గత ప్రభుత్వంలో 11,782 లేఅవుట్లలో పేదల ఇళ్ల నిర్మాణం | Construction of poor houses in 11782 layouts in previous government | Sakshi

గత ప్రభుత్వంలో 11,782 లేఅవుట్లలో పేదల ఇళ్ల నిర్మాణం

Jun 20 2024 5:22 AM | Updated on Jun 20 2024 5:22 AM

Construction of poor houses in 11782 layouts in previous government

6.8 లక్షల సాధారణ ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు 

1.05 లక్షల టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందజేశారు

గత ప్రభుత్వ ఇళ్ల నిర్మాణ పథకాన్ని కొనసాగిస్తాం

గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం రాష్ట్రంలో 11,782 లేఅవుట్లలో పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టిందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ­సా­­రథి చెప్పారు. ఐదేళ్లలో 6.8 లక్షల సాధా­రణ ఇళ్ల నిర్మా­ణం పూర్తి చేశారని, 1.05 లక్షల టిడ్కో ఇళ్లను మౌలిక సదుపా­యా­లతో పూర్తి చేసి లబ్ధి­దా­­రులకు అందజేసి­నట్టు వివరించారు.

 బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి పార్థసారథి విలేక­రులతో మాట్లా­డుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సీఆర్‌డీఏ పరిధిలో పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల అంశం కోర్టులో ఉంద­న్నారు. వైఎ­స్సా­ర్, జగనన్న కాల­నీల పేరు మార్పు­­పై ఆలోచించి నిర్ణయం తీసు­కుంటామ­న్నారు. ఇళ్ల నిర్మాణ పథకాన్ని కొనసాగిస్తామ­న్నారు. 

పేదలకు ఇళ్ల స్థలా­లకు సేకరించిన భూము­లను 2013 భూసే­కరణ చట్టం ప్రకా­రం సేకరించారో లేదో విచారణ జరుపుతా­మని, నిబంధనలు అతి­క్రమించినట్టు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో జర్న­లి­స్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రి­యను వేగ­వంతం చేసి సకాలంలో అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

లేదంటూనే.. అవునంటూ
అయితే వైఎస్సార్‌­సీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదంటూనే 11,782 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణం చేపట్టిందని మంత్రి ఒప్పు­కున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద 31 లక్షలకుపైగా లబ్ధిదారులకు స్థలాలను అందించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Advertisement