ఎన్నికల వేళ టీడీపీ ఎంపీ కేశినేనికి ఎదురుదెబ్బ | TDP Leaders Fires On MP Kesineni Nani In Vijayawada | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ టీడీపీ ఎంపీ కేశినేనికి ఎదురుదెబ్బ

Published Sat, Feb 27 2021 4:57 PM | Last Updated on Sat, Feb 27 2021 6:55 PM

TDP Leaders Fires On MP Kesineni Nani In Vijayawada - Sakshi

విజయవాడ: మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల వేళ టికెట్ల పంచాయతీ టీడీపీకి తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీ కేశినేని నానికి చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీ కార్యకర్తలు అతడికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం విజయవాడలో కలకలం రేపింది. మున్సిపల్‌ ఎన్నికల్లో ఏర్పడిన వివాదం దీనికి కారణమని తెలుస్తోంది. ఈ సందర్భంగా విజయవాడలోని కేశినేని నానికి సంబంధించిన కార్యాలయం ఎదుట కార్యకర్తలు ఆందోళన చేశారు. 

మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల వేళ టికెట్ల పంచాయతీ టీడీపీకి తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే 34వ డివిజన్‌ అభ్యర్థి మార్పుతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం ఏర్పడింది. 34వ డివిజన్‌ టికెట్‌ ఇచ్చే వరకు కదలమని ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.



చదవండి: బాబు వ్యూహం.. కేశినేనికి చెక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement