![YSR Vahana Mitra Scheme 4th Phase Aid Release Program By CM Jagan - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/15/APCMYSJagan.jpg.webp?itok=FZZI8qGq)
న్యూయార్క్: టెస్లా సీఈవో ఎలాన్ మస్�...
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో దార...
లక్నో: అదనపు కట్నం ఇవ్వలేదనే కారణంతో �...
సాక్షి, విశాఖ: టీడీపీ నేత కీచకపర్వం చూ...
ఢిల్లీ: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి �...
ఏలూరు టౌన్: ఏపీలో కూటమి సర్కార్ ఏర్�...
పసిడి ధరలు సామాన్యులను బెంబేలెత్తిస�...
ప్రపంచంలోనే అత్యంత భారీ ఆధ్యాత్మిక స...
తిరుపతి, సాక్షి: జనసేన నేత కిరణ్ రాయల...
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత�...
ఆడబిడ్డ పుట్టిందని ఏ చెత్తకుప్పల్లో�...
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో కాంగ్రెస్ 14 �...
సాక్షి, తిరుపతి: జనసేన నాయకుడు కిరణ్ ...
తిరుపతి, సాక్షి: అమ్మాయిలను మోసం చేసి ...
ఎలాగైతేనేం.. ముఖ్యమంత్రి చంద్రబాబు న�...
Published Fri, Jul 15 2022 8:25 AM | Last Updated on Fri, Jul 15 2022 12:41 PM
వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమం హైలెట్స్
ఒక్కో లబ్ధిదారునికి రూ.10వేల చొప్పున మొత్తం రూ.261.51 కోట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు. దీంతో ఈ నాలుగు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.1,026 కోట్లను పంపిణీ చేసింది.
మూడేళ్లలో రూ.1.65 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని సీఎం జగన్ అన్నారు. ఎక్కడా కూడా లంచాలు లేవు, వివక్ష లేదన్నారు. కులం చూడలేదు, పార్టీ చూడలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. అప్పటి ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని సీఎం కోరారు.
నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని చెప్పిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే వాహనమిత్ర పథకం ప్రారంభించామని సీఎం జగన్ అన్నారు. కరోనా సమయంలోనూ వాహన మిత్ర పథకం అమలు చేశాం. మనది పేదల ప్రభుత్వం.. పేదలకు అండగా ఉండే ప్రభుత్వమని సీఎం అన్నారు.
వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర ఆర్థిక సాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున 261.51 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత వాహనం కలిగిన వారికి ఆర్థిక సాయం అందజేస్తున్నామని సీఎం అన్నారు. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందచేస్తున్నామన్నారు. తమకు తామూ స్వయం ఉపాధి కల్పించుకుని.. ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారన్నారు.
పాదయాత్రలో ఇచ్చిన మాట సీఎం జగన్ నిలబెట్టుకున్నారని లబ్ధిదారులు హరియారామ్ అన్నారు. ఏటా రూ.10 వేలు ఇచ్చి మమల్ని ఆదుకుంటున్నారన్నారు. కరోనా సమయంలోనూ మమ్మల్ని ఆదుకున్నారని ఆయన అన్నారు.
అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోవడం తథ్యమని మంత్రి అన్నారు. జగనన్న సైనికులుగా సంక్షేమ పథకాలు గురించి ప్రచారం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు.
మనసున్న మారాజు సీఎం వైఎస్ జగన్ అని వీఎంఆర్డీఏ చైర్ పర్సన్ అక్కరమాని విజయ నిర్మల అన్నారు. రాష్ట్రంలో పారదర్శకంగా పాలన జరుగుతోందన్నారు. అవినీతి లేకుండా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు చేరుతున్నాయన్నారు.
వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. అనంతరం వైఎస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులతో ఫొటో సెషన్లో పాల్గొన్నారు.
విశాఖ ఎయిర్పోర్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేరుకున్నారు. సీఎంకు మంత్రులు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, మేయర్ హరివెంకట కుమారి, వైఎస్సార్సీపీ నేతలు, అధికారులు స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్కు సీఎం బయలుదేరారు. వాహన మిత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం బయలుదేరారు. వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. అనంతరం సీఎం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి చేరుకోనున్నారు. అక్కడి నుంచి వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు అనంతరం రాజమండ్రి విమానాశ్రయంలో అధికారులతో వరదపై సమీక్షించనున్నారు.
ఇక వైఎస్సార్ వాహనమిత్ర పంపిణీ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం విశాఖపట్నం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ వైఎస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఉ.9.20 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు బయల్దేరతారు. 10.30కు విశాఖ చేరుకుంటారు. 11.05కు ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్కు చేరుకుని వైఎస్సార్ వాహన మిత్ర లబి్ధదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మ.1.20 గంటలకు తిరిగి తాడేపల్లికి బయల్దేరుతారు.
గత మూడేళ్ల కంటే ఈ ఏడాది మరింత ఎక్కువమంది లబ్ధిదారులకు ఈ పథకాన్ని ప్రభుత్వం అందించనుండటం విశేషం. లబ్ధిదారుల్లో అత్యధికులు బడుగు, బలహీనవర్గాలకు చెందినవారే ఉండటం గమనార్హం.
2022–23కుగాను ఈ పథకం కింద 2,61,516 మంది అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సిక్యాబ్ డ్రైవర్లకు ఈ ప్రయోజనం కలి్పంచనుంది. ఒక్కో లబి్ధదారునికి రూ.10వేల చొప్పున మొత్తం రూ.261.51 కోట్లను శుక్రవారం విశాఖపట్నంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తారు. దీంతో ఈ నాలుగు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.1,026 కోట్లను పంపిణీ చేసినట్లవుతుంది.
రవాణా రంగంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది కూడా అందించనుంది.
Comments
Please login to add a commentAdd a comment