించాలన్న డిమాండు ఊపందుకుంటుంది. తీరా దీర్ఘకాలం గడిచాక నిందితులు నిర్దోషులనీ, దర్యాప్తు లోపభూయిష్టమనీ తేలితే ప్రజానీకంలో నిరాశా నిస్పృహలు ఆవరించవా? బాధిత కుటుంబాలు మరోసారి రోదించవా? 189 మంది మరణానికీ, 816 మంది క్షతగాత్రులు కావటానికీ కారణమైన 2006 నాటి పేలుళ్ల ఘటనల్లో బొంబాయి హైకోర్టు దాదాపు 20 యేళ్లు కావస్తుండగా వెలువరించిన తీర్పు అందరినీ దిగ్భ్రాంతి పరిచింది. పోలీసులు ఈ కేసులో వెనువెంటనే 13 మందిని అరెస్టు చేశారు. వారంతా ప్రధాన నిందితులని, మరో 15 మంది పరారీలో వున్నారని తేల్చారు. నిషేధిత ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)కి చెందిన ఈ నిందితులకు పాకిస్తాన్ ఉగ్ర సంస్థ లష్కరే తొయిబాతో సంబంధ బాంధవ్యాలున్నాయని ఆరోపించారు. పేలుళ్ల ఘటనలు జరిగిన కొద్ది రోజుల్లోనే నిందితులను అరెస్టు చేయటంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. ప్రత్యేక కోర్టు 2015 సెప్టెంబర్లో ఒకరు మినహా మిగిలిన 12 మందినీ దోషులుగా నిర్ధారించింది. వారిలో అయిదుగురికి ఉరిశిక్ష, మిగిలినవారికి వేర్వేరు రకాల శిక్షలు పడ్డాయి. 2021లో ఒకరు కోవిడ్ వ్యాధితో మరణించారు. జనం కిక్కిరిసి ప్రయాణించే సాయంత్రం సమయాన్ని పేలుళ్లకు ఎంచుకుని ఏడు లోకల్ రైళ్లలో బాంబులుంచి ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.తమ ముందు విచారణకొచ్చిన కేసుల్లో న్యాయస్థానాలు సాక్ష్యాధారాలను నిశితంగా పరిశీలిస్తాయి. నిందితులుగా చూపించిన వారికి ఆ ఘటనలతో వున్న సంబంధం ఏమిటో, ఏ ప్రాతిపదికన వారే కారకులని పోలీసులు నిర్ధారణకొచ్చారో తరచి చూస్తాయి. ఎంతమంది దోషులైనా తప్పించుకోవచ్చుగానీ, ఒక్క నిరపరాధికి కూడా శిక్షపడరాదన్న సూత్రమే దానికి మూలం. ఉగ్రవాదం మన దేశానికి కొత్తగాదు. దశాబ్దాలుగా అడపా దడపా ఏదో ఒక మూల అది తలెత్తుతూనే వుంది. వివిధ సంఘటనల్లో పదులకొద్దీ మంది మరణిస్తున్నారు. ఉగ్రవాదాన్ని కట్టడి చేయడానికన్నట్టు కొత్త చట్టాలు వస్తున్నాయి. ఉన్న చట్టాలు మరింత కఠినతరమవుతున్నాయి. కానీ చాలా సందర్భాల్లో జరుగుతున్నదేమిటో 2006 నాటి ముంబై పేలుళ్ల ఉదంతమే తార్కాణం. 671 పేజీల తీర్పులో ముంబై హైకోర్టు ధర్మాసనం ప్రస్తావించిన లోటుపాట్లు గమనిస్తే ఇంత నాసిరకంగా దర్యాప్తు జరిగిందా అనిపిస్తుంది. నిందితుల ప్రమేయాన్ని సందేహాతీతంగా నిరూపించాలన్న కర్తవ్యం కన్నా, ఏదో అయిందనిపిద్దామన్న ధోరణే ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్) దర్యాప్తులో కనబడిందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించాల్సి వచ్చిందంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. పేలుళ్ల ఉదంతాలప్పుడు పౌరుల్లో ఆగ్రహావేశాలు కలుగుతాయి. ప్రభుత్వాలు సక్రమంగా పనిచేయటం లేదన్న ఆవేదన వ్యక్తమవుతుంది. రాజకీయ పక్షాల, ఇతర సంస్థల ఆరోపణలు సరేసరి. అందువల్ల దర్యాప్తు చేసేవారిపై ఒత్తిళ్లు పెరుగుతాయన్నది కూడా వాస్తవం. కానీ ఇవేవీ వారిని ప్రభావితం చేయకూడదు. ఘటనాస్థలిలో దొరికిన చిన్న చిన్న ఆధారాలతో అల్లుకుపోతూ ఒక పెద్ద కుట్రను ఛేదించినప్పుడే, నిజమైన నిందితులను పట్టుకున్నప్పుడే సమాజం సురక్షితంగా వుంటుంది. ధర్మాసనం వ్యాఖ్యానించినట్టు నిందితులను పట్టుకున్నామని, అంతా పరిష్కరించామన్న తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించటం వల్ల సమాజానికి ఒరిగేదేమీ వుండదు. తప్పించుకున్న అసలు నిందితులు మరో దురంతానికి పథక రచన చేస్తారు. నిందితులుగా ముద్రపడినవారి కుటుంబాలు దిక్కుతోచక అల్లాడతాయి. జనానికి కావాల్సింది ఆ దారుణానికి పాల్పడ్డ నేరగాళ్లను పట్టుకోవటం తప్ప ఆ పేరిట ఎవరో కొందరిని నిందితులుగా చూపటం కాదు. దేశం మొత్తాన్ని పట్టికుదిపిన కేసులో సాదాసీదా దర్యాప్తు సరికాదని పోలీసు ఉన్నతాధికారులకు అనిపించకపోవటం ఆశ్చర్యం. ఎన్నో కేసుల దర్యాప్తులో పాలుపంచుకొని, ఎంతో అనుభవాన్ని గడించిన వారంతా తమ స్థాయిలోనే ఈ లోటుపాట్లను పట్టుకోవటం అసాధ్యం కాదు. కనీసం న్యాయస్థానం ముందుకెళ్తే ఎలాంటి సందేహాలు ఎదురవుతాయోనన్న బెరుకు ఎవరిలోనూ లేకపోవటం విస్మయం కలిగిస్తుంది. సాంకేతిక కారణాలతోనే ఈ కేసు కొట్టేశారని, సుప్రీంకోర్టుకు వెళ్లి దోషులకు శిక్షపడేలా చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. సాంకేతిక కారణాల సంగతలా వుంచి నిందితుల ఒప్పుకోలు పత్రాలన్నీ దాదాపు ఒకే మాదిరి వుండటం, పొంతన లేని సాక్ష్యాలు నిందితుల అపరాధత్వంపై సందేహాలు కలిగించాయి. తాము నిర్దోషులమని నిరూపించుకునే బాధ్యత నిందితులపైనే వుండేలా చట్టాలు పదునెక్కాయి. కానీ పోలీసులు సక్రమంగా వ్యవహరించి నేరాంగీకారంతో సరిపోలే విధంగా తిరుగులేని సాక్ష్యాధారాలు చూపలేకపోతే ఆ నిబంధన కొరగానిదవుతుంది. దర్యాప్తు ప్రక్రియకు అవరోధంగా మారుతుంది. కనీసం పేలుళ్లలో వాడిన బాంబులేమిటో ఏటీఎస్ నికరంగా చెప్పలేకపోయింది. రేపు సర్వోన్నత న్యాయస్థానం ఏం నిర్ధారిస్తుందో చెప్పలేం. ఇప్పటికైతే బాధిత కుటుంబాలకు ఖేదం మిగిలింది. ఈ తీర్పు దర్యాప్తు సంస్థల తీరుతెన్నులను మరింత పదునెక్కించగలగాలి. నిజమైన నేరగాళ్లను బోనెక్కించాలి. -
కంచ గచ్చిబౌలి కేసు.. సుప్రీం కోర్టు మరో వార్నింగ్
సాక్షి, ఢిల్లీ: వివాదాస్పద హెచ్సీయూ కంచ గచ్చిబౌలి కేసు విచారణలో భాగంగా.. అధికారులకు సుప్రీం కోర్టు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. అక్కడికక్కడే తాత్కాలిక జైళ్లను ఏర్పాటు చేసి అందులోకి అధికారులు పంపాల్సి ఉంటుందని భారత ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ బుధవారం హెచ్చరించారు. కంచ గచ్చిబౌలి కేసు విచారణ ఇవాళ సుప్రీం కోర్టులో జరిగింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పరీశీలనకు సమయం కావాలని ప్రతివాదులు కోరారు. దీంతో రెండు వారాల సమయం ఇస్తూ.. తదుపరి విచారణను ఆగష్టు 13కి వాయిదా వేసింది. కోర్టు.. అయితే.. ప్రస్తుతం అడవిని కాపాడారు కదా? అని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ తెలంగాణ ప్రభుత్వం తరఫున లాయర్లను ప్రశ్నించారు. దానికి ‘‘ప్రస్తుతానికి కంచ గచ్చిబౌలి భూముల్లో అన్ని పనులు ఆపేశాం’’ అని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది బదులిచ్చారు. అభివృద్ధి కోసం అడవులను నరకడం సమంజసం కాదు. రాత్రికి రాత్రి బుల్డోజర్ పెట్టి అడవిని తీసేద్దామనుకున్నారు. సుస్థిర అభివృద్ధి కోసం నేను అడ్వొకేట్ చేస్తున్నా. అడవిని కాపాడకుంటే... అధికారులను అక్కడే టెంపరరీ జైలుకు పంపుతాం అని హెచ్చరించారాయన. -
498(ఏ) కేసుల్లో హడావుడి అరెస్ట్లు వద్దు: సుప్రీం
వరకట్న వేధింపుల కేసుల విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ 498 (ఏ) కేసు దుర్వినియోగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా 2022లో అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను సమర్థించింది. వరకట్న వేధింపుల కేసుల్లో భర్త లేదా అతడి కుటుంబ సభ్యులను తొందరపడి అరెస్ట్ చేయరాదని స్పష్టం చేసింది.దేశంలో ఇటీవలి కాలంలో వరకట్న వేధింపుల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. చిన్న చిన్న కారణాలతో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడం ఒకటైతే.. వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ భర్త, అత్తమామలు, ఇతర బంధువులపై 498 (ఏ) కేసులు వేయడమూ మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఇవి తప్పుడు కేసులని న్యాయస్థానాల్లో తేలడం, పిటిషనర్లకు హెచ్చరికలు, జరిమానాలు విధించడమూ వినే ఉంటాం. దేశ సర్వోన్నత న్యాయస్థానం సైతం 498 (ఏ) దుర్వినియోగమవుతోందని, అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది కూడా. ఈ నేపథ్యంలో మంగళవారం చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ ఎ.జి.మసీహలతో కూడిన బెంచ్ కొన్ని కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. వాటి ప్రకారం..- ఎఫ్ఐఆర్ నమోదైన తరువాత కనీసం రెండు నెలలపాటు ఎలాంటి అరెస్ట్లు చేయకూడదు. ఈ సమయం వివాద పరిష్కారానికి అవకాశం కల్పిస్తుంది.- ఎఫ్ఐఆర్ నమోదైన తరువాత ఫిర్యాదులను ముందుగా ప్రతి జిల్లాలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీలకు రిఫర్ చేయాలి. ఈ కమిటీలో శిక్షణ పొందిన మధ్యవర్తులు, న్యాయ విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, విశ్రాంత న్యాయమూర్తులు, సీనియర్ అధికారులు లేదా వారి సహచరులు ఉండాలి.- ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ సభ్యులను సాక్షులుగా న్యాయస్థానాలు పిలవకూడదు.- వివాద పరిష్కారానికి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీలో జరిగే చర్చల్లో ఇరు పక్షాల వారు కనీసం నలుగురు బంధువులు (పెద్దవాళ్లు)లను భాగస్వాములుగా చేయాలి. ఆ తరువాత ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ తదుపరి చర్యల కోసం పోలీసులు, మేజిస్ట్రేట్లకు వివరణాత్మకమైన నివేదిక సమర్పించాలి. (ఇదంతా రెండు నెలల్లోపు పూర్తి కావాలి)- ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ చర్చలు జరుగుతున్న సమయంలో పోలీసులు ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడరాదు. అయితే సాధారణ విచారణను మాత్రం పోలీసులు కొనసాగించవచ్చు. - కమిటీ సభ్యులకు, విచారణ అధికారులకు ప్రత్యేకమైన శిక్షణ కల్పించాలి.- వివాదం ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీలోనే సమసిపోతే జిల్లా జడ్జీలు క్రిమినల్ కేసులను మూసివేయవచ్చు.దుర్వినియోగం తగ్గుతుందా?498(ఏ) దుర్వినియోగం తగ్గేందుకు ఈ కొత్త మార్గదర్శకాలు ఉపయోగపడతాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో ఏమాత్రం సంబంధం లేని కుటుంబ సభ్యులు తగిన పద్ధతి లేకుండానే అనవసరమైన వేధింపులకు గురవుతూంటారని, అలాంటి వాటిని ఈ మార్గదర్శకాల అమలుతో అరికట్టవచ్చునని వారు వివరిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సుప్రీంకోర్టు తాజా నిర్ణయానికి దారి తీసిన కేసులో భర్తతోపాటు అతడి తండ్రిని కూడా సుమారు వంద రోజులపాటు జైలు నిర్బంధం అనుభవించాల్సి వచ్చింది. వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ భార్య వేసిన కేసులో హత్యాయత్నం, మానభంగం వంటి ఆరోపణలూ చేయడంతో ఆ పరిస్థితి ఏర్పడింది. -
జస్టిస్ వర్మ కోసం టాప్ లాయర్లు.. విచారణకు సీజేఐ దూరం
జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టల ఆరోపణల వ్యవహారంలో శరవేగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు పార్లమెంట్లో ఆయన్ని అభిశంసించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు.. సుప్రీం కోర్టులో ఆయన వేసిన పిటిషన్పై ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ విచారణ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ బుధవారం వైదొలిగారు. ఈ పిటిషన్ను విచారించేందుకు ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేయిస్తామని తెలిపారాయన. ‘‘బహుశా ఈ పిటిషన్ను నేను విచారణ చేయలేనుకుంటా. ఎందుకంటే.. జస్టిస్ సంజీవ్ ఖన్నా(మాజీ సీజేఐ) నేతృత్వంలో జరిగిన విచారణలో నేను భాగమయ్యాను. కాబట్టి దీన్ని వేరొక బెంచ్కు బదిలీ చేస్తా’’ అని పిటిషన్ తరఫు న్యాయవాది కపిల్ సిబాల్కు సీజేఐ స్పష్టం చేశారు. మార్చి 14వ తేదీన ఢిల్లీ హైకోర్టు జడ్జిగా విధులు నిర్వహించిన జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక బంగ్లాలో అగ్నిప్రమాదం సంభవించి.. కాలిన స్థితిలో నోట్ల కట్టలు కనిపించాయి. ‘న్యాయవ్యవస్థలో అవినీతి..’ అంటూ ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు.. ఆయన్ని హుటాహుటిన అలహాబాద్ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేసింది. అదే సమయంలో ఈ ఘటనపై దర్యాప్తునకు ముగ్గురు జడ్జిల కమిటీని ఏర్పాటు చేయించింది. ఆ కమిటీ తన నివేదికను అప్పటి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు అందించగా.. ఆయన దానిని లేఖ రూపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు పంపారు. ఆ నివేదిక ప్రకారం.. జస్టిస్ యశ్వంత్ వర్మ అవినీతికి పాల్పడ్డారని, స్వచ్ఛందంగా రాజీనామాకు ఆయన అంగీకరించలేదని, కాబట్టి ఆయన్ని తొలగించాలని ఇన్-హౌజ్ కమిటీ సిఫార్సు చేసింది. అయితే తన వాదన వినకుండానే చర్యలు తీసుకుంటున్నారని సుప్రీం కోర్టులో జడ్జి యశ్వంత్ వర్మ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఇవాళ(బుధవారం) ఆయన తరఫు లాయర్ కపిల్ సిబాల్ సీజేఐ బెంచ్ను కోరారు. జస్టిస్ వర్మ తరఫున కపిల్ సిబాల్తో పాటు ముకుల్ రోహత్గి, రాకేష్ ద్వివేది, సిద్ధార్థ్ లూథ్రాలాంటి టాప్ లాయర్లు వాదనలు వినిపిస్తుండడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ పార్లమెంట్ సెషన్లోనే ఆయనపై అభిశంసనకు చర్యలు నడుస్తున్నాయి. ఇలాంటి అభిశంసన తీర్మానం కోసం లోక్సభలో కనీసం 100 మంది, రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యులు అభిశంసన నోటీసుపై సంతకం చేయాలి. అయితే జస్టిస్ వర్మ కేసులో ఇప్పటికే 145 మంది లోక్సభ సభ్యులు, 63 మంది రాజ్యసభ సభ్యులు ఇప్పటికే అభిశంసన నోటీసుపై సంతకం చేశారు. జడ్జి తొలగింపు కోసం భారత రాజ్యాంగంలోని 124, 217, 218 ఆర్టికల్స్ ప్రకారం నోటీసు దాఖలైంది. అయితే.. ఎంపీలు ఇచ్చిన అభిశంసన నోటీసును స్వీకరించిన కొన్ని గంటలకే రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి అయిన జగ్దీప్ ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.నెక్ట్స్ ఏంటంటే.. లోక్సభ స్పీకర్ , రాజ్యసభ ఛైర్మన్ సంయుక్తంగా ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని నియమించనున్నారు. ఈ కమిటీలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఒకరు, ఓ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఓ ప్రఖ్యాత న్యాయవేత్త ఉంటారు. ఈ కమిటీకి నివేదిక సమర్పించడానికి మూడు నెలల గడువు ఇస్తారు. అయితే ఈ కమిటీ ముందు తన వాదనలు వినిపించేందుకు జస్టిస్ యశ్వంత్ వర్మకు అవకాశం(మూడుసార్లు) ఉంటుంది. గతంలో త్రీజడ్జి కమిటీ సమర్పించిన నివేదికతో పాటు జస్టిస్ వర్మ వాదనలు, సాక్ష్యాలను పరిశీలించాకే స్పెషల్ కమిటీ ఒక నివేదికను సమర్పిస్తుంది. ఈపై ఇరు సభల్లో ఆ నివేదికపై చర్చ జరిగాక.. అభిశంసన తీర్మానాన్నిప్రవేశపెడతారు. దానిని 2/3 మెజారిటీతో సభ్యులు ఆమోదించాక రాష్ట్రపతికి పంపిస్తారు. అప్పుడు ఆయన తొలగింపుపై రాష్ట్రపతి సంతకం చేసి ఉత్తర్వులు జారీ చేస్తారు. అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడుతున్నాయి. అదే సమయంలో ఆయన పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉంది. ఆగష్టు 21వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ తరుణంలో ఆయన్ని తొలగించడం ఈ సెషన్లో సాధ్యం కాకపోవచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
కన్జ్యూమర్ ఈజ్ కింగ్.. క్యూఆర్ కోడ్ వివాదంపై సుప్రీం
సాక్షి,న్యూఢిల్లీ: కన్వర్ యాత్రికులు వెళ్లే మార్గాల్లోని తినుబండారాల షాపులు, ఇతర దుకాణదారులు తమ పేర్లు బోర్డులపై ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాల్ని రద్దు చేయాలంటూ జారీ చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంపై తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. కన్వార్ యాత్ర కొనసాగుతున్న రూట్లలో షాపులు,దుకాణాల వివరాల్ని వెల్లడిస్తూ ప్రదర్శించే క్యూఆర్ కోడ్ వివాదంపై పిటిషనర్లు (అపూర్వానంద్ జా, మహువా మోయిత్రా తదితరులు) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విధానం మతపరమైన వివక్ష, అసమానత్వానికి దారి తీస్తోందని పిటిషన్లలో పేర్కొన్నారు. అయితే, ఈ పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్కే సింగ్లు క్యూఆర్కోడ్లను తొలగించాలనంటూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టేందుకు తిరస్కరించారు. ఈ సందర్భంగా క్యూర్కోడ్ వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.కన్జ్యూమర్ ఈజ్ కింగ్. వినియోగదారుడి ఏహోటల్లో ఏ వంటల్ని తయారు చేస్తున్నారు. గతంలో ఇదే హోటల్లో నాన్ వెజ్ను వడ్డించారా? అన్న విషయాలు తెలుసుకునే హక్కు ఉంది. అదే సమయంలో అయితే సదరు హోటల్ యజమానుల, ఉద్యోగుల వ్యక్తిగత వివరాలను బహిరంగంగా ప్రదర్శించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. హోటల్ యాజమానులకు రిజిస్ట్రేషన్ తప్పని సరి చేసింది -
‘నెలకు రూ. కోటి భరణం’ కేసు ఏమైందంటే..
పద్దెనిమిది నెలల కాపురానికి రూ.12 కోట్ల విలువైన భరణం ఆశించిన భార్య సుప్రీంకోర్టులో భంగపడింది. ఆ మహిళ గొంతెమ్మ కోర్కెలకు చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయి బ్రేకులేశారు. భర్త ఇవ్వజూపుతున్న ఫ్లాట్తో సరిపెట్టుకోవాలని, చదువుకున్నావు కాబట్టి ఉద్యోగంతో సొంత కాళ్లపై నిలబడే ప్రయత్నం చేయాలని చీఫ్ జస్టిస్ సుతిమెత్తగా ఆ మహిళను మందలించారు. వివరాలు ఇలా ఉన్నాయి..విడాకుల కోసం ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయి మంగళవారం కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ బి.ఆర్.గవాయి ఆ మహిళను ఉద్దేశించి వేసిన ప్రశ్నలు.. ఆ మహిళ ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి...చీఫ్ జస్టిస్: మీ డిమాండ్ (భరణం) ఏమిటి?మహిళ: ముంబైలోని అప్పులు, తనఖా ఇబ్బందుల్లేని ఇల్లు, మెయిన్టెన్స్ కోసం రూ.12 కోట్లు.చీఫ్ జస్టిస్: ‘‘... కానీ ఆ ఇల్లు కల్పతరులో ఉంది. ఒకానొక మంచి బిల్డర్ది. మీరేమో ఐటీ పర్సన్. ఎంబీఏ కూడా చేశారు. మీలాంటి వాళ్లకు డిమాండ్ ఉంది.. బెంగళూరు హైదరాబాద్లలో.. మీరెందుకు ఉద్యోగం చేయకూడదు?’’ ‘‘పెళ్లయిన తరువాత మీ దాంపత్యం 18 నెలలు సాగింది... ఇప్పుడు మీకు బీఎండబ్ల్యూ కూడా కావాలా?’’ పద్దెనిమిది నెలల వైవాహిక జీవితానికి నెలకొ రూ.కోటి చొప్పున కావాలా?’’మహిళ: కానీ అతడు బాగా ధనవంతుడు. నాకు స్కిజోఫ్రెనియా ఉందని, వివాహం రద్దు చేయాలని అతడే కోరాడు.సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ (భర్త తరఫు న్యాయవాది): ఆమె కూడా ఉద్యోగం చేయాలి. అన్నీ ఇలా డిమాండ్ చేయడం సరికాదు.మహిళ: మైలార్డ్ నేను స్కిజోఫ్రెనియా బాధితురాలి మాదిరిగా కనిపిస్తున్నానా?చీఫ్ జస్టిస్: ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయండి. అయితే ఒకటి అర్థం చేసుకోండి. మీరు అతడి తండ్రి ఆస్తి కోరలేరు!కొంత సమయం తరువాత మంగళవారం బెంచ్ మళ్లీ విచారణ చేపట్టినప్పుడు...చీఫ్ జస్టిస్: ఆదాయపన్ను పత్రాలెక్కడ? మహిళ: ఇక్కడున్నాయి.సీనియర్ న్యాయవాది మాధవి దివాన్: అన్ని పత్రాల కాపీ ఇవ్వండి... చూశారా 2015- 16లో ఆదాయం ఎక్కువ ఉంది. అప్పట్లో అతడు ఉద్యోగం చేసేవాడు.చీఫ్ జస్టిస్: 2015 - 16లో ఆదాయం ఎంత?సీనియర్ న్యాయవాది మాధవి దివాన్: రెండు కోట్ల యాభై లక్షలు, కోటి బోనస్. ఇతర వ్యాపారాలు చేసినట్లు ఆరోపణలేవీ లేవు. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. దీని గురించి మాట్లాడేందుకు ఏమీ లేదు. తాను (మహిళ) ఆక్రమించుకున్న ఫ్లాట్కు రెండు కార్ పార్కింగ్లు ఉన్నాయి. వాటి ద్వారా కూడా ఆదాయం వస్తుంది.చీఫ్ జస్టిస్: అవును అవును. ముంబైలో అన్ని రకాల ప్రదేశాలతో డబ్బు చేసుకోవచ్చు. సీనియర్ న్యాయవాది మాధవి దివాన్: తాను కోరుకుంటున్న బీఎండబ్ల్యూ కారు కూడా పదేళ్ల పాతది. ఎప్పుడో పాడుపడింది. చీఫ్ జస్టిస్: మీకు (మహిళను ఉద్దేశించి) తనఖా ఇబ్బందుల్లేని ఫ్లాట్ లభిస్తుంది అంతే. బాగా చదువుకున్నా ఉద్యోగం చేయకపోవడం మీ సొంత నిర్ణయం. కేసులో తీర్పు రిజర్వ్ చేస్తున్నాం.మహిళ: నా భర్త న్యాయవాదిని ప్రభావితం చేశారు...చీఫ్ జస్టిస్: ఎవరిని? మీకు లభిస్తున్న ఫ్లాట్తో సంతృప్తి పడితే మేలు. లేదంటే అతడు ఇవ్వజూపుతున్న రూ.నాలుగు కోట్లు తీసుకుని మంచి ఉద్యోగం చూసుకోండి.మహిళ: వారు నాపై ఎన్నో ఆరోపణలు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. నాకు ఏ ఉద్యోగం వస్తుంది?చీఫ్ జస్టిస్:... వాటన్నింటినీ మేము రద్దు చేస్తాం! మీరు అంతంత చదువులు చదువుకున్నారు. మీ కోసం మీరు అడుక్కోకూడదు. సొంతంగా సంపాదించుకుని తినాలి! మ్యాటర్ ఎండ్స్! ఆర్డర్స్ రిజర్వ్డ్!:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
రాజకీయ పోరాటాలతో మీకేం పని?.. ఈడీపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం
జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్పై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పోరాటం ఈడీ పని కాదని.. అది ముమ్మాటికీ అధికార దుర్వినియోగం కిందికి వస్తుందంటూ పేర్కొంది. కర్ణాటక ‘మూడా స్కాం’ కేసుతో పాటు.. లాయర్లకు ఈడీ సమన్లు జారీ చేసిన వ్యవహారాలను విచారించే క్రమంలో సుప్రీం కోర్టు ఈడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీ: మూడా స్కాం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి కర్ణాటక హైకోర్టు కల్పించిన ఉపశమనాన్ని ఈడీ సుప్రీం కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ ఈడీపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు సింగిల్ జడ్జి సమర్థించారని మీకు బాగా తెలుసు. అంటే ఈ కేసులో ఇప్పటికే రెండు స్థాయిల్లో న్యాయ నిర్ణయాలు వచ్చాయి. వాటిని తిరగరాయడానికి ఈడీ ప్రయత్నించడం అనవసరం. ఇది రాజకీయ ప్రమేయంలా అనిపిస్తోంది. రాజకీయాలు పోరాటాలు అనేది ప్రజల