ఈద్‌ ముబారక్‌ ముస్లింలకు వైఎస్‌ జగన్‌ రంజాన్‌ శుభాకాంక్షలు | YS Jagan Wishes To Muslims On Ramadan Festival | Sakshi
Sakshi News home page

ఈద్‌ ముబారక్‌ ముస్లింలకు వైఎస్‌ జగన్‌ రంజాన్‌ శుభాకాంక్షలు

Mar 30 2025 5:05 AM | Updated on Mar 30 2025 11:52 AM

YS Jagan Wishes To Muslims On Ramadan Festival

సాక్షి, అమరావతి: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సోమవారం జరుపుకోనున్న సందర్భంగా మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈద్‌ ముబారక్‌(శుభాకాంక్షలు) తెలిపారు. రంజాన్‌ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.

అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధారి్మక చింతనల కలయికే రంజాన్‌ మాసం విశిష్టత అని పేర్కొన్నారు. పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ఒక ముగింపు వేడుక అని వైఎస్‌ జగన్‌ తెలిపారు. మనిషి లోని చెడు భావనలను, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని వైఎస్‌ జగన్‌ తన సందేశంలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement