ads
-
IPL 2025: జియోహాట్స్టార్కు యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం ఎన్ని కోట్లంటే?
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025' (IPL 2025) మొదలైపోయింది. సుమారు రెండు నెలల పాటు సాగే ఈ సీజన్కు సంబంధించిన డిజిటల్, ఓటీటీ రైట్స్ అన్నింటినీ జియోహాట్స్టార్ సొంతం చేసుకుంది. ఈసారి జియోహాట్స్టార్ ప్రకటనల ద్వారానే ఏకంగా రూ. 4,500 కోట్లు సంపాదించనుంది. దీనికోసం సంస్థ.. 32 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.ఐపీఎల్ 2025 ప్రకటన ధరలు➤టీవీ ప్రకటనలు: రూ.40 కోట్ల నుంచి రూ.240 కోట్లు➤ప్రాంతీయ టీవీ ప్రకటనలు: రూ.16 కోట్ల నుంచి ప్రారంభమవుతాయి➤కనెక్టెడ్ టీవీ (CTV): 10 సెకన్లకు రూ.8.5 లక్షలు➤మొబైల్ ప్రకటనలు: రూ.250 వరకుస్పాన్సర్లుజియోహాట్స్టార్ స్పాన్సర్ల జాబితాలో.. మై11సర్కిల్, ఫోన్పే, ఎస్బీఐ, బ్రిటానియా 50-50, అమెజాన్ ప్రైమ్, డ్రీమ్11, టీవీఎస్, మారుతి, అమెజాన్ ప్రైమ్, వోల్టాస్, ఎంఆర్ఎఫ్, జాగ్వార్, ఏషియన్ పెయింట్స్, అమూల్ మొదలైన 32 కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ టీవీ, డిజిటల్ స్ట్రీమింగ్లో యాడ్స్ కోసం ఇప్పటికే డీల్స్ కుదుర్చుకున్నాయి.ఇదీ చదవండి: వేలకోట్ల సంపదకు యువరాణి.. స్టార్ హీరోయిన్ కూతురు.. ఎవరో తెలుసా?జియోహాట్స్టార్ సబ్స్క్రిప్షన్స్ఐపీఎల్ 2025 సమయంలో.. జియోహాట్స్టార్ 40 మిలియన్ల అదనపు చెల్లింపు సబ్స్క్రైబర్ల ప్రత్యేక ఆఫర్స్ అందించడం మొదలుపెట్టింది. డిస్నీ ప్లస్ హాట్స్టార్, జియో సినిమా విలీనం తర్వాత ఏర్పడిన స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్.. ప్రస్తుతం 62 మిలియన్ల సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. 2025 ఫిబ్రవరి 14న ఈ సంఖ్య 50 మిలియన్లు. ఈ ఐపీఎల్ 2025 సీజన్కు 100 మిలియన్ల సబ్స్క్రైబర్లను చేరుకోవడానికి సంస్థ కృషి చేస్తోంది. -
థియేటర్లో ప్రకటనలపై కోర్టు కీలక తీర్పు
బెంగళూరు: సరదాగా సినిమా చూద్దామని వెళితే తన విలువైన సమయం వృథా చేశారని ఓ యువ న్యాయవాది థియేటర్పై కేసు వేశారు. ఈ కేసులో వినియోగదారుల కోర్టు న్యాయవాదికి అనుకూలంగా తీర్పిచ్చింది. అతనికి రూ.65వేల నష్టపరిహారం చెల్లించాలని థియేటర్ యాజమాన్యాన్ని కోర్టు ఆదేశించింది. 2023లో బెంగళూరులో అభిషేక్ అనే న్యాయవాది బుక్మైషో ప్లాట్ఫాంలో టికెట్లు బుక్ చేసుకొని పివిఆర్ ఐనాక్స్ థియేటర్లో సినిమాకు వెళ్లారు.సినిమా ప్రదర్శించే ముందు థియేటర్లో 25 నిమిషాల పాటు ప్రకటనలు వేశారు. దీంతో యువ న్యాయవాదికి చిర్రెత్తుకొచ్చి థియేటర్పై కేసు వేసి విజయం సాధించారు.ఈ కేసులో తీర్పిచ్చే సందర్భంగా వినియోగదారుల కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమయం డబ్బులతో సమానమని, అభిషేక్ విలువైన టైమ్ వేస్ట్ చేసినందుకు అతడికి నష్టపరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే ప్రకటనలు వేయడాన్ని థియేటర్ యాజమాన్యం సమర్థించుకుంది. తాము కొన్ని ప్రకటనలు తప్పనిసరిగా వేయాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నాయి. -
డిజిటల్ మీడియాకూ ప్రభుత్వ ప్రకటనలు
హైదరాబాద్: ప్రతిక్షణం ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్న ఆన్లైన్ న్యూస్ మీడియా(వెబ్సైట్, యాప్)కు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలంటూ తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ (I&PR) ప్రత్యేక కమిషనర్ ఎస్ హరీష్కు విజ్ఞప్తి చేశారు తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ (TDMJA) నాయకులు స్వామి ముద్దం, పోతు అశోక్. ఈ మేరకు ఆన్లైన్ మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరాన్ని తెలుపుతూ లేఖ అందించారు.దీనిపై సానుకూలంగా స్పందించిన ఐ అండ్ పీఆర్ కమిషనర్.. త్వరలోనే ఆన్లైన్ మీడియా(వెబ్సైట్, యాప్)కు ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చే ప్రక్రియ షురూ చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ రూపొందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు స్వామి ముద్దం మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా డిజిటల్ మీడియా రంగం కీలక పాత్ర వహిస్తుందన్నారు.ఈ కొత్త మాధ్యమంలో అనేక మంది జర్నలిస్టులు పని చేస్తున్నారని చెప్పారు. ఆన్లైన్ న్యూస్ మీడియాకు గుర్తింపును ఇస్తూ ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి సహకరించాలని ఐ అండ్ పీ ఆర్ కమిషనర్కు విజ్ఞప్తి చేశామని చెప్పారు. దీనికి సానుకూలంగా స్పందించి, ఆ ప్రక్రియ ప్రారంభిస్తామని కమిషనర్ హామీ ఇవ్వడం సంతోషకరమని, ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆన్లైన్ న్యూస్ మీడియాకు తెలంగాణ మీడియా అకాడమీ ఆక్రిడిటేషన్లు ఇచ్చేందుకు గైడ్లైన్స్ రూపొందించడం కొత్త మీడియా జర్నలిస్టులకు శుభపరిణామమని చెప్పారు. -
‘సాక్షి’పై చంద్రబాబు అక్కసు
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు అరాచకాలు, వైఫల్యాలు, అవినీతిని ఎండగడుతున్నందుకే ‘సాక్షి’ పత్రికపై చంద్రబాబు మంత్రి మండలి సమావేశం మాటున అక్కసు వెళ్లగక్కారు. వైఎస్సార్సీపీ హయాంలో ‘సాక్షి’కి ప్రభుత్వ ప్రకటనల జారీని వక్రీకరిస్తూ అసత్య ఆరోపణలు చేశారు. గతంలో శాసనసభ వేదికగా వక్రీకరణలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన చంద్రబాబు.. ఈసారి కూడా అవే అవాస్తవాలను వినిపించారు. నాడు నిబంధనల మేరకే అన్ని పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు జారీ చేశారని సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి శాసనసభలో లిఖిత పూర్వకంగా సమాధానమివ్వడం గమనార్హం. అయినాసరే చంద్రబాబు పదే పదే సాక్షి పత్రికపై బురదజల్లేందుకు యత్నిస్తుండటం ఆయన దిగజారుడుకు నిదర్శనంగా నిలుస్తోంది. భారతి చైర్పర్సన్ కాదు.. డైరెక్టరూ కాదువైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి చైర్పర్సన్గా ఉన్న సాక్షి పత్రికకు అక్రమంగా అధికంగా ప్రకటనలు ఇచ్చారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉంది. వాస్తవం ఏమిటంటే వైఎస్ భారతి సాక్షి పత్రికకు చైర్పర్సన్ కాదు.. డైరెక్టరూ కాదు. ఏబీసీ మార్గదర్శకాల మేరకే ప్రకటనలు వైఎస్సార్సీపీ హయాంలో సాక్షి పత్రికకు అడ్డగోలుగా రూ.443 కోట్ల ప్రకటనలు జారీ చేశారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఇతర పత్రికలన్నింటికీ కలిపి కూడా అంత విలువైన ప్రకటనలు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. వాస్తవం ఏమిటంటే నాడు సమాచార శాఖ నిబంధనలు, ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) గణాంకాలను పరిగణలోకి తీసుకునే సాక్షి, ఈనాడుతోపాటు ఇతర పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో సాక్షి పత్రికకు ఐదేళ్లలో రూ.443 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు జారీ చేశారని చంద్రబాబు చెప్పింది అవాస్తవం. సాక్షి పత్రికకు ఆ ఐదేళ్లలో మొత్తం రూ.371 కోట్ల విలువైన ప్రకటనలు జారీ అయ్యాయి. ఈనాడు పత్రికకు కూడా మొత్తం రూ.243 కోట్లు విలువైన ప్రకటనలు ఇచ్చారు. అయితే మూడున్నరేళ్ల తరువాత తమకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వొద్దని ఈనాడు యాజమాన్యం సమాచార శాఖకు లేఖ రాసింది. దాంతో చివరి ఏడాదిన్నర ఈనాడు పత్రికకు ప్రకటలు ఇవ్వలేదు. ఆ ఏడాదిన్నర కూడా ఈనాడు పత్రిక యాజమాన్యం ప్రకటనలు తీసుకొని ఉంటే ప్రభుత్వం మరో రూ.125 కోట్ల వరకు విలువైన ప్రకటలు ఇచ్చేది. దాంతో సాక్షి పత్రికతో సమానంగా ఈనాడు పత్రికకు కూడా ప్రకటనల బడ్జెట్ కేటాయించినట్టు అయ్యేది. ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈనాడు పత్రికకు ప్రకటనల బిల్లులు పూర్తిగా చెల్లించకుండా పెండింగ్లో పెట్టిందని చంద్రబాబు విమర్శించారు. వాస్తవమేమిటంటే.. ఈనాడుకే కాదు.. సాక్షి పత్రికకు కూడా ప్రకటనల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈనాడు పత్రికకు చెల్లించాల్సిన ప్రకటనల బకాయిలు రూ. 51 కోట్లు ఉండగా నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ సాక్షి పత్రికకు రూ.104.85 కోట్ల యాడ్స్ బకాయిలు పెండింగులోనే ఉన్నాయి. -
ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు కీలక సూచన.. ఇకపై..
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI).. అన్ని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు తమ ఉత్పత్తుల మీద '100% ఫ్రూట్ జ్యూస్' అనే లేబుల్స్, అడ్వర్టైజ్మెంట్లను తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబరు 1లోపు ఇప్పటికే ఉన్న అన్ని ప్రీ-ప్రింటెడ్ ప్యాకేజింగ్ మెటీరియల్లను ఎగ్జాస్ట్ చేయమని కూడా సూచించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.జ్యూస్ కవర్ మీద 100 శాతం నేచురల్.. తక్కువ చక్కెర కంటెంట్ అని రాసి ఉంటుంది. కానీ ఇలాంటి వాటిలో వంద శాతం ఫ్రూట్ జ్యూస్ ఉండదు. తప్పుడు సమాచారంతో కంపెనీలు ప్రజలను మోసం చేస్తున్నారు. ఫ్రెష్ జ్యూస్ చేసుకోవడం కష్టమని.. చాలామంది రెడిమేడ్ జ్యూస్లను కొనుగోలు చేస్తూ.. ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. ఈ కారణంగానే కంపెనీలన్నీ తమ ఉత్పత్తుల మీద లేబుల్స్, అడ్వర్టైజ్మెంట్లను తొలగించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది.ఎఫ్ఎస్ఎస్ఏఐ కొత్త రూల్స్ ప్రకారం.. కిలో జ్యూస్లో 15 గ్రాముల కంటే ఎక్కువ చక్కర ఉంటె స్వీట్ జ్యూస్ అని లేబుల్ వేయాలి. తాజా పండ్ల రసం కాకూండా.. ప్రాసెస్ చేసిన జ్యూస్ ఆరోగ్యానికి చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇది క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. బరువు పెరగడం, గుండె జబ్బులు వంటి వివిధ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఢిల్లీలో పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ తొలగించిన ఎంసీడీ
సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో దేశంలో ఎలక్షన్ కోడ్ అమలులో వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) తన 12 జోన్ల నుంచి 5,20,042 పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ (హోర్డింగ్లు, పోస్టర్లు, వాల్ పెయింటింగ్లు, జెండాలు) తొలగించింది. ఎన్నికల షెడ్యూల్ను ఎలక్షన్ కమిషన్ (ఈసీ) మార్చి 16న ప్రకటించడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) అమల్లోకి వచ్చింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలో మే 25న ఢిల్లీలో ఓటింగ్ ఉంటుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ తొలగించిన మొత్తం పొలిటికల్ అడ్వర్టైస్మెంట్లలో.. 257280 హోర్డింగ్లు, 192601 వాల్ పెయింటింగ్లు & పోస్టర్లు, 40022 సంకేతాలు, 30139 జెండాలు ఉన్నట్లు సమాచారం. ఎన్నికలు ముగిసే వరకు ఈ నియమం అమలులో ఉంటుందని ఎంసీసీ పేర్కొంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన 24 గంటల్లోపు బహిరంగ ప్రదేశంలో ఏదైనా రాజకీయ పార్టీ లేదా నాయకుడిని ప్రోత్సహించే పోస్టర్లు, హోర్డింగ్లు లేదా బ్యానర్లను తొలగించాలని ఈసీ ఇప్పటికే ఆదేశించింది. కాబట్టి ఎంసీడీ బ్యానర్లను ఎప్పటికప్పుడు తొలగిస్తోంది. -
సోషల్ మీడియా క్యాష్ పార్టీ..
సాక్షి, అమరావతి: యువత బలహీనతలు సోషల్ మీడియా సంస్థలకు కాసులు కురిపిస్తున్నాయి. ప్రతీ విషయాన్ని ఆర్థిక కోణంలోనే చూస్తూ యూజర్ల రక్షణ, హానికర కంటెంట్ను అరికట్టడంలో అవి అలక్ష్యం వహిస్తున్నాయి. సోషల్ మీడియా సంస్థలు తమకు వచ్చే ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికే పనిచేస్తున్నాయని హార్వర్డ్ యూనివర్సిటీలోని ‘హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్’ అధ్యయనం వెల్లడిస్తోంది. తాజా నివేదిక ప్రకారం..2022లో అమెరికాలోని 18 ఏళ్ల లోపు యూజర్ల కేటగిరీలో ఏకంగా రూ.91,541 కోట్లను సోషల్ మీడియా సంస్థలు ఆర్జించాయి. ఇందులో 12 ఏళ్లలోపు కేటగిరీలో ఏకంగా రూ.17,476 కోట్లు ప్రకటనల రాబడి ఉండటం విశేషం. స్నాప్చాట్, టిక్టాక్, యూట్యూబ్ ద్వారా వచ్చే ప్రకటనల ఆదాయం 30–40% యువ యూజర్ల వీక్షణల ద్వారా సోషల్ మీడియా సంస్థలకు సమకూరుతోంది. ఈ ట్రెండ్ ఏటా పెరుగుతూనే ఉంది. ఈ లెక్కన కొత్త సంవత్సరంలో వీటి ఆదాయంలో మరింత వృద్ధి కనిపించనుంది. స్నాప్చాట్కు అధిక రాబడి: హార్వర్డ్ వర్సిటీ బృందం అమెరికాలోని ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, స్నాప్చాట్, టిక్టాక్, ఎక్స్(ట్విట్టర్), యూట్యూబ్ వినియోగదారులపై పరిశోధన చేసింది. 12 ఏళ్ల లోపు యూజర్ల కేటగిరీలో ప్రకటనల ద్వారా యూట్యూబ్ రూ.7,983 కోట్లు, ఇన్స్ట్రాగామ్ రూ.6,676 కోట్లు, ఫేస్బుక్ రూ.1,140 కోట్లను రాబట్టినట్లు నివేదిక పేర్కొంది. 13–17 ఏళ్ల లోపు యూజర్ల వినియోగంలో టిక్టాక్ రూ.16,644 కోట్లు, యూట్యూబ్ రూ.9,986 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించింది. మొత్తం ప్రకటనల ఆర్జనలో స్నాప్చాట్ 41%, టిక్టాక్ 35%, యూట్యూబ్ 27%, ఇన్స్ట్రాగామ్ 16% వాటా ఉన్నట్లు వెల్లడించింది. దేశంలోనూ గణనీయంగా వృద్ధి: భారత్లో సగటు వ్యక్తి సోషల్ మీడియా వినియోగం రోజుకు 192 నిమిషాలుగా ఉన్నట్లు పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సోషల్ మీడియా దిగ్గజ సంస్థ మెటా (ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, వాట్సాప్) స్థూల ప్రకటనల ఆదాయం రూ.18,308 కోట్లుగా నమోదైంది. ఇది 2022 ఆర్థిక సంవ్సతరంతో పోలిస్తే 13% వృద్ధి చెందింది. త్వరలోనే మెటా యాడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ను ప్రారంభించే అవకాశాన్ని అన్వేషిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రెడిసీర్ నివేదిక ప్రకారం దేశంలో డిజిటల్ ప్రకటనల విలువ 2020లో రూ.24,966 కోట్ల నుంచి 2030కి రూ.2.91 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. దేశీయంగా ఇన్స్ట్రాగామ్ ప్రకటనల కోసం ప్రతి క్లిక్కి సగటున రూ.66.06 వసూలు చేస్తోంది. టెక్ కంపెనీల నుంచి ఎక్కువ పారదర్శకత ఉండాలన్నా..యువత మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావాలను అరికట్టాలన్నా ప్రభుత్వ జోక్యం ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ నియంత్రణ ఉంటే చిన్నా రులు, యుక్త వయస్కులను లక్ష్యంగా చేసుకుని వచ్చే హాని కరమైన ప్రకటన పద్ధతులను తగ్గించవచ్చని వీరు అభిప్రా యపడుతున్నారు. భారత ప్రభుత్వం కూడా డిజిటల్, సోషల్ మీడియా నియంత్రణలపై డ్రాఫ్ట్ బిల్లును సిద్ధం చేస్తోంది. -
టయోటా హైలక్స్ యాడ్ బ్యాన్ చేసిన యూకే - కారణం ఇదే!
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న జపనీస్ వాహన తయారీ దిగ్గజం 'టయోటా' (Toyota)కు యూకేలో గట్టి షాక్ తగిలింది. సామాజిక బాధ్యత ప్రమాణాలను ఉల్లంఘించినందుకు కంపెనీ ప్రకటనను నిషేధిస్తూ ఏఎస్ఏ ఆదేశాలు జారీ చేసింది. టయోటా హైలక్స్ యాడ్ నిలిపేయడం వెనుక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? గతంలో ఇలాంటి నిషేధాలు విధించారా? అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.. యూకే అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ అథారిటీ (ASA) పర్యావరణ బాధ్యతారహిత డ్రైవింగ్ను ప్రోత్సహిస్తున్న రెండు టయోటా ప్రకటనలను నిషేధించింది. ఇందులో ఒకటి పోస్టర్, మరొకటి వీడియో. వీడియోలో టయోటా హైలెక్స్ పికప్ ట్రక్కులు కఠినమైన భూభాగాల్లో న్యావిగేట్ చేస్తున్నాయి. ఇందులో రివర్స్ క్రాసింగ్ కూడా ఉంది. ఆ తరువాత పట్టణ ప్రాంతం గుండా వెళ్లడం చూడవచ్చు. రోడ్డులో వాటికవి విడిపోవడం చూడవచ్చు. ఇవన్నీ వినియోగదారులను కొంత తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని చెబుతున్నారు. పోస్ట్ విషయానికి వస్తే.. ఇందులో తిరగటానికే పుట్టాను అన్నట్లు రాసి ఉంది. అంతే కాకుండా కొండల్లో దిగటం, ఎత్తైన ప్రదేశాల్లో దుమ్ములేపుకుంటూ ప్రయాణించడం వంటివి ఇందులో చూడవచ్చు. ఈ ప్రకటనలు పర్యావరణ హానికరమైన ప్రవర్తనను ఆమోదించాయని, అధిక కార్బన్ ఉత్పత్తులు ప్రొడ్యూస్ చేస్తున్నట్లు వెల్లడిస్తూ.. ఈ ప్రకటనలను నిషేదించింది. ఈ ప్రకటనలపై అడ్ఫ్రీ సిటీస్ కో-డైరెక్టర్ వెరోనికా విగ్నాల్ మాట్లాడుతూ.. వాహనాలు నదులు, అడవి గడ్డి మైదానాల గుండా వేగంగా డ్రైవింగ్ చేస్తే.. ప్రకృతి దెబ్బతింటుందని చెబుతూ, యూకేలో చాలా వాహనాలు పట్టాన ప్రాంతాలకు పరిమితమయ్యాయి. అలాంటిది ఇలాంటి ప్రకటలను ఎలా చిత్రీకరిస్తారని వాదించింది. ఇదీ చదవండి: లక్షల విలువ చేసే కారులో 'హోమ్ మేడ్ ఫుడ్' బిజినెస్.. వీడియో వైరల్ ఈ ప్రకటనను కంపెనీ సమర్థిస్తూ.. వ్యవసాయ, అటవీ ప్రాంత వాసులకు ఇలాంటి కార్లు చాలా ఉపయోగపడతాయని చెప్పినప్పటికీ, ప్రకటనలో అలాంటి కార్మికులు కనిపించలేదని సంబంధిత అధికారులు వెల్లడించారు. కానీ ఫుటేజీని యూకే వెలుపల ఉన్న ప్రైవేట్ భూమిలో చిత్రీకరించినట్లు, పోస్టర్ మాత్రం కంప్యూటర్ ద్వారా క్రియేట్ చేసినట్లు ప్రతినిధి స్పష్టం చేశారు. ఇందులో మళ్ళీ మార్పులు చేస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. -
యాడ్.. మార్చేనా పబ్లిక్ మూడ్!
సూటిగా సుత్తిలేకుండా..గురిపెడితే టార్గెట్ రీచ్ అయ్యేలా..విమర్శనాస్త్రం సంధిస్తే.. వైరిపక్షం విలవిల్లాడేలా ఉంటున్నాయి రాజకీయ పార్టీల లఘు చిత్రాల ప్రకటనలు. పబ్లిక్ మీటింగ్లో అగ్రనేతలు దంచికొట్టే ఉపన్యాసాలు ఓటరును ఎంత మేర ప్రభావితం చేస్తాయో లేదో కానీ, టీవీల్లో ప్రకటనల రూపంలో వస్తున్న పొలిటికల్ యాడ్స్ మాత్రం ప్రజల మూడ్ను ప్రభావితం చేస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ అధికార పార్టీని ఇరుకునపెట్టేలా కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు ఉంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీల్లో నెరవేర్చని అంశాలను టార్గెట్ చేస్తూ బీజేపీ వీడియోలు ఉంటున్నాయి. ఈ తొమ్మిదిన్నరేళ్లలో ఏం మార్పు తెచ్చామన్నది అధికార బీఆర్ఎస్ చెప్పుకొస్తోంది. మొత్తంగా ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఓటర్లను ఆలోచింపజేసేలా.. ఆకర్షించేలా పొలిటికల్ యాడ్స్తో అదరగొడుతున్నాయి. ఓటర్కు వీలైనంత రీచ్ అయ్యేలా... పొలిటికల్ యాడ్స్ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటోందని చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలపైనా వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. అదే సమయంలో బీఆర్ఎస్ సైతం కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన మేలు ఏంటి..? మళ్లీ కేసీఆర్నే ఎందుకు సీఎం చేయాలన్నది సూటిగా అర్థమయ్యేలా లఘు చిత్రాలను రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం గుప్పిస్తోంది. ఇందుకోసం రాజకీయ ప్రత్యర్థులను ఠక్కున గుర్తించేలా క్యారెక్టర్లు, వారి హావభావాలను సైతం పలికించేలా ఈ వీడియోల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విమర్శల ఘాటుతో ఫిర్యాదులు ఈ పొలిటికల్ యాడ్స్లో విమర్శల ఘాటు పెరగడంతో ఆయా పొలిటికల్ పార్టీల నాయకులు ఆ ప్రకటనలు నిలిపివేయించాలని ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదులు చేశారు. అంతలా పొలిటికల్ యాడ్లు వేడి పెంచుతున్నాయి. ‘గులాబీ జెండా..తెలంగాణకు అండ’ ట్యాగ్తో బీఆర్ఎస్ షార్ట్ వీడియోలను చేస్తే..‘‘మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి..’’అన్న ట్యాగ్లైన్ను కాంగ్రెస్ పార్టీ వాడుతోంది. ఇక బీజేపీ ‘‘సాలు దొర..ఇక నీకు సెలవు దొర..’’ట్యాగ్లైన్తో పిట్టల దొర క్యారెక్టర్ను పెట్టి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూ లఘు వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. కంటెంట్ ఒకరిది.. మార్ఫింగ్ మరొకరిది.. ‘‘అప్పుడెట్లా ఉండే తెలంగాణ..ఇప్పుడెట్లుంది తెలంగాణ’’ అంటూ అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు రీల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రులు మొదలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది ఈ రీల్ ఫార్ములా ఫాలో అయ్యారు. తీన్మార్ స్టెప్పులతో సదరు నాయకుడి కామెంట్లతో ఉన్న ఈ షార్ట్ వీడియోలు సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయ్యాయి. అయితే ఎంతో ప్లానింగ్, కంటెంట్తో తయారు చేసిన ఈ షార్ట్ వీడియోలను ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ వాడి ప్రత్యర్థి పార్టీలు తిప్పికొడుతున్నాయి. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ‘అప్పుడెట్లుండే తెలంగాణ.. ఇప్పుడెట్లయింది తెలంగాణ’ వీడియోలను ప్రత్యర్థి పార్టీల సోషల్మీడియా గ్రూపుల సభ్యులు మార్ఫిగ్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ (ఎక్స్), ఇన్స్టా్రగామ్ ఇలా అన్ని వేదికల్లోనూ వీడియోలు, రీల్స్.. వాటిపై ప్రత్యర్థుల మార్ఫింగ్లు హోరెత్తుతున్నాయి. -నాగోజు సత్యనారాయణ -
ఘనంగా ఏఐఐ వార్షికోత్సవ వేడుకలు.. ఇద్దరు భారతీయల అరుదైన ఘనత
అమెరికా న్యూయార్క్ నగరంలో ఇంటర్నేషన్ అడ్వటైజింగ్ అసోసియేషన్ (ఐఏఏ) వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారత్కు చెందిన శ్రీనివాసన్ స్వామీ, రమేష్ నారాయణ్లకు ఐఏఏ అసోసియేషన్ ‘నార్త్ స్టార్’ అవార్డులతో ఘనంగా సత్కరించింది. 2014లో ఐఐఏ గ్లోబుల్ ప్రెసిడెంట్గా శ్రీనివాసన్ స్వామి ప్రశంసలందుకున్నారు. 2014 లండన్లో జరిగిన ఇన్స్పైర్ అవార్డ్స్లో స్వామి, నారాయణ్లు గ్లోబుల్ చాంపియన్లుగా గుర్తింపు పొందారు. కాగా, నారాయణ్ ఐఏఏ గ్లోబల్ బోర్డ్లో డైరెక్టర్గా, దాని ఏపీఏసీ రీజీయన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారిద్దరూ ఐఏఏ భారత బోర్డ్ మాజీ అధ్యక్షులు సేవలందించారు. అడ్వటైజింగ్ విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంపై శ్రీనివాసన్ స్వామి,రమేష్ నారాయణ్లను పరిశ్రమ వర్గాల ప్రతినిధుల అభినందనలు తెలుపుతున్నారు. -
భారీ షాక్.. ఇకపై మెటా,ఇన్స్టాగ్రామ్ యూజర్లు డబ్బులు కట్టాల్సిందే!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్బుక్) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎక్స్ (ట్విటర్) తరహాలో మెటా, ఇన్స్టాగ్రామ్ను వినియోగించుకోవాలంటే నెలవారీ సబ్స్క్రిప్షన్ చెల్లించేలా కొత్త చెల్లింపు పద్దతిని అమలు చేయనుందని సమాచారం. అయితే, ఈ సబ్ స్క్రిప్షన్ విధానం యాడ్స్ వద్దనుకునే యూజర్లు మాత్రమే నెలవారీ చొప్పున కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే యూరప్ దేశాలకు చెందిన మెటా, ఇన్స్టాగ్రామ్ యూజర్ల నుంచి యాడ్- ఫ్రీ ఎక్స్పీరియన్స్ పేరుతో మెటా నెలకు రూ.1,165 వసూలు చేస్తుంది. మరి ఆసియా దేశాల్లో అతిపెద్ద సోషల్ మీడియా మార్కెట్గా కొనసాగుతున్న భారత్లోని యూజర్లకు ఈ సబ్స్క్రిప్షన్ విధానం ఉంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే భద్రత దృష్ట్యా భారత్ యాడ్-ఫ్రీ ఎక్స్పీరియన్స్కు అనుమతి ఇవ్వనుందనే అంచనాలు నెలకొన్నాయి. యూరప్లో మెటా నోయాడ్స్ సబ్స్క్రిప్షన్ ధరలు పలు నివేదికల ప్రకారం.. డెస్క్టాప్ పరికరాలలో ప్రకటనలు లేకుండా మెటా లేదా ఇన్స్ట్రాగ్రామ్ని యాక్సెస్ చేయాలనుకునే వినియోగదారుల నెలకు 10.46 డాలర్లకు సమానమైన సుమారు 10 యూరోల సబ్స్క్రిప్షన్ ఫీజును వసూలు చేయాలని మెటా ఆలోచిస్తోంది. ఒకటి కంటే ఎక్కువ సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటే వారి వద్ద నుంచి ఒక్కో ఖాతాకు దాదాపు 6 యూరోల అదనపు ఛార్జీని విధించవచ్చు. మొబైల్ యూజర్ల సబ్స్క్రిప్షన్ ధర నెలకు దాదాపు 13 యూరోలకు పెరగవచ్చని అంచనా. కమిషన్ల భారం తగ్గించుకునేందుకే యాపిల్, గూగుల్ ప్లేస్టోర్లో ఉదాహరణకు మెటా,ఇన్స్ట్రాగ్రామ్, వాట్సాప్ యాప్స్ను యూజర్ల కోసం అందుబాటులో ఉన్నాయి. ఆ యాప్స్ను తమ ప్లేస్టోర్లలో ఉంచేందుకు గూగుల్, యాపిల్ సంస్థలు మెటా నుంచి కమిషన్ తీసుకుంటుంది. ఇప్పుడా కమిషన్ ఛార్జీలు పెంచడంతో .. ఆ భారాన్ని తగ్గించుకునేందుకు మెటా నోయాడ్స్ అంటూ కొత్త పేమెంట్ మెథడ్ అస్త్రాన్ని వదిలింది. చదవండి👉 కోర్టు హాలులో గూగుల్పై విరుచుకుపడ్డ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల! -
50 సెకన్లకు రూ. 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్
సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ అయిన నయనతార ప్రకటనల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్, చిరంజీవి, మమ్ముట్టి, విజయ్, అజిత్, సూర్య, విక్రమ్, ధనుష్ వంటి అగ్ర నటులందరితోనూ నటించిన నయన్ తాజాగా షారుక్ ఖాన్ జవాన్లో మెప్పించింది. ఇన్స్టాగ్రామ్లో మాత్రమే నయన్ చాలారోజుల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్న నయన్ కొద్దిరోజుల క్రితం తన పిల్లల ఫోటోలు చూపుతూ ఇన్స్టాగ్రామ్లో అడుగు పెట్టింది. నిమిషాల్లోనే ఆమెకు లక్షలాది మంది ఫాలోవర్లు వచ్చేశారు. ప్రస్తుతం ఆమెకు 32 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నయనతార గత కొన్నేళ్లుగా కొత్త స్కిన్ కేర్ కంపెనీని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఆమె తరచుగా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆ ఫోటోలను పోస్ట్ చేస్తోంది. ఈ ఉత్పత్తులను కూడా ఆన్లైన్లో విక్రయించేందుకు ప్లాన్లో ఉంది. ఇలా ఆమె వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెట్టడం విశేషం. తన వ్యాపార ఉత్పత్తులు షేర్ చేసేందుకే ఇన్స్టాగ్రామ్లోకి నయన్ అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రకటనకు కోట్లలో రెమ్యునరేషన్: ఈ సందర్భంలో నటి నయనతార ప్రకటనల ద్వారా కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. కేవలం 50 సెకన్ల ప్రకటనలకే నయనతార దాదాపు రూ. 5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రకటనల సమయం అంతకు మించి పెరిగితే తన రెమ్యునరేషన్ కూడా పెరుగుతుందని అంటున్నారు. సినిమా ద్వారా కోట్లకు పడగలెత్తినా.. కొత్త మార్గాల్లో సంపాదిస్తూ.. ఏడాదికేడాది ఆస్తుల విలువను పెంచుకుంటుంది నయన్. (ఇదీ చదవండి: గర్భవతిగా ఉన్న నేను ఆ సీన్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను: పూర్ణ) -
పాపులారిటీలో మహేష్ ని మించిపోయిన సితార
-
టాటా మోటార్స్ ఏడీఎస్కు టాటా
న్యూఢిల్లీ: అమెరికన్ డిపాజిటరీ షేర్ల(ఏడీఎస్లు)ను స్వచ్చందంగా డీలిస్ట్ చేస్తున్నట్లు ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా పేర్కొంది. సాధారణ షేర్లను ప్రతిబింబించే వీటిని న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ నుంచి డీలిస్ట్ చేస్తున్నట్లు తెలియజేసింది. సోమవారం(23న) ట్రేడింగ్ ముగిశాక ఓవర్ ద కౌంటర్ మార్కెట్లో వీటి ట్రేడింగ్ నిలిచిపోనున్నట్లు వెల్లడించింది. ఏడీఎస్లు కలిగిన వాటాదారులు వీటిని సాధారణ షేర్లుగా మార్పిడి చేసుకునేందుకు 2023 జులై24లోగా ఎక్స్ఛేంజీ లోని డిపాజిటరీవద్ద దాఖలు చేయవలసి ఉంటుందని టాటా మోటార్స్ తెలియజేసింది. కాగా.. దేశీయంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టయిన టాటా మోటార్స్ ఈక్విటీ షేర్లపై ఈ ప్రభావం ఉండబోదని కంపెనీ స్పష్టం చేసింది. -
నెట్వర్క్18 మీడియా క్యూ3 వీక్.. 97 శాతం పతనం!
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ నెట్వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 97 శాతం పతనమై రూ. 9 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 307 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 12 శాతం ఎగసి రూ. 1,850 కోట్లను అధిగమించింది. గతేడాది క్యూ3లో రూ. 1,657 కోట్ల ఆదాయం నమోదైంది. మొత్తం వ్యయాలు 45 శాతం పెరిగి రూ. 1,939 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో నెట్వర్క్18 మీడియా షేరు బీఎస్ఈలో 3.3 శాతం క్షీణించి రూ. 63 వద్ద ముగిసింది. చదవండి: స్విగ్గీ సంచలనం..డెలివరీ బాయ్స్కు, వారి కుటుంబ సభ్యులకు.. -
అవి చూసే ఫెయిలయ్యా: 75 లక్షలకు ప్లాన్, సుప్రీం రియాక్షన్
న్యూఢిల్లీ: యూట్యూబ్లో అసభ్యకరమైన కంటెంట్ ప్రకటనల కారణంగా తన దృష్టి మళ్లిందని తదర్వారా పరీక్షలో ఫెయిల్ అయ్యానని దాఖలైన పిటీషన్పై సీరియస్గా స్పందించింది. "ఆర్టికల్ 32 కింద దాఖలైన అత్యంత దారుణమైన పిటిషన్లలో ఇదొకటి" అని ధర్మాసనం పేర్కొంది. ఈ రకమైన పిటిషన్లు న్యాయవ్యవస్థ సమయాన్ని పూర్తిగా వృధా చేస్తాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాతు పిటీషనర్కు భారీ జరిమానా కూడా విధించింది. దీంతో పిటీషనర్ లబోదిబోమన్నాడు. వివరాలను పరిశీలిస్తే..గూగుల్ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ యూట్యూబ్లో వచ్చిన అశ్లీల ప్రకటనల కారణంగా తాను పరీక్షలకు సరిగ్గా ప్రిపేర్కాలేక, ఎగ్జామ్ ఫెయిలయ్యానని ఇందుకు రూ. 75 లక్షల పరిహారం ఇప్పించాలంటూ ఆనంద్ కిషోర్ చౌదరి అనే ఒక నిరుద్యోగి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మధ్యప్రదేశ్ పోలీసు పరీక్షకు సన్నద్ధమవుతున్న సమయంలో తమ దృష్టిని మరల్చేలా లైంగిక, అసభ్యకరమైన యాడ్స్ చూపించారంటూ ఆరోపిస్తూ పిటీషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. నచ్చకపోతే యాడ్స్ చూడకండి, వాటిని చూడాలా వద్దా అనేమీ మీ హక్కు అని పేర్కొంది. ఇలాంటి పిటిషన్లు న్యాయవ్యవస్థ సమయాన్ని పూర్తిగా వృథా చేస్తాయని బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ లక్షరూపాయల జరిమానా విధించింది. అయితే తాను నిరుద్యోగినని, క్షమించి జరిమానా తగ్గించాలని వాపోవడంతో కోర్టు కనికరించింది. పబ్లిసిటీ కోసం ఇలాంటి పనులు చేయొద్దని ధర్మాసనం మందలించింది.జరిమానా తగ్గిస్తాం కానీ క్షమించ లేమంటూ జరిమానాను రూ. 25 వేలకు తగ్గించింది. సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కేంద్రంలో ఈ సొమ్మును డిపాజిట్ చేయాలని అతగాడిని ఆదేశించింది. -
మస్క్ సంచలన ప్రకటన: ఎడ్వర్టైజర్లకు బూస్ట్?
న్యూఢిల్లీ:టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్ టేకోవర్ తరవాత తమ యూజర్ల సంఖ్య రికార్డు స్థాయికి పెరిగిందంటూ ప్రకటనదారులకు భరోసా ఇస్తోంది ట్విటర్. ఈ విషయాన్ని ప్రపంచ బిలియనీర్ ట్విటర్ బాస్ మస్క్ ట్విటర్లో షేర్ చేశారు. బ్లూటిక్ ఫీజు, భావ ప్రకటనా స్వేచ్ఛ, విద్వేషపూరిత కంటెంట్, ఇతర గందరగోళాల మధ్య యూజర్లు ప్రత్యర్థి ప్లాట్ఫారమ్లకు తరలిపోతున్నారన్న అంచనాల మధ్య ఈ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. Twitter usage is at an all-time high lol — Elon Musk (@elonmusk) November 8, 2022 తమ రోజువారీ వినియోగదారుల వృద్ధి "ఆల్-టైమ్ హై"కి చేరుకుందని ట్విటర్ తన ప్రకటనదారులకు తెలిపింది. గత వారం ఎలాన్ మస్క్ టేకోవర్ తర్వాత మానిటైజబుల్ డైలీ యూజర్ (mDAU) వృద్ధి 20 శాతానికి పైగా వేగం పుంజుకుందని,1.5 కోట్ల అదనపు యూజర్లు చేరారని ట్విటర్ పత్రాల ఆధారంగా ది వెర్జ్ నివేదించింది. ముఖ్యంగా అతిపెద్ద మార్కెట్లో అమెరికాలో మరింత వేగంగా పెరుగుతోంది. ట్విటర్ తాజా 15 మిలియన్ల కంటే ఎక్కువ mDAUలను జోడించుకొని, క్వార్టర్ బిలియన్ మార్క్ను దాటింది. అంతకుముందు 16.6 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. I just hope the servers don’t melt! — Elon Musk (@elonmusk) November 8, 2022 కాగా ఏప్రిల్-జూన్ కాలంలో కంపెనీ ఆదాయం ఒక శాతం పడిపోయి 1.18 బిలియన్ డాలర్లకు, ఆ తరువాత క్వార్టర్లో 270 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఇది ప్రకటనదారులను ప్రభావితం చేసింది. ఇక తాజా పరిణామల నేపథ్యంలో సమస్యాత్మక కంటెంట్తో పాటు తమ ప్రకటనలు కనిపించవచ్చనే ఆందోళనతో ఇప్పటికే వోక్స్వ్యాగన్ గ్రూప్ అనేక ఇతర కంపెనీలతో కలిసి ట్విటర్లో యాడ్స్ను నిలిపివేసింది. అలాగే డానిష్ బ్రూయింగ్ కంపెనీ కార్ల్స్బర్గ్ గ్రూప్ కూడా తన మార్కెటింగ్ బృందాలకు దాదాపు ఇలాంటి సలహానే ఇచ్చింది. యునైటెడ్ ఎయిర్లైన్స్ కూడా ప్రకటనలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
శాంసంగ్కు భారీ షాక్.. 30రోజుల గడువిచ్చిన కోర్టు.. మాట వినకపోతే..
ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ శామ్సంగ్కు ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు ఝలకిచ్చింది. స్మార్ట్ ఫోన్లుకు సంబంధించి తప్పుదోవ ప్రకటనలు ఇచ్చినందుకు కోర్టు శామ్సంగ్కు 14 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం రూ.78 కోట్లు) ఫైన్ విధించింది. ఈ మొత్తాన్ని కూడా 30 రోజుల్లోగా చెల్లించాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జస్టిస్ బ్రెండన్ ముర్ఫీ తీర్పునిచ్చారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై విచారణ జరిపినందుకుగాను ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్కి కూడా అదనంగా మరో 2 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు ( భారత కరెన్సీ ప్రకారం రూ.1.10 కోట్లు) చెల్లించాలని ఆదేశించారు. 2016 నుంచి 2018 మధ్య S7, S7 ఎడ్జ్.A5 (2017), A7 (2017), S8, S8 ప్లస్, నోట్ 8 గెలెక్సీ ఫోన్లను శామ్సంగ్ ఆస్ట్రేలియాలో విక్రయించింది. ప్రత్యేకంగా వీటిని తయారు చేశామని నీళ్లలో తడిచినా పాడవవంటూ భారీగా ప్రకటనలు కూడా ఇచ్చింది. నీళ్లలో ఈ ఫోన్లు ఉంచినప్పుడు ఛార్జింగ్ పోర్టులు పాడయ్యాయి. దీంతో తమ ఫోన్లు పనిచేయడం లేదంటూ వందలాదిగా వినియోగదారులు ఆస్ట్రేలియన్ కాంపీటీషన్ అండ్ కన్జూమర్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి 2019లో నమోదైన కేసులపై కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంపై శాంసంగ్ స్పందిస్తూ.. 2016 నుంచి 2017 మధ్యలో అమ్మకాలు జరిపిన ఏడు మోడళ్లపై మాత్రమే ఈ సమస్య తలెత్తినట్లు తెలిపింది. ప్రస్తుత శాంసంగ్ ఫోన్లలో ఈ తరహా సమస్యలు లేవని తెలిపింది. చదవండి: Gmail Storage: మీ ఇ-మెయిల్ బాక్స్ నిండిపోయిందా, సింగిల్ క్లిక్తో ఇలా చేయండి! -
మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే, చూస్తూ ఊరుకోం ఇక్కడ!
భారత్కు చెందిన పర్ఫ్యూమ్, డియోడ్రంట్, స్ప్రే తయారీదారు కంపెనీ లేయర్స్కి షాక్ తగిలింది. క్రియేటివిటీ పేరిట రూపొందించిన మహిళలను అగౌరవపరిచేలా ఉన్న సెమీ బూతు అడ్వెర్టైజ్మెంట్పై కేంద్రం కన్నెర్ర చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఈ యాడ్ కనిపించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. లేయర్స్ సంస్థ షాట్ పేరుతో ఇటీవల ఓ యాడ్ ప్రోమోను రెడీ చేసింది. ఈ యాడ్ రిలీజ్ కావడం ఆలస్యం దుమారం చెలరేగింది. ఈ యాడ్ ద్వందార్థాలతో మహిళలను కించపరిచేలా మహిళలపై లైంగిక దాడులకు ప్రోత్సాహం అందించేలా ఉందంటూ స్త్రీ వాదులతో పాటు ప్రజా సంఘాలు విమర్షలు ఎక్కుపెట్టాయి. సోషల్ మీడియాలోనూ ఈ యాడ్కి పెద్దగా మద్దతు లభించలేదు. అన్ని వైపుల నుంచి ఘాటైన విమర్శలు ఎదుర్కొంది లేయాన్స్. లేయాన్స్ తాజా యాడ్ వివాదంపై కేంద్రం కూడా స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ యాడ్ యూట్యూబ్, ట్విటర్లో కనిపంచడానికి వీలులేదంటూ ఆదేశాలు జారీ చేసింది. భారత ప్రభుత్వ ఐటీ రూల్స్ - 2021కి విరుద్ధంగా ఉన్నందున ఈ నిషేధం అమలు చేస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు యూట్యూబ్, ట్విటర్లకు ఈమెయిల్ ద్వారా ఆదేశాలు పంపింది కేంద్రం. Fuming at cringe worthy ads of the perfume ‘Shot’. They show toxic masculinity in its worst form and clearly promote gang rape culture!The company owners must be held accountable. Have issued notice to Delhi Police and written letter to I&B Minister seeking FIR and strong action. pic.twitter.com/k8n06TB1mQ — Swati Maliwal (@SwatiJaiHind) June 4, 2022 చదవండి: వీడియో: ఇదెక్కడి ‘షాట్’.. డబుల్ మీనింగ్ యాడ్స్పై దుమారం -
టీవీ ప్రకటనలు గతేడాది 22% అప్
ముంబై: కోవిడ్–19 మహమ్మారితో 2020లో టీవీ ప్రకటనలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడినప్పటికీ 2021లో మాత్రం యాడ్ల పరిమాణం గణనీయంగా పుంజుకుంది. 22 శాతం పెరిగి 1,824 మిలియన్ సెకన్లుగా నమోదైంది. బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) సోమవారం ఈ విషయాలు వెల్లడించింది. టీవీ ప్రకటనల పరిమాణం 2019లో 1,542 మిలియన్ సెకన్లుగా ఉండగా 2020లో 1,497 మిలియన్ సెకన్లకు తగ్గింది. టీవీలో మొత్తం 9,239 ప్రకటనకర్తలు.. 14,616 బ్రాండ్లకు సంబంధించిన యాడ్స్ ఇచ్చారు. ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ విభాగం ప్రకటనలు (1,117 మిలియన్ సెకన్లు) అత్యధికంగా ఉండగా, 185 మిలియన్ సెకన్లతో ఈ–కామర్స్, నిర్మాణ రంగ ప్రకటనలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
టార్గెట్ ట్విటర్..! కాకపుట్టిస్తోన్న ఇండియన్ ‘కూ’
ట్విటర్కు పోటీగా స్వదేశీ పరిజ్ఞానంతో భారతీయులకు ‘కూ’ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా యాప్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. కూ యాప్ను భారతీయులు భారీగానే ఆదరిస్తున్నారు. కూ యాప్ను ప్రారంభించిన 16 నెలల కాలంలో 10 మిలియన్ల యూజర్లను సొంతం చేసుకుంది. విదేశీ సోషల్ మీడియా యాప్స్తో పోటీపడుతూ ‘కూ’ యాప్ దూసుకెళ్తోంది. ఫేస్బుక్, ట్విటర్లకు పోటీగా...! స్వదేవీ సోషల్ మీడియా యాప్ కూ ఒక బిగ్ బ్యాంగ్తో ప్రారంభమైంది. యూజర్లు, కొన్ని ప్రభుత్వ అధికారుల నుంచి కూ యాప్ భారీగా ఆసక్తిని సంపాందించింది. ట్విటర్కు, కేంద్రానికి మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినడంతో కూ యాప్ గణనీయంగా పుంజుకుంది. ప్రముఖ సోషల్మీడియా ట్విటర్ను ఎదుర్కొనేందుకు కూ యాప్ యాడ్స్ విషయంలో భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: అదిరిందయ్యా ముఖేశ్ అంబానీ.. ! జెప్బెజోస్, ఎలన్ మస్క్తో పాటు.. ఫేస్బుక్ యాడ్ లైబ్రరీ ప్రకారం....గత 90 రోజుల్లో ఫేస్బుక్ యాడ్స్ కోసం కూ కంపెనీ సుమారు రూ. 2.4 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంటే రోజుకు రూ. 2.6 లక్షల మేర కూ యాప్ ఖర్చు చేసింది. గత మూడు నెలల్లో ఫేస్బుక్లో అత్యధికంగా ఖర్చు చేసిన కంపెనీగా కూ యాప్ నిలిచింది. కూ యాప్ వ్యూహంలో భాగంగా - హిందీ, ఇంగ్లీష్, అస్సామీ, గుజరాతీ, కన్నడ, తమిళం , తెలుగు వంటి భాషలతో యాప్ను రూపొందించింది. ట్విట్టర్కు ప్రత్యామ్నాయం అమెరికాకు చెందిన ట్విట్టర్ను వినియోగించే జాబితాలో భారత్ 22.1 మిలియన్ల యూజర్లతో మూడో స్థానంలో ఉంది. అదే సమయంలో నవంబర్ 14,2019 లో ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా ఎంట్రప్రెన్యూర్ లు అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ లు బెంగళూరు కేంద్రంగా 'కూ' ను అందుబాటులోకి తెచ్చారు. చదవండి: కంపెనీల మధ్య పోటాపోటీ..! నిన్న అమితాబ్ బచ్చన్..నేడు రణ్వీర్సింగ్..! -
దాయాది దేశాల మ్యాచా? మజాకా? 10 సెకన్ల యాడ్కు రూ.30 లక్షలు!
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఇంకా ప్రారంభమే కాలేదు అప్పుడే రికార్డుల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటేనే భావోద్వేగాల సమ్మేళనం.! మైదానంలో ఓ యుద్ధంలాంటి వాతావరణం నెలకొంటుంది.! ఇరు దేశాల అభిమానులే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా చూస్తోంది. ఒకే గ్రూప్లో ఉన్న దాయాది దేశాలు అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. అయితే ఈ మ్యాచ్కు ఉండే క్రేజే అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్కు కాసుల వర్షం కురిపించనుంది.(చదవండి: ఫ్రీ.. ఫ్రీ..ఫ్రీ.. యూట్యూబ్ మ్యూజిక్ సరికొత్త ఆఫర్!) ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఇప్పటికే ఈ దాయాదీ దేశాల మ్యాచ్ సమయంలో యాడ్స్ కోసం 14 మంది స్పాన్సర్లతో ఒప్పంద సంతకాలు చేసింది. అందరూ ఊహించినట్టే భారత్-పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ లో 10 సెకన్ల యాడ్ కోసం మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు అయ్యాయి. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ బ్రాడ్ కాస్టింగ్ హక్కులను దక్కించుకున్న స్టార్స్పోర్ట్స్కు యాడ్స్ రూపంలో కనక వర్షం కురుస్తోంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లైవ్ బ్రాడ్ కాస్ట్ భాగస్వామి అయిన స్టార్ స్పోర్ట్స్ 10 సెకన్ల యాడ్ కోసం 25-30 లక్షల రూపాయలు కోరుతున్నట్లు తెలుస్తుంది. ఈ యాడ్స్ విషయంపై స్టార్ స్పోర్ట్స్ ప్రతినిధిని స్పష్టత ఇవ్వలేదు.(చదవండి: Windows 11: వచ్చిందోచ్.. మీ కంప్యూటర్ సపోర్ట్ చేస్తుందా?) ఇందులో డ్రీమ్ 11, బైజుస్, ఫోనెప్, థంప్స్, విమల్, హావెల్స్, జియోమార్ట్, netmeds.com సహ-ప్రజంటింగ్ స్పాన్సర్లు, ఆకాశ్, స్కోడా, వైట్ హాట్జ్ర్, గ్రేట్ లెర్నింగ్, కాయిన్ డిఎక్స్, మరియు ట్రెండ్స్ అసోసియేట్ స్పాన్సర్లు ఉన్నారు. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ యాడ్స్ రేట్లు 10 సెకండ్ల కోసం 25-30 లక్షల చెల్లించినట్లు తెలుస్తుంది. అలాగే, సహ-ప్రజంటింగ్ స్పాన్సర్ షిప్ 60-70 కోట్లకు విక్రయించబడింది. బ్రాడ్ కాస్టర్ అసోసియేట్ స్పాన్సర్ షిప్ 30-35 కోట్ల కొరకు ఆఫర్ చేసినట్లు సమాచారం. 2016లో మన దేశంలో జరిగిన ఐసీసీ ప్రపంచ కప్ టీ20 సందర్భంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, దూరదర్శన్లలో 17.3 రేటింగ్ తో 83 మిలియన్ల మందికి చేరుకుంది. ఇప్పటికే వరకు ఇదే అత్యుత్తమ రేటింగ్ గల టీ-20 మ్యాచ్. -
పది సెకండ్ల యాడ్కు 18 లక్షలా....!
కోవిడ్-19 దెబ్బకు ఐపీఎల్-14 వాయిదా పడిన విషయం తెలిసిందే. రెండో దఫా ఐపీఎల్-14 యూఎఈలో కొనసాగుతుంది. ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్ హక్కులను దక్కించుకున్న స్టార్స్పోర్ట్స్కు యాడ్స్ రూపంలో కనక వర్షం కురుస్తోంది. ఐపీఎల్-14 రెండో దఫా నేపథ్యంలో స్టార్స్పోర్ట్స్ యాడ్ రేట్లను భారీగా పెంచినట్లు తెలుస్తోంది.దసరా, దీపావళి పండుగ సీజన్ల నేపథ్యంలో పలు కంపెనీ బ్రాండ్స్ నుంచి భారీగా డిమాండ్ ఉండటంతో సుమారు 25 శాతం నుంచి 30 శాతం మేర యాడ్స్ రేట్లను పెంచింది. చదవండి: Forgotten Password: పాస్వర్డ్ మరిచిపోవడంతో... పది లక్షల కోట్ల రూపాయలు ఆగం...! విశ్వసనీయ వర్గాల ప్రకారం.. తొలి దఫా ఐపీఎల్లో ఒక యాడ్ పది సెకన్ల పాటు టీవీలో కన్పించేందుగాను సుమారు రూ. 13 నుంచి 14 లక్షలు ఉండగా...ప్రస్తుతం రూ. 18 లక్షలను ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాడ్స్ పెంపుపై స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం స్పందించలేదు. స్టార్స్పోర్ట్స్ను ఇప్పటివరకు 12 బ్రాండ్ కంపెనీలు సంప్రదించారు. సహ-సమర్పణ స్పాన్సర్లుగా... డ్రీమ్ 11, ఫోన్పే, బైజుస్ ఉన్నాయి. అసోసియేట్ స్పాన్సర్లుగా..బింగో, కమలా పసంద్, ఏఎమ్ఏఫ్ఐ, ఏషియన్ పెయింట్స్, క్యాడ్బరీ డైరీ మిల్క్, అమెజాన్ ప్రైమ్, థమ్స్ అప్, గార్నియర్ మెన్, క్రెడ్ కంపెనీలు ఉన్నాయి ఎక్స్చేంజ్4మీడియా నివేదిక ప్రకారం...ఐపీఎల్-14 మొదటి దశలో 10 సెకన్ల యాడ్స్కు సుమారు రూ. 14.1 నుంచి 14.3 లక్షలను స్టార్స్పోర్ట్స్ ఛార్జ్ చేసింది. సహ-ప్రాయోజిత వ్యయం రూ.110-125 కోట్ల పరిధిలో ఉండగా, అసోసియేట్ స్పాన్సర్షిప్ ధర రూ.65-70 కోట్లుగా ఉంది. బ్రాడ్కాస్టర్ సహ-సమర్పించే స్పాన్సర్ల నుంచి 10 సెకన్లకు 13.2 లక్షలు, అసోసియేట్ స్పాన్సర్ల నుంచి 10 సెకన్లకు 13.6 లక్షలను వసూలు చేసింది. చదవండి: iPhone13: ఐఫోన్-13పై చిప్ దెబ్బ..కొన్ని వారాలు ఎదురు చూడాల్సిందేనా? -
కాసుల వర్షం కురిపిస్తున్న బిగ్బాస్ షో...!
ముంబై: బిగ్బాస్ ఒక రియల్టీ గేమ్ షో. దేశ వ్యాప్తంగా బిగ్బాస్ టెలివిజన్ రంగంలో కొత్త రికార్డులను నమోదు చేసింది. బిగ్ బాస్ షోను తొలిసారిగా హిందీ భాషలో స్ట్రీమ్ అవ్వగా...హిందీలో బిగ్బాస్ విజయవంతంకావడంతో నిర్వాహకులు ఇతర భాషలో కూడా వచ్చేవిధంగా పలు చర్యలను తీసుకున్నారు. బిగ్బాస్ దేశవ్యాప్తంగా హిందీతో పాటుగా మిగతా ఆరు భాషలో ఈ షో విజయవంతంగా నడుస్తోంది. బిగ్బాస్ను హిందీ, కన్నడ, బంగ్లా, తెలుగు, మరాఠీ, మలయాళం, తమిళ భాషల్లో ఎండెమోల్ షైన్ ఇండియా నిర్మిస్తుంది. చదవండి: Bigg Boss: బాస్లకే బాస్ అసలైన బిగ్బాస్ ఇతనే తాజాగా బిగ్బాస్ ఓటీటీ షోను ప్రముఖ మీడియా సంస్థ వయాకామ్ 18 వూట్ ఓటీటీ ప్లాట్ఫాంలో స్ట్రీమ్ చేస్తుంది. గత ఏడాది కలర్స్ ఛానల్లో బిగ్బాస్ -14 స్ట్రీమ్ అయినప్పుడు సుమారు 3.9 బిలియన్ల నిమిషాలపాటు ఆడియన్స్ చూశారు. ప్రస్తుతం వూట్లో వస్తున్న ఈ షోకు ఆడియన్స్ మంచి ఆదరణ వస్తోంది. ప్రతి వారం 1.5-2 మిలియన్ల యూజర్లు బిగ్బాస్ ఓటీటీ షోను చూడడానికి వస్తోన్నట్లు తెలుస్తోంది. యూజర్లలో ఎక్కువగా 15-30 వయసు ఉన్న వారు ఉన్నారు. వయాకామ్ 18 మీడియా చేసిన ఓటీటీ ప్రయోగం విజయవంతమైనట్లు కంపెనీ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గౌరవ్ రక్షిత్ పేర్కొన్నారు. వూట్ ను వాడే యూజర్లు ఏకంగా రెట్టింపుఐన్నట్లు వెల్లడించారు. ప్రముఖ ఓటీటీలకు పోటీగా... బిగ్బాస్ ఓటీటీ రాకతో వూట్ దశ మారింది. భారత్లో ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్వీడియో, నెట్ఫ్లిక్స్, డిస్నీ+హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువగా ప్రజాదరణను పొందాయి. బిగ్బాస్ ఓటీటీ ను వూట్లో ప్రసారం చేయడంతో ఈ ఓటీటీ ప్లాట్ఫాంకు వ్యూయర్షిప్ గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. బిగ్బాస్ ఓటీటీ షోను వూట్ యాడ్స్ను అందిస్తూ ఉచితంగా చూసే వీలు కల్పించింది. బిగ్బాస్ ఓటీటీ షో లో స్విగ్గి, కాయిన్డీసీఎక్స్ వంటి కంపెనీలు యాడ్స్ను షోలో ప్రదర్శించడానికి ముందుకువచ్చాయి. బిగ్బాస్ ఓటీటీ షో వూట్కు కాసుల వర్షం కురిపిస్తోంది. అడ్వటైజింగ్ నిపుణుల ప్రకారం బిగ్బాస్ ఓటీటీ ప్రకటనల ద్వారా ఇప్పటివరకు సుమారు రూ. 120 కోట్ల నుంచి రూ. 150 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది. బిగ్బాస్ ఓటీటీ గత నెల ఆగస్టు 8న ప్రారంభమవ్వగా...షోకు వ్యాఖ్యాతగా నిర్మాత కరణ్ జోహర్ వ్యవహరిస్తున్నారు. బిగ్బాస్-15 షోకు కర్టన్రైజర్గా బిగ్బాస్ ఓటీటీ షో ఆరు వారాలపాటు వూట్లో స్ట్రీమ్ కానుంది. చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్..! -
క్రియేటివిటీ అంటే ఇది..
Old TV Advertisements: అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్.. బిజినెస్కి అవసరమైన ప్రధాన సూత్రం. ఒక బ్రాండ్ను ప్రమోట్ చేసుకునేందుకు, జనాలకు దగ్గరిదాకా తీసుకెళ్లేందుకు వీటికి మించిన పవర్ఫుల్ మార్గం మరొకటి ఉండదు. అందుకే వెరైటీ కాన్సెప్ట్లు, రకరకాల స్క్రిప్లతో తమలోని క్రియేటివిటీ మొత్తాన్ని చూపిస్తుంటారు యాడ్ మేకర్స్, డైరెక్టర్స్. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న యాడ్స్ ట్రెండ్.. పోను పోనూ కొత్త పుంతలు తొక్కుతోంది. అయితే ఒకానొక టైంలో వచ్చిన యూనివర్సల్ యాడ్స్ మాత్రం జనాలకు బాగా గుర్తుండిపోయాయి. ముఖ్యంగా నైంటీస్, మిలీనియంలో బుల్లితెర ద్వారా ఇంటింటికీ చేరిన ఈ యాడ్స్.. ఇప్పటికీ తలుచుకున్నా ఆహ్లాదకరమైన ఓ అనుభూతి కలుగుతుంది. పిల్లలతో పాటు పెద్దల పెదవులపై చిరునవ్వు పూయిస్తుంది. విశేషం ఏంటంటే.. వీటిలో చాలావరకు క్రికెట్ మ్యాచ్ల మధ్యల్లో రిపీట్గా టెలికాస్ట్ కావడం వల్ల చాలామందికి బహుశా ఇవి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. అతుక్కుపోయే గుణం ఉన్న ఫెవికిక్ను చేపల వేటను ఉపయోగించే ఈ ఫన్నీ యాడ్.. చివర్లో ఆ వ్యక్తి నవ్వే నవ్వు. ప్రాణం కన్నా డబ్బు మిన్న అనుకునే ఓ వ్యక్తికి నీటి బొట్టు ఇచ్చే భారీ షాక్.. ఎమ్సీల్ యాడ్ కోసం రూపొందించింది. జంతువుల్లో ఉన్న సెన్సిబుల్ ప్రేమను.. ఆడ పక్షి- దత్తత తాబేలు పిల్ల, ఆ పిల్లను యాక్సెప్ట్ చేసే మిగతా పక్షి పిల్లల ద్వారా చూపించిన సరదా యాడ్. చిన్నప్పుడు చదివిన కాకి-దాహం కథ.. రాళ్లకు బదులు ముక్కుతో పొడిచే కాకి.. బ్యాక్గ్రౌండ్లో వినిపించే సాంగ్(తెలుగు వెర్షన్ కూడా ఉంటుంది) కరెంట్ లేని ప్యాలెస్లో దీపం పెట్టే కూలీల కథ.. చివరిదాకా అర్థం కానీ ట్విస్ట్.. హ్యాపీడెంట్ చూయింగ్గమ్ యాడ్ మూకీ యాడ్లలో కొత్త ఒరవడి.. మిరిండా యాడ్ దురదృష్టంలోనూ సరదాను ఆస్వాదించొచ్చని చూపించిన సరదా పెప్సీ యాడ్.. మేరా నెంబర్ కబ్ ఆయేగా(నా నెంబర్ ఎప్పుడు వస్తుంది) పగిలిపోని గుడ్డు.. జుట్టు పీక్కునే వంటగాడు. ఫెవికల్ డబ్బాలో దాణా తినే కోడి.. ఉల్లాసంగా సాగే లిరిల్ సోప్ యాడ్.. జలపాతం, అందమైన లొకేషన్లో వయ్యారి చిందులు కుటుంబ ఆప్యాయతలకు అడ్డొచ్చే గోడను బద్ధలు కొట్టాలని ప్రయత్నించే కవల అన్నదమ్ములు. బాంబులతో పేల్చిన బద్ధలు కానీ అంబూజా సిమెంట్తో కట్టిన గోడ.. ఇలా చెప్తూ పోతే బోలెడన్ని యాడ్లు. వాటిలో కొన్ని మాత్రం ఇవి. -
లేడీ మోడల్స్ని అలా చూపించొద్దు: గవర్నర్
తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ శుక్రవారం సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఆభరణాల కంపెనీలు తమ ప్రకటనల్లో మోడల్స్ని పెళ్లి కుమార్తెలుగా చూపించవద్దని సూచించారు. కేరళలో కొన్ని రోజుల క్రితం వెలుగు చూసిన వరకట్న బాధితురాలి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంలో ఇలాంటి అరాచకాలు వెలుగు చూడటం పట్ల ఆందోళన వ్యక్తం అయ్యింది. ఈ ఘటన అనంతరం కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా ఒకరోజు ఉపవాస దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కొచ్చిలోని కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ ఏడవ కాన్వొకేషన్ వేడుకకు గవర్నర్ ఆరిఫ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆభరణాల ప్రకటనల్లో.. మోడల్స్ని పెళ్లి కుమార్తెలా చూపించకూడదు. దీని వల్ల జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. ఆభరణాల ప్రకటనల్లో మోడల్స్ని పెళ్లి కుమార్తెలుగా కాకుండా వేరే విధంగా చూపించాలి. ఇలాంటి యాడ్స్లో పెళ్లి కుమార్తె ఒంటి నిండ బంగారు ఆభరాణాలు వేసి.. చూపిస్తారు. దాంతో జనాలు పెళ్లి కుమార్తె అంటే ఇంతే అట్టహసంగా.. భారీగా నగలు ధరించాలని భావించే ప్రమాదం ఉంది. కనుక బంగారు ఆభరణాల ప్రకటనల్లో మోడల్స్ని పెళ్లి కుమార్తెలుగా చూపించకండి’’ అని కోరారు. ఇక కాన్వొకేషన్ కార్యక్రమంలో విద్యార్థుల చేత కట్నం తీసుకోము.. ఇవ్వము అని అండర్టేకింగ్ తీసుకున్నారు ఆరిఫ్. అంతేకాక విద్యార్థులు కాలేజీలో చేరిన సమయంలోనే వారి వద్ద నుంచి కట్నం ఇవ్వం, తీసుకోం అని బాండ్ తీసుకోవాలన్నారు. మన సమాజంలో వరకట్న దురాచారం బలంగా పెనవేసుకుపోయిందని.. దాన్ని తొలగించడానికి కఠిన చట్టాలతో పాటు జనాల్లో అవగాహన కూడా రావాలన్నారు ఆరిఫ్. -
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు కొత్త బెడద..! వారికి మాత్రం పండగే...
భారత్లో టిక్టాక్ బ్యాన్ను అదనుగా తీసుకున్న ఫేస్బుక్ తన వినియోగదారుల కోసం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ను తెచ్చిన విషయం తెలిసిందే. చాలా మంది నెటిజన్లు ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియోల్లో మునిగితేలుతున్నారు. కాగా ప్రస్తుతం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇన్స్టాగ్రామ్లో రీల్స్ మధ్యలో 30 సెకన్ల పాటు యాడ్స్ రానున్నాయి. జూన్ 18 నుంచి ఈ సదుపాయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్స్టాగ్రామ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. దీంతో రీల్స్ చూస్తోన్న యూజర్లకు కాస్త చికాకును కల్పించనుంది కాగా ఇన్స్టాగ్రామ్ ఏప్రిల్లోనే భారత్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, జర్మనీల్లో తొలిసారిగా యాడ్ రీల్స్ను పరీక్షించింది. ఇది విజయవంతం కావటంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సదుపాయాన్ని లాంచ్ చేసింది. యూజర్లకు కొత్త కంటెంట్ను కనుగొనడానికి, క్రియేట్ చేయడానికి రీల్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఇన్స్టాగ్రామ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జస్టీన్ ఓసోఫ్స్కీ తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ నిర్ణయంతో కంటెంట్ క్రియేటర్లకు మాత్రం పండగే..! ఇన్స్టాగ్రామ్ రీల్స్ మధ్యలో వచ్చే యాడ్స్తో కంటెంట్ క్రియేటర్లు డబ్బును సంపాందించనున్నారు. చదవండి: ఈ బిల్లులతో అమెజాన్ ప్రైమ్ ఫ్రీ షిప్పింగ్కు కాలం చెల్లనుందా..! -
యూట్యూబ్ టాప్లో ఇక అవి కనిపించవు
న్యూఢిల్లీ: ఫ్రీ మరియు ప్రీమియం ప్యాకేజీల ద్వారా వీడియో కంటెంట్ వినోదాన్ని అందిస్తున్న యూట్యూబ్ హర్షించదగ్గ నిర్ణయం తీసుకుంది. ఇకపై జూదం, మద్యం, రాజకీయాలకు సంబంధించిన యాడ్లను ప్రముఖంగా ప్రచురించకూడదని నిర్ణయించుకుంది. ఈ మేరకు జూన్ 14న యూట్యూబ్ మస్ట్హెడ్ (యూట్యూబ్ టాప్ పేజీ) కంటెంట్కు ఉండాల్సిన అర్హతల జాబితాను రిలీజ్ చేసింది. గ్యాంబ్లింగ్, ఆల్కాహాల్, పాలిటిక్స్, డ్రగ్స్కు లింకు ఉన్న యాడ్లేవీ ఇకపై యూట్యూబ్ టాప్, హోం పేజీలో కనిపించవని ఆదివారం యూట్యూబ్ సంస్థ ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. యూట్యూబ్ను ఓపెన్ చేయగానే టాప్లో కనిపించే ఈ యాడ్స్ ద్వారా గూగుల్కు భారీ ఆదాయం వస్తుంటుంది. అయితే ఇకపై ఆ ప్లేస్లో మాగ్జిమమ్ యూజర్లకు పనికొచ్చేవి, అవగాహనకు సంబంధించిన యాడ్లే ఉండాలని యూట్యూబ్ నిర్ణయించింది. ‘‘యూజర్ల పట్ల ఇకపై మరింత బాధ్యతగా వ్యవహరించాల’’ని అనుకుంటున్నాం యూట్యూబ్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. వీటితో పాటు యూజర్లను తప్పుదారి పట్టించే ప్రకటనలను, అసత్య ప్రచారాలకు సైతం యూట్యూబ్లో చోటు ఉండబోదని స్పష్టం చేసింది. అంతేకాదు యాడ్లకు సంబంధించిన వీడియోల(థంబ్నెయిల్స్) విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. ‘‘అవి మానసికంగా యూజర్పై ప్రభావం చూపెడతాయి. కాబట్టి, అలాంటి యాడ్లను ప్రొత్సహించం’’ అని యూట్యూబ్ ప్రతినిథి ఒకరు వెల్లడించారు. చదవండి: యూట్యూబ్ గురించి ఇవి తెలుసుకోవాల్సిందే -
ఈ ఫేమస్ యాడ్స్లో ఉన్నవారిని గుర్తుపట్టారా?
అట్టర్లీ బట్టర్లీ... కార్టూన్స్ అంటే కళ్లను టీవీకి కట్టేసే పిల్లలు కమర్షియల్స్నూ కన్నార్పకుండా చూస్తారు.. తెలియని బ్రాండ్ ఉండదు.. కంఠతా రాని డైలాగ్స్, జింగిల్స్ ఉండవు.. అందులో పిల్లలు కనిపించే ప్రకటనలైతే చెప్పక్కర్లేదు.. ఆ చైల్డ్ మోడల్స్ను చైల్డ్హుడ్ ఫ్రెండ్స్లాగే భావించిన తరమూ ఉంది! ఆ జ్ఞాపకాలు మెదడు పొరల్లోనే ఉండిపోకుండా మనసుకూ మారుతూ తాజా పరుస్తున్నాయి. నాటి లిటిల్ స్టార్స్ నేడు ఎక్కడున్నారో.. ఏం చేస్తున్నారో అన్న కుతూహలాన్ని కలిగిస్తున్నాయి.. ఫేస్బుక్లో సెర్చ్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాలన్నా.. వాళ్ల అసలు పేర్లు తెలియాలి.. మొహాలను పోల్చుకోగలగాలి.. కదా.. అందుకే ఆ పాత రోజులను...వాళ్ల ప్రెజెంట్ స్టేటస్ను పట్టుకొని వచ్చిందే ఈ కథనం.. ఈ అక్షరాల వెంట బాల్యాన్ని చేరుకోండి.. వర్తమానాన్నీ అందుకోండి. దేశంలో శ్వేత విప్లవానికి ప్రతీక అమూల్ పాలు.. పాల ఉత్పత్తులు. ఆ రోజుల్లో బొద్దుగా, ఆరోగ్యంగా ఉన్న ఏ పాపాయి కనపడ్డా ‘వావ్.. అమూల్ బేబీ’ అనుకునేవాళ్లట అసంకల్పితంగా. తల్లి పాలకు సమానమైన పోషకాలతో అమూల్ పాలు అనే వ్యాఖ్యతో ఆ బ్రాండ్ పాపులర్ అయింది. స్ట్రాంగ్ ఇండియాకు గుర్తుగా మారుమోగింది. అలాంటి అమూల్కు తొలి బేబీ మోడల్ .. ఫస్ట్ అమూల్ బేబీ ఎవరో తెలుసా? ప్రముఖ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సోదరి. కలర్లో మొదలైన అమూల్ యాడ్ ఫస్ట్ అమూల్ బేబీ కూడా శశి థరూర్ మరో చెల్లెలు. అది 1961 నాటి సంగతి. పాల వెల్లువ (శ్వేత విప్లవం) మొదలైన తొలినాళ్లలో అమూల్ పాల పొడి ప్యాకెట్ మీద మోడల్ కోసం పండంటి పాపాయిని వెదికే పనిలో పడింది అమూల్ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ. ఏడువందల పన్నెండు మంది పిల్లల ఫొటోలను పరిశీలించింది. రాజీ పడలేదు. మరిన్ని ఫొటోలను పరిశీలించాలనే ఉద్దేశంతో అమూల్ అడ్వర్టయిజ్ అండ్ సేల్స్ ప్రమోషన్ డైరెక్టర్కు శశిథరూర్ తండ్రి తెలిసి ఉండడంతో అతణ్ణి కలిశాడు. తన ప్రయత్నం గురించి చెబుతూ ఎందుకైనా మంచిది మీ పిల్లల ఫొటోలు కూడా ఒకసారి చూపించమని కోరాడు. తన కూతురు ఫొటో చూపించాడు. చారెడేసి కళ్లతో.. బొద్దుగా.. ఆరోగ్యంగా ఉన్న ఆ నెలల పాపను చూడగానే ‘అమూల్ బేబీ ఫౌండ్’ అన్నాడట డైరెక్టర్. కట్ చేస్తే అమూల్స్ప్రేకి మోడల్ అయింది ఆ బేబీ. పేరు శోభ. అమూల్కి ఫస్ట్ బేబీ మోడల్గా.. అమూల్ అట్టర్లీ బట్టర్లీ డెలీషియస్ ప్రకటనల్లో అందరినీ అలరించిన బేబీగా గుర్తుండి పోయింది. థరూర్ కుటుంబంతో అమూల్ అనుబంధం అక్కడితోనే ఆగిపోలేదు. కలర్లో వచ్చిన ప్రకటనకూ మోడల్గా ఆ ఇంటి పాపాయినే ఎంచుకున్నారు. తొలి మోడల్ శశిథరూర్ అక్కయ్య శోభ అయితే కలర్లో తొలి మోడల్గా శశిథరూర్ చెల్లెలు స్మిత ఎంపికైంది. శశిథరూర్ కూడా ఆ కుటుంబపు అమూల్ బంధాన్ని కొనసాగించారు. ఆయన అమెరికా నుంచి వచ్చాక.. రాజకీయాల్లో చేరాక.. అమూల్ కార్టూన్స్ క్యాంపెయిన్కి మోడల్ అయ్యారు. ముంబై, మెరైన్ డ్రైవ్లోని ఆ హోర్డింగ్స్ను చూసి శశిథరూర్ ‘ఇప్పుడు మా నాన్నగారు ఉండుంటే తన కొడుక్కూడా అమూల్ మోడల్ అయ్యాడని ఆనందపడేవారు’ అని చమత్కరించాడు. ఫస్ట్ అమూల్ బేబీ శోభ 1977లో ‘మిస్ కోల్కత్తా’ క్రౌన్ గెలుచుకుంది. స్మిత కూడా అందాల పోటీల్లో పాల్గొన ‘మిస్ ఇండియా’ రన్నరప్గా నిలిచింది. సామాన్యుడి స్నాక్స్.. పార్లే జీ బిస్కట్స్ కవర్ మీదున్న పాపాయికి సంబంధించి చాలా వదంతులు ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో ఒకటి.. ఆ పాప ఎవరో కాదు చిన్నప్పటి సుధా మూర్తే అని. సుధా మూర్తి ఎవరో తెలుసు కదా.. ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి భార్య . రెండో వదంతేమో ఆ అమ్మాయి పేరు నీరూ దేశ్పాండే అని, నాగ్పూర్ నివాసి అని, ఆమె మూడో ఏట వాళ్ల నాన్న ఆ ఫొటో తీసి పార్లే జీ వాళ్లకు పంపితే .. దాన్ని పార్లే జీ వాళ్లు తమ బ్రాండ్ మస్కట్గా ఉపయోగించుకున్నారని. అయితే నిజం ఏంటంటే.. అదొక కల్పిత చిత్రం. 1960లో ఎవరెస్ట్ క్రియేటివ్స్ అనే సంస్థ దాన్ని చిత్రించింది. ఐయామ్ ఎ కంప్లాన్ బాయ్.. హూ.. ఐయామ్ ఎ కంప్లాన్ గర్ల్.. కంప్లాన్ యాడ్ అని వేరే చెప్పక్కర్లేదు. కాని ఆ కంప్లాన్ బాయ్, కంప్లాన్ గర్ల్ గురించే చెప్పాలి. ఒక్కసారి ఆ పాత కమర్షియల్ను జ్ఞాపకం చేసుకోండి. అందులో అన్నాచెల్లెళ్లుగా నటించిన ఆ ఇద్దరినీ ఇప్పుడు ఈజీగా పోల్చుకోగలుగుతాం. అప్పటి ఆ ఇద్దరి నవ్వులు, ఎక్స్ప్రెషన్స్ను కాస్త మనసు పెట్టి పరిశీలిస్తే ఇప్పటి ఆ ఇద్దరెవరో ఇట్టే తెలిసిపోతారు. అవును... ఆ కంప్లాన్ బాయ్.. ‘కబీర్ సింగ్’ షాహీద్ కపూర్. మరి కంప్లాన్ గర్ల్? ఇంకెవర్ తెలుగు సినిమా ‘సూపర్’ హీరోయిన్ ఆయేషా టకియా. చైల్డ్ మోడల్ దశ దాటాక టీన్స్లో వీళ్లిద్దరూ కలసి వీడియో ఆల్బమ్లోనూ నటించారు. వీళ్ల సినిమా ప్రయాణాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరూ చూసిందే.. చేస్తున్నదే. ఘర్ ఘర్ కీ రోనక్.. ...అనగానే 1960, 70ల్లో పిల్లలుగా ఉన్న పెద్దవాళ్లందరికీ గుర్తొచ్చే పదం ‘మర్ఫీ’. ఎస్.. ‘మర్ఫీ .. ఘర్ ఘర్ కీ రోనక్.. మర్ఫీ ఘర్ ఘర్ కీ ఛానక్ .. తరహ్ తరహ్ కే మర్ఫీ రేడియో లా దేతే హై ఘర్ మే జాన్’ అంటూ మహ్మద్ రఫీ పాడిన ఆ వ్యాపార ప్రకటనా గీతం ప్రార్థనా గీతంలా పాపులర్ అయిన బాల్యం అది. రేడియోకు పర్యాయపదంగా మారిన మర్ఫీ సృష్టించిన నోస్టాల్జియా ఘనమైనదే. చెక్క ఫ్రేముతో పోర్టబుల్ టీవీ పరిమాణంలో ఉండే ఆ కాలపు మర్ఫీ రేడియో ఇంట్లో ఉందంటే ఆ ఇంటి హోదాయే వేరు. మ్యాటీ క్లాత్ పరిచిన టేబుల్ మీద రేడియో ఉంటుంది ఠీవీగా. ఆ క్లాత్ ఆ ఇంటి ఇల్లాలి ఎంబ్రాయిడరీ కళతో మెరిసిపోతూంటుంది. రేడియో మీద దుమ్ము పడకుండా కప్పిన ఊలు కవరూ ఆమె కళానైపుణ్యమే. ఇవన్నీ మర్ఫీ రేడియో మురిపాన్ని పెంచిన ఆసక్తులైతే.. గర్భిణిలకు కలల బిడ్డగా ముద్దొచ్చిన వాడు.. మర్ఫీ రేడియో మీది బుగ్గల బుజ్జాయి. ఈ పిల్ల మోడల్ ఎంత ఫేమస్ అంటే మెటర్నిటీ క్లినిక్స్, ఆసుపత్రులు, బెడ్రూమ్స్లోని గోడల మీద.. ఆఖరుకు సెలూన్స్లో కూడా ఆ బుజ్జోడి ఫొటో క్యాలెండర్లే వేలాడేంతగా. ‘మర్ఫీ మున్నా’గా ప్రసిద్ధుడైన ఈ మోడల్ పేరు కాగ్యూర్ తుల్కు రిన్పోచే. మర్ఫీ యాడ్ కోసం నటిస్తున్నప్పుడు రిన్పోచే వయసు మూడేళ్లు. స్వస్థలం హిమాచల్ ప్రదేశ్లోని మనాలి. నిజానికి మర్ఫీ కోసం కూడా మొదట్లో ఆడపిల్లనే మోడల్గా తీసుకున్నారు. అయితే ఆ అమ్మాయి చనిపోవడంతో అలాంటి పోలికలే ఉన్న పిల్లల్ని వెదుకుతున్న క్రమంలో రిన్పోచే కనిపించాడు. అలా రిన్పోచే మర్ఫీ మున్నా అయ్యాడు. అదే అతని మొదటి, చివరి వ్యాపార ప్రకటన. ఊహ తెలిసే వయసులో బౌద్ధారామంలో చేరాడు. దాదాపు 20 ఏళ్లు బౌద్ధ భిక్షువుగా ఉన్నాడు. తర్వాత ఢిల్లీకి మకాం మార్చాడు. బాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్ మందాకినిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్లకు ఒక పాప కూడా. రిన్పోచే ప్రస్తుతం కుటుంబంతో కలసి ముంబైలో ఉంటున్నాడు. స్కూల్ టైమ్...యాక్షన్ కా స్కూల్ టైమ్.. ఆ సబ్ హెడ్ చూసి అర్థమైపోయి ఉంటుంది.. ఇది యాక్షన్ షూ టీవీ కమర్షియల్ను గుర్తుకు తెచ్చే కథనం అని. స్కూల్ టైమ్.. యాక్షన్ కా స్కూల్ టైమ్ అంటూ సాగే పాటలో అల్లరి పిల్లాడుగా వాసికెక్కిన ఆ చైల్డ్ మోడల్ పేరు తేజన్ దివాన్జీ. యాక్షన్కే కాకుండా మ్యాగీ, బ్యాండ్ ఎయిడ్కూ మోడలింగ్ చేశాడు 90ల చివరిదాకా. యాక్షన్లోని ఆ నాటీ బాయ్ ఇప్పుడు బాధ్యతగల డాక్టర్. రేడియేషన్ ఆంకాలజీ నిపుణుడు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్లో వైద్యాన్ని చదివిన తేజన్ అక్కడే బాల్టిమోర్లోని అడల్ట్ మెడికల్ సెంటర్లో వైద్యసేవలందిస్తున్నాడు. కోల్గేట్.. 1980ల్లోని పిల్ల తరానికి ఈ కోల్గేట్ ప్రకటనలోని బేబీ గుడ్డు.. నచ్చిన మోడల్. ఎందుకంటే అందరి పిల్లల్లాగే ఆమే టూత్పేస్ట్ను టేస్ట్ చేస్తుంది. ఇలాంటి సహజమైన పిల్ల చేష్టలతో నాటి చాలా ప్రకటనల్లో కనిపించిన బేబీ గుడ్డు మూడవ యేట నుంచే మోడలింగ్ మొదలుపెట్టింది. అసలు పేరు షాహిందా బేగ్ అయినా బేబీ గుడ్డుగానే సుపరిచితం. వ్యాపార ప్రకటనల్లోనే కాదు రజని వంటి దూరదర్శన్ సీరియళ్లు, సముందర్, ఆఖిర్ క్యోం, ఘర్ పరివార్, ఇన్స్పెక్టర్ ధనుష్ మొదలైన సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం దుబాయ్లో ఉంటోంది. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్లో పనిచేస్తోంది. గొంతులో కిచ్కిచ్ ఏం చెయ్యను.. ....అనగానే విక్స్ బిళ్లలతో కిచ్కిచ్ పోయేను అంటూ పూర్తిచేస్తారు ఏ తరంలోని పిల్లలైనా. అంత ప్రాచుర్యం ఆ జింగిల్. ఆ లిరిక్స్, ట్యూన్ ఎంత క్యాచీయో.. విక్స్ బిళ్లలదీ అంతే మజా అయిన రుచి. గొంతులో కిచ్కిచ్ లేకపోయినా కిచ్కిచ్ ఉన్నట్టు నటించి పెద్దవాళ్ల దగ్గర్నుంచి ఆ బిళ్లలను చప్పరించాలనే బాల్య చాపల్యం అది. దాన్ని చక్కగా నటించిన బేబీ మోడల్ ఇషితా అరుణ్. మోడల్ జయంత్ కృపలానీకి కూతురుగా ఆ యాడ్లో మూడేళ్ల ఇషితా నాటి పిల్లలను, పెద్దలను అందరినీ ఆకట్టుకుంది. ఆ ఇషితా అరుణ్ ఎవరో కాదు ప్రముఖ నటి, గాయని ఇలా అరుణ్ కూతురే. పెద్దయ్యాక ఇషితా కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్తోపాటు బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లోనూ నటించింది. వైశాలీ సామంత్ పాడిన, ఇషితా అభినయించిన ‘ఐక దాజీబా’ అనే ఆల్బమ్ సూపర్ హిట్ అయింది. ఐ లవ్ యూ రస్నా.. ...అంటూ పెదవులకు అంటిన రస్నాను చప్పరిస్తూ ముద్దు ముద్దుగా పలికిన అమ్మాయిని ఎవరు మరచిపోతారు?! అప్పటి పిల్లలను అమితంగా ఆకట్టుకున్న యాడ్ రస్నా. ఒకరకంగా పిల్లలే ఈ డ్రింక్ను ప్రమోట్ చేశారనొచ్చు. రస్నా బేబీగా ఫేమ్ తెచ్చుకున్న ఆ అమ్మాయి పేరు అంకితా ఝవేరి. తర్వాత తెలుగు, తమిళ, కన్నడభాషల సినిమాల్లో హీరోయిన్గానూ కనిపించింది. ‘సింహాద్రి’లోని ఇద్దరు కథానాయికల్లో ఒకరు అంకిత ఝవేరీనే. ఇప్పుడు పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిరపడిందని సమాచారం. శుద్ధ్ ధారా.. అలిగి ఇంట్లోంచి రోడ్డు మీదకు వచ్చిన అయిదారేళ్ల పిల్లాడికి తమ ఇంటికి ఉత్తరాలు మోసుకొచ్చే పోస్ట్ మాస్టర్ తారసపడ్తాడు. ‘రామూ కాకా..’ అని పిలుస్తాడు. ‘అరే బబ్లూ ఒక్కడివే ఎక్కడికి వెళ్తున్నావ్?’ అని అడుగుతాడు పోస్ట్మాస్టర్. ‘నేను ఇంట్లోంచి వెళ్లిపోతున్నా’ అంటాడు బుంగమూతితో. ‘అయ్యో .. అవునా. మరి ఇంట్లో అమ్మ వేడివేడి జిలేబీలు చేస్తుందే.. నీకోసం కాదా?’ అంటాడు రాము కాకా ముసిముసిగా నవ్వుతూ. ఆ మాట వినగానే కళ్లింత చేసుకుంటూ ‘జిలేబీలా.. ’ అంటాడు బబ్లూ. ‘ఊ.. ’ అన్నట్టుగా తలూపుతాడు పోస్ట్ మాస్టర్ అదే నవ్వుతో. ‘అయితే జిలేబీలు తిని వెళ్లిపోతా’ అంటూ ఇంటిదారి పడ్తాడు బబ్లూ. ఇది ‘ధారా’ వంట నూనె వ్యాపార ప్రకటన. ఇందులోని బబ్లూలో తమ పిల్లలను ఊహించుకోని తల్లులు ఉండరు. అమాయకమైన మొహం.. స్వచ్ఛమైన, స్పష్టమైన వ్యక్తీకరణతో బబ్లూని పోలని పిల్లలు ఉండరు. అంతలా ఆకట్టుకున్న మోడల్ బబ్లూ అసలు పేరు పర్జాన్ దస్తూర్. ఈ అబ్బాయి అనుకోకుండా ‘ధారా’ మోడల్ అయ్యాడు. ఈ ‘ధారా’ జిలేబీ యాడ్కు పర్జాన్ కన్నా కాస్త పెద్దపిల్లాడిని తీసుకుని షూటింగ్ కూడా పూర్తి చేశారు. కాని దర్శకుడు ఆచార్యకు ఇంకొంచెం చిన్న పిల్లాడైతే బాగుంటుంది.. ఇంకా అమాయకమైన ఎక్స్ప్రెషన్స్ వస్తాయేమో అనుకున్నాడు. షూటింగ్ చేసిన ఆ పెద్దపిల్లాడికి వాయిస్ ఓవర్ ఇచ్చింది పర్జాన్. డైలాగులు రికార్డ్ చేస్తున్నప్పుడు ‘జిలేబీ’ అనగానే పర్జాన్ కళ్లల్లో మెరిసిన మెరుపు ఆచార్యకు గుర్తొచ్చింది. వెంటనే పర్జాన్తో చేయిస్తే ఎలా ఉంటుంది? అని అనుకోవడమే కాదు పర్జాన్తో షూటింగ్ మొదలుపెట్టేశాడట. ఆచార్య ఊహించినట్టుగానే ‘జిలేబీ’ అనగానే ఆ పిల్లాడి కళ్లల్లో జిలేబీ పట్ల చవులూరే భావం కనిపించింది. 38 టేకులు చేసినా పర్జాన్ కళ్లల్లో అదే మెరుపుట. అలా పర్జాన్ .. బబ్లూ అయిపోయి అందరి గారాబాలకు పాత్రుడయ్యాడు. వ్యాపార ప్రకటనలకే పరిమితం కాలేదు బాల పర్జాన్ ప్రతిభ. సినిమాల్లోనూ కనిపించింది. కుఛ్ కుఛ్ హోతాహైలో సర్దార్ కిడ్గా ‘తుస్సీ జా రహే హో.. తుస్సీ నా జావో’ అనే డైలాగ్తో వెండితెర ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. గుజరాత్ అల్లర్ల మీద వచ్చిన పర్జానియా, మొహబ్బతే, జుబేదా, సికందర్ మొదలైన చిత్రాల్లోనూ నటించి ఆ పబ్లిసిటీని కంటిన్యూ చేసుకున్నాడు. ఇది ఇరవై, ఇరవైరెండేళ్ల నాటి మాట. ఇప్పుడు పర్జాన్కు ఇరవై ఎనిమిదేళ్లు. నటుడిగానే కాదు గాయకుడిగా, రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్గా తనలోని బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటున్నాడు. ది హెల్దీ ఆయిల్ ఫర్ హెల్దీ పీపుల్ ...అని జింగిల్లోని చివరి పంక్తులను చెప్పినా ఠక్కులన ‘సన్డ్రాప్ సూపర్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఫర్ హెల్డీ పీపుల్ హెల్దీ ఆయిల్’ అంటూ పూర్తిచేస్తారు ఆ బాల్యపు యాదిని దాచిపెట్టుకున్న నేటి పెద్దలు. ఈ జింగిల్ పాడుకోగానే కొండలాగా ఉన్న పూరీల చుట్టూ అలవోకగా పల్టీలు కొడుతూ అదే పరిమాణంలోని గులాబ్ జామ్స్ పై నుంచి జంప్ చేస్తుండే పిల్లాడూ గుర్తొస్తాడు. చురుగ్గా.. మెరుపు వేగంతో స్టంట్స్ చేసే ఆ చైల్డ్ మోడల్ పేరు నిశాంత్ మెహ్రా. ఆ వయసులోనే అథ్లెట్గా రాణించిన మెహ్రా ఇప్పుడు ఫుట్బాల్ ఆటగాడు. ముంబై ఎఫ్సీకి కెప్టెన్గానూ వ్యవహరించాడు. సర్ఫ్ ఆల్ట్రా.. దూరదర్శన్తో అనుబంధం ఉన్న తరానికి కునాల్ ఖేము సుపరిచితుడు.. సీరియళ్లు, టీవీ కమర్షియల్స్తో. సర్ఫ్ ఆల్ట్రా చైల్డ్ మోడల్, గుల్ గుల్షన్ గుల్ఫామ్ వంటి ధారావాహికలు, సర్, రాజా హిందుస్తానీ, జఖ్మ్, భాయ్, హమ్ హై రాహి ప్యార్ కే మొదలైన సినిమాల్లో బాలనటుడు కునాల్ ఖేము. అయితే నేటి యువతకూ అంతే పరిచయం అతను. భాగ్ జానీ, గుడ్డు కీ గన్ వంటి సినిమాల్లో హీరోగానే కాదు సైఫ్ అలీ ఖాన్ చెల్లెలు సోహా అలీఖాన్ భర్తగా కూడా. ఇదీ ఒకప్పటి లిటిల్ స్టార్స్ నేటి కథ. -
అంతరిక్షంలో యాడ్స్: పొరపాటున ఏలియన్స్ చూస్తే!
అప్పట్లో అంతరిక్ష ప్రయాణమంటే కల్లోనే సాధ్యం, కానీ పెరిగిన టెక్నాలజీతో బాగా డబ్బున్న ఆసాములు ప్రైవేట్గా అంతరిక్షంలోకి ట్రిప్ వేసే వీలు కలిగింది. ఇప్పటివరకు ప్రభుత్వాల ఆధీనంలోనే ఉన్న అంతరిక్ష ప్రయాణం ప్రైవేట్ కంపెనీల ప్రవేశంతో రూపుమారుతోంది. దీంతో ఇకపై అంతరిక్షంలో వాణిజ్య ప్రకటనల పోటీ పెరగనుంది. ప్రస్తుతం భూమిపై కాదేదీ ప్రకటనలకనర్హం అనే రీతిలో వాణిజ్య ప్రకటనల జోరు కొనసాగుతోంది. ఏ కాస్త ఖాళీ స్థలం కనిపించినా, దానిపై తక్షణమే ఏదో ఒక కమర్షియల్ ప్రకటన ప్రత్యక్షమవుతోంది. వ్యాపారాల్లో పోటీ పెరిగే కొద్దీ కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీలు అడ్వర్టైజింగ్పై భారీగా వెచ్చిస్తున్నాయి. ఈ జోరు క్రమంగా భూగోళం దాటి అంతరిక్షం వైపు పయనిస్తోందట. రెండేళ్ల క్రితం స్పేస్ రంగంలో యాడ్స్ రెవెన్యూ 36,600 కోట్ల డాలర్లు దాటిందంటే, వీటి జోరు ఎలాగుందో అర్ధం చేసుకోవచ్చు. అయినా స్పేస్లో ప్రకటనలేంటండీ, ఎవరు చూస్తారని ప్రశ్నిస్తే పైన చెప్పిందే సమాధానం. ఈ యాడ్స్ అన్నీ భారీగా డబ్బులున్న కుబేరులను ఉద్దేశించినవి. అంటే అంతరిక్ష యాత్రలకు వెళ్లే అతి ధనవంతులకోసమే ఈ ప్రకటనలు. స్పేస్యాత్రల జోరు మరింత పెరిగితే, ఈ ప్రకటనలు మరింతగా పెరుగుతాయి. మనలో మన మాట.. ‘‘మా సబ్బు వాడితే మిలమిల మెరుస్తారు’’ లాంటి ప్రకటనలు పొరపాటున ఏలియన్స్ చూస్తే ఏమనుకుంటారో కదా! చదవండి: పాతికవేలతో హరిద్వార్కు స్పెషల్ టూర్! -
టీవీలో ప్రకటనలు చూస్తే నెలనెలా జీతం..!
సాక్షి, సిటీబ్యూరో: గుజరాత్లోని సూరత్ కేంద్రంగా పని చేసే ఓ సంస్థ కొత్త తరహా మోసానికి తెరలేపింది. తమ వద్ద డబ్బు చెల్లించి ఎల్ఈడీ టీవీ పొందాలని, అందులో వచ్చే యాడ్స్ చూస్తూ ఉంటే నెలనెలా తామే కనీస మొత్తం చెల్లిస్తూ ఉంటామని ఆన్లైన్లో ప్రచారం చేసుకుంది. దీన్ని చూసిన ముగ్గురు నగరవాసులు రూ.2.49 లక్షలు చెల్లించి మోసపోయారు. వీరి ఫిర్యాదు మేరకు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సూరత్కు చెందిన డోర్ టైజర్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఆన్లైన్లో యాడ్స్ ఇచ్చింది. అందులో తమ వద్ద రూ.83 చెల్లిస్తే అత్యాధునికమైన ఎల్ఈడీ టీవీ పంపిస్తామని నమ్మబలికింది. అంతటితో ఆగకుండా తమ వద్ద సభ్యత్వం తీసుకున్న వారికి ప్రత్యేక యాప్ ద్వారా ఆ టీవీలో కొన్ని ప్రకటనలు చూపిస్తామంటూ చెప్పింది. వీటిని క్రమం తప్పకుండా చూస్తే ప్రతి నెలా కనిష్టంగా రూ.11,500 చొప్పున చెల్లిస్తామంటూ ఎర వేసింది. ఈ ప్రకటన చూసి ఆకర్షితులైన ముగ్గురు నగరవాసులు అందులోని నెంబర్లకు సంప్రదించారు. ఒక్కోక్కరు రూ.83 వేల చొప్పున రూ.2.49 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత ఆ సంస్థ నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మరోపక్క ఈ యాడ్స్ యాడ్స్ ఓఎల్ఎక్స్లో, ఫేస్బుక్లోని మార్కెట్ ప్లేస్లో సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాల విక్రయం పేరుతో ఉన్న ప్రకటనలకు ఇద్దరు నగరవాసులు స్పందించారు. అందులో ఉన్న నెంబర్లకు సంబంధించిన వీరు బేరసారాలు పూర్తి చేశారు. ఆపై అడ్వాన్సుల పేరుతో రూ.40 వేలు, రూ.74 వేలు చెల్లించి మోసపోయారు. ఇంకో ఉదంతంలో నగరానికి చెందిన ఓ బ్యాంకు డిప్యూటీ మేనేజర్కు సైబర్ నేరగాళ్ళు ఫొన్ చేశారు. తాము ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి మాట్లాడుతున్నామంటూ పరిచయం చేసుకున్నారు. తక్కువ వడ్డీకి భారీ మొత్తం రుణం అంటూ ఎర వేశారు. బాధితుడు అంగీకరించడంతో ఇతడి నుంచి కొన్ని పత్రాలు సైతం వాట్సాప్ చేయించుకున్నారు. చివరకు ప్రాసెసింగ్ ఫీజు సహా ఇతర పేర్లు చెప్పి రూ.40 వేలు కాజేశారు. -
13 సంవత్సరాలుగా వాడింది, కానీ...
కాలిఫోర్నియా: అధిక బరువుతో బాధపడుతున్నారా? మీ చింతను మాకు వదిలేసి మా దగ్గరున్న వస్తువును మీరు తీసుకెళ్లండి. బరువును తగ్గించుకుని ఆనందంగా జీవించండి.. ఇలాంటి యాడ్స్ రోజూ ఎన్నో వస్తుంటాయి. ప్రోడక్ట్ వాడక ముందు, తర్వాత అంటూ ఊదరగొట్టే ఫొటోలతో జనాలను బుట్టలో పడేస్తారు. దీంతో చాలామంది ఆ ప్రోడక్ట్ను కొనడానికి ఉత్సాహం చూపిస్తారు. ఇక్కడ కూడా ఓ మహిళ బరువు తగ్గడం కోసం డైట్ ప్రోడక్ట్ ఏళ్ల తరబడి వాడింది. కానీ, ఎలాంటి ఫలితం కానరాక చివరికి కోర్టుకెక్కింది. వివరాలు.. కాలిఫోర్నియాకు చెందిన షానా బాసెరా అనే మహిళ ఊబకాయంతో బాధపడుతోంది. ఎలాగైనా బరువు తగ్గించుకుకుందామని ప్రముఖ కంపెనీ డా.పెప్పర్కు చెందిన సోడా డైట్ డ్రింక్ను రోజూ వాడటం మొదలు పెట్టింది. అలా 13 సంవత్సరాలు గడిచాయి. కానీ ఆమె బరువులో ఏమాత్రం మార్పు కనిపించలేదు. దీంతో విసుగెత్తిపోయిన మహిళ తను వాడుతున్న సోడా డ్రింక్ కంపెనీపై కోర్టుకెక్కింది. ఈ ప్రోడక్ట్ తనను తప్పుదారి పట్టించిందని ఆరోపించింది. కానీ అనూహ్యంగా కోర్టు ఆమెకు దిమ్మతిరిగే సమాధానమిచ్చింది. మీరు తాగుతున్న సోడా డ్రింక్ను ఆ కంపెనీ ‘డైట్’ అని పేర్కొందే కానీ ఎక్కడా ‘వెయిట్ లాస్’ అని పేర్కొనలేదని స్పష్టం చేసింది. దీన్ని వినియోగదారులు తప్పుగా అర్థం చేసుకున్నంత మాత్రాన కంపెనీ వారిని మోసం చేసినట్టు కాదని వెల్లడించింది. ‘డైట్’ అంటే సాధారణ ఉత్పత్తుల కన్నా తక్కువ కేలరీలు కలిగి ఉండటమని వివరించింది. ప్రకటనలో కనిపించేవాళ్లు అందంగా, స్లిమ్గా ఉన్నవాళ్లు కనిపించినంత మాత్రాన మీరు కూడా అలా మారుతారని కాదని చెప్తూ కేసును కొట్టివేసింది. చదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే.. -
‘థెరపీ’ ప్రకటనలపై గూగుల్ బ్యాన్
శాన్ప్రాన్సిస్కో: శాస్త్రీయంగా నిర్థారణ కాని వైద్య చికిత్సలకు సంబంధించిన ప్రకటనలపై నిషేధం విధిస్తున్నట్లు సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ శుక్రవారం ప్రకటించింది. స్టెమ్ సెల్ థెరపీ, సెల్యూలార్ థెరపీ, జీన్ థెరపీల వంటి శాస్త్రీయంగా పూర్తిగా నిర్ధారణకాని ప్రయోగాత్మక వైద్య విధానాలకు సంబంధించిన యాడ్లు ఇకపై గూగుల్లో కనుమరుగు కానున్నాయని గూగుల్ పాలసీ సలహాదారు ఆడ్రిన్నె బిడ్డింగ్స్ తెలిపారు. బయో మెడికల్, సైంటిఫిక్ ఆధారాలు లేని అన్ని వైద్యవిధానాలు, థెరపీ ప్రకటనల నియంత్రణ కోసం కొత్త పాలసీ తీసుకొచ్చినట్లు ఆమె చెప్పారు. రోగాలతో బాధపడుతున్న వారు ఈ తరహా యాడ్స్ కారణంగా తప్పుదోవ పడుతున్నారని గూగుల్ పేర్కొంది. ఇది మెడికల్ పరిశోధనలను తప్పుబట్టడం కాదని, నిర్థారణ కానటువంటి వాటిపై ఓ కన్నేసి ఉంచడం మాత్రమే అని స్పష్టం చేసింది. దీన్ని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్ అధ్యక్షుడు దీపక్ శ్రీవత్సవ స్వాగతించారు. సంపూర్ణ చికిత్సా విధానాలుగా అభివృద్ధిగాని ఇలాంటి చికిత్సలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటివి ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయన్నారు. ఇలాంటి సందేశాలను నియంత్రించడంలో ఆన్లైన్ సర్వీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. -
ఆ ప్రకటనలపై సానియా ఫైర్
హైదరాబాద్: ప్రపంచకప్లో భాగంగా టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్పై ప్రసారమవుతున్న టీవీ ప్రకటనలపై టెన్నిస్ స్టార్ సానియా అసంతృప్తి వ్యక్తం చేశారు. మతిలేని ప్రకటనలతో మితిమీరిన ప్రచారం అక్కర్లేదని వారించారు. ఈ యాడ్లపై సానియా స్పందిస్తూ ‘సరిహద్దుకు అవతల, ఇవతల వస్తున్న ప్రకటనలు చిరాకు తెప్పిస్తున్నాయి. ఈ మ్యాచ్పై అభిమానులకు ఇప్పటికే కావాల్సినంతగా ఆసక్తి, ఉత్సాహం ఉంది. మీరేమీ అంచనాలు పెంచక్కర్లేదు... మార్కెటింగ్ చేయాల్సిన అవసరమూ లేదు. ఇది కేవలం క్రికెట్ మ్యాచే. ఇంతకు మించి ఎక్కువ ఊహించుకోకండి’ అని ట్విటర్లో పోస్ట్ చేశారు. పాక్కు చెందిన ఓ టీవీలో భారత వింగ్ కమాండర్ అభినందన్ వేష ధారణలో ఉన్న వ్యక్తితో భారత వ్యూహాలపై ఓ వ్యంగ్య ప్రకటన వస్తోంది. ‘అభినందన్ వేషధారణతో, టీమిండియా జెర్సీతో ఓ వ్యక్తి విచారణ గదిలో ఉంటాడు. మీ జట్టు టాస్ గెలిస్తే ఏం చేస్తుంది..ఐయామ్ సారీ నేనది చెప్పకూడదు అని ఆ వ్యక్తి బదులిస్తాడు. పైనల్ టీమ్లో ఎవరెవరు ఉంటారు అని మళ్లీ ప్రశ్నిస్తారు. ఐయామ్ సారీ నేనది చెప్పకూడదు అని ఆ వ్యక్తి అంటాడు. చివరలో టీ ఎలా ఉంది అనే ప్రశ్నకు.. చాలా బాగుంది అంటాడు. ఇక నువ్ వెళ్లొచ్చు అనగానే.. అక్కడ నుంచి ముందుకు కదులుతాడు. అంతలోనే... కప్పు ఎక్కడికి తీసుకెళ్తున్నావ్.. అని చేతిలో నుంచి లాక్కుంటారు’. ఇదిలా ఉండగా.. ఈ ప్రకటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎన్ని టీ కప్పులు కావాలో తీస్కోండి అని చురకలంటిస్తున్నారు. వచ్చే ప్రపంకప్నకు సంబంధించి కూడా మరిన్ని కప్పులు కావాలంటే తీస్కోండని ఎద్దేవా చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ అయింది. -
‘ఫేస్బుక్’కే ఎక్కువ ఎన్నికల యాడ్స్
సాక్షి, న్యూడిల్లీ : పత్రికలు, రేడియో, టీవీ ఛానళ్లతోపాటు సోషల్ మీడియాలో కూడా ఎన్నికల ప్రచార యాడ్స్ జోరందుకున్నాయి. సామాజిక మాధ్యమాలైన గూగుల్, ఫేస్బుక్, ట్విటర్లలో పలు పార్టీలు, అభ్యర్థులు యాడ్స్ ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నారు. ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్ 5 మధ్య 45 రోజుల్లో 830 రాజకీయ యాడ్స్ ప్రచారమయ్యాయని, వాటి ద్వారా 3.76 కోట్ల రూపాయలు వచ్చాయని ప్రధాన ఇంటర్నెట్ సర్చ్ ఇంజన్ ‘గూగుల్’ తాజాగా ఓ నివేదికలో వెల్లడించింది. అయితే ఈ విషయంలో జుకర్బర్గ్ నాయకత్వంలోని ‘ఫేస్బుక్’ మరింత ముందున్నది. 2019, ఫిబ్రవరి మొదటి నుంచి రెండు నెలల కాలంలో 51వేల రాజకీయ యాడ్స్ ద్వారా 10.32 కోట్ల రూపాయలు సమకూరాయని ఓ నివేదికలో తెలిపింది. ఈ విషయంలో ‘ట్విటర్’ బాగా వెనకబడి ఉంది. ప్రముఖ రాజకీయ నాయకుడుగానీ, రాజకీయ పార్టీగానీ ఎన్నికల ప్రచార యాడ్స్ ఇవ్వలేనది ట్విటర్కు చెందిన ‘యాడ్స్ ట్రాన్స్పర్ సెంటర్’ తెలియజేసింది. ఫేస్బుక్కు చెందిన ‘వాట్సాప్’ సందేశ పోర్టల్లో యాడ్స్ను ప్రసారం చేయకపోవడం గమనార్హం. ట్విటర్ కన్నా ఫేస్బుక్కు ఎక్కువ యాడ్స్ రావడానికి కారణంగా దేశంలో ఫేస్బుక్కు 30 కోట్ల మంది ఖాతాదారులు ఉండగా, ట్విటర్కు కేవలం మూడున్నర కోట్ల మంది మాత్రమే ఉన్నారు. దేశంలో ఉన్న 90 కోట్ల మంది ఓటర్లతో పోలిస్తే ఈ సంఖ్య పెద్ద ఎక్కువేమి కాదు. సోషల్ మీడియాలో నకిలీ వార్తలు ప్రసారం అవుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు, పార్టీలు సోషల్ మీడియాలో యాడ్స్ ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నారు. యాడ్స్ విషయంలో పాలకపక్ష బీజేపీ ఎంతో ముందుండగా, కాంగ్రెస్ పార్టీ బాగా వెనకబడింది. ఫేస్బుక్కు 1.5 కోట్లు, గూగుల్కు 1.2 కోట్ల యాడ్స్ను బీజేపీ ఇవ్వగా, కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్కు 5.6 లక్షలు, గూగుల్కు కేవలం వేల రూపాయల్లోనే ఇచ్చింది. ఎన్నికల కమిషన్ ముందస్తు అనుమతి తీసుకొనే రాజకీయ పార్టీలైనా, నాయకులైనా సోషల్ మీడియాలో యాడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో పారదర్శకత పాటిస్తామని ఫేస్బుక్, గూగుల్, ట్విటర్లు ఇదివరకే ప్రకటించాయి. ఇక టీవీ, రేడియో ఛానళ్లు, ప్రింట్ మీడియాలో పాలకపక్ష బీజేపీ యాడ్స్కు, కాంగ్రెస్ పార్టీ యాడ్స్కు మధ్య వ్యత్యాసం నింగీ నేలకున్న దూరమంత ఉంది. బీజేపీ ప్రచారానికన్నా ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారానికే ఎక్కువ యాడ్స్ ఇస్తున్నారు. ఈ యాడ్స్కైన డబ్బుతో ఏడాదిపాటు నాలుగున్నర కోట్ల మంది బడి పిల్లలకు మధ్యాహ్నం భోజనం సరఫరా చేయవచ్చని ‘ఫస్ట్ పోస్ట్’ వెబ్సైట్ అంచనా వేసింది. -
ప్రకటనలు.. ప్రచారం ఒక్క చోటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏ ఉత్పత్తయినా లకి‡్ష్యంచిన కొనుగోలుదారులకు చేరాలంటే నాణ్యతతో పాటూ బ్రాండ్ ఇమేజ్ తప్పనిసరి! దీనికోసం సెలబ్రిటీల ఎంపిక, ప్రకటనలు, ప్రచారం... ఇవన్నీ పెద్ద టాస్కే. కానీ, విజయవాడకు చెందిన రీసెర్చ్ మీడియా గ్రూప్ దీన్ని సులభతరం చేసింది. సెలబ్రిటీల ఎంపిక కోసం సెలబ్రిటీ హబ్, ప్రకటనల కోసం న్యూవేవ్ అడ్వర్టయిజింగ్, ప్రొడక్షన్ హౌస్ సేవల కోసం రీసెర్చ్ మీడియా ఎంటర్టైన్మెంట్, ఈవెంట్ల నిర్వహణ కోసం మ్యాజిక్ మంత్ర... ఇలా అన్ని సేవలనూ అందిస్తున్న రీసెర్చ్ మీడియా గ్రూప్. మరిన్ని వివరాలు సంస్థ చైర్మన్ జే చైతన్య ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. చిన్న ప్రకటనల సంస్థగా మా ప్రస్థానం మొదలైంది. ఇపుడు కార్పొరేట్ ఈవెంట్స్, సెలబ్రిటీ మేనేజ్మెంట్ స్థాయికి చేరాం. ప్రస్తుతం రీసెర్చ్ మీడియా గ్రూప్లో సెలబ్రిటీ హబ్, మేజిక్ మంత్ర, న్యూవేవ్ అడ్వర్టయిజింగ్, రీసెర్చ్ మీడియా గ్రూప్ ఎంటర్టైన్మెంట్స్, పింక్ పీఆర్ లైన్స్, కీ హైట్స్ అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. ఇప్పటివరకు రీసెర్చ్ మీడియా గ్రూప్కు 18 వేల మంది కార్పొరేట్స్ క్లయింట్లున్నారు. వీటిలో రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి కార్పొరేట్ ఆసుపత్రులు, ఉత్పత్తుల తయారీ కంపెనీల వరకూ అన్నీ ఉన్నాయి. త్వరలోనే కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ), కామినేని, కేర్ ఆసుపత్రులు, ప్రక్రియ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మా క్లయింట్ల జాబితాలో చేరనున్నాయి. ఇదీ... మా కంపెనీల తీరు సెలబ్రిటీ హబ్: 2014లో విజయవాడ కేంద్రంగా ప్రారంభమైంది. దీనికి విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై, గోవా, బెంగళూరు, ముంబైలో బ్రాంచీలున్నాయి. సెలబ్రిటీల ఎంపిక కోసం ముంబైకి చెందిన సిమ్కామ్ మోడల్, చిరాక్ మేనేజ్మెంట్స్, జాకీ ఫెర్నాండెస్, పినాకిల్ రూడ్జ్, ది క్వీన్స్, ఎవాన్ ఎంటర్టైన్మెంట్స్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం సెలబ్రిటీ హబ్లో 40 వేల మంది సినీ ప్రముఖులున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, దుబాయ్, మలేషియా, బ్యాంకాక్, శ్రీలంక వంటి దేశాల్లోని కార్యక్రమాలకూ తారలను అందించాం. మ్యాజిక్ మంత్ర: 2012లో ప్రారంభమైన ఈ సంస్థ కార్పొరేట్, వ్యక్తిగత ఈవెంట్లను నిర్వహిస్తుంది. గతేడాది రూ.40 కోట్ల టర్నోవర్ను చేరుకున్నాం. న్యూవేవ్: విజువల్ యాడ్స్ రూపకల్పన కోసం న్యూవేవ్ అడ్వర్టయిజింగ్ పనిచేస్తుంది. టీవీ సీరియల్స్, సినిమాల చిత్రీకరణ కోసం అవసరమైన ప్రొడక్షన్ హౌస్ సేవల కోసం రీసెర్చ్ మీడియా ఎంటర్టైన్మెంట్ పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు 16 టీవీ సీరియల్స్కు సేవలందించాం. రూ.100 కోట్లు లక్ష్యం.. ప్రస్తుతం రీసెర్చ్ మీడియా గ్రూప్లో 300 మంది ఉద్యోగులున్నారు. గతేడాది రూ.60 కోట్ల వ్యాపారాన్ని చేరుకున్నాం. ఈ ఏడాది రూ.100 కోట్లు లకి‡్ష్యంచాం. త్వరలోనే సొంత బ్యానర్పై తెలుగు, హిందీ చిత్రాల నిర్మాణంతో పాటూ జాతీయ స్థాయిలో మిస్ ఇండియా పోటీలను నిర్వహించనున్నాం’’ అని చైతన్య వివరించారు. -
వాట్సాప్ స్టేటస్తో సంపాదన
ఒకటి కాదు.. రెండు కాదు.. పదేళ్లు! ప్రకటనలనేవి లేకుండా వాట్సాప్ నడిచిన కాలమిది! ఇకపై ఆ గ్యారెంటీ లేదు. ఎందుకంటారా? వాట్సాప్లోని స్టేటస్ సెక్షన్ను సంపాదనకు వాడుకోవాలని ఆ కంపెనీ నిర్ణయించింది! అదే అందులోనూ ప్రకటనల హోరు త్వరలోనే మొదలు కానుంది! వెబ్సైటైనా.. మొబైల్ యాప్ అయినాసరే.. ప్రకటనలు తప్పనిసరన్నది తెలిసిన విషయమే. కాకపోతే చాటింగ్ యాప్గా ప్రస్థానం మొదలుపెట్టిన వాట్సాప్ మాత్రం ఇందుకు భిన్నమనే చెప్పాలి. ఫేస్బుక్ చేతుల్లోకి వెళ్లిపోగానే ఉచిత సర్వీసులకు తెరపడుతుందని అనేక వదంతులొచ్చాయి. దాదాపు రూ.1.2 లక్షల కోట్లు పెట్టి కొనుక్కున్న ఈ ప్లాట్ఫాం నుంచి అంతకంత రాబట్టు కునేందుకు ఫేస్బుక్ రూపకర్త జుకర్బర్గ్ ప్రయత్నిస్తా రని అంతా అనుకున్నారు. అయితే ఈ వార్తలను ఫేస్బుక్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. అయితే తాజాగా భారత్ పర్యటనలో ఉన్న వాట్సాప్ వైస్చైర్మన్ క్రిస్ డేనియల్స్ ఈ అనుమానాలకు తెరదించారు. భవిష్యత్తులో వాట్సాప్ స్టేటస్ను యాడ్లకు వాడుకుంటామని ప్రకటించారు. ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నది మాత్రం స్పష్టత లేదు. ‘అధిక లాభాల కోసం వినియోగదారుల వ్యక్తిగత గోప్యతను అమ్మేసుకున్నా. ఈ విషయంలో రాజీపడ్డాను. ప్రతిరోజూ ఈ విషయం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. టార్గెటెడ్ యాడ్స్ ద్వారా డబ్బు సంపాదించాలని ఫేస్బుక్ సీఈవో జుకర్బర్గ్ ఎప్పుడో ప్రణాళిక సిద్ధం చేశాడు’. – బ్రాయన్ యాక్టన్, వాట్సాప్ రూపకర్త స్టేటస్లోనే ఎందుకు? యాడ్ల కోసం వాడుకునేందుకు వాట్సాప్.. స్టేటస్నే ఎందుకు ఎన్నుకుంది.. చాటింగ్ విండోతో పాటు అనేక అవకాశాలు ఉన్నాయి కదా.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే స్టేటస్ ఫీచర్ గురించి ముందు తెలుసుకోవాలి. స్టేటస్ అప్డేట్ అనేది 24 గంటలు మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. ఈ విషయం దాదాపు చాలా మందికే తెలుసు. ఉదయాన్నే ‘ఫీలింగ్ హ్యాపీ’అని స్టేటస్ పెట్టారనుకోండి. అలాగే సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేశారనుకోండి.. సరిగ్గా 24 గంటల తర్వాత ఆ స్టేటస్ ఉండదు. మీ స్టేటస్తో పాటు వచ్చే యాడ్లు కూడా 24 గంటలే ఉంటాయన్న మాట. ఇంకోలా చెప్పాలంటే.. మీ అభిరుచులు, మీరున్న ప్రాంతం వంటి అనేక వివరాలను పరిగణనలోకి తీసుకుని మీకు తగిన ప్రకటనలను స్టేటస్ ఫీచర్లోకి కంపెనీ జొప్పిస్తుందన్నమాట! వ్యక్తిగత అభిరుచులకు తగ్గట్టు ప్రకటనలను వాల్పై పోస్ట్ చేసేందుకు ఫేస్బుక్లో ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్.. వాట్సాప్కు ఎలాగూ ఉపయోగ పడుతుందని అంచనా. ఇవీ ప్రత్యామ్నాయాలు డిస్కార్డ్.. ఈ క్రాస్ ప్లాట్ఫాం ముఖ్యంగా గేమర్స్ కోసం ఉద్దేశించింది. అన్నిరకాల స్మార్ట్ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్స్తో పాటు వెబ్క్లయింట్ కూడా ఉంది. తమదైన సర్వర్లను తయారు చేసుకోగలగడం దీని కున్న ఇంకో ప్రత్యేకత. వాయిస్, చాటింగ్ ఫీచర్లు ఓ మోస్తరుగానే ఉన్నా ఆర్గనైజేషన్ సిస్టమ్స్ బాగుంటుందని ఈ ప్లాట్ఫాంను వాడేవారు చెబుతుంటారు. అల్లో /హ్యాంగౌట్స్.. హ్యాంగౌట్స్ గురించి ఇప్పటికే చాలామందికి తెలుసుగానీ.. గూగుల్ సృష్టించిన తాజా మెసెం జర్ ప్లాట్ఫాం అల్లో వివరాలు మాత్రం పెద్దగా తెలియవు. గూగుల్ అసిస్టెంట్తో అనుసంధా నమైన ప్లాట్ఫాం ఇది. గూగుల్ డుయో సపోర్ట్ కూడా ఉంటుంది. ఇతరులు గుర్తించకుండా చాటింగ్ చేసేందుకు ఇందులో ఇన్కాగ్నిటో మోడ్ కూడా ఉంటుంది. కిక్.. మన పేరు, ఫోన్ నంబర్ల స్థానం లో ఇతర పేర్లను యూజర్ ఐడీ లుగా వాడుకునేందుకు అవకాశం కల్పించే మెసెంజర్ ప్లాట్ఫాం ఇది. మొబైల్ గేమర్స్, పరిచయంలేని వారితోనూ మాటలు కలపాలను కునే వారికి మెరుగైన ప్లాట్ఫాం. ఇవేకాక స్నాప్చాట్, టెలీగ్రామ్, వైబర్, స్కైప్ వంటివెన్నో. -
ఆర్టీసీలో కానరాని కోడ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ ప్రకటనలు, ఫ్లెక్సీలపై ఈసీ ఆంక్షలు విధించింది. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఎక్కడా ఎలాంటి ప్రభుత్వ ప్రకటనలు ఉండరాదు. రాష్ట్రమంతా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా.. ఆర్టీసీలో మాత్రం ఇంకా ఇది అమలు కావడం లేదు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ఫ్లెక్సీలు, నేతల చిత్రాలను తొలగిస్తున్నారు. ఇప్పటికే మొదలైన ఈ ప్రక్రియ క్రమంగా ఊపందుకుంటోంది. ఇంకా మొదలుపెట్టని ఆర్టీసీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి మూడురోజులవుతున్నా ఆర్టీసీ దీనిపై పెద్దగా దృష్టి సారించలేదు. టీఎస్ఆర్టీసీ ప్రజారవాణా సంస్థ. ఆర్టీసీ బస్సులపై వివిధ రకాల వాణిజ్య ప్రకటనల ద్వారా సంస్థకు ఆదాయం సమకూరుతుంది. వీటిలో ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రకటనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కార్మికశాఖ, రవాణాశాఖ, శిశుసంక్షేమ శాఖ తదితర శాఖలు తాము అమలు చేస్తోన్న పలు పథకాలు, వాటి పురోగతిపై ప్రచారం కోసం ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకుంటున్నాయి. కోడ్ అమల్లోకి వచ్చిన దరిమిలా వీటిని తొలగించాల్సిన బాధ్యత ఆర్టీసీపై ఉంది. కానీ, ఇంతవరకూ ఇది అమలుకు నోచుకోవడం లేదు. ప్రతిపక్షాల విమర్శలు.. ప్రతిరోజూ కోటి మందికిపైగా ప్రయాణించే ఆర్టీసీలో ప్రభుత్వ ప్రకటనలు ఇంకా అలాగే ఉండటంపై ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. ఆర్టీసీ చైర్మన్ అధికార పార్టీకి చెందిన వ్యక్తి అయినందునే ప్రకటనల తొలగింపుపై ఉదాసీనంగా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేతలంతా దీన్ని కోడ్ ఉల్లంఘనగానే ఆరోపిస్తున్నారు. ప్రయాణికులను ప్రభావితం చేసే ఈ పోస్టర్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అన్నింటినీ తొలగిస్తాం కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వాణిజ్య ప్రకటనలను తొలగిస్తాం. ఈ దిశగా ఇప్పటికే ఆదేశాలిచ్చాం. తొలగింపు ప్రక్రియ మొదలైంది. దాదాపు 3000 బస్సులపై ఈ ప్రకటనలున్నాయని సమాచారం. రెండుమూడురోజుల్లో అన్ని బస్సుల్లోనూ తొలగిస్తాం. – రవీందర్, సీటీఎం, (యాడ్స్) -
రావణ బ్రహ్మలు
లార్డ్ గణేశ్.. యానిమేషన్కు ఓ క్యారెక్టర్ అయ్యాడు.రావణుడు.. యాడ్స్కి మోడల్ అయ్యాడు. తలనొప్పి మాత్రల నుంచి భావోద్వేగాల వరకు ప్రకటనలకు ఆయన పదితలలు పనికొచ్చినట్టుగా ఇంకే పౌరాణిక పాత్రా మేకప్ వేసుకోలేదు. ఇటీవలే నిమజ్జనం కాబట్టి గణేశ్ ఇంకా వార్తల్లో ఉన్నాడు అనుకోవచ్చు. మరి హఠాత్తుగా రావణుడి ప్రస్తావన ఎందుకు? ఎందుకంటే ఆయన బొమ్మల తయారీకి టైమ్ వచ్చింది కనుక. ఢిల్లీ ఆ పనిలో అప్పుడే బిజీ అయిపోయింది కూడా. దసరాకి ఉత్తర భారతంలో రావణ దగ్ధం ఓ ఘట్టం. అందుకు రావణుడి దిష్టిబొమ్మలు కావాలి కదా. తితార్పూర్ ఇప్పుడు ఆ పనిలో ఉంది. ఢిల్లీలోని సుభాష్నగర్కి టాగోర్ గార్డెన్స్కీ మధ్యలో ఉంటుంది తితార్పూర్. మెట్రోలో వెళ్లాలంటే బ్లూలైన్ పట్టుకోవాలి. ఇదొక అర్బన్ విలేజ్. దీన్ని రావణ సూపర్మార్కెట్ అని పిలిచుకుంటారు అర్బన్ ఫోక్స్ (పురజనులు). ఎందుకంటే ఆసియాఖండంలోనే అతిపెద్ద దిష్టిబొమ్మల మార్కెట్ ఇది. దసరా సమయంలో రావణ, మేఘనా«థుడు (రావణుడి కొడుకు), కుంభకర్ణుడి బొమ్మలు చేస్తారు. మిగిలిన రోజుల్లో ఎవరు ఏ బొమ్మలు (రాజకీయ నాయకులు ఎట్సెట్రా) చేయమని ఆర్డర్ ఇస్తే అవి చేసిపెడ్తారు. తితార్పూర్ ఫుట్పాత్లన్నీ రావణుడి తలలు, చేతులు, కాళ్లు, అవయవాలతో నిండి ఉంటాయి. ఇంకోవైపు.. తయారైన రంగురంగుల దిష్టిబొమ్మలు. వీటిని కొనుక్కునేవాళ్లతోనే కాదు.. ఫొటోలు తీసుకునే విదేశీయులు, దేశీ టూరిస్ట్లతోనూ తితాపూర్ కిటకిటలాడుతూ ఉంటుంది దసరా వరకు. 2 నుంచి 80 అడుగుల వరకు వెదురు బద్దలతో ముందు రావణుడి దేహాకృతిని తయారు చేస్తారు. తర్వాత దాంట్లో అన్నీ గుడ్డముక్కలు కుక్కుతారు. పటాసులూ పెడ్తారు (పటాసులు కూడా కావాలని కోరుకున్న వాళ్లకు మాత్రమే పటాసులు పెట్టి తయారు చేసిస్తారు). పైనుంచి మళ్లీ ఓ గుడ్డను చుట్టి.. తర్వాత రంగురంగుల కాగితాలతో తల నుంచి కాళ్ల వరకు అతికించేస్తారు. ఇప్పుడు పెయింట్తో కళ్లు, ముక్కు, చెవులు, నోరు గీస్తారు. దాంతో రావణుడి దిష్టిబొమ్మ రెడీ. ఈ బొమ్మలు రెండు అడుగుల నుంచి దాదాపు 80 అడుగుల ఎత్తు వరకు రకరకాల సైజుల్లో దొరుకుతాయి. అయిదు వందల నుంచి లక్షరూపాయల వరకు ధరలుంటాయి. బాహుబలి.. డ్రాక్యూలా దసరా వస్తోందంటే రావణుడి దిష్టిబొమ్మలకు చాలా గిరాకీ ఉంటుంది. రావణుడిని రావణుడి ఆకారంలోనే కాక తమకు ఇష్టమైన వారి ఆకారంలో కూడా తయారు చేసివ్వమని అడుగుతుంటారట కస్టమర్లు. కిందటేడు బాహుబలి, డ్రాక్యూలా షేప్లో రావణుడి బొమ్మలు కావాలని మహా డిమాండ్ వచ్చిందట. ఇంకొంత మంది తమకు నచ్చిన దుస్తుల్లో రావణుడిని అలంకరించమంటారట. కాని ఈ తయారీదారులు ఇలాంటి వాటికి ‘నో’ అని సమాధానం చెప్తారు చాలా సింపుల్గా. ‘‘ఎంతైనా రావణుడే కదా మాకు అన్నదాత. ఆయన బొమ్మలు అమ్మే కదా మా పొట్టనింపుకుంటున్నాం. మాకు అన్నంబెట్టే ఆ దేవుడిని అతని రూపంలో కాకుండా వేరే వేరే రూపాల్లో తయారు చేయడమంటే ఆ దేవుడిని అవమానించినట్టే కదా! అందుకే కలర్స్, డిజైన్ ఎలిమెంట్స్ తప్ప ఇంక వేటినీ కస్టమైజ్ చేయం’’ అంటాడు రాజు అనే తయారీదారుడు. దహనం చేస్తున్నప్పుడు ఏమైనా ఫీలవుతారా? అని అడిగితే.. ‘‘బాధనిపిస్తుంటుంది.. ఈ చేతులతో తయారు చేస్తాం కదా... కాని ఏంచేస్తాం? పండగలో భాగం. అదొక సంప్రదాయం’’ అని సమాధానమిస్తాడు శంకర్ అనే ఇంకో తయారీదారుడు. సీజన్ అయ్యాక ఇంట్లో శిక్షణ ఈ సంచార కమ్మరులు దిష్టిబొమ్మల తయారీని ఓ పరిశ్రమగా కాక కళగానే చూస్తారు. సీజన్ అయిపోయాక ఇంట్లో ఉన్న పిల్లలకు ఈ కళను నేర్పిస్తుంటారు. వెదురుబద్దలను ఎండబెట్టడం.. వాటిని చీల్చడం.. బొమ్మల్లా చేయడం, రంగులు తయారు చేయడం.. రంగుల ఎంపిక.. కనుముక్కు తీరు గీయడం... వంటివాటన్నిటిలో శిక్షణనిస్తారు. చాలా మంది పిల్లలు బడికి వెళ్తూనే తమ పెద్దవాళ్ల దగ్గర ఈ కళనూ అభ్యసిస్తున్నారు. పనిముట్ల తయారీలో వచ్చే లాభం కన్నా సీజన్లో దిష్టిబొమ్మల ద్వారా సంపాదించేదే ఎక్కువ అని చెప్తారు. ఎవరీ రావణబ్రహ్మలు? కమ్మరుల్లో సంచార కమ్మరులు ఈ దిష్టిబొమ్మలు చేసేవారు. రాజస్థాన్కు చెందిన గడియా లోహార్ తెగవాళ్లు మేవాడ్ రాజు మహారాణా ప్రతాప్ సైన్యంలో ఉండేవారట. అక్బర్తో జరిగిన యుద్ధంలో మహారాణా ప్రతాప్ ఓడిపోవడంతో ఆ అవమానం తట్టుకోలేక తిరిగి విజయం సాధించే వరకు ఆ రాజ్యంలో అడుగుపెట్టమని ప్రతిజ్ఞచేసి మరీ మేవాడ్ను వదిలారట. అలా చెట్టుకొకరు.. పుట్టకొకరుగా చెల్లా చెదురై సంచారం కొనసాగించారట. వాళ్ల వారసులమే అని తమ చరిత్ర చెప్తారు వీళ్లు. కర్ణాటకతోపాటు మన దగ్గర కనిపించే లండాలు కూడా ఈ తెగవారే అంటారు. తితార్పూర్లో ఉంటున్న గడియా లోహార్స్ సీజన్లో దిష్టిబొమ్మలను చేస్తూ మిగిలిన సమయంలో ఇనుప వస్తువులు తయారు చేస్తూ జీవనం సాగిస్తారు. – శరాది -
ప్రజాధనంతో సొంత ప్రచారమా?
సాక్షి, అమరావతి: అడ్వర్టయిజ్మెంట్ల (ప్రకటనలు)కు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత ప్రచారం చేసుకుంటున్నారని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత, ప్రముఖ సామాజిక కార్యకర్త సందీప్ పాండే విమర్శించారు. పార్టీ ఇమేజ్ పెంచుకోవడానికి ప్రజాధనాన్ని కుమ్మరిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా ప్రజాధనాన్ని పబ్లిసిటీ (ప్రచారం) కోసం ఖర్చు చేస్తున్నది చంద్రబాబు ప్రభుత్వమేనని వెల్లడించారు. ఎన్నికల ఏడాది కావడంతో మరింత ప్రజాధనం దుర్వినియోగం చేసేలా టీడీపీ ప్రభుత్వం ప్రకటనలు ఇస్తోందని మండిపడ్డారు. విజయవాడ ప్రెస్క్లబ్లో ఏపీకి చెందిన సామాజికవేత్త బి.రామకృష్ణంరాజుతో కలిసి సందీప్పాండే సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజాధనంతో ప్రభుత్వాలు ఇచ్చే ప్రకటనలు (యాడ్స్), ప్రచార హోర్డింగ్ల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు మార్గదర్శకాలను టీడీపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాయావతి తన విగ్రహాలు తయారు చేయించుకుని ప్రధాన కూడళ్లలో పెట్టుకోవడం దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీసిందని గుర్తు చేశారు. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం మాయవతికి మించి సొంత పార్టీ ప్రచారానికి ప్రకటనలు ఇవ్వడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలు, కార్యక్రమాలకు ప్రధానమంత్రి అనే పదాన్ని ఉపయోగిస్తున్నారే తప్ప మోదీ పేరు పెట్టడం లేదని, ఏపీలో మాత్రం ఎన్టీఆర్, చంద్రన్న పేర్లతో పథకాలు అమలు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్ ఫొటోలతో ప్రకటనలు, హోర్డింగ్లు, పబ్లిసిటీని ప్రజాధనంతో చేసుకుంటూ పార్టీకి ఇమేజ్ వచ్చేలా వ్యవహరిస్తున్న తీరు మారాల్సి ఉందన్నారు. చంద్రబాబు సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ఏడాదిలోనైనా ప్రభుత్వ సొమ్ముతో పార్టీ ఇమేజ్ పెంచుకునే తరహా ప్రకటనలు, పబ్లిసిటీ మానుకోవాలని హితవు పలికారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనలపై సుప్రీం కోర్టు పలు మార్గదర్శకాలు ఇచ్చిందని సందీప్పాండే, రామకృష్ణంరాజు చెప్పారు. 13/2003, 302/2012(సివిల్)ల రిట్ పిటిషన్లపై 2015 మే 13, ఈ ఏడాది మార్చి 18న సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను వివరించారు. ♦ ప్రకటనల్లో ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, గవర్నర్ ఫొటోలు వాడుకోవడం వరకు ఫర్వాలేదు. ప్రధాని, ముఖ్యమంత్రి ఫొటోలు వాడకుంటే వారికి బదులు ఆయా ప్రభుత్వ శాఖల మంత్రుల ఫొటోలు వాడుకోవచ్చు. ♦ ప్రజా ప్రయోజనం లేని ప్రకటనలకు ప్రజాధనాన్ని వెచ్చించకూడదు. ♦ఒక వ్యక్తికి గానీ, రాజకీయ పార్టీకి గానీ, ప్రభుత్వానికిగానీ ప్రచారం కల్పించే విధంగా ఉండరాదు. ♦ ప్రజాధనాన్ని ఖర్చు చేసే విషయంలో ప్రభుత్వాలు అత్యంత జాగరుకతతో వ్యవహరించాలి. ♦ పౌరులకు వారి హక్కులు, బాధ్యతలు తెలియజెప్పే విధంగా, ప్రభుత్వ వి«ధానాలు, సేవలు, ప్రభుత్వ చొరవతో తీసుకునే కార్యక్రమాలు, ప్రజారోగ్యం, పరిసరాలు, భద్రత మొదలైన విషయాలపై ప్రకటనలు ఉండాలి. ♦ రాజకీయ పార్టీల చిహ్నాలు, గుర్తులు, జెండాలు ప్రభుత్వ ప్రకటనల్లో ప్రదర్శించకూడదు. ♦ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ఏ పథకమైనా కొన్ని దశాబ్దాలపాటు కొనసాగుతాయి కాబట్టి పథకాలకు అధికార పార్టీ నాయకుల, వ్యక్తుల పేర్లను పెట్టి కొనసాగించడం సబబుకాదు. ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీలోని అధికార పార్టీ నేతల ప్రచారానికి ప్రజాధనంతో ఇచ్చే ప్రకటనలు ఎన్నికల్లో వారి గెలుపుకోసం ఉపయోగించుకునే విధంగా ఉంటున్నాయని సందీప్పాండే వివరించారు. రాష్ట్రంలో 30 పథకాలకు ఇమేజ్ పెంచుకునే పేర్లే.. ఏపీలో ఏకంగా 30 పథకాలకు సొంత పార్టీ ఇమేజ్, వ్యక్తుల ఇమేజ్ పెంచుకునేలా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని సందీప్పాండే, రామకృష్ణంరాజు చెప్పారు. అన్న, చంద్రన్న, ఎన్టీఆర్ పేర్లతో పథకాలు, ప్రకటనలు ఇవ్వడం సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధమన్నారు. ఎన్టీఆర్ పేరుతో పెన్షన్ పథకం, సుజల స్రవంతి, జలసిరి, విద్యోన్నతి, వైద్యసేవ, వైద్య పరీక్ష, ఆశయం, విదేశీ విద్యాదారణ, ఎన్టీఆర్ గృహనిర్మాణం వంటి పథకాలు అమలు జరుగుతున్నాయన్నారు. అన్న అమృతహస్తం, అన్న సంజీవిని, అన్న క్యాంటిన్, అన్న దీవెన, అన్న అభయహస్తం పేరుతో ఎన్టీఆర్ పేరు గుర్తొచ్చేలా చేసి పార్టీ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం జరుగుతోందన్నారు. చంద్రన్న పేరుతో చంద్రన్న బాట, చంద్రన్న బీమా, చంద్రన్న విదేశీ విద్యాదీవెన, విద్యోన్నతి, స్వయం ఉపాధి, సంచార చికిత్స, ఉన్నత విద్యదీపం, తోఫా, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, రైతునేస్తం, భూసార పరీక్షలు, చేయూత, కాపు భవన్లు, డ్రైవర్ల ప్రమాద బీమా, చంద్రన్న పెళ్లికానుక వంటి పేర్లతో సొంత ఇమేజ్ పెంచుకుని పార్టీకి మేలు జరిగేలా ప్రజాధనాన్ని ఖర్చుపెడుతున్నారని వారు తప్పుబట్టారు. ఇప్పటికైనా ఈ పథకాలకు ముందున్న ఎన్టీఆర్, అన్న, చంద్రన్న పేర్లు మార్పుచేసి ‘ముఖ్యమంత్రి’ పేరు పెట్టుకోవడం మంచిదని, అలా అయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎన్ని ఏళ్లు అయినా ఈ పథకాలు అదే పేరుతో కొనసాగుతాయని సందీప్పాండే, రామకృష్ణంరాజు సూచించారు. -
డిజిటల్ యాడ్స్లో ‘అడ్వాంటేజ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెట్టాప్ బాక్సుల తయారీలో ఉన్న ఎక్స్జా ఇన్ఫోసిస్టమ్స్ డిజిటల్ ప్రకటనలకై కొత్త వేదికను అభివృద్ధి చేసింది. ‘అడ్వాంటేజ్’ పేరుతో తొలుత కేబుల్ టీవీ ద్వారా వీక్షకులకు చేరువ కానుంది. టీవీ రిమోట్ను ఆపరేట్ చేస్తున్న సమయంలో మాత్రమే చిన్న సైజులో ప్రకటనలు తెరపై ప్రత్యక్షమవుతాయి. వీక్షకులు అవసరమైతే ఆ ప్రకటనను రిమోట్లో ప్రత్యేక బటన్ను నొక్కడం ద్వారా స్క్రీన్ మీద పెద్దగా చూసుకోవచ్చు. అడ్వాంటేజ్ ద్వారా కేబుల్ ఆపరేటర్లకు అదనపు ఆదాయం సమకూరుతుందని ఎక్స్జా ఎండీ జాయ్ కొక్కట్ తెలిపారు. డైరెక్టర్లు సోన్యా రాయ్, విశాల్ మల్హోత్రా, అద్నాన్ ధులియావాలాతో కలిసి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. అతి తక్కువ ఖర్చుతో: అడ్వాంటేజ్ సేవలను మొదట తెలంగాణలో ప్రారంభిస్తున్నట్టు జాయ్ కొక్కట్ చెప్పారు. ‘కేంద్రీకృత వ్యవస్థ ద్వారా ప్రకటనలు నియంత్రిస్తాం. ట్రాయ్ పరిమితులకు లోబడే ఈ ఫీచర్ను అభివృద్ధి చేశాం. వీక్షకులున్న ప్రాంతం, భాష ఆధారంగా ప్రకటనలు మార్చవచ్చు. ఇతర ప్రకటనలతో పోలిస్తే 1/8 వంతు మాత్రమే ప్రకటనదారుల నుంచి చార్జీ వసూలు చేస్తాం. వీడియో యా డ్స్కు సైతం టెక్నాలజీ రూపొందించాం. భారత్లో 14 మంది, విదేశాల్లో ఇద్దరు కేబుల్ ఆపరేటర్లు మా కస్టమర్లు’ అని తెలిపారు. దేశవ్యాప్తంగా 35 లక్షల గృ హాల్లో ఎక్స్జా సెట్టాప్ బాక్సులు వాడుతున్నారు. -
ప్రకటనల ఆదాయంపై పన్ను కట్టాల్సిందే
న్యూఢిల్లీ: గూగుల్ ఇండియా వాదన ఆదాయపన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్లోనూ (ఐటీఏటీ) గెలవలేదు. గూగుల్ ఐర్లాండ్ లిమిటెడ్కు జమచేసిన ప్రకటనల ఆదాయంపై గూగుల్ ఇండియా పన్ను చెల్లించాలన్న ఆదాయపన్ను శాఖ డిమాండ్ను ఐటీఏటీ సమర్థించింది. ఈ మేరకు ఐటీఏటీ బెంగళూరు బెంచ్ 331 పేజీలతో కూడిన ఆదేశాలను జారీ చేసింది. గూగుల్ ఇండియా పంపించే ఆదాయం రాయల్టీ కనుక, అది పన్ను పరిధిలోకి వస్తుందని ఆదాయపన్ను శాఖ చేసిన వాదనను ట్రిబ్యునల్ సమర్థించింది. అయితే, ఈ ఆదేశాలను హైకోర్టులో సవాలు చేస్తామని గూగుల్ తెలిపింది. ప్రకటనల స్పేస్ను కొనుగోలు చేసి దాన్ని తిరిగి భారత్లో ప్రకటనదారులకు గూగుల్ యాడ్వర్డ్స్ కార్యక్రమం కింద విక్రయిస్తున్నామని... అలా ఆర్జించిన ఆదాయాన్నే గూగుల్ ఐర్లాండ్కు పంపిస్తున్నామని... కాబట్టి ఇది పన్ను పరిధిలోకి రాదని గూగుల్ తన పిటిషన్లో పేర్కొంది. 2012–13 ఆర్థిక సంవత్సరానికిగాను మూలం వద్ద పన్ను కోయకుండా గూగుల్ ఇండియా రూ.1,114.91 కోట్లను గూగుల్ ఐర్లాండ్ లిమిటెడ్కు చెల్లించినట్టు ఆదాయపన్ను శాఖ గుర్తించింది. దీంతో రూ.258.84 కోట్లు చెల్లించాలని కోరుతూ ట్యాక్స్ డిమాండ్ను జారీ చేసింది. అయితే, గూగుల్ యాడ్వర్డ్స్ కార్యక్రమానికి తాను ఏకైక డిస్ట్రిబ్యూటర్గా ఉన్నానని, గూగుల్ ఐర్లాండ్కు చెల్లించే డిస్ట్రిబ్యూషన్ ఫీజును ‘హక్కు బదిలీ’ లేదా పేటెంట్ను వినియోగించుకునే హక్కుగా చూడరాదని, దీన్ని రాయల్టీగా భావించి పన్ను వేయరాదని గూగుల్ ఇండియా వాదిస్తోంది. ఈ వాదనతో ఐటీఏటీ ఏకీభవించలేదు. -
డిజిటల్ యాడ్ మార్కెట్ రూ.12వేల కోట్లకు!
ముంబై: డిజిటల్ మాధ్యమం ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో కంపెనీలు ఈ తరహా ప్రకటనలపై మరింతగా వెచ్చిస్తున్నాయి. డిజిటల్ ప్రకటనలపై కంపెనీలు చేస్తున్న వ్యయాలు ఏటా 30% పెరుగుతున్నాయి. 2017 ఆఖరుకి రూ. 9,266 కోట్లుగా ఉన్న ఈ వ్యయాలు.. ఈ ఏడాది చివరికి రూ.12,046 కోట్లకు చేరనున్నాయి. డిజిటల్ ప్రకటనలపై గతేడాది భారత్లో కంపెనీల వ్యయాలపై ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ (ఐఏఎంఏఐ), కాంటార్ ఐఎంఆర్బీ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2017 ఆఖరు నాటికి వివిధ మాధ్యమాల్లో మొత్తం ప్రకటనల వ్యయాలు రూ. 59,000 కోట్లు కాగా.. అందులో డిజిటల్ అడ్వర్టైజింగ్ వ్యయాల వాటా 16%. విభాగాల వారీగా... బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) కంపెనీలు డిజిటల్ ప్రకటనలపై అత్యధిక స్థాయిలో రూ. 2,022 కోట్లు వెచ్చించాయి. ఈ–కామర్స్ కంపెనీలు రెండో స్థానంలో ఉన్నాయి. పెరుగుతున్న మొబైల్ ప్రకటనలు..: డిజిటల్ మీడియాలో బీఎఫ్ఎస్ఐ బ్రాండ్స్ ప్రకటనల వాటా 46 శాతంగా ఉన్నట్లు, ఈ–కామర్స్, టెలికం, ట్రావెల్ విభాగాలు వరుసగా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. మొత్తం డిజిటల్ ప్రకటనల్లో ఈ 4 విభాగాల సంస్థల వాటా 68%. మొత్తం డిజిటల్ అడ్వర్టైజింగ్లో సోషల్ మీడియా వాటా 18%(సుమారు రూ. 1,668 కోట్లు) ఉంది. అటు మొబైల్ అడ్వర్టైజింగ్పై (ఎస్ఎంఎస్.. ఇన్ యాప్ యాడ్స్) చేసే వ్యయాలు వార్షికంగా 34% పెరిగి రూ.1,314 కోట్ల నుంచి రూ. 1,761 కోట్లకు చేరాయి. డేటా చార్జీలు గణనీయంగా తగ్గిపోవడం, అందుబాటు ధరల్లో హ్యాండ్సెట్స్ మొదలైన అంశాల కారణంగా మొబైల్ అడ్వర్టైజింగ్ మరింతగా పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. డిజిటల్పై పెట్టుబడులతో లాభాలు: డబ్ల్యూఈఎఫ్ డిజిటల్ టెక్నాలజీలపై పెట్టుబడులతో ఉత్పాదకత పెరగడంతో పాటు కార్పొరేట్ల లాభాలు మెరుగుపడుతున్నాయని వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) పేర్కొంది. అయితే, అన్ని స్థాయిల సంస్థల్లోనూ ఈ ధోరణి లేదని, ప్రతి రంగం నుంచి కేవలం టాప్ 20 శాతం సంస్థలు మాత్రమే డిజిటల్ టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేస్తున్నాయని వివరించింది. -
టచ్చి టమారం
విప్లవంతో మార్పు వస్తుంది. మార్పుతో ‘విప్లవం’ తెస్తున్నాయి కమర్షియల్ యాడ్స్! మా ప్రాడక్ట్ ఇదీ, దాని గొప్పతనం ఇదీ.. అని కంపెనీలేవీ నేరుగా ఇప్పుడు పబ్లిసిటీ ఇచ్చుకోవడం లేదు. ముందు గుండె తలుపుల్ని తట్టి.. ఆ తర్వాతే ఇంటి తలుపుల్ని తడుతున్నాయి. ‘టచ్’ చేసే ఐడియాలతో యాడ్స్ చేయించి మార్కెట్లో కన్నా ముందు, మనసుల్లోకి చొచ్చుకుని వచ్చేస్తున్నాయి. టముకు టమారంలా ఊదరగొట్టేయకుండా.. టచ్చి టమారంలా గుండెకు హత్తుకుపోతున్నాయి. మీరు ఈ యాడ్ చూసే ఉంటారు. ‘‘నాన్నా’’ అంటూ అర్ధరాత్రి ఫోన్ చేస్తుంది ఓ కూతురు. ‘‘ఏంటమ్మా’’ అంటాడు గాభరాపడుతూ తండ్రి.‘‘నేహా (ఫ్రెండ్) వాళ్లింట్లో చదువుకోవడానికి వెళ్తున్నానని నీకు అబద్ధం చెప్పాను.. నిద్ర రావట్లేదు’’ అంటుంది. తండ్రి వైపు నుంచి నిశ్శబ్దం. ‘‘ఫ్రెండ్స్తో కలిసి ఔటింగ్కు వచ్చా నాన్నా’’ అని నిజం చెప్తుంది. కాసేపటి మౌనం తర్వాత తండ్రి అంటాడు‘‘నిజం చెప్పావు కదా.. ఇప్పుడు నిశ్చింతంగా నిద్రపో’’ అని. బొట్టు బొట్టులో స్వచ్ఛత అంటూ ఓ ప్రసిద్ధ కంపెనీ.. వాటర్ కోసం చిత్రీకరించిన తండ్రీ, కూతుళ్ల అనుబంధపు యాడ్ ఇది. ఆ కంపెనీవాళ్ల ముఖ్య ఉద్దేశం నీళ్లను అమ్ముకోవడమే. అవి ఎంత స్వచ్ఛంగా ఉంటాయో చూపించడానికి.. తండ్రి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని.. చిన్న అబద్ధంతో వమ్ము చేయకూడదని కూతురు పడే ఆరాటాన్ని తన ప్రొడక్ట్కు జోడించి మార్కెట్లోకి వదిలింది ఆ వ్యాపార సంస్థ! ఇదొక్కటే కాదు.. నూనెల దగ్గర్నుంచి జిల్లెట్ దాకా, కాస్మోటిక్స్ నుంచి కాస్ట్యూమ్స్ దాకా, వాషింగ్ మెషీన్స్ నుంచి వజ్రాల దాకా అన్నిటినీ అమ్మి పెడుతున్నవి ఇప్పుడు మానవ సంబంధాలే! కాలం మారింది. కమర్షియల్సూ (వాణిజ్య ప్రకటనలు) మారాయి. మరి మేమెప్పుడు రావాలి? పెళ్లి చూపులకు కూతురు అన్యమనస్కంగా రెడీ అవుతుంటుంది. అవతల అబ్బాయి వాళ్లు వచ్చి వెయిట్ చేస్తుంటారు. ‘‘ఇంకా రెడీ కాలేదా? త్వరగా కానియ్’’ అంటాడు తండ్రి లోపలికి వచ్చి. ‘‘రెండు సమోసాలు పెట్టి పెళ్లికొడుకును ఎలా అంచనా వేసుకోవాలి నాన్నా?’’ అంటూ ప్రశ్నిస్తుంది తండ్రిని. తండ్రి పట్టించుకోడు. నిట్టూరుస్తూ ఆయన వెనకాలే వెళ్లి అబ్బాయి వాళ్ల ముందు కూర్చుంటుంది. సమోసాలు తిని, టీ తాగుతూ ‘‘అమ్మాయి మాకు బాగా నచ్చింది. సంబంధం ఖాయం చేసేసుకోండి’’ అంటుంది పెళ్లి కొడుకు తల్లి. అమ్మాయి కళ్లల్లో దిగులు. ‘‘మరి మీ అబ్బాయిని చూసుకోవడానికి మీ ఇంటికి ఎప్పుడు రావాలి’’ అంటాడు అమ్మాయి తండ్రి! అమ్మాయితో సహా అందరూ అవాక్కవుతారు. ‘‘అబ్బాయి ఇక్కడే ఉన్నాడుగా’’ అంటుంది అబ్బాయి తల్లి. ‘‘మా అమ్మాయికి ఏం వచ్చో.. ఏం రాదో మా ఇంటికి వచ్చి తెలుసుకున్నారు కదా.. మరి మా అమ్మాయిక్కూడా తెలియాలి కదా.. మీ అబ్బాయికి వంటొచ్చా.. ఇంటి పని చూసుకోగలడా అని’’ అంటాడు. అమ్మాయి కళ్లల్లో తండ్రి పట్ల ఆరాధన. ‘‘మావాడికి వేణ్ణీళ్లలో మ్యాగి వేసి ఉడికించడం మాత్రమే తెలుసు’’ అంటూ గట్టిగా నవ్వేస్తుంది తల్లి. అమ్మాయి మనసు అర్థమవుతుంది అబ్బాయికి. ‘‘ఒక పది రోజులు ఆగి మా ఇంటికి రండి నన్ను చూసుకోవడానికి. అప్పటికి అన్నీ నేర్చుకుంటాను’’ అంటాడు అబ్బాయి. అమ్మాయితో సమానంగా అబ్బాయి కూడా ఇంటి బాధ్యతను పంచుకోవాలని చెప్పే యాడ్ ఇది. తను కష్టంగా చేయట్లేదు అమ్మా నాన్నా... కొడుకు కాపురం చూడ్డానికి వస్తారు. రాత్రవుతుంది. కోడలు ఆఫీస్ నుంచి ఇంకా ఇంటికి రాదు. పెద్దవాళ్లకు లేట్ అవుతుందని... కొడుకు వాళ్లతో కలిసి డిన్నర్ చేస్తుంటాడు. ‘‘రోజూ ఇలా ఆలస్యమవుతుందా?’’ అడుగుతారు కోడలి గురించి తల్లిదండ్రులు. ‘‘లేదు నాన్నా...తనకు పని ఎక్కువున్నప్పుడు లేట్ అవుతుంది’’అని సమాధానమిస్తాడు కొడుకు. వీళ్లు ఇలా మాటల్లో ఉండగానే కోడలు వస్తుంది. తను డైనింగ్ హాల్లో అడుగుపెట్టబోతుంటే వినిపిస్తుంది.. ‘‘నీకు ప్రమోషన్ కూడా వచ్చింది కదా.. ఇంకా తను ఉద్యోగం చేయడం ఎందుకు? ఈ కష్టం ఎందుకు?’’ అని ప్రశ్నిస్తుంటాడు తండ్రి. ‘‘నాన్నా.. తను ఇది కష్టంగా చేయట్లేదు. తనకు ఇష్టం’’అంటాడు కొడుకు. కోడలి పెదవుల మీద చిరునవ్వు. మ్యాట్రిమొనీలో తామిద్దరు పరిచయం అయినప్పుడు... అభిరుచులు కలిసి, సంబంధం ఖాయమవుతున్నప్పుడు చెప్తుంది ఆమె. పెళ్లి తర్వాత కూడా జాబ్ చేస్తానని. ఆమెను అర్థం చేసుకుంటాడు. ఆమె అభిప్రాయాన్ని అలా గౌరవిస్తుంటాడు భర్త. ‘‘మిమ్మల్ని అర్థంచేసుకున్న వాళ్లనే మీతో కలుపుతాం’’ అంటూ వచ్చే ఓ మాట్రిమోనియల్ యాడ్ అది. ‘తియ్యని’ అత్తాకోడళ్లు కాలనీలో బారాత్ వెళ్తుంటుంది. చాక్లెట్ తింటూ ఆ మ్యూజిక్కు కాళ్లను కదుపుతూ కోడలు బాల్కనీలోంచి బారాత్ను చూస్తుంటుంది. అత్త వచ్చి పక్కనే నిలబడుతుంది. అత్తను చూడగానే పవిట సరిచేసుకొని తింటున్న చాక్లెట్ లోంచి కొంచెం విరిచి అత్తగారికి ఆఫర్ చేస్తుంది. గంభీరంగానే ఆ చాక్లెట్ తీసుకొని చప్పరిస్తూ తనూ ఆ మ్యూజిక్ను ఆస్వాదిస్తుంటుంది. కట్ చేస్తే.. అత్తాకోడళ్లు ఇద్దరూ కిందికి వెళ్లి బారాత్లో తీన్మార్ డ్యాన్స్ చేస్తుంటారు. బంధాలను తీపిగా ఉంచుతుంది అని చూపించే చాక్లెట్ యాడ్ ఇది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు మాత్రమే కాదు, వ్యాపార సూత్రాలు కూడా! ఆయా సంస్థలన్నీ సమాజం మారాలనే ఉదాత్తమైన భావనతో ఈ యాడ్స్ను తీయలేదు. కేవలం తమ ఉత్పత్తులు జనాల్ని ఆకర్షించాలనే తీసాయి.. తీస్తాయి కూడా. అయితే పనిలో పనిగా మానవ సంబంధాలను మెరుగు పరిచే విధంగానూ వాటిని మలుస్తున్నాయి. ఇది మంచి పరిణామం. నీకోసం కాదు.. మనిద్దరి కోసం ఒక యాడ్లో... భార్య ప్రెగ్నెంట్ అని తెలియగానే తన డ్రీమ్ ప్రాజెక్ట్కు సింగపూర్ వెళ్లే పని ఉన్నా క్యాన్సిల్ చేసుకుంటాడు భర్త. అంతేకాదు, ఎప్పుడూ టైమ్కి రాని వ్యక్తి.. చెప్పిన టైమ్కు వస్తాడు. భార్య కూడా వర్కింగ్ ఉమనే అయినా ఆమె ఇంటికి రాగానే కాఫీ అంటూ ఎప్పుడూ ఆర్డర్ వేసే అతను తనే ఈసారి స్వయంగా కాఫీ కలిపి భార్యకు ఇస్తాడు. రాత్రి తనే స్వయంగా వండిపెడ్తాడు. అలారమ్ పెట్టుకొని మరీ భార్యకు ఆహారం ఇస్తుంటారు. ‘‘ఇదంతా నేను ప్రెగ్నెంట్ అని చేస్తున్నావ్ కదా’’ అని అడుగుతుంది భార్య. ‘‘కాదు.. వి ఆర్ ప్రెగ్నెంట్ అని.. మన కోసం చేస్తున్నా..’’ అంటాడు అతను. మగవాళ్ల ఆలోచనా ధోరణిని మార్చే మరో యాడ్ ఇది. – శరాది -
రేట్ల పెరుగుదలపై ప్రకటనలివ్వాలి
ట్రేడర్లు, వ్యాపార సంస్థలకు కేంద్రం ఆదేశం న్యూఢిల్లీ: జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. ప్రజానీకం విరివిగా ఉపయోగించే ఉత్పత్తుల ఎంఆర్పీ(గరిష్ట చిల్లర ధర) పెరిగిన పక్షంలో ఆ విషయం అందరికీ తెలిసేలా వ్యాపారులు, వ్యాపార సంస్థలు తక్షణం ప్రకటనలు జారీ చేయాలని కేంద్రం సూచించింది. సవరించిన ఎంఆర్పీని కనీసం రెండు స్థానిక దినపత్రికల్లో ప్రకటించాల్సి ఉంటుందని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా చెప్పారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తేదీ నాటికి అమ్ముడు కాకుండా మిగిలిపోయిన స్టాక్స్పై కొత్త ధరను స్టిక్కర్ రూపంలో అతికించి విక్రయించే వెసులుబాటు కల్పించినట్లు అధియా తెలిపారు. జీఎస్టీ విధానంలో నిర్ధిష్ట ఇన్వాయిస్ స్వరూపమేదీ నిర్దేశించ లేదన్నారు. అయితే, ఇన్వాయిస్లో సదరు ట్రేడరు జీఎస్టీఐఎన్, బిల్లు మొత్తం కచ్చితంగా ఉండాలని చెప్పారు. తప్పనిసరిగా డిజిటైజ్డ్ బిల్లు ఇవ్వాలనే నిబంధనేది పెట్టలేదని.. మాన్యువల్ ఇన్వాయిస్ ఇచ్చే వెసులుబాటు కూడా కల్పించినట్లు వివరించారు. ప్రస్తుతం 11,000 పైచిలుకు ఉత్పత్తుల్లో ఒకోదానికి ప్రత్యేక కోడ్ను (హెచ్ఎస్ఎన్) కేటాయించామని, రూ. 1.5 కోట్ల పైగా టర్నోవరు గల వ్యాపార సంస్థలు ఇన్వాయిస్లలో దీన్ని పొందుపర్చాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. కేంద్రియ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీఈసీ) ఆవిష్కరించిన వెబ్సైట్లో వ్యాపార సంస్థలు ఈ కోడ్లను సెర్చి చేసి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. -
క్షమాపణ చెప్పిన రిలయన్స్ జియో, పేటీఎం
వ్యాపార స్వలాభం కోసం ముందస్తుగా ఎలాంటి అనుమతి లేకుండా ప్రధాని నరేంద్రమోదీ చిత్రాన్ని వాడుకున్నందుకు రిలయన్స్ జియో, పేటీఎంలు క్షమాపణ చెప్పాయి. ఈ విషయంపై రిలయన్స్ జియో, పేటీఎంలు క్షమాపణ చెప్పినట్టు ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. మోదీ ఫోటోగ్రాఫ్ లను తమ అడ్వర్ టైజ్ మెంట్లలో వాడుకున్నందుకు ప్రభుత్వం గత నెల ఈ కంపెనీలకు నోటీసులు జారీచేసింది. ఈ తప్పిదానికి కంపెనీలు క్షమాపణ చెప్పాయి. యాంబ్లమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్, 1950 కింద ముందస్తు అనుమతి లేకుండా ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తుల ఫొటోలు లేదా యాంబ్లమ్లు వాడటం నిషేధం. రిలయన్స్ జియో మాత్రం మోదీ ఫొటోతో ఒక ఫుల్ పేజ్ ప్రకటనను గత నెల సెప్టెంబర్ లో ఇచ్చింది. ఈ వ్యాపార ప్రకటన రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై పలు కోర్టులలో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా నమోదయ్యాయి. అలాగే పేటీఎం కూడా రెండు నెలల అనంతరం మోదీ డీమానిటైజేషన్ నిర్ణయాన్ని స్వాగతించడమే కాకుండా తమ డిజిటల్ వాలెట్ను వినియోగించాలని ప్రకటనలు విడుదల చేసింది. -
ఫేస్బుక్ పబ్లిషర్లకు గుడ్ న్యూస్
న్యూయార్క్ : ఫేస్ బుక్ లో పోస్టు చేస్తున్న వీడియోల ద్వారా తగినంత మనీని సంపాదించలేని పబ్లిషర్లకు గుడ్ న్యూస్. టీవీ చూసేటప్పుడు మధ్యలో వచ్చే యాడ్స్ మాదిరి ఇక ఈ వ్యాపార ప్రకటనలు ఫేస్బుక్ లైవ్ వీడియోలోకి కూడా రాబోతున్నాయి. లైవ్ వీడియోస్ మధ్యలో 20 సెకన్ల యాడ్స్ను వేయాలని ఫేస్ బుక్ నిర్ణయించిందట. తన నెట్వర్క్పై షేర్ చేసే వీడియోస్ ద్వారా మనీ ఆర్జించాలని సోషల్ మీడియా దిగ్గజం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇలా ఆర్జించిన రెవెన్యూలను పబ్లిషర్లకు పంచబోతున్నట్టు ఫేస్ బుక్ పేర్కొంది. రీకోడ్ రిపోర్టు ప్రకారం పబ్లిషర్స్ వీడియోల మధ్యలో యాడ్స్ను వేయడం కంపెనీ త్వరలోనే ప్రారంభించబోతుందని తెలుస్తోంది. అచ్చం టీవీ కమర్షియల్ యాడ్స్ మాదిరే ఈ యాడ్స్ కూడా ఉండబోతున్నాయని తెలిపింది. యాడ్స్ ద్వారా ఆర్జించిన రెవెన్యూలను పబ్లిషర్లు, తను పంచుకోవాలనుకుంటోందని పేర్కొంది. ఫేస్బుక్లో వీడియోలు షేర్ చేస్తూ మనీని ఆర్జించలేని వారికి ఇది ఓ గుడ్ న్యూస్ లాంటిదని రీకోడ్ రిపోర్టు చేసింది. మధ్యలో వచ్చే 20 సెకండ్ల యాడ్ పూర్తిగా అయిపోయేంత వరకు లైవ్ స్ట్రీమ్ చేయడం కుదరదని రీకోడ్ రిపోర్టు పేర్కొంది. యాడ్ బ్రేక్కు ముందు పబ్లిషర్లు కనీసం నాలుగు నిమిషాలు లైవ్ స్ట్రీమ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బ్రేక్, మళ్లీ లైవ్ ప్రొగ్రామ్ రన్ అయ్యేలా టెస్టింగ్ ప్రారంభించామని కంపెనీ అధికార ప్రతినిధి చెబుతున్నారు. -
జియోకు అనుమతి ఇవ్వలేదు
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ముద్రణ మరియు ఎలక్ట్రానిక్ ప్రకటనల్లో నరేంద్ర మోదీ చిత్రాలు ఉపయోగించడానికి రిలయన్స్ జియోకు అనుమతి మంజూరు చేయలేదని స్పష్టం చేసింది. రాజ్యసభలో సమాజ్ వాది పార్టీ ఎంపీ నీరజ్ శేఖర్ గురువారం అడిగిన ఒక ప్రశ్నకు రాతపూర్వక సమాధానంగా సమాచార మరియు ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చెప్పారు. ఎలక్ట్రానిక్ యాడ్స్ పై ప్రధాన మంత్రికార్యాలయం నుంచి (పీఎంఒ) నుంచి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఆయన తేల్చి చెప్పారు. మంత్రిత్వ శాఖకు చెందిన మీడియా యూనిట్, అడ్వర్టయిజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ డైరెక్టరేట్ (డీఏవీపీ), వివిధ మీడియా సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు ప్రకటనలకు అనుమతి ఇస్తుందని తెలిపారు. కానీ తమ నోడల్ ఏజెన్సీ డీఏవీపీ ఏ ప్రైవేటు సంస్థ కు మోదీ ఫోటోలను విడుదల చేయలేదని చెప్పారు. అయితే అనుమతిలేకుండానే ప్రధాని ఫోటోలను వాడుకోవడంపై జియోపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని శేఖర్ కోరారు. చిహ్నాలు మరియు పేర్లు (అసమాన వినియోగం నివారణ) చట్టం 1950 ప్రకారం కన్జ్యుమర్ అఫైర్స్ , ఫూడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మంత్రిత్వ శాఖ సమాధానమిస్తుందని చెప్పారు. కాగా బిలియనీర్ రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ జియో ఇన్ ఫ్రాటెల్ వ్యాపార ప్రకటనల్లో మోదీ పోటోలు దర్శనమివ్వడంపై పలు విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. -
రమ్మీ... రమ్మటోందా?
శ్రీకాకుళం: ఈజీ మనీ... క్షణాల్లో లక్షాధికారుమైపోవాలనే ఆలోచన చాలా మంది జీవితాలను నాశనం చేస్తోంది. ఈ ఆలోచననే అదనుగా చేసుకుని ఊరిలో బెట్టింగ్ నుంచి ఆన్లైన్లో పేకాట వరకు అంతా మోసం చేయడానికి రెడీ అయిపోతున్నారు. యువత కూడా ఈజీగా వీరి ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఫేస్బుక్ తెరిస్తే చాలు ఊరూ పేరూ లేని వ్యక్తులు ‘మేం అంత గెలిచాం.. ఇంత గెలిచామంటూ’ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఏదో వెబ్సైట్ బ్రౌజ్ చేద్దామన్న రమ్మీ అంటూ రమ్మంటూ ప్రకటనలు కనిపిస్తున్నాయి. క్షణాల్లో డబ్బులు సంపాదించాలనే యా వతో జిల్లాలోనూ చాలా మందికి వీటికి అలవాటు పడుతున్నారు. ఫలితంగా ఉన్న డబ్బులు క్షవరం చేయించుకుని మోసపోతున్నారు. బంగారు ఆభరణాలతోపాటు విలువైన వస్తువులను తనఖా పెట్టి మరీ జూదమాడి కుదేలవుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ కూడా ఇలాగే తయారైంది. చాలా మంది పాకెట్ మనీగా ఇళ్లల్లో ఇచ్చింది ఇలాంటి బెట్టింగులపై పెట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. బైకులు, సెల్ఫోన్లు వంటి ఖరీదైన వస్తువులను అమ్మి జూదం, బెట్టింగ్లకు పెడుతున్న వారూ ఉన్నారు. ఇటీవలి కాలంలో పోలీసులకు చిక్కిన నేరస్తుల్లో ఎక్కువమంది యువకులే కావడం, వీరంతా బెట్టింగ్, జూదంలోనే పట్టుబడుతుండడమే దీనికి నిదర్శనం. బెట్టింగు నిర్వహిస్తున్న వారు అన్ని వర్గాల అధికారులను తమ దారిలోకి తెచ్చుకునేందుకు నెలనెలా లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఆన్లైన్ జూదాన్ని అదుపులోకి ఎలా తేవాలన్నది ఎవరికీ తెలి యడం లేదు. అలాగే జిల్లా వ్యాప్తంగా 15 నుంచి 20 వరకు జూదశాలలు నడుస్తున్నట్లు అనధికారిక లెక్క ప్రకారం తెలుస్తోంది. వీటిలో కొన్ని ప్రజాప్రతినిధులు, కొందరి అధికారుల కనుసన్నల్లో నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వాటిని తక్షణంఅరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
కేంద్ర ప్రభుత్వ ప్రకటనల ఖర్చు రూ.1000 కోట్లు
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం రేండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు చేసుకుంటున్న వేళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ ప్రకటనల ఖర్చుపై విమర్శలు కురిపించారు. ఇప్పటి వరకు కేంద్ర సర్కారు ప్రకటనలకోసం రూ.1000 కో్ట్లని ఖర్చు చేసిందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. తమ ప్రభుత్వ యేడాదికి రూ.150 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పత్రికల్లో పూర్తి పేజీ ఆడ్ ఇవ్వడాన్నిఆయన తప్పు పట్టారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఇటీవల ప్రకటనల కోసం రూ.526 కోట్లు బడ్జెట్ లో కేటాయించిన విషయం తెలిసిందే. కాగా ఈ యేడాది ఫిబ్రవరి, మే నెలల్లో ఆప్ ప్రభుత్వం రూ.100 కోట్లు ఖర్చు చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రూ.14.5 కోట్లు కేవలం టీవీ, పత్రికలు ,హోర్డింగ్ ల కోసమే ఖర్చు చేసిందని ,పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం ముందుకు రావడంలేదని ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే. -
ఔను... నేనంతే!
సినిమాల్లో తప్ప నయనతార విడిగా కనిపించరు. సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనరు. యాడ్స్లో నటించరు. అప్పుడెప్పుడో ఓ యాడ్లో నటించారంతే. పబ్లిక్ దర్శనాలు ఎక్కువ ఇవ్వకపోవడానికి నయనతార కారణాలు నయనతారకున్నాయి. అయితే, ఇలా చేయడం వల్ల నయనతార ఫ్రెండ్లీ టైప్ కాదనీ, గర్వం అనీ, పొగరనీ చాలామంది అనుకుంటారు. ఈ విషయం గురించి నయనతార ప్రస్తావిస్తూ, ‘‘అవును. నేను పొగరుబోతునే! అహంకారిని కూడా! అయితే, నాతో వేళాకోళంగా ప్రవర్తించే వాళ్ల దగ్గరే అలా ఉంటాను. మిగతావాళ్ల దగ్గర అలా ఉండాల్సిన అవసరం నాకేంటి?’’ అన్నారు. తమిళ, తెలుగు, మలయాళ భాషా చిత్రాలతో తెగ బిజీగా ఉన్న ఈ మలయాళ సుందరి తన స్వభావం గురించి ఇంకా చాలానే చెప్పారు. ‘‘నాతో సినిమాలు చేసినవాళ్లకూ, చేసేవాళ్లకూ నేనెంత ఫ్రెండ్లీగా ఉంటానో తెలుసు! నా గురించి నేను ఎక్కువ చెప్పుకుంటున్నానని అనుకోకపోతే ఒక్క మాట. నాది చాలా స్వీట్ నేచర్! షూటింగ్ లొకేషన్లో చాలా సరదాగా ఉంటాను. అందరితోనూ మాట్లాడుతుంటాను’’ అని ఆమె తన వాదన వినిపించారు. ఇన్నీ చెబుతూనే, ఒక్క విషయం కుండబద్దలు కొట్టారు. ‘‘ఏమైనా, మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. నాకు మర్యాద ఇస్తే... నేనూ వాళ్ళకు మర్యాద ఇస్తా. ఒకవేళ నా దగ్గర మర్యాదగా నడుచుకోకూడదని ఎవరైనా నిశ్చయించుకుంటే, నా నుంచి కూడా ఇక మర్యాద ఎక్స్పెక్ట్ చేయొద్దు’’ అన్నారు. -
'అన్నింటికి అమ్మేంటి.. ఆ ప్రచారమేంటి?'
మదురై: తమిళనాడులో అమ్మ పేరిట పథకాలు రావడంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల పేర్లకు అమ్మ, పురుచ్చి తలైవి(విప్లవాత్మక నేత) అని చేర్చడం, ఆ పేరిట ప్రకటనలు ప్రచురించడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ పీ రథినం అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. మున్ముందు అలాంటి ప్రకటనలు అలాంటి పనులు చేయకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించాలని అందులో కోరారు. అంతేకాకుండా ప్రజల సొమ్మును ఇలా పథకాల పేరిట వ్యక్తిగత ప్రచారానికి ఉపయోగించకుండా ఉండేలా చూడాలని కోరుతూ కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని కోరారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ప్రచారం చేసుకునేందుకే పథకాల పేర్లు పెడుతున్నారని, వాటి ప్రకటనల్లో కూడా ఆమె పేరును చేరుస్తూ ప్రజలను ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. అమ్మ కాల్ సెంటర్, అమ్మ మైక్రో లోన్స్ స్కీమ్స్ అంటూ ప్రతిరోజు దినపత్రికల్లో వేల కోట్ల రూపాయలను వృధా చేస్తున్నారని కూడా పిటిషనర్ అందులో పేర్కొన్నారు. -
ఇక టీవీల్లో ఎవరికి నచ్చే యాడ్స్ వారికి మాత్రమే!
లండన్: మొన్నటి తరానికి బ్లాక్ అండ్ వైట్ టీవీలు, వాటిలో చూసిన ఒకటి, రెండు ఛానెళ్లే గుర్తు. నిన్నటి తరానికి కలర్ టీవీలు, వాటిలో చూసిన 30, 40 ఛానళ్లు గుర్తు. మరి అదే నేటి తరానికి వస్తే వందల ఛానళ్లే కాదు, యూట్యూబ్, నెట్ఫిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ, బీటీ విజన్, స్కై....ఇలా ఎన్నో చూస్తున్నారు. తరాల సంగతి పక్కనపెట్టి ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయబద్ధంగా టీవీల్లో కొన్ని నచ్చిన ఛానళ్ల వీక్షణకు పరిమితమవుతున్న వారి సంఖ్య సరాసరిగా యాభై శాతానికి మించిలేదు. ఇలాంటి పోటీ ప్రపంచంలో టీవీ ఛానళ్లు తమ మనుగడను కొనసాగించాలంటే వాణిజ్య ప్రకటనల్లో విప్లవాత్మక మార్పులు తీసుకరావాల్సిందే. ప్రస్తుతం భారత్ సహా పలు దేశాల్లో టీఆర్పీ రేటింగ్ల ప్రకారం వాణిజ్య ప్రకటనలు ఛానళ్లలో ప్రసారం అవుతున్నాయి. ఇప్పుడు ‘సెట్ టాప్’ బాక్సుల పుణ్యమా అని రేటింగ్స్లో కచ్చితత్వం రావడమే కాకుండా ఛానళ్లలో వచ్చే మనకిష్టమైన కార్యక్రమాన్ని ముందుగానే రికార్డు చేసుకొని కోరుకున్నప్పుడు చూసుకునే అవకాశం వచ్చింది. కానీ చూస్తున్న కార్యక్రమం మధ్యలో వచ్చే యాడ్స్ చీకాకు కలిగిస్తున్నాయి. ఛానళ్లు మనుగడ సాగించాలి కనుక యాడ్స్ ఎలాగు తప్పవు. అదే మనకు నచ్చే యాడ్స్ మాత్రమే వస్తే బాగుంటుంది కదా! మన ఇంట్లో పిల్లీ లేదు, కుక్కా లేదనుకోండీ! మరి పిల్లి, కుక్కల ఫుడ్కు సంబంధించిన యాడ్ మనకెందుకు? మన అభిరుచులకు తగ్గ దుస్తుల డిజైన్స్ గురించో, నగల గురించో యాడ్స్ ఇస్తే బాగుంటుందికదా! లోకోభిన్నరుచులు ఉన్నప్పుడు ఇది ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్న సహజంగా వస్తుంది. నిజంగా అభిరుచులకు తగ్గ యాడ్స్ను వీక్షించే అవకాశం త్వరలోనే సాకారం కాబోతోన్నది. అప్పుడు మన ఇంట్లో వచ్చే యాడ్ పక్కింట్లో రాదు, అలాగే పక్కింట్లో వచ్చే యాడ్ మనకు రాదు. ఇప్పటికే దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దానికి ‘డైనమిక్ యాడ్ ఇన్సర్షన్’ అని పేరు కూడా పెట్టారు. మన పేరు, వయస్సు, అభిరుచులు తెలుసుకోవడానికి సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి కూడా. మనం ఏ టీవీ ఛానళ్లు చూస్తున్నామో, వాటిలో ఏ కార్యక్రమాన్ని ఎంతసేపు చూస్తున్నామో సెట్టాప్ బాక్సులు ఇప్పటికే రికార్డు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ డేటా నేరుగా యాడ్ ఏజెన్సీలకు వెళుతుంది. వారు వారి పద్ధతిలో వీక్షకుల అభిరుచులను అంచనా వేస్తారు. ఇదో పద్ధతి. ప్రజల వయస్సు తదితర వివరాలతోపాటు అభిరుచులను నేరుగా తెలుసుకునేందుకు ఆన్లైన్ ప్లేయర్లు, సర్వీసులు ఉన్నాయి. దీనికోసమే ఆన్లైన్ ‘ఐటీవీ’ ప్లేయర్ గత నవంబర్ నెలలో ‘ఐటీవీ హబ్’గా మారింది. ఇప్పుడు ఈ హబ్ వద్ద కోటీ పాతిక లక్షల మంది రిజిస్టర్ చేసుకున్న యూజర్లు ఉన్నారు. ఇదే మాదిరిగా లండన్కు చెందిన ఛానెల్ 4 తన ‘40 డీ’ ఫ్లాట్ ఫామ్ను ‘ఆల్ 4’గా మార్చుకుంది. దీని ద్వారా అది యూజర్ల అభిరుచులను సేకరిస్తోంది. ఇలా సేకరించిన సమస్త సమాచారాన్ని యాడ్ ఏజెన్సీలు పంచుకుంటాయి. వాటిని విశ్లేషించి వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా యాడ్స్ను రూపొందిస్తాయి. వివిధ రకాల యాడ్స్ను వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో ప్రసారం చేయడానికి ‘డైనమిక్ యాడ్ ఇన్సర్షన్’ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. ప్రజల అభిరుచులకు తగిన విధంగా ఒక్క ‘డోవ్’ సబ్బు యాడ్ను 25 రకాలుగా తీయగలమని యూనిలివర్ యాడ్ ఎగ్జిక్యూటివ్ ఇటీవల ఇక్కడ జరిగిన ప్రపంచ సదస్సులో వెల్లడించారు. ఈ సదస్సులో ప్రపంచ నలుమూలల నుంచి యాడ్ ఏజెన్సీల సీనియర్ ఎగ్జిక్యూటివ్లు పాల్గొన్నారు. వారిలో ఫేస్బుక్, గూగుల్, ట్విట్టర్ ప్రతినిధులు కూడా ఉన్నారు. -
చేస్తా.. చేస్తా.. చేస్తూనే ఉంటా!
అమితాబ్ బచ్చన్ని చూస్తుంటే చాలామందికి ఆశ్చర్యం కలగక మానదు. 72 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా సినిమాలూ, యాడ్స్ చేస్తున్నారు. ‘ఎందుకండీ ఇంత కష్టపడతారు.. రెస్ట్ తీసుకోవచ్చుగా’ అని ఎవరైనా అమితాబ్తో అంటే, ‘ఇప్పుడు నాకేమైందని రెస్ట్ తీసుకోవాలి. బాగానే ఉన్నానుగా’ అని నవ్వుతూ అనేవారు. ఇప్పుడు మాత్రం ఆయన ఓపిక సన్నగిల్లుతోందట. ‘ఇంత ఎనర్జీ మీకు ఎక్కణ్ణుంచి వస్తోంది? ఇంత బిజీగా ఎలా పని చేయగలుగుతున్నారు?’ అని ఎవరైనా అడిగితే అమితాబ్కి చిరాకుగా ఉంటోందట. ఆ విషయం గురించి ఆయన చెబుతూ - ‘‘నేనూ అందరిలాంటి మనిషినే. ఈ వయసులో ఇంట్లో కాలక్షేపం చేయకుండా పని చేయడమేంటి? అని అడుగుతుంటే కోపం వస్తోంది. కొంతమందేమో అతిగా పొగుడుతున్నారు. మీరు సూపర్ సార్.. మీ ఎనర్జీ అదుర్స్ సార్ అని పొగుడుతుంటే ఇబ్బంది ఉంటోంది. అందుకే ఎవరూ నన్ను పొగడొద్దు. నా పని నేను చేస్తున్నాను. ఉదయం పని చేస్తా.. మధ్యాహ్నం చేస్తా.. అవసరమైతే రాత్రిపూట కూడా చేస్తా.. పని చేస్తా.. చేస్తా.. చేస్తూనే ఉంటా. నాకు అందులోనే ఆనందం ఉంది. నా ఆనందం కోసం చేస్తున్న పనికి ప్రశంసలు ఆశించడంలేదు’’ అన్నారు. -
సెలబ్రిటీ కాదు కంప్లీట్ మ్యాన్
యాడ్స్.. ప్రొడక్ట్ క్వాలిటీని ఎంతవరకు ప్రొజెక్ట్ చేస్తున్నాయో తెలియదు కానీ మారిన తరంలోని మానవ సంబంధాలను మాత్రం కళ్లకు కడుతున్నాయి. ముఖ్యంగా మీసం మెలేసే మగాడు సున్నితంగా మారిన వైనానికి అద్దం పడుతున్నాయి!. ఓరియో బిస్కట్స్ నాన్న.. భారత్ మ్యాట్రిమోనీ భర్త.. క్యాడ్బరీ డెయిరీ మిల్క్ స్నేహితుడిని కలుపుకొని రేమండ్స్ ది కంప్లీట్ మ్యాన్ని ఆవిష్కరిస్తోంది! యాడ్స్లోనే కాదు ఇంట్లోనూ అలాగే ఉన్న ఈతరం పురుషుడి గురించి కథనం.. నిజమైన సంఘటనలే ఊపిరి సెలబ్రిటీలే కాదు కంప్లీట్ మ్యాన్కి అద్దంపట్టే సామాన్యూలూ ఉన్నారు. సికింద్రాబాద్కి చెందిన కోమల్రెడ్డి నేటి తరం పురుషుడికి ప్రతినిధి. ఆయన గురించి వాళ్లావిడ శిరీష ‘నాకు డిగ్రీ అవగానే పెళ్లయింది. పీజీ చేయాలని ఉండింది. కోమల్తో చెబితే ఓకే అన్నాడు. ఎంట్రెన్స్ రాస్తే సీట్ వచ్చింది. ఫస్టియర్ అయేటప్పటికి కన్సీవ్ అయ్యాను. సెకండియర్ ఎగ్జామ్స్ అప్పటికి చంటిబిడ్డ తల్లిని. రోజుల బిడ్డను పట్టుకొని ఎగ్జామ్స్ రాయడమా అని భయపడ్డాను. కోమల్ ధైర్యం చెప్పి పరీక్షలకు రెడీ చేశాడు. నేను ఎగ్జామ్నేషన్ హాల్లో.. తను బయట పాపను ఎత్తుకొని పచార్లు.. ఇలాంటి నేచర్ ఉన్న మగవాళ్లను ఇటు మా ఇంట్లోను, అటు వాళ్లింట్లోనూ చూడలేదు’ అంది. ‘శిరీష నా కోసం కొన్నింటిని శాక్రిఫైస్ చేసినప్పుడు ఆమె లైఫ్ యాంబిషన్ కోసం నేనెందుకు చూయకూడదని అనుకున్నాను. మా పాప అనన్య విషయంలో తల్లిగా తనకెంత బాధ్యత, ప్రేమ ఉన్నాయో, తండ్రిగా నాకూ అంతే బాధ్యత, ప్రేమ ఉన్నాయి’ అంటాడు కోమల్. యాడ్స్ ప్రభావం.. యాడ్స్కి రియల్ ఘటనలు ప్రేరణ ఇచ్చినట్టే యాడ్స్ ప్రభావమూ తన మీదుందంటాడు బాలశేఖర్. ‘సినిమాలు మగవాళ్లలోని సున్నితత్వాన్ని చంపేస్తుంటే ఇలాంటి యాడ్స్ మరింత సెన్సిటైజ్ చేస్తున్నాయి. నా పెళ్లయి తొమ్మిది నెలలైంది. నా భార్య శ్రావణి.. మంచి ఫ్రెండ్. ఏ విషయంలోనూ సొంత నిర్ణయం తీసుకోను. నేను మల్టీమీడియా చేశాను. తను బీటెక్. ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్చేశాం. ఆడవాళ్లు సెకండ్ జెండర్కాదు.. మగవాళ్లతో ఈక్వల్. ఈ భావన నాలో కలగడానికి నాకున్న రీడింగ్ హాబీ ఒక కారణమైతే.. రేమండ్స్లాంటి యాడ్సూ కారణమే’ అంటాడు బాలశేఖర్. ‘నిజమే.. శేఖర్ భర్తగా కన్నా ఓ ఫ్రెండ్లా ఉంటాడు. అన్నీ షేర్ చేసుకుంటాను’ అంటుంది బాలశేఖర్ భార్య శ్రావణి. -
దేవుడి వెయ్యినోటు!
దైవికం వరుణ్ పృధి నటుడు, మంచి డాన్సర్. కొన్ని యాడ్స్ చేశాడు. మ్యూజిక్ వీడియోలు తీశాడు. చిన్నపాటి నిర్మాత కూడా. ‘టెరోడాక్టల్ సర్ప్రైజ్’, ‘సుగర్ వీల్స్’, ‘రికీ ది హ్యాండీమ్యాన్’ (మొదటిది టీవీ సిరీస్, తర్వాతి రెండూ షార్ట్ ఫిల్ములు)లలో నటించాడు. ‘రికీ ది హ్యాండీమ్యాన్’ చిత్రానికి మాటలు అతడివే. ఖర్చూ అతడిదే. ఇన్ని రంగాలలో ప్రావీణ్యం ఉన్న ఈ ఢిల్లీ యువకుడి గురించి నిన్నమొన్నటి వరకు దాదాపుగా ఎవరికీ తెలియదు. ఇప్పటికైనా తెలియకపోయేవాడేనేమో కానీ, ఇటీవల తను అప్లోడ్ చే సిన వీడియో ఒకటి అతడిని వివాదాస్పద ప్రముఖుణ్ణి చేసింది! ‘డ బ్బు సంతోషాన్నిస్తుందా’ అనే ప్రశ్నతో ప్రారంభమయ్యే ఆ వీడియో, ‘తప్పకుండా. కష్టాలు, కన్నీళ్లతో జీవితం సాగిస్తున్నవారికి అది సంతోషాన్నిస్తుంది’ అనే సమాధానంతో ముగుస్తుంది. ఆ వీడియో పేరు ‘గాడ్ సెంట్ మీ ఫర్ యు’ (మీకోసం దేవుడు నన్ను పంపించాడు). వీడియో ఆసక్తికరంగా సాగుతుంది. వరుణ్ మొదట ఓ పార్కులో గ్లాసు నీళ్లను (కుండలోని నీళ్లు) రూపాయి చొప్పున అమ్ముకునే మహిళ దగ్గరకు వెళ్లి, మోకాళ్ల మీద వంగి నిలబడి, ‘‘ఏమ్మా, నీకు దేవుడి మీద నమ్మకం ఉందా?’’ అంటాడు. ఆమె ఆశ్చర్యపోతుంది. నిజమే. జీన్స్ప్యాంటు, టీషర్టులో సినిమా హీరోలా ఉన్నవాడికి వెళ్లెళ్లి ఆమె కుండలో నీళ్లు తాగే అవసరం ఏముంటుంది? ఆమె ఆశ్చర్యం పూర్తికాకుండానే, మళ్లీ అదే ప్రశ్న అడుగుతాడు వరుణ్. దానికి సమాధానంగా ఆమె ‘‘ప్రతి ఒక్కరికీ నమ్మకం ఉంటుంది. నాకు మాత్రం ఎందుకు ఉండదు?’’ అని ప్రశ్నిస్తుంది. వెంటనే వరుణ్ నిటారుగా నిలబడి ప్యాంటు జేబులోంచి పెళపెళలాడే వెయ్యినోటు తీసి ఆమెకు ఇస్తూ, ‘‘దేవుడు నీ కోసం నన్ను పంపాడు’’ అంటాడు. ఆమెకేమీ అర్థం కాదు! భయంగా చూస్తుంది. ‘‘తీస్కోమ్మా, నీకే’’ అంటాడు. ఇచ్చి, అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత కొద్దిసేపు వీడియోలో ఆ నోటు తీసుకున్నావిడ ఫీలింగ్ కనిపిస్తాయి. ఈలోపు వరుణ్ ఇంకో చోటుకు వెళ్లి ఉంటాడు. అక్కడా ఇలాగే ‘‘దేవుడు నీ కోసం నన్ను పంపాడు’’ అని చెప్పి వెయ్యినోటు ఇస్తుంటాడు. అలా... బ్రేస్లెట్స్ అమ్మే అమ్మాయి, పాపడ్లు అమ్ముకునే 55 ఏళ్ల ఆయన, పిల్లలు ఆడుకునే బొమ్మలు అమ్మే వ్యక్తి, ఐదురూపాయలకు టీ అమ్ముకునే అతను, పదిరూపాయలకు పీచుమిఠాయి అమ్ముతుండే పెద్దాయన, బబుల్ టాయ్స్ అమ్మే కుర్రాడు... ఇలాంటి వాళ్లందరి దగ్గరకు వెళ్లి ‘‘దేవుడి మీద నీకు నమ్మకం ఉందా?’’ అని మొదలు పెడతాడు. చివర్లో ‘‘దేవుడు నీ కోసం నన్ను పంపాడు’’ అంటూ వెయ్యి నోటు చేతిలో పెడతాడు. పెట్టి, వెంటనే వెళ్లిపోతాడు. ఆ డబ్బు తీసుకున్నవాళ్లు ఒక్కొక్కొళ్లు ఒక్కోలా స్పందిస్తుంటారు. బ్రేస్లెట్స్ అమ్మే అమ్మాయి ఎలాంటి సంకోచం లేకుండా డబ్బు తీసుకుని థ్యాంక్స్ చెబుతుంది. ఆ ఆనందంలో... రాబోతున్న డాన్స్ని ఆపుకుంటుంది. పాపడ్లు అమ్మే ఆయన ‘‘సార్ ఒక్క పాపడ్ అయినా తీసుకోండి’’ అని కృతజ్ఞతగా అంటాడు. వెయ్యినోటుని కళ్లకద్దుకుని, ముద్దు పెట్టుకుని జేబులో పెట్టుకుంటాడు. పిల్లలు ఆడుకునే బొమ్మలు అమ్మే ఒంటి కన్ను వ్యక్తి వెయ్యి నోటు తీసుకుని ఒక్కసారిగా ఏడ్చేస్తాడు. వరుణ్ అక్కడి నుంచి వెళ్లిపోయినా కూడా ఆ నోటును చూసుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటాడు. టీ అమ్మే అతను మాటలు రాని ఆనందంలో తటపటాయింపుగా నోటు తీసుకుని జేబులో పెట్టుకుంటాడు. కాసేపు అలా స్తంభించినట్లు నిలబడిపోతాడు. పీచుమిఠాయి అమ్మే ఆయన ‘‘నా మీద జోకు చెయ్యొద్దుసార్’’ అని, తర్వాత నోటును అందుకుని నుదుటికి ఆన్చుకుంటాడు. బబుల్ టాయ్స్ కుర్రాడు చిరునవ్వుతో వెయ్యినోటు అందుకుని ప్యాంటు జేబులో పెట్టుకుంటాడు. వరుణ్ వీళ్లందరిలోనూ ఆనందాన్ని చూశాడు. ఎలా చూశాడంటే నేరుగా చూడలేదు. ఒకళ్లకు వెయ్యినోటు ఇచ్చివెళ్లాక వాళ్ల ముఖ భావాలను దూరం నుంచి వీడియోగ్రాఫర్ కొద్దిసేపు క్యాచ్ చేస్తే, అన్నిటినీ కలిపి ఒకేసారి వీడియోలో చూశాడు. లేమిలో సైతం భగవంతుడిపై నమ్మకం కోల్పోకుండా కుటుంబాల కోసం బతుకులు ఈడుస్తున్న ఈ స్ట్రీట్ హాకర్ల కళ్లలో వెయ్యినోటు తెచ్చిన ఆనందాన్ని, దేవుడే వెయ్యినోటుగా సాక్షాత్కరించినంత ఉద్వేగాన్ని చూశాడు. ‘‘జీవితం మీద ఆశలు కోల్పోకండి. దేవుడు ఏదో ఒకరూపంలో మీ బాధలు తీరుస్తాడు’ అని చెప్పడం వరుణ్ ఉద్దేశం. అయితే వరుణ్ ఇలా దేవుడు పంపిన దూతలా పేదవారికి డబ్బు పంచడం వివాదాస్పదం అయింది. ‘‘దేవుణ్ణి ఇందులోకి లాగడం ఏం బాలేదు. ఎవరికైనా మేలు చేయాలనుకున్నప్పుడు వారికి పని కల్పించాలి తప్ప, వాళ్లను యాచకుల స్థాయికి దిగజార్చకూడదు. అలా చేయడం దాతృత్వం అనిపించుకోదు’’ అని ఇండియన్ కార్పొరేట్ గురు సుహెల్ సేథ్ లాంటి వాళ్లు అంటున్నారు. అయితే వరుణ్ పృధి ఆ మాటలేమీ పట్టించుకున్నట్టు లేదు. ‘గాడ్ సెంట్ మీ ఫర్ యూ’ పార్ట్ 2 కూడా తీసి నెట్లో పెట్టేశాడు. ‘‘వాళ్లను సంతోషపెట్టడం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. దేవుడి చిరునామా పేదవాళ్ల సంతోషమే కదా. అలా దేవుణ్ణి వెదికి పట్టుకుంటున్నాను తప్ప, దేవుణ్ణి ఎందులోకీ లాగడం లేదని చెబుతున్నాడు. వరుణ్ని కూడా మనం ఎందులోకీ లాగకుండా అతడి ఉద్దేశాన్ని అర్థం చేసుకోగలిగితే... లేమిలో ఉన్నవారిని సంతోష పెట్టడం అంటే ఆ భగవంతుడిని సాక్షాత్కరింప చేసుకోవడమేనన్న భావనలో మనకెలాంటి తప్పూ కనిపించదు. - మాధవ్ శింగరాజు -
ఏముందిరా బుల్బుల్..
ఈ క్రీం వాడండి.. మీ వయసు ఓ పదేళ్లు తగ్గిపోతుంది.. లేదా ఈ ఫేషియల్ చేయించుకోండి మీరు అరవైలో ఇరవైలా కనిపిస్తారు వంటి యాడ్స్ మనమెన్నో చూశాం.. వయసు తగ్గుతుందంటే చాలు.. ఎంత డబ్బు పెట్టడానికైనా సిద్ధపడిపోతాం.. ఇది చివరకు ఎంత వరకూ వెళ్లిందంటే.. పక్షుల రెట్టలను కూడా పులిమేసుకునేంత వరకూ.. ఇక్కడ జరుగుతోంది కూడా అదే. ఈ పక్షి పేరు నైటింగేల్.. మన దగ్గర బుల్బుల్ పిట్ట అని అంటారు.. అయితే.. జపాన్లో నైటింగేల్లోని ఓ అరుదైన రకం పక్షి ఉంది. దాని రెట్టను రాసుకుంటే.. వయసు తగ్గినట్లు కనిపిస్తుందని.. మొటిమల వల్ల ముఖంపై వచ్చే మచ్చలను అది తొలగిస్తుందన్నది జపానోళ్ల విశ్వాసం. అక్కడ 17వ శతాబ్దంలోనే ఈ నైటింగేల్ ఫేషియల్ ఫేమస్. తర్వాత అది ఆ నోటా ఈ నోటా పాకి.. విదేశాలకూ చేరింది. ఈ ఫేషియల్ అంటే పడి చచ్చే జాబితాలో హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్, విక్టోరియా బెక్హాం వంటి వారూ చేరారు. ఓ సారి పులుముకుంటే రూ.20 వేలు సమర్పించుకోవాల్సిందే. ఎందుకింత ధర అంటే.. జపాన్లో స్థానిక నైటింగేల్ పిట్టలు తగ్గిపోతుండటంతో దాని రెట్టకూ డిమాండ్ పెరిగింది. పైగా.. నైటింగేల్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. దానికి ఏది పడితే అది పెట్టరు. పళ్లు లాంటి మంచి ఫుడ్ మాత్రమే పెడతారు. పురుగులు తినడం నిషిద్ధం. ఇంత మంచి ఫుడ్ తినడం వల్ల వచ్చే మంచి రెట్టతో ఎంతో మంచి జరిగిపోతుందట. దాన్ని పౌడర్ కింద మార్చి.. మరికొన్ని పదార్థాలు కలిపి.. ఫేషియల్ చేస్తారు. ఈ ఫేషియల్కు మంచి డిమాండ్ ఉంది. -
అమ్మ మాట జవదాటను
అమ్మ మాట జవదాటను చాలా మంది హీరోయిన్లు అమ్మ గారాల బిడ్డలే. వారి మాటలే వేదం. క్రేజీ నటి హన్సిక తల్లి చాటు కూతురే. అమ్మే ఆమెకు మార్గ దర్శకురాలు. బాలతారగా ప్రవేశించిన ఈ బబ్లీ గర్ల్ స్టేజీ కార్యక్రమాలు, మోడలింగ్, యాడ్స్ అంటూ తన నటనకు పదునుపెట్టుకుంటూ వచ్చింది. ప్రస్తుతం ప్రముఖ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. కోలీవుడ్లో అత్యధిక చిత్రాలు చేస్తున్న హీరోయిన్ హన్సికే. ఆ మధ్య ప్రేమ వ్యవహారంలో కాస్త వేడి పుట్టించినా ప్రస్తుతం బుద్దిగా నటనపైనే దృష్టి సారించింది. ఈ భామ త్వరలో నటుడు విశాల్తో రొమాన్స్కు సిద్ధం అవుతోంది. అమ్మ మాట జవదాటని హన్సిక ఈ మధ్య నటుడు శింబుతో ప్రేమ వ్యహారంలో పడి తల్లి హితబోధను పెడచెవిన పెట్టి తప్పటడుగులు వేసే ప్రయత్నం చేసింది. ఆ విధంగా కాస్త సంచలనం కలిగించినా శింబు ప్రేమకు రాంరాం పలికి మళ్లీ అమ్మ గూటికే చేరింది. ఏ విషయమైనా అమ్మతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటోందట. కథల ఎంపికలోనే కాకుండా ఏ హీరోతో జత కట్టాలి వంటి విషయాలను హన్సిక అమ్మే చూసుకుంటున్నారట. దీని గురించి ఈ క్రేజీ హీరోయిన్ తెలుపుతూ బాల తారగా నటిస్తున్నప్పటి నుంచే అమ్మ చెప్పినట్టే నడుచుకుంటున్నానని తెలిపింది. ఇప్పటికీ అదే అలవాటుగా మారిందని పేర్కొంది. ఇటీవల ఈ అమ్మడు ఒక సాహస కార్యం చేసింది. చెన్నైలోని ఒక సినీ కాంప్లెక్స్కు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా వెళ్లి సినిమా చూసొచ్చింది. హన్సిక లాంటి స్టార్ సినిమా కొస్తే ప్రేక్షకుల కంట పడకుండా ఉండడం సాధ్యమా చాలా మంది ఆమెను గుమికూడి ఆటోగ్రాఫ్లు తమ సెల్ఫోన్లతో ఫొటోలు తీసుకోవడం కార్యక్రమాలతో ఆ ప్రాంతం కలకలంగా మారిపోయింది. అయినా అదంతా అధిగమించి హన్సిక సురక్షితంగా ఎవరి సాయం లేకుండా ఇల్లు చేరింది. -
మళ్లీ హన్సిక హవా
జరిగేది జరగక మానదు. అయితే జరిగిన దాన్ని మనకనుకూలంగా మార్చుకోవడం ఉత్తమ లక్షణం అన్నది జీవిత సత్యం. నటి హన్సిక ఈ నగ్న సత్యాన్ని గ్రహించినట్లున్నారు. ఈ బ్యూటీ దశాబ్దం క్రితమే నటనకు శ్రీకారం చుట్టారు. యాడ్స్, మోడలింగ్, సినిమాలు అంటూ నటిగా తన స్థాయిని పెంచుకుంటూ వచ్చారు. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో క్రేజీ హీరోయిన్గా ప్రకాశిస్తున్న ఈ బ్యూటీ వద్దంటే అవకాశాలు వచ్చి పడుతున్నాయి. అయితే 25 ఏళ్లు పైబడుతున్న హన్సిక వయసు ప్రభావం కావచ్చు, మరేదైనా కావచ్చు నటుడు శింబుతో ప్రేమలో పడ్డారు. తమ ప్రేమ పెళ్లికి దారి తీస్తుందని ప్రకటించడంతో హన్సిక కెరీర్పై తీవ్ర ప్రభావాన్నే చూపింది. శింబుతో ప్రేమ విషయంలో పునరాలోచన చేసుకోవటాన్ని కొందరు సీనియర్ నటీనటులు బహిరంగంగానే హితవు పలికారు. అది అటుంచితే ఆమెతో సినిమాలు చేద్దామనుకున్న కొందరు నిర్మాతలు వెనకడుగేశారు. ఇంటిలో తల్లి ఒత్తిడికి గురయ్యారు. ఎట్టకేలకు హన్సిక శింబుతో సుదీర్ఘంగా చర్చించి ప్రేమకు ఫుల్స్టాప్ పెట్టినట్లు ఆయనతోనే చెప్పించి పలు సమస్యల నుంచి బయటపడ్డారు. చక్కని పరిణితితో ప్రవర్తించిన హన్సికకు తెలివైన అమ్మాయని పరిశ్రమ వర్గాలంటున్నారు. అంతేకాదు ఈ మిల్కీ బ్యూటీకి మళ్లీ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అత్యధిక చిత్రాలు చేస్తున్న దక్షిణాది నటి ఎవరన్నా ఉన్నారంటే అది హన్సికనే. తమిళం, తెలుగు భాషలతో కలిసి మొత్తం ఎనిమిది చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. అంటే హన్సిక హవా మళ్లీ మొదలైనట్లే. -
యాడ్ క్లిక్ చేస్తే టాక్ టైం ప్రీ....