Srivari Brahmotsavalu
-
ముత్యపు పందిరిలో ముగ్ధమనోహరుడిగా...!
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఆదివారం రాత్రి మలయప్పస్వామి ముత్యపు పందిరి వాహనంపై దర్శనమిచ్చారు. ఉదయం సింహ వాహనాన్ని అధిష్టించి యోగ నరసింహుడు రూపంలో ఊరేగిన స్వామి రాత్రి ముగ్ధమనోహర స్వరూపుడై ఉభయ దేవేరులు శ్రీదేవి, భూదేవిలతో కలిసి ముత్యపు పందిరిలో భక్తులను సాక్షాత్కరించారు.సాయంత్రం ఉత్సవరులకు రంగనాయకుల మండపంలో విశేష సమర్పణ అనంతరం ఆలయం వెలుపల వేయి నేతి దీపాల వెలుగులో సహస్రదీపాలంకార సేవలో ఊయలూగుతూ స్వామి దర్శనమిచ్చారు. తర్వాత వాహన మండపంలో వేంచేపు చేసి సర్వాలంకార భూషితుడై అశేష భక్తజన గోవింద నామాల నడుమ పురవీధుల్లో రాత్రి 7–9 గంటల వరకు స్వామివారు వైభవంగా ఊరేగారు. ఉత్సవ శోభల్లో కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి. ఈ వాహన సేవలో కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. గరుడ సేవకు విస్తృత ఏర్పాట్లు బ్రహ్మోత్సవాల్లో ఐదోరోజు రాత్రి 6.30 నుంచి 12 గంటల వరకు గరుడవాహన సేవ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తిరుమల ఘాట్రోడ్లలో నేటి ఉదయం నుంచి ద్విచక్రవాహనాలు అనుమతి రద్దు చేసింది. పార్కింగ్ సరిపోయేలాగా వాహనాలను తిరుమలకు అనుమతించనుంది. తిరుమల వెళ్లే ప్రతి వాహనం కూడా ముందస్తు పాసును తీసుకొని వెళ్లాల్సి ఉంది. తర్వాత వచ్చే వాహనాలన్నీ తిరుపతిలోనే కట్టడి చేయనుంది. ఇందుకోసం అలిపిరి వద్ద పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలు షురూ..
-
సేనాపతి ఉత్సవం.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది. అంకురార్పణ కార్యక్రమంలో శ్రీవారి తరపున ఆయన సేనాధిపతి అయిన విశ్వక్సేనుడిని మాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. రేపు సాయంత్రం ధ్వజారోహణంతో శ్రీవారి ఉత్సవాలు.. 12వ తేదీ రాత్రి ధ్వజావరోహణంతో ముగుస్తాయి.శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ముందు రోజు చేపట్టే అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఈ క్రమంలో ఆలయానికి నైరుతి దిశలో భూదేవిని పూజించి, మృత్తికను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. దీన్నే ‘మృత్సంగ్రహణ యాత్ర’ (పుట్టమన్ను సేకరణ) అంటారు. ఈ మట్టిలో నవ ధాన్యాలను ఆరోహింపజేసే కార్యక్రమాన్ని అంకురార్పణగా పేర్కొంటారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. 05వ తేదీన ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం, 06వ తేదీ ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం, 07వ తేదీ సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రికి సర్వభూపాల వాహనం, ఎనిమిదో తేదీ ఉదయం మోహిని అవతారం, రాత్రి గరుడ వాహనంపై స్వామివారు ఉరేగుతారు. గరుడ సేవకు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.09వ తేదీ ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహనం, 10వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 11వ తేదీ ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 12వ తేదీ శనివారం ఉదయం చక్రవాహనం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో.. అక్టోబరు 7న రాత్రి 11 గంటల నుంచి అక్టోబరు 8 అర్ధరాత్రి వరకు ద్విచక్రవాహనాల రాకపోకలపై నిషేధం అమలు కానుంది. అలాగే.. వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వయోవృద్ధులు, వికలాంగులు, ఎన్ఆర్ఐలు, చిన్న పిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. -
Tirumala: చంద్రప్రభ వాహనంపై ఉరేగిన స్వామివారు
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఏడో రోజు సాయంత్రం చంద్రప్రభ వాహనంపై కొలువుదీరి శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. చంద్రప్రభ వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వాహన సేవలో కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఉదయం సూర్యప్రభ వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనం ఇచ్చారు. పరిమళ భరిత పూలమాలలు, విశేష ఆభరణాలతో అలంకృతులైన స్వామి వారు నాలుగు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, కోలాటాలు, డప్పు నృత్యాలు, సంప్రదాయ వేష ధారణలతో వాహన సేవ ముందు ఆకట్టుకున్నాయి. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలు: తిరుమలలో పెరిగిన రద్దీ..
సాక్షి, తిరుమల: తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. కాగా, హనుమంత వాహనంపై శ్రీవారు దర్శనం ఇచ్చారు. ఈ క్రమంలో శ్రీవారి భక్తులు కర్పూర నీరాజనాలు అందిస్తున్నారు. మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. ఇక, సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న గరుడోత్సవం రోజు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,650గా ఉంది. గరుడోత్సవం నాడు శ్రీవారి హుండీ ఆదాయం 3.33 కోట్లు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 27,410గా ఉంది. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి గరుడ సేవను చూడటానికి తిరుమల నాలుగుమాడ వీధుల్లో వేచి ఉన్న భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించడం జరిగింది. భక్తుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను అడిగి తెలుసుకోగా.. టీటీడీ చేసిన ఏర్పాట్లపై వారు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. pic.twitter.com/FI3MFrUFrD — Bhumana Karunakara Reddy (@bhumanatirupati) September 22, 2023 ఇదిలా ఉండగా.. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు శుక్రవారం రాత్రి గరుడ వాహనాన్ని అధిరోహించారు. రాత్రి 7 గంటలకు ఆరంభమైన ఈ వాహన సేవ అర్ధరాత్రి వరకు సాగింది. గరుడ వాహనం ముందు భక్త బృందాలు, భజనలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వాయు గమనంతో పోటీపడే గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని విశ్వాన్ని పాలించే జగత్కల్యాణ చక్రవర్తి మలయప్ప దేదీప్యమాన కాంతులతో ఆలయ మాడ వీధుల్లో ఊరేగారు. On the evening of the fifth day of the ongoing Brahmotsavams in Tirumala, the processional deity of Lord Malayappa Swamy was carried in a procession on the Garuda Vahanam.#TTD#TTDevasthanams#Brahmotsavam2023#SalakatlaBrahmotsavam2023#GarudaVahanam pic.twitter.com/riS8YuR4kh — Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) September 22, 2023 విశిష్టమైన గరుడ వాహన సేవలో గర్భాలయ మూలమూర్తికి వాడుతున్న మకరకంఠి, లక్ష్మిహారం, సహస్ర నామ కాసులమాల, సుదర్శన చక్రమాల, మూలవిరాట్కు అలంకరించే పురాతనమైన విశేష ఆభరణాలు, శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్ తులసి, పుష్పమాల, చెన్నై నూతన ఛత్రాలను(గొడుగులు) అలంకరించారు. తన నిత్య సేవకుడు గరుత్మంతుడిపై దేవదేవుడు వైభవంగా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు శుక్రవారం ఉదయం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు సాక్షాత్కరించారు. శ్రీవారు మోహినీ రూపంలో దంత పల్లకిపై, పక్కనే వెన్న ముద్ద చేతబట్టిన చిన్నికృష్ణుడితో కలిసి భక్తకోటిని అనుగ్రహించారు. కాగా, తిరుమలలో శనివారం శ్రీవారు స్వర్ణరథంపై సాయంత్రం 4 గంటల నుంచి ఆలయ పురవీధుల్లో ఊరేగనున్నారు. కాగా, శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకుని వాహన సేవలో పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మాల ధరించి భక్తులకు అభయమిచ్చారు.#GarudaSeva pic.twitter.com/6JwhWGT694 — Roja Selvamani (@RojaSelvamaniRK) September 23, 2023 -
హంసవాహనంపై సరస్వతీ రూపంలో మలయప్ప స్వామి
-
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్
-
తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
తిరుమలలో నేడు ధ్వజారోహణం.. సీఎం జగన్ పట్టువస్త్రాల సమర్పణ
సాక్షి, తిరుమల: నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి 7–8 గంటల మధ్యలో వైదికంగా అంకురార్పణ చేశారు. వైఖానస ఆగమశాస్త్ర బద్ధంగా ఈ వేడుకను నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజైన ఆదివారం సాయంసంధ్యా సమయంలో శ్రీవారి సర్వ సేనాధిపతి అయిన విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల నడుమ మాడవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహించారు. నేడు ధ్వజారోహణం, పెద్ద శేషవాహనం సోమవారం సాయంత్రం 6.15–6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తం గా ధ్వజారోహణం నిర్వహించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చారు. సీఎం జగన్ పట్టు వస్త్రాల సమర్పణ.. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమలలో పర్యటించనున్నారు. తిరుమల శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం జగన్ పర్యటన ఇలా.. ►నేడు మధ్యాహ్నం 3.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. ►మధ్యాహ్నం 3.50 గంటలకు స్థానిక మ్యాంగో మార్కెట్ వద్ద శ్రీనివాస సేతు, ఎస్.వి.ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనాల శిలాఫలకాల ఆవిష్కరణ చేసి ప్రారంభం. ►టీటీడీ ఉద్యోగులకు ఇంటిపట్టాల పంపిణీ. ►సాయంత్రం 4.30 గంటలకు తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకుని తిరుమల బయలుదేరుతారు. ►సాయంత్రం 5.40 గంటలకు వకులమాత రెస్ట్ హౌస్ ప్రారంభిస్తారు. ►సాయంత్రం 5.55 గంటలకు రచన రెస్ట్ హౌస్ ప్రారంభించి, శ్రీ పద్మావతి అతిధి గృహం చేరుకుంటారు. ►రాత్రి 7.45 గంటలకు బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుండి శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకు వెళ్లి సమర్పిస్తారు. ►పెద్ద శేష వాహన సేవలో పాల్గొని శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకొని రాత్రి బస చేస్తారు. రేపటి షెడ్యూల్ ఇదే.. ►మంగళవారం ఉదయం 6.20 గంటలకు సీఎం జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ►ఉదయం 8.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని ఓర్వకల్ విమానాశ్రయానికి బయలుదేరుతారు. -
బ్రహ్మోత్సవ సంబరం ప్రారంభం
తిరుమల/తిరుపతి క్రైం: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి 7–8 గంటల మధ్యలో వైదికంగా అంకురార్పణ చేశారు. వైఖానస ఆగమశాస్త్ర బద్ధంగా ఈ వేడుకను నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజైన ఆదివారం సాయంసంధ్యా సమయంలో శ్రీవారి సర్వ సేనాధిపతి అయిన విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల నడుమ మాడవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహించారు. నేడు ధ్వజారోహణం, పెద్ద శేషవాహనం సోమవారం సాయంత్రం 6.15–6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తం గా ధ్వజారోహణం నిర్వహించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చారు. వాహనాలకు పాసులు ఉంటేనే అనుమతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 22న గరుడ సేవ సందర్భంగా తిరుమలకు వచ్చే వాహనాలకు (ఫోర్వీలర్లకు) పాసులను టీటీడీ తప్పనిసరి చేసింది. దీంతో తిరుమల వెళ్లే ప్రతి వాహనదారుడు పాసులు పొందాల్సి ఉంటుంది. కాగా, గరుడ సేవ రోజు ద్విచక్రవాహనాలను తిరుమలకు అనుమతించేది లేదని టీటీడీ స్పష్టం చేసింది. పాసులు అందించే ప్రదేశాలు ♦ బెంగళూరు, చిత్తూరు నుంచి వచ్చే వాహనాలకు చంద్రగిరి నియోజకవర్గంలోని ఐతేపల్లి దగ్గర ♦ మదనపల్లి నుంచి వచ్చే వాహనాలకు రంగంపేట కేఎంఎం కళాశాల వద్ద ♦ చెన్నై, నగరి, పుత్తూరు వైపు నుంచి వచ్చే వాహనాలకు వడమాలపేట టోల్ ప్లాజా సమీపంలోని అగస్త్య ఎన్క్లేవ్ వద్ద ♦ కడప వైపు నుంచి వచ్చే వాహనదారులకు కుక్కల దొడ్డి వద్ద ఉన్న కేశవరెడ్డి హైసూ్కల్లో ♦ నెల్లూరు, శ్రీకాళహస్తి వైపు నుంచి వచ్చే వాహనాలకు ఆర్ మల్లవరం పెట్రోల్ బంక్ వద్ద ♦ తిరుపతి పట్టణ ప్రజలకు, చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చేవారికి కరకంబాడి రోడ్డులోని ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద. -
తిరుమల బ్రహ్మోత్సవాలు.. వాహనసేవ వీక్షణకు టీటీడీ చర్యలు
సాక్షి, తిరుమల: తిరుమలలో బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. భక్తులు వాహనసేవ వీక్షించడానికి మాడవీధులను పరిశీలించినట్టు చెప్పారు. కాగా, ఈవో ధర్మారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 18వ తేదీన రాష్ట్రప్రభుత్వం తరఫున శ్రీవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. గరుడోత్సవం రోజు దగ్గరంగా వాహనసేవను వీక్షించడానికి మాడవీధులను పరిశీలించామన్నారు. గ్యాలరీలలో 2 లక్షల మంది భక్తులు వాహనసేవలు వీక్షిస్తారు. అందరూ వాహనసేవలు వీక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు. మరోవైపు.. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల నిమిత్తం అదనంగా మరో 100 ఎకరాల భూమి కేటాయింపుపై మంత్రి రోజాతో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి చర్చించారు. పాధిరేడు అరణ్యం వద్ద గతంలో 300 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఈ క్రమంలో నగరిలోని తన నివాసం వద్ద భూమనను మంత్రి రోజా సత్కరించారు. ఇది కూడా చదవండి: ఏపీకి వర్షసూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ -
తిరుమల ఉద్యానవనాల నుంచి శ్రీవారి కైంకర్య పుష్పాలు
-
తిరుమల బ్రహ్మోత్సవాలు.. వచ్చే నెల 22న గరుడవాహనం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఉంటాయని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. కాగా, టీటీడీ ఈవో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రివ్యూ చేశాం. ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. సెప్టెంబర్, అక్టోబర్లో బ్రహ్మోత్సవాలు ఉంటాయి. సెప్టెంబర్ 18న శ్రీవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సెప్టెంబర్ 22న గరుడవాహనం, 23న స్వర్థరథంపై శ్రీవారి ఊరేగింపు ఉంటుంది’ అని తెలిపారు. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయంలో జరుగుతన్న మండపం పునఃనిర్మాణ పనులను ఆలయ కమిటీ చైర్మన్ కట్టా గోపి యాదవ్ గారితో కలిసి పరిశీలించడం జరిగింది. ఆలయ అధికారులు, పార్టీ నాయకులు తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు.#Tirupati #tirumalatirupati #tirumala #ttd #ttdchairman pic.twitter.com/9wEDI8BiSs — Bhumana Karunakara Reddy (@bhumanatirupati) August 31, 2023 ఇదిలా ఉండగా.. రాఖీ పండుగ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు 18 కంపార్ట్మెంట్లలో నిండిపోయి ఉన్నారు. టికెట్లు లేని సర్వదర్శనానికి(ఉచిత దర్శనం) ఏడు గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆగష్టు 30, 2023) స్వామివారిని 71,132 భక్తులు దర్శించుకున్నారు. 26,963 తలనీలాలు సమర్పించుకున్నారు. రూ. 4.06 కోట్ల హుండీ ఆదాయం లెక్కగా తేలింది. ఇది కూడా చదవండి: సెప్టెంబర్ 18 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు: టీటీడీ ఛైర్మన్ భూమన -
తిరుమలలో భక్తుల రద్దీ
-
తిరుమలలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
-
స్వర్ణ రథంపై సప్తగిరీశుడు..!
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో ఆదివారం స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా సాగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు స్వర్ణ రథోత్సవం ఊరేగింపు అశేష భక్తజన గోవింద నామస్మరణల మధ్య సాగింది. ఈ స్వర్ణ రథం 32 అడుగుల ఎత్తు, 30 టన్నుల బరువు ఉంటుంది. ఈ తరహాలో రథం మన దేశంలో మరెక్కడా లేకపోవడం విశేషం. ఈ రథాన్ని 74 కిలోల మేలిమి బంగారంతో 18 ఇంచుల మందంతో కూడిన 2,900 కిలోల రాగి పై 9 సార్లు తాపడం చేశారు. వెండి రథం కొయ్యకు సరికొత్త హంగులతోనే ఈ స్వర్ణ రథాన్ని తయారు చేశారు. రథం తయారికీ టీటీడీ రూ.30 కోట్లు ఖర్చు చేసింది. 2013లో తొలిసారిగా ఊరేగించారు. ఉదయం భక్తశిఖామణిపై శ్రీరామచంద్రుడు రాత్రి గజరాజుపై రారాజు దర్శనం ఇవ్వగా ఉదయం శ్రీరామచంద్రుని రూపంలో మలయప్పస్వామి తన భక్తశిఖామణి హనుమంతుని వాహనంగా మలుచుకుని ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ధనుర్భాణాలు చేతపట్టిన శ్రీరామచంద్రుడిని ఆంజనేయుడు తన భుజంపై ఉంచుకుని ఆలయ పురవీధుల్లో అశేష భక్త జనులకు కనువిందు చేశారు. రాత్రి గజ వాహనంపై శ్రీనివాసుడు ఊరేగారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముగ్ధమనోహరుడైన శ్రీనివాసుడు గజ వాహనంపై ఆశీనుడై రాజసంగా మాడ వీధులలో భక్తులను కనువిందు చేశారు. వాహన సేవల్లో పెద్దజీయంగార్, చిన్నజీయంగార్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు.లలిత్, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు. శ్రీవారి గరుడ వాహన సేవ భక్తుల సహకారంతో విజయవంతమైందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సర్వ దర్శనానికి 12 గంటలు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయి లైన్ ఆల్వార్ ట్యాంక్ వద్దకు చేరుకుంది. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు 81,318 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 38,464 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.2.94 కోట్లు వేశారు. టీటీడీలో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన అనంతరం స్వామి వారిని సామాన్య భక్తులు ఈ సంఖ్యలో దర్శించుకోవడం ఇదే ప్రథమం. -
ఆనంద నిలయం అంటే... ఆ దేవదేవుడి నిలయం
-
తిరుమల శ్రీవారుని దర్శించుకున్న సీజేఐ లలిత్
-
స్వర్ణరథం పై భక్తులకు దర్శనమిస్తున్న స్వామి వారు
-
గరుడోత్సవానికి భారీగా తరలివస్తున్న భక్తులు
-
భక్తుల సర్వదర్శనాలకు అన్ని ఏర్పాట్లు చేశాం : టీటీడీ చైర్మన్
-
తిరుమలలో గరుడ సేవకు విస్తృత ఏర్పాట్లు
-
తిరుమల బ్రహ్మోత్సవాలు: శ్రీవారి సేవలో సీఎం జగన్ (ఫొటోలు)
-
2023 టీటీడీ క్యాలెండర్ ,డైరీ ఆవిష్కరించిన సీఎం జగన్
-
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
-
బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం
-
శ్రీవారి వాహన సేవలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్
Live Updates: ► పద్మావతి గెస్ట్ హౌస్కు చేరుకున్న సీఎం జగన్. రాత్రికి అక్కడే బస. ► పెద్ద శేషవాహనంపై ఊరేగుతున్న శ్రీవారు. కాగా, శ్రీవారి వాహన సేవలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ► 2023 టీటీడీ క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన సీఎం జగన్. ► శ్రీవారి దర్శన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. ►సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఇది నాలుగోసారి. ► శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్. సాంప్రదాయ పంచె కట్టులో శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి. ►శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్. పట్టు వస్త్రంతో సీఎం జగన్ తలకు పరివట్టం కట్టిన అర్చకులు. ► ఎలక్ట్రిక్ బస్సులను సీఎం జగన్ ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలతో శ్రీవారి భక్తులకు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ► సీఎం వైఎస్ జగన్.. గంగమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, సీఎం జగన్కు అర్చకులు వేదాశీర్వచనం అందించారు. 18:10 ► గంగమ్మ ఆలయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్. ► సీఎం జగన్కు మంత్రి పెద్దిరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పలువురు ఘన స్వాగతం పలికారు. 17:48 PM ► శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ► సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమం కొనసాగుతోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 17:10 PM ► రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ 15:02 PM ► తిరుమల పర్యటనకు బయల్దేరిన సీఎం వైఎస్ జగన్ సాక్షి, తాడేపల్లి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజులపాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇక, పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్.. తిరుపతి గ్రామదేవత, శ్రీవారి సోదరి శ్రీతాతయ్యగుంట గంగమ్మను దర్శించుకోనున్నారు. అనంతరం, శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకోన్నారు. పెద్దశేష వాహన సేవలో పాల్గొని తరించనున్నారు. -
CM Jagan Tirumala Tour: సీఎం జగన్ పర్యటన పూర్తి వివరాలిలా..
సాక్షి, తిరుపతి: జిల్లాల పునర్విభజన తర్వాత పది రోజుల వ్యవధిలోనే రెండో సారి చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ఇటీవల వైఎస్సార్ చేయూత మూడో విడత కార్యక్రమ ప్రారంభోత్సవాన్ని విపక్ష నేత చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో అశేష జనవాహిని మధ్య అట్టహాసంగా ప్రారంభించి అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచారు. ఆ తర్వాత ఇప్పుడు శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రెండు రోజులపాటు పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలో మునిగితేలనున్నారు. మంగళవారం తిరుపతి గ్రామదేవత, శ్రీవారి సోదరి శ్రీతాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుని చరిత్ర సృష్టించనున్నారు. రాజుల కాలం నుంచి వస్తున్న ఆచారవ్యవహారాల మేరకు ముందుగా గంగమ్మను దర్శించి తిరుమల కొండకు బయలుదేరి వెళ్లే పురాతన సంప్రదాయానికి నాందిపలకనున్నారు. అదేరోజు రాత్రి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుని పునీతులుకానున్నారు. అనంతరం పెద్దశేష వాహన సేవలో పాల్గొని తరించనున్నారు. ఆ రోజు రాత్రికి కొండపైనే బసచేసి, మరుసటిరోజు బుధవారం ఉదయం మళ్లీ శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇదిలావుండగా ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ సహకారంతో పేరూరుబండపై పునఃనిర్మించిన శ్రీవారి మాతృమూర్తి వకుళమాత ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం ఆధ్యాత్మిక ఆనందంలో మునిగితేలారు. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేస్తుండటంతో ఆధ్యాత్మికత కొత్త పుంతలు తొక్కుతోందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఇలా.. ►27వ తేదీ మంగళవారం సాయంత్రం 3.15 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి నుంచి బయలుదేరి 3.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ►3.45గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి 4.35 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేస్తారు. ►సాయంత్రం 5.20 గంటలకు తిరుపతిలోని గంగమ్మ ఆలయానికి చేరుకొని పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ►6 నుంచి 6.15గంటల వరకు అలిపిరి టోల్గేట్ వద్ద విద్యుత్ బస్సులను ప్రారంభిస్తారు. ►6.40కు తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. ►7.45 నుంచి7.55 వరకు బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. ►8.05 గంటలకు ఆంజనేయస్వామి ఆలయం నుంచి శ్రీవారి ఆలయానికి బయలుదేరుతారు. ►8.05 నుంచి 8.20 గంటల వరకు పట్టువస్త్ర సమర్పణ కార్యక్రమంలో పాల్గొంటారు. ►8.20 నుంచి 8.30 గంటల వరకు శ్రీవారిని దర్శించుకుంటారు. ►8.30 నుంచి 8.40 గంటల వరకు వకుళమాత దర్శనం, ప్రదక్షిణం, వెండివాకిలి రంగనాయక మండపం కార్యక్రమంలో పాల్గొంటారు. ►8.40 నుంచి 8.50 వరకు రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనం పొందుతారు. ►8.55 నుంచి 9 గంటల వరకు శ్రీవారి ఆలయంలో వస్త్ర మండలం పెద్దశేష వాహనం కార్యక్రమంలో పాల్గొంటారు. ►9.10కి వాహన మండపం నుంచి పద్మావతి గెస్ట్హౌస్కు బయలుదేరుతారు. ►9.15 గంటలకు తిరుమల పద్మావతి అతిథిగృహం చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. 28వ తేదీ ముఖ్యమంత్రి పర్యటన ఇలా.. ►ఉదయం 6 గంటలకు పద్మావతి అతిథి గృహం నుంచి శ్రీవారి ఆలయానికి బయలుదేరుతారు. ►6.05 నుంచి 6.30 వరకు శ్రీవేంకటేశ్వరస్వామి సేవలో పాల్గొంటారు. ►6.45 నుంచి 7.05 వరకు పరకామని భవన ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ►రాత్రి 7.05కు పరకామని నుంచి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి నిర్మించిన అతిథిగృహాన్ని ప్రారంభిస్తారు. ►7.10కి తిరిగి పద్మావతి అతిథిగృహానికి చేరుకుంటారు. ►7.10 నుంచి 7.30 గంటలకు లక్ష్మి వీపీఆర్ అతిథిగృహాన్ని ప్రారంభిస్తారు. ►7.35కు పద్మావతి అతిథిగృహానికి చేరుకుంటారు. ►8.35కి పద్మావతి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరుతారు. ►9.55కి రేణిగుంట నుంచి గన్నవరానికి బయలుదేరి వెళ్లనున్నారు. -
Tirumala Srivari Brahmostavam: బ్రహ్మోత్సవం.. చూసి తరిద్దాం!
పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవున్ని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఈ ప్రకారం ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించిన శ్రీవేంకటేశ్వరుడికి కన్యామాసం(ఆశ్వయుజం) లోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారట. అందువల్లే ఇవి ‘బ్రహ్మోత్సవాలు’గా ప్రసిద్ధిచెందాయి. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు 9 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో శ్రీమలయప్పస్వామి వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. తిరుమల: ప్రపంచ మానవాళి సంక్షేమాన్ని కాంక్షించడంతో పాటు శ్రీవేంకటేశ్వరస్వామివారి దివ్యమైన ఆశీస్సులను భక్తులందరికీ అందించేందుకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తుంది. ఉదయం వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 7 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు జరుగుతుంది. కరోనా కారణంగా రెండేళ్ల తరువాత భక్తుల నడుమ బ్రహ్మోత్సవాలు జరగనుండడంతో టీటీడీ విస్త్రత ఏర్పాట్లు చేస్తోంది. నేడు అంకురార్పణం సోమవారం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరగనుంది. ఇందులో భాగంగా శ్రీవారి తరఫున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనుడు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటుతారు. ఈ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. శాస్త్రాల ప్రకారం ఉత్సవానికి తొమ్మిది రోజుల ముందు అంకురార్పణం నిర్వహిస్తారు. 27న ధ్వజారోహణం సెప్టెంబర్ 27వ తేదీ మంగళవారం సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్దశేషవాహన సేవ జరుగుతుంది. అదే రోజున తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. వాహన సేవల వైశిష్ట్యం ఇలా.. పెద్దశేషవాహనం (27వ తేదీ రాత్రి 9 గంటలకు) శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు రాత్రి 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు. రామావతారంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. చిన్నశేషవాహనం (28వ తేదీ ఉదయం 8 గంటలకు) రెండో రోజు ఉదయం స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. హంస వాహనం (28వ తేదీ రాత్రి 7 గంటలకు) బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. అది పాలను, నీళ్లను వేరుచేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తిగలదని అర్థం. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి దాసోహభావాన్ని(శరణాగతి) కలిగిస్తాడు. సింహ వాహనం (29వ తేదీ ఉదయం 8 గంటలకు) శ్రీవారి దశావతారాల్లో నాలుగోది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తుంది. యోగశాస్త్రంలో సింహం బలానికి (వహనశక్తి), వేగానికి(శీఘ్రగమన శక్తి) ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని వాహనసేవలో అంతరార్థం. ముత్యపుపందిరి వాహనం (29న రాత్రి 7 గంటలకు) జ్యోతిష్యశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగా పూనిన స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది. కల్పవృక్ష వాహనం (30వ తేదీ ఉదయం 8 గంటలకు) క్షీరసాగరమథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. సర్వభూపాల వాహనం (30వ తేదీ రాత్రి 7 గంటలకు) సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. మోహినీ అవతారం (అక్టోబర్ ఒకటో తేదీ ఉదయం) బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు ఉదయం శ్రీవారు మోహినీరూపంలో శృంగారరసాధి దేవతగా భాసిస్తూ దర్శనమిస్తాడు. పక్కనే స్వామి దంతపు పల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయావిలాసమని, తనకు భక్తులైనవారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహినీ రూపంలో ప్రకటిస్తున్నాడు. గరుడ వాహనం (1వ తేదీ రాత్రి 7 గంటలకు) 108 వైష్ణవ దివ్యదేశాల్లోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నాడు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెప్పుతున్నాడు. హనుమంత వాహనం (2వ తేదీ ఉదయం 8 గంటలకు) శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది. స్వర్ణరథం (2వ తేదీ సాయంత్రం 4 గంటలకు) స్వర్ణరథం స్వామికి ప్రీతిపాత్రమైంది. ద్వాపరయుగంలో శ్రీకష్ణుడు రథగమనాన్ని వీక్షించిన ద్వారక ప్రజలకు ఎంతో ఆనందం కలిగింది. స్వర్ణరథంపై ఊరేగుతున్న శ్రీనివాసుడిని చూసిన భక్తులకూ అలాంటి సంతోషమే కలుగుతుంది. గజవాహనం (2వ తేదీ రాత్రి 7 గంటలకు) శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్లు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని ఈ వాహనసేవ ద్వారా తెలుస్తోంది. సూర్యప్రభ వాహనం (3వ తేదీ ఉదయం 8 గంటలకు) సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు సిద్ధిస్తాయి. చంద్రప్రభ వాహనం (3వ తేదీ రాత్రి 7 గంటలకు) చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది. శ్రీవారి రథోత్సవం (4వ తేదీ ఉదయం 7 గంటలకు) ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు, ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చుతారు. దీన్నివల్ల స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. అశ్వవాహనం (4వ తేదీ రాత్రి 7 గంటలకు) ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలను వర్ణిస్తున్నాయి. వాటిని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కష్ణయజుర్వేదం తెలుపుతోంది. ఈ వాహనంపై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడు. చక్రస్నానం (5వ తేదీ ఉదయం 6 గంటలకు) చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరించే అవభృథస్నానమే. ముందుగా ఉభయదేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్ ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు. ధ్వజావరోహణం (5వ తేదీ రాత్రి 7 గంటలకు) శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన తొమ్మిదో రోజు రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవం తరువాత ధ్వజావరోహణం జరుగుతుంది. ఈ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుమల: కలియుగ వైకుంఠనాథుడు తిరుమల శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు సోమవారం అంకురార్పణతో ఆరంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించేందుకు విష్వక్సేనుడు ఆలయ మాడ వీధుల్లో విహరించనున్నారు. అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్న పెరుమాళ్ల తిరునాళ్లకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. మంగళవారం సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో అంగరంగ వైభవంగా ధ్వజారోహణతో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు ప్రారంభమవుతాయి. సాయంత్రం పెద్దశేషవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి భక్తులకు దర్శనమిస్తారు. ఇల వైకుంఠనాథుని బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల సప్తగిరులను టీటీడీ సుందరంగా ముస్తాబు చేసింది. విద్యుత్ దీపాలు అలంకరణతో కొండ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఆలయ పరిసర పాంతాలు, ప్ర«ధాన మార్గాలను పలు రకాల పూల మొక్కలతో ప్రత్యేక అలంకరణ చేశారు. -
తిరుమలకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి మంగళవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఆయన మంగళవారం మధ్యాహ్నం 3.35 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. అలిపిరి వద్ద తిరుమలకు విద్యుత్ బస్సును ప్రారంభిస్తారు. రాత్రి 8.20 గంటలకు శ్రీవారికి పట్టువ్రస్తాలు సమర్పించి, స్వామిని దర్శించుకుం టారు. రాత్రికి తిరుమలలోనే బసచేసి బుధవారం ఉదయం మరోసారి శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమలలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి నిర్మించిన పరకామణి భవనాన్ని, తర్వాత లక్ష్మీ వీపీఆర్ రెస్ట్హౌస్ను ప్రారంభిస్తారు. అనంతరం రేణిగుం ట విమానాశ్రయం చేరుకుంటారు. నంద్యాల జిల్లాలో పర్యటన సీఎం వైఎస్ జగన్ బుధవారం ఉదయం రేణిగుంట ఎయిర్పోర్టు నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలి కాప్టర్లో నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలోని రాంకో సిమెంట్ ఫ్యాక్టరీకి వెళతారు. కంపెనీ ప్రాంగణంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.55గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 2.20గంటలకు తాడేపల్లి వెళతారు. -
'మూగ సేవ..' ముక్తి తోవ!
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల సంబరంలో గజరాజులు, అశ్వాలు, వృషభాలది కీలకపాత్ర. స్వామివారి వాహనసేవల్లో తొలి అడుగు వీటివే. ఇవే భక్తులకు ముందుగా కనువిందు చేస్తాయి. సర్వాంగసుందరంగా అలంకరించిన ఈ జంతువులు ఠీవిగా ముందుకు కదులుతూ స్వామివారు వస్తున్నారన్న సంకేతాన్నిస్తాయి. బ్రహ్మోత్సవాలకు అట్టహాసం తీసుకువస్తున్న ఘనత వీటికే దక్కుతుంది. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ శాలలో వీటి ఆలనా పాలనాను టీటీడీ చూస్తోంది. లక్ష్మీ నుంచి శ్రీనిధి వరకు గజం ఐశ్వర్యానికి చిహ్నం. శ్రీమహావిష్ణువు దేవేరి అయిన శ్రీ లక్ష్మీదేవి ఇష్టవాహనం కూడా ఏనుగే. శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీ వేంకట్వేరుని వైభవాన్ని సిరిసంపదలకు సూచికలైన ఏనుగులు ఇతర జంతువులైన అశ్వాలు, వృషభాలతో కలిసి మరింత ఇనుమడింపజేస్తున్నాయి. ప్రస్తుతమున్న ఏనుగుల్లో 14 ఏళ్ల శ్రీనిధి అన్నిటికంటే చిన్నది. 45 ఏళ్ల లక్ష్మి అన్నిటికంటే పెద్దది. ఏనుగుల సంరక్షణ చూస్తోన్న ఎస్వీ గో సంరక్షణశాల సంచాలకులు డాక్టర్ హరనాథరెడ్డి మాట్లాడుతూ..హార్మోన్లు విడుదల సమయంలో మగ ఏనుగులను అదుపు చేయడం కష్టతరమని, ఈ కారణంగా వాటిని ఉంచడం లేదని చెప్పారు. ఉన్న ఏనుగులకు ప్రతీ రోజు ఆలయాల ఉత్సవ సేవల్లో, గోశాలలో నడక ద్వారా వ్యాయామం, శరీర మర్దన చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి అరగంటకు ఓసారి ఏనుగులకు ఆహారం అందిస్తున్నట్లు వెల్లడించారు. మాడవీధుల్లో వాహనసేవల సమయంలో శక్తివంతమైన విద్యుత్ దీపాల వెలుగులు, కళాకారుల వాయిద్యాల శబ్దం నుంచి ఏనుగులకు ఉపశమనం కల్పించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొన్ని రోజుల ముందు నుంచి పలు రకాలుగా మచ్చిక చేసుకుని వీటిని బ్రహ్మోత్సవాలకు సమాయత్తం చేస్తామని వివరించారు. ప్రతి 20 నిమిషాలకోసారి చెరుకు గడలు, నేపియర్ గ్రాసం అందిస్తామని చెప్పారు. తిరుమలలో గోశాల మరింత అభివృద్ధి తిరుమలలోని ఎస్వీ గోశాలలో పాడి ఆవులు, లేగ దూడలు, మేలురకం ఎద్దులతో కలిపి మొత్తం 45 గోవులున్నాయి. గోశాలకు ఆనుకుని ఉన్న 8 ఎకరాల స్థలాన్ని చదును చేసి గోవులు తిరిగేందుకు అనువుగా మారుస్తున్నారు. 100 గోవులు ఉంచేందుకు వీలుగా షెడ్డు నిర్మించనున్నారు. శ్రీవారి తోమాల సేవ, అభిõÙకం, ఏకాంత సేవ, నవనీత సేవ కోసం పాలు, పెరుగు, వెన్న తదితర పదార్థాలను ఇక్కడి నుంచే తీసుకు వెళతారు. మజ్జిగను అన్నదానం కాంప్లెక్స్కు సరఫరా చేస్తారు. అద్భుత అలంకరణ.. ప్రత్యేక శిక్షణ వాహన సేవల్లో పాల్గొనే జంతువులను అద్భుతంగా అలంకరిస్తారు. గజరాజులను ముఖపట్టాతోపాటు రంగురంగుల బొంతలతో అలంకరిస్తారు. మరోపక్క మావటిలు గొడుగులు, విసన కర్రలతో స్వామివారికి సేవ చేస్తూ ఉంటారు. ఏనుగులను గరుడ సేవ నాడు ప్రత్యేకంగా అలంకరిస్తారు. రాజసానికి చిహా్నలైన అశ్వాలను ముఖపట్టా, తలపై కుచ్చు, బొంతలు, మెడగజ్జెలు, కాళ్లపట్టీలతో అలంకరిస్తారు. రైతన్నలకు నేస్తాలైన ధర్మానికి ప్రతీకగా నిలిచే వృషభాలను మెడలో నల్లతాడు, పూలహారాలు, గజ్జెలు, బొంతలతో అలంకరిస్తారు. వాహన సేవల్లో ఈ జంతువులకు ఇష్టమైన రావి, మర్రి ఆకులు, రాగి సంగటి, చెరకు గడలను ఆహారంగా ఇస్తారు. మాడ వీధుల్లో తిరిగే సమయంలో క్రమం తప్పకుండా ఆహారాన్ని, నీటిని అందిస్తూ ఉంటారు. వాహన సేవల్లో వినియోగించే జంతువులకు తగిన శిక్షణ కూడా ఇస్తారు. మావటిలు తాళ్లు, అంకుశం (ముల్లు కట్టె), గొలుసులతో నిరంతరం అప్రమత్తంగా ఉండి గజరాజులను నియంత్రిస్తారు. వాటికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఊరేగింపులకు వినియోగిస్తారు. వాటి వెంట జంతుశాస్త్ర నిపుణులు కూడా ఉంటారు. అనుకోని ఘటనలు జరిగినప్పుడు జంతువులను నియంత్రించేందుకు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. మాడవీధుల్లో గజరాజులు తిరిగేందుకు ప్రత్యేక మార్గాన్ని కూడా రూపొందిస్తారు. ఏనుగులను అదుపు చేసేందుకు కేరళ నుంచి నిపుణులైన పశువైద్యులను రప్పిస్తారు. -
బ్రహ్మోత్సవాల్లో మాస్క్ తప్పనిసరి
తిరుమల: సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు మాస్క్ తప్పని సరిగా ధరించాలని చెప్పారు. తిరుమల, అలిపిరిలో భక్తుల కోసం తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేస్తామన్నారు. అన్నమయ్య భవనంలో గురువారం ఆయన ఈవో ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డితో కలసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాలకు సెప్టెంబర్ 26న అంకురార్పణ, 27న ధ్వజారోహణం నిర్వహించనున్నట్లు చెప్పారు. 27న సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేస్తామని, ఆర్జిత సేవలు, శ్రీవాణి, వీఐపీ బ్రేక్ దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ప్రివిలైజ్డ్ దర్శనాలను రద్దు చేశామని పేర్కొన్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టు ప్రతిరోజూ 9 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్గా ఉంచనున్నట్లు తెలిపారు. -
బ్రహ్మోత్సవాల సమయంలో ‘ప్రత్యేక’ దర్శనాలు రద్దు
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో సామాన్య భక్తులకు టీటీడీ పెద్దపీట వేయనుంది. అన్ని రకాల ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసింది. భక్తులకు సర్వదర్శనం మాత్రమే కల్పించనుంది. రూ.300 దర్శన టికెట్లతోపాటు శ్రీవాణి ట్రస్టు దాతలకు, ఇతర ట్రస్టుల దాతలకు దర్శన టికెట్లు, వీఐపీ బ్రేక్, వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం, తదితర దర్శనాలను రద్దు చేసింది. ఆర్జిత సేవలు కూడా రద్దు చేసినట్లు పేర్కొంది. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే శ్రీవారి బ్రేక్ దర్శనం ఉంటుందని వెల్లడించింది. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్రెడ్డి, ఇతర టీటీడీ అధికారులతో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ..బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన సెప్టెంబర్ 27న సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. తొలిరోజు ధ్వజారోహణం కారణంగా రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహన సేవ ప్రారంభమవుతుందని, మిగతా రోజుల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తామన్నారు. పెరటాసి మాసం మూడో శనివారం నాడు గరుడ సేవ రావడంతో తమిళనాడు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముందని, రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. భక్తులకు సేవలందించేందుకు 3,500 మంది శ్రీవారి సేవకులను ఆహ్వానిస్తామన్నారు. గరుడసేవ నాడు పూర్తిగా, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించనున్నట్లు వెల్లడించారు. -
Photos: దేవదేవుడికి సీఎం జగన్ పట్టువస్త్రాల సమర్పణ
సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం రాత్రి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనమివ్వగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సంప్రదాయబద్ధంగా తిరునామం, పంచెకట్టుతో సీఎం వైఎస్ జగన్ శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్న సీఎం వైఎస్ జగన్ -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుమల: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంపంగి ప్రాకారంలో వైఖానస ఆగమోక్తంగా బుధవారం అంకురార్పణ చేశారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల మధ్య ఆలయంలోని రంగనాయకుల మండపంలోకి సేనాధిపతిని వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. యాగశాలలో నవధాన్యాలను మొలకెత్తించేందుకు పాలికల (మట్టికుండల)ను వినియోగించారు. బుధవారం మధ్యాహ్నం కొత్తపాత్రలో నీరుపోసి నవధాన్యాలను నానబెట్టారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవుపేడతో అలికి బ్రహ్మపీఠం ఏర్పాటుచేశారు. దేవతలను ఆహ్వానించి, భూమాతను ప్రార్థిస్తూపాలికలను మట్టితో నింపారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో నవధాన్యాలు చల్లి నీరు పోశారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహించారు. అనంతరం సోమరాజ, వరుణ మంత్రాలు, విష్ణుసూక్తం పఠించారు. కంకణధారిగా వాసుదేవభట్టాచార్యులు బ్రహ్మోత్సవాలకు గురువారం సాయంత్రం 5.10 నుంచి 5.30 గంటల మధ్య మీనలగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు పెద్దశేషవాహన సేవ ఉంటుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో క్రతువులు, వైదిక కార్యక్రమాల నిర్వహణకు కంకణధారిగా వాసుదేవభట్టాచార్యులు వ్యవహరించనున్నారు. ఈ ఉత్సవాల్లో నిర్వహించే హోమాలు, వాహన సేవలకు ఆయన పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. 11న పట్టువ్రస్తాలు సమర్పించనున్న సీఎం బ్రహ్మోత్సవాల్లో గురువారం నుంచి 15వ తేదీ వరకు వాహనసేవలను కల్యాణోత్సవ మండపంలో ఏకాంతంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. చక్రస్నానాన్ని ప్రత్యేక తొట్టిలో నిర్వహిస్తామన్నారు. తిరుమలలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 11న∙శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్ జగన్ పట్టువస్త్రాలను సమర్పిస్తారని చెప్పారు. దీనికిముందు తిరుపతిలో చిన్నపిల్లల హృదయాలయం, గోమందిరం, అలిపిరి–తిరుమల మెట్లదారిని సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. 12వ తేదీ తిరుమలలో బూందీపోటును, ఎస్వీబీసీకన్నడ, హిందీ చానళ్లను సీఎం ప్రారంభిస్తారన్నారు. 13 జిల్లాల్లో టీటీడీ నిర్మించిన 500 ఆలయాల పరిధిలోని గిరిజన, మత్స్యకారులకు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం నుంచి ఈనెల 14వ తేదీ వరకు శ్రీవారి దర్శనం చేయిస్తామన్నారు. రోజుకు ఒకటి, రెండు జిల్లాల నుంచి బస్సుల్లో తీసుకువచ్చి శ్రీవారితోపాటు శ్రీపద్మావతి అమ్మవారి దర్శనం చేయిస్తామని తెలిపారు. -
5న వీఐపీ బ్రేక్ దర్శనం లేదు: టీటీడీ
తిరుమల: అక్టోబర్ 5న తిరుమలలో బ్రేక్ దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు టీటీడీ పీఆర్వో విభాగం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 7 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో అక్టోబర్ 5న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ కారణంగా అక్టోబర్ 4న వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. నాదనీరాజనంపై బాలకాండ పారాయణం తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం బాలకాండలోని 3 నుంచి 7వ సర్గ వరకు ఉన్న మొత్తం 142 శ్లోకాలను పండితులు పఠించారు. బాలకాండ పారాయణం నిర్వహిస్తోన్న ఎస్వీ వేద వర్సిటీ ఆధ్యాపకులు ఆచార్య ప్రవా రామక్రిష్ణ సోమయాజులు మాట్లాడుతూ.. ప్రపంచ శాంతిని కోరుకుంటూ ఈ పారాయణాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద వర్సిటీ అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణదారులు, రాష్ట్రీయ సంస్కృత వర్సిటీకి చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నారు. -
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి
సాక్షి, అమరావతి: తిరుమలలో అక్టోబర్ 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి ఆహ్వానించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం వారు ముఖ్యమంత్రి జగన్ను కలిసి ఆహ్వానపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు సీఎంకు శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జి.వాణీమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల: తిరుమలలో నిర్వహిస్తున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య ధ్వజావరోహణంతో ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజైన ఆది వారం ఉదయం శ్రీవారికి చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉ. 6 నుంచి 9 గంటల మధ్య శ్రీవారి ఆలయంలోని అయినమహల్ ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారికి, శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అయినమహల్ ముఖమండపం ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించిన చిన్న పుష్కరిణిలో ఉదయం 8.15 గంటలకు సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణి జలంలో ముంచి స్నానం చేయించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి ‘షోడశదిన సుందరకాండ దీక్ష’ ఈ నెల 29 నుంచి అక్టోబర్ 14 వరకు తిరుమలలోని వసంత మండపంలో షోడశదిన సుందరకాండ దీక్ష జరగనుంది. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 14 వరకు తిరుమలలోని వసంత మండపంలో షోడశదిన సుందరకాండ దీక్ష జరగనుంది. ఇందుకుగాను సెప్టెంబర్ 28న రాత్రి 7 గంటలకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో అంకురార్పణ చేయనుంది. లోక కల్యాణార్థం 16 రోజుల పాటు నిష్ణాతులైన వేద పండితులతో టీటీడీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి ఈ కార్యక్రమం ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఘనంగా రామానుజ జీయర్ తిరునక్షత్రోత్సవాలు శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న పెద్దజీయర్ మఠం స్థాపించి 900 ఏళ్లు అయిన సందర్భంగా తిరువేంగడ రామానుజ జీయర్ తిరు నక్షత్రోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. -
శాస్త్రోక్తంగా చక్రధారుడి చక్రస్నానం
సాక్షి, తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య శ్రీవారి ఆలయంలోని ‘అయినా మహల్’ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ‘అయినా మహల్’ ముఖ మండపం ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించిన చిన్న పుష్కరిణిలో ఉదయం 8.15 గంటలకు సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణీ జలంలో ముంచి స్నానం చేయించారు. ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూప దీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభ ధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశ శాంతి మంత్రములు, పురుష సూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను పారాయణం చేశారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను పెద్ద జీయ్యంగార్, చిన్న జీయ్యంగార్లు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. చక్రస్నానం - లోకం క్షేమం.. తొమ్మిది రోజుల ఉత్సవాల్లో జరిగిన అన్ని సేవలూ సఫలమై - లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతుల్తో ఉండడానికీ - చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక యజ్ఞాంతంలో అవభృథస్నానం' చేస్తారు. యజ్ఞ నిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, అన్నీ సంపూర్ణ ఫలాలు చేకూరడంకోసం చేసే దీక్షాంత స్నానం అవభృథం. చక్రస్నానం నాటి సాయంకాలం ధ్వజావరోహణం యథావిధిగా చేస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవయజ్ఞం మంగళాంతం అవుతుంది. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాప విముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు. విష మృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల ఐహిక శ్రేయస్సులు పొందుతారు. పరాంతకాలం వరకూ ఎటువంటి జనన, మరణ వికారములు లేకుండా సర్వలోకాలలో యథేచ్ఛగా విహరిస్తూ బ్రహ్మానందాన్ని పొంది శాశ్వతమైన విష్ణులోకాన్ని చేరుకొంటారు. అనంతరం రాత్రి ఎనిమిది గంటల నుంచి నుండి తొమ్మిది గంటల మధ్య ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి. ఈ కార్యక్రమాల్లో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు శేఖర్ రెడ్డి, డా.నిశ్చిత, శివకుమార్, డీపీ అనంత, అర్బన్ ఎస్పీ రమేష్రెడ్డి, సిఇ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. వైభవంగా బ్రహ్మోత్సవాలు: వైవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఏకాంతంగా నిర్వహించామని తెలిపారు. కోవిడ్ కారణంగా ఈసారి ఏకాంతంగా నిర్వహించినా, ఎక్కడ లోపం లేకుండా వైభవంగా నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. చక్రస్నానం ఏకాంతంగానే నిర్వహించామని చెప్పారు. సాయంత్రం ధ్వజాఅవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. -
శ్రీవారి సేవలో
-
ఏకాంతంగా దేవదేవుడి గరుడోత్సవం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు బుధవారం రాత్రి 7 గంటలకు కల్యాణోత్సవ మండపంలో శ్రీమలయప్ప స్వామి తనకెంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున దేవదేవుడు శ్రీవేంకటేశ్వరుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. పంచెకట్టు, తిరునామంతో సంప్రదాయబద్ధంగా అందజేశారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ► న్యూఢిల్లీ నుంచి నేరుగా సాయంత్రం 3.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సీఎం.. రోడ్డు మార్గాన తిరుమల పద్మావతి అతిథి గృహం చేరుకున్నారు. అక్కడ టీటీడీ చైర్మన్, అధికారులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంకు స్వాగతం పలికారు. ► అనంతరం అన్నమయ్య భవన్ చేరుకుని ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి బేడి ఆంజనేయస్వామి ఆలయం చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు పరివట్టంతో తలపాగా చుట్టి పట్టువస్త్రాల పళ్లెంను సీఎం తలపై పెట్టారు. ► వేద మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ 6.23 గంటలకు ఆలయం లోపలికి చేరుకుని, అర్చకులకు పట్టు వస్త్రాలు అందజేసి, శ్రీవారిని దర్శించుకున్నారు. ► అనంతరం వకుళామాత దేవిని, ఆలయ ప్రదక్షిణగా విమాన వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ధ్వజస్తంభానికి నమస్కరించారు. హుండీలో కానుకలు చెల్లించి, రంగనాయక మండపం చేరుకున్నారు. టీటీడీ 2021 డైరీని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ► వేద ఆశీర్వచనం అనంతరం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డి స్వామివారి చిత్రపటంతోపాటు, శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం కల్యాణ మండపం వద్ద ఏకాంతంగా సాగిన గరుడ వాహన సేవలో పాల్గొన్నారు. కాగా, సీఎం హోదాలో వైఎస్ జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఇది రెండోసారి. ► టీటీడీ ముద్రించిన 2021 సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను సీఎం జగన్ ఆలయంలో ఆవిష్కరించారు. 12 పేజీల క్యాలెండర్లు 15 లక్షలు, పెద్ద డైరీలు 8 లక్షలు, చిన్నడైరీలు 2 లక్షలు, టేబుల్ టాప్ క్యాలెండర్లు 75 వేలు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు, పద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4 లక్షలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టీటీడీ ముద్రించింది. ఇవి సెప్టెంబర్ 28వ తేదీ నుంచి తిరుమల, తిరుపతిలోని టీటీడీ పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ రెండో వారం నుంచి ఇతర ప్రాంతాల్లోని టీటీడీ సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతారు. ► సీఎం వైఎస్ జగన్ బుధవారం రాత్రి తిరుమలలోనే బసచేస్తారు. గురువారం ఉదయం మరోమారు శ్రీవారిని దర్శించుకుంటారు. నాద నీరాజనం వేదికపై నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణంలో పాల్గొంటారు. అనంతరం కర్ణాటక రాష్ట్ర చారిటీస్ సత్రాల శంకుస్థాపనలో పాల్గొంటారు. -
శ్రీవారి ఆలయంలో సీఎం జగన్
-
శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
-
శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
సాక్షి, తిరుమల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. పంచెకట్టు, తిరునామంతో.. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపుగా వెళ్లి శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వేదపండితులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం సీఎం జగన్, డిప్యూటీ సీఎంలు ఆళ్ల నాని, నారాయణ స్వామి, ధర్మాన కృష్ణ దాస్, మంత్రులు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, మేకతోటి సుచరిత, కొడాలి నాని, మేకపాటి గౌతమ్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చింతల రామ చంద్రారెడ్డి, బియ్యపు మధు సూధన్ రెడ్డి, కొలుసు పార్థ సారధి, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్.కె.రోజా శ్రీవారి గరుడ వాహన సేవలో పాల్గొన్నారు. కాసేపటి క్రితమే సీఎం బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్మావతి అథితి గృహానికి సీఎం తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్ను, డైరీని ఆయన ఆవిష్కరించిన సీఎం జగన్.. శ్రీవారి దర్శనం అనంతరం శ్రీ పద్మావతి అతిధి గృహానికి చేరుకున్నారు. ఈ రాత్రికి ఆయన అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం 6.15 గంటలకు పద్మావతి అతిధి గృహం నుండి బయలుదేరి.. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్పతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు. ఇరు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు నాద నీరాజనం సుందర కాండ పారాయణ కార్య క్రమంలో పాల్గొంటారు. అలాగే కర్ణాటక రాష్ట్ర ఛారిటీస్ సత్రాలకు శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరుమల నుండి 9.20 గంటలకు బయలుదేరి 10.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని గన్నవరం తిరుగు ప్రయాణం అవుతారు. (చదవండి: శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు) -
తిరుమలకు చేరుకున్న సీఎం జగన్
-
తిరుమలకు చేరుకున్న సీఎం జగన్
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో, అదనపు ఈవో ఆయనకు సాదర స్వాగతం పలికారు. కాసేపట్లో అన్నమయ్య భవన్లో ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటారు. అంతకుముందు ఢిల్లీ పర్యటన ముగించుకుని రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్న సీఎం జగన్కు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం శ్రీవారి సాలకట్ల బ్రహోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రాత్రికి పద్మావతి గెస్ట్హౌస్లో సీఎం జగన్ బస చేయనున్నారు. ఇక రెండు రోజుల ఢిల్లీ టూర్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వంటి ప్రముఖులను సీఎం జగన్ కలిశారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ద్వారా రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై చర్చించారు. అనంతరం ఏపీ భవన్లో వైఎస్సార్ సీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. (చదవండి: ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన) రేణిగుంటలో ఘన స్వాగతం రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఆయన వెంట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి ఉన్నారు. ఉప ముఖ్యమంత్రులు కె.నారాయణ స్వామి, ఆళ్ల నాని, జిల్లా ఇంచార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, మంత్రులు ఆదిమూలపు సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర రెడ్డి, బియ్యపు మధుసూధనరెడ్డి, ఆర్కే రోజా, ఎమ్మెస్ బాబు, వెంకటె గౌడ, కోరుముట్ల శ్రీనివాసులు, మేడా మల్లిఖార్జున రెడ్డి, ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులు రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి, జేసీ మార్కండేయులు (ఇంచార్జి కలెక్టర్), నగరపాలక కమిషనర్ గిరీషా, అసిస్టెంట్ కలెక్టర్ విష్ణు చరణ్, డీఐజీ కాంతిరణా టాటా, అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్, జేఈఓ బసంత్ కుమార్, ఐజీ శశిధర్ రెడ్డి, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్, డిప్యూటీ కమాండెంట్ దుర్గేష్ చంద్ర శుక్లా, సీ.ఎస్.ఓ. రాజశేఖర్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ రెడ్డెమ్మ, స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ, టర్మినల్ మేనేజర్ గోపాల్ తదితరులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎంపీలకు ఘన స్వాగతం పలికారు. -
వెంకన్న వైభవం
-
శ్రీవారి బ్రహ్మోత్సవం.. ఏకాంతం
తిరుమల: కోవిడ్–19 వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఆలయ చరిత్రలో తొలిసారి ఏకాంతంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈవో అనిల్కుమార్ సింఘాల్తో కలిసి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కల్యాణోత్సవ మండపంలో వాహన సేవలు జరుగుతాయన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శుక్రవారం ఏకాంతంగా అంకురార్పణ జరిగిందని.. శనివారం ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయన్నారు. సుబ్బారెడ్డి ఇంకా ఏం చెప్పారంటే.. ► 23వ తేదీ గరుడసేవ రోజున సాయంత్రం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ► 24న ఉదయం సీఎం వైఎస్ జగన్, కర్ణాటక సీఎం యడ్యూరప్పతో కలిసి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అనంతరం సుందరకాండ పారాయణంలో పాల్గొంటారు. తర్వాత కర్ణాటక సత్రాల నిర్మాణానికి ముఖ్యమంత్రులిద్దరూ భూమిపూజ చేస్తారు. ► ఈ నెల 27వ తేదీన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. టీడీపీ హయాంలోనే నిధుల దుర్వినియోగం ► టీడీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలో నిధులు దుర్వినియోగమయ్యాయని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేని సంస్థతో ఆడిట్ చేయించాలని ఎంపీ సుబ్రమణ్యస్వామి కోర్టులో పిల్ వేశారు. ► గత ప్రభుత్వంలో టీటీడీలో జరిగిన నిధుల దుర్వినియోగంపై సీఎంతో చర్చించినపుడు గత ప్రభుత్వ హయాంలోనే కాకుండా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరిగిన నిధుల ఖర్చుపైనా కాగ్తో ఆడిట్ చేయించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ దృష్ట్యా కాగ్ ఆడిట్ జరపాలని తీర్మానం చేశాం. -
19 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల: ‘తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆదాయ, వ్యయాలను ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆడిట్ చేసేవారు. ఇకపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)తో ఆడిటింగ్ చేయించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది’ అని ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. అలాగే ఈనెల 19 నుంచి 27 వరకు జరగనున్న తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను కరోనా నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తిరుపతిలో ఆదివారం జరిగిన ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో భక్తులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన వివరాలు.. ► పారదర్శకత పెంచడంలో భాగంగా ఆగస్టులో బోర్డు సమావేశాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశాం. ► పెరటాసి మాసం కారణంగా భక్తుల రద్దీ పెరగడంతో తిరుపతిలో రోజుకు 3 వేల చొప్పున ఆఫ్లైన్లో జారీ చేస్తున్న సర్వ దర్శనం టైంస్లాట్ టోకెన్లను 30 వరకు తాత్కాలికంగా నిలిపివేశాం. ఆన్లైన్ కోటా పెంచి రోజుకు 13 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు జారీ చేస్తున్నాం. నిధుల కోసమే టీటీడీ ఇలా చేస్తోందన్న ప్రచారంలో వాస్తవం లేదు. ► ఆన్లైన్ కల్యాణోత్సవంలో పాల్గొనే వారు టికెట్ బుక్ చేసుకున్న తేదీ నుంచి 90 రోజుల్లోపు శ్రీవారిని దర్శించుకోవచ్చు. ► కరోనా వల్ల శ్రీవారి ఆర్జిత సేవలను రద్దు చేయడంతో.. ఇప్పటికే ఉదయాస్తమాన సేవ, వింశతి వర్ష దర్శిని పథకాల టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ప్రోటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తాం. దళారుల మాటలకు మోసపోవద్దు: టీటీడీ తిరుమలలో ఆర్జిత సేవా టికెట్లు ఇప్పిస్తామని కొందరు దళారులు భక్తులను మోసగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని టీటీడీ నిఘా, భద్రతా విభాగం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా నేపథ్యంలో తిరుమలలో ప్రస్తుతం ఎలాంటి ఆర్జిత సేవా టికెట్లు ఇవ్వడం లేదని పేర్కొంది. తిరుమలకు సంబంధించిన సేవా టికెట్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ అయిన ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్’ లో మాత్రమే పొందే అవకాశముందని స్పష్టం చేసింది. ఆర్జిత సేవల పునరుద్ధరణ తర్వాత ఆన్లైన్లో సేవా టికెట్లు లభించని భక్తులకు తిరుమలలో లక్కీ డిప్ ద్వారా టికెట్లు పొందవచ్చని పేర్కొంది. భక్తులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేసింది. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్
సాక్షి, తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కర్ణాటక సీఎం యడియూరప్ప విచ్చేయనున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా రెండు రోజులు పాటు తిరుమలలోనే సీఎం వైఎస్ జగన్ ఉండనున్నారు. 23వ తేది సాయంత్రం తిరుమలకు సీఎం చేరుకోనున్నారు. గరుడ సేవ సందర్భంగా 23 సాయంత్రం శ్రీవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. (సెప్టెంబరు 19 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు) 24న ఉదయం శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దర్శించుకోనున్నారు. దర్శనాంతరం నాదనీరాజనం మండపంలో నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అనంతరం కర్ణాటక అతిథి గృహం శంకుస్థాపన కార్యక్రమంలో ఇరువురు సీఎంలూ పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి పద్మావతి అతిథి గృహానికి చేరుకోని అల్పాహారం స్వీకరించి సీఎం జగన్ తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. -
సెప్టెంబరు 19 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
సాక్షి, చిత్తూరు: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 19 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్-19 కారణంగా ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించింది. సెప్టెంబరు 18న అంకురార్పణ నిర్వహిస్తారు. వాహన సేవల సమయాల్లో మార్పులు చేశారు. ఉదయం 9 నుంచి 10 గంటలు, రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య వాహన సేవలు జరుగుతాయి. చదవండి: (కాగ్ ద్వారా టీటీడీ ఆడిటింగ్..!) బ్రహ్మోత్సవాల్లో రోజువారీ వివరాలు ఇలా వున్నాయి... 18-09-2020: అంకురార్పణం (సాయంత్రం) 19-09-2020: ధ్వజారోహణం (సాయంత్రం) 19-09-2020: పెద్దశేషవాహనం (రాత్రి) 20-09-2020: చిన్నశేషవాహనం (ఉదయం), హంస వాహనం (రాత్రి) 21-09-2020: సింహ వాహనం(ఉదయం), ముత్యపుపందిరి వాహనం (రాత్రి) 22-09-2020: కల్పవృక్ష వాహనం(ఉదయం), సర్వభూపాల వాహన (రాత్రి) 23-09-2020: మోహినీ అవతారం (ఉదయం), గరుడ సేవ (రాత్రి) 24-09-2020: హనుమంత వాహనం (ఉదయం), స్వర్ణరథం (సాయంత్రం), గజవాహనం (రాత్రి) 25-09-2020: సూర్యప్రభ వాహనం(ఉదయం), చంద్రప్రభ వాహనం(రాత్రి) 26-09-2020: శ్రీవారి రథోత్సవం (ఉదయం), అశ్వవాహనం (రాత్రి) 27-09-2020: చక్రస్నానం (ఉదయం), ధ్వజావరోహణం (రాత్రి) -
ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల: సెప్టెంబర్ 19 నుంచి 27 వరకు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను కరోనా కారణంగా ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అక్టోబర్లో నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలను అప్పటి పరిస్థితులను బట్టి ఎలా నిర్వహించాలో నిర్ణయిస్తామని తెలిపారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. ఈవో అనిల్కుమార్ సింఘాల్, ధర్మకర్తల మండలి సభ్యులు డా.చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి, మేడా మల్లికార్జునరెడ్డి, డా.నిశ్చిత, శివకుమార్, గోవిందహరి, దామోదర్రావు, వెంకటప్రసాద్కుమార్, డీపీ అనంత, కృష్ణమూర్తి వైద్యనాథన్, పార్థసారథి, మురళీకృష్ణ, రమణమూర్తి రాజు, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవోలు పి.బసంత్కుమార్, సదా భార్గవి, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► శనివారం నుంచి తిరుపతిలో 3 వేల ఉచిత శ్రీవారి దర్శన టోకెన్లు ► శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు నిర్మించాలని, స్థానిక భక్తులను భాగస్వామ్యం చేస్తూ దాతల నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించాం. ► టీటీడీ ఆదాయం పెంచుకునే ఆలోచనలో భాగంగా ఇకపై నగదు, బంగారం డిపాజిట్లలోంచి ప్రతి నెలా కొంత మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసేలా నిర్ణయం. ► బర్డ్ ఆస్పత్రిలో కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స చేసుకున్న వారి కోసం రూ.5.4 కోట్లతో బర్డ్ పరిపాలన భవనం మూడో అంతస్తులో 50 ప్రత్యేక గదుల నిర్మాణానికి ఆమోదం. ► విశాఖ దివ్య క్షేత్రం ఘాట్ రహదారి వాలు గోడల నిర్మాణానికి రూ.4.95 కోట్లతో ఆమోదం. కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చాక సీఎం చేతుల మీదుగా ఈ ఆలయానికి మహా కుంభాభిషేకం. ► కరోనా కారణంగా శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు చేయడం వల్ల ఇప్పటికే ఉదయాస్తమాన సేవ, వింశతి వర్ష దర్శిని పథకాల టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ప్రొటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయం. ► తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ను కొత్త టెక్నాలజీతో అభివృద్ధి చేయాలని నిర్ణయం. ఇందుకోసం టీటీడీ పాలక మండలి సభ్యురాలు సుధా నారాయణమూర్తి రూ.కోటి విరాళం ప్రకటించారు. ► ఇదిలా ఉండగా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ టీటీడీ చరిత్రలో తొలిసారి పాలకమండలి సమావేశాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. -
