ఎల్లుండి విజయవాడలో వైఎస్సార్‌సీపీ పదాధికారుల సమావేశం | CM Jagan To Meet YSRCP Leaders On 9th October At Vijayawada | Sakshi
Sakshi News home page

ఎల్లుండి విజయవాడలో వైఎస్సార్‌సీపీ పదాధికారుల సమావేశం

Published Sat, Oct 7 2023 4:25 PM | Last Updated on Sat, Oct 7 2023 4:40 PM

YSRCP Meeting At Vijayawada On October 9th - Sakshi

సాక్షి, తాడేపల్లి: సోమవారం విజయవాడలో వైఎస్సార్‌సీపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగే ఈ సభకు రాష్ట్ర నలమూలల నుంచి పార్టీ శ్రేణులు భారీగా  హాజరుకానున్నారు. మొత్తం 8,222 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ కో ఆర్డినేటర్లు, సమన్వయకర్తలు, మున్సిపల్ ఛైర్మన్లు, మార్కెట్ యార్డు ఛైర్మన్లు, ఎంపీపీలు సహా పలువురు ప్రతినిధులు హాజరవ్వనున్నారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎన్నికలకు క్యాడర్‌ను సమాయత్తం చేయనున్నారు. రానున్న రోజుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనునున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement