
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) ఓఎఫ్ఎస్కు అనూహ్య స్పందన లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఐఆర్సీటీసీలో 20 శాతం వాటాను ఆఫర్ ఫర్సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయిస్తోంది. గురువారం ఇష్యూ మొదలైన రోజునే ఈ ఓఎఫ్ఎస్ 1.98 రెట్లు ఓవర్ సబ్స్క్రైబయింది. నేడు (శుక్రవారం) రిటైల్ ఇన్వెస్టర్లు తమ బిడ్లను దాఖలు చేసుకోవచ్చు. ఈ ఓఎఫ్ఎస్కు ఫ్లోర్ధరను రూ.1,367గా కంపెనీ నిర్ణయించింది.
రూ.4,374 కోట్ల నిధులు....
ఓఎఫ్ఎస్లో భాగంగా 15% వాటాకు సమానమైన 2.4 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నది. అదనంగా సబ్స్క్రైబ్ కావడంతో మరో 5% వాటా(80 లక్షల షేర్లను) గ్రీన్ షూ ఆప్షన్(అదనంగా బిడ్లు వస్తే వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు)గా అట్టేపెట్టుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 4,374 కోట్లు సమకూరుతాయని అంచనా.
ప్రస్తుతం ఐఆర్సీటీసీలో కేంద్ర ప్రభుత్వానికి 87.40 శాతం వాటా ఉంది. పబ్లిక్ హోల్డింగ్ నిబంధనలను పాటించాలంటే ఈ వాటాను 75 శాతానికి తగ్గించుకోవలసి ఉంటుంది. భారత రైల్వేలకు ఐఆర్సీటీసీ కంపెనీ కేటరింగ్ సర్వీసులను అందిస్తోంది. ఆన్లైన్ ద్వారా టికెట్లు విక్రయిస్తోంది. రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ను విక్రయిస్తోంది. ఈ కంపెనీ 2019, అక్టోబర్లో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా రూ.645 కోట్లు సమీకరించింది.
ఓఎఫ్ఎస్ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో ఐఆర్సీటీసీ షేర్ 10 శాతం నష్టంతో రూ.1,452 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment