
సాక్షి, తూర్పుగోదావరి : లక్షలాది మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లనే సాధ్యమైందని మంత్రి కన్నబాబు అన్నారు. ప్రజల గుండెల్లో ఉండేలా ఆలోచన చేసిన నాయకుడని కొనియాడారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మాటిస్తే.. ఎంత కష్టమైనా ఆ మాటకు కట్టుబడే నాయకుడు సీఎం జగన్. మీ పిల్లలకు పుట్టింటి ఆస్తిలా ఇళ్ల స్థలాలను సీఎం జగన్ ఇచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన స్థలాన్ని అమ్మవద్దు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment