ప్రకటనల రంగ దిగ్గజం పీయూష్ పాండే మరణంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి | YS Jagan pays tribute to Piyush Pandey | Sakshi
Sakshi News home page

ప్రకటనల రంగ దిగ్గజం పీయూష్ పాండే మరణంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Oct 24 2025 5:38 PM | Updated on Oct 24 2025 6:15 PM

YS Jagan pays tribute to Piyush Pandey

సాక్షి,తాడేపల్లి: ప్రకటనల రంగ దిగ్గజం పీయూష్ పాండే (70) మరణంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

వైఎస్‌ జగన్‌ తన ట్వీట్‌లో..‘ దేశానికి కనెక్టయ్యేలా ఆయన సృజనాత్మక ప్రకటనలు ఉంటాయి. అలాంటి పద్మశ్రీ పాండేని కోల్పోవటం విచారకరం. పాండే కుటుంబ సభ్యులు,  స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. సాక్షి, భారతి సిమెంట్స్ ప్రారంభ సమయంలో ఆయన చేసిన సృజనాత్మక కృషి ఎప్పటికీ గుర్తుండి పోతుంది’అని పేర్కొన్నారు’అని పేర్కొన్నారు. 

కాగా, ప్రకటనల రంగ దిగ్గజం పీయూష్ పాండే (70) అనారోగ్యంతో ముంబైలో కన్నుమూశారు. ప్రకటనల రంగానికి నాలుగు దశాబ్దాలకు పైగా విశేష సేవలు అందించిన ఈ సృజనాత్మక మేధావి, భారతీయ ప్రకటనల రంగాన్ని మలుపు తిప్పిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement