ఉద్యోగుల సేవలు మరువలేనివి | - | Sakshi

ఉద్యోగుల సేవలు మరువలేనివి

Apr 1 2025 1:03 PM | Updated on Apr 1 2025 3:41 PM

రాయచోటి అర్బన్‌ : వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగుల సేవలు మరువలేనివని అడిషనల్‌ డీఎంఅండ్‌హెచ్‌ఓ శైలజ, ఆర్‌ఐఓ ఉషశ్రీ అన్నారు. రాయచోటిలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసిన డాక్టర్‌ కొండయ్యకు స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సోమవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండయ్య విధులను అంకితభావంతో నిర్వర్తించడంతోపాటు ఉద్యోగుల పట్ల సానుకూలతతో వ్యవహరించారన్నారు. క్రమశిక్షణ, నిజాయితీకి మారు పేరుగా నిలిచారన్నారు. డాక్టర్‌ కొండయ్య మాట్లాడుతూ ఉద్యోగులంతా నిబద్ధతతో పనిచేసి తగు గుర్తింపు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో రియాజ్‌బేగ్‌, విష్ణువర్దన్‌రెడ్డి, దేవశిరోమణి, ఓబుళరెడ్డి, రవికుమార్‌, మునీవర్‌, ప్రసాద్‌, ప్రసాద్‌యాదవ్‌, వెంక టేశ్వర రెడ్డి, దేవేంద్ర, బలరాం, మహాదేవ, వేణుగోపాల్‌రెడ్డి, శివారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement