Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YS Jagan Serious Warning To Chandrababu And TDP
దాడుల రాజకీయం కరెక్ట్‌ కాదు.. వెంటనే ఆపాలి: వైఎస్‌ జగన్‌ హెచ్చరిక

సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో టీడీపీకి ఓటు వేయలేదని ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని అన్నారు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. శిశుపాలుని మాదిరిగా చంద్రబాబు పాపాలు పండుతున్నాయి. రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రెడ్‌ బుక్‌ పేరుతో టార్గెట్‌ చేసి దాడులు చేస్తున్నారు.. ఇలాంటి వెంటనే ఆపాలని వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు.కాగా, వైఎస్‌ జగన్‌ నెల్లూరు జిల్లాలో జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. అనంతరం, వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ..‘పిన్నెల్లిపై అక్రమ కేసులు పెట్టారు. పిన్నెల్లిపై హత్యానేరం మోపారు. కారంపూడి సీఐని పిన్నెల్లి కనీసం చూసిన దాఖలాలు కూడా లేవు. మే 14న ఘటన జరిగితే.. మే 23న హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిజంగా దాడి జరిగితే ఆ మరుసటి రోజు కేసు ఎందుకు పెట్టలేదు?. ఒక్క పిన్నెల్లిపైనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇలానే దాడులు కొనసాగుతున్నాయి. ప్రజలకు మంచి చేసే రాజకీయాలు చేయాలి కానీ.. దౌర్జన్యం కాదు. టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో అక్రమ కేసులు పెడుతున్నారు. టీడీపీకి ఓటు వేయలేదని ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్‌ విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు. ప్రజలు అన్నీ చూస్తున్నారు. దాడుల రాజకీయాలు ఎక్కువ కాలం నిలబడవు. లెక్క జమ చేసి ప్రజలు బాబుకు గట్టిగా జవాబిస్తారు. ప్రతీ గ్రామం, మండల పరిధిలో రెడ్‌ బుక్‌ల పేరుతో దాడులు చేస్తున్నారు. టీడీపీ వాళ్లే కొట్టి.. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. దాడుల రాజకీయాలు మంచిది కాదు.. దగ్గరుండి దాడులను పోత్సహించడం దుర్మార్గం. ఇలాంటివి వెంటనే ఆపాలని హెచ్చరిస్తున్నా అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. ప్రజల్లో వ్యతిరేకతతో వైఎస్సార్‌సీపీ ఓడిపోలేదు. చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీల కారణంగానే 10 శాతం ఓట్లతో చంద్రబాబు గెలిచారు. కులమతాలు చూడకుండా మేము సంక్షేమం అందించాం. ప్రజలు ఇప్పటికీ మా వెంటే ఉన్నారు. శిశుపాలుని మాదిరిగా చంద్రబాబు పాపాలు పండుతున్నాయి. టీడీపీ పాలనలో రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు. ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతు భరోసా, అమ్మ ఒడి అందలేదు. అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం అని పెట్టారు. పాఠశాలలు ప్రారంభమైనా ఇంకా డబ్బులు అందలేదు. రైతు భరోసా రూ.20వేల హామీ ఏమైందో తెలియదు’ అంటూ కామెంట్స్‌ చేశారు.

Team India Victory Parade Live Updates: Rohit Sharma and Co land in Mumbai
పోటెత్తిన ముంబై తీరం.. కాసేపట్లో భారత ఆటగాళ్ల ఓపెన్ బస్ పరేడ్

టీ20 వరల్డ్‌కప్‌-2024 ఛాంపియన్స్‌ భారత జట్టుకు ముంబైలో ఘనస్వాగతం లభించింది. ముంబై వీధుల్లో భారత ఆటగాళ్ల ఓపెన్ బస్ పరేడ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. క్రికెట్ అభిమానుల‌తో ముంబై తీరం పోటెత్తింది. తమ ఆరాధ్య క్రికెటర్లను స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో అభిమానులు రోడ్లపైకి వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

Hemant Soren Back As Jharkhand Chief Minister After 5 Months
జార్ఖండ్‌ సీఎంగా ప్రమాణం చేసిన హేమంత్‌ సోరెన్‌

రాంచీ: జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టారు. గురువారం సాయంత్రం ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణం చేయించారు. భూకుంభకోణం కేసులో అరెస్టయి ఇటీవలే బెయిల్‌పై విడుదలైన హేమంత్‌.. 5 నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ల్యాండ్‌ స్కాం కేసులో మనీలాండరింగ్‌ అభియోగాలపై జనవరి 31న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) అధికారులు హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేశారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య.. అరెస్ట్‌ కంటే ముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో ఫిబ్రవరి 2న చంపయీ సోరెన్‌ రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఐదు నెలల తర్వాత.. హేమంత్‌కు హైకోర్టు తాజాగా బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో జూన్‌ 28న బిర్సా ముండా జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఈ తరుణంలో బుధవారం చంపయీ సోరెన్‌ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే జేఎంఎం సారథ్యంలోని కూటమి ఎమ్మెల్యేలంతా సమావేశమై హేమంత్‌ సోరెన్‌ను తమ సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. తొలుత జులై 7న ఆయన సీఎంగా ప్రమాణం చేస్తారనే ప్రచారం నడిచింది. అయితే ఆలస్యం చేయకుండా ఆయన గవర్నర్‌ను కలిసిన హేమంత్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి గవర్నర్‌ అంగీకారం లభించడంతో.. ఇవాళ సాయంత్రం జార్ఖండ్‌ 13వ ముఖ్యమంత్రిగా గురువారం సాయంత్రం ఆయన ప్రమాణస్వీకారం చేశారు.

TV5 Sambasivarao: Another Sensation Came To Light In Phone Tapping Case
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో సంచలనం.. టీవీ5 సాంబకు రూ.2 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. టీవీ5 సాంబశివరావుకు రూ.2 కోట్లు అందాయని ఇంటెలిజెన్స్ ఎస్పీ భుజంగరావు స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడని హైకోర్టుకు దాఖలు చేసిన కౌంటర్‌లో పోలీసులు తెలిపారు. సంధ్యశ్రీధర్‌రావుపై కేసులు లేకుండా చేసేందుకు రూ.15 కోట్ల డీల్‌ను సాంబశివరావు కుదిర్చాడు. కమీషన్‌ కింద రూ.2 కోట్లు సాంబశివరావు తీసుకున్నాడు. పార్టీఫండ్‌గా బీఆర్‌ఎస్‌కు రూ.13 కోట్లు ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో చెల్లించినట్లు పోలీసులు కౌంటర్‌లో పేర్కొన్నారు. అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.కాగా, ‘ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వందల మంది జడ్జీలు, మాజీ మంత్రులు, జర్నలిస్టులు, న్యాయవాదులు.. ఇలా ఎంతో మంది ఫోన్‌ నంబర్లు, అడ్రస్‌లు, కాల్‌ రికార్డుల జాబితా అంతా సేకరించారు. వారి ఫోన్లు ట్యాప్‌ చేసి బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మార్చుకునే యత్నం చేశారు. హైకోర్టు జడ్జి జస్టిస్‌ కాజా శరత్‌ ఫోన్‌ కూడా ట్యాప్‌ అయింది. ఓ వ్యక్తిపై కేసులు లేకుండా చేసేందుకు టీవీ 5 సాంబశివరావు రూ.2 కోట్లు తీసుకున్నారు’ అని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు బుధవారం హైకోర్టులో అఫిడవిట్‌ సమర్పించింది.సంధ్య కన్వెన్షన్‌ శ్రీధర్‌రావు, టీవీ 5 సాంబశివరావులకు సంబంధించిన హెచ్‌పీసీఎల్‌ పెట్రోల్‌ బంక్‌ వివాదం ఉంది. ఈ పంచాయతీని సాంబశివరావు భుజంగరావు వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రావుపై చాలా క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, వాటి నుంచి బయటపడాలంటే రూ.15 కోట్లు బీఆర్‌ఎస్‌కు పార్టీ ఫండ్‌గా ఇవ్వాలని భుజంగరావు ఒత్తిడి తెచ్చారు.శ్రీధర్‌రావు రూ.13 కోట్లు విలువైన బీఆర్‌ఎస్‌ బాండ్లు కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించిన సాంబశివరావు రూ.2 కోట్లు తీసుకున్నారని భుజంగరావు వాంగ్మూలంలో పేర్కొన్నారు..’’ అని ప్రభుత్వం అఫిడవిట్‌లో తెలిపింది.

PM Modi to visit Russia
త్వరలో ప్రధాని మోదీ రష్యా పర్యటన.. షెడ్యూల్‌ ఖరారు

సాక్షి,న్యూఢిల్లీ : ఐదేళ్లు సుదీర్ఘ కాలం తర్వాత ప్రధాని మోదీ.. రష్యాలో పర్యటించనున్నారు. జులై 8,9 ఈ రెండు రోజుల పాటు రష్యాలో జరిగే భారత్‌-రష్యాల 22వ వార్షిక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల అభివృద్దిపై చర్చ జరగనుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.రష్యా పర్యటన అనంతరం మోదీ ఆస్ట్రియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనతో 40ఏళ్ల చరిత్రలో భారత ప్రధాని తొలిసారి సందర్శించిన ఘనత దక్కనుంది.మోదీ చివరి సారిగా 2019లో రష్యా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో వ్లాడివోస్టోక్ నగరంలో నిర్వహించిన ఎకనమిక్స్‌ కంక్లేవ్‌లో పాల్గొన్నారు. తాజాగా మరోసారి రష్యాలో సందర్శించనున్నారు.

Vijayalakshmi Says Pavithra Gowda Is Not Darshan's Wife
ఆమెను నా భర్త పెళ్లి చేసుకోలేదు.. పోలీసులకు హీరో భార్య లేఖ!

రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్‌తో పాటు నటి పవిత్రా గౌడను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు పోలీసు కస్టడీలో ఉన్నారు. అయితే ఈ కేసు విచారణలో వీరిద్దరిని దంపతులుగా పేర్కొనడంపై దర్శన్‌ భార్య విజయలక్ష్మి అభ్యంతరం తెలిపింది. పవిత్రాగౌడ, దర్శన్‌ భార్య కాదంటూ బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాసింది. ‘ఇటీవల మీరు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవిత్రను దర్శన్‌ భార్య అని తప్పడు ప్రకటన చేశారు. ఆ తర్వాత హోంమంత్రి కూడా అలానే పేర్కొన్నారు. ఆమెను నా భర్త పెళ్లి చేసుకోలేదు. దర్శన్‌కు పవిత్ర కేవలం స్నేహితురాలు మాత్రమే. దర్శన్‌కు చట్టపరమైన జీవిత భాగస్వామిని నేనే. మా పెళ్లి 2003లో జరిగింది. దయచేసి పోలీసు రికార్డుల్లో పవిత్రాగౌడను దర్శన్‌ భార్య అని పేర్కొనకండి. ఇది భవిష్యత్తులో నాకు, నా కుమారుడికి సమస్యలు తెచ్చిపెడుతుంది. పవిత్రకు సంజయ్‌సింగ్‌ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి ఓ కుమార్తె కూడా ఉంది. దయచేసి ఈ వాస్తవాలను రికార్డుల్లో స్పష్టంగా రాయండి’ అని విజయలక్ష్మి విజ్ఞప్తి చేసింది.కాగా, దర్శన్‌కి విజయలక్ష్మితో వివాహమైనప్పటికీ.. కొంతకాలంగా దూరంగా ఉంటున్నాడు. కన్నడ నటి పవిత్రాగౌడతో సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయం దర్శన్‌ అభిమాని రేణుకాస్వామికి తెలియడంతో.. విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందని భావించి.. పవిత్రకు అశ్లీల సందేశాలు పంపించి హెచ్చరించాడు. అదే అతని హత్యకు దారి తీసిందని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది.

Ap Government Discontinue Door Delivery Ration Scheme
ఏపీలో రేషన్‌ డోర్‌ డెలివరీ బంద్‌!

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌ సరుకుల డోర్‌ డెలివరీకి మంగళం పాడాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆ దిశగా స్పష్టమైన వ్యాఖ్యలతో సంకేతాలిచ్చారు.రేషన్‌ డోర్‌ డెలివరీ కోసం కొన్న వాహనాల వల్ల కార్పొరేషన్‌పై రూ.1,500 కోట్ల భారం పడింది. అన్ని వర్గాలతో చర్చించి ఒక నివేదిక సిద్ధం చేస్తాం. కేబినెట్‌లో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం.కాగా, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజా పంపిణీ వ్యవస్థలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. జనవరి 21, 2021 పౌరసరఫరాల శాఖ పరిధిలో రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారాయన.

Ksr Comments On TDP's Trick Politics Of Social Pensions In Andhra Pradesh
బాబు ‘బిల్డప్‌’ షురూ.. సూపర్ సిక్స్ అయిపోయినట్లేనా..!?

ఏపీలో సామాజిక పెన్షన్ల రాజకీయం తమాషాగా ఉంది. గత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో ప్రాంతం చూడం, కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం.. అని స్పష్టంగా చెప్పి ఎక్కడా రాజకీయాలకు తావు లేకుండా కార్యక్రమాలు అమలు చేసింది. అందులో భాగంగా వృద్ధాప్య పెన్షన్లు, ఇతర పెన్షన్లను వలంటీర్ల ద్వారా పంపిణీ చేసింది. ఎక్కడా వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ప్రమేయం లేకుండానే సాగిపోయేది. వలంటీర్లు ప్రభుత్వ వ్యవస్థలో ఒక భాగం కనుక వివాదం, పబ్లిసిటీ లేకుండా పెన్షన్లు పంచేవారు. అయినా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఓటమిపాలైంది.కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం తాను చెప్పిన విధంగా ఈ నెలకైతే పెంచిన సామాజిక పెన్షన్ లు ఇచ్చింది. అంతవరకు ఒకే. మిగిలిన స్కీముల గురించి ఇంకా చెప్పకపోయినప్పటికీ ఇప్పటికే అమలులో ఉన్న పెన్షన్ కు మరో వెయ్యి రూపాయలు పెంచి, మూడు నెలల బకాయిలు చెల్లించారు. ఇంతవరకు అభ్యంతరం లేదు. కానీ ఇదేదో ఇప్పుడే సరికొత్తగా కనిపెట్టినట్లు, మొత్తం రాజకీయ కార్యక్రమంగా మార్చి టీడీపీ ప్రచారానికి వాడుకోవడం మాత్రం ఆక్షేపణీయమే.జూలై ఒకటిన జరిగిన తంతు చూశాకా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి అమాయకత్వంగా చిత్తశుద్దితో రాజకీయాలకు అతీతంగా వలంటీర్లు ద్వారా సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారా అనే భావన ఎవరికైనా రావచ్చు. అదే చంద్రబాబు అయితే ఫక్తు తనదైన రాజకీయ శైలిలో గతంలో జన్మభూమి కమిటీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ఈసారి తన పార్టీ కార్యకర్తల ద్వారా వీటిని పంపిణీ చేయించారు. వలంటీర్లు లేకుండానే పంపిణీ చేయగలం చెప్పుకోవడంతో పాటు ప్రచారం కూడా భారీగా రావాలన్న ఆకాంక్షతో కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేశారన్నది అర్ధం అవుతూనే ఉంది.ఇప్పటికే పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇలా పార్టీ కార్యకర్తల ద్వారా డబ్బు పంపిణీ చేయించవచ్చా అని అడిగితే ఎవరు బదులు ఇస్తారు. వారికి ఉన్న చట్టబద్దత ఏమిటని ఎవరు ప్రశ్నిస్తారు? పైగా టీడీపీ కేంద్ర కార్యాలయమే దీనిపై ఆదేశాలు ఇచ్చి మరీ కార్యకర్తలను రంగంలోకి దింపింది. పేరుకు సచివాలయ సిబ్బంది పెన్షన్లు ఇస్తారని తెలిపినా, హడావుడి చేసి ఫోటోలు దిగింది మాత్రం టీడీపీ, జనసేన కార్యకర్తలే. కొన్ని చోట్ల వీరి మధ్య గొడవలు కూడా జరిగాయట. కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలో, సిబ్బందో ఐదువందల రూపాయలు కట్ చేసుకుని పెన్షన్ ఇచ్చారన్న వార్తలు వచ్చాయి. మరికొన్నిచోట్ల వృద్ధుల ఇళ్లకు వెళ్లకుండా, అందరిని ఒక చోటకు పోగు చేసి పెన్షన్లు అందచేశారు. వైఎస్సార్‌సీపీకి సంబంధించినవారని చెప్పి పలాస తదితర కొన్నిచోట్ల పెన్షన్ ఇవ్వకుండా నిలుపుదల చేశారు. భవిష్యత్తులో పెన్షన్ దారుల సంఖ్యలో కోత పెట్టబోతున్నారని కూడా సమాచారం వస్తోంది.ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సైతం స్వయంగా ఒక లబ్దిదారు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం విశేషం. గతంలో ఎప్పుడూ ఆయన ఇలా చేయలేదు. ఈసారి అలా చేయవలసి వచ్చిందంటే అది వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకువచ్చిన వ్యవస్థ ప్రభావమే అని చెప్పాలి. అంతకు ముందు పద్నాలుగేళ్లు తాను సీఎంగా ఉన్నప్పుడు మాదిరి ఇప్పుడు కూడా లబ్దిదారులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలని చంద్రబాబు చెప్పి ఉంటే నానా రభస అవుతుందని భయపడి ఇళ్లవద్దే పెన్షన్ పంపిణీ చేశారు. చివరికి ఆయన కూడా వలంటీర్ పాత్ర పోషించారని వైఎస్సార్‌సీపీవారు చమత్కరిస్తున్నారు.ఇక్కడే చంద్రబాబు అనండి.. తెలుగుదేశం వారు అనండి.. తమదైన శైలిలో అసత్యాలు చెప్పే యత్నం చేశారు. ఇళ్లకు వెళ్లి పెన్షన్ ఇవ్వడం ఇదే తొలిసారి అన్నట్లు బిల్డప్ ఇచ్చారు. కానీ గత ఐదేళ్లలో చివరి మూడు నెలలు తప్ప మిగిలిన కాలం అంతా వృద్దులు, వికలాంగులు, తదితర వర్గాలకు చెందిన వారి ఇళ్లకు వెళ్లి పెన్షన్ ఇచ్చే పథకాన్ని తీసుకువచ్చిందే వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి అనే సంగతి దాచేస్తే దాగని సత్యం. ఎన్నికల సమయంలో వలంటీర్లు ఈ కార్యక్రమం జరపకుండా అడ్డుపడిందే కూటమి నేతలు అనే సంగతి తెలిసిందే.జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వలంటీర్లు లేకపోతే పంపిణీ ఆగిందా అని ప్రశ్నించడం ద్వారా తన నైజం ప్రదర్శించుకున్నారు. వలంటీర్లు పెన్షన్ దారుల వద్ద లంచాలు తీసుకున్నారని ఆరోపించి వారిపై విషం కక్కారు. వారిపై ఇంకా తన అక్కసు తీరలేదని రుజువు చేసుకున్నారు. తీరాచూస్తే ఇప్పుడు కొంతమంది చేతివాటం ప్రదర్శించారని వీడియో సహితంగా తేలింది. అదే టైమ్ లో వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారికి నెలకు పదివేల రూపాయలు ఇస్తామని చంద్రబాబుతో పాటు తాను ఎందుకు హామీ ఇచ్చింది మాత్రం పవన్ కల్యాణ్ వివరించలేదు. పైగా వారిని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న సంకేతం ఇస్తున్నారు. వారికి ప్రత్యామ్నయా ఉపాధి చూపుతారట.ఉన్న ఉద్యోగం పీకి కొత్తగా ఏదో చేస్తామంటే నమ్మడానికి జనం పిచ్చివారా! అబద్దాలు చెప్పినా జనం ఓట్లు వేసి గెలిపించారు కనుక వారు పిచ్చోళ్లే అని పవన్ కల్యాణ్ భావిస్తుండవచ్చు. తప్పు లేదు. కానీ ఇప్పుడు ఆయన ఇంకో మాట చెప్పారు. లబ్దిదారుల అర్హతలపై రీసర్వే చేయించాలని అన్నారు. అంటే దాని అర్థం.. లబ్దిదారులలో కోత పెడతామనే కదా! ఈ సంగతి ఎన్నికల సమయంలో ఎందుకు చెప్పలేదు. కేవలం వెయ్యి రూపాయల పెన్షన్ పెంచుతామని మాత్రమే ఎందుకు ప్రచారం చేశారు. ఇది జనాన్ని మాయ చేయడం కాదా? అని అడిగితే జవాబు ఏమి ఉంటుంది. ఇక్కడే వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి అందరికి గుర్తుకు వస్తారు. ఆయన పార్టీలు చూడకుండా ప్రజలకు మేలు చేయాలని తలపెట్టి దెబ్బతిన్నారు.చంద్రబాబు నాయుడు అయితే యథా ప్రకారం ప్రవచనాలు వల్లించారు. పేదరికం లేని సమాజం సృష్టించడమే ఆయన లక్ష్యమట. ఈ మాట 1995లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చెబుతూనే ఉన్నారు. కాలం ఆయనకు కలిసి వచ్చి నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు కానీ, పేదరికం మాత్రం పోలేదు. సంపద సృష్టించి పేదలకు పంచుతానని చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. ఆ బ్రహ్మ పదార్ధం ఎలా ఉంటుందో ఎవరికి కనిపించదు. వినేవాడు వెర్రివాడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అన్నట్లుగా ఉంటాయి ఈ మాటలు. పోలవరం పూర్తి అయితే సంపద వచ్చేసేదట. పేదరికం పోయేదట. ఆయన పాలన ఐదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి కదా! అయినా పేదరికం ఎందుకు కొనసాగుతోంది. జనాన్ని మభ్య పెట్టడానికి ఇలాంటివి మాట్లాడుతుంటారు. అందులో చంద్రబాబు నిపుణుడే అని చెప్పాలి.గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల మయం చేసిందని విమర్శించిన చంద్రబాబు తాను పవర్ లోకి వచ్చిన ఇరవైరోజులలోనే ఏడువేల కోట్ల అప్పు చేశారు. ఈ అప్పులనే సంపద అని ప్రజలు అనుకోవాలి కాబోలు. ఈ అప్పులలో తమకు ఎంతో కొంత వాటా వస్తుంది కనుక, ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా కూడా ఈ అప్పులపై నోరు విప్పడం లేదు. చంద్రబాబుకు అనుభవం ఉంది కనుకే పెన్షన్లు ఇవ్వగలిగారని పవన్ కల్యాణ్ సర్టిఫికెట్ ఇచ్చారు. అంటే మరి గత ఐదేళ్లలో వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పెద్దగా ప్రచారం లేకుండానే ప్రతి నెల మొదటితేదీకే పెన్షన్లు ఇచ్చింది కదా! అది గొప్ప విషయం కాదా? చంద్రబాబు తన అనుభవంతో అప్పులు తెచ్చారని పవన్ భావిస్తున్నారా! ఈ అప్పులతో రాష్ట్రం శ్రీలంక అవ్వదని కూడా ఆయన చెప్పి ఉండాల్సింది.ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. గతంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించిన చంద్రబాబు ఈసారి ఒక్క పవన్ కల్యాణ్ కు మాత్రమే ఆ పదవి కట్టబెట్టి వెయిట్ పెంచారని ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత అన్నిచోట్ల పవన్ కల్యాణ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆయన ఫోటోలు సైతం ఉంచాలని చంద్రబాబు చెప్పినట్లు లీకులు వచ్చాయి. కానీ వారంతా భావిస్తున్న ఇంత ప్రతిష్టాత్మక కార్యకమం ప్రచార ప్రకటనలో మాత్రం పవన్ కల్యాణ్ ఫోటో కనిపించలేదు. ఒక్క చంద్రబాబు ఫోటోనే ప్రచురించారు. రామోజీరావు సంస్మరణ సభ ప్రకటనలో కూడా పవన్ కల్యాణ్‌ పేరే వేయలేదు. అదేదో చంద్రబాబు రాజగురువు సంస్మరణ సభ కనుక పవన్ కల్యాణ్ పేరు వేయలేదులే అని అనుకున్నారు. కానీ పెన్షన్లు పంపిణీ ఇది ప్రభుత్వపరంగా చేసిన ప్రతిష్టాత్మక కార్యక్రమం కదా! అయినా పవన్ కల్యాణ్ పోటో వేయలేదేమిటా అని జనసేన వారు ఆవేదన చెందుతున్నారు.పవన్ కల్యాణ్ వెనుక ఉన్న సామాజికవర్గం వారు కూడా మదన పడుతున్నారు. ఆయా రాష్ట్రాలలో ఉప ముఖ్యమంత్రుల ఫోటోలు కూడా ప్రచారంలో వాడుతుంటారు. అయినా పవన్ కల్యాణ్ దీనిని అవమానంగా భావించకపోవచ్చు. టీడీపీ వారు ఏమి చేసినా పడి ఉండడానికి ఆయన ఎప్పుడో సిద్దపడిపోయారన్న భావన ఉంది. ఏది ఏమైనా వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి పార్టీ రహితంగా ఇలాంటి సంక్షేమ స్కీములు ఎన్నిటినో అమలు చేసి తన మంచిని ప్రజలు గుర్తిస్తారని ఆశిస్తే తద్విరుద్దంగా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు దీనిని ఫక్తు రాజకీయం చేసి పార్టీ కార్యక్రమం చేశారు. ఒక్క స్కీము అమలు చేసి, సూపర్ సిక్స్ అయిపోయినంతగా బిల్డప్ ఇచ్చే యోచనలో ఉన్నారు. చంద్రబాబు, పవన్ లు ఇప్పుడు ఏమి చెప్పినా, ఏమి చేసినా అంతా రైటే అని జనం ఒప్పుకుంటారా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Today Gold and Silver Price 4 July 2024
పసిడి ప్రియులకు షాక్!.. ఒక్కసారిగా పెరిగిన ధరలు

జులై ప్రారంభం నుంచి స్వల్పంగా పెరుగుతూ ఉన్న పసిడి ధరలు ఈ రోజు (జులై 4) మరింత పైకి లేచాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు గరిష్టంగా రూ.710 పెరిగింది. దీంతో బంగారం ధర మళ్ళీ తారా స్థాయికి చేరుకుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు నేడు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్‌లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67000 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.73090 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 650, రూ. 710 పెరిగింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. కాబట్టి నేడు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67150 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73240 వద్ద ఉంది. నేడు 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 650 పెరిగింది. 24 క్యారెట్స్ ధరలు రూ. 710 పెరిగింది.చెన్నై విషయానికి వస్తే.. బంగారం ధరలు వరుసగా రూ. 650, రూ. 710 పెరిగి.. రూ. 67600 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 73750 (24 క్యారెట్స్ 10 గ్రా) వద్ద నిలిచాయి. ఇతర రాష్ట్రాలకంటే చెన్నైలో బంగారం ధరలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.వెండి ధరలుదేశంలో వెండి ధరలు గత నాలుగు రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. నేడు ఒక కేజీ వెండి ధర నిన్నటి కంటే రూ. 1500 పెరిగింది. దేంతో ఈ రోజు (జులై 4) కేజీ వెండి రూ. 93000లకు చేరింది. గంట నాలుగు రోజుల్లో వెండి ధర ఏకంగా రూ. 3000 పెరిగింది. ఈ ధరలు ఇలాగె కొనసాగితే కేజీ వెండి లక్ష రూపాయలకు చేరుతుందని తెలుస్తోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?

NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all