kannababu
-
బాబు పాలనలో ప్రజలకు రోజుకో షాక్.. కూటమిపై కన్నబాబు కామెంట్స్
-
‘స్కిల్’ దొంగలు మరోసారి దొరికిపోయారు: కన్నబాబు
సాక్షి,కాకినాడజిల్లా: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దొంగలు మరోసారి దొరికిపోయారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత కురసాల కన్నబాబు అన్నారు. ఈ వ్యవహారంలో అవినీతి ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) హైకోర్టుకు స్పష్టంగా తెలిపిందని చెప్పారు. కాకినాడ జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో కన్నబాబు ఆదివారం(అక్టోబర్ 27) మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ఎన్ని తప్పులు చేసినా ఆయనను కాపాడే వ్యవస్ధ ఉంటుంది. స్కిల్ స్కామ్లో చంద్రబాబు సమ్మతితో డొల్ల కంపెనీలు సృష్టించి వందల కోట్లు కొల్లగొట్టారని అందరికీ తెలుసు. ఈ కేసు కోల్డ్ స్టోరేజీలో పెట్టేసిన సందర్భంలో ఈడీ ముందుకు వచ్చింది. ఈ స్కామ్లో అవినీతి నిజం అని ఈడీ హైకోర్టుకు స్పష్టంగా తెలిపింది. ఈడీ కోర్టులో ఫైల్ చేసిన కౌంటర్ చంద్రబాబుకు ఆయన మద్దత్తుదారులకు చెంపపెట్టు లాంటిది. ఈడీ కౌంటర్ పై చంద్రబాబు ఏం చెబుతారు అని ప్రశ్నిస్తున్నాం. అన్స్టాపబుల్ పేరుతో చంద్రబాబు,బాలకృష్ణ పెద్ద షో చేశారు. ఈడీ ఎవరి ప్రభుత్వంలో పని చేస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు? బీజేపీ,జనసేన నాయకులు ఈడీ కౌంటర్పై ఏం చెబుతారు. చంద్రబాబు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనుకుంటున్నారు. స్కిల్ స్కామ్లో ఎన్ని సూట్కేసు కంపెనీలు రిజిస్టర్ చేశారో ఈడీ చెప్పింది. బోగస్ కంపెనీలు, షెల్ కంపెనీలతో డబ్బులు కాజేశారని ఈడీ వివరించింది.చంద్రబాబు కోసం జరిగిన స్కామ్ ఇది. స్కిల్ స్కామ్ సొమ్ములు ఎక్కడికి వెళ్ళాయి? హైకోర్టులో ఈడీ కౌంటర్ వేయడం ఒక కీలమైన అంశం. స్కిల్ స్కామ్ లో రూ.330 కోట్లు అవినితి జరిగిందని కాగ్ తేల్చింది’అని కన్నబాబు గుర్తుచేశారు. ఇదీ చదవండి: దీపావళికి కూటమి ప్రభుత్వం ఇచ్చే కానుక ఇదేనా.. -
ఈ సంక్షేమం ఆగకూడదు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాతే రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమం అందుతోందని, అట్టడుగు వర్గాల సామాజిక సాధికారత సాధ్యమైందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. ఈ సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ను ఎన్నుకోవాలని తెలిపారు. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్లో సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన సామాజిక సాధికార సభలో ఆయన ప్రసంగించారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మగౌరవంతో బతకగలుగుతున్నారని మంత్రి తెలిపారు. వయో పరిమితిని 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గించి, అవ్వాతాతలకు పెన్షన్ ఇస్తున్న మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని చెప్పారు. అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.18,760 ఇస్తానని చెప్పి, ఇప్పటికే మూడు విడతలు అందించారని, జనవరిలో నాలుగో విడత కూడా ఇవ్వనున్నారని తెలిపారు. 2014 ఎన్నికలకు ముందు రుణ మాఫీ చేస్తానని చంద్రబాబు రైతులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను మోసం చేశారన్నారు. అదే అక్కచెల్లెమ్మలకు 2019 ఏప్రిల్ వరకూ ఉన్న బకాయిలు చెల్లిస్తామన్న జగన్ దానిని అమలు చేసి చూపించారన్నారు. రైతులకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తొలిసారిగా గౌరవాన్ని కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. జగన్ సీఎం అయ్యాక బీసీ ఉప కులాలన్నింటినీ గుర్తించి, 57 కార్పొరేషన్లకు తొలిసారి చైర్మన్లను నియమించి, వారికి సరైన గుర్తింపు, గౌరవం కల్పించారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఉప ముఖ్యమంత్రి పదవులు, మంత్రి వర్గంలో, ఇతర నామినేటెడ్ పదవులన్నింటిలో పెద్ద పీట వేసిన సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ చెప్పారు. ఇన్నాళ్లూ మాటలకే పరిమితమైన సామాజిక సాధికారతను సీఎం జగన్ చేతల్లో చూపించారని అన్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో ఎస్సీ, మైనార్టీలకు స్థానమే కల్పించలేదన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా చంద్రబాబుకు ఆయన కులమే కనిపిస్తుందని, సీఎం జగన్కు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కనిపిస్తారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని అన్నారు. సీఎం వైఎస్ జగన్కు బడుగు, బలహీన వర్గాలే ప్రాధాన్యత అని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు చెప్పారు. రాజ్యసభకు తొమ్మిది మందికి అవకాశం వస్తే అందులో మత్స్యకార వర్గం నుంచి తనకు, శెట్టిబలిజల నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, యాదవ నుంచి బీద మస్తాన్రావు, కురుబ నుంచి ఆర్. కృష్ణయ్యలకు ప్రాతినిధ్యం కల్పించి రాజకీయంగా అగ్రస్థానంలో కూర్చోబెట్టారన్నారు. అవే పదవులను కోట్లకు అమ్ముకున్న నైజం చంద్రబాబుదని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు లభించిన గౌరవం 2024 తర్వాత ఆగిపోకూడదంటే సీఎం జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ చెప్పారు. ఎవరైనా పార్టీ పెడితే సీఎం కావాలనుకుంటారని, కానీ పక్కవారు సీఎం కావాలని కోరుకునే నాయకులు మనకు అవసరమా అంటూ పవన్ కళ్యాణ్ తీరును ఎద్దేవా చేశారు. బలిసిన వారికి, బడుగులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో బడుగుల పక్షాన నిలిచిన జగన్కు మద్దతుగా నిలిచి మరోసారి సీఎంను చేయాలని కోరారు. సామాజిక సాధికారతకు అర్థం చెప్పేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన అందించారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిధున్రెడ్డి, మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ వంగా గీత, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పాల్గొన్నారు. -
బాబుకు లోపల మోత మోగుతుంది..మోగని టీడీపీ కంచాలు..
-
చీకటి ఒప్పందానికి రుజువు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దొరికిపోయిన దొంగ, మాజీ సీఎం చంద్రబాబును ఎల్లో మీడియా పునీతుడిగా, అన్నా హజారేకు అన్న మాదిరిగా ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విమర్శించారు. గతంలో చంద్రబాబును పెద్ద లంచగొండిగా పేర్కొంటూ రామోజీరావు స్వయంగా తన పత్రికలో కార్టూన్ వేయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు అదే చంద్రబాబును దేశభక్తుడి మాదిరిగా చిత్రీకరించేందుకు ఈనాడు ఆపసోపాలు పడుతోందన్నారు. ఫేక్ ఉద్యమాన్ని నడిపిస్తున్న ఎల్లో మీడియా చంద్రబాబును దోమలతో చంపేలా కుట్ర చేస్తున్నారంటూ కథనాలు ప్రచురించడం పైశాచికత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. సిల్క్ డెవలప్మెంట్ స్కామ్పై శుక్రవారం శాసనసభలో స్వల్ప కాలిక చర్చలో కన్నబాబు మాట్లాడారు. కరెంట్ పోయిందని కహానీలు ఒప్పందం సమయంలో కరెంట్ పోవడంతో తేదీ వేయలేదని సీమెన్స్ ఇండియా అప్పటి ఎండీ సుమ న్బోస్ చెప్పడం విడ్డూరంగా ఉంది. నిజమైన చీకటి ఒప్పందానికి ఇదే ఉదాహరణ. విజనరీగా ప్రచారం చేసుకునే చంద్రబాబు హయాంలో సెక్రటేరియట్, సీఎంవోల్లో కనీసం జనరేటర్ కూడా లేదా? కరెంట్ పోయిన వెంటనే సెల్ఫోన్లో టార్చ్ వేస్తున్న రోజులివి! స్కిల్ స్కామ్లో చంద్రబాబు సహనిందితులు ముకుల్ అగర్వాల్, సుమన్ బోస్, వికాస్ ఖన్వేల్కర్ గతంలో ఒకే కంపెనీలో పనిచేశారు. పక్కా ఆధారాలతో ఈడీ అరెస్టు చేసిన సుమన్ బోస్ బెయిల్పై వచ్చి చంద్రబాబు తప్పు చేయలేదని చెప్పడం సిగ్గుచేటు. గుజరాత్తో పోలిక సిగ్గుచేటు గుజరాత్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో 85 శాతం సీమెన్స్, 15 శాతం ప్రభుత్వం భరించింది. ఇందులో సీమెన్స్ గ్రాంట్ ఇన్ ఎయిడ్గా కాకుండా కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా (సీఎస్ఆర్) రూ.99.85 కోట్లు సమకూరిస్తే ప్రభు త్వం రూ.17.10 కోట్లు ఖర్చు పెట్టింది. అదే ఏపీలో రూ.3,281 కోట్ల ప్రాజెక్టు అంటూ సీమెన్స్ పేరుతో బోగస్ ఒప్పందం చేసుకున్నారు. ఆ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ వాటాగా ఏకంగా రూ.371 కోట్లను విడుదల చేసి అప్పనంగా దోచేశారు. చంద్రబాబు తరపున ఢిల్లీ నుంచి వచ్చిన ఒక వకీల్సాబ్ కోర్టుల్లో కేసు వాదిస్తుంటే లోకల్ వకీల్ సాబ్ రోడ్లపై దొర్లుతూ వాగుతున్నాడు. పెండ్యాలకు టికెట్లు తీసింది మీరే.. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, లోకేశ్ అనుచరుడు కిలారు రాజేష్ను విచారిస్తే మొత్తం బయటకొస్తుంది. వారిని ఇప్పటికే దేశం దాటించేశారు. లోకేశ్ జాతీయ మీడియాతో పెండ్యాల శ్రీనివాస్ అసలు ప్రభుత్వ ఉద్యోగి కాదని చెబుతు న్నారు. పెండ్యాల శ్రీనివాస్ ప్రభుత్వ ఉద్యోగే. చంద్రబాబుకు సూట్కేసుల్లో డబ్బులు తెచ్చింది అతడే. పైగా శ్రీనివాస్ పిక్నిక్కు అమెరికా వెళ్లాడని లోకేశ్ చెబుతున్నాడు. అలాగైతే మీ నాన్నను (చంద్రబాబును) అరెస్టు చేసిన వెంటనే వెనక్కి పిలిపించొచ్చు కదా? మీరే టికెట్లు తీసి ఆయన్ను అమెరికా పంపించారనేందుకు మాదగ్గర ఆధారా లున్నాయి. ఇంటర్పోల్ సాయం తీసుకునైనా పెండ్యాల శ్రీనివాస్, రాజేష్ను వెనక్కి తీసుకొస్తాం. దొంగతనం తేటతెల్లం: పేర్ని నాని, మాజీ మంత్రి చంద్రబాబు సీఐడీ విచారణలో నాకు తెలియదు.. మర్చిపోయా.. గుర్తులేదు అంటూ సినిమా డైలాగులు చెప్పారు. ఆయనకు బాకా ఊదే వ్యక్తులు, మీడియా సంస్థలు ఆధారాలు అడుగుతున్నాయి. లంచాలను ఫోన్పే, బ్యాంకు ఖాతాల ద్వారా తీసుకుంటారా? ఒకప్పుడు చంద్రబాబు ఒక్కరే ప్రజాధనాన్ని స్వాహా చేయగా లోకేశ్ రాకతో దోచుకునే జేబులు పెరిగాయి. టీడీపీ జమా ఖర్చులు చూసే దొంగ ఆడిటర్ను స్కిల్ డెవలప్మెంట్లో పెట్టుకుని కథ నడిపించారు. చంద్రబాబు తన గ్లామర్, గడ్డం అందాన్ని చూసి సీమెన్స్ పరుగెత్తుకుంటూ వచ్చిందని కేబినెట్లో కథలు చెప్పారు. ఇప్పుడు దొంగతనం తేటతెల్లం అవుతోంది. వాటాల కోసమే టీడీపీ సభ్యులు అసెంబ్లీలో రచ్చరచ్చ చేశారు. ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి సీటు లాక్కున్నప్పుడు కత్తి అందించిన బాలకృష్ణకు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. మొన్న బావను అరెస్టు చేయగానే పార్టీ ఆఫీసులో సీట్లో కూర్చోగా ఈరోజు అసెంబ్లీలోనే చంద్రబాబు సీట్లో బాలయ్య కూర్చున్నారు. మావాడు (పవన్ కళ్యాణ్) ఒక్కసారి ఎమ్మెల్యేగా, కార్పొరేటర్గా కూడా గెలవలేదు. అందుకే చంద్రబాబు ఎక్కడా సంతకం పెట్టలేదని అజ్ఞానంగా మాట్లాడుతు న్నాడు. చంద్రబాబు న్యాయవాదులు ఎక్కడా స్కిల్లో స్కామ్ జరగలేదని వాదించట్లేదు. రిమా ండ్ రిపోర్టులో ఏమీ లేదని ఎనిమిదేళ్ల వయసున్న తన పిల్లాడు కూడా చెబుతాడని చంద్రబాబు కుటుంబ సభ్యురాలు (నారా బ్రహ్మణి) అంటు న్నారు. ఈ వివరాలన్నీ తెలిస్తే తన తాతకు ఇంత స్కిల్ ఉందా? అని ఆ పిల్లాడికీ అర్థం అవుతుంది. తప్పు చేస్తే చట్టం ముందు ఎవరైనా ఒకటే. పంజాబ్లో సినిమాల షూటింగ్ల పిచ్చి ఉన్న డేరా బాబా నేరం చేసి దొరికిపోయాడు. గోదావరి పుష్కరాల్లో అమాయకులను బలి తీసుకున్న చంద్రబాబు కూడా అదే కోవలోకి వస్తారు. -
దొరికిపోయిన గజదొంగ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మాజీ సీఎం చంద్రబాబు అవినీతి వ్యవహారాలపై సాక్షాత్తూ ఐటీ శాఖే నిగ్గు తేల్చినా పచ్చ మీడియా ఎందుకు కథనాలు రాయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. ‘చంద్రబాబు దొరికిన దొంగ.. గజదొంగ! చిన్న కాంట్రాక్టులోనే రూ.118 కోట్లు నొక్కితే 14 ఏళ్లు సీఎంగా బొక్కిందెంత? రామోజీ, ఏబీఎన్ రాధాకృష్ణ, బీఆర్ నాయుడు కళ్లకు ఇవి కనిపించడం లేదా? ఈ బాగోతాన్ని రాయాలనిపించడం లేదా?’ అని నిలదీశారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈ అవినీతిని ప్రశ్నిస్తారని తాను అనుకోవడం లేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, చంద్రబాబుకు సొంత వదినే కాబట్టి ఆమె మాట్లాడటం లేదని, ఇక కమ్యూనిస్టులు ఎలాగూ స్పందించరని చెప్పారు. కన్నబాబు ఆదివారం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. తెహల్కా ఎప్పుడో చెప్పింది చంద్రబాబు తనను ఎవరూ ఏమీ చేయలేరని, సచ్చిలుడినని కితాబు ఇచ్చుకుంటున్నారు. జాతీయ మీడియా కథనాలతో ఆయన ఎంత దుర్మార్గమైన అవినీతి చేశారో బహిర్గతమైంది. ఆరోపణలకు సమాధానం చెప్పకుండా వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు షోకాజ్పై దాటవేత వైఖరి అనుసరిస్తున్నారు. చంద్రబాబుకు డబ్బులు అందాయనడానికి వాట్సాప్ చాట్స్, ఈ–మెయిల్ ఆధారాలున్నాయని ఐటీశాఖ స్పష్టం చేసింది. చిన్న కాంట్రాక్టుల్లోనే చంద్రబాబు ఇంత డబ్బు నొక్కేశారంటే ఆయన ఎంత పెద్ద గజదొంగ అయి ఉంటాడు? ఇంత జరిగినా చంద్రబాబు నోరు విప్పట్లేదు. ఆయన వందిమాగధులు, భజన బృందాలు స్పందించడం లేదు. ఎల్లో మీడియా అసలే మాట్లాడదు. కాకినాడలో నిర్వహించిన పార్టీ జోన్–2 సమావేశంలో ఈ విషయాన్ని ఎందుకు ఖండించలేకపోయావు బాబూ? కనీసం నీ కార్యకర్తలకైనా సమాధానం చెప్పే దమ్ము లేదంటే తప్పు జరిగిందనే విషయం అర్థమవుతోంది. చంద్రబాబు ఎలా అవినీతి సామ్రాజ్యం నిర్మించుకున్నాడో 1999లోనే తెహల్కా చెప్పింది. ఓటుకు కోట్లు కేసు ద్వారా కూడా ఆయన వద్ద ఎంత అవినీతి సొమ్ము పేరుకు పోయిందో వెల్లడైంది. లోకేశ్ పాత్ర కూడా.. ఈ అవినీతి బాగోతంలో చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేశ్ పేరు కూడా చెబుతున్నారు. చిన్నచిన్న రాజకీయ ఆరోపణలకే పరువు నష్టం దావా వేసిన చరిత్ర మీ హెరిటేజ్కు, మీకు ఉంది కదా! మీ అవినీతిని బహిర్గతం చేసిన జాతీయ మీడియాపై పరువు నష్టం దావా వేసే దమ్ముందా? తేలు కుట్టిన దొంగల్లా ఎందుకున్నారు? 2014లో చంద్రబాబు 650 అంశాలతో ఇచ్చిన మేనిఫెస్టోకే దిక్కు లేదు. ఎన్నికలు కాగానే దాన్ని మాయం చేశారు. అధికారంలోకి వస్తానని ఆయనకే నమ్మకం లేదు. ఇక ఆయన ప్రజలకు గ్యారెంటీ ఇవ్వడం ఏమిటి? గతంలో కిరణ్కుమార్రెడ్డి లాస్ట్ బాల్ అన్నట్లుగా చంద్రబాబు సూపర్ సిక్స్ అంటున్నారు. ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఎలాగూ లేదు. పార్టీ ఉంటుందో లేదో తెలియదు. కచ్చితంగా బౌండరీలో క్యాచ్ ఇచ్చి నిష్క్రమిస్తారు. -
బాబుది విధ్వంస యాత్ర
కాకినాడ రూరల్: రాష్ట్రంలో చంద్రబాబు విధ్వంస యాత్ర సాగిస్తున్నారని, అరాచకం సృష్టించేందుకే కుట్రపూరితంగా యాత్ర చేపడుతున్నారని మాజీమంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎక్కడికెళ్లినా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముందుగానే ప్లాన్ వేసుకుని పుంగనూరు వెళ్లి 50 మంది పోలీసులను గాయపరిచారని, రక్తం వచ్చేలా దాడులు చేశారని, వాహనాలు తగలబెట్టారని చెప్పారు. అల్లర్లకు బాబు, పవన్ యత్నం.. చంద్రబాబు, ఆయనకు మద్దతు పలుకుతున్న పవన్ మాట్లాడుతున్న తీరుచూస్తే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం అర్థమవుతోందన్నారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తలతో దాడులు చేయించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆపాదించే ప్రయత్నం చేశారని కన్నబాబు చెప్పారు. పోలీసుల గురించి మాట్లాడే భాష ఇదేనా అని ప్రశ్నించారు. తన కార్యకర్తపై చేయి చేసుకున్నారంటూ సీఐ అంజుయాదవ్పై గతంలో గొడవ చేసిన పవన్.. ఇదే పోలీసులపై చంద్రబాబు దాడి చేయిస్తే ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. బాబు ఏ ప్రాజెక్టు పూర్తిచేశారు? 14 ఏళ్లు సీఎంగా పనిచేసి ఏ ప్రాజెక్ట్ పూర్తిచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కక్కుర్తితో పట్టిసీమ ప్రాజెక్టు పూర్తిచేసి రాయలసీమ ప్రాజెక్టులు ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. ఇక చంద్రబాబుకు సింహం బ్రాండ్ లేదని, మామగారిని కుళ్లబొడిచిన నక్కజిత్తుల బ్రాండ్ ఉందని కురసాల ఎద్దేవా చేశారు. -
విజయవాడలో సీ ఫుడ్ ఫెస్టివల్
సాక్షి, అమరావతి: స్థానిక వినియోగాన్ని పెంచడం, ప్రత్యామ్నాయ మార్కెటింగ్ సౌకర్యాల కల్పనే లక్ష్యంగా విజయవాడలో 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కూనపురెడ్డి కన్నబాబు తెలిపారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏటా 50 లక్షల టన్నుల మత్స్య సంపద ఉత్పత్తితో దేశంలోనే నం.1 స్థానంలో ఉన్న రాష్ట్రంలో స్థానిక వినియోగం 8 శాతానికి మించడం లేదన్నారు. దేశ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 75 శాతం మన రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. కానీ వినియోగం మాత్రం 5 శాతం లోపే ఉందని చెప్పారు. మిగిలిన రొయ్య అంతా ఎగుమతి అవుతోందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు ఎదురైతే రాష్ట్రంలోని రొయ్య రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోందని తెలిపారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే డొమెస్టిక్ మార్కెట్ను పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రంలో సీ ఫుడ్ వినియోగదారులు పెద్ద ఎత్తున ఉన్నా.. డిమాండ్కు తగ్గట్టుగా రిటైల్ షాపులు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారిందన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ‘ఫిష్ ఆంధ్రా’ బ్రాండ్తో స్థానిక వినియోగం పెంచేలా ఆక్వా హబ్స్ అండ్ స్పోక్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే 1,500 అవుట్ లెట్స్ను ఏర్పాటు చేయగా.. 15 హబ్స్ నిర్మాణంలో ఉన్నట్టు చెప్పారు. మరిన్ని హబ్స్, అవుట్ లెట్స్ ఏర్పాటుకు ముందుకొచ్చే ఔత్సాహికులను ప్రోత్సహించడం, వినియోగదారుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఫెస్టివల్లో 20 వేల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఫెస్టివల్లో రోజూ రూ.699తో అపరిమితమైన సీ ఫుడ్ బఫెట్ను అందిస్తున్నామన్నారు. సీ ఫుడ్పై వంటల పోటీలు, వైద్యులు, పోషకాహార నిపుణులతో సెమినార్లు, 2కే రన్ నిర్వహంచనున్నట్టు తెలిపారు. ఇలాంటి సీ ఫుడ్ ఫెస్టివల్స్ విశాఖ, కాకినాడ, భీమవరం, నెల్లూరు తదితర ప్రాంతాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోనూ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా ఫెస్టివల్ బ్రోచర్ను కమిషనర్ కన్నబాబు విడుదల చేశారు. -
ఫిష్.. ఫిష్ హుర్రే!
సాక్షి, అమరావతి: ‘ఫిష్ ఆంధ్ర’ అవుట్లెట్స్కు ఆదరణ మరింత పెరుగుతోంది. ‘ఫిష్ ఆంధ్ర’ అవుట్లెట్స్కు ఏ రోజు వెళ్లినా కావాల్సిన మత్స్య ఉత్పత్తులు తాజాగా దొరుకుతాయన్న నమ్మకం మాంసాహార ప్రియుల్లో ఏర్పడింది. దీంతో వీటికి విశేష ఆదరణ లభిస్తోంది. తమకు జీవనోపాధి లభించడంతోపాటు తమ ద్వారా మరికొందరికి ఉపాధి కల్పించగలుగుతున్నామని అవుట్లెట్స్ నిర్వాహకులు చెబుతుంటే.. శుభ్రమైన వాతావరణంలో తాజా మత్స్య ఉత్పత్తులు లభిస్తున్నాయని వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక వినియోగం పెంచే లక్ష్యంతో.. మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా ‘ఫిష్ ఆంధ్ర’ పేరిట ప్రభుత్వం బ్రాండింగ్ చేసి ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో ఏటా 4.36 లక్షల టన్నులున్న మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగాన్ని 2025 నాటికి కనీసం 15 లక్షల టన్నులకు పెంచాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 70 హబ్లను, వాటికి అనుబంధంగా 14 వేల అవుట్లెట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలి దశలో జిల్లాకు ఒకటి చొప్పున ఆక్వా హబ్, వాటికి అనుబంధంగా 4 వేల అవుట్లెట్స్, స్పోక్స్, డెయిలీ, సూపర్, లాంజ్ యూనిట్స్తో పాటు త్రీవీలర్, 4 వీలర్ కియోస్్కలను 60 శాతం సబ్సిడీపై నిరుద్యోగ యువతకు మంజూరు చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,250 అవుట్లెట్స్, 70 త్రీ వీలర్, 84 ఫోర్ వీలర్ వెహికల్స్, 62 డెయిలీ, 50 సూపర్, 11 లాంజ్ యూనిట్స్ కలిపి మొత్తంగా 1,527 యూనిట్స్ ఏర్పాటయ్యాయి. తొలుత నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో సముద్ర మత్స్య ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. స్థానికంగా దొరికే చేపలు, రొయ్యలతోపాటు సముద్ర మత్స్య ఉత్పత్తులు సైతం లభిస్తుండటంతో వీటిని కొనేందుకు ఎగబడుతున్నారు. స్పందన చాలా బాగుంది ప్రైవేటు బ్యాంక్లో ఉద్యోగం చేసేవాడిని. నెలకు రూ.15 వేలు జీతం వచ్చేది. ప్రభుత్వ ప్రోత్సాహంతో కర్నూలులోని నంద్యాల చెక్పోస్ట్ సెంటర్లో 60 శాతం సబ్సిడీతో ఫిష్ ఆంధ్ర అవుట్లెట్ పెట్టుకున్నా. ఆదివారం 200–300 కిలోలు, మిగిలిన రోజుల్లో 50నుంచి 100 కేజీల వరకు మత్స్య ఉత్పత్తులు అమ్ముడుపోతున్నాయి. నాకు ఉపాధి లభించడంతోపాటు మరో నలుగురికి ఉపాధి చూపిస్తున్నా. కాకినాడ నుంచి సముద్ర చేపలు, రొయ్యలు, పీతలు సైతం వస్తున్నాయి. సీ ఫుడ్స్ కోసం క్యూ కడుతున్నారు. సాయంత్రం పూట చేప, రొయ్య తదితర వంటకాలతో వాల్యూ యాడెడ్ యూనిట్ నడుపుతున్న. స్పందన చాలా బాగుంది. సిబ్బంది జీతభత్యాల కింద రూ.56 వేలు చెల్లిస్తున్నా. రూ.60 వేలకు పైగా ఈఎంఐలు కడుతున్నా. అయినా రూ.50 వేల వరకు మిగులుతోంది. – బట్టు రాజశేఖర్, ఫిష్ ఆంధ్ర అవుట్లెట్ నిర్వాహకుడు, కర్నూలు చాలా తాజాగా ఉంటున్నాయి ప్రతి ఆదివారం ఫిష్ ఆంధ్ర అవుట్లెట్కు వస్తున్నా. ఇక్కడ గోదావరిలో మాత్రమే దొరికే చేపలతో పాటు సముద్ర చేపలు, రొయ్యలు కూడా దొరుకుతాయి. చాలా తాజాగా ఉంటున్నాయి. ఎంతో రుచిగా ఉంటున్నాయి. – జి.శ్రీనివాసరావు, పోరంకి, విజయవాడ హైజీనిక్గా ఉంటున్నాయి అవుట్లెట్కు ఏరోజు వచ్చినా అన్నిరకాల చేపలు దొరుకుతున్నాయి. చాలా తాజాగా ఉంటున్నాయి. హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. – కె.రామయ్య, ఈడుపుగల్లు, పెనమలూరు ఆదరణ పెరుగుతోంది స్థానిక వినియోగం పెంచడం లక్ష్యంగా ఫిష్ ఆంధ్ర పేరిట నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను హబ్ అండ్ స్పోక్ మోడల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇప్పటికే మూడు హబ్లతో పాటు 1,500కు పైగా అవుట్లెట్స్, ఇతర యూనిట్స్ను అందుబాటులోకి తెచ్చాం. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. గతంతో పోలిస్తే స్థానిక వినియోగం గణనీయంగా పెరిగింది. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
కాపు ఉద్యమకారుడి కుటుంబానికి సీఎం బాసట
కాకినాడ రూరల్: కాపు రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా 2016లో కాకినాడలో కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యకు పాల్పడిన కాపు ఉద్యమకారుడు చీకట్ల వెంకట రమణమూర్తి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాసటగా నిలిచారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాన డిమాండ్తో చంద్రబాబు హయాంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి కేంద్రంగా కాపు ఉద్యమం ప్రారంభించారు. ఈ క్రమంలో తునిలో రైలు దహనం ఘటన మరునాడు వెంకట రమణమూర్తి కలెక్టరేట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పట్లో ఈ ఘటన సంచలనమైంది. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే కాపులను ఇబ్బంది పెడుతోందని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కాపు రిజర్వేషన్లపై సమాధానం చెప్పాలని, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్తో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని వెంకట రమణమూర్తి రాసిన లేఖలో పేర్కొన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. లారీ డీజిల్ మెకానిక్గా పనిచేసే అతడి ఆత్మహత్యతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. మృతుడికి భార్య పార్వతి, కుమారుడు రాజేష్, కుమార్తె రాజేశ్వరి ఉన్నారు. వీరిని అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ ఓదార్చారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం సహాయ నిధి నుంచి చీకట్ల పార్వతి పేరిట రూ.5 లక్షలు మంజూరు చేశారు. ఈ చెక్కును రమణయ్యపేటలోని తన క్యాంపు కార్యాలయం వద్ద మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆదివారం వెంకట రమణమూర్తి కుమార్తె రాజేశ్వరి, కుమారుడు రాజేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. వెంకట రమణమూర్తి కుటుంబ పరిస్థితిని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందించి రూ.5 లక్షల ఆరి్థక సహాయం పంపించి ఆదుకున్నారని చెప్పారు. వెంకట రమణమూర్తి కుమార్తె రాజేశ్వరి కాకినాడ 3వ డివిజన్లో వలంటీర్గా పని చేస్తోందన్నారు. -
రైతు పక్షపాత ప్రభుత్వంపై దుష్ప్రచారమా?
కాకినాడ: వైఎస్ జగన్ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని, అన్నదాత సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఈ సర్కారుపై మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేస్తారా... అంటూ వ్యవసాయ శాఖ మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఆయన గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవలి అకాల వర్షాలను సాకుగా తీసుకుని రైతుల పక్షాన మాట్లాడుతున్నట్టు ఆ ఇద్దరు నేతలు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ఏ ఒక్క రైతు నష్టపోకూడదనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ నిబంధనలను సడలించి మరీ తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా సివిల్ సప్లైస్ ద్వారా ఖరీఫ్లో 6.40 లక్షల రైతుల నుంచి 35,41,564 టన్నుల ధాన్యం కొన్నారని తెలిపారు. సుమారు రూ.7,233 కోట్లలో రూ.7,212 కోట్లు.. అంటే 99 శాతం చెల్లింపులు జరిగాయని చెప్పారు. ప్రస్తుత సీజన్లో రూ.1,629 కోట్ల విలువైన ధాన్యాన్ని కొని రూ.1,277 కోట్ల చెల్లింపులు కూడా చేశారన్నారు. 21 రోజుల్లో చెల్లించాలనే నిబంధన ఉన్నప్పటికీ రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆరు రోజులకే చెల్లించారన్నారు. ఎఫ్సీఐ బొండాలు ధాన్యాన్ని కొంతకాలంగా కొనడంలేదని, అయితే ఈసారి అధిక విస్తీర్ణంలో ఈ రకం పండించడంతో ముఖ్యమంత్రి కేంద్రం దృష్టికి తీసుకెళ్లి వాటినీ కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. 17 శాతంకన్నా తేమ అధికంగా ఉంటే రైతులు నష్టపోకూడదని నిబంధనలు సడలించారన్నారు. తడిసిన ధాన్యం కళ్లాల్లో ఉండడం వల్ల ఆఫ్లైన్లో సైతం ప్రొక్యూర్మెంట్ జరిగిందన్నారు. ఇవన్నీ విపక్ష నేతలకు కనిపించలేదా.. అని ప్రశ్నించారు. -
టీడీపీ స్కిల్ స్కాంపై మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ స్కామ్పై చర్చ జరిగింది. ఈ క్రమంలో మంత్రి బుగ్గన, ఎమ్మెల్యే కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో కన్నబాబు మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ స్కాం ఓ దొంగల ముఠా కథ. డబ్బులు కొట్టేసే కార్యక్రమంలో టీడీపీ వాళ్లకు ఉన్న స్కిల్ ఎవరికీ లేదు. నిరుద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది. చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన నెలరోజులకే ప్రతిపాదన తెచ్చారు. ప్రతిపాదన రాగానే కేబినెట్లో ప్రవేశపెట్టి ఆమోదించారు. రూ. 3,356 కోట్ల ప్రాజెక్టుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఏదైనా ప్రాజెక్ట్ ముందుకొస్తే డీపీఆర్ ఇవ్వాలి. డీపీఆర్ సిమెన్స్ కంపెనీ ఇవ్వకుండా ఇతరులు ఇచ్చారు. కంపెనీ ఇవ్వకుండా ఇతరులు డీపీఆర్ ఎలా తయారు చేస్తారు. ఒక కంపెనీకి ప్రభుత్వం రూ.3వేల కోట్లు ఖర్చు పెడుతుందా?. ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగలేదన్నారు. ఈ స్కాంలో నిందితులు ఎవరో తేల్చి త్వరగా చర్యలు తీసుకోవాలి అని అన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. జీవో, ఎంవోయూకి తేడా ఉంది. రూ.371 కోట్లు ఇచ్చే ముందు సరైన వివరాలు పేర్కొనలేదు. లెటర్ నెంబర్, డేటా లేకుండానే నిధులు విడుదల చేశారు. చంద్రబాబు హయంలో కేవలం స్కిల్ స్కాం ద్వారానే రూ. 371 కోట్లు దోపిడీ జరిగింది. ఫేక్ ఇన్వాయిస్లతో నగదు కాజేశారు. ఎలాంటి ఒప్పందాలు లేకుండా పలు కంపెనీలకు నిధులు మళ్లించారు అని ఆరోపించారు. ఇంకా ఏమన్నారంటే.. జీవోలోని అంశాలు, సంబంధిత లేఖలను ప్రస్తావించకుండానే సంతకాలు. ఒక్కపైసా సీమెన్స్ నుంచి రాకుండానే డబ్బు విడుదల. డబ్బు విడుదలకు ఆర్థికశాఖ అధికారుల అభ్యంతరం. వాటిని కొట్టేసి తానే స్వయంగా నిధులు విడుదల చేయించిన చంద్రబాబు. తర్వాత షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేశారు. జీఎస్టీ అధికారుల ఆరాతో వెలుగులోకి ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. ఈడీ, సెబీ సోదాల్లో అవన్నీ షెల్ కంపెనీలుగా గుర్తింపు. ఒక్క పైసా కూడా తమకు ముట్టలేదన్న సీమెన్స్ గ్లోబల్ టీం. మరిన్ని ఆధారాలను ఇచ్చిన సీమెన్స్ గ్లోబల్ టీమ్. కొంత డబ్బు హైదరాబాద్, పుణే వెళ్లిందని ఆధారాలిచ్చిన సీమెన్స్ గ్లోబల్ టీమ్. ఇవన్నీ కూడా చంద్రబాబు హయాంలోనే వెలుగు చూశాయి. అయినా వాటన్నింటినీ దాచేసిన చంద్రబాబు సర్కారు. ముఖ్యమంత్రి హోదాను అడ్డుపెట్టుకుని ఏసీబీని తొక్కిపెట్టిన చంద్రబాబు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఈడీ, సీఐడీ. కేసును మరింత ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న సీఐడీ. రాష్ట్రంలో మొదలై.. విదేశాలకు పాకిన కుంభకోణం. దోచిన ప్రజాధనం విదేశాలకు తరలింపు. గంటా సుబ్బారావు అనే అనధికార ప్రైవేట్ వ్యక్తిని ఏపీఎస్ఎస్డీసీకి సీఈవోగా నియమించారు. సీఎఫ్ఎంఎస్ కార్పొరేషన్కి, సీఈవోగా కూడా ప్రైవేట్ వ్యక్తినే పెట్టుకున్నారు. రిటైర్డ్ అధికారి లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని డైరెక్టర్గా నియమించారు. రూ.370 కోట్ల విలువైన సాఫ్ట్ వేర్కు ఎంవోయూ చేసుకున్నారు. డిజ్ టెక్ కంపెనీ నుంచి ఈ ప్రాజెక్టులో ఏ భాగస్వామ్యం లేకుండా ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఏమీ చేయకుండా డిజ్ టెక్ కంపెనీకి రూ.370 కోట్లు అప్పనంగా ఇచ్చేశారు. ఎంవోయూపై గంటా సుబ్బారావు, సుమన్ బోస్, సంతోష్ సారాల సంతకాలున్నాయి. జీవోకి, ఎంవోయూకి తేడా ఉంది. రూ.371 కోట్లను ఇచ్చే ముందు సరైన వివరాలు నమోదు చేయలేదు. లెటర్ నెంబర్, డేటా లేకుండానే నిధులు విడుదల చేశారు. చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ద్వారానే రూ.371 కోట్లు కాజేశారు. ఫేక్ ఇన్వాయిస్లతో నిధులు కాజేశారు. ఎలాంటి ఒప్పందాలు లేకుండా పలు కంపెనీలకు నిధులు మళ్లించారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో టీడీపీ నేతలు భారీగా దోచుకున్నారు. రూ.3,300 కోట్ల పెట్టుబడి అని మోసం చేశారు. సీమెన్స్ 90శాతం పెట్టుబడి పెడుతుందని అబద్ధాలు చెప్పారు. 10శాతం ప్రభుత్వం నిధులు ఇవ్వాలని చెప్పి రూ.371 కోట్లు విడుదల. గంటా సుబ్బారావు, సుమన్ బోస్ మధ్య ఈ ఒప్పందం జరిగింది. సుమన్ బోస్కి, సీమెన్స్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. అయినా సీమెన్స్ పేరుతో రూ.371 కోట్లు దోచుకున్నారు. నిధులు విడుదలకు అభ్యంతరం తెలిపిన ఆర్థికశాఖ అధికారులు. చంద్రబాబు చెప్పినందువల్లే అధికారులు డబ్బు రిలీజ్ చేశారు. -
ఏపీ మాజీ మంత్రి కన్నబాబుతో స్ట్రెయిట్ టాక్
-
ఒబెరాయ్ హోటల్కు 20 ఎకరాల కేటాయింపు
తిరుపతి అలిపిరి/ జమ్మలమడుగు/మధురపూడి(రాజమహేంద్రవరం): ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా తిరుపతి అలిపిరి రోడ్డులో టూరిజం స్థలం 20 ఎకరాలను ఒబెరాయ్ హోటల్కు లీజ్ కమ్ రెంట్ విధానంలో కేటాయించే విషయమై ఒప్పంద పత్రాలను మార్చుకున్నట్టు టూరిజం ఎండీ కన్నబాబు తెలిపారు. శనివారం మధ్యాహ్నం స్థానిక అలిపిరి రోడ్డులోని దేవలోక్ వద్ద ఒబెరాయ్ హోటట్ ప్రతినిధులతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. దాదాపు రూ.100 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారని తెలిపారు. గండికోటలో స్థలం పరిశీలన వైఎస్సార్ జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో ఒబెరాయ్ బృందం పర్యటించింది. ఒబెరాయ్ హోటల్ సీఈవో, ఎండీ విక్రమ్ ఒబెరాయ్, కార్పొరేట్ అఫెర్స్ ప్రెసిడెంట్ శంకర్, ఫైనాన్స్ ఆఫీసర్ కల్లోల్ కుందా,ఎంఏఎల్ రెడ్డి, మహిమాసింగ్ ఠాగూర్ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా నాలుగు వందల ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. గతేడాది ఒబెరాయ్ హోటల్ యాజమాన్యం గండికోటలో రిసార్టులను ఏర్పాటు చేస్తామని, భూమిని కేటాయించాలని కోరడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఒబెరాయ్ యాజమాన్యానికి 50 ఎకరాల భూమిని కేటాయించింది. దీంతో రూ.250 కోట్లతో 120 విల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఒబెరాయ్ బృందం గండికోటలోని వివిధ ప్రాంతాలను పరిశీలించింది. పెన్నానదిలోయ అందాన్ని తిలకించారు. పిచ్చుక లంక, హేవలాక్ బ్రిడ్జి అభివృద్ధిపై ఒబెరాయ్ ప్రతినిధులతో కలెక్టర్ల చర్చ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రసిద్ధి గాంచిన హేవలాక్ బ్రిడ్జి, పర్యాటక కేంద్రమైన పిచ్చుక లంక అభివృద్ధిపై ఒబెరాయ్ గ్రూప్ ప్రతి నిధులతో తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్లు కె.మాధవీలత, హిమాన్షుశుక్లా, ఎంపీ మార్గాని భరత్రామ్ చర్చించారు. తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్తూ మధురపూడి విమానాశ్రయంలో ఆగిన ఒబెరాయ్ గ్రూప్ ప్రతినిధులతో శనివారం రాత్రి సమావేశమై పిచ్చుక లంక, హేవలాక్ బ్రిడ్జి అభివృద్ధి ద్వారా పర్యాటక రంగాన్ని విస్తరించవచ్చని వివరించారు. భేటీలో రాష్ట్ర ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు. -
రూ.100 కోట్లతో గండికోట అభివృద్ధి
బి.కొత్తకోట: వైఎస్సార్ జిల్లా గండికోటను రూ.100 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీటీడీసీ) ఎండీ కె.కన్నబాబు తెలిపారు. గండికోటకు స్పెషల్ ప్రాజెక్టు కింద కేంద్రం రూ.100 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్యకొండపై అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డితో కలిసి ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తోందని తెలిపారు. తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించే దిశగా కృషి చేస్తోందని చెప్పారు. గండికోటలో చేపట్టిన రోప్ వే పనులు త్వరలో పూర్తవుతాయని చెప్పారు. శ్రీకాళహస్తి, లంబసింగి, పెనుగొండ, గాలికొండ, అన్నవరంలో 20 కిలో మీటర్ల మేర రోప్ వేను రూ.1,200 కోట్లతో పీపీపీ పద్ధతిలో ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఒబెరాయ్ సంస్థ రూ.1,350 కోట్లతో గండికోట, తిరుపతి, పిచ్చుకలంక, హార్సిలీహిల్స్, విశాఖపట్నంలో సెవెన్ స్టార్ హోటళ్లను నిర్మించనుందని చెప్పారు. వైజాగ్ బీచ్ కారిడార్ అమలుకు ప్రణాళికలు రూపొందించామని, భోగాపురం, భీమిలిలో పర్యాటకుల కోసం సీ ప్లేన్, తొట్లకొండలో రూ.120 కోట్లతో అక్వేరియం టన్నెల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నారు. విజయవాడ భవానీ ద్వీపం అభివృద్ధికి రూ.149 కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని తెలిపారు. ఇంద్రకీలాద్రి నుంచి భవానీ ద్వీపం వరకు 2.5 కిలోమీటర్లు రోప్వే ఏర్పాటు ఈ మాస్టర్ ప్లాన్లో ఉందన్నారు. లంబసింగి, పాడేరులో కొత్తగా హోటళ్ల నిర్మాణం, అన్నవరంలో ఎకో రిసార్ట్కు చర్యలు చేపట్టామని చెప్పారు. -
కొత్త మంత్రి వర్గంపై కన్నబాబు కామెంట్స్
-
తప్పుదోవ పట్టిస్తారా?
సాక్షి, అమరావతి: వివిధ కారణాలతో చనిపోయిన వారిని కల్తీ సారా మృతులంటూ సభను టీడీపీ తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణశ్రీనివాస్ (నాని) మండిపడ్డారు. ప్రతిపక్షం పదేపదే సభను అడ్డుకోవడంతో బుధవారం అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు. ఇదీ వాస్తవం.. ఈ నెల 11న జంగారెడ్డిగూడెంలో వరదరాజులు అనే వ్యక్తి అనారోగ్యానికి గురి కావడంతో ఏలూరు అక్కడ నుంచి గుంటూరు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలియగానే నేను 12వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు గుంటూరు ఆస్పత్రి వైద్యులతో మాట్లాడా. వరదరాజులు బ్రెయిన్ హెమరేజ్తో మెదడులో రక్తస్రావం జరుగుతోందని ఆస్పత్రి సూపరింటెండెంట్ చెప్పారు. అతడిని బతికించేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం దక్కలేదు. బాధితుడు మంగళవారం రాత్రి 7 గంటలకు చనిపోయాడు. ఇప్పటికే ఎంఎల్సీ ప్రాథమిక నివేదిక రాగా పూర్తి స్థాయి రిపోర్టు రావాల్సి ఉంది. ఈలోగానే టీడీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. లక్షణాలన్నీ ఒకేలా ఉండాలి కదా? అవి నిజంగా కల్తీ సారాకు సంబంధించిన మరణాలే అయితే ఒకే రకమైన లక్షణాలుండాలి కదా? జంగారెడ్డిగూడెంలో చనిపోయిన వారందరి లక్షణాలు ఒకేలా లేవు. కొందరు కిడ్నీ వ్యాధులతో మరణిస్తే మరికొందరు కాలేయ సంబంధ జబ్బులతో మరికొందరు గుండెపోటు వల్ల మృతి చెందారు. వినే ఓపికా లేదా?: బుగ్గన టీడీపీ సభ్యులు రోజూ రెండు మరణాలను పెంచుతూ శవ రాజకీయాలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. కనీసం అడిగిన ప్రశ్నలకు సమాధానం వినే ఓపిక కూడా వారికి లేదని విమర్శించారు. అప్పుడు ఎందుకు వెళ్లలేదు?: కన్నబాబు రాష్ట్రంలో ఏ సమస్యలు కనపడకపోవడంతో టీడీపీ సభ్యులు ఈ అంశాన్ని ఎత్తుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు దుయ్యబట్టారు. అధికారంలో ఉండగా ప్రచార వ్యామోహంతో గోదావరి పుష్కరాల్లో 29మంది, ఏర్పేడులో ఇసుక మాఫియా 16మందిని చంపినప్పుడు పరామర్శించని చంద్రబాబు ఇప్పుడు ఓట్ల కోసం జంగారెడ్డిగూడెం పరుగెత్తుకెళ్లారని చెప్పారు. -
విశాఖ అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు
-
చెరువుల వేలంపై ఆందోళన అనవసరం
సాక్షి, అమరావతి: మత్స్యకార సహకార సంఘాల అభ్యున్నతి కోసం జారీ చేసిన జీవో 217 విషయంలో మత్స్యకారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు స్పష్టం చేశారు. వాస్తవానికి దీనివల్ల వారికి మేలు జరుగుతుందన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మత్స్యకార సొసైటీల్లో ప్రతి మత్స్యకారుడు కనీసం రూ.15 వేలకు తక్కువ కాకుండా ఆదాయం పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. వంద హెక్టార్లు పైబడిన చెరువులను బహిరంగ వేలం ద్వారా కేటాయించి ఆదాయంలో 30 శాతాన్ని సొసైటీ సభ్యులకు సమానంగా జమ చేయాలని, మరో 20 శాతం మత్స్య కారుల సహకార సంఘాల ఫెడరేషన్(ఆప్కాఫ్) ద్వారా వారి అభ్యున్నతి కోసం ఖర్చు చేయాలని నిర్ణయించామన్నారు. వేలం పాటల్లో మత్స్యకార సహకార సొసైటీలు కూడా పాల్గొనవచ్చన్నారు. సహజంగా అత్యధికంగా సముద్రంపైనే ఆధారపడి జీవించే మత్స్యకారులకు 217 జీవోతో ఎలాంటి నష్టం ఉండదన్నారు. మంచినీటి చెరువులకు సంబంధించిన ఈ జీవో వల్ల వారికి ఇబ్బంది ఉండదన్నారు. వంద హెక్టార్లకు పైబడిన, పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న నెల్లూరు జిల్లాలోని 27 చెరువులకు ప్రస్తుతం ఈ జీవోను వర్తింపచేస్తామని, మిగిలిన చోట్ల పాత పద్ధతిలోనే కొనసాగిస్తామని చెప్పారు. సందేహాల నివృత్తికి సిద్ధం వంద హెక్టార్లు పైబడిన చెరువులు దళారీల చేతుల్లో ఉండడం వల్ల లీజు సొసైటీల్లో సభ్యులు ఏటా రూ.300 నుంచి రూ.10 వేలకు మించి ఆదాయాన్ని పొందడం లేదని కన్నబాబు తెలిపారు. 90 శాతం సొసైటీల్లో గరిష్టంగా ఏటా రూ.2500 మించి పొందలేకపోతున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వంద హెక్టార్ల విస్తీర్ణం పైబడినవి 582 చెరువులుండగా 337 చోట్ల మాత్రమే మత్స్యకార సçహకార సంఘాలకు లీజుకు ఇస్తున్నామన్నారు. జీవోపై సందేహాలుంటే నివృత్తి చేసేందుకు తమ శాఖ సిద్ధంగా ఉందన్నారు. వ్యాపారం చేయడం లేదు మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంచడం, ఫిష్ ఆంధ్ర పేరిట నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా దేశీయ మార్కెటింగ్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కమిషనర్ కన్నబాబు చెప్పారు. 70 ఆక్వా హబ్లు, 14 వేలకు పైగా రిటైల్ అవుట్లెట్స్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఫెసిలిటర్గా వ్యవహరిస్తుందే కానీ వ్యాపారం చేయడం లేదన్నారు. సమావేశంలో సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీజిల్ సబ్సిడీ, పరిహారం, భరోసా గతంలో డీజిల్ సబ్సిడీ రూ.6.03 మాత్రమే ఇవ్వగా ఇప్పుడు రూ.9కి రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని కన్నబాబు తెలిపారు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో డీజిల్ సబ్సిడీ కింద రూ.59.42 కోట్లు ఇవ్వగా ఇప్పుడు 33 నెలల్లోనే ప్రభుత్వం రూ.89.17 కోట్లు చెల్లించింది. ప్రమాదవశాత్తూ మరణిస్తే పరిహారాన్ని రూ.ఐదు లక్షల నుంచి రూ.10 లక్షలకు ప్రభుత్వం పెంచింది. ఇప్పటివరకు 64 కుటుంబాలకు రూ.64.10 కోట్లు పరిహారంగా చెల్లించింది. వేట నిషేధ సమయంలో నాడు ఐదేళ్లలో రూ.104.67 కోట్లు ఇవ్వగా ఇప్పుడు వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద మూడేళ్లలో రూ.309.33 కోట్లు చెల్లించింది. -
ఆయనకి బాబు మాటే బంగారు బాట: మంత్రి కన్నబాబు
-
‘రైతు సంక్షేమం కోసం సీఎం జగన్ ఎన్నో పథకాలు తెచ్చారు’
-
దిగజారుడు రాజకీయాలు చేసి ఢిల్లీ వీధుల్లో డ్రామాలా..?
-
ఆంధ్రా ఆక్వా అంటే.. అమెరికాలో లొట్టలు!
సాక్షి, అమరావతి: ఆంధ్రా రొయ్యలు, చేపలకు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎనలేని డిమాండ్ ఉందని మరోసారి రుజువైంది. ఇక్కడి మత్స్య ఉత్పత్తులంటే అమెరికా వాసులు లొట్టలేసుకుని తింటారు. విస్తీర్ణంలోనే కాదు.. దిగుబడుల్లోనూ నంబర్ 1గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో అదే స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఆంధ్రా నుంచి ఆక్వా ఎగుమతుల్లో మూడొంతులు అమెరికాకే జరుగుతున్నాయని ఎంపెడా వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. ఆక్వారంగంపై 2020–21 మొదట్లో కరోనా ప్రభావం కాస్త తీవ్రంగానే చూపినప్పటికీ ద్వితీయార్థంలో మాత్రం అనూహ్యంగా పుంజుకుంది. దీంతో ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది దేశం నుంచి రూ.43,717.26 కోట్ల విలువైన 11,49,341 టన్నుల ఆక్వా ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. 2019–20తో పోలిస్తే పరిమాణంలో 10.81 శాతం, విలువలో 6.31 శాతం తగ్గుదల నమోదైంది. రూ.15,832 కోట్ల విలువైన 2,93,314 టన్నుల ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులతో ఏపీ దేశంలోనే నంబర్ 1గా నిలిచింది. గతేడాదితో పోలిస్తే పరిమాణంలో 4.54 శాతం, విలువలో 2.15 శాతం తగ్గుదల నమోదైంది. చదవండి: భలే ఫిష్.. ఆల్ ఫ్రెష్ ఎగుమతుల్లో 36 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే దేశ ఎగుమతుల పరిమాణంలో 36 శాతంతో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. 13 శాతంతో తమిళనాడు, కేరళ, 10 శాతంతో గుజరాత్ తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఎగుమతుల విలువ పరంగా చూసినా 24 శాతంతో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. 18 శాతంతో గుజరాత్, 14 శాతంతో కేరళ, 10 శాతంతో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఎగుమతుల పరిమాణంలోను, విలువలోను ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్కు సమీపంలో కూడా లేవు. ఏపీ ఎగుమతుల్లో మూడొంతులు అమెరికాకే మన దేశం నుంచి జరిగిన ఆక్వా ఎగుమతుల్లో 25 శాతం అమెరికాకు, 19 శాతం చొప్పున చైనా, దక్షిణ తూర్పు ఆసియా దేశాలకు, 13 శాతం యూరోపియన్ దేశాలకు, 8 శాతం జపాన్కు, 4 శాతం మిడిల్ ఈస్ట్ దేశాలకు, 12 శాతం ఇతర దేశాలకు వెళ్లాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి జరిగిన ఎగుమతుల్లో 70.74 శాతం అమెరికా సంయుక్త రాష్ట్రాలకు (యూఎస్ఏకు), 12.74 శాతం చైనాకు, 4.54 శాతం యూరోపియన్ దేశాలకు, 3.51 శాతం మిడిల్ ఈస్ట్ దేశాలకు, 2.92 శాతం సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలకు వెళ్లాయి. ఇక ఫ్రోజెన్ చేసిన రొయ్యల ఎగుమతుల్లో 97.20 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే జరగడం గమనార్హం. చదవండి: కొల్లేరు కొర్రమీను.. కనుమరుగయ్యేను వనామీలోనే 77 శాతం ఏపీదే రొయ్యల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న మన రాష్ట్రం మరోసారి సత్తా చాటుకుంది. 2020–21లో వనామీ రొయ్యల ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 1,08,526.27 హెక్టార్లలో సాగవుతున్న ఆక్వాకల్చర్ ద్వారా 8,15,745 టన్నుల వనామీ రొయ్యల ఉత్పత్తి జరిగింది. మన రాష్ట్రంలో 71,921 హెక్టార్లలో 6,34,672 టన్నుల వనామీ రొయ్యలు ఉత్పత్తి అయ్యాయి. దేశంలో వనామీ రొయ్యల ఉత్పత్తిలో 77.80 శాతం ఏపీ నుంచే జరగడం గమనార్హం. 28 శాతం ఎగుమతి వైజాగ్ పోర్టు నుంచే దేశంలో 10 పోర్టుల ద్వారా రూ.43,717.26 కోట్ల విలువైన 11,49,341 టన్నుల ఎగుమతులు జరిగాయి. వాటిలో రూ.16,124.92 కోట్ల విలువైన 2,80,687 టన్నుల మత్స్య ఎగుమతులు ఆంధ్రప్రదేశ్లోని పోర్టుల నుంచే జరిగాయి. అంటే మొత్తం ఎగుమతుల్లో 24 శాతం విలువైన 37 శాతం ఆక్వా ఉత్పత్తులు మన రాష్ట్ర పరిధిలోని పోర్టుల నుంచే వెళ్లాయి. ప్రధానంగా రూ.12,362.71 కోట్ల (28.28 శాతం) విలువైన 2,16,457 టన్నుల(18.83 శాతం) ఎగుమతులతో వైజాగ్ పోర్టు ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. రూ.5112.77 కోట్ల (11.70 శాతం) విలువైన 1,16,419 టన్నుల (10.13 శాతం) ఎగుమతితో కోల్కతా పోర్టు, రూ.4,994.75 కోట్ల (11.43 శాతం) విలువైన 1,43,552 టన్నుల (12.49 శాతం) ఎగుమతితో కొచ్చి పోర్టు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. రూ.3,762.21 కోట్ల (8.61 శాతం) విలువైన 64,230 టన్నుల (5.59 శాతం) ఎగుమతులతో రాష్ట్రంలోని కృష్ణపట్నం పోర్టు జాతీయస్థాయిలో నాలుగో స్థానంలో నిలిచింది. ఎగుమతుల్లో మనమే టాప్ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ తిరుగులేని ఆధిక్యతను కొనసాగిస్తోంది. 2020–21 మొదట్లో కరోనా కొంత ప్రభావం చూపినప్పటికీ ద్వితీయార్థంలో ఎగుమతులు అనూహ్యంగా పుంజుకున్నాయి. రికార్డు స్థాయిలో ఎగుమతులు చేయగలిగాం. నంబర్ 1గా నిలవగలిగాం. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
రైతులను అరెస్ట్ చేయించిన ఘనుడు చంద్రబాబు
-
లక్ష మంది రైతులతో వ్యవసాయ సలహా మండళ్లు
సాక్షి, అమరావతి : ‘ఎంతో అనుభవజ్ఞులైన లక్షమంది రైతులతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటయ్యాయి. ఇంతపెద్ద వ్యవస్థ మరే రాష్ట్రంలోనూ లేదు. వీరి సలహాలు, సూచనలతో రైతులకు ఎంతో మేలు చెయ్యొచ్చు’.. అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా ఏర్పాటైన ఈ సలహా మండళ్లను వ్యవసాయపరంగా అన్ని అంశాల్లో భాగస్వాములను చేస్తున్నామన్నారు. రైతులకు మరింత మెరుగైన సేవలందించేందుకే ఈ మండళ్లు ఏర్పాటయ్యాయని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో శుక్రవారం 13 జిల్లాల వ్యవసాయ సలహా మండళ్ల చైర్మన్లతో జరిగిన రాష్ట్రస్థాయి అవగాహన సదస్సులో మంత్రి కన్నబాబు మాట్లాడారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఏర్పాటుచేసిన ఈ సలహా మండళ్ల సహకారంతో రాష్ట్రంలో వ్యవసాయరంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. వ్యవసాయ, ఉద్యాన, సహకార, పట్టుసాగు, చేపలు రొయ్యల పెంపకం తదితర అన్ని అంశాల్లో ఈ మండళ్లు సూచనలిస్తే వాటిని సీఎం దృష్టికి తీసుకువచ్చి వ్యవసాయాన్ని మరింతగా అభివృద్ధి చెయ్యొచ్చన్నారు. సాగుచేసే ప్రతి ఎకరాను ఈ–క్రాప్లో నమోదు చేయించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని మంత్రి కన్నబాబు అన్నారు. బోర్ల కింద వరి పండించకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ–క్రాప్, సీఎం యాప్లను మరింత సరళతరం చేసి రైతులకు అర్ధమయ్యేలా చెయ్యాలన్నారు. అనంతరం వ్యవసాయ సలహా మండళ్ల ఆవిర్భావం, ఉద్దేశ్యాలు, బాధ్యతలు తదితర అంశాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులు అవగాహన కల్పించారు. పంటల ప్రణాళిక, డిమాండ్ మేరకు ఉత్పత్తి, పంటల మార్పు, రైతులకు ఆర్బీకేలో అందుతున్న సేవలు, మార్కెట్ ఇంటెలిజెన్స్, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలపై సలహాలిస్తూ రైతుల్ని చైతన్యపరచాలని సూచనలు చేశారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఏపీ వ్యవసాయ మిషన్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ అనుబంధ శాఖల కమిషనర్లు అరుణ్కుమార్, ప్రద్యుమ్న, శ్రీధర్, అహ్మద్బాబు, కన్నబాబు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆర్ అమరేంద్రకుమార్, ఏపీ సీడ్స్, ఆయిల్ ఫెడ్, ఆగ్రోస్ ఎండీలు శేఖర్బాబు, శ్రీకంఠనాథరెడ్డి, కృష్ణమూర్తి, సీడ్స్ సర్టిఫికేషన్ డైరెక్టర్ త్రివిక్రమరావు తదితరులు పాల్గొన్నారు. -
పశ్చిమ డెల్టాలో ఫిషరీస్ వర్సిటీ
సాక్షి, అమరావతి: ఆక్వా రాజధాని ‘పశ్చిమ డెల్టా’లో ఫిషరీస్ యూనివర్సిటీ నెలకొల్పే దిశగా రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సరిపల్లి–లిఖితపూడి గ్రామాల మధ్య ఈ వర్సిటీ ఏర్పాటు కాబోతోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 40 ఎకరాల భూమిని కేటాయించింది. దీనికి రూ.332 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.100 కోట్లు కేటాయించింది. వర్సిటీ నిర్మాణానికి సెప్టెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. నిపుణుల కొరత తీర్చేలా.. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో 29 శాతం, రొయ్యల ఉత్పత్తిలో 68 శాతం వాటా ఏపీదే. మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లోనూ 40 శాతం వాటా రాష్ట్రానిదే. రాష్ట్ర స్థూల ఆదాయంలో 8.67 శాతం (రూ.55,294 కోట్లు) ఈ రంగం నుంచే వస్తోంది. గడచిన పదేళ్లలో సముద్ర చేపల ఉత్పత్తి రెట్టింపు కాగా, రొయ్యల ఉత్పత్తి నాలుగు రెట్లు, సంప్రదాయ చెరువుల్లో చేపల ఉత్పత్తి రెండున్నర రెట్లు, ఉప్పు, మంచినీటి చెరువుల్లో రొయ్యల ఉత్పత్తి 15 రెట్లు పెరిగింది. ఈ రంగంపై 8.50 లక్షల మంది మత్స్యకార కుటుంబాలతో పాటు 26.50 లక్షల మంది ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. ఏటా 11 శాతం వృద్ధిరేటు సాధిస్తున్న ఆక్వా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ రంగంలో నిపుణుల కొరతను తీర్చడంతోపాటు లోతైన పరిశోధనలు చేపట్టడం.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో ప్రత్యేకంగా ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తోంది. మరో రెండు కళాశాలల ఏర్పాటు ఈ వర్సిటీకి అనుబంధంగా శ్రీకాకుళం జిల్లా పలాస, కృష్ణా జిల్లా కైకలూరు వద్ద కూడా ఫిషరీస్ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వర్సిటీకి అనుబంధంగా మరిన్ని పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు కాబోతున్నాయి. సర్కారు చర్యల వల్ల ఆక్వా రంగంలో పరిశోధనలు పెరగడమే కాకుండా నిరుద్యోగ యువతకు విద్యా, ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చడంతోపాటు ఆక్వా రంగంపై ఆధారపడిన వారి నైపుణ్యతను పెంపొందించేందుకు అవకాశం కలుగుతుంది. దేశంలోనే మూడో వర్సిటీ దేశంలోని కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రమే ఫిషరీస్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఏపీలో నిర్మిస్తున్న ఈ వర్సిటీ దేశంలోæ మూడోది కానుంది. ఇందుకు అవసరమైన భూమిని రెవెన్యూ శాఖ ఇప్పటికే గుర్తించి ఇటీవలే మత్స్య శాఖకు అప్పగించింది. తొలి దశలో ఇచ్చే రూ.100 కోట్లతో పరిపాలనా భవనం, అకడమిక్ బ్లాక్, విద్యార్థులు, విద్యార్థినులకు వేర్వేరుగా హాస్టల్స్, రైతులకు శిక్షణ కేంద్రం, మల్టీపర్పస్ బిల్డింగ్ వంటి సదుపాయాలు కల్పిస్తారు. రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో అంతర్జాతీయ ప్రమాణాలతో వర్సిటీని నిర్మించేందుకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. టెండర్లు పిలిచేందుకు కసరత్తు ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.100 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో పరిపాలన, విద్యా సంబంధిత భవనాలతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు త్వరలో టెండర్లు పిలవబోతున్నాం. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్య శాఖ వచ్చే విద్యా సంవత్సరం నుంచే.. ఫిషరీస్ యూనివర్సిటీ ప్రాంగణంలో కొత్తగా మత్స్య కళాశాల కూడా ఏర్పాటు కానుంది. తొలుత బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్ కోర్సుతో వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తరువాత మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్, పీహెచ్డీ కోర్సులను సైతం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీహెచ్డీలలో ఆక్వా కల్చర్, అక్వాటిక్, యానిమల్ హెల్త్ మేనేజ్మెంట్, ఫిషరీస్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ తదితర కోర్సులు ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నెల్లూరు జిల్లా ముత్తుకూరు వద్ద మత్స్య కళాశాల, అవనిగడ్డ మండలం బావదేవరపల్లి వద్ద ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాల ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఉప్పు నీటి రొయ్యలు, బిక్కవోలు మండలం బలభద్రపురంలో మంచినీటి చేపల పరిశోధనా కేంద్రాలు ఉండగా.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి వద్ద మంచినీటి చేపలు, రొయ్యల పరిశోధనా కేంద్రం ఉంది. ఇవన్నీ ఇకపై ఫిషరీస్ యూనివర్సిటీకి అనుబంధంగా పనిచేస్తాయి. -
మత్స్యకారులకు 'కొత్త ఉపాధి'
సాక్షి, అమరావతి: చేపల వేటపైనే ఆధారపడి జీవనోపాధి సాగించే మత్స్యకార కుటుంబాలకు కొత్త ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. ఎలాంటి రిస్క్ లేకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడినిచ్చే సముద్ర నాచు (సీవీడ్స్)సాగులో మత్స్యకార మహిళలను ప్రోత్సహించాలని సంకల్పించింది. సముద్రగర్భంలో సహజసిద్ధంగా పెరిగే నాచుమొక్కల ద్వారా వచ్చే కెర్రాజీనన్, అల్జిన్, అల్జినేట్స్, ఆగర్ వంటి ఉప ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని కొన్ని రకాల పరిశ్రమలతో పాటు మందులు, మద్యం, కాస్మోటిక్స్, బేకరీ ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 33మిలియన్ టన్నుల సముద్ర నాచు ఉత్పత్తి జరుగుతుండగా, చైనా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. మూడు వైపులా సముద్రతీరంతో పాటు అపారమైన మంచినీటి వనరులున్న భారతదేశంలో 10 లక్షల టన్నుల (మిలియన్) ఉత్పత్తి సామర్ధ్యం ఉంది. కానీ సాగుపట్ల అవగాహన లోపం, కొరవడిన ప్రభుత్వ సహకారం వల్ల కేవలం 25వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. దీంట్లో నాల్గోవంతు తమిళనాడులోనే సాగవుతోంది. ఈ నాచుకున్న ప్రాధాన్యతను గుర్తించిన కేంద్రం తీర ప్రాంత రాష్ట్రాలతో కలిసి సీవీడ్ సాగును ప్రోత్సహించాలని సంకల్పించింది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎం ఎస్వై) కింద 60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక చేయూతనివ్వనున్నాయి. తద్వారా రానున్న ఐదేళ్లలో దేశంలో 17లక్షల టన్నులు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశిస్తే మన రాష్ట్రంలో కనీసం 1.50లక్షల టన్నులు ఉత్పత్తి చెయ్యాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ రెండు రకాలకే డిమాండ్ 970 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతమున్న మన రాష్ట్రంలోని సీ వెడ్ సాగుకు అపారమైన అవకాశాలున్నాయని 1979–82లో నిర్వహించిన పరిశోధనల్లో సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఎంసీఆర్ఐ) గుర్తించింది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 19 ప్రాంతాలు అనువైనవిగా ప్రాథమికంగా గుర్తించారు. తీర ప్రాంతంలో 78 రకాల సీవీడ్స్ ఉన్నప్పటికీ వాటిలో ‘కప్పాఫైకస్, గ్రాసిలేరియా’కు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. మూడురకాలుగా సాగు .. రాప్ట్, ట్యూబ్, మోనోలైన్ పద్ధతిలో వైర్లకు ద్రాక్ష తీగల మాదిరిగా మొక్కలను కడతారు.ఒక్కోదానికి 45–60 కేజీల వరకు సీవీడ్స్ను కట్టి అలల తాకిడి, పూడిక, చిక్కదనం లేని తీరప్రాంతంలో 6–8 మీటర్ల లోతులో వీటిని అమర్చి సాగు చేస్తారు. రూ.1.50లక్షల పెట్టుబడి.. రూ.6లక్షల ఆదాయం మార్కెట్లో కిలో నాచు రూ.60 పలుకుతోంది. 15 మందితో ఏర్పాటయ్యే ఒక్కో క్లస్టర్ పరిధిలో 1.50 లక్షల పెట్టుబడితో సాగు చేస్తే 6లక్షల వరకు ఆదాయం వస్తుంది. పైగా పెట్టుబడిలో 60 శాతం సబ్సిడీ ఇస్తారు. రూ.1.86 కోట్లతో 7,200 యూనిట్లు రాష్ట్రానికి ఈ ఏడాది 7,200యూనిట్లు మంజూరు చేశారు. రూ.1.86కోట్లు కేటాయించారు. ఈ మొత్తంలో రూ.1.12కోట్లు సబ్సిడీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనుండగా, 74.40లక్షలు లబ్ధిదారులు భరిస్తారు. ఇప్పటికే జిల్లాలకు 55.80 లక్షలు విడుదల చేశారు. మార్కెటింగ్ కోసం పలు కంపెనీలు–సాగు దారుల మధ్య ఒప్పందం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సముద్ర నాచు సాగు లాభాలెన్నో తీర ప్రాంత మండలాల్లోని మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుçపర్చే లక్ష్యంతో సముద్ర నాచుసాగును ప్రోత్సహిస్తున్నాం. రానున్న 5 ఏళ్లలో 1.50లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేశాం.రిస్క్ చాలా తక్కువ. పైగా కచ్చితమైన ఆదాయం. మత్స్యకార మహిళలు ముందుకు రావాలి. –కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
రైతు నాయకుడు అంటే గుర్తు వచ్చేది YSR గారు : కన్నబాబు
-
ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన స్థలాన్ని అమ్మవద్దు
సాక్షి, తూర్పుగోదావరి : లక్షలాది మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లనే సాధ్యమైందని మంత్రి కన్నబాబు అన్నారు. ప్రజల గుండెల్లో ఉండేలా ఆలోచన చేసిన నాయకుడని కొనియాడారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మాటిస్తే.. ఎంత కష్టమైనా ఆ మాటకు కట్టుబడే నాయకుడు సీఎం జగన్. మీ పిల్లలకు పుట్టింటి ఆస్తిలా ఇళ్ల స్థలాలను సీఎం జగన్ ఇచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన స్థలాన్ని అమ్మవద్దు’’ అని అన్నారు. -
చంద్రబాబు వ్యాక్సిన్ వేయించుకున్నారా? లేదా?
-
విశాఖ జిల్లా అభివృద్ధిపై మంత్రుల సమీక్షా సమావేశం
-
సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్ నిజమైన అర్థం చెబుతున్నారు
-
సీఎం జగన్ ప్రమాణ స్వీకారం ఒక చారిత్రాత్మకం
-
వ్యవసాయం దండగ అన్నందుకు చంద్రబాబును ఓడించారు
-
వైఎస్సార్ మత్స్యకార భరోసా
-
గంగ పుత్రులకు నేడు ‘మత్స్యకార భరోసా’
సాక్షి, అమరావతి: సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చే లక్ష్యంతో అమలు చేస్తున్న వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద ఈ ఏడాది మరింత మందికి లబ్ధి చేకూరనుంది. సంతృప్త స్థాయిలో (అర్హత గల వారిని ఒక్కరిని కూడా వదలకుండా) 1,19,875 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున రూ.119,87,50,000 మేర లబ్ధి కలగనుంది. సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఉదయం కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా సొమ్ములు జమ చేయనున్నారు. గడచిన రెండేళ్లలో మత్స్యకారులకు రూ.211.71 కోట్ల మేర లబ్ధి కలిగింది. ఈ ఏడాది మరో రూ.119.87 కోట్లతో కలిపి మూడేళ్లలో రూ.331.58 కోట్ల మేర లబ్ధి చేకూరుతోంది. రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచిన సర్కారు గతంలో రూ.4 వేల చొప్పున మాత్రమే ఇచ్చిన భృతి మొత్తాన్ని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది. రెండేళ్లుగా ఏటా క్రమం తప్పకుండా వేట నిషేధ సమయంలోనే భృతిని అందజేస్తూ మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ విధంగా 2019లో 1,02,478 కుటుంబాలకు రూ.102.48 కోట్లు లబ్ధి చేకూర్చగా, 2020లో 1,09,231 కుటుంబాలకు రూ.109.23 కోట్ల మేర సాయమందించారు. ఇతర సబ్సిడీల రూపంలో.. బోట్లపై సముద్రంలోకి వేట కోసం బోట్లపై వెళ్లేందుకు వినియోగించే ఆయిల్పై సబ్సిడీ రూపంలో 2019–20లో 10.06 కోట్లు, 2020–21లో రూ.22.70 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. విద్యుత్ చార్జీల సబ్సిడీ రూపంలో 53,500 మంది లబ్ధిదారులకు 2019–20లో రూ.720 కోట్లు, 2020–21లో నవంబర్ వరకు రూ.420 కోట్లు చెల్లించింది. వేట సమయంలో ప్రమాదవశాత్తు మత్స్యకారులు మరణిస్తే ఒక్కొక్క కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున 2019–20లో రూ.2.20 కోట్లు, 2020–21లో రూ.1.20 కోట్లను ఎక్స్గ్రేషియా రూపంలో చెల్లించింది. మత్స్యకారేతరులకూ వర్తింపు మత్స్యకారులతో పాటు సముద్రంలో చేపల వేటే జీవనాధారంగా బతుకుతున్న ఇతర సామాజిక వర్గాల వారిని కూడా ఈ ఏడాది అర్హులుగా గుర్తించాం. ఈ విధంగా బీసీలు 1,18,119 మంది, ఓసీలు 747 మంది, ఎస్సీలు 678 మంది, ఎస్టీలు 331 మంది అర్హులుగా నిర్ధారించాం. – కె.కన్నబాబు, మత్స్య శాఖ కమిషనర్ -
కోవిడ్ బాధితులకు విశాఖ కే జీ హెచ్ లో మెరుగైన వైద్య సేవలు
-
రైతు ఉత్పత్తుల ధరలు పడిపోకుండా చూడాలి
సాక్షి, అమరావతి : కోవిడ్, కర్ఫ్యూ దృష్ట్యా రైతులు, వినియోగదారులపై.. ఎలాంటి దుష్ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. రైతులకు ఎలాంటి నష్టం రాకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. గురువారం వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో స్పెషల్ సీఎస్ పూనమ్ మాలకొండయ్య, అగ్రికల్చర్ కమిషనర్ అరుణ్ కుమార్, మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విత్తనాల సరఫరాకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కోవిడ్ వల్ల రైతు ఉత్పత్తుల ధరలు పడిపోకుండా చూడాలన్నారు. నిత్యావసర వస్తువుల రవాణాకు కూడా తగిన అనుమతులు కల్పించాలని, రైతులకు అవసరమైన ఎరువులు, రసాయనాల దుకాణాలు కూడా సాయంత్రం వరకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. -
సీఎం జగన్ ధాటికి టీడీపీ జెండా పీకేయడమే
సాక్షి, అమరావతి: మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు చేసిన ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమికి భయపడే పోటీ నుంచి తప్పించుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రులు కన్నబాబు, గౌతమ్రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. బాబుకు ఓటమి భయం:మంత్రి కన్నబాబు చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది మంత్రి కన్నబాబు తెలిపారు. ఓటమి భయంతోనే చంద్రబాబు పారిపోతున్నారని చెప్పారు. గత ఎన్నికల సంఘం కమిషనర్ నిర్ణయాన్నే కొత్త ఎస్ఈసీ కొనసాగిస్తున్నారని గుర్తుచేశారు. సీఎం జగన్ ధాటికి చంద్రబాబు టీడీపీ జెండా పీకేయడం ఖాయమని పేర్కొన్నారు. ఆఫీస్ మూసేసుకోవచ్చు: మంత్రి గౌతమ్రెడ్డి ఎన్నికల్లో పాల్గొనకపోతే పార్టీ ఎందుకు? ఇక టీడీపీ ఆఫీసును మూసేసుకోవచ్చు అని మంత్రి గౌతమ్రెడ్డి ఎద్దేవా చేశారు. నాయకత్వం ఎలా ఉండాలో.. సీఎం జగన్ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. ఏకగ్రీవాలపై హైకోర్టు తీర్పు ఇచ్చాక.. చంద్రబాబు విభేదించడం ఏమిటి? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో వందశాతం ఓడిపోతుందనే బాబు పారిపోతున్నారని పేర్కొన్నారు. అనైతిక రాజకీయాలు బాబుకే సాధ్యం: పెద్దిరెడ్డి చంద్రబాబు చేతగాని తనాన్ని తమపై నెడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనైతిక రాజకీయాలు చంద్రబాబుకే సాధ్యమని స్పష్టంచేశారు. సీఎం జగన్ సంక్షేమ పాలనకు ప్రజలు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పట్టం కట్టారని, ఈ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే చంద్రబాబు పారిపోతున్నారని చెప్పారు. ఆ ప్రకటన ఓ డ్రామా: వైవీ సుబ్బారెడ్డి చంద్రబాబు ప్రకటన ఓ డ్రామాగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అభివర్ణించారు. నాటకాలాడటంలో చంద్రబాబు దిట్ట అని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే బాబు పోటీ నుంచి తప్పించుకుంటున్నారని తెలిపారు. సీఎం జగన్ సంక్షేమ పాలనను చూసి బాబు జీర్ణించుకోలేకపోతున్నారని, అన్ని వర్గాలకు గడప వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని వైవీ సుబ్బారెడ్డి వివరించారు. చదవండి: జ్యోతుల నెహ్రూ, అశోక్ గజపతి అసంతృప్తి చదవండి: ఓటమి భయంతోనే బాబు ఎన్నికల బహిష్కరణ -
పవన్ కల్యాణ్ స్పష్టత లేని రాజకీయాలు చేస్తున్నారు
సాక్షి, విశాఖపట్నం : జనసేన అధినేత, సినిమా హీరో పవన్ కల్యాణ్ స్పష్టత లేని రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కన్నబాబు అన్నారు. చంద్రబాబునాయుడు, నారా లోకేష్ బాబు హైదరాబాద్కే పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్తా ఏమిటో ఈ ఎన్నికల ద్వారా తెలిసింది. గత పంచాయతీ ఎన్నికల్లో 84 శాతం గెలుచుకుంటే ఈ ఎన్నికల్లో 98 శాతం వైఎస్సార్ సీపీ గెలిచింది. చంద్రబాబుకు ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్. పరిపాలనా రాజధానికి ప్రజలు మద్దతు తెలిపారు. చంద్రబాబు స్టీల్ ప్లాంట్పై తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదు. బాబు తప్పుడు ప్రచారం వలన గాజువాకలో కొంత గట్టి పోటీ ఎదుర్కొన్నాము’’ అని అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయం : ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం : ‘‘ రాష్ట్ర చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయం. ప్రజలు స్పష్టమైన తీర్పు చెప్పారు. ఎన్నికలు ఎలాంటివైనా సరే వైఎస్సార్ సీపీదే విజయం అని తేలిపోయింది. 20 నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సంక్షేమ పాలనతో గొప్ప సీఎంగా నిలిచిపోయారు. మూడు రాజధానులకి ప్రజలంతా మద్దతు పలికారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాల్లోనూ వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనం. టీడీపీ కంచుకోటలు బద్దలయ్యాయి. చంద్రబాబు ఇప్పటికైనా తన ఓటమిని హుందాగా అంగీకరించాలి. కుయుక్తులతో రాజకీయాలు నడపాలి అనుకునేవారికి ప్రజలు తమ ఓటుతోనే చావు దెబ్బ కొట్టారు.’’ చదవండి : బేవర్స్ రాజకీయాలు చేసే వ్యక్తి సబ్బం హరి -
ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి :మంత్రి కన్నబాబు
-
టీ డి పి అహంభావాన్ని ప్రజలు పీకేశారు : కన్నబాబు
-
అభ్యర్థి చనిపోతే ఎన్నిక వాయిదా
సాక్షి, అమరావతి: గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసి, పరిశీలనలో ఆ నామినేషన్ సక్రమమే అని నిర్ధారణ జరిగిన తర్వాత అభ్యర్ధి మరణించిన పక్షంలో ఆ మున్సిపల్ వార్డు/ కార్పొరేషన్ డివిజన్లో ఎన్నిక వాయిదా వేసేందుకు సంబంధిత రిటర్నింగ్ అధికారికి ప్రత్యేక అధికారాలు ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద ప్రత్యేక ఎన్నికల గుర్తును పొందిన రిజిస్టర్డ్ రాజకీయ పార్టీ అభర్థి మరణించినా ఎన్నిక వాయిదా వేయవచ్చునని తెలిపింది. మున్సిపల్, నగర పాలక సంస్థల ఎన్నికలలో భాగంగా గతంలో జరిగిన నామినేషన్ దాఖలు ప్రక్రియకు, తాజాగా ఇప్పటి ఎన్నికల ప్రక్రియకు మధ్య దాదాపుగా ఏడాది అంతరం ఏర్పడింది. ఈ ఏడాది సమయంలో కొన్నిచోట్ల పోటీలో ఉన్న అభ్యర్థులు మరణించారు. ఈ నేపథ్యంలో ఉత్పన్నమైన సందేహాలపై వివరణ ఇస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ కార్యదర్శి కన్నబాబు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పోటీలో ఉన్న అభ్యర్థి మరణించినప్పుడు రిటర్నింగ్ అధికారి ఎలా వ్యవహరించాలో తెలియజేయడంతో పాటు, నామినేషన్ల ఉపసంహరణ నిబంధనలను వెల్లడించారు. అభ్యర్థులు చనిపోయినటువంటి ప్రత్యేక పరిస్థితులలో రిటర్నింగ్ అధికారి.. స్పష్టమైన ఆధార సహిత వివరాలు సేకరించిన తర్వాతనే ఎన్నికల వాయిదాపై నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. వాయిదా వేస్తే ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్కు తెలియజేయాలని సూచించారు. -
చంద్రబాబు హయాంలో పాలరంగాన్ని గాలికొదిలేశారు
-
నటించడం మా సీఎంకు రాదు: కన్నబాబు
సాక్షి, అమరావతి : రైతులకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తున్నారు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అన్నారు. అధికారంలోకి రాగానే రైతు పక్షపాతినని సీఎం జగన్ ప్రకటించారని గుర్తుచేశారు. రైతులకు ఉచితంగా బోర్లు, మోటార్లు, పైపులు ఇస్తున్నామన్నారు. పంటల కొనుగోలుకు రూ.3,200 కోట్లు కేటాయించామని వెల్లడించారు. రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని, సహకార రంగాన్ని ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం జగన్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. పరిపాలకుడు బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజున వ్యవసాయరంగంపై చర్చ సందర్భంగా మంత్రి కన్నబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు. (ఇది కేవలం ఫార్మాలిటీ మాత్రమే: సీఎం జగన్) అన్నీ తానే చేసినట్లు చంద్రబాబు ఫోజులు.. శాసనసభలో కన్నబాబు మాట్లాడుతూ.. ‘రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారు. టీడీపీకి అమరావతి రైతులే తప్ప మిగతా రైతులు కనిపించడం లేదు. వరదల సమయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. డిసెంబర్ నెలాఖరుకల్లా బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రంగుమారిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునే బాధ్యత మాది. సీఎం జగన్ స్వయంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. ఏరియల్ సర్వేలను గాలి సర్వేలని చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు చేసిన సర్వేలను ఏమనాలి. హుద్హుద్ తుపాను వస్తే అన్నీ తానే చేసినట్లు చంద్రబాబు ఫోజులిచ్చారు. నటించడం మా ముఖ్యమంత్రికి రాదు. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఏ సీజన్లో పంట నష్టం జరిగితే.. ఆ సీజన్లోనే పరిహారం ఇవ్వాలనేది సీఎం జగన్ ఆదేశం. ఉచిత పంటల బీమాను అమలు చేస్తున్నాం. ఈ క్రాప్లో నమోదు చేసుకుంటే చాలు ఉచిత పంటల బీమా వర్తింపు. రైతుల కోసం రాష్ట్రప్రభుత్వమే బీమా కంపెనీని ఏర్పాటు చేస్తుంది. కేంద్రం అనుమతి వచ్చిన వెంటనే బీమా కంపెనీని ఏర్పాటు చేస్తాం. రైతు భరోసా కింద ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.11,981 కోట్లు వేశాం. ఏడాదిన్నరలో నేరుగా రైతుల ఖాతాల్లో రూ.13,463 కోట్లు వేశాం. పొగాకు రైతులనుసైతం ఆదుకునేందుకు పొగాకును కొనుగోలు చేశాం. సుమారు రూ.120 కోట్లతో పొగాకును కొనుగోలు చేశాం. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. చేయూత పథకం కింద మహిళలకు పాడి పశువులు అందిస్తున్నాం. సహకార చక్కెర కర్మాగారాలను చంద్రబాబు అమ్మేశారు. చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కోసం మేం సబ్కమిటీలను వేశాం కరోనా సమయంలో ధరలు పడిపోయిన అరటి, బత్తాయి పంటలను కొన్నాం. ధర పడిపోయిన ప్రతిసారి ఉల్లిని కొనుగోలు చేశాం’ అని వివరించారు. -
'టీడీపీ క్యాడర్ నిమ్మగడ్డనే ఎక్కువ నమ్ముతోంది'
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎన్నారై పార్టీగా తయారయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హైదరాబాద్ ఉండి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పోలవరం పూర్తి కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. పక్క రాష్ట్రాలతో కేసులు వేయించారు. పోలవరం భూసేకరణ పూర్తి కాకుండా అడ్డుపడ్డారు. పోలవరం దగ్గర 150 అడుగుల వైఎస్సార్ విగ్రహం పెడతామంటే చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదు. 2018కి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పిన మాటలు ఏమయ్యాయి..?. 2021 డిసెంబర్కు పోలవరం పూర్తి చేస్తాము. టీడీపీ తొత్తుగా నిమ్మగడ్డ నిమ్మగడ్డ చంద్రబాబు తొత్తుగా మారిపోయారు. టీడీపీ అధికార ప్రతినిదిగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. ఎన్నిలు చంద్రబాబు పెట్టమంటే పెడుతున్నారు. వద్దంటే మానేస్తున్నారు. రాజ్యాంగ నిబంధనలు నిమ్మగడ్డ తుంగలో తొక్కుతున్నారు. టీడీపీ నేతలతో స్టార్ హోటల్లో కూర్చొని మంతనాలు జరిపిన వ్యక్తి నిమ్మగడ్డ. కరోనా లేని సమయంలో వాయిదా వేశారు. కరోనా ఎక్కువుగా ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహిస్తామంటున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని నిమ్మగడ్డ రమేష్ పట్టించుకోలేదు. టీడీపీ క్యాడర్ చంద్రబాబు కంటే నిమ్మగడ్డను ఎక్కుగా నమ్ముతున్నారు. నిమ్మగడ్డ పదవీ విరమణ తరువాత టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారు అనే అనుమానం మాకు ఉంది. చంద్రబాబును దింపి టీడీపీ నేతలు నిమ్మగడ్డకు పగ్గాలు అప్పగిస్తారనే అనుమానం కలుగుతుంది. పేదలకు ఇళ్లు ఇస్తామంటే దేశ చరిత్రలో అడ్డుకున్న పార్టీ టీడీపీ మాత్రమే. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలమయ్యారు. ('ఇలాంటిదెప్పుడైనా ఊహించారా.. దటీజ్ సీఎం జగన్') విశాఖ ఎయిర్ పోర్ట్పై చర్చకు సిద్ధం విశాఖ ఎయిర్ పోర్ట్ ప్రభుత్వం ఎయిర్ పోర్ట్ కాదు నేవి ఎయిర్ పోర్ట్. ల్యాండింగ్ టేక్ ఆఫ్ ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి చిన్న విషయంలో నావీ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వచ్చిన తరువాత బేగంపేట ఎయిర్ పోర్ట్ మూసేశారు. నాకు ఎలాంటి భూ లావాదేవీలాతో సంబంధం లేదు. నా పేరు చెప్పి ఎవరైనా బెదిరిస్తే నాకు లేదా పోలీసులు దృష్టికి తీసుకురండి. రాధాకృష్ణ, రామోజీరావు లాంటి వారు సమతుల్యం పాటించాలి. రాధాకృష్ణ ఛానెల్, పేపర్ నడపడానికి అనర్హుడు. విశాఖ ఎయిర్ పోర్ట్పై నాతో చర్చకు వస్తే అన్ని విషయాలు చర్చిస్తాను. జర్నలిస్ట్ కానీ జర్నలిస్ట్ రామోజీరావు. జర్నలిజం ముసుగు వేసుకొని ఒక పార్టీకి రాధాకృష్ణ కొమ్ము కాస్తున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన లేఖలోనే భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభమైతే విశాఖ ఎయిర్ పోర్ట్ మూసేవేయలని ఉంది. విశాఖ ఎయిర్ పోర్ట్పై రామోజీరావు, రాధాకృష్ణ తో చర్చించాలా. రెండు ఎయిర్ పోర్ట్ల మధ్య ఎంత దూరం ఉండాలో తెలియదా.. అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. విశాఖ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: అవంతి పరిశ్రమల ప్రోత్సాహం అభివృద్ధి సమస్యలపై రేపు జిల్లా సమావేశం జరుగుతుంది. అభివృద్ధికి వైఎస్సార్సీపీ వ్యతిరేకమన్నట్లు చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అన్ని విధాలుగా పరిశ్రమల అభివృద్ధికి మేము సిద్ధంగా ఉన్నాము. విశాఖ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. శుక్రవారం జరిగే సమావేశంలో జిల్లా ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు. చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం ఇండస్ట్రియల్ రీ స్టార్ట్ పేరుతో ఈ కార్యక్రమం రూపొందించారు అని మంత్రి అవంతి పేర్కొన్నారు. (తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సీఎం జగన్) నిమ్మగడ్డ స్వతంత్ర ప్రతిపత్తి ఏమైంది..?: కన్నబాబు చంద్రబాబుకు యనమల కో పైలెట్ లాంటివారని జిల్లా ఇన్చార్జి మంత్రి కన్నబాబు అన్నారు. 'యనమల స్పృహ లేకుండా మాట్లాడుతున్నారు. ఎన్నికల కమిషన్లా కాకుండా రమేష్ కమిషన్లా నిమ్మగడ్డ పనిచేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ వస్తుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తోంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. చంద్రబాబు ఏం చెపితే నిమ్మగడ్డ అదే చేస్తున్నారు. ఎన్నికలు అంటే వైఎస్సార్సీపీకి భయం లేదు. ఎన్నికలకు మేము భయపడలేదు, ప్రజల ఆరోగ్యం బాగుండాలని మేము కోరుకుంటున్నాము. ఎన్నికలు ఇప్పుడు నిర్వహించాల్సిన అవసరం ఏముంది. చంద్రబాబు హయాంలో జరగాల్సిన ఎన్నికలను ఎందుకు నిమ్మగడ్డ నిర్వహించలేదు. చంద్రబాబు హయాంలో నిమ్మగడ్డ స్వతంత్ర ప్రతిపత్తి ఏమైంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ('బాబు జీవితం మొత్తం వెన్నుపోట్లు, శవరాజకీయాలే') -
ఏపీకి భారీ వర్ష సూచన
సాక్షి, విజయవాడ: రానున్న నాలుగైదు గంటల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణశాఖ తెలిపింది. ఐఎండీ వాతావరణ సూచనల ప్రకారం.. గుంటూరు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఉభయ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తులశాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు. (గంటా ఆస్తుల వేలం..) -
'మూడు రాజధానులతో అభివృద్ధికి శ్రీకారం'
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినం సందర్భంగా రాష్ట్రమంతటా వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశాఖ కలెక్టర్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్య అతిథిగా జిల్లా ఇంచార్జి మంత్రి కురసాల కన్నబాబు, మంత్రి అవంతి శ్రీనివాసరావు, తెలుగు భాష సంఘం అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు. జాతీయ పతానికి గౌరవ వందనం చేసి, పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. (పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన సీఎం) ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు పోరాట పటిమ ఉంది. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు అభివృద్ధికి శ్రీకారం చూడుతుంది. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి అవుతుంది. స్వప్రయోజనాల కోసం రాష్ట్రాభివృద్ధికి కొందరు అడ్డుపడినా.. వెనకడుగు వేయకుండా ప్రభుత్వం అభివృద్ధి దిశగా వెళ్తోంది. జిల్లాలో 2.53 లక్షల మందికి 4,457 ఎకరాల ప్రభుత్వ, అసైన్ భూమి సేకరించి త్వరలో లబ్దిదారులకు అందిస్తాం. తెలుగు వారు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. విశాఖ పరిపాలనా రాజధానిగా ఎదుగుతోందని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనావాస్ అన్నారు. 'జిల్లాలో ఎక్కువగా ఉన్న ప్రభుత్వ భూమిని ఉపయోగించి అభివృద్ధి చేస్తాం. విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేసి ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా అవతరించేలా చేస్తాం' అని మంత్రి అన్నారు. తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ... మన రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1నాడే చేయాలి. మన నుంచి తెలంగాణ వేరు పడింది కానీ మన రాష్ట్రం అలాగే ఉంది. రాష్ట్రంలో తెలుగు అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని పేర్కొన్నారు. -
లోకేష్ చెబితే వాళ్ల కార్యకర్తలే వినరు : కన్నబాబు
సాక్షి, తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరద బాధితులను ఆదకునేందుకు అనునిత్యం చర్యలు తీసుకుంటున్నారని మంత్రి కన్నబాబు అన్నారు. లోకేష్, చంద్రబాబు చెబితే పాలన జరగడం లేదని, తండ్రీ కొడుకులు హైదరాబాద్లో కాపురం పెట్టి ఏపీపై పెత్తనం చేస్తున్నారని దుయ్యబట్టారు. లోకేష్ చెప్తే వాళ్ళ కార్యకర్తలే వినరని, తమ బాధ్యత ఏంటో తమకు తెలుసునని ఎద్దేవా చేశారు. బహుశా లోకేష్ కొత్తగా వరద ప్రాంతాల్లో పర్యటించినట్లున్నాడని మంత్రి కన్నబాబు అన్నారు. అమరావతి ఏ ఒక్కరికో నోటిఫై చేసిన ప్రాంతం కాదని, ఇక్కడ అందరికీ హక్కు ఉంటుందని తెలిపారు. మాదే పెత్తనం అంటే ఒప్పుకునేది లేదని, పేదలు, దళితులకు ఇళ్ల స్థలాలు పొందే హక్కు ఉందని గుర్తుచేశారు. (చంద్రబాబుది ఆరాటం.. జగన్గారిది నిరంతర పోరాటం) పీడబ్ల్యూగ్రౌండ్ సమీపంలోని రైతు బజార్ను సందర్శించిన కన్నబాబు వినియోగదారులకు సబ్సిడీ ఉల్లిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉల్లి ధరలు పెరగడంతో సబ్సిడీకి ఇవ్వాలని నిర్ణయించామని, మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయల స్టాక్ తెప్పిస్తున్నామని తెలిపారు. సబ్సిడీ భరించడానికి ప్రభుత్వం సిద్ధమైందని, రైతుతో పాటు వినియోగదారుడిని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. 'ప్రజల ప్రతీ అంశం సూక్ష్మంగా ఆలోచించే సీఎం జగన్ వినియోగదారులకు సబ్సిడీని ఇవ్వాలని నిర్ణయించారు. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ఉల్లి సరఫరా చేస్తున్నాం.దేశంలో నిత్యవసర వస్తువులపై స్పందించే సీఎం జగన్ మాత్రమ. ప్రతీ షాపు దగ్గర ధరల బోర్డులు ఉండాలి. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్,సబ్ కలెక్టర్లు నిత్యావసరాల సరఫరా పర్యవేక్షణ చేస్తారు. నిత్యావసరాలు ఎక్కడా బ్లాక్ చేయడానికి వీలు లేదు. బ్లాక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం' అని వెల్లడించారు. (వరదలు: సహాయ చర్యలపై సీఎం జగన్ ఆరా) -
లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాలి: మంత్రి ఆదేశం
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: అల్పపీడనం ప్రభావంతో ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలన్నారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ అధికారులతో ఫోన్ లో మాట్లాడి వరద పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులను, ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వర్షాల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలలో జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. జిల్లా రెవిన్యూ శాఖ పోలీస్ యంత్రాంగం సమన్వయంతో ఇతర శాఖలను అప్రమత్తం చేయాలని సూచించారు. భారీ వర్షాలు కారణంగా అంటూ వ్యాధులు ప్రబలకుండా ముందుగానే అన్ని ప్రాంతాల్లో మెడికల్ టీమ్స్ ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అవసరం ఉన్న ప్రాంతంలో మెడికల్ క్యాంపు లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న దృష్ట్యా ప్రజలు అనవసరంగా బైటికి రావద్దని సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ లోతట్టు ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అదేవిధంగా తమ్మిలేరుకు వరద ఉధృతి పెరిగింది. అక్కడ 5000 క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఏలూరు తమ్మిలేరుకు ఇరు వైపుల ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏలూరులోని లోతట్టు ప్రాంతంలో జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టండి అని ఆయన అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం 6:30 నుంచి 7: 30 మధ్య కాకినాడకు అతి సమీపంలో వాయుగుండం తీరం దాటిందని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. ఈ కారణంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చదవండి: భారీ వర్షాలు : ఉద్యోగులకు సెలవులు రద్దు -
భారీ వర్షాలు : ఉద్యోగులకు సెలవులు రద్దు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని భారీ వర్షాలపై పంచాయతీ రాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్ మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల డీపీవోలు, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో దీనిపై సమీక్షించారు. ఈ క్రమంలో పంచాయతీ రాజ్ అధికారులు, ఉద్యోగులందరికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని జిల్లాల్లో మంచి నీటి సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని గిరిజా శంకర్ ఆదేశించారు. వర్షాల కారణంగా పేరుకుపోయిన డ్రైన్ను శుభ్ర పరచాలని సూచించారు. అన్ని గ్రామాల్లోనూ క్లోరినషన్ చేపట్టాలని స్థానిక అధికారులను ఆదేశించారు. నిరంతరం వర్షాల పరిస్థితులు సమీక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా గిరిజా శంకర్ వెల్లడించారు. ఇక కాకినాడ సమీపాన వాయుగుండం తీరాన్ని తాకింది. దీంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర అంతటా వర్షాలు పడనున్నాయి. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, తీర ప్రాంత ప్రజలు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దీనిపై ఏపీ విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు మాట్లాడుతూ, ఇది డీప్ డిప్రెషన్ మాత్రమేనని, తుఫానులా మారలేదని చెప్పారు. ఫలితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రస్తుతం కాకినాడ ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని, రాగల మూడు నాలుగు గంటలు పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరుల మీదుగా వర్షాలు తెలంగాణా వైపు వెళతాయన్నారు. ప్రస్తుతం గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల మేర గాలులు వీస్తున్నాయన్నారు. తీర ప్రాంతంలో 60 నుంచి 65 కిలో మీటర్ల వేగం ఉండొచ్చు అని తెలిపారు. అన్ని జిల్లాల్లో సహాయకచర్యలు అందించడానికి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మంగళగిరిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సర్వం సిద్ధం చేసుకొని ఉన్నాయని తెలిపారు. రెండు రోజుల క్రితమే కాకినాడకు ఒక ప్లటూన్ ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపామని వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నానానికి ఏపీలో వర్షాలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. చదవండి: భారీ వర్షాలు: తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); -
‘గాంధీ ఆశయాలను నిజం చేసిన సీఎం జగన్’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. వైస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఇవాళ(అక్టోబర్ 2) మహత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీల జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కన్నబాబు, ఎంపీ నందిగాం సురేష్, పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. గాంధీ ఆశయ సాధన కోసం అందరం పునరంకితం కావాలన్నారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. గాంధీజీని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. గ్రామ స్వరాజ్యం ఆచరణలో చూపిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. (చదవండి: గాంధీ అడుగు నీడలో పాలన : సీఎం జగన్) ఇక సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విశ్వం ఉన్నంత వరకు తలుచుకోవాల్సిన మహ మనిషి గాంధీజీ అని చెప్పారు. ఆయనను స్మరించుకోవడమే కాకుండా గాంధీ ఆశయాలను నిజం చేసిన వ్యక్తి సీఎం జగన్ అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని ప్రజల ముంగిటకే తీసుకేళ్లిందని, సచివాలయ వ్యవస్థ ప్రతి కుటుంబంలో ఒక భాగంగా అయిందని తెలిపారు. ప్రతి ఇంటికి వాలంటిర్లు వెళ్లి పెన్షన్లుఇవ్వడమే ఇందుకు నిదర్శనమని, ప్రభుత్వం వదిలిపోయిన భయంకరమైన ఆర్థిక పరిస్థితిలో కూడా సీఎం వైఎస్ జగన్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. గాంధీజీ కలలు కన్న నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి కోర్టుల ద్వారా ప్రతిపక్షం అడ్డుపడుతోందని వచ్చే మూడేళ్లలో సమస్యలు లేని గ్రామాలు ఉండేలా చేస్తామన్నారు. పట్టణాలకు ధీటుగా గ్రమాలను తయారు చేస్తామని సజ్జల వ్యాఖ్యానించారు. -
విశాఖ ప్రమాదం: మెరుగైన వైద్యం అందించండి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పరవాడ ఫార్మా సిటీలో జరిగిన పేలుడుపై జిల్లా ఇంచార్జ్ మంత్రి కురసాల కన్నబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ పేలుడుకు సంబంధించిన వివరాలపై మంత్రి ఆరా తీశారు. అదే విధంగా జిల్లా కలెక్టర్తో ఫొన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. (విశాఖ ప్రమాదం.. అనాథలైన పిల్లలు) విశాఖపట్నం ఫార్మ సిటిలో పేలుడు ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడు ఘటనపై జిల్లా యంత్రాంగం ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఎవరికి ప్రాణ నష్టం లేకుండా వైద్యం అందించడానికి ప్రత్యేకంగా వైద్య బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. పరిసర ప్రాంతాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని గ్రామాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని మంత్రి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అదేశించారు. (విశాఖ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం) సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక కార్మికుడు చనిపోయినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాంకీ సాల్వెంట్ ఫాక్టరీలో రాత్రి 10.30 ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించగా.. కార్మికుడు శ్రీనివాసరావు అగ్నికి ఆహుతయ్యాడు. గాయాలపాలైన మరో కార్మికుడు మల్లేష్ను గాజువాకలోని ఆస్పుపత్రి తరలించారు. ప్రమాద సమయంలో అక్కడ మొత్తం ఆరుగురు కార్మికులు ఉన్నారు. (విశాఖ ప్రమాదంపై హోంమంత్రి దిగ్భ్రాంతి) -
భీమవరంలో ఆక్వా యూనివర్సిటీ
సాక్షి, అమరావతి: భీమవరంలో ఆక్వా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వర్సిటీ స్థాపనకు అవసరమైన భూమిని సేకరించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. ప్రాథమికంగా వర్సిటీ ఏర్పాటుకు కావాల్సిన భూమిని సేకరించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ► రాష్ట్రంలో ఏటా 25.52 లక్షల టన్నుల చేపలు, 11.82 లక్షల టన్నుల రొయ్యల దిగుబడి వస్తోంది. ఇది క్రమంగా పెరుగుతూనే ఉంది. ► చేపలు, రొయ్యల సాగులో శాస్త్రీయ విధానాలను అనుసరిస్తే ఈ దిగుబడి మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో సాగుకు సంబంధించిన వివిధ కోర్సులను బోధించే యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారు. ► ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఆక్వా సాగు అధికంగా జరుగుతుండటంతో ఈ జిల్లాల రైతులకు భీమవరం అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్పారు. ► ఈ జిల్లాల్లోనే శాస్త్రీయ విధానాలను అనుసరించే రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, హేచరీస్ నిర్వహణ, ఎగుమతి వ్యాపారాల్లో కొనసాగుతున్నవారు అధికంగా ఉన్నారు. వీటన్నింటినీ పరిశీలనలోకి తీసుకుని భీమవరంలో యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి మోపిదేవి వెంకట రమణారావు, ఇతర అధికారులను సీఎం ఆదేశించడంతో చర్యలు ఊపందుకున్నాయి. ► దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తాడే పల్లిగూడెం సమీపంలోని వెంకటరామన్న గూడెంలో ఉద్యానవన విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం భీమవరంలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పింది. ► ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించడం పట్ల ఆయా జిల్లాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో భూసేకరణ పూర్తి చేస్తాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు భీమ వరంలో ఆక్వా యూ నివర్సిటీ ఏర్పాటుకు అవసర మైన భూమిని సేకరించే ప్రయ త్నాలు చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్తో పలుమార్లు భూసేకరణపై చర్చలు జరిపాం. త్వరలోనే భూసేకరణ పూర్తి చేస్తాం. –కె. కన్నబాబు, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ -
అప్రజాస్వామికం.. అమానుషం
సాక్షి, అమరావతి: శాసనమండలిలో టీడీపీ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే.. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ అప్రజాస్వామికంగా వ్యవహరించి సభ నడిపారని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్, మంత్రులు కురసాల కన్నబాబు, ఆదిమూలం సురేష్, మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. యనమల రామకృష్ణుడు తన తెలివితేటలతో సభను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం సభ నడపమని వేడుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలి నిరవధిక వాయిదా అనంతరం వారంతా మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి బోస్ ఏమన్నారంటే.. ► రూల్–90 ప్రకారం ఏదైనా అంశంపై చర్చ చేపట్టాలంటే ఒకరోజు ముందే నోటీసు ఇవ్వాలి. చైర్మన్, సభా నాయకుడితో మాట్లాడి పరిగణనలోకి తీసుకోవాలి. ఇవేమీ పట్టించుకోకుండా చైర్మన్ రూల్–90ని పరిగణనలోకి తీసుకున్నారు. ► ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదిస్తే తప్ప ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేం. ► ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టాలన్న ఆలోచనతోనే టీడీపీ వ్యవహరించింది. ఉన్నత లక్ష్యాల కోసం ఏర్పడ్డ పెద్దల సభను అప్రతిష్ట పాల్జేశారు. టీడీపీకి రాజకీయమే ప్రాధాన్యత. రాష్ట్ర ప్రజల బాగోగులు అవసరం లేదు. ► ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ చేతులు జోడించి వేడుకున్నా పట్టించుకోలేదు. 33వేల ఎకరాల్లో వ్యాపారం చేసుకోవడం కోసమే ప్రభుత్వ బిల్లులను అడ్డుకున్నారు. ► యనమల రామకృష్ణుడిది పైశాచిక ఆనందం. టీడీపీ సభ్యులు వారి మాట వినకపోతే విధ్వంసం సృష్టిస్తామని బెదిరిస్తున్నారు. సభా సంప్రదాయాలు, నిబంధనలు వారికి అవసరం లేదు. శాసన మండలి సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు. చిత్రంలో మంత్రులు, వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు చరిత్రలో దుర్దినం : మంత్రి కన్నబాబు ► టీడీపీ సభ్యులు సభా నిబంధనల్ని ఉల్లంఘించారు. మెజార్టీ ఉందని ఇష్టానుసారం వ్యవహరించారు. చరిత్రలో ఇది దుర్దినం. ► మంత్రి వెలంపల్లి శ్రీనివాస్పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఫొటోలు తీయొద్దని చెప్పినందుకు లోకేష్ దాడికి దిగారు. సభలో ఫొటోలు తీసి లోకేష్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ► దీనిపై కచ్చితంగా సభా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. లోకేష్ విధానం సరికాదని చైర్మన్ కూడా చెప్పారు. ► మండలి నిరవధిక వాయిదా వెనుక యనమల ప్లాన్ ఉంది. మెజార్టీ ఉందని సభను అడ్డుకుంటున్నారు. ► డిప్యూటీ చైర్మన్ తీరు ఆక్షేపణీయం. టీడీపీకి తప్ప ఏ ఇతర పార్టీ సభ్యులకు అవకాశం ఇవ్వలేదు. ► మూడ్ ఆఫ్ ద ఫ్లోర్ తీసుకోవాలని నాలుగు గంటలు కోరాం. బీజేపీ, పీడీఎఫ్, ఇతర సభ్యుల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోలేదు. దాడికి దిగారు: మంత్రి ఆదిమూలపు ► టీడీపీ సభ్యులు సభ నియమ, నిబంధనల్ని తుంగలో తొక్కారు. మంత్రులపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. ► పాస్ చేయాల్సిన బిల్లులను అడ్డుకున్నారు. సంక్షేమ కార్యక్రమాల్ని టీడీపీ అడ్డుకుంటోంది. వాయిదా వేయడం శోచనీయం: చీఫ్ విప్ ఉమ్మారెడ్డి ► శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ నిర్ణయాలు అప్రజాస్వామికంగా ఉన్నాయి. టీడీపీ సభ్యులు కుట్రతోనే వచ్చారు. ► కీలక బిల్లులు ఆమోదించకుండానే సభను వాయిదా వేయడం శోచనీయం. టీడీపీ సభ్యులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి అవకాశం ఇవ్వలేదు. సభను విచ్ఛిన్నం చేయడానికి టీడీపీ ప్రయత్నించింది. గత సమావేశాల్లో మాదిరిగానే చైర్మన్ వ్యవహరించారు. ఇపుడు ఏం జరగనుంది? ద్రవ్య వినిమయ బిల్లు ► ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించకుండా మండలిలో అడ్డుకోవడంవల్ల మహా అయితే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ఇతర చెల్లింపులు ఒకటి రెండు రోజులు ఆలస్యం కావడం మినహా ఎలాంటి సమస్య ఉండబోదని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. ► శాసనసభ ఆమోదించిన ఆర్థిక బిల్లులను మండలి 14 రోజులు జాప్యం చేయగలదు తప్ప అంతకుమించి ఎలాంటి అధికారం లేదు. ► ‘ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ ఈనెల 17న ఆమోదించింది. ఇక 14 రోజులు అంటే ఈ నెలాఖరుతో గడిచిపోతాయి. వచ్చే నెల ఒకటి లేదా రెండో తేదీ నుంచి యథా ప్రకారం చెల్లింపులు చేయవచ్చు’ అని నిపుణులు తెలిపారు. సీఆర్డీఏ రద్దు.. వికేంద్రీకరణ ► ఆర్థికేతర బిల్లులను రెండోసారి మండలిలో అడ్డుకోవడంవల్ల నెల రోజులు అవి చట్టరూపం దాల్చ కుండా ఆగిపోతాయి. నెల రోజుల్లో మండలి ఆమోదించినా, తిరస్కరించినా రాజ్యాంగంలోని ఆర్టికల్ 197 ప్రకారం ఆ బిల్లులు ఆమోదం పొందినట్లే. ► ఏదైనా బిల్లును శాసనసభ ఆమోదించి మండలికి పంపితే అది మూడు నెలలు మాత్రమే దానిని ఆపగలదు. మూడు నెలల్లో తిరస్కరించినా, వెనక్కు పంపినా మళ్లీ అసెంబ్లీ ఆమోదించి పంపవచ్చు. ఇలా వచ్చిన బిల్లును మండలి నెల రోజుల్లోగా ఆమోదించి పంపాలి. ఒకవేళ ఆమోదించకపోయినా తిప్పి పంపకపోయినా ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదం పొందినట్లేనని ఆర్టికల్ 197 స్పష్టంగా చెబుతోంది. ► పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు, విద్యా హక్కు చట్ట సవరణ బిల్లులను అసెంబ్లీ ఆమోదించి మండలికి పంపించి మూడు నెలలు దాటిపోయింది. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ ఆమోదించి మండలికి పంపింది. వీటిని మండలిలో చర్చకు రాకుండా అడ్డుకున్నంత మాత్రాన ఒరిగేదేమీలేదని,అవి ఆమోదం పొందినట్లేనని న్యాయ నిపుణులంటున్నారు. -
ఏపీ వ్యవసాయ బడ్జెట్ హైలైట్స్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2020-21ను ఆ శాఖ మంత్రి కన్నబాబు శాసనసభలో మంగళవారం సాయంత్రం ప్రవేశపెట్టారు. గతేడాది కాలంలో వ్యవసాయ రంగంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. దీర్ఘకాలికంగా రైతులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఆయన శాసనసభలో ప్రసంగిస్తూ.. ‘రైతు సంక్షేమం అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తొస్తారు. రైతుల కోసం నాన్న ఒకడుగు ముందుకేస్తే తాను రెండడుగులు ముందుకేస్తానని చెప్పి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆచరణలో చూపుతున్నారు. ఒత్తిడిలేని వ్యవసాయమే ఆయన సంకల్పం. పెట్టుబడి తగ్గిస్తూ ఉత్పత్తుల నాణ్యతను, రైతుల నికరా ఆదాయాన్ని పెంచడం ద్వారా రైతన్నల ముఖాల్లో సంతృప్తిని చూడటమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తోంది’అని మంత్రి కన్నబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ, అనుబంధ రంగాలకు 2020-21 ఏడాదికి గాను రూ. 29,159.97 కోట్ల బడ్జెట్ ప్రతిపాదిస్తున్నామని అన్నారు. రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.12,500 ఇస్తామని చెప్పి రూ.13,500 ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. శాసనమండలిలో మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. వ్యవసాయ బడ్జెట్లో కేటాయింపులు.. 3 వేల కోట్ల తో ధరల స్థిరీకరణ నిధి రైతు భరోసా కేంద్రాల కు 100 కోట్లు వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు 500 కోట్లు వైఎస్సార్ వడ్డీ లేని పంట రుణాలను 1100 కోట్లు రైతులకు ఎక్స్ గ్రేషియో కు 20 కోట్లు రాయితీ విత్తనాల కోసం 200 కోట్లు వ్యవసాయ యాంత్రీకరణ కు 207.83 కోట్లు ప్రకృతి వ్యవసాయానికి 225.51 కోట్లు ప్రకృతి విపత్తు నిధి 2000 కోట్లు ఎన్జీ రంగా యూనివర్సిటీ కి 402 కోట్లు ఉద్యాన వన అభివృద్ధి కి 653.02 కోట్లు వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ కి 88.60 కోట్లు పట్టు పరిశ్రమ అభివృద్ధి కి 92.18 కోట్లు పశు సంవర్థక శాఖ కు854.77 కోట్లు వెంకటేశ్వర పశు వైద్య శాల కు 122.73 కోట్లు మత్స్య అభివృద్ధి కి 299.27 కోట్లు సహకార శాఖ కు 248.38 కోట్లు వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి 4450 కోట్లు వ్యవసాయ అనుబంధ ఉపాధి హామీకి 6270 కోట్లు వెంకటేశ్వర పశు వైద్యశాలకు 122.73 కోట్లు మత్స్య అభివృద్ధి కి 299.27 కోట్లు సహకార శాఖ కు 248.38 కోట్లు వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కి 4450 కోట్లు వ్యవసాయ అనుబంధ ఉపాధి హామీకి 6270 కోట్లు చదవండి: ఏపీ బడ్జెట్ హైలైట్స్ -
అక్రమాలకు పాల్పడ్డారు: కన్నబాబు
-
గ్యాస్ లీక్ బాధితులు కోలుకుంటున్నారు: కన్నబాబు
సాక్షి, విశాఖపట్నం: కేజీహెచ్ ఆస్పత్రిలో సుమారు 300 మంది విష వాయువు బాధితులు చికిత్స పొందుతున్నారని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆస్పత్రుల్లో బాధితులు కోలుకుంటున్నారని ఆయన చెప్పారు. మంత్రి కన్నబాబు శనివారం ఎల్జీ పాలిమర్స్ పరిసర గ్రామాల్లో నెలకొన్న పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలను గ్రామాల్లోకి అనుమతించలేదని ఆయన చెప్పారు. (గ్యాస్ లీక్పై విచారణకు హైపవర్ కమిటీ) అదేవిధంగా బాధత కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించేందుకు ఇప్పటికే రూ.30 కోట్లు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్ వినయ్చంద్, సీపీ ఆర్కే మీనా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (కరువు పొమ్మంది.. వాయువు ఆయువు తీసింది) -
మంత్రి కన్నబాబుకు పర్యవేక్షణ బాధ్యత
సాక్షి, విశాఖపట్నం: స్టైరీన్ గ్యాస్ బాధిత ప్రజలకు సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రి కురసాల కన్నబాబుకు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్ స్థానికంగా అందుబాటులో ఉండాలని, ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని రెండు రోజుల పాటు విశాఖలోనే ఉండాలని సూచించారు. డిప్యూటీ సీఎం సమీక్ష ఎల్జీ పాలిమర్స్ ఘటనకు సంబంధించి కలెక్టరేట్లో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాసరావు(నాని), మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సమీక్షించారు. విషవాయువు ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈని అడిగి తెలుసుకున్నారు. కేజీహెచ్తో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎంత మంది చికిత్స పొందుతున్నారో ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్చంద్, అగ్నిమాపక శాఖ డీజీ ఎ.ఆర్.అనురాధ, విశాఖ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన, జేసీ ఎం.వేణుగోపాలరెడ్డి, డీఆర్వో ఎం.శ్రీదేవి, ఆర్డీవో పెంచల కిషోర్, ఇండస్ట్రీస్ అధికారులు పాల్గొన్నారు. -
‘గురు స్మరణలో’ ఆవిష్కరించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘గురు స్మరణలో’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సీనియర్ పాత్రికేయుడు బూదరాజు రాధాకృష్ణ 88వ జయంతి సందర్భంగా ఆయన శిష్య బృందం రూపొందించిన కవితా సంకలనం ‘గురు స్మరణలో’ పుస్తకాన్ని సీఎం జగన్ శనివారం క్యాంప్ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆవిష్కరణ చేశారు. పత్రికా రంగానికి, తెలుగు భాషకు బూదరాజు సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కమ్యూనికేషన్స్ సలహాదారు జీవీడీ కృష్ణ మోహన్ పాల్గొన్నారు. కాగా ‘బూరా బృందం’ గా పిలుచుకునే బూదరాజు శిష్యులు పి.మధుసూదన్, ముని సురేష్ పిళ్ళె, ఎస్.రాము ఈ సంకలనాన్ని అందుబాబులోకి తీసుకువచ్చారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ... కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి తాము హాజరు కాలేకపోయామని తెలిపారు. -
చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు?
సాక్షి, కాకినాడ : ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తప్పుడు సమాచారాలు సేకరించి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఆయన బుధవారం కాకినాడ రూరల్లో కోరమండల్ సహకారంతో పేదలకు బియ్యం నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ‘కరోనా నివారణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 24 గంటలు ప్రభుత్వాన్ని నిమగ్నపరిచి పని చేస్తున్నారు. ప్రతిపక్ష నేత మాత్రం హైదరాబాద్లో ఉండి ఖాళీ దొరికినప్పుడల్లా లేఖ రాస్తున్నారు. (ఏపీలో ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం) ముందు హెరిటేజ్ కంపెనీలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసులు ఎందుకు గోప్యంగా ఉంచారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఆయనకు రాష్ట్ర ప్రజలపై నిజమైన ప్రేముంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడం లేదు. కరోనాకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు? మేమందరం తిరగడం లేదా?. రాజధాని పేరుతో పెద్ద ఎత్తున భూములు సేకరించి చెట్లు, తోటలు నరికించిన దుర్మార్గాన్ని ప్రజలు మరిచిపోలేదు. మిల్లర్లు ఎక్కడైనా ధాన్యం ధర తగ్గించి కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కరోనా వల్ల నష్టపోయిన రైతులను వర్షాలను సాకుగా చూపి దోచుకోవడం మంచి పద్ధతి కాదు’ అని హితవు పలికారు. (ఉప్పల్ హెరిటేజ్: క్వారంటైన్కు 34 మంది) -
మొదటి నుంచి ఎన్నో అనుమానాలు ఉన్నాయి
-
జర్నలిస్టుల సేవలు అభినందనీయం
-
రైతుభరోసా వచ్చేసింది
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ యోజన కింద రాష్ట్రంలోని రైతులకు తొలివిడతగా రూ.2వేలు జమచేయడం ప్రారంభమైంది. 46.5 లక్షల మందికి పైగా రైతు ఖాతాలకు శుక్రవారం నుంచి ఈ నిధులు జమచేయడం మొదలైందని.. 15లోగా అర్హులైన రైతులందరి ఖాతాలకు నగదు చేరుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ‘సాక్షి’కి తెలిపారు. ఈ పథకం కింద వ్యవసాయ ఉత్పాదకాల కోసం ప్రభుత్వం ఏటా రూ.13,500 పెట్టుబడి సాయాన్ని అందిస్తుంది. వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఖరీఫ్లో సగం, రబీలో మిగతా సగం నగదు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తితో ఎదురైన ప్రస్తుత విపత్కర పరిస్థితులలో రైతులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా.. ► కేంద్రం వివిధ రాష్ట్రాలకు తొలి విడతగా రూ.15,841 కోట్లు విడుదల చేసింది. ► ఇందులో ఏపీకి కేటాయించిన రూ.920 కోట్లలో దాదాపు రూ.660 కోట్లు వివిధ బ్యాంకులకు చేరాయి. ► మిగతా మొత్తం ఒకటి రెండ్రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. బ్యాంకులకు జాబితాలు వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ యోజన నోడల్ అధికారిగా ఉన్న వ్యవసాయ శాఖ కమిషనర్.. లబ్ధిదారుల జాబితాను బ్యాంకులకు పంపారు. దీంతో బ్యాంకర్లు ప్రస్తుతం తమ వద్దకు వచ్చిన నిధులను రైతుల ఖాతాల్లో జమచేస్తున్నారు. కౌలు రైతులు, అటవీ భూముల సాగుదార్లు, దేవదాయ భూముల సాగుదారులు సహా రాష్ట్రవ్యాప్తంగా 46,50,846 మందికి గత రబీలో ప్రభుత్వ సాయం అందింది. ఇప్పుడు మళ్లీ ఖరీఫ్, రబీలలో రైతులు పెట్టుబడుల కోసం ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ‘ఖరీఫ్’ మొత్తం చెల్లించేందుకు సర్కారు సన్నాహాలు ఇదిలా ఉంటే.. వచ్చే జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఖరీఫ్లో ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని మంత్రి కన్నబాబు చెప్పారు. రైతులను అన్ని విధాల ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కాగా, వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ యోజన కింద ప్రస్తుతం జమచేస్తున్న నగదును తీసుకునేందుకు రైతులు బ్యాంకులకు వెళ్లాల్సిన పనిలేదన్నారు. రూపే కార్డులు, ఏటీఎంలు, గ్రామాల్లోని బ్యాంకు మిత్ర ద్వారా నగదును డ్రా చేసుకోవచ్చని.. తప్పని పరిస్థితుల్లో బ్యాంకుల వద్దకు వెళ్తే భౌతిక దూరాన్ని పాటించాలని రైతులకు కన్నబాబు విజ్ఞప్తి చేశారు. -
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
-
చంద్రబాబుకు బీసీలపై ఉన్నది కపటప్రేమ
-
ఆత్మహత్యలు చేసుకున్న.. రైతు కుటుంబాలకు చెక్కుల పంపిణీ
సాక్షి, అమరావతి: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కాకుండా గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సైతం ఆర్థిక సాయం ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న 2014 నుంచి 2019 మే వరకు ఆత్మహత్యలు చేసుకున్న 417 మంది రైతు కుటుంబాలకు రూ.5.లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించే కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. వ్యవసాయ శాఖ అందించిన జాబితా ప్రకారం ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ చెక్కులు పంపిణీ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ.7 లక్షల ఎక్స్గ్రేషియో చెల్లిస్తానని మాట ఇచ్చారు. దాని ప్రకారం 210 మంది కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున సాయం అందిస్తున్నారు. బలవన్మరణాలకు పాల్పడ్డ రైతు కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.వంద కోట్లు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల రూ.35.55 కోట్లను విడుదల చేసింది. సంక్షేమ పథకాలతో తగ్గనున్న ఆత్మహత్యలు వైఎస్ జగన్ సర్కారు ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా, పంటల ఉచిత బీమా, ధరల స్థిరీకరణ నిధి వంటి సంక్షేమ పథకాలతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి ఆత్మహత్యలు తగ్గవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అభిప్రాయపడ్డారు. రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, ఇప్పటికే దాని ఫలితాలు కనిపిస్తున్నాయని ‘సాక్షి’కి వివరించారు. రైతుభరోసా పథకం రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచిందన్నారు. ఇంకా అర్హత ఉన్న బాధిత కేసులు ఏమైనా ఉంటే వారికీ సాయం అందిస్తామని చెప్పారు. -
మనీ లాండరింగ్లో బాబు దిట్ట: మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్నం: టీడీపీలో అవినీతి తారాస్థాయిలో ఉందని తాను ఎన్నికలకు ముందే చెప్పానని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. శుక్రవాం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా పని చేస్తున్నప్పుడు ప్రజాధనానికి కాపలాదారుడిగా ఉండాలి కానీ.. దోపిడీ దారుడిగా కాదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును విమర్శించారు. టీడీపీ హయాంలో పోలవరం, పట్టిసీమ లాంటి ప్రాజెక్టులలో భారీ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. తమ అవినీతిని ఎవరూ పట్టుకోలేరని బాబు భావించారన్నారు. మనీ లాండరింగ్లో చంద్రబాబు దిట్టని బాబు, లోకేష్లను కూడా పూర్తిగా విచారించి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఒక పీఏ దగ్గరే రెండువేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగితే.. ఇక చంద్రబాబు, లోకేష్ల దగ్గర ఎన్ని లక్షల కోట్లు దొరుకుతాయోనన్నారు. చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు కాబట్టే స్పందించటం లేదని, ఎవరు దోపిడీదారులో ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. లోతైన విచారణ జరిగితే చంద్రబాబు అక్రమాలు పూర్తిగా బయటపడతాయని మంత్రి వ్యాఖ్యానించారు. ఇక యలమంచిలి ఎమ్మెల్యే యువి రమణమూర్తి రాజు మాట్లాడుతూ.. డొల్లకంపెనీల పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ కో లక్షలాది కోట్ల రూపాయలు దోచుకున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ దగ్గర చాలా విషయాలున్నాయన్నారు. ఆయన డైరీని పూర్తిగా పరిశీలిస్తే భారీ అక్రమాలు బయటపడతాయని తెలిపారు. విదేశాలకు పారిపోకుండా చంద్రబాబు, లోకేష్ల పాస్పోర్టులు సీజ్ చేయాలని, వేంటనే వారిని విచారించాలన్నారు. గత అయిదేళ్ల పాలనలో అంతా అవినీతిమయమేనని.. ఇక బాబు రాజకీయ జీవితం ముగిసిందని పేర్కొన్నారు. చంద్రబాబు వద్ద దేశంలో ఒక బడ్డేట్కు సరిపడా అక్రమాస్థు ఉన్నాయని, రెండు ఎకరాల నుంచి లక్షల కోట్ల వరకు అక్రమాస్థుల సంపాదించారన్నారు. ఐటీ దాడుల వ్యవహారంలో లోతైన విచారణ జరుగుతుందనే తాము భావిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు -
చంద్రబాబుకు ఎందుకంత ఉలిక్కిపాటు?
సాక్షి, కాకినాడ : ప్రజల అభీష్టం, ఆకాంక్షలు మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పని చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అధికార, పాలనా వికేంద్రీకరణ అవసరమని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రజల కోరిక మేరకే సీఎం జగన్ పరిపాలిస్తున్నారని, అధికార వికేంద్రీకరణ చేస్తే చంద్రబాబు అడ్డుపడ్డారని ధ్వజమెత్తారు. (‘లోకేష్ ఓడిపోయాక రెఫరెండం ఎందుకు..?’) మంత్రి కన్నబాబు బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రచారాన్ని భుజాలపై మోసే సొంత ప్రచార సాధనాలను పెట్టుకుని ఒక అబద్ధాన్ని నిజం చేసేలా ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని విషయంలో ఒక కృత్రిమ పోరాటాన్ని తయారు చేశారని కన్నబాబు మండిపడ్డారు. మొన్నటివరకూ అక్కడ వీధుల్లో తిరిగి జోలె పట్టుకుని చంద్రబాబు చందాలు వసూలు చేశారని, ఆయన క్యారెక్టర్కు ఇది ఒక నిదర్శనమని వ్యాఖ్యానించారు. జోలె పట్టుకుని సేకరించిన బంగారం, డబ్బులు ఎంత వచ్చాయో చెబితే చంద్రబాబు నిజాయితీ ఏంటో తెలుస్తుందన్నారు. (రాజధానితో చంద్రబాబు వ్యాపారం) రాజధానిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తర్వాత చంద్రబాబు భంగపడ్డారని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబు విజన్ విశాఖలో బికినీ ప్రదర్శన చేయాలని... వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేది సీఎం జగన్ విజన్’ అని అన్నారు. మంత్రులు నారావారిపల్లె కాదు.. ఏ ప్రాంతానికి అయినా వెళతారు. సొంత గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయలేని వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు నారివారి పల్లెపై లేని ప్రేమ అమరావతిపై ఎందుకు పుట్టిందని సూటిగా ప్రశ్నించారు. (కొందరు భ్రమలు కల్పిస్తున్నారు: జీవీఎల్) -
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అధికార వికేంద్రీకరణ
-
వైఎస్సార్ సీఎం అయ్యాకే సీమకు గుర్తింపు
సాక్షి, చిత్తూరు : దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాకే రాయలసీమకు గుర్తింపు వచ్చిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం నారావారిపల్లెలో జరిగిన ప్రజాసదస్సులో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఏనాడూ రాయలసీమను పట్టించుకోలేదని అన్నారు. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణకు సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. అధికార వికేంద్రీకరణ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఇందుకు నారావారిపల్లెకు వచ్చిన జనమే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అధికార వికేంద్రీకరణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అధికార వికేంద్రీకరణ జరిగిందని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆదివారం నారావారిపల్లెలో జరిగిన ప్రజాసదస్సులో ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. నిపుణుల కమిటీ సూచన మేరకే సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. అందుకే చంద్రబాబును ఓడించి కుప్పంకు పంపారు నారావారిపల్లె చాలా మంచిదని, అందుకే చంద్రబాబునాయుడిని ఓడించి కుప్పానికి పంపారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించారు. ఆదివారం నారావారిపల్లెలో జరిగిన ప్రజాసదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం బాగుండాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు ప్రతి కుటుంబం సీఎం జగన్ను దేవుడిలా భావిస్తున్నారని అన్నారు. -
అమ్మఒడి ఓ చరిత్రాత్మక పథకం
సాక్షి, అమరావతి: జగనన్న అమ్మఒడి పథకం విద్యావ్యవస్థలో ఓ పెద్ద సంస్కరణగా పలువురు మంత్రులు, శాసనసభ్యులు అభివర్ణించారు. రాష్ట్రాన్ని అక్షర క్రమంలోనే కాకుండా అక్షరాస్యతలోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు ఈ పథకం దోహదం చేస్తుందన్నారు. లక్షలాది మంది తల్లులు తమ పిల్లల భవిష్యత్ను తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. అమ్మఒడి పథకానికి రూపకల్పన చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనీయుడని కొనియాడారు. అమ్మఒడి పథకం– లక్ష్యాలపై రాష్ట్ర మంత్రి కె.కన్నబాబు మంగళవారం అసెంబ్లీలో స్పల్పకాలిక చర్చను ప్రారంభించారు. అమ్మ ఒడితో సంక్రాంతి కంటే ముందుగానే పండుగ వచ్చిందని తల్లులు సంతోష పడ్డారన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం బోధన దేశంలో ఎక్కడా లేదని మంత్రి కన్నబాబు అన్నారు. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని, సీఎం స్వయంగా రూపొందించిన మధ్యాహ్న భోజన మెనూ ఈరోజు నుంచే అన్ని పాఠశాలల్లో అమలవుతోందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పిన దానికంటే ఎక్కువగా ఇస్తున్నారన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల నెలవారీ వేతనాన్ని రూ. వేయి నుంచి రూ.3 వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్దే అని చెప్పారు. పాఠశాలలు నాడు–నేడు కార్యక్రమంతో వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారనున్నాయని కన్నబాబు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా సీఎంను అభినందించాలి జగనన్న అమ్మఒడి పథకం కేవలం సంక్షేమ పథకం కాదు.. ఓ సంస్కరణ పథకం అని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కొనియాడారు. సమాజ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమ్మఒడి పథకాన్ని రూపొందించారని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు కేవలం ఎన్నికల ముందు ప్రజలను మభ్య పెట్టేందుకు పసుపు కుంకుమ, పండుగలకు పప్పు బెల్లాలు పంచారని, కానీ సీఎం వైఎస్ జగన్ పేదలు, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను ఉన్నత స్థానాలను చేర్చేందుకు అమ్మఒడి పథకంతో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ముఖ్యమంత్రిని అభినందించాలని పేర్కొన్నారు. ఈ పథకంతో పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన సీఎం జగన్కు ధన్యవాదాలు తెలుతున్నానని చెప్పారు. ఇటువంటి మంచి పథకంపై జరుగుతున్న చర్చలో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో లేకపోవడం దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదవుకున్న వ్యక్తిగా తాను ‘అమ్మ ఒడి’ పథకానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. జగన్ అంటే ఒక బ్రాండ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే పేరు కాదని, అదో బ్రాండ్ అని, చెప్పాడంటే చేస్తాడంతే– అనేది ట్యాగ్లైన్ అని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అభివర్ణించారు. చిన్నప్పుడు ఏ ఫర్ యాపిల్ అని చెప్పేవారని, ఇప్పుడు ఏ ఫర్ అమ్మఒడి అని చెప్పే విధంగా ఈ పథకం ఉందన్నారు. అ అంటే అమ్మఒడి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని అక్షరాలు దిద్దేలా నిలిచిపోయే చారిత్రకమైన పథకం అని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేద బిడ్డకు సంక్రాంతి పండుగకు మేనమామ మాదిరిగా జగన్ అమ్మఒడి కానుకను తెచ్చారన్నారు. చరిత్రను తిరగరాసిన రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకువచ్చిన జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు బడుగు, బలహీన వర్గాల పాలిట పెద్ద వరమని ఎమ్మెల్యే సీహెచ్ అప్పలరాజు కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంటు పథకంతో ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన కుమారుడు వైఎస్ జగన్ మరో రెండడుగులు ముందుకు వేసి విద్యను ఉద్యమ రూపంలో సంస్కరించేందుకు నడుంకట్టారన్నారు. అమ్మఒడి సంక్షేమ పథకం కాదని, అదో విప్లవాత్మక సంస్కరణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన స్వానుభవాలు, చంద్రబాబుపై సెటైర్లు సభికులను ఆకట్టుకున్నాయి. అమ్మఒడిని ప్రారంభించిన జనవరి 9 ఏపీ చరిత్ర తిరగరాసిన రోజు అన్నారు. మంచి చెప్పినా టీడీపీలో వినే పరిస్థితి లేదు మంచి చెప్పినా తెలుగుదేశం పార్టీలో వినే పరిస్థితి లేదని ఆ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాళి గిరిధరరావు అన్నారు. అమ్మఒడి లాంటి అద్భుతమైన పథకంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేతతో సహా ఆ పార్టీ సభ్యులు సభలో లేకపోవడం పేద పిల్లల చదువుపట్ల వారి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందన్నారు. జగనన్న అమ్మఒడి, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, నాడు–నేడు వంటి పథకాలతో ప్రభుత్వ విద్యా వ్యవస్థల్లో సీఎం వైఎస్ జగన్ సంస్కరణలు తీసుకొస్తున్నారని చెప్పారు. అమ్మఒడి పథకం పట్ల బడుగు, బలహీన వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. కూల్చడానికి సినిమా సెట్టింగులు కాదు ఢిల్లీ వెళ్లి వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని ఓ నాయకుడు ప్రగల్భాలు పలుకుతున్నాడంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. కూల్చేయడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏమీ సినిమా సెట్టింగులు కాదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే కొన్ని కోట్ల కుటుంబాల సమూహం అన్నారు. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆ సినీ హీరో పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మద్దతు ఇస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్ జగన్ను జైల్లో నిర్బంధిస్తా అన్న కాంగ్రెస్, టీడీపీలు కాలగర్భంలో కలిసిపోయాయని చెప్పారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్న మరో నాయకుడు మూడు రాజధానులను అడ్డుకునేందుకు రాజకీయ భిక్షగాడి పాత్ర పోషిస్తున్నారని ఆయన విమర్శించారు. మనసుతో చూసినప్పుడే ఇది సాధ్యం ప్రజల కష్టాలను మనసుతో చూడడం వల్లే అమ్మఒడి లాంటి అద్భుత పథకాలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టగలిగారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వేణుగోపాల్ అన్నారు. జగన్ అంటే నిజం, నిజమంటే జగన్ అనేది రుజువైందని, తన కలను జగన్ సాకారం చేశారని చెప్పారు. పేదల గుండెల్లో జగన్కు గుడి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ యతిప్రాసలతో, కవితలతో చేసిన ప్రసంగం సభను ఆకట్టుకుంది. ’జనవరి నైన్త్– జనానికి స్ట్రెంగ్త్’ అన్నారు. ’పేదవాళ్లకు ఉండదు తడి (డబ్బు అనే అర్థంలో), వారి గుండెల్లో కట్టుకున్నారు జగనన్నకు గుడి.. అదే జగనన్న అమ్మఒడి, ఇదే చదువుల బడి’ అంటూ ఆయన ఆసు కవితను చదివినప్పుడు సభికుల నుంచి అభినందనలు వచ్చాయి. -
మీ అభిప్రాయాలు, సందేహాలు చెప్పండి
సాక్షి, అమరావతి: అమరావతి గ్రామాల రైతుల నుంచి ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ అభిప్రాయాలు, సలహాలను కోరింది. 17వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకూ సీఆర్డీఏ కమిషనర్కు వ్యక్తిగతంగా గానీ, పోస్టు, ఇ–మెయిల్ ద్వారా గానీ తాము చెప్పదలచుకున్న విషయాలను పంపాలని సూచించింది. హైపవర్ కమిటీ మూడో సమావేశం విజయవాడలో సోమవారం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధ్యక్షతన జరిగింది. సమావేశం వివరాలను కమిటీ సభ్యులు, మంత్రులు పేర్ని నాని, కన్నబాబు, కొడాలి నాని మీడియాకు వివరించారు. రాజధాని గ్రామాల రైతులే కాకుండా ఎవరైనా తమ అభిప్రాయాలు పంపవచ్చని పేర్ని నాని తెలిపారు. ప్రతి సమావేశంలోనూ తాము రాజధాని రైతుల గురించి చర్చిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే చాలామంది రైతులు మంత్రి బొత్స సత్యనారాయణ, కొడాలి నానితోపాటు తన వద్దకు వచ్చి అభిప్రాయాలు వ్యక్తం చేసి తమ ప్రతిపాదనలు చెబుతున్నారని వివరించారు. ఈ అంశాలన్నింటినీ తాము ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో పొందుపరుస్తామన్నారు. వికేంద్రీకరణ అంశాన్ని రాజకీయంగా వాడుకుని, ఇతర ప్రాంతాలకు చెందిన వారిని, మహిళల్ని తీసుకొచ్చి రెచ్చగొడుతున్నారని చంద్రబాబును విమర్శించారు. అన్ని అంశాలపైనా రాజధాని రైతులు తమతో మాట్లాడుతున్నారని, చంద్రబాబు ప్రేరేపిత శక్తులు దాడి చేస్తాయనే భయంతో ఆందోళన చెందుతున్నారని చెప్పారు. జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళికలను తయారు చేస్తున్నామని, ఈ నెల 17న మరోసారి కమిటీ సమావేశం జరపాలని నిర్ణయించినట్లు వివరించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న చంద్రబాబు: కన్నబాబు సంక్రాంతి పండుగ సమయంలోనైనా చంద్రబాబు రైతుల్ని రెచ్చగొట్టి తప్పుదారి పట్టించకుండా ప్రశాంతంగా ఉండనివ్వాలని మంత్రి కన్నబాబు హితవు పలికారు. భూములిచ్చిన రైతులది ఒక ఆందోళనైతే చంద్రబాబుది మరో ఆందోళనని విమర్శించారు. ఆయన కుటుంబ సభ్యులు నారావారిపల్లి వెళ్లి పండుగ చేసుకుంటున్నారని, రైతుల్ని మాత్రం పండుగ చేసుకోవద్దంటున్నారని మండిపడ్డారు. డీజీపీ గౌతం సవాంగ్పై అవమానకరంగా విమర్శలు చేస్తున్నారని, ఇది పద్ధతి కాదన్నారు. ముడాలో కలపాలని కోరాం: కొడాలి నాని మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను సీఆర్డీఏ పరిధి నుంచి తొలగించి ముడా పరిధిలోకి తేవాలని కమిటీ దృష్టికి తీసుకువచ్చినట్లు మంత్రి కొడాలి నాని తెలిపారు. పోర్టును త్వరితగతిన చేపట్టాలని కూడా కోరామన్నారు. ఎయిర్పోర్టు, జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లు, ఎక్స్పోర్టు, ఇంపోర్టును దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ, ఆక్వా పరిశ్రమల్ని మచిలీపట్నం ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరినట్లు వివరించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. -
హైపవర్ కమిటీ భేటీ
-
13 జిల్లాల సమగ్ర అభివృద్ధి
సాక్షి, అమరావతి: పరిపాలన ఒకేచోట కాకుండా వికేంద్రీకరణ ఎలా చేయాలి.. 13 జిల్లాల్లో సమాంతరంగా, సమంగా అభివృద్ధి ఎలా జరగాలనే దానిపై చర్చించినట్లు వికేంద్రీకరణపై ఏర్పాటైన హైపవర్ కమిటీ తెలిపింది. అభివృద్ధి కేవలం ఒకేచోట కేంద్రీకృతం కావడంవల్ల ఎంతో నష్టపోయినట్లు గత చరిత్ర చెబుతోందని.. అది పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వివరించింది. అమరావతి రైతుల ప్రయోజనాలు కాపాడతామని కమిటీ తెలిపింది. జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదికలతోపాటు రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం, శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికలన్నింటిపై చర్చించినట్లు వివరించింది. హైపవర్ కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధ్యక్షతన కమిటీ రెండో సమావేశం శుక్రవారం విజయవాడలో జరిగింది. వివరాలను కమిటీ సభ్యులు పేర్ని నాని, కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకటరమణారావు వివరించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలనే అంశంపై చర్చించినట్లు పేర్ని నాని తెలిపారు. ప్రజల్లో ప్రాంతీయ భావోద్వేగాలు రాకుండా, అవి పెరిగే అవకాశాలు లేకుండా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, పరిపాలన అన్ని ప్రాంతాల్లో కేంద్రీకృతం కావాలనే దానిపై సభ్యులు చర్చించినట్లు ఆయన తెలిపారు. అభివృద్ధిలో తనక్కూడా భాగస్వామ్యం ఉందని ప్రతిఒక్కరూ భావించేలా నిర్ణయాలు తీసుకోవాల్సి వుందన్నారు. ఈ నెల 13న కమిటీ మరోసారి సమావేశమవుతుందని, ఆ సమావేశంలో దాదాపు ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందని పేర్ని నాని తెలిపారు. ప్రతి ఒక్కరి అభిప్రాయం, డిమాండ్, సూచనలను హైపవర్ కమిటీ చర్చిస్తుందని ఆయన స్పష్టంచేశారు. హైపవర్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బుగ్గన. చిత్రంలో మంత్రులు ఉన్నతాధికారులు చంద్రబాబుకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అక్కర్లేదా? కమిటీ సభ్యులు కన్నబాబు, మోపిదేవి వెంకట రమణారావు మాట్లాడుతూ.. చంద్రబాబుకు రాష్ట్ర సమగ్రాభివృద్ధి అక్కర్లేదా.. వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందడం ఇష్టంలేదా అని ప్రశ్నించారు. తన సొంత సంపద కోసం అమరావతిని సృష్టించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన చంద్రబాబుకు మిగతా ప్రాంతాలు నాశనమైపోయినా పర్వాలేదా అని ప్రశ్నించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని వారు స్పష్టంచేశారు. కాగా, ఏడు నెలల సీఎం వైఎస్ జగన్ పరిపాలన ఒక యజ్ఞంలా జరుగుతుంటే దాన్ని భగ్నం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో ఎందుకు అపోహలు సృష్టించాలనుకుంటున్నారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు పాలనలో అణచివేత కాగా.. ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ విశాఖ వెళ్తే ఎయిర్పోర్టులో నిర్బంధించి తిరిగి వెనక్కి పంపింది.. అదే ఉద్యమం చేస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను అరెస్టు చేసింది.. కాపుల హక్కుల కోసం ఉద్యమం చేసిన ముద్రగడ పద్మనాభంను అణచివేసి, ఆయన కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేసింది చంద్రబాబే అని మోపిదేవి, కన్నబాబు విమర్శించారు. తన పాలనలో ఇష్టానుసారం అణచివేతకు పాల్పడిన చంద్రబాబు ఇప్పుడు ప్రజాస్వామ్యం, గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఇసుక, ఇంగ్లిష్ మీడియం, రాజధాని అంశాలపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు మంత్రులు పిల్లి సుభాష్చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, మేకతోటి సుచరిత, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం పాల్గొన్నారు. -
విధ్వంసానికి చంద్రబాబు కుట్ర
సాక్షి, అమరావతి/గుడివాడ: బస్సు యాత్రల పేరుతో చంద్రబాబు ఉద్రిక్తతలు, ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి లెజిస్లేటివ్ రాజధానిగా కొనసాగుతుందని చెబుతున్నా రాజధాని తరలిపోతోందంటూ టీడీపీ నేతలు 20 రోజులుగా హంగామా చేస్తున్నారన్నారు. రాజధాని తరలిస్తామని ప్రభుత్వం చెప్పకపోయినా.. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం రైతులకు ఎటువంటి అన్యాయం చేయదన్నారు. రోజుకో డ్రామా: మంత్రి కన్నబాబు విధ్వంసానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు. జేఏసీ ముసుగులో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ రోజుకో డ్రామాతో రక్తి కట్టిస్తున్నారన్నారు. బెంజ్ సర్కిల్లో నడిరోడ్డుపై బైఠాయించి కొత్త డ్రామాకు తెరతీశారన్నారు. రెచ్చగొడుతున్నారు: మంత్రి వెలంపల్లి ఏడు నెలల్లోనే సీఎం వైఎస్ జగన్కు ప్రజల్లో మంచిపేరు రావడాన్ని తట్టుకోలేక చంద్రబాబు కుట్రలు, రౌడీయిజానికి పాల్పడుతున్నారని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. రాజధాని ముసుగులో రైతులు, మహిళలు, న్యాయవాదులను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు పరపతిని కాపాడుకోవడానికి హింసను, విధ్వంసాన్ని ప్రేరేపిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. దుర్మార్గ రాజకీయాలకు పరాకాష్ట మంత్రి కొడాలి నాని చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. బుధవారం గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బెంజ్ సర్కిల్లో బస్సుయాత్ర పేరుతో రాజకీయం చేయటం చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. అలజడులు సృష్టిస్తున్న చంద్రబాబు గుంటూరు రూరల్: ప్రతిపక్ష నేత చంద్రబాబు వర్గ విభేదాలు సృష్టిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. ఆమె బుధవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ర్యాలీకి అనుమతులు ఇచ్చిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో ర్యాలీ చేసి స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. రాజధాని పేరుతో చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఏదైనా అవసరమైతే శాంతియుతంగా చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. అమరావతి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సంఘ విద్రోహ శక్తిలా చంద్రబాబు ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజం పట్నంబజారు(గుంటూరు): రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు రాక్షసంగా వ్యవహరిస్తూ, సంఘ విద్రోహ శక్తిగా మారుతున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు సృష్టించేందుకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే ఎంతటి వారినైనా ప్రభుత్వం ఉపేక్షించబోదని తేల్చిచెప్పారు. అంబటి బుధవారం గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ అశాంతిని సృష్టించేందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అనిల్కుమార్పై జరిగిన దాడే అందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. దాడి ఘటనలను చంద్రబాబు కనీసం ఖండించారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చిచ్చుపెట్టి, లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో అసలు ఏం కట్టారు, ఏం అభివృద్ధి చేశారని చంద్రబాబు హడావుడి చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. నిజమైన రైతులకు అన్యాయం జరిగితే ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. -
కౌలు రైతులు, చేనేత సంఘాలకు రుణ సాయాన్నిపెంచండి
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు బ్యాంకర్ల నుంచి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బ్యాంకర్లను కోరారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. కుటీర, చిన్న తరహా పరిశ్రమలు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నాయని, వీటిపై కూడా బ్యాంకర్లు దృష్టి సారించాలన్నారు. కౌలు రైతులకు సహకారాన్ని అందించాలని కోరారు. అలాగే చేనేత సహకార సంఘాలకు రుణ సహాయాన్ని పెంచాలన్నారు. చిన్న పరిశ్రమల పునరుద్ధరణ కోసం వైఎస్సార్ నవోదయం కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బ్యాంకర్లను కోరారు. దీనికోసం బ్యాంకర్లు, పరిశ్రమల శాఖ మధ్య మరింత సమన్వయం, పర్యవేక్షణ అవసరమన్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వడానికి క్షేత్రస్థాయిలో బ్యాంకులు ముందుకు రావడం లేదన్నారు. దీనిపై జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయాల్సిందిగా బ్యాంకర్లను కోరారు. పొగాకు రైతుల రుణాలను పునర్వ్యవస్థీకరించాం ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల రుణాలను పునర్వ్యవస్థీకరించామని, ఇందుకు సహకరించిన రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)కి ధన్యవాదాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) చైర్మన్ పకీరిసామి చెప్పారు. వార్షిక రుణప్రణాళిక మేరకు సెప్టెంబర్ 2019 నాటికి వివిధ ప్రాధాన్య రంగాల్లో నిర్దేశించిన రూ.1,69,200 కోట్లకు గాను రూ.94,531 కోట్లు (55.87 శాతం) రుణాలు ఇచ్చామన్నారు. అదేవిధంగా ఇదే కాలానికి వ్యవసాయ రంగంలో రూ.1,15,000 కోట్లకు గాను, రూ.65,577 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఎంఎస్ఎంఈ కింద నిర్దేశించిన రూ.36 వేల కోట్ల లక్ష్యానికి గాను రూ.25,020 కోట్ల (69.60 శాతం) రుణాలు ఇచ్చామని వెల్లడించారు. వైఎస్సార్ జిల్లాలో పూర్తి స్థాయిలో డిజిటల్ లావాదేవీలు వైఎస్సార్ జిల్లాలో పూర్తి స్థాయిలో డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ సుబ్రతోదాస్ తెలిపారు. కౌలు రైతులకు రుణాలు ఆశించినంతగా ఇవ్వలేదని, అనుకున్న లక్ష్యం మేరకు ఇవ్వాల్సిందేనని బ్యాంకర్లకు స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే కౌలు రైతుల చట్టాన్ని తెచ్చిందని, బ్యాంకులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన వెంటనే ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారాన్ని అందించాలన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళికను నెల రోజుల్లో రూపొందించాలని బ్యాంకర్లకు సూచించారు. కాగా, ఉద్యానవన శాఖ, మత్స్య శాఖ, పశుసంవర్థక శాఖల్లో అనుకున్న దానికన్నా రుణాలు తక్కువగా ఇచ్చారని, బ్యాంకులు దీనిపై దృష్టిపెట్టాలని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ సెల్వరాజ్ కోరారు. -
17 నుంచి రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు
ప్రభుత్వం అంటే అవినీతి ఉంటుందని, తక్కువ నాణ్యత ఉన్న వాటిని ఇస్తారనే ఒక అభిప్రాయం ఉంది. మేము ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్చబోతున్నాం. అవినీతి విషయంలో కఠినంగా వ్యవహరించి.. రైతులకు ఇచ్చే విత్తనాలు, పురుగు మందుల్లో నాణ్యత ఉండేలా చూస్తాం. దీనివల్ల రైతుల్లో పూర్తి భరోసా ఉంటుంది. సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది జనవరి 17వ తేదీ నుంచి గ్రామ సచివాలయాల పక్కనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. జనవరి నాటికి 3,300 కేంద్రాలు, ఫిబ్రవరిలో మరో 5 వేల కేంద్రాలు, ఏప్రిల్ నాటికి మొత్తం 11,158 కేంద్రాల ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ రంగంలో వినియోగించే ఉత్పత్తులను రైతు భరోసా కేంద్రాల ద్వారా సరసమైన ధరలకు విక్రయించాలని ఆదేశించారు. రైతులకు సలహాలు, శిక్షణ ఇచ్చేలా ఈ కేంద్రాలను తీర్చిదిద్దాలని సూచించారు. రైతులకు అందిస్తున్న వివిధ పథకాలను సక్రమంగా అందించడంలో ఈ కేంద్రాలు కీలకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. వ్యవసాయ దిగుబడులు పెంపొందించి, రైతులకు ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఈ కేంద్రాలు పని చేయాలన్నారు. దశల వారీగా విత్తన పంపిణీ, ప్రొక్యూర్మెంట్ సెంటర్లుగా కూడా రైతు భరోసా కేంద్రాలు అవతరించాలని సీఎం పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రంలో డిజిటల్ కియోస్క్ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, బయోఫెర్టిలైజర్స్, అగ్రి కెమికల్స్, పశుదాణా.. ఇతరత్రా ఉత్పత్తుల ఆర్డర్ ఇవ్వడానికి డిజిటల్ కియోస్క్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. విత్తనాల తయారీదారులు నాణ్యత పరీక్షలు చేసిన తర్వాతే వాటిని రైతు భరోసా కేంద్రాలకు పంపించాలని స్పష్టం చేశారు. విత్తనాలు నిల్వ చేసే గోడౌన్లలో కూడా నాణ్యత పరీక్షలు చేయాలని, జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న పరీక్ష కేంద్రాల్లో కూడా ఈ పరీక్షలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆక్వాఫీడ్ నాణ్యతపై ఎలాంటి నియంత్రణ లేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆక్వాఫీడ్ నాణ్యతపై ప్రమాణాలు నిర్దేశిస్తూ త్వరలోనే ఒక చట్టం తీసుకొస్తున్నామని వివరించారు. ఎంఓయూలు చేసుకున్న కంపెనీలు మాత్రమే తమ విత్తనాలు, పురుగు మందులు, ఎరువులను విక్రయించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. దీనివల్ల కల్తీకి చెక్ పడుతుందన్నారు. ప్రస్తుతమున్న ల్యాబ్లను ప్రభుత్వం పెంచుతున్నందున కల్తీని అడ్డుకునే పనులు ముమ్మరంగా కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు. సమావేశానికి ముందు డిజిటల్ కియోస్క్ను, రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసే భూసార పరీక్ష పరికరాలను సీఎం వైఎస్ జగన్, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పరిశీలించారు. సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా.. - గోడౌన్లలో ఉన్నప్పుడు విత్తనాలు కల్తీ జరక్కుండా సరైన నిల్వ పద్ధతులు పాటించాలి. ఆ మేరకు సంచుల నాణ్యత ఉండాలి. - గ్రామ సచివాలయాల్లోని అగ్రికల్చర్, వెటర్నరీ ఉద్యోగులు రైతు భరోసా కేంద్రాల నుంచే విధులు నిర్వహించాలి. - పంటలకు బీమా సదుపాయం కూడా రైతు భరోసా కేంద్రాల నుంచే అందించాలి. - వివిధ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరల వివరాల జాబితా ప్రదర్శించాలి. - పంటలు, సాగు విధానాలపై డిజిటల్ సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి. - వెదర్ స్టేషన్స్ ఏర్పాటు చేసి, వాతావరణ సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు చేరవేయాలి. - నిరంతరాయంగా ఇంటర్నెట్ ఉండేలా చూసుకోవాలి. - ఇ–క్రాపింగ్ నమోదు, పశువులకు బీమా సదుపాయం, కౌలు రైతుల సాగు ఒప్పందాల ప్రక్రియ కూడా రైతు భరోసా కేంద్రంలో జరగాలి. -
చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు: కన్నబాబు
సాక్షి, అమరావతి : ప్రజలు కోరుకునే తీర్పునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువస్తున్నారని, అయితే సీఎంకు మంచి పేరు వస్తుందంటే చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారు అని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. దిశ బిల్లుపై శుక్రవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసమే దిశ చట్టాన్ని తీసుకువస్తున్నామని అన్నారు. ‘దిశ సంఘటన పక్క రాష్ట్రంలో జరిగితే మన రాష్ట్రంలో చట్టం చేస్తున్నాం. మంత్రివర్గ సహచరులకు కూడా... దిశ ఉదంతంలో అలాంటి తీర్పులు ఇవ్వడం సరికాదని, అయితే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే... నేరం చేసినట్లు ఆధారాలు పక్కాగా ఉంటే 21 రోజుల్లోగా విచారణ పూర్తి చూసి చట్టపరమైన శిక్షలు పడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నిర్భయ దోషులకు ఇప్పటివరకూ శిక్ష పడలేదు. వాళ్లు జైలుకు వెళ్లకముందు ఎలా ఉండేవాళ్లు... వెళ్లిన తర్వాత సిక్స్ ప్యాక్ కండలు పెంచుకుని జైలు నుంచి బయటకు వచ్చారు. ఇవన్నీ చూస్తుంటే బాధిత కుటుంబాల ఆవేదన చెప్పలేనిది. దమ్మున్న నాయకుడుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చట్టం తీసుకు వస్తుంటే దాన్ని సమర్థిస్తుందో లేదో ప్రతిపక్షం స్పష్టం చేయాలి. ఇక సోషల్ మీడియా వేదికగా భయంకరమైన కుట్ర జరుగుతుంది. నాయకుల మీదే కాకుండా వారి కుటుంబసభ్యులను కూడా వదిలిపెట్టడం లేదు. మార్ఫింగ్ చేసి, అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. భార్యలను, సోదరిలను, తల్లుల్ని అవమానపరుస్తారా? సిగ్గు అనిపించడం లేదా? మహిళలకు గౌరవం వద్దా? సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్ చేస్తే కఠిన శిక్ష ఉంటుందని, దేశంలో మొట్టమొదటిసారిగా సీఎం జగన్ చట్టాన్ని తీసుకు వస్తున్నారు. ‘మహిళలు కనిపిస్తే కడుపైనా చేయాలి..... ముద్దు అయినా పెట్టాలి’ అని సుభాషితాలు చెప్పినవారు ప్రతిపక్ష పార్టీలో శాసనసభ్యులు గా కొనసాగుతున్నారు. వారిని వదిలేసి... మాపై బురద చల్లడం కాదు. చట్టపరంగా శిక్షిస్తాం కానీ కాల్చి చంపేస్తామా? గొప్ప సంస్కరణకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఈ రాష్ట్రంలో రేప్ కేసుల్లో నిందితులు ఎలా ఉన్నారో చూస్తున్నాం. వారిని అతిథిల్లాగా చూస్తున్నారు. నాయ్యం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చర్చను పక్కదారి పట్టించకుండా దిశ చట్టానికి మద్దతు ఇచ్చేలా మాట్లాడాలి’ అని పేర్కొన్నారు. -
వక్రీకరించడం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య