మధ్య జరగాలి. మీరు(ఈడీ) దానిని ఎందుకు ఉపయోగిస్తున్నారు? ప్రశ్నించారు. EDను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదు.. అది ప్రజాస్వామ్యానికి హానికరం. ఈ వైరస్ను దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందనివ్వకండి అని సీజేఐ వ్యాఖ్యానించారు.Let political battles be fought among the electorate.. రాజకీయ పోరాటాలు ప్రజల మధ్య జరగాలి. రాజకీయ పార్టీల మధ్య ఉన్న విభేదాలు, ఆరోపణలు, విమర్శలు కోర్టుల ద్వారా కాదు, ఓటర్ల తీర్పు ద్వారా పరిష్కరించాలి. అలాంటిది ED (Enforcement Directorate) వంటి సంస్థలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతున్నాయా?. కోర్టులను రాజకీయ వేదికలుగా ఉపయోగించకండి. ప్రజాస్వామ్యంలో ఓటర్లు మాత్రమే రాజకీయ నాయకుల భవితవ్యాన్ని నిర్ణయించాలి, న్యాయవ్యవస్థ కాదు.దురదృష్టవశాత్తూ.. మహారాష్ట్రలో ఈడీతో నాకు అనుభవం ఉంది. మాతో మీ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసేలా చేసుకోకండి అని చీఫ్ జస్టిస్ గవాయ్ హెచ్చరించారు. ఈ క్రమంలో అదనపు సోలిసిటర జనరల్ ఎస్వీ రాజు తమ పిటిషన్ను వెనక్కి తీసుకుంటామని ధర్మాసనానికి తెలిపారు. అదే సమయంలో.. భవిష్యత్తులో ఈ పిటిషన్ను ఇతర కేసుల్లో ఉదాహరించవద్దంటూ విజ్ఞప్తి చేశారాయన. దీంతో పిటిషన్ను కొట్టేస్తున్నట్లు సీజేఐ ప్రకటించారు. మరో కేసులో.. క్లయింట్లకు సలహాలు ఇస్తున్నారనే అభియోగాల కింద.. ఈడీ సీనియర్ అడ్వొకేట్లకు కొందరు సమన్లు జారీ చేసింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు .. ఇవాళ విచారణ చేపట్టింది. సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్ తోపాటు మరికొన్ని లీగల్ బాడీస్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో.. చైనా, టర్కీలలో బార్ అసోషియేషన్లు రద్దైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆందోళన వ్యక్తం చేశాయి. అదే సమయంలో మార్గదర్శకాలు జారీ చేయాలని కోరాయి. దీంతో.. న్యాయపరమైన సలహాలు ఇవ్వడం తప్పెలా అవుతుంది? అని ఈడీ తీరును సుప్రీం కోర్టు తప్పుబట్టింది. అయితే గుజరాత్లో ఓ హత్య కేసులో నిందితుడికి న్యాయవాది సలహా ఇవ్వడాన్ని ఈడీ ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ వ్యవహారంలో ఈడీని నెగెటివ్గా చూపించే ప్రయత్నం జరుగుతోందంటూ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అయితే అది వేరే సందర్భమన్న సీజేఐ బెంచ్.. న్యాయవాదిని సమన్లు ఇవ్వాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలనే విషఁఆన్ని గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో మార్గదర్శకాల రూపకల్పనకు అమీకస్ క్యూరీని నియమిస్తామంటూ వచ్చేవారానికి విచారణ వాయిదా వేసింది.మూడా (MUDA) కేసు నేపథ్యంకర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య B.M. పర్వతికి సంబంధించి మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) ద్వారా భూ కేటాయింపులపై అక్రమతల ఆరోపణలతో ప్రారంభమైంది. సుమారు 3.16 ఎకరాల భూమి పర్వతి పేరుతో ఉంది, ఇది MUDA ద్వారా డెనోటిఫై చేయబడిన తర్వాత రెసిడెన్షియల్ లేఅవుట్గా అభివృద్ధి చేయబడింది. MUDA ఈ భూమిని ఉపయోగించినందుకు పర్వతి 14 ప్లాట్లు (ప్రతి ఒక్కటి ₹2 కోట్ల విలువ) విజయనగర ప్రాంతంలో పొందారు. అయితే.. బీజేపీ, JD(S) వంటి ప్రతిపక్షాలు దీన్ని ₹4,000 కోట్ల స్కాంగా అభివర్ణించాయి. మూడా (MUDA) కేసు కోర్టు విచారణ టైం లైన్కర్ణాటక గవర్నర్ తావార్చంద్ గెహ్లాట్ 2024 ఆగస్టు 17న MUDA కేసులో ED విచారణకు అనుమతి ఇచ్చారు. తద్వారా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లైంది. ED తన Enforcement Case Information Report (ECIR) నమోదు చేసి, పర్వతి (CM భార్య) సహా ఇతరులపై ప్రీలిమినరీ విచారణ ప్రారంభించింది. ఆగస్టు 19, 2024👉 సీఎం సిద్ధరామయ్య గవర్నర్ ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.👉 ED విచారణకు అనుమతి ఇచ్చిన గవర్నర్ ఆదేశాన్ని రద్దు చేయాలని కోరారు.ఆగస్టు 29, 2024👉 హైకోర్టు ప్రత్యేక కోర్టును MUDA కేసులో తాత్కాలికంగా ఆదేశాలు ఇవ్వకుండా ఉండమని సూచించింది.👉 విచారణ తదుపరి తేదీకి వాయిదా వేసింది. సెప్టెంబర్ 12, 2024👉 హైకోర్టు విచారణ పూర్తిచేసి తీర్పును రిజర్వ్ చేసింది.👉 న్యాయమూర్తి M. నాగప్రసన్న రెండు పక్షాల వాదనలు ఆఖరి రోజులోనే ముగించాలని స్పష్టం చేశారు.సెప్టెంబర్ 24, 2024👉 కర్ణాటక హైకోర్టు సీఎం సిద్ధరామయ్య పిటిషన్ను తిరస్కరించింది.👉 గవర్నర్ అనుమతి చట్టబద్ధమైనదే అని తీర్పు ఇచ్చింది.2025 మార్చి 7కర్ణాటక హైకోర్టు సిద్ధరామయ్య సతీమణి B.M. పార్వతికి ఉపశమనంMUDA భూ కేటాయింపు కేసులో, ED జారీ చేసిన సమన్లను హైకోర్టు రద్దు చేసింది. న్యాయమూర్తి M. నాగప్రసన్న ఈ తీర్పును ఇచ్చారు, పార్వతి, మంత్రి బైరతి సురేష్ దాఖలు చేసిన పిటిషన్లను విచారించి, ED చర్యలు చట్టపరంగా నిలబడవని తేల్చారు. Money Laundering Act (PMLA) ప్రకారం, “proceeds of crime” అనే అంశం స్పష్టంగా లేకపోతే, ED విచారణ కొనసాగించలేదని కోర్టు అభిప్రాయపడింది. పార్వతి 14 ప్లాట్లు స్వచ్ఛందంగా తిరిగి అప్పగించడంతో, ఆర్థిక లాభం పొందలేదని కోర్టు గుర్తించింది. సమన్లు జారీ చేయడం చట్టబద్ధంగా కాదని తీర్పు ఇచ్చారు.జూలై 21, 2025👉 సుప్రీం కోర్టు ఈ కేసులో ED అప్పీల్ను తిరస్కరించింది.👉 “రాజకీయ పోరాటాలు ప్రజల మధ్య జరగాలి, కోర్టుల్లో కాదు” అని CJI BR గవాయ్ వ్యాఖ్యానించారు. -