ఆగమోక్తంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఈనెల 13 నుంచి 21వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 10 నుంచి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని తెలిపారు. బ్రహ్మోత్సవాలపై ఏర్పాట్లపై ఆయన సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘భక్తులకు పెద్దపీట శ్రీవారి దర్శనానికి భక్తులకే పెద్దపీట వేస్తాం. నలుమాడ వీధుల్లో 2 లక్షల 26 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశాం. వారికి 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 6 లక్షల వాటర్ ప్యాకెట్లను సిద్ధం చేశాం. ఒక్కో సెక్టార్కు ఒక అధికారకిని నియమించాం. తిరుమలలో ఇప్పటికే 900 సీసీ కెమెరాల నిఘా ఉంది. ఆలయ నలుమాడ వీధుల్లో 280 అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. వీటిని 24 గంటలు పర్యవేక్షించేందుకు టీవీవాల్, సిబ్బందిని ఏర్పాటు చేశాం. విజిలెన్స్ సిబ్బంది 3 వేల మంది, పోలీసులు 2,500 మంది బ్రహ్మోత్సవాల్లో విధులు నిర్వహిస్తారు. గరుడ సేవ రోజున అదనంగా మరో 1,000 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారు. హోంగార్డులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు టోల్ఫ్రీ నంబర్లు 18004254141, 1800425333333కు భక్తులు ఫిర్యాదు చేయవచ్చు. బ్రేక్ దర్శనాలు, సేవలు రద్దు బ్రహ్మోత్సవాల్లో ఉదయం వాహనసేవ 9 నుంచి 11 గంటల వరకు, రాత్రి వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. గరుడ వాహనసేవ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశాం. రూ.98 కోట్ల వ్యయంతో మహిళలకు, పురుషులకు వేర్వేరుగా నిర్మించిన నూతన భవనాలను బ్రహ్మోత్సవాల్లో ప్రారంభిస్తాం. భక్తుల సౌకర్యార్థం రూ.26 కోట్లతో అదనపు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాం. వాహనసేవలను తిలకిం చేందుకు మాడ వీధుల్లో 19, భక్తుల రద్దీ ఉన్న ఇతర ప్రాంతాల్లో 12 కలిపి మొత్తం 31 డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నాం. శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ చేస్తాం. తిరుమలలోని ప్రధాన కూడళ్లలో 11 ప్రథమ చికిత్స కేంద్రాల ఏర్పాటు చేస్తున్నారు. 3 వేల మంది శ్రీవారి సేవకులు, దాదాపు 1000 స్కౌట్స్ అండ్ గైడ్స్ తిరుమలలోని అన్ని విభాగాల్లో భక్తులకు సేవలందిస్తారు.’ అని ఈవో వివరించారు. -
‘తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు’
సాక్షి, తిరుమల: ఈ ఏడాది తిరుమల శ్రీవారి ఆలయంలో రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్కుమార్ సంఘాల్ వెల్లడించారు. సెప్టెంబర్ 12 నుంచి 21 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 9 నుంచి 18 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుపుతామని చెప్పారు. ఈ మేరకు మంగళవారం జరిగిన టీటీడీ ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గత ఉత్సవాల్లో చోటుచేసుకున్న తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని మెరుగైన ఏర్పాట్లు చేస్తామని అన్నారు. మాడ వీధుల్లో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నామనీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాల సేవలను సైతం బ్రహ్మోత్సవాల్లో వినియోగించుకుంటామని అన్నారు. ఆగస్టు 31 లోపు ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేస్తామని స్పష్టం చెప్పారు. కాగా,టీటీడీ ఉన్నతస్థాయి సమావేశంలో కలెక్టర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వాహన సేవల్లో మార్పులు.. ఉత్సవాల్లో ఇబ్బందులు తలెత్తకుండా వాహన సేవల్లో మార్పులు చేశామని అనిల్కుమార్ చెప్పారు. శ్రీవారి వాహన సేవలు రాత్రి 8 గంటలకే ప్రారంభమవుతాయని అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 7 లక్షల లడ్డూలను నిల్వ చేశామని వెల్లడించారు. శ్రీవారికి గరుడ వాహన సేవ రోజున కొండపైకి ద్విచక్ర వాహనాలను అనుమతించబోమని అన్నారు. పిన్స్ సిస్టమ్, చైల్డ్ ట్యాగింగ్ సిస్టమ్ను ఈ ఏడాది కూడా అమలు చేస్తామని జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి తెలిపారు. పార్కింగ్ కోసం ప్రత్యేక యాప్ రూపొందించామనీ, బ్రహ్మోత్సవాలలో ఈ యాప్ను ప్రారంభిస్తామని తెలిపారు. -
సర్వభూపాల వాహనంపై సర్వజగద్రక్షకుడు
తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం కల్పవృక్షం, రాత్రి కొత్త సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు తిరు వీధుల్లో విహరించారు. నాలుగో రోజు భక్తుల సందడి పెరిగింది. గ్యాలరీలు నిండుగా కనిపించా యి. సాయంత్రం శ్రీవిల్లిపుత్తూరు నుంచి పుష్పమాలలు, చెన్నయ్ నుంచి గొడుగులు కానుకగా అందాయి. సహస్ర దీపాలంకార సేవలో స్వామి వేయి నేతి దీపాల వెలుగులో భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవల ముందు సంగీత, సాంస్కృతిక కళా బృందాల విభిన్న ప్రదర్శనలు భక్తులను కట్టిపడేశాయి. అఘోరా నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు మంగళవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారు కోర్కెలు తీర్చే కల్పవృక్ష వాహనంపై తిరువీధుల్లో విహరించారు. చర్నాకోల్ చేతబట్టి రాజమన్నార్ రూపధారిగా భక్తులను కటాక్షించారు. వాహన సేవకు ముందుకళా బృందాల ప్రదర్శనలు భక్తులను కట్టిపడేశాయి. మధ్యాహ్నం ఆలయంలో స్నపన తిరుమంజనం కనులపండువగా జరిగింది.రాత్రి ఉభయదేవేరులతో సర్వభూపాల వాహనంపై కొలువుదీరి తిరువీధుల్లో విహరించారు. అదనపు బందోబస్తు తిరుపతి (అలిపిరి) : గరుడోత్సవానికి అదనంగా 1000 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు అనంతపురం రేంజ్ డీఐజీ జె.ప్రభాకర్ రావు వెల్లడించారు. తిరుమల రాంభగీచ విశ్రాంతి గృహాల సముదాయం ఎదుట ఏర్పాటు చేసి పోలీసు కంట్రోల్ రూంలో మంగళవారం ఆయన తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మొహంతితో కలిసి గరుడసేవ భద్రతపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ గరుడ సేవ రోజున తిరుమలలో ఎటువంటి అవాంచనీయ సంఘటన చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పా టు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్, క్రైమ్ పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులకు సేవలందించాలని కోరారు. గరుడ సేవ రోజు ట్రాఫిక్ సమస్య తలెత్తితే ఘాట్రోడ్లలో ప్రయాణించే వాహనాలను తిరిగి తిరుపతికి వెనక్కు పంపుతామని తెలిపారు. ♦ విస్తృత తనిఖీలు తిరుపతి అర్బన్: శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రధాన ఘట్టమైన గరుడసేవను పురస్కరించుకుని మంగళవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు పటిష్ట తనిఖీలు చేపడుతున్నట్టు అలిపిరి ఏవీఎస్ఓ దాసరిదండు గంగరాజు తెలిపారు. డోర్ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లతో పాటు భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి తిరుమలకు పంపుతున్నామన్నారు. కాలిబాట మెట్ల మార్గాలు, అలిపిరి పాత చెక్పాయింట్ పరిసరాల్లో విస్తృత తనిఖీ లు చేస్తునట్లు తెలిపారు. అనామానాస్పద వ్యక్తలు, గుర్తు తెలియని లగేజీలు కనిపిస్తే టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఆర్టీసీ బస్సులు, నాలుగు చక్రాల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతామని తెలిపారు. ♦ నేడు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ ♦ 3.70 లక్షల మందికి ప్రసాదాలు సిద్ధం తిరుపతి (అలిపిరి): గరుడ సేవకు విచ్చేసే భక్తకోటికి నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు టీటీడీ అన్నదాన డిప్యూటీ ఈఓ వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు ఉదయం 8 నుంచి రాత్రి ఒంటి గంట వరకు నిరంతరాయంగా అన్నప్రసాదం పంపిణీ జరుగుతుందన్నారు. 3.70 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. గ్యాలరీల్లోని భక్తులకు 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తామన్నారు. బిస్బెల్లా బాత్, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, ఉప్మా, కాఫీ, పాలు అందిస్తామని తెలిపారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్, సీఆర్ఓ, రాంభగీచా విశ్రాంతి గృహాల వద్ద ఉన్న ఫుడ్ కౌంటర్ల ద్వారా రోజుకు 40 వేల మందికి అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని పార్కింగ్ ప్రదేశాల్లో భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. 1985లో రోజుకు 2వేల మందితో అన్నప్రసాద వితరణ ప్రారంభించి నేడు 1.5 లక్షల మందికి అన్నప్రసాదాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో టీటీడీ క్యాటరింగ్ అధికారి శాస్త్రి, పీఆర్వో రవి, ఏపీఆర్వో నీలిమ పాల్గొన్నారు. నేటి గరుడోత్సవానికి నిమిషానికి 4 బస్సులు ♦ 24గంటలు ఘాట్ రోడ్లలో రాకపోకలు ♦ టూవీలర్లకు నో ఏంట్రీ తిరుపతి సిటీ: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం జరిగే గరుడ సేవను పురస్కరిం చుకుని∙నిమిషానికి 4 బస్సులను నడిపేలా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. గరుడ సేవకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. బుధవారం తెల్లవారు జామున నుంచే కావాల్సినన్ని బస్సులను సిద్ధం చేశారు. గరుడ సేవను పురస్కరించుకుని తిరుమల ఘాట్ రోడ్లలో 24 గంటల పాటు బస్సులు రాకపోకలు కొనసాగించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఉదయం నుంచి గురువారం తెల్లవారు జాము వరకు 525 బస్సులతో 4152 ట్రిప్పులు నడిపేలా ఆర్ఎం నిర్ణయించారు. గరుడ సేవను పురస్కరించుకుని మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచే ద్విచక్ర వాహనాలను తిరుమలకు రద్దు చేశారు. తిరుమలకు వెళ్లే ద్విచక్ర వాహనదారులు అలిపిరి, బాలాజీ లింక్ బస్ స్టేషన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్లో పెట్టాలి. అక్కడ్నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్లాల్సి ఉంటుంది. -
షోడశ కళానిధికి షోఢశోపచారాలు..
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వర స్వామివారు నిత్యపూజా ప్రియుడు. దేవదేవునికి నిత్యం ఆరుసార్లు పూజలు జరుగుతాయి. ఆగమ భాషలో షట్కాల పూజ అంటారు. ప్రత్యూషతో మొదలై షట్కాలాలు వరుసగా పూజలు జరుగుతాయి. ప్రత్యూష, ప్రాతఃకాల, మధ్యాహ్న, అపరాహ్న, సాయంకాల, రాత్రి పూజలు అందుకునే ఆ స్వామి నిత్య కైంకర్య వైభోగం అనిర్వచనీయం. –సాక్షి, తిరుమల సుప్రభాత సేవ ‘కౌసల్యా సుప్రజా రామా... సంధ్యా ప్రవక్తతే’ అంటూ వేకు వ జామున సుప్రభాతంతో శ్రీవారిని మేల్కొలుపుతారు. ఇదే ప్రథమ పూజ సేవ. నిత్యం వేకువజాము సమయం మూడు గంటలకు ప్రారంభమవుతుంది. అంతకు ముందే ఆలయ అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగులు, యాదవ వంశీకుడు (సన్నిధి గొల్ల) దేవాలయం వద్దకు చేరుకుంటారు. అప్పుడే నగారా మండపంలో గంట మోగుతుంది. మహాద్వారం గుండా సన్నిధి గొల్ల ముందు నడుస్తుండగా అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. కుంచె కోలను, తాళం చెవులను ధ్వజస్తంభం వద్ద నున్న క్షేత్ర పాలక శిలకు తాకించి ద్వారాలు తెరిచేందుకు అనుమతి పొందుతారు. తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీకుడు తం బురా పట్టుకుని మేలుకొలుపు పాట పాడేందుకు ముందుగా లోపలికి వెళతారు. వెంటనే పండితులు సుప్రభాతాన్ని పఠిస్తారు. ఆ తర్వాత వేంకటేశ్వర స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ఆలపిస్తారు. అదే సమయంలో తాళ్లపాక వంశీయుడు తంబురా మీటుతూ మూలమూర్తిని మేల్కొలుపుతాడు. అర్చక స్వాములు అంతర్ ద్వారం తలుపులు తెరిచి గర్భగుడిలోకి వెళ్లి శ్రీవారి పాద పద్మాలకు నమస్కరించి స్వామిని మేల్కొలుపుతారు. శుద్ధి సుప్రభాత సేవ అనంతరం వేకువజామున మూడున్నర నుంచి మూడు గంటల నలౖభై ఐదు నిమిషాల వరకు ఆలయ శుద్ధి నిర్వహిస్తారు. గత రాత్రి జరిగిన అలంకరణలు, పూలమాలలన్నింటినీ తొలగిస్తారు. వాటన్నింటినీ సం పంగి ప్రదక్షిణంలో ఉండే పూలబావిలో వేస్తారు. అర్చన శ్రీవారికి రోజూ తెల్లవారుజామున జరిగే ఆరాధన ఇది. జియ్యంగారు పూలగది నుంచి పుష్పమాలలు, తులసి మాలలతో ఉన్న వెదురుగంపను తలపై పెట్టుకుని శ్రీవారి సన్నిధికి తెస్తారు. అర్చనకు ముందు పురుషసూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి ఆవుపాలు, చందనం, పసుపునీళ్లు, గంధపు నీటితో అర్చకులు అభిషేకం చేస్తారు. పుష్పాంజలి తర్వాత భోగమూర్తి విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు. ప్రోక్షణ చేసి మూల విగ్రహానికి, భోగమూర్తికి స్వర్ణ సూత్రాన్ని కలుపుతారు. ఈ సూత్రం ద్వారానే ధృవబేరం నుంచి భోగ విగ్రహానికి శక్తి ప్రసరిస్తుందని నమ్మిక. శ్రీవారి సువర్ణ పాదాలను(తిరువడి) స్నాన పీఠంలో ఉంచి అభిషేకిస్తారు. తోమాల సేవ తమిళంలో ‘తోడుత్తమలై’ అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థం. కాలక్రమంలో ‘తోమాల’గా మారి అదే తో మాల సేవగా మారి ఉండవచ్చని అర్చకుల అభిప్రాయం. తోమాల సేవనే ‘భగవతీ ఆరాధన’ అని కూడా అంటారు. ఈ సేవలో భాగంగా వేంకటేశ్వర స్వామిని పూలమాలలతో అలం కరిస్తారు. వారంలో ఆరు రోజులు శుద్ధి్ద అనంతరం ఈ సేవ ఉంటుంది. శుక్రవారం మాత్రం అభిషేకం జరిపించిన తరువాత తోమాల సేవ చేస్తారు. కొలువు తోమాల సేవ తర్వాత పదిహేను నిమిషాల పాటు తిరుమామణి మండపంలో కొలువు శ్రీనివాసమూర్తికి దర్బార్ నిర్వహిస్తారు. బలి బేరానికి రాజోచిత మర్యాదలు నిర్వహించి ఆ నాటి గ్రహ సంచార క్రమాన్ని ఆరోజు జరిపించబోయే ఉత్సవ విశేషాల గురించి విన్నవిస్తారు. ముందు రోజు హుండీ ఆదాయం వివరాలను..ఏయే నోట్లు ఎన్ని వచ్చాయి.. నాణాలు మొత్తం విలు వను స్వామి వారికి తెలియజేస్తారు. సహస్రనామార్చాన నిత్యం ఉదయం నాలుగు నలభై ఐదు నిమిషాల నుంచి ఐదున్నర వరకు సహస్ర నామార్చన జరుగుతుంది. బ్రహ్మాండ పురాణంలోని స్వామి వారి వెయ్యి నామాలతో స్తుతిస్తూ చేసే అర్చన ఇది. ఈ అర్చన పూర్తయ్యాక శ్రీవారి పాదాల మీద ఉన్న పుష్పాలు, తులసి దళాలతో దేవేరులకు పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో మిరాశీదారు వరాహ పురాణంలోని లక్ష్మీ సహస్ర నామాలను పఠిస్తారు. మొదటి గంట, నైవేద్యం మేలుకొలుపు, అభిషేకాలు, కొలువు కూటం, సహస్ర నామార్చన పూర్తయ్యాక స్వామి వారికి నైవేద్యం పెడతారు. నైవేద్య సమర్పణకు ముందుగా శయన మండపాన్ని శుభ్రం చేసి బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు. తిరుమామణి మండపంలోని గంటలు మోగిస్తారు. అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామి వారికి ప్రసాదాలను కులశేఖరపడి (స్వామి వారికి ముందుమెట్టు) ఇవతల ఉంచి సమర్పిస్తారు. అష్టోత్తర శతనామార్చన ఈ అర్చనతోనే స్వామి వారికి మధ్యాహ్న పూజలు ప్రారంభమవుతాయి. వరాహ పురాణంలో వేంకటేశ్వరుడిని స్తుతిస్తూ ఉన్న నూట ఎనిమిది(108) నామాలను అర్చకులు పఠిస్తారు. అనంతరం శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చాన జరుపుతారు. అక్కడితో మధ్యాహ్న పూజలు పూర్తవుతాయి. అనంతరం రెండో గంట నైవేద్యం ఉంటుంది. రాత్రి కైంకర్యాలు ఉదయం జరిగే తోమాల సేవ వంటిదే రాత్రి పూట కూడా జరుగుతుంది. అనంతరం హారతి, స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన, శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన, నైవేద్య సమర్పణ జరుగుతాయి. ఈ సమయంలోనే మూడో గంట మోగుతుంది. తర్వాత భక్తులకు సర్వదర్శనం ఉంటుంది. ఏకాంత సేవ నిత్యం రాత్రి ఒకటిన్నర గంటల తర్వాత స్వామికి పవళింపు సేవ నిర్వహిస్తారు. దీనినే ఏకాంత సేవ/ పవళింపుసేవ అంటారు. ఏడాదిలో 11 నెలలు, భోగశ్రీనివాసుడికి, ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణుడికి నిర్వహిస్తారు. -
బ్రహ్మోత్సవాలకు హైటెక్ భద్రత
‘శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం. హైటెక్ టెక్నాలజీతో దొంగలను నియంత్రించేందుకు ప్రత్యేక టెక్నాలజీని వినియోగిస్తున్నాం. అందరి సహకారంతో ఉత్సవాలను విజయవం తం చేసేందుకు కృషి చేస్తాం’ అని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అభిషేక్ మొహంతి అన్నారు. బ్రహ్మోత్సవాలకు భద్రతపరంగా తీసుకుంటున్న చర్యలపై ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.. – తిరుపతి క్రైం సాక్షి : బ్రహ్మోత్సవాలకు భద్రతపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తారా? ఎస్పీ : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఫేజ్–1 కింద 3వేల మందితో గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నాం. గరుడ సేవ రోజున ఫేజ్–2 కింద అదనంగా మరో 1000 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నాం. తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డులో స్పెషల్ టీమ్లు తిరుమలకు వెళ్లే రహదారులను తని ఖీలు చేస్తాయి. భద్రత కో సం 8 చెక్పాయింట్లను ఏర్పాటు చేశాం. 25 మంది సిబ్బంది బాడీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని తిరుమల మొత్తం తిరుగుతుంటారు. పెరటాశి నెల, దసరా సెలవులను దృష్టిలో ఉంచుకుని ఈసారి గరుడసేవకు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు జనసందోహం ఉంటుందని అంచనా వేశాం. ట్రాఫిక్ను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. నగరంపై ఒక డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేస్తాం. కెమెరాల ద్వారా కమాండెంట్ కంట్రోల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తాం. సాక్షి : పార్కింగ్ ఏర్పాట్ల గురించి? ఎస్పీ : తిరుమలలో పార్కింగ్ కోసం ప్రత్యేక యాప్ను ఏర్పాటు చేశాం (బ్రహ్మోత్సవ పార్కింగ్ ట్రాకర్ అనే యా ప్). వాహనదారులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తద్వారా తిరుమలలో ఏయే ప్రాంతాల్లో పార్కింగ్ఏర్పాటు చేశాం. వాహనాలు రద్దీగా ఉన్నాయా లేదా తెలియజేస్తుంది. మా సిబ్బంది ఎప్పటికప్పుడు వాహనాల పార్కింగ్ వివరాలను యాప్లో అప్లోడ్ చేస్తుంటారు. సాక్షి : భక్తుల సమాచారానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెబుతారా? ఎస్పీ : తిరుపతిలో రైల్వేస్టేషన్, బస్టాండ్, అలిపిరి చెక్పాయింట్, అలిపిరి లింక్ బస్టాండ్ వద్ద హెల్ప్ సెంటర్లను ఏర్పాటు చేశాం. ఇక్కడ ప్రజలకు కావాల్సిన సమాచారం ఇస్తారు. ఇందులో ఓ ఎస్సై స్థాయి అధికారి ఉంటారు. ఏదైనా సమస్య వస్తే అక్కడికక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. 14 మొబైల్ క్లినిక్స్ను ఏర్పాటు చేశాం. ఆరు మొబైల్ క్లినిక్స్ ఘాట్ రోడ్డులో తిరుగుతూ ఉంటాయి. అక్కడ నిలిచిపోయిన వాహనాలను మరమ్మతులు చేసి పంపుతుంటాయి. మిగతావన్నీ తిరుమల పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి. భక్తులు గాయపడితే వెంటనే వైద్యం అందిస్తాయి. సాక్షి : చిన్నపిల్లల భద్రత గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్పీ : 5 సంవత్సరాల లోపు చిన్నారులకు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద, తిరుమలకు వెళ్లే రెండు వైపులా ఉన్న నడకదారుల భక్తులకు ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కంకణం కడుతాం. దానిపై వారి కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్ రాస్తాం. వారు ఫోటో తీసుకుని చిరునామాను సేకరిస్తాం. దీన్ని పేస్ బయోమెట్రిక్ చైల్డ్ట్రాకింగ్ యాప్లో అప్లోడ్ చేస్తాం. తద్వారా ఎవరైనా తప్పిపోయినా సకాలంలో కుటుంబ సభ్యులకు చేర్చే అవకాశం ఉంది. ఇది వృద్ధులకు కూడా వర్తిస్తుంది. సాక్షి : దొంగల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి చెప్పగలరా? ఎస్పీ : దొంగలను నియంత్రించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. క్రైం ఏఎస్పీ ఆధ్వర్యంలో ఆ సిబ్బంది మొత్తం పనిచేస్తారు. వీరి వద్ద 50 ఎఫ్ఐఎన్ఎస్ (ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అండ్ సర్చ్) మిషన్లు ఉంటాయి. ఇది అంతా హైటెక్ టెక్నాలజీ దొంగ దొరికిన వెంటనే ఫింగర్ ప్రింట్ తీసుకుంటాం. అందులో 6 లక్షల వేలిముద్రలు ఉన్నాయి. పాతనేరస్థుడైతే స్పాట్లోనే చిట్టా బయటకు వస్తుంది -
పుష్కరిణిలో శ్రీవారి చక్రస్నానం
-
పుష్కరిణిలో శ్రీవారి చక్రస్నానం
తిరుమల : తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో స్వామి వారి చక్రస్నాన కార్యక్రమం మంగళవారం ఉదయం ముగిసింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలో నేటి రాత్రి ధ్వజావరోహణం జరగనుంది. దీంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. -
వైభవంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు