
దేశవ్యాప్తంగా బంగారం ధరలు నేడు (సెప్టెంబర్ 1) స్థిరంగా ఉన్నాయి. రెండు రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వచ్చిన పసిడి రేట్లు ఈరోజు నిలకడగా కొనసాగుతున్నాయి. కాస్తయినా తగ్గుతుందని ఆశించిన నేటి కొనుగోలుదారులకు నిరాశ తప్పలేదు.
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.66,950 వద్ద, అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.73,040 వద్ద కొనసాగుతన్నాయి. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇవే ధరలు నిలకడగా ఉన్నాయి. ఢిల్లీలోనూ ఈరోజు పసిడి ధరలలో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,100, అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.73,190 లుగా ఉన్నాయి.
ఇక వెండి విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ ఆదివారం ఎలాంటి కదలిక కనిపించలేదు. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.92,000 వద్ద నిలకడగా కొనసాగుతోంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)