జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో కానిస్టేబుల్ ప్రతిభ
బాపట్లటౌన్: జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో బాపట్ల జిల్లా ఖ్యాతి ఇనుమడింపచేయటం హర్షనీయమని జిల్లా ఎస్పీ తుషార్డూడీ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాపట్ల జిల్లా, చందోలు పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న నాగ బ్రహ్మారెడ్డిని జిల్లా ఎస్పీ అభినందించి స్విమ్మింగ్లో సాధించిన మెడల్స్తో సత్కరించి, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ నాగ బ్రహ్మారెడ్డి 2025 ఫిబ్రవరి 2న విజయవాడలో జరిగిన 25వ కృష్ణా రివర్ క్రాసింగ్ స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటారన్నారు. దుర్గా ఘాట్ నుంచి 1.5 కిలోమీటర్ల దూరాన్ని 21 నిమిషాలలో ఈది పూర్తిచేసి విజేతగా నిలిచాడు. 2025 మార్చి 24 నుండి 28వ తేదీలలో గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్లో జరిగిన 72వ ఆల్ ఇండియా పోలీస్ ఆక్వాటిక్స్ క్లస్టర్ చాంపియన్ షిప్ 2024–2025 పోటీలలో పాల్గొని సత్తా చాటారన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుజరాత్ లోని గాంధీనగర్లో జరిగిన స్విమ్మింగ్ పోటీలలో పాల్గొని విజేతగా నిలవడంతోపాటు గతంలో జాతీయ స్థాయిలో మరో 4 అవార్డులు అందుకున్నారన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరెన్నో క్రీడా పోటీలలో పాల్గొని సత్తా చాటాలన్నారు. పోలీస్ శాఖలో విధులు నిర్వహించే పోలీస్ అధికారులు సిబ్బంది బ్రహ్మారెడ్డి స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొని ప్రతిభ కనబరచాలన్నారు. క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచే పోలీస్ అధికారులను సిబ్బందిని ప్రోత్సహిస్తామన్నారు.
అభినందించిన జిల్లా ఎస్పీ తుషార్డూడీ


