
దేశంలో బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ ఊపందుకున్నాయి. బుధవారం (ఆగస్టు 21) పసిడి ధరలు గణనీయంగా పెరిగాయి. క్రితం రోజున స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు కూడా దిగివస్తాయని కొనుగోలుదారులు ఆశించారు. కానీ మళ్లీ పెరుగుదల బాట పట్టడంతో నిరాశ తప్పలేదు.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.500 పెరిగింది. దీంతో ఇది రూ.67,100 వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రేటు రూ.550 పెరగడంతో రూ. 73,200 వద్దకు ఎగిసింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇవే స్థాయిలో బంగారం ధరలు పెరిగాయి.
దేశ రాజధాని ఢిల్లీలోనూ ఈరోజు బంగారం ధరలు అనూహ్యంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.500 పెరిగి రూ.67,250, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.550 పెరిగి రూ.73,350 లుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా వెండి ధరల్లో మాత్రం ఈరోజు ఎటువంటి కదలిక లేదు. హైదరాబాద్లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.92,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)