‘దత్త’ పుత్రులు.. నిరీక్షిస్తున్నారు
‘దత్తత ప్రక్రియలో దీర్ఘ జాప్యం కారణంగా దత్తత తీసుకోవడానికి చట్టబద్ధంగా అర్హులని ప్రకటించిన పిల్లలకు డిమాండ్ పెరిగింది, దీనివల్ల దత్తత కోసం పిల్లలను అక్రమంగా తరలించే ప్రమాదం ఉంది’– ఈ ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలివి. దేశంలో దత్తతకు చట్టపరంగా ఏ అడ్డంకులూ లేని బిడ్డ కోసం దంపతులు.. సగటున మూడేళ్లకుపైగా వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇలా ఆలస్యమయ్యేకొద్దీ కొన్నాళ్లకు వాళ్లకు దత్తతపై పూర్తిగా ఆసక్తిపోయే అవకాశం ఉంటుంది. ఇది అనాథలైన చిన్నారుల పాలిట శాపంలా మారుతుంది. వా రికొక కుటుంబం ఏర్పడే అవకాశాన్ని కాలరాస్తోంది. చిన్నారుల దత్తత ప్రక్రియను పూర్తి పారదర్శకంగా ఆన్లైన్లోనే ‘కేరింగ్స్’పోర్టల్ ద్వారా నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దత్తత విధి విధానాలు శీఘ్రంగా అమలయ్యేందుకు కేంద్ర దత్తత వ్యవహారాల ప్రాధికార సంస్థ (కారా)ను ఏర్పాటుచేసింది. ఇది గత కొన్నేళ్లుగా దత్తతలను సమర్థంగా నిర్వహించలేకపోతోంది అనే విమర్శలు ఎదుర్కొంటోంది. పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, పరిమిత సంఖ్యలో మాత్రమే పిల్లలను దత్తత ఇవ్వటానికి చట్టబద్ధమైన అనుమతులు పొందగలుగుతోంది. దీనిపై గతంలోనే పార్లమెంటరీ కమిటీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. దరఖాస్తుల వెల్లువ సమాచార హక్కు దరఖాస్తుల ద్వారా వెల్లడైన తాజా సమాచారం ప్రకారం 2021లో 26,734 మంది తల్లిదండ్రులు దత్తత కోసం ‘కారా’పోర్టల్లో నమోదు చేసుకోగా, 2,430 మంది పిల్లలు మాత్రమే చట్టబద్ధమైన దత్తతకు సిద్ధంగా ఉన్నారు. అంటే, ప్రతి బిడ్డకు 11 మంది తల్లిదండ్రులు ఎదురు చూశారన్నమాట. 2025 జూలై 19 నాటికి, దత్తత తీసుకునేందుకు నమోదు చేసుకున్న తల్లిదండ్రుల సంఖ్య 36,433కి, పిల్లల సంఖ్య 2,777కి పెరిగింది. ప్రస్తుతం దత్తతకు యోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డకు 13 మంది తల్లిదండ్రులు ఉన్నారు. 2025–26లో జూలై 19 వరకు 1,365 మంది పిల్లలు దత్తుకు వెళ్లారు.మూడేళ్లకు పెరిగిన జాప్యం 2025లో దేశం మొత్తం మీద దత్తత కోసం పేర్లు నమోదు చేసుకున్న తల్లిదండ్రుల్లో 50 శాతం కంటే ఎక్కువ మంది తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్నారు. దత్తతకు న్యాయపరమైన అన్ని ప్రక్రియలు పూర్తవటానికి 2017లో ఒక సంవత్సరంగా ఉన్న సగటు ఆలస్యం 2022 నాటికి మూడేళ్లకు, ప్రస్తుతం దాదాపు 3.5 సంవత్సరాలకు పెరిగింది. 34 శాతం వారే! ప్రస్తుతం దత్తత కోసం సిద్ధంగా ఉన్న పిల్లల్లో దాదాపు 34 శాతం మంది 14–18 సంవత్సరాల వయసువారే. ‘దత్తత తీసుకుంటున్న తీరును పరిశీలిస్తే.. భారతీయ తల్లిదండ్రులు సాధారణంగా పెద్ద పిల్లలు, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను దత్తత తీసుకోవడానికి ఇష్టపడటం లేదని అర్థమవుతోంది’అని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. అర్హత ప్రక్రియల్లో అస్పష్టత జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, భద్రత) చట్టం (2021) ప్రకారం బాలల సంరక్షణ సంస్థలలో (సీసీఐలు) ఉండే పిల్లలను దత్తతకు అనుమతిస్తారు. కానీ, ఆయా రాష్ట్రాల్లో సీసీఐలలో ఉండే పిల్ల ల సంఖ్యకు, దత్తతకు అర్హులుగా ప్రకటించే పిల్లల సంఖ్యకూ చాలా వ్యత్యాసం ఉంటోంది. పిల్లల సంఖ్య ఎక్కు వ ఉన్నప్పటికీ.. దత్తతకు అర్హులైన వారి సంఖ్య తక్కు వగా ఉంటోంది. 2025లో 22,000 కంటే ఎక్కువ మంది పిల్లలు సీసీఐలలో ఉన్నారని, చట్టబద్ధంగా దత్తతకు అర్హత ఉన్న పిల్లల సంఖ్య కంటే ఇది 8.5 రెట్లు ఎక్కువ అనీ సమాచార హక్కు డేటా చూపిస్తోంది. సీసీఐలలోని పిల్లల్లో అనాథలు, తల్లిదండ్రులు వదిలేసినవారు, బంధువులు తెచ్చి అప్పగించినవారు, సంరక్షకులు లేని పిల్లలు ఉంటారు. వారిలో దత్తతకు అర్హమైన పిల్లల్ని ప్రక టించే ప్రక్రియ ఇంకా అస్పష్టంగానే ఉంది. సంరక్షకులు / తల్లిదండ్రులు ఉండి కూడా ఏనాడూ తమ పిల్లల ముఖం చూడ్డానికి రాకపోవటం వల్ల కూడా చట్టబద్ధంగా వారిని దత్తత ఇవ్వటంలో అవాంతరాలు ఎదురౌతున్నాయి. -
జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపునకు ముహూర్తం ఖరారు?
సాక్షి,న్యూఢిల్లీ: కాలిన నోట్ల కట్టల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు పదవి నుంచి ఉద్వాసన పలికే సమయం ఆసన్నమైంది.రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందే జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసన ద్వారా తొలగించే ప్రక్రియపై 100 మంది పార్లమెంట్ సభ్యులు సంతకాలు పెట్టినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా ప్రకటించారు.ఇంట్లో కాలిన నోట్ల కట్టలు.. విచారణకు సుప్రీంఈ ఏడాది మార్చి నెలలో జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీ ఎత్తున కాలిన నోట్ల కట్టలు వెలుగులోకి వచ్చాయి. దీంతో జస్టిస్ వర్మపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే అంశంపై సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీతో విచారణ చేపట్టింది. ఈ విచారణలో కాలిన నోట్ల కట్టలు జస్టిస్ యశ్వంత్ వర్మవేనన్న సాక్షులు,ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.అభిశంసన చర్యలువీటిని పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం నియమించిన త్రిసభ్య కమిటీ సైతం జస్టిస్ వర్మను అభిశంసన ద్వారా తొలగించాలని సిఫారసు చేసింది. త్రిసభ్య కమిటీ నిర్ణయాన్ని తప్పుబట్టిన జస్టిస్వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కమిటీ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని అత్యున్నత న్యాయ స్థానంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తనపై అభిశంసన చర్యలు ప్రారంభించాలంటూ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా చేసిన సిఫార్సులను సైతం సవాలు చేశారు.త్రిసభ్య కమిటీ రిపోర్టుపై సవాలునోట్ల కట్టల వ్యవహారంలో తన వాదన పూర్తిగా వినకుండానే నివేదిక రూపొందించారని అంతర్గత ఎంక్వైరీ కమిటీ తీరును ఆయన తప్పుపట్టారు. ఈ దర్యాప్తులో లోపాలు ఉన్నాయని స్పష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు కమిటీకి లభించలేదన్నారు.ఏకమైన అధికార,ప్రతి పక్షాలు తనను దోషిగా తేల్చాలన్న ముందస్తు వ్యూహంతోనే నివేదిక సిద్ధంగా చేశారని విమర్శించారు. తనపై దర్యాప్తు ప్రక్రియ మొత్తం రాజ్యాంగవిరుద్ధంగా సాగిందని, తన ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. నివేదికపై తాను అధికారికంగా స్పందించకముందే దాన్ని మీడియాకు లీక్ చేశానని, తన ప్రతిష్టను దెబ్బతీయాలన్న కుట్ర జరిగిందని జస్టిస్ వర్మ మండిపడ్డారు. అందుకే ఈ నివేదికను రద్దు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. అయినప్పటికీ జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టేందుకు అధికార,ప్రతి పక్షాలు ఏకమయ్యాయి. అభిశంసన తీర్మానం ద్వారాభారత రాజ్యాంగం ప్రకారం.. అవినీతి ఆరోపణల ఆధారంగా రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా మాత్రమే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పదవి నుండి తొలగించవచ్చు.అటువంటి ఘటనల్లో అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యుల మద్దతు లేదంటే లోక్సభలో కనీసం 100 మంది సభ్యుల మద్దతు ఉంటేనే ఆమోదిస్తారు. ఈ తీర్మానాన్ని ఆమోదించడానికి సభలోని మూడింట రెండు వంతుల ఎంపీల మద్దతు అవసరం.మంత్రి కిరణ్ రిజిజు ఏమన్నారంటే?ఇప్పుడు ఇదే పద్దతిలో జస్టిస్ వర్మ తొలగింపునకు అధికార,ప్రతిపక్ష లోక్ సభ,రాజ్య సభ సభ్యులు సంతకాలు పెట్టారు. న్యాయవ్యవస్థలో అవినీతి అనేది చాలా సున్నితమైన విషయం. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉన్నాయి. వర్షాకాల సమావేశంలో జస్టిస్ యశ్వంత్ వర్మపై ప్రభుత్వం అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్నాం’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అభిశంసన తీర్మానంలో అనూహ్య పరిణామంఈ అభిశంసన తీర్మానంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంటు సమావేశాల్లో బీజేపీ, కాంగ్రెస్లు పరస్పరం విభేదిస్తుంటాయి. కానీ న్యాయవ్యవస్థలో అవినీతి వంటి సున్నితమైన అంశంపై పార్టీలకు అతీతంగా స్పందించడం, ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిలుస్తూ.. 100 మంది ఎంపీలు అభిశంసన తీర్మానంపై సంతకాలు చేయడం, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సహా 35 మంది కాంగ్రెస్ ఎంపీలు సైతం సంతాలు చేసినట్లు సమాచారం. -
గవర్నర్ను క్షమాభిక్ష కోరవచ్చు
న్యూఢిల్లీ: కాబోయే భర్తను హత్య చేసిన కేసులో దోషిగా తేలిన కర్ణాటక మహిళ శుభాకు సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. కర్ణాటక గవర్నర్ నుంచి క్షమాభిక్ష కొరేందుకు ఆమెకు అనుమతి ఇచ్చింది. సామాజిక పరిస్థితులు, ఒత్తిళ్ల కారణంగా మహిళలు కొన్ని సందర్భాల్లో నేరాలకు పాల్పడుతున్నారని న్యాయస్థానం పేర్కొంది. శుభా 20 ఏళ్ల వయసులో కాలేజీలో చదువుకుంటున్న సమయంలో నిశ్చితార్థం జరిగింది. ఈ పెళ్లి ఆమెకు ఎంతమాత్రం ఇష్టంలేదు. కుటుంబ సభ్యుల ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చింది. కాబోయే భర్తను హత్య చేస్తే తనకు ఈ పెళ్లి తప్పుతుందని భావించింది. తన మిత్రులైన అరుణ్ వర్మ, వెంకటేశ్, దినేశ్తో కలిసి అతడిని హత్య చేసింది. శుభాపై నేరం రుజువైంది. అయితే, బలవంతంగా పెళ్లి చేసేందుకు పెద్దలు ప్రయత్నించడంతో విధిలేని పరిస్థితుల్లో అతడిని చంపాల్సి వచ్చిందని శుభా మొరపెట్టుకుంది. గవర్నర్ను క్షమాభిక్ష కొరేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అరవింద్ కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. శుభా వినతి పట్ల సానుకూలంగా స్పందించింది. -
రష్యా మహిళ, చిన్నారి జాడ తక్షణమే కనిపెట్టండి
న్యూఢిల్లీ: రష్యా మహిళ, ఆమె కుమార్తె కనిపించకుండా పోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీని వెనుక కుట్ర కోణం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా ఆమెకు ఎవరో సాయం చేసి ఉండొచ్చని పేర్కొంది. లుకౌట్ నోటీసు జారీ చేసి, తల్లి, కుమార్తె జాడను త్వరగా తెలుసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సైకత్ బసు అనే వ్యక్తి వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా శుక్రవారం జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్మల్యా బాగ్చిల ధర్మాసనం పైవిధంగా స్పందించింది. రష్యా పౌరురాలైన తన మాజీ భార్య విక్టోరియా బసు, నాలుగున్నరేళ్ల చిన్నారి ఈ నెల 7వ తేదీ నుంచి కనిపించడం లేదంటూ సైకత్ బసు పేర్కొన్నారు. పోలీసులు లుఔట్ నోటీసు జారీ చేశారని, రష్యా ఎంబసీతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి ధర్మాసనానికి నివేదించారు. ఈ నెల 6న ఆమెకున్న కెనరా బ్యాంక్ అకౌంట్లో కేవలం రూ.169 మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలిసిందన్నారు. ఆమె దేశం విడిచి వెళ్లినట్లు ఎయిర్పోర్టుల్లో నమోదు కాలేదని వివరించారు. స్పందించిన ధర్మాసనం..విక్టోరియా బసు వేరే మార్గాల ద్వారా దేశం దాటి వెళ్లి ఉండొచ్చని అభిప్రాయపడింది. అన్ని రైల్వే స్టేషన్లు, ఇతర రవాణా వ్యవస్థల నుంచి సమాచారం సేకరించాలని, ఢిల్లీని విడిచారా లేదా నిర్థారించాలని ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే వారి జాడ కనుగొనాలంది. సుప్రీంకోర్టు గత ఆదేశాల మేరకు సైకత్, విక్టోరియా దంపతులు చిన్నారి సంరక్షణను వారంలో చెరో మూడు, నాలుగు రోజులు తీసుకోవాల్సి ఉంది. అయితే, ఈ నెలారంభంలో ఢిల్లీలోని రష్యా ఎంబసీ వెనుక వైపు నుంచి ఓ దౌత్యాధికారి వెంట కూతురిని తీసుకుని వెళ్లిన విక్టోరియా జాడ మళ్లీ కనిపించలేదని సైకత్ పేర్కొన్నారు. కుమార్తె సహా ఆమె భారత్ విడిచి వెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
భూమికి ఉద్యోగం కేసు.. లాలూకు చుక్కెదురు
న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో(భూమికి ఉద్యోగం) ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్కు చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్పై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అంతేకాదు.. ఈ కేసులో ట్రయల్ కోర్టు విచారణను నిలిపివేసేలా ఢిల్లీ హైకోర్టుకు ఆదేశాలివ్వాలన్న ఆయన అభ్యర్థననూ శుక్రవారం తోసిపుచ్చింది. దీంతో ఈ కేసులో విచారణ యధాతథంగా కొనసాగనుంది.ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించాని కోరుతూ లాలూ ప్రసాద్ ముందుగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. విచారణపై స్టే విధించడానికి ఎలాంటి కారణలూ లేవని తెలిపింది. ఆపై ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఇవాళ ఆయన పిటిషన్ను పరిశీలించిన సుప్రీం కోర్టు ద్విససభ్య ధర్మాసనం తోసిపుచ్చుతున్నట్లు వెల్లడించింది.యూపీఏ ప్రభుత్వ హయాంలో.. 2004 నుంచి 2009 మధ్య లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో భారతీయ రైల్వే తరఫున మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో వెస్ట్ సెంట్రల్ జోన్లో గ్రూప్-డి ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు సీబీఐ 2022లో అభియోగాలు నమోదు చేసింది. అక్రమంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు లాలూ, అతని కుటుంబ సభ్యులకు భూములు బహుమతిగా ఇచ్చారని సీబీఐ అభియోగాలు మోపింది. ఇదే వ్యవహారంపై మనీలాండరింగ్ వ్యవహారం (PMLA) కింద కేసు నమోదు చేసిన ఈడీ.. లాలూ కుటుంబ సభ్యులకు చెందిన 25 చోట్ల సోదాలు జరిపింది. ఆ సమయంలో.. రూ.6 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేసింది.అయితే.. రాజకీయ దురుద్ధేశ్యంతోనే తనపై దాదాపు దశాబ్దన్నర తర్వాత కేసు నమోదు చేశారని లాలూ అంటున్నారు. -
కమిటీ నివేదికను రద్దు చేయండి..జస్టిస్ యశ్వంత్ వర్మ
న్యూఢిల్లీ: నోట్ల కట్టల విషయంలో అంతర్గత విచారణ కమిటీ నివేదికను సవాలు చేస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నివేదికను రద్దు చేయాలని కోరుతూ గురువారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తనపై అభిశంసన చర్యలు ప్రారంభించాలంటూ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా చేసిన సిఫార్సులను సైతం సవాలు చేశారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని, సుప్రీంకోర్టును ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఎంక్వైరీ కమిటీ నివేదికను రద్దు చేయాలంటూ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించడం అత్యంత అరుదైన ఘటన అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఒకవైపు ఏర్పాట్లు జరుగుతుండగా, మరోవైపు ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. నోట్ల కట్టల వ్యవహారంలో తన వాదన పూర్తిగా వినకుండానే నివేదిక రూపొందించారని అంతర్గత ఎంక్వైరీ కమిటీ తీరును ఆయన తప్పుపట్టారు. ఈ దర్యాప్తులో లోపాలు ఉన్నాయని స్పష్టంచేశారు. తనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు కమిటీకి లభించలేదన్నారు. తనను దోషిగా తేల్చాలన్న ముందస్తు వ్యూహంతోనే నివేదిక సిద్ధంగా చేశారని విమర్శించారు. తనపై దర్యాప్తు ప్రక్రియ మొత్తం రాజ్యాంగవిరుద్ధంగా సాగిందని, తన ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. నివేదికపై తాను అధికారికంగా స్పందించకముందే దాన్ని మీడియాకు లీక్ చేశానని, తన ప్రతిష్టను దెబ్బతీయాలన్న కుట్ర జరిగిందని జస్టిస్ వర్మ మండిపడ్డారు. అందుకే ఈ నివేదికను రద్దు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. అభిశంసన తీర్మానం ప్రవేశపెడతాం: మేఘ్వాల్న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన కోసం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీర్మానం ప్రవేశపె ట్టనున్నట్లు న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ శుక్రవారం వెల్లడించారు. దీనిపై నిర్ణయం తీసు కోవాల్సింది ఎంపీలేనని, ఇందులో ప్రభుత్వం పాత్ర ఏమీ ఉండదని తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు లేదా హై కోర్టు జడ్జిని పదవి నుంచి తొలగించే హక్కు పార్లమెంట్కు ఉందని గుర్తుచేశారు. అభిశంసన తీర్మానానికి లోక్సభలో కనీసం 100 మంది, రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరమని అన్నారు. -
సుప్రీంకోర్టు ఉత్తర్వు రివర్స్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణ యం తీసుకుంది. ఏడాది క్రితం తాము స్వయంగా ఇచ్చిన ఉత్తర్వునే మార్చేసింది. 13 ఏళ్ల బాలుడి మానసిక పరిస్థితిని, అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అతడిని తల్లికే అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ బాలుడిని తండ్రి కస్టడీకి అప్పగిస్తూ 2024 ఆగస్టులో ఇచ్చిన ఉత్తర్వును న్యాయస్థానం మార్చింది. కేరళకు చెందిన యువతి, యువకుడికి 2011లో వివాహం జరిగింది. వారికి 2012లో కుమారుడు జన్మించాడు. తర్వాత కాపురంలో విభేదాలు తలెత్తడంలో వేర్వేరుగా జీవిస్తున్నారు. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుమారుడు తల్లి వద్దే ఉండేలా, తండ్రి నెలకు రెండు రోజులు చూసేలా ఒప్పందం కుదిరింది. 2015లో వారికి విడాకులు మంజూరయ్యాయి. యువతి మళ్లీ పెళ్లిచేసుకుంది. ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు. మొ దటి భర్త నాలుగేళ్లుగా ఆమె మొదటి కుమారుడిని చూడడానికి రాలేదు. తాను మలే షియా వెళ్లిపోతున్నానని, మొదటి బిడ్డను కూడా తీసుకెళ్తానని, ఇందుకు అంగీకరిస్తూ సంతకం చేయాలని మొదటి భర్తను 2019 లో కోరింది. అందుకు అతడు నిరాకరించా డు. ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన బిడ్డను తనకే అప్పగించాలని కోరాడు. కానీ, బిడ్డను తల్లికే అప్పగిస్తూ 2022లో ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ మొదటి భర్త కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. హైకోర్టు అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బిడ్డను తండ్రి కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ తల్లి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గత ఏడాది విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేరళ హైకోర్టు తీర్పును సమరి్థంచింది. కుమారుడు తండ్రి వద్దే ఉండొచ్చని ఉత్తర్వు జారీ చేసింది. దాంతో ఈ ఉత్వర్వును పునఃసమీక్షించాలని కోరుతూ తల్లి మరోసారి పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వును రివర్స్ చేస్తున్నట్లు తేల్చిచెప్పింది. కుమారుడు తల్లి కస్టడీలోనే ఉండొచ్చని తేల్చిచెప్పింది. ఈ సమయంలో అతడికి తల్లి అవసరం చాలా ఉందని అభిప్రాయపడింది. చిన్న వయసులో బిడ్డకు తల్లే అసలైన సంరక్షురాలు అని న్యాయస్థానం పేర్కొంది.