
సీఎం జగన్కు ఆహ్వాన పత్రిక ఇస్తున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు
సాక్షి, అమరావతి: తిరుమలలో అక్టోబర్ 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి ఆహ్వానించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం వారు ముఖ్యమంత్రి జగన్ను కలిసి ఆహ్వానపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు సీఎంకు శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జి.వాణీమోహన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment