
నిరాధార వార్తలు పోస్టు చేస్తే కఠిన చర్యలు
గుంటూరు రూరల్: సామాజిక మాధ్యమాల్లో నిరాధార వార్తలను పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, సౌత్ సబ్ డివిజన్ డీఎిస్పీ ఎ. భానోదయ తెలిపారు. ఆదివారం నగరంలోని తన కార్యాలయంలో డీఎస్పీ మాట్లాడారు. ప్రజా రిపోర్టర్ అనే వాట్సాప్ గ్రూప్లో 96401 28296 అనే ఫోన్ నంబర్ కలిగిన వ్యక్తి గుంటూరు పోలీసుల అదుపులో దళిత జర్నలిస్టు? మూడు రోజులైనా ఇంకా కోర్టులో ప్రవేశపెట్టలేదని పోస్టును వైరల్ చేసినట్టు వివరించారు. వాస్తవానికి దళిత జర్నలిస్టులెవరినీ అరెస్టు చేయలేదని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమ మద్యం తెచ్చి విక్రయిస్తున్న కేసులో మార్చి 22న తెల్లవారు జామున కూరపాటి విజయ్ను అరెస్టు చేసి, అదే రోజు మధ్యాహ్నం న్యాయస్థానంలో ప్రవేశపెట్టామని చెప్పారు. అతనికి న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు వెల్లడించారు. వాస్తవదూర పోస్టును పెట్టిన వ్యక్తిపై కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
సౌత్ డీఎస్పీ భానోదయ
Comments
Please login to add a commentAdd a comment