Top Stories
ప్రధాన వార్తలు
![YS Jagan Serious Warning To Chandrababu And TDP](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/YSJagan_1.jpg.webp?itok=0xj0mySD)
దాడుల రాజకీయం కరెక్ట్ కాదు.. వెంటనే ఆపాలి: వైఎస్ జగన్ హెచ్చరిక
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో టీడీపీకి ఓటు వేయలేదని ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శిశుపాలుని మాదిరిగా చంద్రబాబు పాపాలు పండుతున్నాయి. రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రెడ్ బుక్ పేరుతో టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు.. ఇలాంటి వెంటనే ఆపాలని వైఎస్ జగన్ హెచ్చరించారు.కాగా, వైఎస్ జగన్ నెల్లూరు జిల్లాలో జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. అనంతరం, వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ..‘పిన్నెల్లిపై అక్రమ కేసులు పెట్టారు. పిన్నెల్లిపై హత్యానేరం మోపారు. కారంపూడి సీఐని పిన్నెల్లి కనీసం చూసిన దాఖలాలు కూడా లేవు. మే 14న ఘటన జరిగితే.. మే 23న హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిజంగా దాడి జరిగితే ఆ మరుసటి రోజు కేసు ఎందుకు పెట్టలేదు?. ఒక్క పిన్నెల్లిపైనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇలానే దాడులు కొనసాగుతున్నాయి. ప్రజలకు మంచి చేసే రాజకీయాలు చేయాలి కానీ.. దౌర్జన్యం కాదు. టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో అక్రమ కేసులు పెడుతున్నారు. టీడీపీకి ఓటు వేయలేదని ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్ విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు. ప్రజలు అన్నీ చూస్తున్నారు. దాడుల రాజకీయాలు ఎక్కువ కాలం నిలబడవు. లెక్క జమ చేసి ప్రజలు బాబుకు గట్టిగా జవాబిస్తారు. ప్రతీ గ్రామం, మండల పరిధిలో రెడ్ బుక్ల పేరుతో దాడులు చేస్తున్నారు. టీడీపీ వాళ్లే కొట్టి.. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. దాడుల రాజకీయాలు మంచిది కాదు.. దగ్గరుండి దాడులను పోత్సహించడం దుర్మార్గం. ఇలాంటివి వెంటనే ఆపాలని హెచ్చరిస్తున్నా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రజల్లో వ్యతిరేకతతో వైఎస్సార్సీపీ ఓడిపోలేదు. చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీల కారణంగానే 10 శాతం ఓట్లతో చంద్రబాబు గెలిచారు. కులమతాలు చూడకుండా మేము సంక్షేమం అందించాం. ప్రజలు ఇప్పటికీ మా వెంటే ఉన్నారు. శిశుపాలుని మాదిరిగా చంద్రబాబు పాపాలు పండుతున్నాయి. టీడీపీ పాలనలో రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు. ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతు భరోసా, అమ్మ ఒడి అందలేదు. అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం అని పెట్టారు. పాఠశాలలు ప్రారంభమైనా ఇంకా డబ్బులు అందలేదు. రైతు భరోసా రూ.20వేల హామీ ఏమైందో తెలియదు’ అంటూ కామెంట్స్ చేశారు.
![Team India Victory Parade Live Updates: Rohit Sharma and Co land in Mumbai](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/Rohitsharma.jpg.webp?itok=eCNSZ6pn)
పోటెత్తిన ముంబై తీరం.. కాసేపట్లో భారత ఆటగాళ్ల ఓపెన్ బస్ పరేడ్
టీ20 వరల్డ్కప్-2024 ఛాంపియన్స్ భారత జట్టుకు ముంబైలో ఘనస్వాగతం లభించింది. ముంబై వీధుల్లో భారత ఆటగాళ్ల ఓపెన్ బస్ పరేడ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. క్రికెట్ అభిమానులతో ముంబై తీరం పోటెత్తింది. తమ ఆరాధ్య క్రికెటర్లను స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో అభిమానులు రోడ్లపైకి వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
![Hemant Soren Back As Jharkhand Chief Minister After 5 Months](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/Hemanth_Soren_Again_CM.jpg.webp?itok=fOjzzKNn)
జార్ఖండ్ సీఎంగా ప్రమాణం చేసిన హేమంత్ సోరెన్
రాంచీ: జేఎంఎం నేత హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టారు. గురువారం సాయంత్రం ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. భూకుంభకోణం కేసులో అరెస్టయి ఇటీవలే బెయిల్పై విడుదలైన హేమంత్.. 5 నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ల్యాండ్ స్కాం కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై జనవరి 31న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు హేమంత్ సోరెన్ను అరెస్టు చేశారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య.. అరెస్ట్ కంటే ముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో ఫిబ్రవరి 2న చంపయీ సోరెన్ రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఐదు నెలల తర్వాత.. హేమంత్కు హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. దీంతో జూన్ 28న బిర్సా ముండా జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఈ తరుణంలో బుధవారం చంపయీ సోరెన్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే జేఎంఎం సారథ్యంలోని కూటమి ఎమ్మెల్యేలంతా సమావేశమై హేమంత్ సోరెన్ను తమ సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. తొలుత జులై 7న ఆయన సీఎంగా ప్రమాణం చేస్తారనే ప్రచారం నడిచింది. అయితే ఆలస్యం చేయకుండా ఆయన గవర్నర్ను కలిసిన హేమంత్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి గవర్నర్ అంగీకారం లభించడంతో.. ఇవాళ సాయంత్రం జార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా గురువారం సాయంత్రం ఆయన ప్రమాణస్వీకారం చేశారు.
![TV5 Sambasivarao: Another Sensation Came To Light In Phone Tapping Case](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/TV5-Sambasivarao3.jpg.webp?itok=tHzC-zrp)
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. టీవీ5 సాంబకు రూ.2 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. టీవీ5 సాంబశివరావుకు రూ.2 కోట్లు అందాయని ఇంటెలిజెన్స్ ఎస్పీ భుజంగరావు స్టేట్మెంట్లో పేర్కొన్నాడని హైకోర్టుకు దాఖలు చేసిన కౌంటర్లో పోలీసులు తెలిపారు. సంధ్యశ్రీధర్రావుపై కేసులు లేకుండా చేసేందుకు రూ.15 కోట్ల డీల్ను సాంబశివరావు కుదిర్చాడు. కమీషన్ కింద రూ.2 కోట్లు సాంబశివరావు తీసుకున్నాడు. పార్టీఫండ్గా బీఆర్ఎస్కు రూ.13 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో చెల్లించినట్లు పోలీసులు కౌంటర్లో పేర్కొన్నారు. అఫిడవిట్ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.కాగా, ‘ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వందల మంది జడ్జీలు, మాజీ మంత్రులు, జర్నలిస్టులు, న్యాయవాదులు.. ఇలా ఎంతో మంది ఫోన్ నంబర్లు, అడ్రస్లు, కాల్ రికార్డుల జాబితా అంతా సేకరించారు. వారి ఫోన్లు ట్యాప్ చేసి బీఆర్ఎస్కు అనుకూలంగా మార్చుకునే యత్నం చేశారు. హైకోర్టు జడ్జి జస్టిస్ కాజా శరత్ ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఓ వ్యక్తిపై కేసులు లేకుండా చేసేందుకు టీవీ 5 సాంబశివరావు రూ.2 కోట్లు తీసుకున్నారు’ అని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు బుధవారం హైకోర్టులో అఫిడవిట్ సమర్పించింది.సంధ్య కన్వెన్షన్ శ్రీధర్రావు, టీవీ 5 సాంబశివరావులకు సంబంధించిన హెచ్పీసీఎల్ పెట్రోల్ బంక్ వివాదం ఉంది. ఈ పంచాయతీని సాంబశివరావు భుజంగరావు వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శ్రీధర్రావుపై చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయని, వాటి నుంచి బయటపడాలంటే రూ.15 కోట్లు బీఆర్ఎస్కు పార్టీ ఫండ్గా ఇవ్వాలని భుజంగరావు ఒత్తిడి తెచ్చారు.శ్రీధర్రావు రూ.13 కోట్లు విలువైన బీఆర్ఎస్ బాండ్లు కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించిన సాంబశివరావు రూ.2 కోట్లు తీసుకున్నారని భుజంగరావు వాంగ్మూలంలో పేర్కొన్నారు..’’ అని ప్రభుత్వం అఫిడవిట్లో తెలిపింది.
![PM Modi to visit Russia](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/modi_russia%20visit.jpg.webp?itok=AGPQrlAZ)
త్వరలో ప్రధాని మోదీ రష్యా పర్యటన.. షెడ్యూల్ ఖరారు
సాక్షి,న్యూఢిల్లీ : ఐదేళ్లు సుదీర్ఘ కాలం తర్వాత ప్రధాని మోదీ.. రష్యాలో పర్యటించనున్నారు. జులై 8,9 ఈ రెండు రోజుల పాటు రష్యాలో జరిగే భారత్-రష్యాల 22వ వార్షిక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల అభివృద్దిపై చర్చ జరగనుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.రష్యా పర్యటన అనంతరం మోదీ ఆస్ట్రియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనతో 40ఏళ్ల చరిత్రలో భారత ప్రధాని తొలిసారి సందర్శించిన ఘనత దక్కనుంది.మోదీ చివరి సారిగా 2019లో రష్యా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో వ్లాడివోస్టోక్ నగరంలో నిర్వహించిన ఎకనమిక్స్ కంక్లేవ్లో పాల్గొన్నారు. తాజాగా మరోసారి రష్యాలో సందర్శించనున్నారు.
![Vijayalakshmi Says Pavithra Gowda Is Not Darshan's Wife](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/dharshna.jpg.webp?itok=QPkWZVk_)
ఆమెను నా భర్త పెళ్లి చేసుకోలేదు.. పోలీసులకు హీరో భార్య లేఖ!
రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్తో పాటు నటి పవిత్రా గౌడను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు పోలీసు కస్టడీలో ఉన్నారు. అయితే ఈ కేసు విచారణలో వీరిద్దరిని దంపతులుగా పేర్కొనడంపై దర్శన్ భార్య విజయలక్ష్మి అభ్యంతరం తెలిపింది. పవిత్రాగౌడ, దర్శన్ భార్య కాదంటూ బెంగళూరు పోలీస్ కమిషనర్కు లేఖ రాసింది. ‘ఇటీవల మీరు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవిత్రను దర్శన్ భార్య అని తప్పడు ప్రకటన చేశారు. ఆ తర్వాత హోంమంత్రి కూడా అలానే పేర్కొన్నారు. ఆమెను నా భర్త పెళ్లి చేసుకోలేదు. దర్శన్కు పవిత్ర కేవలం స్నేహితురాలు మాత్రమే. దర్శన్కు చట్టపరమైన జీవిత భాగస్వామిని నేనే. మా పెళ్లి 2003లో జరిగింది. దయచేసి పోలీసు రికార్డుల్లో పవిత్రాగౌడను దర్శన్ భార్య అని పేర్కొనకండి. ఇది భవిష్యత్తులో నాకు, నా కుమారుడికి సమస్యలు తెచ్చిపెడుతుంది. పవిత్రకు సంజయ్సింగ్ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి ఓ కుమార్తె కూడా ఉంది. దయచేసి ఈ వాస్తవాలను రికార్డుల్లో స్పష్టంగా రాయండి’ అని విజయలక్ష్మి విజ్ఞప్తి చేసింది.కాగా, దర్శన్కి విజయలక్ష్మితో వివాహమైనప్పటికీ.. కొంతకాలంగా దూరంగా ఉంటున్నాడు. కన్నడ నటి పవిత్రాగౌడతో సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయం దర్శన్ అభిమాని రేణుకాస్వామికి తెలియడంతో.. విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందని భావించి.. పవిత్రకు అశ్లీల సందేశాలు పంపించి హెచ్చరించాడు. అదే అతని హత్యకు దారి తీసిందని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది.
![Ap Government Discontinue Door Delivery Ration Scheme](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/Ration%20door%20delivery.jpg.webp?itok=Vi83mBrO)
ఏపీలో రేషన్ డోర్ డెలివరీ బంద్!
ఆంధ్రప్రదేశ్లో రేషన్ సరుకుల డోర్ డెలివరీకి మంగళం పాడాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆ దిశగా స్పష్టమైన వ్యాఖ్యలతో సంకేతాలిచ్చారు.రేషన్ డోర్ డెలివరీ కోసం కొన్న వాహనాల వల్ల కార్పొరేషన్పై రూ.1,500 కోట్ల భారం పడింది. అన్ని వర్గాలతో చర్చించి ఒక నివేదిక సిద్ధం చేస్తాం. కేబినెట్లో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం.కాగా, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజా పంపిణీ వ్యవస్థలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. జనవరి 21, 2021 పౌరసరఫరాల శాఖ పరిధిలో రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారాయన.
![Ksr Comments On TDP's Trick Politics Of Social Pensions In Andhra Pradesh](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/64485.jpg.webp?itok=Iuyrwvk0)
బాబు ‘బిల్డప్’ షురూ.. సూపర్ సిక్స్ అయిపోయినట్లేనా..!?
ఏపీలో సామాజిక పెన్షన్ల రాజకీయం తమాషాగా ఉంది. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో ప్రాంతం చూడం, కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం.. అని స్పష్టంగా చెప్పి ఎక్కడా రాజకీయాలకు తావు లేకుండా కార్యక్రమాలు అమలు చేసింది. అందులో భాగంగా వృద్ధాప్య పెన్షన్లు, ఇతర పెన్షన్లను వలంటీర్ల ద్వారా పంపిణీ చేసింది. ఎక్కడా వైఎస్సార్సీపీ కార్యకర్తల ప్రమేయం లేకుండానే సాగిపోయేది. వలంటీర్లు ప్రభుత్వ వ్యవస్థలో ఒక భాగం కనుక వివాదం, పబ్లిసిటీ లేకుండా పెన్షన్లు పంచేవారు. అయినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఓటమిపాలైంది.కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం తాను చెప్పిన విధంగా ఈ నెలకైతే పెంచిన సామాజిక పెన్షన్ లు ఇచ్చింది. అంతవరకు ఒకే. మిగిలిన స్కీముల గురించి ఇంకా చెప్పకపోయినప్పటికీ ఇప్పటికే అమలులో ఉన్న పెన్షన్ కు మరో వెయ్యి రూపాయలు పెంచి, మూడు నెలల బకాయిలు చెల్లించారు. ఇంతవరకు అభ్యంతరం లేదు. కానీ ఇదేదో ఇప్పుడే సరికొత్తగా కనిపెట్టినట్లు, మొత్తం రాజకీయ కార్యక్రమంగా మార్చి టీడీపీ ప్రచారానికి వాడుకోవడం మాత్రం ఆక్షేపణీయమే.జూలై ఒకటిన జరిగిన తంతు చూశాకా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమాయకత్వంగా చిత్తశుద్దితో రాజకీయాలకు అతీతంగా వలంటీర్లు ద్వారా సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారా అనే భావన ఎవరికైనా రావచ్చు. అదే చంద్రబాబు అయితే ఫక్తు తనదైన రాజకీయ శైలిలో గతంలో జన్మభూమి కమిటీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ఈసారి తన పార్టీ కార్యకర్తల ద్వారా వీటిని పంపిణీ చేయించారు. వలంటీర్లు లేకుండానే పంపిణీ చేయగలం చెప్పుకోవడంతో పాటు ప్రచారం కూడా భారీగా రావాలన్న ఆకాంక్షతో కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేశారన్నది అర్ధం అవుతూనే ఉంది.ఇప్పటికే పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇలా పార్టీ కార్యకర్తల ద్వారా డబ్బు పంపిణీ చేయించవచ్చా అని అడిగితే ఎవరు బదులు ఇస్తారు. వారికి ఉన్న చట్టబద్దత ఏమిటని ఎవరు ప్రశ్నిస్తారు? పైగా టీడీపీ కేంద్ర కార్యాలయమే దీనిపై ఆదేశాలు ఇచ్చి మరీ కార్యకర్తలను రంగంలోకి దింపింది. పేరుకు సచివాలయ సిబ్బంది పెన్షన్లు ఇస్తారని తెలిపినా, హడావుడి చేసి ఫోటోలు దిగింది మాత్రం టీడీపీ, జనసేన కార్యకర్తలే. కొన్ని చోట్ల వీరి మధ్య గొడవలు కూడా జరిగాయట. కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలో, సిబ్బందో ఐదువందల రూపాయలు కట్ చేసుకుని పెన్షన్ ఇచ్చారన్న వార్తలు వచ్చాయి. మరికొన్నిచోట్ల వృద్ధుల ఇళ్లకు వెళ్లకుండా, అందరిని ఒక చోటకు పోగు చేసి పెన్షన్లు అందచేశారు. వైఎస్సార్సీపీకి సంబంధించినవారని చెప్పి పలాస తదితర కొన్నిచోట్ల పెన్షన్ ఇవ్వకుండా నిలుపుదల చేశారు. భవిష్యత్తులో పెన్షన్ దారుల సంఖ్యలో కోత పెట్టబోతున్నారని కూడా సమాచారం వస్తోంది.ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సైతం స్వయంగా ఒక లబ్దిదారు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం విశేషం. గతంలో ఎప్పుడూ ఆయన ఇలా చేయలేదు. ఈసారి అలా చేయవలసి వచ్చిందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన వ్యవస్థ ప్రభావమే అని చెప్పాలి. అంతకు ముందు పద్నాలుగేళ్లు తాను సీఎంగా ఉన్నప్పుడు మాదిరి ఇప్పుడు కూడా లబ్దిదారులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలని చంద్రబాబు చెప్పి ఉంటే నానా రభస అవుతుందని భయపడి ఇళ్లవద్దే పెన్షన్ పంపిణీ చేశారు. చివరికి ఆయన కూడా వలంటీర్ పాత్ర పోషించారని వైఎస్సార్సీపీవారు చమత్కరిస్తున్నారు.ఇక్కడే చంద్రబాబు అనండి.. తెలుగుదేశం వారు అనండి.. తమదైన శైలిలో అసత్యాలు చెప్పే యత్నం చేశారు. ఇళ్లకు వెళ్లి పెన్షన్ ఇవ్వడం ఇదే తొలిసారి అన్నట్లు బిల్డప్ ఇచ్చారు. కానీ గత ఐదేళ్లలో చివరి మూడు నెలలు తప్ప మిగిలిన కాలం అంతా వృద్దులు, వికలాంగులు, తదితర వర్గాలకు చెందిన వారి ఇళ్లకు వెళ్లి పెన్షన్ ఇచ్చే పథకాన్ని తీసుకువచ్చిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే సంగతి దాచేస్తే దాగని సత్యం. ఎన్నికల సమయంలో వలంటీర్లు ఈ కార్యక్రమం జరపకుండా అడ్డుపడిందే కూటమి నేతలు అనే సంగతి తెలిసిందే.జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వలంటీర్లు లేకపోతే పంపిణీ ఆగిందా అని ప్రశ్నించడం ద్వారా తన నైజం ప్రదర్శించుకున్నారు. వలంటీర్లు పెన్షన్ దారుల వద్ద లంచాలు తీసుకున్నారని ఆరోపించి వారిపై విషం కక్కారు. వారిపై ఇంకా తన అక్కసు తీరలేదని రుజువు చేసుకున్నారు. తీరాచూస్తే ఇప్పుడు కొంతమంది చేతివాటం ప్రదర్శించారని వీడియో సహితంగా తేలింది. అదే టైమ్ లో వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారికి నెలకు పదివేల రూపాయలు ఇస్తామని చంద్రబాబుతో పాటు తాను ఎందుకు హామీ ఇచ్చింది మాత్రం పవన్ కల్యాణ్ వివరించలేదు. పైగా వారిని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న సంకేతం ఇస్తున్నారు. వారికి ప్రత్యామ్నయా ఉపాధి చూపుతారట.ఉన్న ఉద్యోగం పీకి కొత్తగా ఏదో చేస్తామంటే నమ్మడానికి జనం పిచ్చివారా! అబద్దాలు చెప్పినా జనం ఓట్లు వేసి గెలిపించారు కనుక వారు పిచ్చోళ్లే అని పవన్ కల్యాణ్ భావిస్తుండవచ్చు. తప్పు లేదు. కానీ ఇప్పుడు ఆయన ఇంకో మాట చెప్పారు. లబ్దిదారుల అర్హతలపై రీసర్వే చేయించాలని అన్నారు. అంటే దాని అర్థం.. లబ్దిదారులలో కోత పెడతామనే కదా! ఈ సంగతి ఎన్నికల సమయంలో ఎందుకు చెప్పలేదు. కేవలం వెయ్యి రూపాయల పెన్షన్ పెంచుతామని మాత్రమే ఎందుకు ప్రచారం చేశారు. ఇది జనాన్ని మాయ చేయడం కాదా? అని అడిగితే జవాబు ఏమి ఉంటుంది. ఇక్కడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరికి గుర్తుకు వస్తారు. ఆయన పార్టీలు చూడకుండా ప్రజలకు మేలు చేయాలని తలపెట్టి దెబ్బతిన్నారు.చంద్రబాబు నాయుడు అయితే యథా ప్రకారం ప్రవచనాలు వల్లించారు. పేదరికం లేని సమాజం సృష్టించడమే ఆయన లక్ష్యమట. ఈ మాట 1995లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చెబుతూనే ఉన్నారు. కాలం ఆయనకు కలిసి వచ్చి నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు కానీ, పేదరికం మాత్రం పోలేదు. సంపద సృష్టించి పేదలకు పంచుతానని చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. ఆ బ్రహ్మ పదార్ధం ఎలా ఉంటుందో ఎవరికి కనిపించదు. వినేవాడు వెర్రివాడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అన్నట్లుగా ఉంటాయి ఈ మాటలు. పోలవరం పూర్తి అయితే సంపద వచ్చేసేదట. పేదరికం పోయేదట. ఆయన పాలన ఐదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి కదా! అయినా పేదరికం ఎందుకు కొనసాగుతోంది. జనాన్ని మభ్య పెట్టడానికి ఇలాంటివి మాట్లాడుతుంటారు. అందులో చంద్రబాబు నిపుణుడే అని చెప్పాలి.గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల మయం చేసిందని విమర్శించిన చంద్రబాబు తాను పవర్ లోకి వచ్చిన ఇరవైరోజులలోనే ఏడువేల కోట్ల అప్పు చేశారు. ఈ అప్పులనే సంపద అని ప్రజలు అనుకోవాలి కాబోలు. ఈ అప్పులలో తమకు ఎంతో కొంత వాటా వస్తుంది కనుక, ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా కూడా ఈ అప్పులపై నోరు విప్పడం లేదు. చంద్రబాబుకు అనుభవం ఉంది కనుకే పెన్షన్లు ఇవ్వగలిగారని పవన్ కల్యాణ్ సర్టిఫికెట్ ఇచ్చారు. అంటే మరి గత ఐదేళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్దగా ప్రచారం లేకుండానే ప్రతి నెల మొదటితేదీకే పెన్షన్లు ఇచ్చింది కదా! అది గొప్ప విషయం కాదా? చంద్రబాబు తన అనుభవంతో అప్పులు తెచ్చారని పవన్ భావిస్తున్నారా! ఈ అప్పులతో రాష్ట్రం శ్రీలంక అవ్వదని కూడా ఆయన చెప్పి ఉండాల్సింది.ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. గతంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించిన చంద్రబాబు ఈసారి ఒక్క పవన్ కల్యాణ్ కు మాత్రమే ఆ పదవి కట్టబెట్టి వెయిట్ పెంచారని ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత అన్నిచోట్ల పవన్ కల్యాణ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆయన ఫోటోలు సైతం ఉంచాలని చంద్రబాబు చెప్పినట్లు లీకులు వచ్చాయి. కానీ వారంతా భావిస్తున్న ఇంత ప్రతిష్టాత్మక కార్యకమం ప్రచార ప్రకటనలో మాత్రం పవన్ కల్యాణ్ ఫోటో కనిపించలేదు. ఒక్క చంద్రబాబు ఫోటోనే ప్రచురించారు. రామోజీరావు సంస్మరణ సభ ప్రకటనలో కూడా పవన్ కల్యాణ్ పేరే వేయలేదు. అదేదో చంద్రబాబు రాజగురువు సంస్మరణ సభ కనుక పవన్ కల్యాణ్ పేరు వేయలేదులే అని అనుకున్నారు. కానీ పెన్షన్లు పంపిణీ ఇది ప్రభుత్వపరంగా చేసిన ప్రతిష్టాత్మక కార్యక్రమం కదా! అయినా పవన్ కల్యాణ్ పోటో వేయలేదేమిటా అని జనసేన వారు ఆవేదన చెందుతున్నారు.పవన్ కల్యాణ్ వెనుక ఉన్న సామాజికవర్గం వారు కూడా మదన పడుతున్నారు. ఆయా రాష్ట్రాలలో ఉప ముఖ్యమంత్రుల ఫోటోలు కూడా ప్రచారంలో వాడుతుంటారు. అయినా పవన్ కల్యాణ్ దీనిని అవమానంగా భావించకపోవచ్చు. టీడీపీ వారు ఏమి చేసినా పడి ఉండడానికి ఆయన ఎప్పుడో సిద్దపడిపోయారన్న భావన ఉంది. ఏది ఏమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ రహితంగా ఇలాంటి సంక్షేమ స్కీములు ఎన్నిటినో అమలు చేసి తన మంచిని ప్రజలు గుర్తిస్తారని ఆశిస్తే తద్విరుద్దంగా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు దీనిని ఫక్తు రాజకీయం చేసి పార్టీ కార్యక్రమం చేశారు. ఒక్క స్కీము అమలు చేసి, సూపర్ సిక్స్ అయిపోయినంతగా బిల్డప్ ఇచ్చే యోచనలో ఉన్నారు. చంద్రబాబు, పవన్ లు ఇప్పుడు ఏమి చెప్పినా, ఏమి చేసినా అంతా రైటే అని జనం ఒప్పుకుంటారా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
![Today Gold and Silver Price 4 July 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/gold-and-silver-price.jpg.webp?itok=z0U3EtIq)
పసిడి ప్రియులకు షాక్!.. ఒక్కసారిగా పెరిగిన ధరలు
జులై ప్రారంభం నుంచి స్వల్పంగా పెరుగుతూ ఉన్న పసిడి ధరలు ఈ రోజు (జులై 4) మరింత పైకి లేచాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు గరిష్టంగా రూ.710 పెరిగింది. దీంతో బంగారం ధర మళ్ళీ తారా స్థాయికి చేరుకుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు నేడు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67000 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.73090 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 650, రూ. 710 పెరిగింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్లలో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. కాబట్టి నేడు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67150 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73240 వద్ద ఉంది. నేడు 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 650 పెరిగింది. 24 క్యారెట్స్ ధరలు రూ. 710 పెరిగింది.చెన్నై విషయానికి వస్తే.. బంగారం ధరలు వరుసగా రూ. 650, రూ. 710 పెరిగి.. రూ. 67600 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 73750 (24 క్యారెట్స్ 10 గ్రా) వద్ద నిలిచాయి. ఇతర రాష్ట్రాలకంటే చెన్నైలో బంగారం ధరలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.వెండి ధరలుదేశంలో వెండి ధరలు గత నాలుగు రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. నేడు ఒక కేజీ వెండి ధర నిన్నటి కంటే రూ. 1500 పెరిగింది. దేంతో ఈ రోజు (జులై 4) కేజీ వెండి రూ. 93000లకు చేరింది. గంట నాలుగు రోజుల్లో వెండి ధర ఏకంగా రూ. 3000 పెరిగింది. ఈ ధరలు ఇలాగె కొనసాగితే కేజీ వెండి లక్ష రూపాయలకు చేరుతుందని తెలుస్తోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
![If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/20/Untitled-2_9.jpg.webp?itok=Yu3M0cnh)
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?
NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి
బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ హెల్త్ అప్డేట్
త్వరలో ప్రధాని మోదీ రష్యా పర్యటన.. షెడ్యూల్ ఖరారు
ఇండియన్ ఐడల్ సీజన్ 2.. గెస్టుగా విజయ్ దేవరకొండ
పోటెత్తిన ముంబై తీరం.. కాసేపట్లో భారత ఆటగాళ్ల ఓపెన్ బస్ పరేడ్
హత్రాస్ తొక్కిసలాట: ఆరుగురి అరెస్ట్, అవసరమైతే బాబాను విచారణ
జార్ఖండ్ సీఎంగా ప్రమాణం చేసిన హేమంత్ సోరెన్
సీఎం రేవంత్ కామెంట్స్పై స్పందించిన టీఎప్సీసీ
త్వరలో తండ్రి కాబోతున్న బిగ్బాస్ మానస్
నిజంగానే విడిపోతున్నారా? హార్దిక్ పాండ్యా సతీమణి పోస్టు వైరల్
కల్కి మేకర్స్పై ప్రముఖ నటుడు ఆగ్రహం.. అలా చూపించడం సరైంది కాదు!
మొదటి భార్యతో విడాకులు.. అతనితో ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్..!
అందరికంటే ముందుగా మీరే 'కల్కి'ని ఆదరించారు: నాగ్ అశ్విన్
మేం ఓడిపోయాం.. ప్రజలు మోసపోయారు..
Pension Distribution In AP: మంత్రి గారి భార్య దాదాగిరి.. !
నాకు మొబైల్ లేదు: సిద్ధూ
భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు
కేసీఆర్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు.. పిటిషన్ కొట్టివేత
బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ హెల్త్ అప్డేట్
త్వరలో ప్రధాని మోదీ రష్యా పర్యటన.. షెడ్యూల్ ఖరారు
ఇండియన్ ఐడల్ సీజన్ 2.. గెస్టుగా విజయ్ దేవరకొండ
పోటెత్తిన ముంబై తీరం.. కాసేపట్లో భారత ఆటగాళ్ల ఓపెన్ బస్ పరేడ్
హత్రాస్ తొక్కిసలాట: ఆరుగురి అరెస్ట్, అవసరమైతే బాబాను విచారణ
జార్ఖండ్ సీఎంగా ప్రమాణం చేసిన హేమంత్ సోరెన్
సీఎం రేవంత్ కామెంట్స్పై స్పందించిన టీఎప్సీసీ
త్వరలో తండ్రి కాబోతున్న బిగ్బాస్ మానస్
నిజంగానే విడిపోతున్నారా? హార్దిక్ పాండ్యా సతీమణి పోస్టు వైరల్
కల్కి మేకర్స్పై ప్రముఖ నటుడు ఆగ్రహం.. అలా చూపించడం సరైంది కాదు!
మొదటి భార్యతో విడాకులు.. అతనితో ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్..!
అందరికంటే ముందుగా మీరే 'కల్కి'ని ఆదరించారు: నాగ్ అశ్విన్
మేం ఓడిపోయాం.. ప్రజలు మోసపోయారు..
Pension Distribution In AP: మంత్రి గారి భార్య దాదాగిరి.. !
నాకు మొబైల్ లేదు: సిద్ధూ
భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు
కేసీఆర్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు.. పిటిషన్ కొట్టివేత
సినిమా
![Sussanne Khan Mom Happy Her Daughter Found Love after Hrithik Roshan Divorce](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/hrithik.jpg.webp?itok=oXEHMc8P)
విడాకుల తర్వాత మరొకరితో లవ్.. సంతోషంగా ఉందన్న తల్లి
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, సుజానే ఖాన్.. చిన్ననాటి స్నేహితులు. ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు. రెండు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 13 ఏళ్ల పాటు కలిసున్నారు. పరిస్థితులు తారుమారవడంతో 2014లో విడాకులు తీసుకున్నారు. హృతిక్ మరో హీరోయిన్తో ప్రేమాయణం నడిపించడం వల్లే ఈ జంట విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అప్పట్లో రూమర్స్ వినిపించాయి.విడాకుల తర్వాత ప్రేమలో..అయితే విడాకులు తర్వాత ఇద్దరూ శత్రువుల్లా మారిపోకుండా పిల్లల కోసం ఫ్రెండ్స్గా ఉన్నారు. అలాగని ఒంటరిగానూ మిగిలిపోలేదు. అటు హృతిక్.. నటి సబా ఆజాద్తో ప్రేమలో పడగా ఇటు సుజానే.. నటుడు అర్స్లన్ గోనిని లవ్ చేస్తోంది. తాజాగా సుజానే ప్రేమాయణం గురించి ఆమె తల్లి జరీన్ మాట్లాడింది. సుజానే పార్ట్నర్ అర్స్లన్ న్యాయవిద్యను అభ్యసించాడు. జమ్ములో పేరున్న రాజకీయ కుటుంబానికి చెందినవాడు. తనకు యాక్టింగ్ అంటే ఇష్టం. పెళ్లి చేసుకోవాలనేం లేదునటనారంగంలోనూ తను రాణించాలని ఆశిస్తున్నాను. ఆయన కుటుంబసభ్యులు కూడా ఎంతో మంచివారు! సుజానే, అర్స్లన్ కలిసి ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఒకరితో మనకు సంతోషం దక్కుతుందంటే మంచిదే కదా.. అలా అని పెళ్లి చేసుకుంటే ఆ సంతోషం కంటిన్యూ అవుతుందనేం లేదు. అర్స్లన్, సుజానేలు వారి కెరీర్పై ఫోకస్ చేస్తున్నారు. వారిని చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది.చదవండి: అప్పుడు తండ్రి.. ఇప్పుడు కుమారుడు.. ఎంత గొప్ప మనసో!
![Mirzapur 3 Ready To Streaming On Amazon Prime Video, Recap Of Season 1, 2](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/mirzapur-3.jpg.webp?itok=95YzNoeM)
మరికొన్ని గంటల్లో మీర్జాపూర్ 3 ... సీజన్ 1, 2లో ఏం జరిగింది?
‘మీర్జాపూర్’.. ఓటీటీలో సంచలనం సృష్టించిన వెబ్ సిరిస్ ఇది. భాషతో సంబంధం లేకుండా ఓటీటీ ప్రేక్షకుల అంతా ఈ క్రైమ్ యాక్షన్ వెబ్ సిరీస్ని ఆదరించారు. ముఖ్యంగా యూత్కి ఈ సిరీస్ బాగా నచ్చింది. ఇప్పటి వరకు రెండు సీజన్లు రాగా.. రెండూ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మూడో సీజన్ రాబోతుంది. అలీ ఫజల్, విజయ్ వర్మ, శ్వేతా త్రిపాఠి, పంకజ్ త్రిపాఠి తదితరులు కీలక పాత్రల్లో నటించిన మీర్జాపూర్ సీజన్ 3 జులై 5 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో అసలు సీజన్ 1, 2లలో చెప్పారు? సీజన్ 3లో ఏం చూపించబోతున్నారు? తెలుసుకుందాం.గన్స్, డ్రగ్స్ మాఫియా చుట్టూ ఈ వెబ్ సిరీస్ కథ తిరుగుతుంది. మీర్జాపూర్ మొత్తం కాలీన్ భాయ్(పంకజ్ త్రిపాఠి) చేతిలో ఉంటుంది. అక్కడి మాఫియా సామ్రాజ్యానికి అతనే మహా రాజు. కాలీన్ భాయ్ కొడుకు మున్నా భాయ్(దివ్యేంద్) ఓ పెళ్లి కొడుకును గన్తో కాల్చి చంపేస్తాడు. ఈ కేసును లాయర్ రమాకాంత్ పండిత్(రాజేశ్ తైలాంగ్) వాధిస్తాడు. అతనికి ముగ్గురు పిల్లలు. పెద్ద కొడుకు పేరు గుడ్డు పండిత్(అలీ ఫజల్), చిన్న కొడుకు బబ్లూ పండిత్(విక్రాంత్ మస్సే), కూతురు డింపీ(హర్షిత). కొడుకును కాపాడుకునేందుకు కాలీన్ భాయ్ భారీ ప్లాన్ వేస్తాడు. ఈ క్రమంలో తన వ్యాపార పనులను గుడ్డు, బబ్లులకు అప్పగిస్తాడు. దీంతో మున్నా..తీవ్ర కోపంతో రగిపోతుంటాడు. గుడ్డు ప్రేయసి స్వీటీపై కన్నేస్తాడు. ఆమె దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఓ పెళ్లి వేడుకకు హాజరైన గుడ్డు, స్వీటీ, బబ్లూ, డింపీలపై మున్నా తన గ్యాంగ్తో దాడి చేస్తాడు. ఈ దాడిలో గర్భిణి అయిన స్వీటీతో పాటు బబ్లు కూడా చనిపోతాడు. గోలు సహాయంతో గుడ్డు తప్పించుకుంటాడు. ఇంతటితో సీజన్ 1 ముగుస్తుంది.మున్నా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరంభమయ్యే సన్నివేశాలతో సీజన్-2 మొదలవుతుంది. మరోవైపు డింపీ, గోలు కలిసి ఓ డాక్టర్ని కిడ్నాప్ చేసి గుడ్డుకు చికిత్స చేయిస్తారు. మున్నాను ఎలాగైన చంపేయాలనే పగతో రగిలిపోతుంటారు. మీర్జాపూర్లో కాలీన్ భాయ్కు అత్యంత నమ్మకస్తుడైన మక్బూల్.. ఒకప్పుడు తన కుటుంబ సభ్యుడి చావుకు కారణం అయ్యాడనే కోపంతో కాలీన్ తండ్రిని చంపేందుకు ప్లాన్ వేస్తాడు. కాలీన్ భార్య బీనా కూడా అతనితో చేతులు కలిపి మామను చంపేందుకు ప్రయత్నిస్తుంటుంది. మరోవైపు మీర్జాపూర్ డాన్ సింహాసనంపై ఆశపడి తండ్రినే చంపేందుకు ప్లాన్ వేస్తాడు మున్నా. అందుకోసం శరత్ శుక్లాతో చేతులు కలుపుతాడు. అయితే గుడ్డు, గోలులు మాత్రం పక్కా ప్లాన్తో మున్నాపై దాడికి దిగుతారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కాలీన్ భాయ్ని శరత్ కాపాడగా.. మున్నాను మాత్రం ప్రాణాలు కోల్పోతాడు. అనంతరం గుడ్డు మీర్జాపూర్ సింహాసనాన్ని అధిరోహిస్తాడు. ఇంతటితో సీజన్ 2కి ఎండ్ కార్డు పడుతుంది.మీర్జాపూర్ 3లో ఏం చూపించబోతున్నారు?మీర్జాఫూర్ ప్రాంతాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్న గుడ్డు.. పూర్వాంచల్లో తన ఆదిపత్యాన్ని కొనసాగించాలనుకుంటాడు. మీర్జాపూర్లో కాలీన్ భాయ్ గుర్తులేవి లేకుండా చేస్తాడు. మరోవైపు భర్త మున్నాభాయ్ మరణంతో అతని భార్య, యూపీ సీఎం కూతురు మాధురి రాజకీయాల్లోకి అడుగుపెడుతుంది. కాలీన్ భాయ్పై సింపథీ క్రియేట్ చేసి ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తుంటుంది. అదే సమయంలో కాలీన్ భాయ్ తిరిగి వచ్చినట్లు ట్రైలర్లో చూపించారు. మీర్జాఫూర్ మాఫీయా సామ్రాజ్యాన్ని కాలీన్ భాయ్ తిరిగి పొందడా? డాన్గా ఎదిగిన తర్వాత గుడ్డు జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? మాధురి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చింది? తదితర విషయాలన్నీ తెలియాలంటే సీజన్ 3 చూడాల్సిందే.
![Tiger Shroff Extends Financial Help to Bedridden Focus Puller of Heropanti](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/tigerdhroff.jpg.webp?itok=-DStvRob)
అప్పుడు తండ్రి.. ఇప్పుడు కుమారుడు.. ఎంత గొప్ప మనసో!
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ మంచి మనసు చాటుకున్నాడు. ఇబ్బందుల్లో ఉన్న సినిమా టెక్నీషియన్ రవి కుమార్కు ఆర్థిక సాయం చేశాడు. టైగర్ ష్రాఫ్ తొలి సినిమా 'హీరోపంతి'కి రవి కుమార్ ఫోకస్ పుల్లర్ (అసిస్టెంట్ కెమెరామన్)గా పని చేశాడు. తాజాగా రవి కుమార్ మాట్లాడుతూ.. టైగర్ ష్రాఫ్ తండ్రి జాకీ ష్రాఫ్తో మా అన్న ప్రసాద్ కలిసి పని చేశాడు. 1942: ఎ లవ్ స్టోరీ సినిమా షూటింగ్ సమయంలో మా అన్న చేయి ఫ్రాక్చర్ అయింది. అప్పుడు ఆపరేషన్కు జాకీ సర్ సాయం చేశాడు.అప్పుడు ఆయన.. ఇప్పుడు..ఇప్పుడు ఆయన కుమారుడు నాకు సాయపడ్డాడు. నేను హీరోపంటి సినిమాకు వర్క్ చేశాను. అలా ఆయన నాకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. టైగర్ తల్లి ఆయేషా ష్రాఫ్ నాకు మంగళవారం ఫోన్ చేసి మాట్లాడింది. టైగర్ ఫస్ట్ సినిమాకు నేను పని చేశానని బహుశా తనకు గుర్తుండకపోవచ్చు. అయినా మంచి మనసుతో నన్ను ఆదుకున్నాడు అని తెలిపాడు.దాచుకుందంతా అయిపోయిందికాగా రవి కుమార్ పని చేస్తున్న పూజా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుంచి ఇంకా జీతం అందలేదని తెలుస్తోంది. ఓ పక్క రావాల్సిన డబ్బు ఆగిపోగా, మరోపక్క యాక్సిడెంట్ వల్ల ఎనిమిది నెలలపాటు మంచానికే పరిమితమైన పరిస్థితి! దాచుకున్న డబ్బంతా ఖర్చయిపోవడంతో సాయం కోసం ఎదురు చూశాడు. ఇంతలోనే టైగర్ ష్రాఫ్ పెద్ద మనసుతో అతడి చికిత్సకు, ఆర్థిక అవసరాలకు సరిపడా డబ్బు సమకూర్చాడు. అది లక్షల్లోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.చదవండి: ఆ స్టార్ హీరోల ఆల్టైమ్ రికార్డ్స్ను కొట్టేసిన ప్రభాస్
![Srikanth Movie OTT Streaming Date Locked](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/srikanth-ott.jpg.webp?itok=_SUmWRLQ)
ఓటీటీలోకి టాప్ రేటింగ్ సినిమా.. అధికారిక ప్రకటన
బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన 'శ్రీకాంత్' సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. హిందీ వర్షన్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ బొల్లా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దృష్టి లోపం కారణంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిర్భయంగా తన కలల్ని సాకారం చేసుకున్నారు శ్రీకాంత్. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు.శ్రీకాంత్ బొల్లా పాత్రలో రాజ్కుమార్ రావ్ అద్బుతంగా మెప్పించారు. అలయా ఎఫ్ ఈ చిత్రంలో హీరోయిన్గా మెప్పించారు. ఈ చిత్రంలో జ్యోతిక ఒక కీలక పాత్రలో కనిపించారు. తుషార్ హీరానందానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 5 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. భూషణ్ కుమార్, నిధి పర్మార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రేటింగ్ పరంగా కూడా ఈ సినిమాకు భారీగా రెస్పాన్స్ వచ్చింది. IMDb 7.9 రేటింగ్తో ఈ చిత్రం రికార్డ్ క్రియేట్ చేసింది.
ఫొటోలు
![Narendra Modi Adorable moment with Jasprit Bumrah's son, photos goes viral](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/4/888.jpg.webp?itok=N1pS_s9J)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/4/888.jpg.webp?itok=N1pS_s9J)
ప్రధాని మోదీతో బుమ్రా కొడుకు..ఎంత క్యూట్గా ఉన్నాడో ఫోటోలు వైరల్
![YSRCP President YS Jagan Mohan Reddy Nellore Tour Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/4/YSRCP%20President%20YS%20Jagan%20Mohan%20Reddy%20Nellore%20Tour%20Photos%20%282%29.jpg.webp?itok=RZhBUuUu)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/4/YSRCP%20President%20YS%20Jagan%20Mohan%20Reddy%20Nellore%20Tour%20Photos%20%282%29.jpg.webp?itok=RZhBUuUu)
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన.. పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
![Team India Meets PM Modi At His Office After T20 World Cup 2024 Win, Photos Gallery](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/4/Team%20India%20Meets%20PM%20Modi%20At%20His%20Office%20After%20T20%20World%20Cup%202024%20Win%2C%20Photos%20Gallery_1.jpg.webp?itok=aZaLeywp)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/4/Team%20India%20Meets%20PM%20Modi%20At%20His%20Office%20After%20T20%20World%20Cup%202024%20Win%2C%20Photos%20Gallery_1.jpg.webp?itok=aZaLeywp)
T20 ఛాంపియన్స్ ను అభినందించిన ప్రధాని మోదీ (ఫొటోలు)
![Janhvi Kapoor Hugs Anant Ambani, Attends Mameru Ceremony With Boyfriend: Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/4/Janhvi%20Kapoor%20Hugs%20Anant%20Ambani%20Attends%20Mameru%20Ceremony%20With%20Boyfriend_%20%281%29.jpg.webp?itok=nYK6hmt5)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/4/Janhvi%20Kapoor%20Hugs%20Anant%20Ambani%20Attends%20Mameru%20Ceremony%20With%20Boyfriend_%20%281%29.jpg.webp?itok=nYK6hmt5)
అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో మెరిసిన బాలీవుడ్ ప్రేమ జంట (ఫోటోలు)
![Bigg Boss telugu 7fame Ashwini Sri latest phots shared in instagramgoes viral](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/4/Biggbosstelugu-beauty-AshwiniSri%20%286%29.jpg.webp?itok=e75LVxxT)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/4/Biggbosstelugu-beauty-AshwiniSri%20%286%29.jpg.webp?itok=e75LVxxT)
గులాబీలతో గుబాళిస్తున్న బిగ్బాస్ బ్యూటీ (ఫోటోలు)
క్రీడలు
![Free entry for fans at Wankhede Stadium, but will rain spoil T20 World Cup celebration party?](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/Rhit.jpg.webp?itok=c570XyQ2)
వాంఖడేలో భారత జట్టుకు సన్మానం.. ఫ్యాన్స్కు ఫ్రీ ఎంట్రీ
టీ20 వరల్డ్కప్-4 విజేతగా నిలిచిన భారత జట్టు నాలుగు రోజుల తర్వాత తమ సొంత గడ్డపై అడుగుపెట్టింది. గురువారం ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానశ్రాయంకు భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్ట్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు టీమిండియాకు నీరాజనం పలికారు. భారత ఆటగాళ్లు సైతం ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్కు వెళ్తున్న దారిలో అదిరే స్టెప్పులతో అలరించారు. అనంతరం రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. దాదాపు అరగంట పాటు క్రికెటర్లు, సహాయ సిబ్బంది మోదీతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఇక మోదీతో భేటి అనంతరం టీమిండియా ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో ముంబైకు పయనమయ్యారు. సాయంత్రం 5 గంటలకు ముంబై నగర వీధుల్లో టీమిండియా విజయోత్సవ యాత్ర జరుగనుంది.ఫ్యాన్స్కు ఫ్రీ ఎంట్రీ..ఆ తర్వాత రాత్రి 7 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ క్రికెటర్లతో పాటు బీసీసీఐ పెద్దలు హాజరకానున్నారు. ఈ క్రమంలో ముంబై క్రికెట్ ఆసోషియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సన్మాన వేడుకను చూసేందుకు అభిమానులకు ఫ్రీ ఎంట్రీ ఇవ్వాలని ఎంసీఎ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని గురువారం ఎంసీఎ ఒక ప్రకటనలో పేర్కొంది. అదే విధంగా స్టేడియం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎంసీఎ అధికారులు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు స్టేడియం గేట్లు ఓపెన్ చేయనున్నట్లు ఎంసీఏ వెల్లడించింది.వర్షం అంతరాయం..ఇక ఈ కార్యక్రమానికి వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. సన్మాన కార్యక్రమం జరిగే సమయంలో వర్షం పడే అవకాశాలు 90 శాతం ఉన్నట్లు అక్కడ వాతవారణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా ఈ వేడుక కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
![T20 World Cup 2024 Victorious Indian Team Meets PM Narendra Modi](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/acs.jpg.webp?itok=zHo72Nhm)
T20 World Cup 2024: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు
విశ్వ విజేత టీమిండియా ఇవాళ (జులై 4) ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఈ సందర్భంగా మోదీ భారత బృందాన్ని అభినందించారు. పీఎం మోదీ భారత క్రికెటర్లకు ఆల్పాహార విందు ఏర్పాటు చేశారు. మోదీ అరగంట పాటు క్రికెటర్లు, సహాయ సిబ్బంది ముచ్చటించారు. TEAM INDIA MEETS PM NARENDRA MODI. 🇮🇳pic.twitter.com/tCotFhi4QP— Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2024అనంతరం భారత బృందం ప్రధాని నివాసం నుంచి బయల్దేరింది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో భారత క్రికెటర్లు ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్తారు. ముంబై నగర వీధుల్లో టీమిండియా విజయోత్సవ యాత్ర జరుగనుంది. అనంతరం వాంఖడే స్టేడియంలో టీమిండియాకు సన్మాన కార్యక్రమం ఉంటుంది.కాగా, ఇవాళ ఉదయమే భారత క్రికెటర్లు ప్రత్యేక విమానంలో బార్బడోస్ నుంచి న్యూఢిల్లీకి వచ్చారు. హరికేన్ (గాలివాన) కారణంగా భారత బృందం మూడు రోజుల పాటు బార్బడోస్లోనే ఇరుక్కుపోయింది. ఎట్టకేలకు భారత బృందం ఇవాళ తెల్లవారుజామున న్యూఢిల్లీలో ల్యాండ్ అయ్యింది.ఇదిలా ఉంటే, యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్కప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో టీ20 వరల్డ్కప్ను ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో టీమిండియా 11 ఏళ్ల కలను (ఐసీసీ ట్రోఫీ) సాకారం చేసుకుంది. భారత్ చివరిసారిగా 2013లో ఐసీసీ ట్రోఫీని (ఛాంపియన్స్ ట్రోఫీ) సాధించింది.
![Womens Cricket: England Beat New Zealand By 5 Wickets In 3rd ODI](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/sasd.jpg.webp?itok=xBTXZ4-q)
న్యూజిలాండ్ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్
స్వదేశంలో న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఇంగ్లండ్ మహిళా టీమ్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నిన్న (జులై 3) జరిగిన నామమాత్రపు చివరి వన్డేలో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అమేలియా కెర్ (57), కెప్టెన్ సోఫీ డివైన్ (43) రాణించారు. లారెన్ బెల్ ఐదు వికెట్లతో చెలరేగి న్యూజిలాండ్ను దెబ్బకొట్టింది. కేట్ క్రాస్ రెండు వికెట్లు పడగొట్టింది.అనంతరం 212 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నాట్ సీవర్ బ్రంట్ (76), ఆమీ జోన్స్ (50) విజృంభించడంతో 38.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదేసింది. ఆఖర్లో అలైస్ క్యాప్సీ (35 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కివీస్ బౌలర్లలో హన్న రోవ్ 2, మోలీ పెన్ఫోల్డ్, అమేలియా కెర్, బ్రూక్ హ్యలీడే తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు కూడా ఇంగ్లండే గెలిచింది. ఇరు జట్ల మధ్య జులై 6 నుంచి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. జులై 6, 9, 11, 13, 17 తేదీల్లో ఈ మ్యాచ్లు జరుగనున్నాయి.
![Rohit Sharma, Suryakumar Dance To Dhol In New Delhi After Champions Return Home](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/sqas.jpg.webp?itok=ZJaYeDNc)
రోహిత్ శర్మ మాస్ డ్యాన్స్
టీ20 వరల్డ్కప్ విజయానంతరం ఇవాళ (జులై 3) ఉదయం భారత గడ్డపై అడుగుపెట్టిన టీమిండియాకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అభిమానులు కేరింతలు, హర్షద్వానాలతో భారత క్రికెటర్లకు ఘన స్వాగతం పలికారు. జయహో భారత్ నినాదాలతో ఢిల్లీ విమానాశ్రయం మార్మోగిపోయింది.టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ కాగానే అభిమానులు ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్దాలు చేశారు. ఇందుకు ప్రతిగా రోహిత్ వరల్డ్కప్ ట్రోఫీని పైకెత్తి చూపుతూ అభిమానులకు అభివాదం చేశాడు. అనంతరం భారత క్రికెటర్లు ప్రత్యేక బస్సులో ఐటీసీ మౌర్య హోటల్కు చేరుకున్నారు. అక్కడ కూడా భారత క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది.The Happiness and dance of Captain Rohit Sharma is absolute priceless. 😄❤️pic.twitter.com/G5XQPjH5Qj— Tanuj Singh (@ImTanujSingh) July 4, 2024హోటల్ ఎంట్రెన్స్లో కళాకారులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ టీమిండియా క్రికెటర్లకు ఆహ్వానం పలికారు. డోల్ వాయింపుకు రోహిత్ శర్మ, సూర్యకుమార్, రిషబ్ పంత్ మాస్ డ్యాన్స్ చేశారు. రోహిత్ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. హోటల్ యాజమాన్యం విశ్వ విజేతల కోసం ప్రత్యేక కేక్ను ఏర్పాటు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ కేక్ను కట్ చేశాడు. ఇదిలా ఉంటే, భారత క్రికెటర్లు ఐటీసీ మౌర్యలో కాసేపు సేదతీరి ప్రధాని మోదీని కలిసేందుకు వెళతారు. మోదీతో భేటి అనంతరం టీమిండియా ముంబైకు బయల్దేరుతుంది. అక్కడ భారత క్రికెటర్లు ఓపెన్ టాప్ బస్లో ర్యాలీగా వెళ్తారు. చివరిగా టీమిండియా వాంఖడే స్టేడియంకు చేరుకుంటుంది. అక్కడ బీసీసీఐ ఆథ్వర్యంలో భారత క్రికెటర్లకు సన్మాన కార్యక్రమం ఉంటుంది.ఇదిలా ఉంటే, యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్కప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో టీ20 వరల్డ్కప్ను ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో టీమిండియా 11 ఏళ్ల కలను (ఐసీసీ ట్రోఫీ) సాకారం చేసుకుంది. భారత్ చివరిసారిగా 2013లో ఐసీసీ ట్రోఫీని (ఛాంపియన్స్ ట్రోఫీ) సాధించింది.
బిజినెస్
![Today Gold and Silver Price 4 July 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/gold-and-silver-price.jpg.webp?itok=z0U3EtIq)
పసిడి ప్రియులకు షాక్!.. ఒక్కసారిగా పెరిగిన ధరలు
జులై ప్రారంభం నుంచి స్వల్పంగా పెరుగుతూ ఉన్న పసిడి ధరలు ఈ రోజు (జులై 4) మరింత పైకి లేచాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు గరిష్టంగా రూ.710 పెరిగింది. దీంతో బంగారం ధర మళ్ళీ తారా స్థాయికి చేరుకుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు నేడు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67000 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.73090 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 650, రూ. 710 పెరిగింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్లలో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. కాబట్టి నేడు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67150 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73240 వద్ద ఉంది. నేడు 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 650 పెరిగింది. 24 క్యారెట్స్ ధరలు రూ. 710 పెరిగింది.చెన్నై విషయానికి వస్తే.. బంగారం ధరలు వరుసగా రూ. 650, రూ. 710 పెరిగి.. రూ. 67600 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 73750 (24 క్యారెట్స్ 10 గ్రా) వద్ద నిలిచాయి. ఇతర రాష్ట్రాలకంటే చెన్నైలో బంగారం ధరలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.వెండి ధరలుదేశంలో వెండి ధరలు గత నాలుగు రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. నేడు ఒక కేజీ వెండి ధర నిన్నటి కంటే రూ. 1500 పెరిగింది. దేంతో ఈ రోజు (జులై 4) కేజీ వెండి రూ. 93000లకు చేరింది. గంట నాలుగు రోజుల్లో వెండి ధర ఏకంగా రూ. 3000 పెరిగింది. ఈ ధరలు ఇలాగె కొనసాగితే కేజీ వెండి లక్ష రూపాయలకు చేరుతుందని తెలుస్తోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
![132 Seats Bus Nitin Gadkari Pilot Project Details](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/nitin-gadkari-132-seats-bus.jpg.webp?itok=bXCviWcF)
132 సీట్ల బస్సు.. పైలట్ ప్రాజెక్ట్ గురించి వెల్లడించిన గడ్కరీ
భారతదేశంలో కాలుష్యం ఒక పెద్ద సమస్యగా మారుతోంది. దీనికి ప్రధాన కారణంగా ప్రతివ్యక్తి సొంతంగా వాహనం కలిగి ఉండాలనుకోవడమే. ఓ ఇంట్లో నలుగురు జనాభా ఉంటే.. నలుగురికీ నాలుగు కార్లు ఉంటాయి. చాలామంది ప్రజా రవాణా ఉపయోగించడమే పూర్తిగా మానేశారు కూడా. కాలుష్యాన్ని అరికట్టడానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి 'నితిన్ గడ్కరీ' పైలట్ ప్రాజెక్ట్ మొదలైనట్లు వెల్లడించారు.ఇటీవల ఇన్ఫ్రాశక్తి అవార్డుల సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గడ్కరీ రాబోయే 132 సీట్ల బస్సు గురించి వివరించారు. ఈ బస్సులలో విమానం మాదిరిగా ఉండే సీట్లు, ఎయిర్ హోస్టెస్ మాదిరిగానే 'బస్ హోస్టెస్' ఉంటారని వెల్లడించారు. ఇంధనం తక్కువగా వినియోగించుకోవడానికి ప్రత్యామ్నాయాలు వెతుకున్నట్లు, భవిష్యత్తులో భారత్ ఇంధన దిగుమతిదారుగా కాకుండా.. ఎగుమతిదారుగా మారాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.ఇంధన వినియోగం తగ్గించడానికి ఇప్పటికే పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను, ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. ఇథనాల్ ద్వారా నడిచే వాహనాలు విరివిగా అందుబాటులోకి రానున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా.. 300 ఇథనాల్ పంపులను ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన అన్నారు.ప్రజా రవాణా ఖర్చును తగ్గించడానికి కూడా ప్రభుత్వం మార్గాలను అన్వేషితోందని గడ్కరీ అన్నారు. డీజిల్ బస్సు ఒక కిమీ నవ్వడానికి 115 రూపాయలు ఖర్చు అవుతుంది. ఏసీ ఎలక్ట్రిక్ బస్సు కోసం రూ. 41, నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సు కోసం రూ. 37 మాత్రమే ఖర్చు అవుతుంది. నిర్వహణ ఖర్చు తగ్గినప్పుడు.. టికెట్ ధరలు కూడా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం మేము టాటాతో కలిసి నాగ్పూర్లో పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాము. నేను చెక్ రిపబ్లిక్కు వెళ్ళినప్పుడు.. అక్కడ మూడు ట్రాలీలు ఉన్న బస్సు చూశాను. అలాంటిదే ఇండియాలో కూడా రోపొందించాలని అనుకున్నాను. రాబోయే ఎలక్ట్రిక్ బస్సు 132 మంది ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది కేవలం 40 సెకన్లలో 40 కిమీ ప్రయాణించడానికి కావాల్సిన ఛార్జింగ్ వేసుకుంటుంది. దీనికోసం అయ్యే ఖర్చు రూ. 35 నుంచి రూ. 40 మాత్రమే.
![UPI payments available in UAE through NPCI International and Network International](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/upi01.jpg.webp?itok=MM17BWY_)
యూఏఈలోనూ యూపీఐ చెల్లింపులు!
దేశంలో డిజిటల్ చెల్లింపులకు కీలకంగా ఉన్న యూపీఐ సేవలను యూఏఈకి విస్తరిస్తున్నట్లు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) తెలిపింది. యూఏఈలో నివసిస్తున్న భారతీయులు, ప్రయాణికులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడుతాయని ఎన్పీసీఐ పేర్కొంది.ఈ సందర్భంగా ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ సీఈఓ రితేష్ శుక్లా మాట్లాడుతూ..‘ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ మిడిల్ ఈస్ట్(మధ్యప్రాచ్య దేశాలు), ఆఫ్రికాలోని డిజిటల్ కామర్స్లో సేవలందిస్తున్న ‘నెట్వర్క్ ఇంటర్నేషనల్’తో భాగస్వామ్యం కలిగి ఉంది. కాబట్టి యూఏఈలో యూపీఐ సేవలందించే ప్రక్రియ సులువైంది. యూఏఈలోని భారతీయులు, ప్రయాణికులు, టూరిస్టులు పాయింట్-ఆఫ్-సేల్ (పీఓఎస్) టెర్మినల్స్లో క్యూఆర్ కోడ్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. 2024లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య 98 లక్షలుగా ఉంటుందని అంచనా. అందులో యూఏఈ ద్వారానే 52.9 లక్షల మంది రాకపోకలు జరిపే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులకు ఈ సేవలు ప్రారంభించాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: యాపిల్కు ఓపెన్ఏఐ బోర్డులో స్థానం..!ఎన్పీసీఐ ఇప్పటికే నేపాల్, శ్రీలంక, మారిషస్, సింగపూర్, ఫ్రాన్స్, భూటాన్లలో ఈ యూపీఐ సేవలను ఆమోదించింది.
![Industry Needs To Boost Capital Investments Says Anand Mahindra](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/Anand-Mahindra.jpg.webp?itok=nSps7pEF)
పెట్టుబడులు పెంచండి.. ఆనంద్ మహీంద్రా కీలక సూచనలు
ఇండియాలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా వృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి భారతీయ కంపెనీలు పెట్టుబడి పెంచాల్సిన అవసరం ఉందని దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' పేర్కొన్నారు. 2023-24 సంవత్సరానికి కంపెనీ వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశించి వ్యాఖ్యానించిన ఈయన.. కోవిడ్ అనంతర కాలంలో భౌగోళిక రాజకీయాలు మరియు ఆర్థిక సంబంధాల పరస్పర చర్య భారతదేశం స్థితిని బలపరిచిందని పేర్కొన్నారు.భారతదేశం వృద్ధి మరింత వేగవంతం కావాలంటే పరిశ్రమలు కూడా వృద్ధి చెందాలి. ఈ దేశం మనకు ఏమిచ్చింది అని కాకుండా.. దేశానికీ మనం ఏమి చేయగలమో ఆలోచించండి. ఈ క్లిష్ట సమయంలో పరిశ్రమ చేయాల్సిన ముఖ్యమైన పని ప్రైవేట్ పెట్టుబడులను పెంచడం అని ఆనంద్ మహీంద్రా అన్నారు.1990ల ఆర్థిక సంస్కరణల తర్వాత.. ప్రైవేట్ పెట్టుబడులు జీడీపీలో 10 శాతం నుంచి 27 శాతానికి పెరిగాయి. అయితే 2011-12 నుంచి జీడీపీ శాతంగా ప్రైవేట్ పెట్టుబడులు ఆందోళనకరమైన స్థాయికి పడిపోతున్నాయని మహీంద్రా పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మనం చక్కదిద్దాలని, సమస్య వనరులకు సంబంధించినది కాదు, ఇది మనస్తత్వానికి సంబంధించినదని మహీంద్రా వెల్లడించారు.
వీడియోలు
![Kadapa MLA Madhavi Reddy Vs Corporator Uma Devi Over Pension Distribution](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/d_0.jpg.webp?itok=VcdmIlYN)
![Kadapa MLA Madhavi Reddy Vs Corporator Uma Devi Over Pension Distribution](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/d_0.jpg.webp?itok=VcdmIlYN)
పెన్షన్ల పంపిణీపై టీడీపీ నేతల లొల్లి ఎమ్మెల్యేను నిలదీసిన కార్పొరేటర్
![K Keshava Rao Resigns From Rajya Sabha After Joining In Congress](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/m_2.jpg.webp?itok=NuhszVaU)
![K Keshava Rao Resigns From Rajya Sabha After Joining In Congress](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/m_2.jpg.webp?itok=NuhszVaU)
రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా ఉపఎన్నిక జరిగితే..!
![TV5 Sambasiva Rao In Phone Tapping Case](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/ph.jpg.webp?itok=_ERbUx9A)
![TV5 Sambasiva Rao In Phone Tapping Case](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/ph.jpg.webp?itok=_ERbUx9A)
అడ్డంగా దొరికిన టీవీ5 సాంబశివరావు..
![YS Jagan Very Strong Warning to Chandrababu](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/j.jpg.webp?itok=48s07wM3)
![YS Jagan Very Strong Warning to Chandrababu](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/j.jpg.webp?itok=48s07wM3)
90 ఏళ్ల అవ్వపై వివక్ష.. టీడీపీ అరాచకం
![CM Chandrababu Meets PM Modi in Delhi](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/o_1.jpg.webp?itok=BXrKxkRA)
![CM Chandrababu Meets PM Modi in Delhi](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/o_1.jpg.webp?itok=BXrKxkRA)
ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ
![TDP Goons Atrocities In Kurnool Dist Demolished YSR Statue And Inauguration Stones](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/dem.jpg.webp?itok=hwXZDhbh)
![TDP Goons Atrocities In Kurnool Dist Demolished YSR Statue And Inauguration Stones](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/dem.jpg.webp?itok=hwXZDhbh)
కర్నూల్ జిల్లాలో YSR విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం
![Rohit Sharma and Team Meets PM Modi](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/c_0.jpg.webp?itok=fW8zd_up)
![Rohit Sharma and Team Meets PM Modi](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/c_0.jpg.webp?itok=fW8zd_up)
రోహిత్ సేనకు మోదీ విందు
![YS Jagan Mohan Reddy Strong Warning To Chandrababu Govt](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/42_0.png.webp?itok=hRk9m7em)
![YS Jagan Mohan Reddy Strong Warning To Chandrababu Govt](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/42_0.png.webp?itok=hRk9m7em)
దమ్ముంటే ప్రజలకు మంచి చేయండి.. ప్రతి ఒక్కరికీ లెక్క చెల్లిస్తాం
![High Court Slams CM Chandrababu On YSRCP Office Demolition](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/41.png.webp?itok=jswRU1kN)
![High Court Slams CM Chandrababu On YSRCP Office Demolition](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/41.png.webp?itok=jswRU1kN)
YSRCP కార్యాలయాల కూల్చివేతలపై హైకోర్టు కీలక తీర్పు
![KSR LIVE Show On Chandrababu Amaravati Scam](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/40.png.webp?itok=_MQmnjOg)
![KSR LIVE Show On Chandrababu Amaravati Scam](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/40.png.webp?itok=_MQmnjOg)
KSR Live Show: అమరావతి పేరుతో గాల్లో మేడలు.. బాబుగారి లక్ష కోట్ల దందా..!
ఫ్యామిలీ
![How to keep your baby skin healthy during this monsoon](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/Babyskincare_monsoon.jpg.webp?itok=-u5PKLf9)
వర్షాకాలంలోపాపాయి పువ్వులాంటి చర్మంకోసం : చిట్కాలివిగో!
మండించే ఎండల నుంచి ఉపశమనంగా వర్షాకాలం వచ్చేసింది. అయితే వర్షంతోపాటు కొన్ని రకాల ఇబ్బందులు, జలుబు, జ్వరం లాంటివి వెంటే వస్తాయి. అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చిన్నారుల్లో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. చిన్న పిల్లలు ఆరోగ్యం, చర్య సంరక్షణ చాలా అవసరం. ఈ నేపథ్యంలో మారికో లిమిటెడ్ చీఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా వోరా అందించే చిట్కాలను పరిశీలిద్దాం.పెద్దవారితో పోలిస్తే శిశువు చర్మం చాలా సున్నితంగా ఉంటుంది దాదాపు 30శాతం పల్చగా, సుకుమారంగా ఉంటుంది. పెళుసుగా , పొడిగా ఉండి తొందరగా వాతావరణ పరిస్థితుల ప్రభావానికి లోనవుతుంది. దీంతో చర్మం ఎరుపెక్కడం, ఇన్ఫెక్షన్లు లాంటి వివిధ చర్మ సమస్యలొస్తాయి. పాపాయి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పరిశుభ్రత, మాయిశ్చరైజేషన్ రెండూ చాలా అవసరం. వర్జిన్(పచ్చి) కొబ్బరి నూతోనె పాపాయి మృదువైన చర్మానికి మసాజ్ చేయాలి.వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఆధారిత నరిషింగ్ లోషన్ లేదా క్రీంతో క్రమం తప్పకుండా బేబీ బాడీని మాయిశ్చరైజ్ చేయాలి. తల్లి పాలలో లభించే పోషకాలుండే ఈ ఆయిల్ శిశువు చర్మాన్ని 24 గంటలూ తేమగా ఉంచేలా సాయపడుతుంది. చర్మానికి తగిన పోషణ కూడా అందుతుంది.బలమైన ఎముకలు, కండరాల అభివృద్ధి , నరాల అభివృద్ధిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది.దీనితో పాటు, బిడ్డకు సరైన దుస్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం. వర్షాలకి ఉష్ణోగ్రతలు తగ్గి, గాలిలో తేమ పెరుగుతుంది. దీంతో చిన్నారికి చెమటలు పట్టే అవకాశం ఎక్కువ. కనుక వదులుగా ఉండే దుస్తులను వాడాలి. అలాగే సింథటిక్ దుస్తులు కాకుండా మెత్తటి కాటన్, చలికి రక్షణగా ఉలెన్ దుస్తులను వాడాలి. లేదంటే అధిక చెమటతో, పొక్కులు, దద్దుర్లు వస్తాయి. ఈ సీజన్లో డైపర్లను తరచుగా మార్చుతూ అక్కడి చర్మం తడిగా లేకుండా చూసుకోవాలి.
![Eshna Kutty Social Media Influencer Who Redefines HulaHooping In Saree](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/erna.jpg.webp?itok=JK-F0Ono)
చీరకట్టులో హులా హూపింగ్..అథ్లెటిక్ సామర్థ్యాలతో..!
ఇటీవల చాలామంది చీర కట్టులో స్విమ్మింగ్, స్కేటింట్ వంటివి చేసి ఆశ్చర్యపరుస్తున్నారు. మన భారతీయ వస్త్రధారణ మనకు నచ్చిన అభిరుచికి అనుకూలంగా మలుచుకోవచ్చని చేసి చూపిస్తున్నారు. అందుకోసమని పాశ్చాత్య బట్టలను ధరించాల్సిన పనిలేదని చాటి చెబుతున్నారు. మన భారత సంప్రదాయ వస్త్రాధారణకు ఉన్న ప్రాముఖ్యతను తెలయజెప్పుతున్నారు కూడా. అలానే ఈ మలయాళ కుట్టి చీరకట్టులో కేలరీల బర్న్ చేసే క్రీడలాంటి హులా హూప్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సోషల్మీడియ ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఎష్నా కుట్టి మూసపద్ధతలను సవాలు చేస్తూ సాంప్రదాయ భారతీయ చీరకట్టులో చాకచక్యంగా హులా హూపింగ్ చేసి చూపించింది. ఎష్నా చీర ధరించి కూడా చాలా సునాయాసంగా, వేగవంతంగా హులా హూపింగ్ చేసింది. అధునిక అథ్లెటిజంని భారత సాంప్రదాయ చీరతో మిళితం చేసింది. పైగా భారతీయ మహిళలు సాధించలేనిది ఏదీ లేదని చాటి చెప్పింది. ఇక ఎష్నా ఇలా చీరకట్టులో హులా హూప్స్ చేయడానికి ప్రధాన కారణం శారీరక ఫిట్నెస్ కోసం చేసే ఈ క్రీడను మన సాంస్కృతికి వారసత్వానికి చిహ్నమైన చీరలో కూడా చెయ్యొచ్చు అని చెప్పేందుకేనని అంటోంది. ఆమె ఢిల్లీలో పెరిగినప్పటికీ..పుట్టుకతో ఆమె మళయాళీ. కానీ ఆమెకు మళయాళం రాదు. ఆమె తల్లి చిత్ర నారాయణ పాత్రికేయురాలు, తండ్రి విజయన్ కుట్టి డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. తాను ఈ హులాహూపింగ్ని పదేళ్ల ప్రాయం నుంచే నేర్చుకున్నట్లు తెలిపింది. ఇది తనకు ఎంతో ఇష్టమైన అభిరుచి అని చెప్పుకొచ్చింది. తన స్నేహితులు, తల్లిదండ్రలు మద్దతుతో హులా హూపింగ్స్ ట్రైనర్గా మారింది. అంతేగాదు పారిస్లో జరగనున్న ఒలింపిక్స్ 2024లో కూడా అథ్లెట్లకు మద్దతిస్తు పాల్గొనడం విశేషం. ఇక హులా హూప్స్ అనేది ఒక క్రీడా ఈవెంట్గా గుర్తించబడింది, దీనికి నిర్దిష్ట రూపం అవసరం. ముఖ్యంగా ఫిట్నెస్కి సంబంధించి కేలరీలను బర్న్ చేసే గొప్ప సాధనంగా చెప్పొచ్చు. కాగా, ఎష్నా జర్నీ భారతీయ యువతులకు స్ఫూర్తిదాయకం. మన సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవిస్తూనే..అథ్లెటిక్స్ ఆసక్తిన కొనసాగించాలనుకునేవారికి ఓ కొత్త మార్గాన్ని చూపించింది. రాబోయే తరాలు ఎష్నాని ఆదర్శంగా తీసుకుని తాము రాణిస్తున్న రంగంలో భారతీయ సంప్రదాయ వస్త్రధారణకు పెద్దపీట వేసేలా మార్గం సుగమం చేసింది. (చదవండి: కఠినమైన డైట్, జిమ్ చెయ్యలేదు..కేవలం పరాఠాలతో బరువు తగ్గడమా..?)
![Mameru Ceremony: Radhika Merchant Picks Out Gold Jewellery From Mum's Wedding Collection](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/Anantambani_radhikamerchant_mameru%20copy.jpg.webp?itok=TRiC7slu)
‘మామేరు’ వేడుకలో మెరిసిన రాధిక : అమ్మనగలతో అందంగా, అద్భుతంగా!
అపర కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన చిరకాల ప్రేయసితో వివాహ బంధంలోకి అడుగుపెట్టే ముహూర్తం సమీపిస్తోంది. దీంతో పెళ్లి వేడుకలోని కీలక ఘట్టాలు ఒక్కొక్కటీ వైభవంగా మొదలయ్యాయి.ప్రధానంగా గుజరాతీ వివాహాల్లో తొలుతగా నిర్వహించే ఆచారాలను ఇరు కుటుంబాలు పాటిస్తున్నాయి. ఇందులో భాగంగానే ముంబైలోని యాంటిలియాలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల మామేరు వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా కాబోయే వధువు రాధిక తన స్టయిలిష్ లుక్తో అందర్నీ ఆకట్టుకుంది.అమ్మ నగలతో అందంగారాధికా మర్చంట్ ఆరెంజ్ అండ్ పింక్ షేడ్స్లో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లెహంగాలో అందంగా ముస్తాబైంది. బంగారు నెక్లెస్ , మ్యాచింగ్ జుంకాలు, బ్యాంగిల్స్ ఇంకా స్పెషల్ హెయిర్ స్టయిల్తో ఆమె ఫ్యాషన్ లుక్ అదిరిపోయింది. ముఖ్యంగా ఇదే వేడుకలో తన తల్లి ధరించిన ఆభరణాలను ఎంచుకోవడం ప్రత్యేకతగా నిలుస్తోంది.బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్, ప్రియుడు శిఖర్ పహారియాతో స్టైలిష్గా కనిపించింది. ఇంకా మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్, ఓరీ తదితర బాలీవుడ్ ప్రముఖులు ఈ ఈవెంట్కు మరింత గ్లామర్ జోడించారు. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) గుజరాతీ వివాహాలలో కుటుంబ ప్రాముఖ్యతను, వరుడు తల్లి పుట్టింటివారి ప్రేమలను చాటేలా 'మోసలు' లేదా 'మామెరు' వేడుకులను నిర్వహిస్తారు. ఈ 'మామేరు' వేడుకలో వధూవరులు మేనమామలు, ఇతర కుటుంబ సభ్యుల ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. అమ్మతరపు వారు అందించే బహుమతులను స్వీకరిస్తారు.కాగా జూలై 12నుంచి ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహ వేడుకలు జరగ బోతున్నాయి. జూలై 13న శుభ్ ఆశీర్వాద్, జూలై 14న మంగళ్ ఉత్సవ్ (వివాహ రిసెప్షన్)దాకా ఈ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి.
![Sahaya Sharma Success Story As An Abstract Artist](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/sahaya.jpg.webp?itok=QgCBmMgr)
Sahaya Sharma: తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ..
బామ్మ జీవితం నుండి ప్రేరణం పొంది అబ్స్ట్రాక్ట్ ఆర్టిస్ట్గానూ తల్లి సంగీత పరిజ్ఞానాన్ని ఒంటపట్టించుకొని సంగీత కళాకారిణిగానూ ఒకేసారి రెండు కళల్లోనూ రాణిస్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది ఢిల్లీవాసి సహాయ శర్మ. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ యువతరపు ఆలోచనలకు అద్దం పడుతుంది.‘‘నా ఎదుగుదలలో సంగీతం పాత్ర చాలా పెద్దది. మా అమ్మ సంగీత కళాకారిణి. తను పాడుతుండటాన్ని నా చిన్ననాటి నుంచి వింటూ, నేనూ పాడుతూ పెరిగాను. సంగీత ప్రపంచం నుంచి నాదైన సొంత శైలిని కనుక్కోవడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉండేదాన్ని. స్కూల్, కాలేజీ రోజుల్లో ఎప్పుడు సెలవులు వచ్చినా రకరకాల పాటల్ని డౌన్లోడ్ చేసుకొని, ఒక ప్రత్యేకమైన జాబితా తయారు చేసేదాన్ని.సొంతంగా ఆల్బమ్స్ విడుదల..కిందటేడాది ముంబయిలో కిందటేడాది మా ఫ్రెండ్ మ్యూజిక్ స్టూడియోని సందర్శించాను. అక్కడ నేను రాసిన ఒక పాటను ప్లే చేశాను. ఆ పాట విన్నాక, వారు తమతో కలిసి పనిచేయవచ్చని చెప్పారు. దీంతో కిందటేడాది జూలై నాటికి అనుకున్న పాటను పూర్తి చేశాను. ఈ యేడాది మార్చిలో ‘ఫెడెక్స్ ఫెడప్’ ని విడుదల చేశాను. నా వ్యక్తీకరణను ప్రపంచంతో పంచుకోవడానికి ఇది సరైన సమయం అని భావించాను. గొడవల నుంచి పాటలు..రెండేళ్ల క్రితం మా కుటుంబసభ్యులతో చాలా గొడవ పడ్డాను. భగవద్గీత ఒక శ్లోకంలో కోపానికి, భయానికి మూలకారణం అనుబంధమే అని చెబుతోంది. దీనినుంచే నా ఆల్బమ్ పుట్టిందని చెప్పవచ్చు. ఒక సమయంలో జీవితం స్తంభించుకు΄ోయినట్టుగా అనిపిస్తుంది. అలాంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి మ్యూజిక్ ఆల్బమ్ చేశాను.96 బిపిఎమ్ అనేది నాన్నతో గొడవ తర్వాత రాశాను. ఈ గొడవ తర్వాత స్త్రీ ప్రవర్తన నాకు కొత్తగా అర్థమయ్యేలా చేసింది. జీవితంలోని ఆచరణాత్మక దృక్పథాన్ని, భగవంతుని పట్ల ఉండే భక్తి అన్నీ బలమైన మనిషిగా తీర్చిదిద్దాయి. నా పాటలోని సాహిత్యం అంతా ఇలాగే ఉంటుంది. ‘నేను మళ్లీ కలుస్తూనే ఉంటాను. రౌండ్ అండ్ రౌండ్గా తిరుగుతూనే ఉంటాను...’ అని సాగుతుంది. ఇప్పటికి మూడు ఆల్బమ్స్ విడుదలయ్యాయి.చిత్రకళలో ఓదార్పు..రంగులలో లోతైన ఓదార్పును, శాంతిని కనుక్కోవడానికి ఉపయోగపడేదే పెయింటింగ్. సంగీతం ద్వారా నన్ను నేను బయటకు వ్యక్తపరుచుకుంటే పెయింటింగ్లో నన్ను నేను వెతుక్కోగలిగాను. ఇలా ఈ రెండు కళలు నన్ను కొత్తగా ఆవిష్కరింపజేశాయి. మా బామ్మ తన చీరలపై రకరకాల పెయింటింగ్స్ను చిత్రిస్తుండేది. వాటిని చూస్తూ నేనూ సాధన చేసేదాన్ని. అలా రంగుల ప్రపంచం నాకు పరిచయం అయ్యింది. అంతేకాదు, మా ఇల్లు రకరకాల పెయింట్స్, శిల్పాలతో ఒక ఆర్ట్ మ్యూజియంలా ఉంటుంది.మా నాన్న అంత అందంగా తీర్చిదిద్దారు ఇంటిని. ఇది కళాకారిణిగా నా విజువల్ కార్టెక్స్లోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేసింది. అక్కడి కళాకృతుల సేకరణలో అమ్మ అభిరుచి, మన దేశీయ సంస్కృతి... నాలో లోతైన గాఢత నింపాయి. ఆ ఇష్టంతోనే సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేశాను. రంగులతో ఆధ్యాత్మిక ప్రపంచాలను సృష్టిస్తుంటాను. సోలో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తుంటాను. భార తదేశం, న్యూయార్క్, లండన్, బోస్టన్, దుబాయ్, హాంకాంగ్లోని కేఫ్లు, కోర్టులు, హోటళ్లు, గెస్ట్ హౌజ్ గోడలను నా పెయింటింగ్స్ అలంకరించాయి. మార్చిన ప్రయాణాలు..అమ్మానాన్నలతో కలిసి దేశమంతా తిరిగిన రోడ్డు ప్రయాణాలు, జంగిల్ సఫారీలు, ట్రెక్కింగ్ ఏరియాలు నన్ను ప్రకృతికి దగ్గర చేశాయి. నా తల్లితండ్రులు ప్రయాణంలో సంగీతం, కళ, కథలు, సంస్కృతిని పరిచయం చేశారు. అప్పటినుంచి అందమైన ప్రకృతి దృశ్యాలను నా పెయింటింగ్స్ లో చూపించడం అలవాటు చేసుకున్నాను.కరోనా సమయంలో జీవితం ఎంత చిన్నదో కదా అనిపించింది. అప్పుడు భౌతికంగా, ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. విలాసవంతమైన జీవనం అవసరమా అనేది తెలుసుకున్నాను. నా వాస్తవికత ఏమిటో అర్థమయ్యాక నేనేం సృష్టించాలో తెలుసుకున్నాను. అందువల్ల మ్యూజిక్ ఆల్బమ్స్, పెయింటింగ్స్ నన్ను కొత్తగా మార్చాయి’’ అని వివరిస్తుంది సహాయ.
న్యూస్ పాడ్కాస్ట్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
బ్రిటన్లో నేడే పార్లమెంట్ ఎన్నికలు... 650 స్థానాలకు జరుగనున్న పోలింగ్.. బరిలో 107 మంది బ్రిటిష్ ఇండియన్లు.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
రాహల్వి పిల్ల చేష్టలు. సానుభూతి కోసం సభలో వెక్కిళ్లు. రాహుల్పై ప్రధాని వాగ్బాణాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
హిందువులమని చెప్తూనే హింసాద్వేషాలు వ్యాప్తి చేస్తున్నారని బీజేపీపై రాహుల్ ఫైర్.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం... సీఎం ప్రజావాణి దరఖాస్తుల్లో 70 శాతానికి పైగా పెండింగ్లోనే.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
టీ20 క్రికెట్ ప్రపంచ కప్ మనదే... ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
నీట్-యూజీ పరీక్షలో అక్రమాలపై పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళన... వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్... ఉభయ సభలు పలుమార్లు వాయిదాట.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు. నిర్ణయం వాయిదా వేసిన కోర్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసిన సీబీఐ.. మూడు రోజులపాటు సీబీఐ కస్టడీకి కేజ్రీవాల్.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి... స్పీకర్ అయ్యన్నపాత్రుడికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
దేశ ప్రజాస్వామ్యానికి ‘ఎమర్జెన్సీ’ మాయని మచ్చ.. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపాటుర్.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
![-](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/212.jpg.webp?itok=3xyjL0v6)
వివాహితను కర్కశంగా నరికి చంపిన ఆటో డ్రైవర్
పొందూరు: మండలంలోని తాడివలస సమీపంలో చిన్న బొడ్డేపల్లి గ్రామానికి చెందిన వివాహిత హత్య మంగళవారం సంచలనం రేపింది. వివాహితను హత్య చేసిన ఆటోడ్రైవర్ ఆమె మృతదేహాన్ని నేరు గా పొందూరు పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి లొంగిపోయాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు..చిన్నబొడ్డేపల్లి గ్రామానికి చెందిన అచ్చయ్య, రాజులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె అమలాపురపు రాజేశ్వరి భర్త గుప్తేశ్వరరావు మూడేళ్ల కింద ట అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆమె తన కుమార్తెతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ కుమార్తెతో పాటు తల్లిదండ్రులను పోషిస్తున్నారు. రెండు నెలల కిందట బొడ్డేపల్లి రైల్వేట్రాక్ పనులకు వచ్చిన నరసన్నపేట మండలం ఉర్లాం గ్రామానికి చెందిన ఆముజూరు గోపాల్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. గ్రామంలోనే వారిద్దరూ తరచూ కలిసేవారు. మంగళవారం సంతకవిటి మండలం వాల్తేరులో శుభకార్యానికి వెళ్లడానికి సిద్ధమైన రాజేశ్వరి గోపాల్కు ఫోన్ చేసింది. గోపాల్ ఆటోపై చిన్నబొడ్డేపల్లికి వచ్చాడు. ఆటోలో ఇద్దరూ వాల్తేరుకు బయ లుదేరారు. అయితే తాడివలస సమీపంలో ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. గోపాల్ తనతో తెచ్చుకున్న చాకుతో రాజేశ్వరి మెడపై పలుమార్లు దాడిచేశాడు. దీంతో రాజేశ్వరి అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన రాజేశ్వరిని గోపాల్ తన ఆటోలో స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి లొంగిపోయాడు. ఆమదాలవలస సీఐ దివాకర్యాదవ్ పోలీస్స్టేషన్కు వచ్చి విచారణ చేపట్టారు. మృతురాలి తల్లిదండ్రులు అచ్చయ్య, రాజు ఇచ్చిన ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేశారు. హత్య చేసిన గోపాల్తో కలి సి హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలను రాబట్టేందుకు విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.
![-](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/glaskl.jpg.webp?itok=ll8KUL_t)
రైలు కిందపడి తండ్రి, కుమార్తెల విషాదం!
మహబూబ్నగర్: రైలు కిందపడి తండ్రి, కుమార్తె మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ సయ్యద్ అక్బర్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మందిపల్కు చెందిన శివానంద్(50) కొన్నేళ్లుగా ఎస్వీఎస్ ఆస్పత్రిలో కారు డ్రైవర్, ఆయన కుమార్తె చందన అదే ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తుండేవారు.వీరి కుటుంబం ఆస్పత్రి ఎదురుగా ఉన్న కాలనీలో నివాసం ఉంటోంది. సోమవారం రాత్రి కుటుంబ కలహాలతో శివానంద్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకునేందుకు సమీపంలో ఉన్న రైలు పట్టాలపై వెళ్లాడు. అతడిని కాపాడేందుకు కుమార్తె చందన (20) కూడా వెళ్లింది. అదే సమయంలో రైలు వచ్చి ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.
![ASI committed suicide in ysr district](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/565.jpg.webp?itok=0r2lnu1I)
వైఎస్సార్ జిల్లా: రైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్య
వైఎస్సార్ జిల్లా: వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జి వద్ద రైలు పట్టాలపై పడి ఏఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కమలాపురం పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైగా పని చేస్తున్న నాగార్జునరెడ్డిగా గుర్తించారు. నైట్ డ్యూటీ ముగించుకొని తెల్లవారుజామున వెళ్లి రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం. కుటుంబకలహాలతో ఏఎస్సై నాగార్జున రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
![Aswaraopeta SI Sriramulu Srinivas One Plus Mobile missing](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/658_0.jpg.webp?itok=vLQfTDCY)
Aswaraopeta SI: నా వన్ ప్లస్ ఫోన్ చూడండి
అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ గత ఆదివారం ఆత్మహత్యాయ త్నానికి పాల్పడగా.. మంగళవారం పలు విషయాలు సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. ‘నా వన్ ప్లస్ ఫోన్ చూడండి.. అందులో అన్ని వివరాలు ఉన్నాయి’ అంటూ ఎస్సై మెసేజ్ పెట్టారనే వార్త చక్కర్లు కొట్టింది. ఉన్నతాధికారుల వేధింపులు, సహచర సిబ్బంది అవమానాలు తాళలేకే తాను పురుగుల మందు తాగానని, ఆ తర్వాత భార్యాబిడ్డలు గుర్తు రావడంతో బతకాలనిపించి 108కు ఫోన్ చేశానని మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్టు వీడియోలో వైరల్ అయింది. సీఐ జితేందర్రెడ్డి, స్టేషన్ సిబ్బంది అవమానాలకు గురి చేశారని, తనను అవినీతిపరుడిగా ముద్ర వేశారని, ఈ విషయాన్ని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా ఆయన స్పందించలేదని వెల్లడించారు. కాగా, ఆత్మహత్యాయత్నానికి ముందే సర్వీస్ రివాల్వర్ను పోలీస్స్టేషన్లో అప్పగించినట్టు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై ఆరోగ్యం విషమంగానే ఉందని, ప్రధాన అవయవాలు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపినట్లు సమాచారం.ఆ ఫోన్ ఎక్కడ ఉంది?ఎస్సై శ్రీనివాస్ చెబుతున్న వన్ ప్లస్ ఫోన్ ఇప్పుడు ఎక్కడ ఉంది.. ఆత్మహత్యాయత్నం సమయంలో ఫోన్ తన వద్దే ఉంటే దాంట్లో నుంచే అందరికీ ఆధారాలు షేర్ చేయొచ్చు కదా.. అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఫోన్ కుటుంబ సభ్యులకు ఇచ్చారా, ఆత్మహత్యాయత్నం చేసిన ప్రదేశంలో మహబూబాబాద్ పోలీసులకు లేదా 108 సిబ్బందికి లభిస్తే పోలీసులకు అప్పగించారా అనేది ప్రశ్నగానే మిగిలింది. ఏదేమైనా ఆ ఫోన్లోని వివరాలు పరిశీలిస్తేనే అసలు వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. కాగా, ఎస్సై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై ఇంటెలిజెన్స్ పోలీసులు మంగళవారం అశ్వారావుపేటకు వచ్చి పలు కోణాల్లో విచారణ చేపట్టారు.