
సాక్షి, అమరావతి: సినీనటి మల్లిడి విమల అలియాస్ శ్రీరెడ్డికి హైకోర్టు ఊరటనిచ్చింది. విశాఖ నాల్గో పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో ఆమెకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. వారంలో ఒక రోజు సంబంధిత పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో ముందు హాజరు కావాలంది.
అలాగే కర్నూలు, గుడివాడ, నెల్లిమర్ల తదితర పోలీస్స్టేషన్లలో శ్రీరెడ్డిపై నమోదైన కేసులన్నీ ఏడేళ్ల లోపు శిక్ష పడేవేనని, అందువల్ల ఆమె విషయంలో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నడుచుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉత్తర్వులిచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రులు లోకేశ్, అనితలనుద్దేశించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ శ్రీరెడ్డిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు న మోదయ్యాయి.
ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ఆమె ఇటీవల హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు సోమవారం విచారణకు రాగా.. శ్రీరెడ్డిపై చిత్తూరు వన్టౌన్ పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవేనని, అందువల్ల ముందస్తు బెయిల్ పిటిషన్కు విచా రణార్హత లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అనకాపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment