SEC Ramesh‌ Kumar Controversial Decision:11 Unanimous Re-Nominations Allowed In Municipal Elections- Sakshi
Sakshi News home page

ఎన్నికల‌ కమిషనర్ మరో వివాదాస్పద నిర్ణయం

Published Mon, Mar 1 2021 6:23 PM | Last Updated on Mon, Mar 1 2021 10:00 PM

SEC Decision On 11 Consensus In Municipal Elections In AP - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఏకగ్రీవాలైన 11 చోట్ల రీ నామినేషన్‌కి అవకాశం‌ కల్పించారు. నామినేషన్ వేయకుండా అడ్డుకుని బలవంతంగా ఏకగ్రీవం చేయించుకున్నందునే రీ నామినేషన్‌కి అవకాశమిస్తున్నట్లు సోమవారం జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తిరుపతి కార్పోరేషన్‌లో ఆరు, పుంగనూరు మున్సిపాలిటీలో మూడు, కడప జిల్లా రాయచోటిలో రెండు ఏకగ్రీవాలలో రీ నామినేషన్ జరగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ వేసేందుకు అవకాశం ఉంది. ఏకగ్రీవంగా ఎన్నికైన ఆ 11 చోట్ల రీనామినేషన్‌కు అవకాశం ఇవ్వడంపై గెలిచిన అభ్యర్ధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఈసీ నిర్ణయంపై కోర్టుని ఆశ్రయించనున్నారు.

చదవండి : ‘దాని కోసమే చంద్రబాబు ఇంత డ్రామా చేస్తున్నారు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement