నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశం | YS Jagan to hold meet with Guntur YSRCP Leaders on February 12th | Sakshi
Sakshi News home page

నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశం

Published Wed, Feb 12 2025 4:31 AM | Last Updated on Wed, Feb 12 2025 4:31 AM

YS Jagan to hold meet with Guntur YSRCP Leaders on February 12th

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jaganmohan Reddy) బుధ­వారం ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన నేతలతో సమావేశం కానున్నారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యా­లయంలో జరిగే ఈ సమావేశానికి ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఎంపీపీలు, జెడ్పీ­టీసీలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, మేయర్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులపై చర్చించడంతో పాటు వైఎస్సార్‌సీపీని మరింతగా బలో­పేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement