ప్రధాన వార్తలు

Bangladesh: స్కూల్ భవనంపై కూలిన విమానం
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో విమానం ప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్ ఎయిర్ఫోర్స్కు చెందిన F-7 BGI ట్రైనింగ్ విమానం సోమవారం మధ్యాహ్నం ఢాకా నగరంలోని మైల్స్స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రాంగణంలో కూలిపోయింది. మధ్యాహ్నం 1:06 గంటల సమయంలో విమానం టేకాఫ్ తర్వాత దియాబారి అనే ప్రాంతంలో కూలింది. ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్లో విద్యార్థులు ఉన్నారు. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారని అగ్నిప్రమాద శాఖ అధికారులు తెలిపారు.విమానం కూలడంతో ఘటనా స్థలంలో పొగలు ఎగసిపడుతున్నాయి. రెస్క్యూ టీములు సహాయక చర్యలు చేపట్టాయి. విమానం బంగ్లాదేశ్ ఎయిర్ఫోర్స్కు చెందినదిగా ఆర్మీ అధికారికంగా ధృవీకరించింది. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. Bangladesh Air Force China Made FT-7BGI (training) aircraft, tail no. 701, crashes in Uttara near Milestone College. 1:06pm and crashed into the college campus soon after.Casualties : at least 6-7 min. pic.twitter.com/0vg4bvjD86— (((Bharat)))🚨™️🕉🚩🔱 🇮🇳 🇮🇱🇷🇺🇺🇸🎗 (@Topi1465795) July 21, 2025

దేనికైనా రెడీ.. ఎన్ని కేసులైనా పెట్టుకోండి: అంబటి, రజిని
సాక్షి, పల్నాడు: ఏపీలో చంద్రబాబు దుష్టపాలన అంతానికి అంతా కలిసి కట్టుగా పని చేస్తామని, ఈ క్రమంలో ఎన్ని కేసులు పెట్టిన భయపడబోమని వైఎస్సార్సీపీ నేతలు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని అన్నారు. సోమవారం సత్తెనపల్లి గ్రామీణ పీఎస్లో విచారణకు హాజరైన అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్ గత నెల 18న రెంటపాళ్లలో పర్యటించారు. ఆ టైంలో జనసమీకరణ చేపట్టారంటూ పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులిచ్చారు. ఈ కేసులో విచారణ నిమిత్తం అంబటి, రజిని ఇవాళ పీఎస్కు వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని కష్టాలు ఎదురైనా జగన్ వెంటే నడుస్తామని, చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని ఉద్ఘాటించారు. జగన్ పార్టీ పెట్టిన దగ్గర నుండి అయన వెంటే నడుస్తున్నాం. గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఎన్నో మీటింగ్లు పెట్టారు.. ర్యాలీలు నిర్వహించారు. కానీ మేము ఇలాంటి కేసులు పెట్టలేదు. ఇప్పుడు మాపై కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలందరినీ జైలుకు పంపాలన్నది కూటమి ధ్యేయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అక్రమ కేసులో మిథున్ రెడ్డిని అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించారు.సత్తెనపల్లి శాసన సభ్యులుగా గెలిచింది. ఒకరు పెత్తనం చేస్తుంది మరొకరు. డీఎన్ఆర్ అనే వ్యక్తి సత్తెనపల్లిలో పెత్తనం చాలా ఇస్తూ రాజ్యాంగీతర శక్తిగా వ్యవహరిస్తున్నాడు. ఏపీలో కొనసాగుతోంది మిలిటరీ పాలన. చంద్రబాబు, లోకేష్లకు బుద్ది చెప్పి తీరుతాం. దుష్ట పాలన అంతానికి అందరం కలిసి పని చేస్తాం అని అన్నారు. మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. ‘‘రెంటపాళల్లో పోలీసులు, కూటమి నాయకుల వేధింపులు తట్టుకోలేక వైయస్సార్సీపీ నేత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. మేము జనాన్ని సమీకరించామని మాపైన కేసులు పెట్టారు. మా వాళ్లను పరామర్శించడానికి వెళ్తే.. మా మీదే కేసులు పెడుతున్నారు. జగన్ అంటేనే జనం. అలాంటి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు జనాన్ని ఎవరు తరలించాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా భరించడానికి సిద్ధంగా ఉన్నాం. కూటమి పెద్దలు ఒక కట్టు కథ అల్లడం.. దానికి స్కామ్ అని పేరు పెట్టి వైఎస్సార్సీపీ నేతల్ని జైలుకు పంపడం సాధారణంగా మారిపోయింది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ దారుణం. అక్రమ కేసు పెట్టి ఆయన్ని జైలుకు పంపారు. జగన్ మళ్లీ సీఎం అయ్యే దాకా.. ఈ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అని అన్నారామె.

Parliament Live Updates: సాయంత్రం 4 గంటల వరకు లోక్సభ వాయిదా
న్యూఢిల్లీ: లోక్సభ సమావేశాలు సాయంత్రం నాలుగు గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉభయ సభల ప్రారంభం నుంచి పహల్గాం, ఆపరేషన్ సింధూర్పై చర్చించాలని ఉభయ సభల్లో విపక్షాలు పట్టుబడ్డాయి. దీంతో లోక్సభ స్పీకర్ సభను మరోసారి వాయిదా వేశారు ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ -పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినట్లు ట్రంప్ చేసిన వాదనలపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే- బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మధ్య రాజ్యసభలో వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్పై చర్చను తప్పించుకుంటోందని ఖర్గే ఆరోపించారు. దీనికి స్పందించిన నడ్డా ఆపరేషన్ సిందూర్పై పూర్తి చర్చకు ప్రభుత్వం అనుమతిస్తుందన్నారు. ఈరోజు (సోమవారం) ప్రధాని మోదీ ప్రసంగంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే ఇటు లోక్సభ, అటు రాజ్యసభలో గందరగోళం నెలకొంది. బీహార్లో ఓటర్ల జాబితా సవరణ అంశంపై ప్రతిపక్షం చర్చకు పట్టుపట్టింది. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి. లోక్సభలో విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, బీహార్ ఓటర్ జాబితాలపై తీర్మానాలు ఇచ్చారు. ఇంటెలిజెన్స్ వైఫల్యాలు, టెర్రరిస్ట్లను ఇంత వరకూ అరెస్ట్ చేయకపోవడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ గందరగోళం మధ్య లోక్సభ స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.లోక్సభ, రాజ్యసభ ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశమయ్యాయి. పహల్గామ్ ఉగ్ర దాడి, ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారికి నివాళులు అర్పించడంతో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అనంతరం స్పీకర్ ఓం బిర్లా లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు అనుమతించారు. అయితే, ప్రతిపక్ష సభ్యులు ఆపరేషన్ సిందూర్పై చర్చకు డిమాండ్ చేస్తూ, నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఆపరేషన్ సిందూర్పై చర్చ జరుగుతుందని ఓం బిర్లా తెలిపినా, ఎంపీలు తమ నిరసనలు కొనసాగించారు.VIDEO | Monsoon Session 2025: Speaking in Rajya Sabha, BJP Leader and Union Minister JP Nadda (@JPNadda ) said, “ We will and we want to talk about Operation Sindoor. We will share all the details on this, there should be no message conveying that we don't want to talk about the… pic.twitter.com/SeexH17ncD— Press Trust of India (@PTI_News) July 21, 2025ఆపరేషన్ సిందూర్ పై ఎంపీల గందరగోళం మధ్య రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ సభను వాయిదా వేశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో పహల్గామ్ ఉగ్రవాద దాడి అంశాన్ని లేవనెత్తారు. కాల్పుల విరమణలో జోక్యంపై డొనాల్డ్ ట్రంప్ 24 సార్లు తన వాదన వినిపించారన్నారు. ప్రభుత్వం పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణకు సంబంధించిన వివరాలను అందించాలని పట్టుబట్టారు. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం, ఆ విమాన భద్రతపై రాజ్యసభలో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు సమాధానం ఇవ్వనున్నారు. #MonssonSession2025लोकसभा में ‘प्रश्नकाल चल रहा है | #LOkSabha takes up Question Hour#LokSabha @ombirlakota @LokSabhaSecttWatch Live :https://t.co/DyufCPmsYn pic.twitter.com/dPyCF9X3ox— SansadTV (@sansad_tv) July 21, 2025

రన్వేపై జారిన ఎయిరిండియా విమానం.. అంతా సేఫ్
కొచ్చి-ముంబై ఎయిరిండియా విమానానికి సోమవారం పెను ప్రమాదం తప్పింది. రన్వేపై ల్యాండ్ అవుతున్న క్రమంలో విమానం అదుపు తప్పి జారిపోయింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. భారీ వర్షం కారణంగా ఈ ఘటన జరిగిందని అధికారులు ప్రకటించారు. కొచ్చి(కేరళ) నుంచి వచ్చిన విమానం భారీ వర్షంలో విమానం ల్యాండ్ అయ్యింది. అయితే ఆ సమయంలో టైర్లు పేలిపోవడం వల్లే విమానం పక్కకు ఒరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు హుటాహుటిన ఫ్లైట్ నుంచి దిగేశారు. ఈ ఘటనతో ఇంజిన్ కూడా డ్యామేజ్ అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది.Runway scare: #Kochi-bound #AirIndia flight veers off course during landing at #Mumbai airport; passengers safeMore details🔗https://t.co/nhauXEYCrs pic.twitter.com/NewRgbZFyD— The Times Of India (@timesofindia) July 21, 2025

కొందరు హీరోల కంటే నేను చాలా తక్కువ: పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ ఎట్టకేలకు నిజాలు ఒప్పుకొన్నారు. టాలీవుడ్లో చాలామంది హీరోల్లో తను ఒకడినే తప్ప పెద్ద గొప్పేం కాదని చెప్పారు. ఇంకా చెప్పాలంటే కొందరు హీరోలతో పోలిస్తే తాను చాలా తక్కువని కూడా అన్నారు. ఈయన నటించిన 'హరిహర వీరమల్లు'.. దాదాపు ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకొంది. ఫైనల్గా జూలై 24న అంటే ఈ వీకెండ్ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా పవన్ మీడియా ముందుకొచ్చారు. హైదరాబాద్లో ఈ రోజు ఉదయం ప్రెస్మీట్లో పాల్గొన్నారు.(ఇదీ చదవండి: 'వీరమల్లు' నిర్మాతకు కీలక పదవి.. పవన్ కల్యాణ్ ప్రకటన)ఇందులోనే మాట్లాడిన పవన్.. 'రాజకీయంగా నాకు పేరుండొచ్చు. దేశవ్యాప్తంగా నేను తెలుసుండొచ్చు కానీ సినిమాల పరంగా చూస్తే కొందరు హీరోల కంటే నేను చాలా తక్కువనే. దానికుండే ఇబ్బందులు దానికి ఉంటాయి. మిగతా వాళ్లకు బిజినెస్ అయినంతగా నాకు బిజినెస్ అవ్వదు. వాళ్లకు వచ్చినంతగా నాకు కలెక్షన్స్ రాకపోవచ్చు. ఎందుకంటే నా దృష్టి ఎప్పుడూ నేను సినిమాలపై పెట్టలేదు' అని చెప్పుకొచ్చారు.మరో సందర్భంలో మాట్లాడుతూ.. 'నువ్వు చిరంజీవి తమ్ముడైనా, కొడుకైనా.. చివరికి నా కొడుకైనా టాలెంట్ లేకపోతే ఇక్కడ నిలబడలేం' అని ప్రస్తుతం ఇండస్ట్రీలో పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు. పవన్ చెప్పడం వరకు బాగానే ఉంది కానీ ఆయన అభిమానులకు ఇది చెవికెక్కుతుందా అనేది చూడాలి. ఎందుకంటే మా హీరో స్టార్, సూపర్స్టార్ అని ఇతర హీరోల అభిమానులతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు. ఇప్పటికైనా వాళ్లు అర్థం చేసుకుని మారతారా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'ఫిష్ వెంకట్'కు ఎందుకు సాయం చేయాలి: నట్టి కుమార్)

BCCI: నితీశ్ రెడ్డితో పాటు అతడూ అవుట్.. జట్టులోకి కొత్త ప్లేయర్
ఇంగ్లండ్తో నాలుగో టెస్టు (IND vs ENG)కు ముందు టీమిండియాకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే రిషభ్ పంత్ (Rishbah Pant) వేలి గాయంతో కేవలం బ్యాటర్గా బరిలోకి దిగుతాడని తెలుస్తుండగా.. యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు.ఎడమ మెకాలికి గాయమైన కారణంగా ఈ ఆంధ్రా కుర్రాడు.. ఇంగ్లండ్ నుంచి తిరిగి స్వదేశానికి రానున్నాడు. మరోవైపు.. యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ కూడా మాంచెస్టర్ టెస్టుకు దూరమయ్యాడు. బెకెన్హామ్లో నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా అతడి ఎడమ చేతి వేలికి గాయమైంది.నాలుగో టెస్టుకు దూరంఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వైద్య బృందం పర్యవేక్షణలో అర్ష్దీప్ చికిత్స తీసుకుంటున్నాడు. అయితే, ఈ పంజాబీ బౌలర్ ఇప్పట్లో కోలుకునేలా లేడు. అందుకే నాలుగో టెస్టుకు అతడు దూరమయ్యాడు.ఈ నేపథ్యంలో మెన్స్ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అన్షుల్ కంబోజ్ను జట్టుకు ఎంపిక చేసింది. మాంచెస్టర్ టెస్టు సందర్భంగా అతడు జట్టుతో చేరనున్నాడు. ఇందుకు సంబంధించి బీసీసీఐ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.గాయాల బెడదకాగా శుబ్మన్ గిల్ సారథ్యంలో ఇంగ్లండ్తో ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే మూడు పూర్తికాగా ఆతిథ్య ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఎడ్జ్బాస్టన్లో చారిత్రాత్మ విజయం సాధించిన టీమిండియా.. మాంచెస్టర్లో జరిగే నాలుగో టెస్టు (జూలై 23- 27)నూ గెలిచి సిరీస్ను సమం చేయాలని భావిస్తోంది. అయితే, ఈ వేదికపై ఇంత వరకు ఒక్కసారి కూడా టీమిండియా టెస్టు గెలవకపోవడం.. పైగా ఇలా గాయాల బెడద వేధిస్తుండటం ఆందోళనకరంగా మారింది.ఇదిలా ఉంటే.. లీడ్స్లో ఆడిన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్కు బదులు.. నితీశ్ కుమార్ రెడ్డి రెండో టెస్టు నుంచి జట్టులోకి వచ్చాడు. అయితే, అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. చివరగా లార్డ్స్లో మూడు వికెట్లు తీయడంతో పాటు మొత్తంగా కేవలం 43 పరుగులే చేశాడు.మరోవైపు.. టీమిండియా తరఫున టీ20, వన్డేలలో అదరగొడుతున్న అర్ష్దీప్ ఇంత వరకు టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. ఇక హర్యానాకు చెందిన అన్షుల్ కాంబోజ్ ఇటీవల ఇంగ్లండ్తో భారత్-‘ఎ’ జట్టు తరఫున అనధికారిక సిరీస్ ఆడాడు. నార్తాంప్టన్లో జరిగిన రెండో టెస్టులో నాలుగు వికెట్లు తీసిన అన్షుల్ రెండో ఇన్నింగ్స్లో తొమ్మిదో స్థానంలో వచ్చి అజేయ అర్ధ శతకం (51) సాధించాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 24 మ్యాచ్లు ఆడి 79 వికెట్లు తీయడంతో ఆపటు 486 పరుగులు చేశాడు.ఇంగ్లండ్తో నాలుగో టెస్టుకు భారత జట్టు (అప్డేటెడ్ ):శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్ & వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్.చదవండి: BAN vs PAK: పాకిస్తాన్ను చిత్తు చేసిన బంగ్లాదేశ్

రాజకీయ పోరాటాలతో మీకేం పని?.. ఈడీపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం
జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్పై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పోరాటం ఈడీ పని కాదని.. అది ముమ్మాటికీ అధికార దుర్వినియోగం కిందికి వస్తుందంటూ పేర్కొంది. కర్ణాటక ‘మూడా స్కాం’ కేసుతో పాటు.. లాయర్లకు ఈడీ సమన్లు జారీ చేసిన వ్యవహారాలను విచారించే క్రమంలో సుప్రీం కోర్టు ఈడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీ: మూడా స్కాం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి కర్ణాటక హైకోర్టు కల్పించిన ఉపశమనాన్ని ఈడీ సుప్రీం కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ ఈడీపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు సింగిల్ జడ్జి సమర్థించారని మీకు బాగా తెలుసు. అంటే ఈ కేసులో ఇప్పటికే రెండు స్థాయిల్లో న్యాయ నిర్ణయాలు వచ్చాయి. వాటిని తిరగరాయడానికి ఈడీ ప్రయత్నించడం అనవసరం. ఇది రాజకీయ ప్రమేయంలా అనిపిస్తోంది. రాజకీయాలు పోరాటాలు అనేది ప్రజల మధ్య జరగాలి. మీరు(ఈడీ) దానిని ఎందుకు ఉపయోగిస్తున్నారు? ప్రశ్నించారు. EDను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదు.. అది ప్రజాస్వామ్యానికి హానికరం. ఈ వైరస్ను దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందనివ్వకండి అని సీజేఐ వ్యాఖ్యానించారు.Let political battles be fought among the electorate.. రాజకీయ పోరాటాలు ప్రజల మధ్య జరగాలి. రాజకీయ పార్టీల మధ్య ఉన్న విభేదాలు, ఆరోపణలు, విమర్శలు కోర్టుల ద్వారా కాదు, ఓటర్ల తీర్పు ద్వారా పరిష్కరించాలి. అలాంటిది ED (Enforcement Directorate) వంటి సంస్థలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతున్నాయా?. కోర్టులను రాజకీయ వేదికలుగా ఉపయోగించకండి. ప్రజాస్వామ్యంలో ఓటర్లు మాత్రమే రాజకీయ నాయకుల భవితవ్యాన్ని నిర్ణయించాలి, న్యాయవ్యవస్థ కాదు.దురదృష్టవశాత్తూ.. మహారాష్ట్రలో ఈడీతో నాకు అనుభవం ఉంది. మాతో మీ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసేలా చేసుకోకండి అని చీఫ్ జస్టిస్ గవాయ్ హెచ్చరించారు. ఈ క్రమంలో అదనపు సోలిసిటర జనరల్ ఎస్వీ రాజు తమ పిటిషన్ను వెనక్కి తీసుకుంటామని ధర్మాసనానికి తెలిపారు. అదే సమయంలో.. భవిష్యత్తులో ఈ పిటిషన్ను ఇతర కేసుల్లో ఉదాహరించవద్దంటూ విజ్ఞప్తి చేశారాయన. దీంతో పిటిషన్ను కొట్టేస్తున్నట్లు సీజేఐ ప్రకటించారు. మరో కేసులో.. క్లయింట్లకు సలహాలు ఇస్తున్నారనే అభియోగాల కింద.. ఈడీ సీనియర్ అడ్వొకేట్లకు కొందరు సమన్లు జారీ చేసింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు .. ఇవాళ విచారణ చేపట్టింది. సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్ తోపాటు మరికొన్ని లీగల్ బాడీస్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో.. చైనా, టర్కీలలో బార్ అసోషియేషన్లు రద్దైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆందోళన వ్యక్తం చేశాయి. అదే సమయంలో మార్గదర్శకాలు జారీ చేయాలని కోరాయి. దీంతో.. న్యాయపరమైన సలహాలు ఇవ్వడం తప్పెలా అవుతుంది? అని ఈడీ తీరును సుప్రీం కోర్టు తప్పుబట్టింది. అయితే గుజరాత్లో ఓ హత్య కేసులో నిందితుడికి న్యాయవాది సలహా ఇవ్వడాన్ని ఈడీ ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ వ్యవహారంలో ఈడీని నెగెటివ్గా చూపించే ప్రయత్నం జరుగుతోందంటూ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అయితే అది వేరే సందర్భమన్న సీజేఐ బెంచ్.. న్యాయవాదిని సమన్లు ఇవ్వాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలనే విషఁఆన్ని గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో మార్గదర్శకాల రూపకల్పనకు అమీకస్ క్యూరీని నియమిస్తామంటూ వచ్చేవారానికి విచారణ వాయిదా వేసింది.మూడా (MUDA) కేసు నేపథ్యంకర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య B.M. పర్వతికి సంబంధించి మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) ద్వారా భూ కేటాయింపులపై అక్రమతల ఆరోపణలతో ప్రారంభమైంది. సుమారు 3.16 ఎకరాల భూమి పర్వతి పేరుతో ఉంది, ఇది MUDA ద్వారా డెనోటిఫై చేయబడిన తర్వాత రెసిడెన్షియల్ లేఅవుట్గా అభివృద్ధి చేయబడింది. MUDA ఈ భూమిని ఉపయోగించినందుకు పర్వతి 14 ప్లాట్లు (ప్రతి ఒక్కటి ₹2 కోట్ల విలువ) విజయనగర ప్రాంతంలో పొందారు. అయితే.. బీజేపీ, JD(S) వంటి ప్రతిపక్షాలు దీన్ని ₹4,000 కోట్ల స్కాంగా అభివర్ణించాయి. మూడా (MUDA) కేసు కోర్టు విచారణ టైం లైన్కర్ణాటక గవర్నర్ తావార్చంద్ గెహ్లాట్ 2024 ఆగస్టు 17న MUDA కేసులో ED విచారణకు అనుమతి ఇచ్చారు. తద్వారా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లైంది. ED తన Enforcement Case Information Report (ECIR) నమోదు చేసి, పర్వతి (CM భార్య) సహా ఇతరులపై ప్రీలిమినరీ విచారణ ప్రారంభించింది. ఆగస్టు 19, 2024👉 సీఎం సిద్ధరామయ్య గవర్నర్ ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.👉 ED విచారణకు అనుమతి ఇచ్చిన గవర్నర్ ఆదేశాన్ని రద్దు చేయాలని కోరారు.ఆగస్టు 29, 2024👉 హైకోర్టు ప్రత్యేక కోర్టును MUDA కేసులో తాత్కాలికంగా ఆదేశాలు ఇవ్వకుండా ఉండమని సూచించింది.👉 విచారణ తదుపరి తేదీకి వాయిదా వేసింది. సెప్టెంబర్ 12, 2024👉 హైకోర్టు విచారణ పూర్తిచేసి తీర్పును రిజర్వ్ చేసింది.👉 న్యాయమూర్తి M. నాగప్రసన్న రెండు పక్షాల వాదనలు ఆఖరి రోజులోనే ముగించాలని స్పష్టం చేశారు.సెప్టెంబర్ 24, 2024👉 కర్ణాటక హైకోర్టు సీఎం సిద్ధరామయ్య పిటిషన్ను తిరస్కరించింది.👉 గవర్నర్ అనుమతి చట్టబద్ధమైనదే అని తీర్పు ఇచ్చింది.2025 మార్చి 7కర్ణాటక హైకోర్టు సిద్ధరామయ్య సతీమణి B.M. పార్వతికి ఉపశమనంMUDA భూ కేటాయింపు కేసులో, ED జారీ చేసిన సమన్లను హైకోర్టు రద్దు చేసింది. న్యాయమూర్తి M. నాగప్రసన్న ఈ తీర్పును ఇచ్చారు, పార్వతి, మంత్రి బైరతి సురేష్ దాఖలు చేసిన పిటిషన్లను విచారించి, ED చర్యలు చట్టపరంగా నిలబడవని తేల్చారు. Money Laundering Act (PMLA) ప్రకారం, “proceeds of crime” అనే అంశం స్పష్టంగా లేకపోతే, ED విచారణ కొనసాగించలేదని కోర్టు అభిప్రాయపడింది. పార్వతి 14 ప్లాట్లు స్వచ్ఛందంగా తిరిగి అప్పగించడంతో, ఆర్థిక లాభం పొందలేదని కోర్టు గుర్తించింది. సమన్లు జారీ చేయడం చట్టబద్ధంగా కాదని తీర్పు ఇచ్చారు.జూలై 21, 2025👉 సుప్రీం కోర్టు ఈ కేసులో ED అప్పీల్ను తిరస్కరించింది.👉 “రాజకీయ పోరాటాలు ప్రజల మధ్య జరగాలి, కోర్టుల్లో కాదు” అని CJI BR గవాయ్ వ్యాఖ్యానించారు.

కలియుగ సుమతీ..150 కిలోమీటర్లు భర్తను వీపుపై మోసుకెళ్లి..!
పౌరాణిక గాథల్లో సుమతీ అనే పతివ్రత కథ గురించి విన్నాం. పరమ కోపిష్టి అయిన భర్త కౌశికుడుని ఓపికతో వ్యవహరించి తన కాపురాన్ని చక్కదిద్దుకుంటుంది. ఆమె కథ దుర్మార్గుణ్ణి ఓపికతో పరివర్తన చెందేలా చేయడం గురించి వివరిస్తుంది. ఇక్కడ ఈ ఇల్లాలి భర్త అంత దుర్మార్గుడు కాదు. కానీ కుష్ఠు రోగంతో బాధపడుతున భర్తకు సుమతీ చేసిన సపర్యలను తలపించేలా తన భర్తకు చేస్తుందామె. ఆమెను చూస్తే ఈ కాలంలో ఇలాంటి భార్యలు ఉన్నారా అని ఆశ్చర్యకలుగుతుంది. ఇంతకీ ఆ మహాసాధ్వి కథేంటంటే..ఘజియాబాద్లోని మోడీనగర్లోని బఖర్వా నివాసితులు ఆశా, సచిన్ దంపతులు. శ్రావణ మాసంలో ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కన్వర్ యాత్రను చేస్తుంటారు. ఇది శ్రావణ మాసంలో (జూలై-ఆగస్టు) జరుగుతుంది. ఈ సమయాన్ని శివుని ఆరాధనకు అత్యంత విశిష్టమైన కాలంగా భావిస్తారు. శివ భక్తుల తీర్థయాత్రనే కన్వర్ యాత్ర అంటారు. ఈ యాత్రలో భాగంగా భక్తులు హరిద్వార్, గంగోత్రి, రిషికేష్ వంటి ప్రాంతాల నుంచి గంగాజలాన్ని కావడిలో (కన్వర్) నింపుకుని తమ ప్రాంతాల్లోని శివాలయాలకు కాలినడకన తీసుకెళ్తారు. ఈ గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేస్తారు. ఇక్కడ కన్వర్ అనేది వెదురు కర్ర, దానికి రెండు వైపులా నీటి కుండలు వేలాడేలా కట్టి భుజాలపై మోస్తారు కాబట్టి దీన్ని కన్వర్ యాత్ర అంటారు. ఇక్కడ ఆశా భర్త సచిన్ గత 13 ఏళ్లుగా కాలినడకనఈ యాత్ర చేస్తున్నాడు. అయితే గతేడాది వెన్నుకి గాయం కావడంతో పక్షవాతానికి గురయ్యాడు. దాంతో ఈ ఏడాది ఆ యాత్ర చేసే అవకాశం లేకుండాపోయింది. అయితే అతడి భార్య..అతడి నియమానికి ఆటంకం కలగకుండా అతడిని వీపుపై మోసుకుంటూ కన్వర్యాత్ర చేయ తలపెట్టింది. కూడా ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఆశా ఏకంగా 150 కిలోమీటర్లు భర్తను వీపుపై మోసుకుంటూ కాలినడకన యాత్ర పూర్తిచేసింది. ఆమె అపారమైన భక్తి, భర్తపై ఉన్న అచంచలమైన ప్రేమ చుట్టూ ఉన్న యాత్రికులను కూడా మంత్రముగ్దుల్ని చేశాయి. నిజంగా ఆ మహాతల్లి సాహసం స్ఫూర్తిని కలిగించడమే గాక ఎందరినో కదలిచింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా స్వర్గంలో ముడివేసిన గొప్ప బంధం అంటే ఈ జంట కాబోలు అంటూ ఆ మహాతల్లి ఆశపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.(చదవండి: 58 ఏళ్ల నాటి తాతగారి బెంజ్కారు..! ఇప్పటికీ..)

CBN: హద్దుల్లేని స్వోత్కర్ష ఎంత కాలం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్లు పెట్టుబడులకు సంబంధించి చేసే ప్రకటనలు గమ్మత్తుగా ఉంటాయి. ఎప్పుడు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతారో.. ఎవరూ ఊహించ లేరు. తాజాగా చంద్రబాబు ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఏకంగా రూ.పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించిందని అన్నారు. దాంతోపాటే ఎనిమిదిన్నర లక్షల ఉద్యోగావకాశాలు వస్తాయని అని కూడా వక్కాణించారు. రానున్న నాలుగేళ్లలో ఇంకో రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు సాధిస్తామని కూడా చెప్పారు. నిజమైతే సంతోషపడవచ్చు కానీ.. రాష్ట్రంలో పరిస్థితులు అలా లేవు. ఇండోసోల్ వ్యవహారమే పైన చెప్పుకున్నదానికి ఒక ఉదాహరణ. ఈ కంపెనీ సౌర విద్యుత్తు పరిశ్రమ కోసం రూ.70 వేల కోట్ల పెట్టుబడులు సిద్ధం చేసుకుంది. ఇప్పటికే వందల కోట్ల రూపాయల వ్యయం కూడా చేసింది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం తీరు పుణ్యమా అని ఇప్పుడు ఆ కంపెనీ భవిష్యత్తు గందరగోళంలో పడిపోయింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ కంపెనీ కూడా సాహసిస్తుందా?. ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ టాటా గ్రూపు సంస్థల ఛైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలోని బృందం తయారు చేసిన టాస్క్ఫోర్స్ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఏడాదిలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చెప్పారు. అయితే ఇది ఆ సమావేశంలో పాల్గొన్న వారికి కూడా ఆశ్చర్యం కలిగించి ఉంటుంది. చంద్రశేఖరన్ వంటి బిజీ పారిశ్రామికవేత్త ఒక రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక తయారు చేసేంత తీరిక ఉంటుందా? అన్నది ప్రశ్న. నివేదికకు కాస్త మర్యాద దక్కుతుందని ఆయన పేరు జోడించారేమో తెలియదు! అయినా ఫర్వాలేదు కానీ ఆ నివేదికను పరిశీలించినా, చంద్రబాబు మాటలు చూసినా నేల విడిచి సాము చేసే తీరులోనే ఉన్నట్టు అనిపించక మానదు. 2014-19 మధ్యకాలంలోనూ చంద్రబాబు ఇలాంటి సమావేశాలు బోలెడు పెట్టారు. అదిగో పెట్టుబుడులు.. ఇదిగో అభివృద్ధి అని డాబుసరి కబుర్లు చెప్పేవారు. 2029 నాటికి ఏపీ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రం అవుతుందని, ఆ తర్వాత ప్రపంచంలోనే టాప్-5లో ఉంటుందని ఏవేవో చెప్పేవారు. అంతేకాదు.ఆయా జిల్లాలలో ఏఏ రంగాలను అభివృద్ది చేస్తారో, ఏ ప్రాజెక్టులు వస్తాయో చెబుతూ అసెంబ్లీలో పెద్ద స్పీచ్ ఇచ్చారు కూడా. అప్పట్లో వైసీపీలో ఉండి.. ఇప్పుడు టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చంద్రబాబు ప్రకటనలు రియల్ ఎస్టేట్ బ్రోచర్తో పోల్చారు కూడా. చివరకు అయ్యింది కూడా అదే. చంద్రబాబు హామీలేవీ అమలు కాలేదు.2024లో అధికారం దక్కిన తరువాత మరోమారు చంద్రబాబు తన పాత స్టైల్ను భుజాలకు ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది తాజా ప్రకటన చూస్తే. గత ఏడాది దావోస్ పర్యటనకు ముందు కూడా నానా ఆర్భాటమూ జరిగింది. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేస్తాయని టీడీపీ మీడియా ఊదరగొట్టింది. తీరా చూస్తే వచ్చింది హళ్లికి హళ్లి! దీని కవరింగ్ కోసం ‘‘ఏపీ గుడ్విల్ పెంచేందుకు వెళ్లాము తప్ప పెట్టుబడుల కోసం కాదు’’ అన్న బుకాయింపులు! దావోస్ పర్యటన వైఫల్యంతో చంద్రబాబు తన రూటు మార్చారు. కొంతకాలం తరువాత రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయి అని ప్రకటించారు. ఆ తరువాత ఈ అంకెలు ఐదు లక్షల కోట్లకు, మరికొన్ని నెలలకు ఎనిమిది లక్షల కోట్లకు చేరుకున్నాయి. మంత్రి లోకేశ్ ఈ విషయాన్ని శాసనమండలిలోనూ ప్రకటించారు. లక్షల ఉద్యోగాలు వచ్చేశాయన్న చందంగా జవాబు ఇవ్వడం వివాదాస్పదమైంది కూడా. ఇప్పుడు తాజాగా చంద్రబాబు పాట రూ.పది లక్షల కోట్లకు చేరుకుంది!. పారిశ్రామిక దిగ్గజాలుగా పేరొందిన మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలకే మూడు, నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం కష్టంగా ఉంటే, ఆ స్థాయిలో పారిశ్రామికీకరణ జరగని ఏపీకి ఏడాదిలోనే రూ.పది లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయని సీఎం చెబితే వెరైనా నమ్ముతారా? సీఐఐ సదస్సుల్లో పాల్గొనే పారిశ్రామికవేత్తలకు ఈ విషయాలు తెలియవా? కనీసం వచ్చిన పెట్టుబడులు ఏ ఏ రంగాలకు చెందినవి, ఏ కంపెనీలు పెడుతున్నాయని చెప్పి ఉంటే కొంతైనా నమ్మకం కలిగేదేమో! అదేమీ చేయరు. తోచిన గణాంకాలు చెప్పడం తప్ప వాటికి ఆధారాలు చూపే అలవాటు లేదు. గతంలో జగన్ ప్రభుత్వం అప్పులు చేస్తోందంటూ నోటికి వచ్చిన అంకెను చెబుతుండే వారు. చివరకు ఈ అప్పుల అంకె రూ.14 లక్షల కోట్లకు చేరుకుంది కూడా. కానీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి స్వయంగా అప్పులు రూ.ఆరు లక్షల కోట్లేనని ఒప్పుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు వ్యవహార శైలి ఇలా ఉంటుంది!. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఆకర్శించాలన్న చిత్తశుద్ధి ఉంటే.. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రామాయపట్నం వద్ద ఇండోసోల్ రూ.40 వేల కోట్లతో ప్రతిపాదించిన సౌరశక్తి పరిశ్రమకు కొత్త చిక్కులు తెచ్చే వారా! ఆ కంపెనీ ఇప్పటికే రూ.1200 కోట్ల వరకూ వ్యయం చేసింది. పంటలు పెద్దగా పండని భూములు ఐదువేల ఎకరాలను ఈ కంపెనీ రూ.500 కోట్లతో సేకరిస్తే... ప్రభుత్వం ఇప్పుడు వాటిని వెనక్కు తీసుకోవాలని ప్రయత్నించడం ఎంతవరకూ సబబు? భూములివ్వమని భీష్మించుకున్న కరెడు ప్రాంతంలో భూ సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం ఆ కంపెనీ భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టేయడమే అవుతుంది. పైగా ఇండోసోల్ సేకరించిన భూమిని వస్తుందో, రాదో తెలియని బీపీసీఎల్కు ఇస్తారట. దీనికి వేరేచోట భూమి కేటాయిస్తే నష్టమేమిటి? ఈ విషయాలు.. దాని వెనుక మతలబులు పారిశ్రామిక వర్గాలకు తెలియకుండా ఉంటాయా?.. రానున్న పాతికేళ్లలో 2.4 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యమని కూడా చంద్రబాబు ఆ సమావేశంలో ప్రకటించారు. ఇది కూడా గతంలో చంద్రబాబు చెప్పిన ‘విజన్-2020’ బాపతు వ్యవహారమే. ఒక్కసారి ఆ డాక్యుమెంట్ తరచి చూస్తే బాబుగారి డొల్లతనం ఏమిటో బయటపడుతుంది. పాతికేళ్ల క్రితం కుటుంబానికో ఐటి ఫ్రొఫెషనల్ నినాదంతో పని చేశామని చంద్రబాబు చెప్పడం ఇంకో విడ్డూరం. బెంగళూరు, చెన్నై, పూణె వంటి నగరాలు ఐటీకి పెట్టింది పేరుగా ఉన్న ఆ సమయంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డి ఆంధ్రప్రదేశ్లోనూ ఐటీ రంగం పురోగమించాలన్న లక్ష్యంతో హైటెక్ సిటీకి శంకుస్థాపన కూడా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తరువాత సీఎం పీఠమెక్కిన చంద్రబాబు భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. అంతే. కానీ.. హైదరాబాద్లో ఐటీ రంగాన్ని తానే మొదలుపెట్టానని, హైటెక్ సిటీ మొత్తం తన సృష్టి అని మాట్లాడటం అతిశయోక్తి తప్ప ఇంకోటి కాదు. 2004- 2009 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్రోడ్డు వంటి అద్భుత మౌలిక సదుపాయాలను కల్పించారు. దీంతో నగరం రూపురేఖలు మరింత మారిపోయాయి. కానీ కాంగ్రెస్ పార్టీ దానిని సరిగా ప్రచారం చేసుకోలేకపోయింది.2004లో ఓటమి పాలైన తర్వాత చంద్రబాబుకు హైదరాబాద్తో అధికారికంగా సంబంధం లేనట్లే. కానీ.. రెండు దశాబ్దాల తర్వాత కూడా హైదరాబాద్ తనే అభివృద్ది చేశానని చెప్పుకుంటూటారు ఆయన! విభజన తరువాత 2014లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యారు. ఐటీలో హైదరాబాద్ను తానే వృద్ధి చేశానని చెప్పిన మాటలే నిజమైతే 2014- 19 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్కు ఆ స్థాయిలో ఎందుకు ఐటీ పరిశ్రమలను తేలేకపోయారన్నది ప్రశ్న. విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాలను ఎందుకు అభివృద్ది చేయలేకపోయారు? స్వోత్కర్ష చంద్రబాబుకు బాగా వచ్చు. మిగిలిన వారు సెల్ఫ్ డబ్బా అని విమర్శించినా పట్టించుకోరు. ఇతర రాష్ట్రాల నుంచో, ఇతర దేశాల నుంచో ఎవరో ఒకరిని తీసుకు వస్తారు. మర్యాద కోసం వారు ఆయనను ఉద్దేశించి ఒక మాట పొగిడితే, దానిని తెలుగుదేశం మీడియాతో హోరెత్తేలా ప్రచారం చేయించుకోగలరు. ఇప్పుడు పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పడం కూడా అలాంటి వ్యూహంలో ఒక భాగమే!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

హైదరాబాద్లో ఇష్టారాజ్యంగా ఆటో, క్యాబ్ చార్జీల పెంపు!
సాక్షి, హైదరాబాద్: తిరుమలగిరి ఆర్టీసీ కాలనీకి చెందిన శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం తార్నాక నుంచి ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ను ఆశ్రయించాడు. సాధారణంగా అయితే క్షణాల్లో బుక్ అయిపోయే క్యాబ్లకు అనూహ్యంగా డిమాండ్ నెలకొంది. చివరకు పావుగంట తర్వాత ఓ అగ్రిగేటర్ సంస్థకు చెందిన క్యాబ్ బుక్ అయింది. ఆన్లైన్ యాప్లో కనిపించిన చార్జీలు చూసి అతడు బెంబేలెత్తాడు. సాధారణంగా తార్నాక నుంచి తిరుమలగిరికి రూ.250 లోపే ఉంటుంది. కానీ ఆదివారం సాయంత్రం ఏకంగా రూ.530 వరకు పెరిగింది. మరో గత్యంతరం లేక ఎక్కువ చార్జీలు చెల్లించేందుకు సిద్ధపడి క్యాబ్ ఎక్కేశాడు. ఇది కేవలం శ్రీనివాస్కు ఎదురైన సమస్య మాత్రమే కాదు, నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు క్యాబ్ అగ్రిగేటర్లకు కాసులు కురిపిస్తున్నాయి. ఆటోలు, క్యాబ్ల నిర్వహణలో స్లాక్ (రద్దీ లేని), పీక్ (రద్దీ ఉన్న) సమయాలుగా ఎలాంటి విభజన లేకపోయినప్పటికీ అడ్డగోలుగా చార్జీలు పెంచి ప్రయాణికుల జేబులు గుల్ల చేయడం గమనార్హం. ఆన్లైన్లోనే బేరసారాలు.. కొన్ని అగ్రిగేటర్ సంస్థలు ఆన్లైన్లోనే బేరసారాలకు దిగుతున్నాయి. ఉప్పల్కు చెందిన ఓ ప్రయాణికుడు సికింద్రాబాద్ వరకు వెళ్లేందుకు ఒక ఆటోను బుక్ చేసుకున్నాడు. మొదట రూ.150 వరకు చార్జీలు కనిపించాయి. సరేననుకొని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. కానీ.. ఎంపిక చేసుకున్న చార్జీలకు ఆటోడ్రైవర్ సుముఖంగా లేడంటూ ఐదు నిమిషాల తర్వాత మొబైల్ స్క్రీన్పై కనిపించింది. అంతే కాదు. అదనపు చార్జీలు చెల్లిస్తే ఆటో లభించవచ్చని సంకేతం, దాంతో మరో రూ.20 అదనంగా చెల్లించేందుకు సిద్ధమయ్యాడు. అయినా ఆటో రాలేదు. అలా చివరకు రూ.50 ఎక్కువ చెల్లించేందుకు అంగీకరించిన తర్వాత క్షణాల్లో ఆటో వచి్చంది. దీంతో సదరు ప్రయాణికుడు బిత్తరపోయాడు. ఇలా కొన్ని ఆటో, క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలు ఆన్లైన్లోనే బేరసారాలకు దిగుతున్నాయి. మొదట తక్కువ చార్జీలను ప్రదర్శించి ఆ తర్వాత ప్రయాణికుడి అత్యవసరాన్ని సొమ్ము చేసుకొనేందుకు బేరసారాలకు దిగుతున్నాయి. కొన్ని అగ్రిగేటర్ సంస్థలకు చెందిన యాప్లలో ఈ ఆప్షన్ కొత్తగా కనిపించడం గమనార్హం. మరోవైపు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు మాత్రం పలు సంస్థలకు చెందిన క్యాబ్లు పట్టపగలు చుక్కలు చూపిస్తున్నాయి. క్యాబ్ బుక్ అయిన తర్వాత ఆకస్మికంగా రద్దవుతున్నాయి. ఎంపిక చేసుకున్న క్యాబ్ కోసం చాలా సేపటి వరకు పడిగాపులు కాసి చివరకు ప్రయాణికులే తమకు తాముగా రద్దు చేసుకొనేవిధంగా కొందరు డ్రైవర్లు వ్యవహరిస్తున్నారు. మెట్రోల్లో పెరిగిన రద్దీ.. నగరంలోని వివిధ మార్గాల్లో ఆదివారం మెట్రో రైళ్లలోనూ రద్దీ కనిపించింది. బోనాల సందర్భంగా ప్రయాణికులు వివిధ ప్రాంతాల మధ్య ఎక్కువగా రాకపోకలు సాగించారు. దీంతో నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్ కారిడార్లలో సాయంత్రం పలు మెట్రో స్టేషన్లలో సందడి నెలకొంది, సాధారణంగా సెలవు రోజుల్లో రద్దీ తగ్గుముఖం పడుతుంది. కానీ ఆదివారం బోనాల వేడుకలు, వర్షం కారణంగా ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయించారు.
అనధికార ఆస్తులకు బీ-ఖాతాలు జారీ
చిరుజల్లుల్లో బికేర్ఫుల్..ఆ ఆహారాలను తీసుకోకపోవడమే మేలు..!
Bangladesh: స్కూల్ భవనంపై కూలిన విమానం
‘డ్రాప్ చేసి ఇంటికి వచ్చేలోపు దుబాయ్ వెళ్లింది’
ఇండియా కూటమికి ఆప్ గుడ్ బై
దేనికైనా రెడీ.. ఎన్ని కేసులైనా పెట్టుకోండి: అంబటి, రజిని
రంగంలోకి ఆర్ఎస్ సంధు!
జేసీ ప్రభాకర్ తిట్లు .. వినిపించవా పవన్?
రైలు కింద పడేందుకు ట్రై చేసిన హీరోయిన్.. కాపాడిందెవరంటే?
భర్త బర్త్ డే విషెస్ చెప్పలేదని టీచర్..!!
రామ్చరణ్ సాయం..? ఒక్క రూపాయి రాకుండా చేశారు: ఫిష్ వెంకట్ కూతురు
ఎలుక... ఎంత పని చేసింది!
'జూనియర్' కలెక్షన్.. మొదటిరోజు అన్ని కోట్లా?
పైలట్ ‘మాస్ మర్డర్-సూసైడ్’
మీ బండిపై చలాన్ ఉంది.. కట్టేయండి!
అనుకున్నదే జరిగింది.. కరుణ్ నాయర్ గుడ్బై
కుటుంబ సభ్యుల మోసం.. నాన్న కొత్త ప్రయాణం: అనసూయ
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. శుభవార్తలు వింటారు
ఇద్దరితో సహజీవనం.. అతడితో పెళ్లి.. భార్యకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి..
ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో నూతనోత్సాహం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మియాపూర్: స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థి మృతి
మూడు వారాలకే ఓటీటీలోకి తెలుగు సినిమా
ఇంట్లోనే ఉపాసన బర్త్ డే సెలబ్రేషన్స్.. చరణ్ పోస్ట్
స్వామీ! మీరే కాపాడాలి.. ఎక్కడ మద్యం కేసులయినా మమ్మల్నే అందులోకి లాగుతున్నారు!
అనంతపురంలో విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన దోశ
కాంగ్రెస్కు శశిథరూర్లాగా మనకూ ఈయన అలాగే ఉన్నాడనిపిస్తుంది సార్!
మీరు మమ్మల్ని రష్యా మీదికి ఉసిగొల్పారా? లేక రష్యాను మా మీదికి ఉసిగొల్పారా అని ఉక్రెయిన్ అంటోంది సార్!
ODI WC 2011: యువీని సెలక్ట్ చేయడం అవసరమా?
'భళ్లాలదేవ'గా నేనే చేయాలి.. కానీ అలా జరిగేసరికి: జయసుధ కొడుకు
అనధికార ఆస్తులకు బీ-ఖాతాలు జారీ
చిరుజల్లుల్లో బికేర్ఫుల్..ఆ ఆహారాలను తీసుకోకపోవడమే మేలు..!
Bangladesh: స్కూల్ భవనంపై కూలిన విమానం
‘డ్రాప్ చేసి ఇంటికి వచ్చేలోపు దుబాయ్ వెళ్లింది’
ఇండియా కూటమికి ఆప్ గుడ్ బై
దేనికైనా రెడీ.. ఎన్ని కేసులైనా పెట్టుకోండి: అంబటి, రజిని
రంగంలోకి ఆర్ఎస్ సంధు!
జేసీ ప్రభాకర్ తిట్లు .. వినిపించవా పవన్?
రైలు కింద పడేందుకు ట్రై చేసిన హీరోయిన్.. కాపాడిందెవరంటే?
భర్త బర్త్ డే విషెస్ చెప్పలేదని టీచర్..!!
రామ్చరణ్ సాయం..? ఒక్క రూపాయి రాకుండా చేశారు: ఫిష్ వెంకట్ కూతురు
ఎలుక... ఎంత పని చేసింది!
'జూనియర్' కలెక్షన్.. మొదటిరోజు అన్ని కోట్లా?
పైలట్ ‘మాస్ మర్డర్-సూసైడ్’
మీ బండిపై చలాన్ ఉంది.. కట్టేయండి!
అనుకున్నదే జరిగింది.. కరుణ్ నాయర్ గుడ్బై
కుటుంబ సభ్యుల మోసం.. నాన్న కొత్త ప్రయాణం: అనసూయ
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. శుభవార్తలు వింటారు
ఇద్దరితో సహజీవనం.. అతడితో పెళ్లి.. భార్యకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో నూతనోత్సాహం
మియాపూర్: స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థి మృతి
ఇంట్లోనే ఉపాసన బర్త్ డే సెలబ్రేషన్స్.. చరణ్ పోస్ట్
మూడు వారాలకే ఓటీటీలోకి తెలుగు సినిమా
స్వామీ! మీరే కాపాడాలి.. ఎక్కడ మద్యం కేసులయినా మమ్మల్నే అందులోకి లాగుతున్నారు!
అనంతపురంలో విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన దోశ
కాంగ్రెస్కు శశిథరూర్లాగా మనకూ ఈయన అలాగే ఉన్నాడనిపిస్తుంది సార్!
మీరు మమ్మల్ని రష్యా మీదికి ఉసిగొల్పారా? లేక రష్యాను మా మీదికి ఉసిగొల్పారా అని ఉక్రెయిన్ అంటోంది సార్!
ODI WC 2011: యువీని సెలక్ట్ చేయడం అవసరమా?
'భళ్లాలదేవ'గా నేనే చేయాలి.. కానీ అలా జరిగేసరికి: జయసుధ కొడుకు
సినిమా

చరణ్ 'పెద్ది'.. ఈ రేంజులో మారిపోయాడేంటి?
'ఆర్ఆర్ఆర్'తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్.. తర్వాత సినిమా 'గేమ్ ఛేంజర్'తో అందరినీ పూర్తిగా నిరాశపరిచాడని చెప్పొచ్చు. అయితేనేం 'పెద్ది' మూవీతో అదిరిపోయే రేంజులో అదరగొట్టేయబోతున్నాడని తెలుస్తోంది. ఎందుకంటే ఇదివరకే వచ్చిన గ్లింప్స్ ఎంత రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయేలా మరో అప్డేట్ వచ్చేసింది.త్వరలో 'పెద్ది' కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలుకాబోతుంది. ఇందుకోసం జిమ్లో చరణ్ చెమటలు చిందిస్తున్నాడు. మొత్తంగా హ్యాండ్స్, బైసెప్స్ లాంటివి కాస్త గట్టిగానే పెంచుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోని తాజాగా సోషల్ మీడియాలో చరణే పోస్ట్ చేశాడు. ఇది చూసిన అభిమానులు.. ఈసారి గట్టిగా కొట్టబోతున్నాం అని ఫిక్సయిపోతున్నారు.(ఇదీ చదవండి: ఇంట్లోనే ఉపాసన బర్త్ డే సెలబ్రేషన్స్.. చరణ్ పోస్ట్)బుచ్చిబాబు తీస్తున్న 'పెద్ది' చిత్రాన్ని రూరల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. ఇందులో చరణ్.. క్రికెట్, కబడ్డీ ఆటగాడి పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు కనిపిస్తున్న బాడీ.. యాక్షన్ సన్నివేశాల కోసమనిపిస్తోంది. ఈ రేంజు బాడీతో ఫైట్ సీన్స్ అంటే విలన్స్ గాల్లోకి లేస్తారేమో?'పెద్ది' సినిమా వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రానుంది. ఇకపోతే ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. 'మీర్జాపుర్' ఫేమ్ దివ్యేందు, కన్నడ సూపర్స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. రోజురోజుకి హైప్ పెంచుతున్న ఈ మూవీ నుంచి ముందు ముందు ఇంకెన్ని సర్ప్రైజులు వస్తాయో చూడాలి.(ఇదీ చదవండి: సేనాని రూల్స్ మాట్లాడతారు.. పాటించరు) View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan)

కోట కుటుంబాన్ని పరామర్శించిన మోహన్బాబు
టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు(83).. వారం క్రితం చనిపోయారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన కన్నుమూయడంతో తెలుగు సినీప్రముఖులు చాలామంది తమ సంతాపాన్ని తెలియజేశారు. అయితే ఆ రోజు ఊరిలో లేకపోవడంతో ఇప్పుడు వచ్చి కోట కుటుంబాన్ని ప్రముఖ నటుడు మోహన్ బాబు పరామర్శించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు)'కోట శ్రీనివాసరావు నాకు అత్యంత ఆప్తుడు. ఆయన అకాల మరణం రోజు నేను హైదరాబాద్లో లేను. కోట మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. 1987లో వీరప్రతాప్ సినిమాలో మాంత్రికుడుగా అవకాశం ఇచ్చారు. మా బ్యానర్తో పాటు బయట బ్యానర్లోనూ ఆయనతో చాలా సినిమాలు చేశా. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగిన నటుడు. ఏ డైలాగ్ అయినా విలన్గా కమెడియన్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యులేషన్లో చెప్పగలిగే నటుడు కోట. మా ఫ్యామిలీకి ఆయన అత్యంత సన్నిహితులు. ఆయన మరణం నా కుటుంబానికే కాదు, సినిమా పరిశ్రమకే తీరని లోటు. వారి ఆత్మకు శాంతి, వారి కుటుంబానికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాను' అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: జర్నీ మొదలైంది.. 'వరల్డ్ ఆఫ్ కాంతార' వీడియో రిలీజ్)

జర్నీ మొదలైంది.. 'వరల్డ్ ఆఫ్ కాంతార' వీడియో రిలీజ్
2022లో వచ్చిన కన్నడ సినిమా 'కాంతార'.. దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది. దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఈ మూవీ ప్రీక్వెల్ తీయాలని నిర్ణయించారు. అలా దాదాపు మూడేళ్ల నుంచి షూటింగ్ సాగుతూనే ఉంది. ఇప్పుడు అది ఎట్టకేలకు పూర్తయింది. ఈ క్రమంలోనే కొత్త అప్డేట్ వచ్చేసింది. 'వరల్డ్ ఆఫ్ కాంతార' పేరిట ఓ మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు)'కాంతార-1' మూవీ ఎలా ఉండబోతుంది? సెట్స్ ఎలా ఉండబోతున్నాయనేది ఈ వీడియోలో చూచాయిగా చూపించారు. తొలి భాగంతో పోలిస్తే ఈసారి సెట్స్, గ్రాండియర్ కాస్త ఎక్కువగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నా ఉరు, అక్కడి సంప్రదాయాలని చూపించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాని తీశానని, దీనికోసం మూడేళ్లపాటు కష్టపడ్డామని దాదాపు 250 రోజుల పాటు షూటింగ్ జరిపామని హీరో కమ్ డైరెక్టర్ రిషభ్ శెట్టి చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబరు 2న మూవీ థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: ఇంట్లోనే ఉపాసన బర్త్ డే సెలబ్రేషన్స్.. చరణ్ పోస్ట్)

ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు
మరోవారం వచ్చేసింది. ఈ వీకెండ్ థియేటర్లలోకి 'హరిహర వీరమల్లు'తో పాటు 'మహావతార నరసింహా', 'ద ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్', 'సార్ మేడమ్' తదితర డబ్బింగ్ చిత్రాలు కూడా వస్తున్నాయి. వీటిలో పవన్ సినిమాపై చాలా తక్కువ హైప్ అయితే ఉంది. మిగతా వాటి గురించి జనాలకు పెద్దగా తెలియదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 25కి పైగా కొత్త మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: 'డీఎన్ఏ' మూవీ రివ్యూ.. మెప్పించేలా థ్రిల్లర్ క్రైమ్ స్టోరీ)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే 'షో టైమ్' (స్ట్రెయిట్ తెలుగు సినిమా), రోంత్ (డబ్బింగ్ మూవీ) మండల మర్డర్స్(హిందీ సిరీస్), ఎక్స్ & వై(కన్నడ చిత్రం) ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీకెండ్ వచ్చేసరికి ఏవైనా కొత్త చిత్రాలు సడన్ సర్ప్రైజ్ ఇస్తాయేమో చూడాలి? ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందనేది ఇప్పుడు చూద్దాం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 21 నుంచి 27 వరకు)హాట్స్టార్ద సొసైటీ (హిందీ రియాలిటీ షో) - జూలై 21రోంత్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 22వాషింగ్టన్ బ్లాక్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 23షర్జమీన్ (హిందీ మూవీ) - జూలై 25అమెజాన్ ప్రైమ్జస్టిస్ ఆన్ ట్రయల్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 21టిన్ సోల్జర్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 23హ్యాండ్సమ్ గాయ్స్ (కొరియన్ సినిమా) - జూలై 24నోవాక్సిన్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 25రంగీన్ (హిందీ సిరీస్) - జూలై 25సన్ నెక్స్ట్షో టైమ్ (తెలుగు మూవీ) - జూలై 25ఎక్స్ & వై (కన్నడ చిత్రం) - జూలై 25నెట్ఫ్లిక్స్ద హంటింగ్ వైవ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 21ట్రైన్ రెక్: పీఐ మామ్స్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 22క్రిటికల్: బిట్విన్ లైఫ్ అండ్ డెత్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 23లెటర్స్ ఫ్రమ్ ద పాస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 23ఏ నార్మల్ ఉమన్ (ఇండోనేసియన్ సినిమా) - జూలై 24హిట్ మేకర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 24మై మెలోడీ & కురోమి (జపనీస్ సిరీస్) - జూలై 24మండల మర్డర్స్ (హిందీ సిరీస్) - జూలై 25ట్రిగ్గర్ (కొరియన్ సిరీస్) - జూలై 25జీ5సౌంకన్ సౌంకనీ 2 (పంజాబీ సినిమా) - జూలై 25లయన్స్ గేట్ ప్లేజానీ ఇంగ్లీష్ స్టైక్స్ ఎగైన్(ఇంగ్లీష్ సినిమా) - జూలై 25ద ప్లాట్ (కొరియన్ మూవీ) - జూలై 25ద సస్పెక్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 25ఆపిల్ ప్లస్ టీవీఅకపుల్కో సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 23ఎమ్ఎక్స్ ప్లేయర్హంటర్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జూలై 24(ఇదీ చదవండి: 5 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

WCL 2025: నీకసలు దేశభక్తి ఉందా?.. ఆఫ్రిదితో ముచ్చట్లు పెడతావా?
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi)- బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గణ్ (Ajay Devgan) కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రికెట్ మైదానంలో వీరిద్దరు సరదాగా ముచ్చటించుకుంటూ.. పరస్పరం ఆలింగనం చేసుకున్న దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో అజయ్ దేవగణ్పై భారతీయ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.నీకసలు దేశభక్తి ఉందా?‘‘నీకసలు దేశభక్తి అనేదే లేదా? ఒకవేళ ఉన్నా సోషల్ మీడియా పోస్టులకు మాత్రమే పరిమితం చేస్తావా?’’ అంటూ అజయ్ దేవగణ్ను భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ఫొటోలు, వీడియోలు నిజమైనవేనా? అవును.. ఇవేమీ కృత్రిమ మేధ (AI)తో సృష్టించినవి కాదు. నిజమైనవే. అయితే, గతేడాదికి సంబంధించినవి.ఇండియా చాంపియన్స్ సహ యజమానిఅసలు విషయం ఏమిటంటే.. ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) పేరిట మాజీ క్రికెటర్లతో కూడిన ఆరుజట్లతో టీ20 టోర్నమెంట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగమైన ఇండియా చాంపియన్స్ జట్టుకు అజయ్ దేవగణ్ సహ యజమానిగా ఉన్నాడు. గతేడాది ఈ టోర్నీ మొదలు కాగా.. తొలి ఎడిషన్లో యువరాజ్ సింగ్ సారథ్యంలోని భారత్.. ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి ట్రోఫీ గెలిచింది.భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ రద్దుఇక WCL రెండోసీజన్ శుక్రవారం (జూలై 18)న మొదలుకాగా చిరకాల ప్రత్యర్థుల మధ్య ఆదివారం (జూలై 20) మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ను బహిష్కరించాలని కెప్టెన్ యువీతో సహా శిఖర్ ధావన్, సురేశ్ రైనా నిర్ణయించుకున్నట్లు తెలిసింది.గతేడాది ఫొటోలు ఇవిఈ నేపథ్యంలో ఈ టోర్నీని నిర్వహిస్తున్న ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) దాయాదుల పోరును రద్దు చేయాల్సి వచ్చింది. అయితే, అజయ్ దేవగణ్ మాత్రం.. భారత్పై తన వ్యాఖ్యలతో విషం చిమ్మే షాహిద్ ఆఫ్రిదిని కలిసినట్లుగా ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. కానీ అవి తాజా సీజన్కు సంబంధించినవి కావు. గతేడాది ఇరుదేశాలు కలిసి టోర్నీలో ఆడాయి.అప్పుడే అంటే అరంగేట్ర సీజన్ (2024)లో అజయ్ ఆఫ్రిదిని కలిశాడు. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఫొటోలు మరోసారి తెరమీదకు రాగా.. అజయ్ దేవగణ్ను ట్రోల్ చేస్తున్నారు. కాగా ఈ ఏడాది జమ్మూకశ్మీర్లోని ప్రశాంత పహల్గామ్లో ఉగ్రవాదులు దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఇందుకు బదులుగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట ప్రత్యేక ఆపరేషన్తో పాక్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఇందుకు పాక్ సైన్యం బదులివ్వగా అనుచిత దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. దీంతో ఇరుదేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా WCL-2025లో తొలి మ్యాచ్ను రద్దు చేసుకున్న యువీ సేన మంగళవారం తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది. సౌతాఫ్రికా చాంపియన్స్తో తలపడనుంది.చదవండి: WCL 2025: బరిలో యువీ, డివిలియర్స్, బ్రెట్ లీ.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు Ajay Devgan meets Shahid Afridi happily. These celebs desh bhakti will remain for PR only, rest they will do anything for money and don't care about the people of the country. pic.twitter.com/FqfKTMPNOm— Div🦁 (@div_yumm) July 20, 2025Bollywood star Ajay Devgan with legend Shahid Afridi !! pic.twitter.com/eFlR9Ad5jY— TEAM AFRIDI (@TEAM_AFRIDI) July 6, 2024

అరంగేట్రంలోనే ఆసీస్ బ్యాటర్ విధ్వంసం.. విండీస్ చిత్తు
వెస్టిండీస్తో తొలి టీ20 (WI vs AUS)లో ఆస్ట్రేలియా జయభేరి మోగించింది. జమైకా వేదికగా సోమవారం నాటి మ్యాచ్లో ఆతిథ్య జట్టును మూడు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. కాగా మూడు టెస్టులు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది.హోప్, చేజ్ హాఫ్ సెంచరీలుటెస్టు సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన కంగారూలు.. టీ20 సిరీస్లోనూ శుభారంభం చేశారు. సబీనా పార్కులో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన విండీస్ ఆదిలోనే ఓపెనర్ బ్రాండన్ కింగ్ (18) వికెట్ కోల్పోయింది.అయితే, మరో ఓపెనర్, కెప్టెన్ షాయీ హోప్ (39 బంతుల్లో 55), వన్డౌన్ బ్యాటర్ రోస్టన్ చేజ్ (60) అర్ధ శతకాలతో రాణించారు. షిమ్రన్ హెట్మెయిర్ (19 బంతుల్లో 38) తనదైన శైలిలో ధనాధన్ దంచికొట్టగా.. మిగతా వారంతా విఫలమయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్ ఎనిమిది వికట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.5️⃣0️⃣ for Roston in some style!🏏💥#WIvAUS | #fullahenergy pic.twitter.com/J9JygS3XcC— Windies Cricket (@windiescricket) July 21, 2025ఆసీస్ బౌలర్లలో డ్వార్షుయిస్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. సీన్ అబాట్, కూపర్ కన్నోలి, నాథన్ ఎల్లిస్, అరంగేట్ర ప్లేయర్ మిచెల్ ఓవెన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన మార్ష్ బృందం 18.5 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది.గ్రీన్, మిచ్ మెరుపు హాఫ్ సెంచరీలుకెప్టెన్ మిచెల్ మార్ష్ (24) ఫర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెగర్క్ (2), వన్డౌన్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ (18) నిరాశపరిచారు. గ్లెన్ మాక్స్వెల్ (11) సైతం విఫలం కాగా.. కామెరాన్ గ్రీన్, మిచెల్ ఓవెన్ మెరుపు అర్ధ శతకాలతో చెలరేగారు. గ్రీన్ 26 బంతుల్లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేయగా.. మిచెల్ ఓవెన్ 27 బంతుల్లో ఆరు సిక్సర్లు బాది 50 పరుగులు సాధించాడు.మిగతా వారిలో కూపర్ కన్నోలి 13 పరుగులు చేయగా.. డ్వార్షుయిస్ (5), సీన్ అబాట్ (5) అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. 18.5 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 190 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. విండీస్పై మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది.పంజాబ్ కింగ్స్ప్లేయర్గాకాగా ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్కు ఆడిన మిచెల్ ఓవెన్.. విండీస్తో తొలి టీ20 ద్వారా ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అరంగేట్రంలోనే ఈ 23 ఏళ్ల బ్యాటింగ్ ఆల్రౌండర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోవడం విశేషం. అంతేకాదు.. ఆసీస్ తరఫున అంతర్జాతీయ టీ20లలో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్గా మిచ్ నిలిచాడు. చదవండి: నితీశ్ రెడ్డి అవుట్!

T20I Tri-Series: ఫైనల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా
జింబాబ్వే వేదికగా ముక్కోణపు టీ20 టోర్నమెంట్లో దక్షిణాఫ్రికా జట్టు రెండో విజయం నమోదు చేసుకుంది. హరారే వేదికగా ఆదివారం జరిగిన పోరులో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జింబాబ్వేను ఓడించింది. తద్వారా మరో రెండు లీగ్ మ్యాచ్లు మిగిలి ఉండగానే ఫైనల్లో అడుగుపెట్టింది.145 పరుగులుటాస్ గెలిచిన సౌతాఫ్రికా జింబాబ్వేను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఆతిథ్య జట్టు 144 పరుగులు చేసింది. బెనెట్ (61; 7 ఫోర్లు, 3 సిక్స్లు)... ర్యాన్ బుర్ల్ (36 నాటౌట్) రాణించారు.ఇక సఫారీ బౌలర్లలో కార్బిన్ బాష్ రెండు వికెట్లు పడగొట్టగా... నండ్రీ బర్గర్, లుంగి ఎంగిడి, పీటర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా.. 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది.డసెన్ కెప్టెన్ ఇన్నింగ్స్‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రూబిన్ హెర్మాన్ (36 బంతుల్లో 63; 3 ఫోర్లు, 4 సిక్స్లు), కెప్టెన్ రాసీ వాన్ డెర్ డసెన్ (41 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధశతకాలు చేశారు.కాగా జింబాబ్వేతో ముక్కోణపు టీ20 సిరీస్ ఆడేందుకు దక్షిణాఫ్రికాతో పాటు న్యూజిలాండ్ జట్టు కూడా అక్కడ పర్యటిస్తోంది. ఈ క్రమంలో టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచిన న్యూజిలాండ్ 4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించింది.మరోవైపు... తాజా విజయంతో మూడు మ్యాచ్ల్లో రెండింట గెలిచిన దక్షిణాఫ్రికా 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆతిథ్య జింబాబ్వే ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడి ఫైనల్ రేసు నుంచి తప్పుకొంది. దీంతో మరో రెండు లీగ్ మ్యాచ్లు మిగిలుండగానే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఫైనల్కు అర్హత సాధించాయి.తదుపరి మ్యాచ్లో న్యూజిలాండ్- సౌతాఫ్రికా మంగళవారం (జూలై 22) తలపడతాయి. అనంతరం గురువారం (జూలై 24) జింబాబ్వే- న్యూజిలాండ్ మధ్య మ్యాచ్తో లీగ్ దశ ముగుస్తుంది. ఇక శనివారం (జూలై 26) న్యూజిలాండ్- దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్తో ఈ సిరీస్ ముగుస్తుంది. చదవండి: IND vs ENG: నితీశ్ రెడ్డి అవుట్!

BAN vs PAK: పాకిస్తాన్కు బంగ్లాదేశ్ షాక్
మిర్పూర్: బౌలర్లు విజృంభించడంతో సొంతగడ్డపై పాకిస్తాన్తో జరిగిన తొలి టీ20 (BAN vs PAK)లో బంగ్లాదేశ్ ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి పోరులో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో గెలిచి 1–0తో ఆధిక్యంలో నిలిచింది. 110 పరుగులకే ఆలౌట్టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 19.3 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఫఖర్ జమాన్ (34 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... అబ్బాస్ అఫ్రిది (22; 3 సిక్స్లు), ఖుష్దిల్ షా (17; 1 ఫోర్, 1 సిక్స్) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కెప్టెన్ సల్మాన్ ఆఘా (3)తో పాటు సయీమ్ అయూబ్ (6), హరీస్ (4), హసన్ నవాజ్ (0), మొహమ్మద్ నవాజ్ (3) పెవిలియన్కు వరుస కట్టారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కీన్ అహ్మద్ 3, ముస్తఫిజుర్ రహమాన్ 2 వికెట్లు పడగొట్టారు. పర్వేజ్ ఫిఫ్టిముఖ్యంగా ముస్తఫిజుర్ పాక్ బ్యాటర్లను వణికించాడు. 4 ఓవర్లలో కేవలం 6 పరుగులే ఇచ్చి 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్ ఆటగాళ్లలో ముగ్గురు రనౌట్ రూపంలో వెనుదిరిగారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 15.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పర్వేజ్ హుసేన్ (Parvez Hossain Emon) (39 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్స్లు) అజేయ అర్ధశతకంతో అదరగొట్టగా... తౌహిద్ హృదయ్ (37 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ మీర్జా 2 వికెట్లు పడగొట్టాడు. నాలుగో విజయంటీ20 ఫార్మాట్లో పాకిస్తాన్పై బంగ్లాదేశ్ నెగ్గిన మ్యాచ్లు. ఇప్పటిదాకా పాక్తో 23 టీ20 మ్యాచ్లు ఆడిన బంగ్లాదేశ్ నాలుగింటిలో మాత్రమే నెగ్గింది. 2015, 2016లలో మిర్పూర్లోనే జరిగిన మ్యాచ్ల్లో గెలిచిన బంగ్లాదేశ్... 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో చివరిసారి టీ20ల్లో పాక్ను ఓడించింది. చదవండి: IND vs PAK: పాక్తో మ్యాచ్ బహిష్కరణ
బిజినెస్

ఆర్థిక సంక్షేమానికి ‘కస్టమైజ్డ్’ ఆరోగ్య బీమా
దేశీయంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో నాటకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చికిత్స ఖర్చులు, తీవ్రమైన వ్యాధులు, ప్రివెంటివ్ కేర్పై వినియోగదారుల్లో అవగాహన పెరుగుతుండటం తదితర అంశాల వల్ల సంప్రదాయ ఆరోగ్య బీమా పాలసీల తీరుతెన్నులు మారిపోయాయి. అందరికీ ఒకే రకం పాలసీలనేవి ఇప్పటి పరిస్థితులకు అనువైన విధానంగా ఉండటం లేదు. నేటి కస్టమర్లు తమ వాస్తవిక అవసరాలు, వ్యక్తిగత వైద్య చరిత్ర, మారే జీవన దశలకు అనుగుణంగా, సమయోచితంగా, సరళంగా ఉండే పాలసీలను కోరుకుంటున్నారు. 30లలో ఉన్న ఒంటరి వర్కింగ్ ఉమన్ కావచ్చు లేదా మధుమేహం ఉన్న సీనియర్ సిటిజన్ కావచ్చు లేదా పిల్లల కోసం ప్లానింగ్ చేసుకుంటున్న యువ జంట కావచ్చు ఒక్కొక్కరి అవసరాలు ఒక్కో రకంగా ఉంటాయి. ఒకే రకమైన పాలసీ వల్ల వారి అవసరాలు తీరవు. ఇలా వినియోగదారుల మైండ్సెట్ మార డం వల్ల, తమకు అనువైన విధంగా మార్చుకోగలిగే మాడ్యులర్ లేదా కస్టమైజబుల్ హెల్త్ ప్లాన్లకు ఆదరణ పెరుగుతోంది. ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఇది స్మార్ట్ విధానంగా ఉంటోంది. ఈ హెల్త్ ప్లాన్లలో ప్రత్యేకతలు..కస్టమైజబుల్ లేదా మాడ్యులర్ హెల్త్ ప్లాన్లనేవి నిర్దిష్టమైన ఆరోగ్య సంరక్షణ అవసరాలకు తగ్గ కవరేజీని తీసుకునేలా పాలసీదారులకు వెసులుబాటు కల్పిస్తాయి. చాలా మటుకు పథకాల్లో, బేస్ హాస్పిటలైజేషన్ కవరేజీ ఉంటుంది. వ్యక్తిగత అవసరాలను బట్టి మరిన్ని ఫీచర్లను జోడించుకునేందుకు ఇవి యూజర్లకు వీలు కలి్పస్తాయి. ఉదాహరణకు, ప్రీ–సెట్ రూమ్ కేటగిరీకే పరిమితమైపోకుండా, పాలసీదారులు షేర్డ్ రూమ్ల నుంచి మొదలుపెట్టి ఎలాంటి పరిమితులు లేని లేదా సూట్ స్థాయి గదుల వరకు వేర్వేరు రూమ్ రెంట్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. సమ్ ఇన్సూర్డ్ రిస్టోరేషన్ అనేది మరో ప్రధాన ఫీచరు. ఒకవేళ పాలసీదారుకు, సంవత్సరం మధ్యలో కవరేజీ అయిపోతే, చాలా మటుకు ప్లాన్లు ఆటోమేటిక్గా బీమా మొత్తాన్ని పూర్తిగా పునరుద్ధరిస్తాయి. ఇలా ఏడాదిలో ఒకసారికి మించి పునరుద్ధరిస్తాయి. కాలక్రమేణా, సంవత్సరాల తరబడి ఎలాంటి క్లెయిమూ చేయకపోతే పర్మనెంట్ నో–క్లెయిమ్ బోనస్ ప్రయోజనం దక్కుతుంది. అదనపు పేపర్వర్క్ లేదా గణనీయంగా ప్రీమియంల పెరిగే ప్రసక్తి లేకుండానే సమ్ ఇన్సూర్డ్ పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్లు పలు యాడ్–ఆన్లను అందిస్తాయి. మెటర్నిటీ, కవరేజీ, క్రిటికల్ ఇల్నెస్ సంరక్షణ, అంబులెన్స్ సర్వీసులు, హోమ్ కేర్, ఆయుష్ చికిత్సలు, దంత సంరక్షణలాంటి అనేక ప్రయోజనాలను కల్పిస్తాయి. జీవిత దశలను బట్టి రైడర్లను తీసుకునే మాడ్యులర్ ప్లాన్లు ఆకర్షణీయమైనవిగా ఉంటాయి. యువ ప్రొఫెషనల్స్, అవసరమైతే ప్రీమియంను తగ్గించుకునేందుకు, మెటర్నిటీ ప్రయోజనాలను వదులుకుని, అధిక డిడక్టబుల్ని ఎంచుకోవచ్చు. పిల్లల కోసం ప్లానింగ్ చేసుకుంటున్న జంట మొదటి రోజు నుంచి మెటర్నిటీ, నవజాత శిశువు, ఓపీడీ కేర్ను ఎంచుకోవచ్చు. ఇలాంటి అనేకానేక అవకాశాలు ఉండటమనేది పాలసీదారులు తమ బడ్జెట్కు తగ్గట్లుగా ప్లాన్ చేసుకునేందుకు వీలవుతుంది. అలాగే, తమకు ప్రస్తుతం అవసరమైనది మాత్రమే తీసుకుని, తర్వాత పరిస్థితులు మారే కొద్దీ కవరేజీని పెంచుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుంది.ఎవరికి ఎక్కువ ప్రయోజనం?20ల ఆఖర్లోను, 40ల మధ్యలోను ఉన్న వారికి, అంటే తమ కెరియర్లలో ప్రారంభ, మధ్య దశల్లో ఉన్నవారికి ఇలాంటి ప్లాన్లు ప్రయోజనకరంగా ఉంటాయి. తమ జీవన విధానం, ఫ్యామిలీ ప్లానింగ్, దీర్ఘకాలిక ఆరోగ్య లక్ష్యాల ఆధారంగా పథకాన్ని మార్చుకోగలిగే వెసులుబాటుతో తక్కువ ప్రీమియంలను లాక్ ఇన్ చేసుకునే అవకాశం పొందవచ్చు. యువ ప్రొఫెషనల్స్ చాలా తక్కువ యాడ్–ఆన్లు, అధిక డిడక్టబుల్స్ను ఎంచుకోవచ్చు. అలాగే జంటలు లేదా యువ కుటుంబాలు మెటరి్నటీకి, నవజాత శిశువు సంరక్షణ, వెల్నెస్ ఫీచ ర్లకు ప్రాధాన్యమివ్వొచ్చు. 50లకు చేరువవుతు న్న వారూ బేస్ పాలసీని సమూలంగా మార్చే సుకోకుండా, క్రిటికల్ ఇల్నెస్ లేదా తీవ్రమైన అనారోగ్యాల నియంత్రణకు సంబంధించిన నిర్దిష్ట కవరేజీలను తీసుకోవడం ద్వారా మాడ్యులర్ ప్లాన్ల నుంచి ప్రయోజనం పొందవచ్చు.క్లెయిమ్లపై ప్రభావంఅయితే, కస్టమైజ్ చేసుకునేటప్పుడు అన్ని వివరాలను సంపూర్ణంగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కొన్ని కవరేజీలను వదిలివేయడం లేదా తక్కువ లిమిట్స్ను ఎంచుకోవడం (ఉదాహరణకు రూమ్ రెంట్కి పరిమితులు) లేదా క్రిటికల్ ఇల్నెస్ను ఎంచుకోకపోవడం లాంటి అంశాల వల్ల, వైద్యపరంగా తీవ్రమైన పరిస్థితులు ఎదురైనప్పుడు తగినంత కవరేజీ లేకుండా పోయే అవకాశం ఉంది. కో–పే పర్సంటేజీలు, ఉప–పరిమితులు, వెయిటింగ్ పీరియడ్లు, మినహాయింపులు మొదలైన ముఖ్యమైన వివరాలన్నీ పాలసీ డాక్యుమెంట్లలో ఉంటాయి. ఇవన్నీ కూడా క్లెయిమ్లపై గణనీయమైన ప్రభావం చూపుతాయి.ఇదీ చదవండి: రిటైర్మెంట్ కోసం స్మాల్క్యాప్ బెటరా?క్లెయిమ్ల ప్రాసెసింగ్ లేదా ఆమోదించడానికి పట్టే సమయంపై కొన్ని యాడ్–ఆన్లు ప్రభావం చూపవచ్చు. కాబట్టి, పర్సనలైజ్ చేసుకునే సౌకర్యం ఉన్నప్పటికీ, పాలసీని కేవలం అఫోర్డబిలిటీ కోణంలోనే చూడకుండా అత్యవసర పరిస్థితుల్లో అర్ధవంతమైన విధంగా భద్రత లభించేలా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవడం కూడా చాలా ముఖ్యం. కస్టమైజ్ చేసుకోదగిన ప్లాన్లనేవి ప్యాసివ్ ఇన్సూరెన్స్ విధానానికి భిన్నంగా ఆరోగ్య సంరక్షణ కోసం క్రియాశీలకంగా ప్లానింగ్ చేసుకునేందుకు తోడ్పడతాయి. మరింత నియంత్రణను, మరింత విలువను, అలాగే మీ అవసరాలకు అనుగుణంగా మార్చుకునే వెసులుబాటును అందిస్తాయి. ఆరోగ్యపరమైన రిసు్కలు అనూహ్యమైన విధంగా ఉంటున్న నేపథ్యంలో మాడ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లనేవి, ఆర్థిక సంక్షేమానికి సుస్థిర విధానంగా ఉపయోగపడగలవు.

రిటైర్మెంట్ కోసం స్మాల్క్యాప్ బెటరా?
మనీ మార్కెట్ ఫండ్ ఎవరికి అనుకూలం? – స్వర్ణముఖిమనీ మార్కెట్ ఫండ్ అన్నది డెట్ మ్యూచువల్ ఫండ్ పథకం. ఏడాది కాలంలో గడువు ముగిసే స్వల్ప కాల డెట్ ఇన్స్ట్రుమెంట్లు, ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. రిస్క్లేని ఊహించదగిన రాబడులను ఇవి ఇవ్వగలవు. ఇవి అధిక నాణ్యత కలిగిన సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ దాదాపు రిస్క్లేని, అధిక రక్షణతో కూడినవి. స్వల్పకాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే కాస్త అధిక రాబడులను ఇస్తాయి. ఎందుకంటే ఇవి వైవిధ్యమైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఏడాది కాలానికి ఇన్వెస్ట్ చేసుకునే వారు వీటిని పరిశీలించొచ్చు. బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్లపై రాబడి కంటే అధిక రాబడిని ఇవ్వగలవు. బ్యాంక్ ఖాతాల్లో ఎక్కువ బ్యాలన్స్ ఉంచుకునే వారు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.మొత్తం 16 రకాల డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉండగా, లిక్విడ్ ఫండ్స్, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అన్నవి రిటైల్ ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉంటాయి. మీ పెట్టుబడుల కాల వ్యవధి ఏడాది అయితే లిక్విడ్ ఫండ్స్ మంచివి. ఇవి తక్కువ రిస్క్ పథకాలు. అత్యవసర నిధికి వీటిని ఉపయోగించుకోవచ్చు. ఏడాదికి మించిన కాలానికి ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే షార్ట్ డ్యురేషన్ ఫండ్ను ఎంపిక చేసుకోండి. ఏడాది నుంచి మూడేళ్ల కాల సాధనాల్లో ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడంలో ఉన్న ప్రాథమిక లక్ష్యం పెట్టుబడి పరిరక్షణతోపాటు, కొంత రాబడి కోరుకోవడం. ఈ దృష్ట్యా లిక్విడ్ ఫండ్స్, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి.రిటైర్మెంట్ నిధి కోసం స్మాల్క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? – అనిరుధ్ భట్టాచార్యదీర్ఘకాలంలో సంపద సృష్టికి స్మాల్క్యాప్ పథకాలను పరిశీలించొచ్చు. స్మాల్క్యాప్లో పెట్టుబడులకు దీర్ఘకాలం ఒక్కటే ప్రామాణికం కాదు. నష్ట భయాన్ని, యూనిట్ల విలువ క్షీణించినా తట్టుకునే గుండె నిబ్బరం కావాలి. ఇవి నిర్ణీత సమయాల్లో (సైకిల్స్) భారీ నష్టాలకు గురవుతుంటాయి. మార్కెట్లో ఇతర విభాగాలు మంచి పనితీరు చూపిస్తూ, స్మాల్క్యాప్లో పెట్టుబడులు నష్టాలను చూపిస్తుంటే ఆందోళన చెందడం సహజం. అందుకనే మీ మొత్తం పెట్టుబడుల్లో 10–15% మించి స్మాల్క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోకుండా ఉండడం సూచనీయం. చిన్న కంపెనీని ఎంపిక చేసుకుంటే, అది ఆ తర్వాతి కాలంలో పెద్ద కంపెనీగా మారితే, మంచి సంపద సృష్టి జరుగుతుంది. కానీ, అలా ఎంపిక చేసుకున్న ప్రతి కంపెనీ బడా కంపెనీ అవ్వాలనేమీ లేదు. సంపదను తుడిచిపెట్టేవీ ఉంటాయి. ఆటుపోట్లను తట్టుకునే బలం చిన్న కంపెనీలకు తక్కువ. లార్జ్క్యాప్ కంపెనీలతో పోలిస్తే మంచి వృద్ధిని చూపించగలవు.ఇదీ చదవండి: దీర్ఘకాలానికి మంచి ట్రాక్ రికార్డుమరీ చిన్న కంపెనీలు అయితే ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు సైతం దూరంగా ఉంటారు. స్మాల్క్యాప్ విభాగం పెద్దది. స్మాల్క్యాప్ విభాగంలో వివిధ పథకాల మధ్య ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. కనుక సిప్ ద్వారా స్మాల్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా స్మాల్క్యాప్ కంపెనీలకు సంబంధించి తగినంత లిక్విడిటీ ఉండదు. చిన్న కంపెనీలు కావడంతో ఫ్రీ ఫ్లోటింగ్ ఈక్విటీ తక్కువ. దీంతో మార్కెట్ల కరెక్షన్లలో కొద్ది విక్రయాలకే ఎక్కువ నష్టపోతుంటాయి. మిడ్క్యాప్, లార్జ్క్యాప్ కంపెనీలతో పోలిస్తే స్మాల్క్యాప్ కంపెనీలు రిస్క్ ఎక్కువతో ఉంటాయి. చిన్న కంపెనీల్లో ఏ ధరలో ప్రవేశించారు, ఎక్కడ విక్రయించారన్నది రాబడులకు కీలకం అవుతుంది.

దీర్ఘకాలానికి మంచి ట్రాక్ రికార్డు
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడుల పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్కు కొంత మొత్తాన్ని కేటాయించుకోవాల్సిందే. ఎందుకంటే అన్ని రకాల మార్కెట్ విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టే స్వేచ్ఛతో ఇవి పనిచేస్తుంటాయి. స్మాల్, మిడ్, లార్జ్క్యాప్ కంపెనీల్లో మెరుగైన అవకాశాలను గుర్తించి ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో రిస్్కను సమతుల్యం చేస్తూ.. మెరుగైన రాబడులను ఇచ్చే విధంగా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ పనిచేస్తుంటాయి. ఈ విభాగంలో దశాబ్దాలుగా పనిచేస్తూ మంచి పనితీరు చూపిస్తున్న వాటిల్లో హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీక్యాప్ ముందుంది. రాబడులు.. గత పదేళ్ల కాల పనితీరును గమనించినట్టయితే వార్షిక రాబడి 16 శాతం చొప్పున ఉంది. ఏడేళ్లలో 20 శాతం చొప్పున రాబడులను అందించింది. ఐదేళ్లలో 30 శాతం, మూడేళ్లలో 27.43 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. గత ఏడాది కాల రాబడి 8.43 శాతంగా ఉంది. 1995లో ఈ పథకం మార్కెట్లోకి వచి్చంది. అప్పటి నుంచి చూస్తే వార్షిక రాబడి 18.92 శాతం చొప్పున ఉంది. ఇన్వెస్టర్లు నేరుగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే.. మార్కెట్ పతనాలు, రంగాలు, కంపెనీల వారీ పరిణామాలను గమనించి సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమైన పని. మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్లు ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలరు. కనుక సంపద సమకూర్చుకోవాలని భావించే వారు ఈక్విటీ ఫండ్స్కు తగినంత కేటాయించుకోవడం అవసరం. సిప్ ద్వారా కనీసం రూ.100 నుంచి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడుల విధానం.. చురుకైన, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడుల విధానం ఈ పథకంలో గమనించొచ్చు. భవిష్యత్తులో గొప్పగా వృద్ధి చెందే బలాలున్న కంపెనీలను గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంటుంది. పోర్ట్ఫోలియోలో తగినంత వైవిధ్యాన్ని నిర్వహిస్తుంది. ఫ్లెక్సీక్యాప్ విభాగంలో పోటీ పథకాలతో పోల్చి చూసినప్పుడు హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ స్టాక్స్ నాణ్యత మెరుగ్గా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం పోర్ట్ఫోలియో పీఈ 17.68గా ఉంది. సగటున కంపెనీల వార్షిక వృద్ధి 27.42 శాతం చొప్పున ఉంది. క్వాలిటీ, వ్యాల్యూ వ్యూహాలను సైతం ఈ పథకం అమలు చేస్తుంటుంది. ఫ్లెక్సీక్యాప్ విభాగంలో ఈ పథకంతోపాటు పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ టాప్–2గా ఉన్నాయి. పోర్ట్ఫోలియో.. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.79,585 కోట్ల నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) ఉన్నాయి. ఇందులో 87 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. డెట్ సాధనాల్లో 0.66 శాతం పెట్టుబడులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సాధనాల్లోనూ 2.62 శాతం మేర పెట్టుబడులు కలిగి ఉంది. 9.72 శాతం నగదు నిల్వలు ఉన్నాయి. మార్కెట్లు దిద్దుబాటుకు లోనైతే పెట్టుబడులకు వీలుగా నగదు నిల్వలు అధికంగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈక్విటీ పెట్టుబడుల్లో 87 శాతం లార్జ్క్యాప్లోనే ఉండడం గమనార్హం. మిడ్ క్యాప్ స్టాక్స్లో 9 శాతం, స్మాల్క్యాప్ స్టాక్స్లో 3.91 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది.లార్జ్క్యాప్ వ్యాల్యూషన్లు సహేతుక స్థాయిలో ఉండడంతో ఎక్కువ పెట్టుబడులు ఈ విభాగంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. పోర్ట్ఫోలియోలో మొత్తం 51 స్టాక్స్ ఉన్నాయి. అత్యధికంగా 40 శాతం వరకు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత కన్జ్యూమర్ డి్రస్కీషినరీ కంపెనీలకు 16.99 శాతం, హెల్త్కేర్ కంపెనీలకు 8.64 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 8.55 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించింది.

ఫలితాలు, వాణిజ్య చర్చలపై దృష్టి
ప్రధానంగా తొలి త్రైమాసిక ఫలితాలే ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత వారాతాన పలు దిగ్గజాలు ఏప్రిల్–జూన్(క్యూ1) పనితీరు వెల్లడించడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లపై దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో మరిన్ని బ్లూచిప్స్ క్యూ1 ఫలితాలు వెల్లడించనున్నాయి. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్గత వారాంతాన ప్రకటించిన క్యూ1 ఫలితాలలో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త రికార్డ్కు తెరతీసింది. ఒక త్రైమాసికంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 26,994 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ బాటలో ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. వాటాదారులకు సంస్థ చరిత్రలోనే తొలిసారి అదికూడా 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీని ప్రకటించింది. ఇక మరో దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ సైతం పటిష్ట ఫలితాలు సాధించింది. క్యూ1లో 16% వృద్ధితో రూ. 13,558 కోట్ల నికర లాభం ఆర్జించింది. వెరసి నేడు ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కౌంటర్లు సందడి యనున్నట్లు స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. బ్లూచిప్స్ రెడీ..: ప్రస్తుత ఆర్థి క సంవత్సరం(2025–26) తొలి త్రైమాసిక ఫలితాల సీజన్ మరింత జోరందుకోనుంది. ఈ వారం డాక్టర్ రెడ్డీస్ ల్యా»ొరేటరీస్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే, ఎంఅండ్ఎం, ఏసీసీ, కాల్గేట్, డిక్సన్, తదితర బ్లూచిప్స్ క్యూ1 పనితీరు వెల్లడించనున్నాయి. అంతేకాకుండా ఎటర్నల్, జీల్, ఎంఫసిస్, కెనరా బ్యాంక్, ఎస్ బీఐ లైఫ్ తదితరాలు సైతం ఫలితాలు ప్రకటించనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఫలితాలపై అత్యధికంగా దృష్టి పెట్టనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ సాంకేతిక నిపుణులు ప్రవేష్ గౌర్ పేర్కొన్నారు. వాణిజ్య డీల్స్..: యూఎస్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే బాటలో దేశీ ప్రభుత్వం ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. ఈ వారం వాణిజ్య ఒప్పందం కుదిరితే సెంటిమెంటు సానుకూలంగా ప్రభావితమవుతుందని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ఇది విదేశీ పెట్టుబడులపైనా ప్రభావం చూపే వీలున్నట్లు తెలియజేశారు. వడ్డీ రేట్లపై యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై గత వారం భారత్, యూఎస్ బృందాలు నాలుగు రోజులపాటు వాషింగ్టన్లో నిర్వహించిన ఐదో రౌండ్ చర్చలు పూర్తయిన సంగతి తెలిసిందే. దీంతో ఆగస్ట్ 1కల్లా తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదిరే వీలున్నట్లు సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. ఫలితంగా యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ విధించిన టారిఫ్ల ప్రభావానికి చెక్ పడవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది ఇన్వెస్టర్లలో అనిశ్చితికి కారణమవుతున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్విసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా వివరించారు. సాంకేతికంగా చూస్తే.. గత వారం నిఫ్టీ 25,000 మైలురాయి దిగువన 24,900కు క్షీణించింది. దీంతో సాంకేతిక నిపుణుల అంచనా ప్రకారం ఈ వారం ఆటుపోట్ల మధ్య మరింత బలహీనపడి 24,500వరకూ నీరసించే వీలుంది. అయితే మార్కెట్లు బలపడితే నిఫ్టీకి 25,250 స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు.ఎఫ్పీఐల వెనకడుగుజులైలో రూ. 5,524 కోట్లు వెనక్కిన్యూఢిల్లీ: విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) నగదు విభాగంలో ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ. 5,524 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. దీంతో 2025 తొలి 7 నెలల్లో రూ. 83,245 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. అయితే జూన్లో రూ. 14,590 కోట్లు, మే నెలలో రూ. 19,860 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశారు. ఏప్రిల్ మధ్య నుంచి అమ్మకాల బాటను వీడి రూ. 4,223 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అంతకుముందు మార్చిలో రూ. 3,973 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్లు, జనవరిలో రూ. 78,027 కోట్లు చొప్పున పెట్టుబడులు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. గత వారమిలా వరుసగా మూడో వారం దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 743 పాయింట్లు(0.9 శాతం) క్షీణించి 81,758 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ 181 పాయింట్లు తగ్గి 24,968 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్, స్మాల్క్యాప్ ఇండెక్సులు 1–1.5 శాతం చొప్పున నష్టపోయాయి.
ఫ్యామిలీ

శ్రావణ మాసం వచ్చేస్తోంది..! మంచి ముహూర్తాలు ఎప్పుడంటే..
సాక్షి, అమలాపురం: శుభకార్యాలకు నెలవైన శ్రావణ మాసం వచ్చేస్తోంది. ఈనెల 25 నుంచి ఆరంభం కాబోతోంది. ముహూర్తాలు కూడా బాగా ఉండడంతో ఈసారి పెళ్లిబాజాలు ఘనంగా మోగనున్నాయి. ఎక్కడికక్కడ అమ్మవారి ఆలయాలను సైతం ముస్తాబు చేస్తున్నారు. మహిళలు పూజలకు సిద్ధమవుతున్నారు. ఆషాడం వీడి శ్రావణం మొదలుకానుండడంతో వ్యాపారులు, రైతులు మార్కెట్పై కొత్త ఆశలు పెట్టుకున్నారు. ఈ సీజన్లో వస్త్రాలు, పూలు, పండ్లు, స్వీట్లు, బంగారం, వెండి వస్తువులకు డిమాండ్ పెరగనుంది. వచ్చే శుక్రవారం నుంచే శ్రావణమాసం మొదలుకానుండడంతో శుభ ముహూర్తాల సీజన్ మొదలవుతుంది. నవంబరు వరకూ ఈ సుముహూర్తాల సీజన్ కొనసాగనుంది. ఇక ఈసారి భాద్రపద మాసం మినహా శ్రావణ మాసం మొదలు నవంబరు వరకు ప్రతినెలా ముహూర్తాలు ఉండటం విశేషం. ముహూర్తాల తేదీలు ఇవే..ఈ నెలలో 26, 30, 31 తేదీల్లోను, ఆగస్టులో 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17 తేదీల్లో ముహూర్తాలున్నాయి. అలాగే, ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 21 వరకూ భాద్రపద మాసం. ఇది శూన్యమాసం కావడంతో ముహూర్తాలు లేవు. ఆ తర్వాత సెప్టెంబరులో 23 నుంచి ప్రారంభమై 24, 26, 27, 28 తేదీల్లో.. అనంతరం అక్టోబరు, నవంబరు నెలల్లో కూడా ముహూర్తాలు రికార్డు స్థాయిలో ఉన్నాయి.ఈ మాసాల్లో ఏకంగా 13 రోజుల చొప్పున శుభ ముహూర్తాలు ఉండటం విశేషం. అక్టోబరులో 1, 2, 3, 4, 8, 10, 11, 12, 22, 24, 29, 30, 31 తేదీలు.. నవంబరులో 1, 2, 7, 8, 12, 13, 15, 22, 23, 26, 27, 29, 30 తేదీల్లో శుభ ఘడియలున్నాయి. అనంతరం.. డిసెంబరు 8 నుంచి ఫిబ్రవరి ఆరో తేదీ వరకూ ఇంచుమించు రెండు నెలలపాటు ముహూర్తాలు లేవు.పురోహితులు, వ్యాపారుల్లో ఆశలు..ఈ సంవత్సరం జూన్ 10 నుంచి ఈనెల 8 వరకూ గురు మౌఢ్యమి కావడంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ప్రారంభోత్సవాల వంటి ముహూర్తాల్లేవు. ఈనెల 31న పెద్ద ముహూర్తం కావడంతో పెళ్లిళ్లు పెద్ద సంఖ్యలో జరగనున్నాయి. గత రెండునెలలుగా శుభ కార్యక్రమాల్లేక ఇబ్బందిపడుతున్న పురోహితులతో పాటు వారికి అనుబంధంగా ఉపాధి పొందేవారికీ రానున్న కాలం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

అహంకారం అనర్థదాయకం
అహంకారం అంటే తానే అందరికంటే గొప్పవాడిననీ, అందరూ తనముందు అణిగిమణిగి ఉండాలని భావించడం. అహంకారం, అహంభావం రెండూ ఒకే కోవలోకి వస్తాయి. చరిత్రలో మహితమైన గుణాలతో, సాధులక్షణాలతో అలరారే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అహంకారంతో విర్రవీగేవాళ్ళు సైతం అంతకు తక్కువ మంది లేరు. ఈ అహంకారమనేది సర్వదా వదిలివేయవలసిన దుర్లక్షణం. ఒకరిమీద అహంకరించిన వ్యక్తి ఏం సాధించగలడు? అదే ఆహంకరించడం మాని, మమకారం చూపితే, ప్రపంచమే నీ సొంతమవుతుంది.ఇతరులను తక్కువగా చూడడం, తన గురించి తాను ఎంతో గొప్పవాడినని భావించడం, తాను చేసిన తప్పులను అంగీకరించకపోవడం, ఎదుటివారి అభిప్రాయాలకు అస్సలు విలువ ఇవ్వకపోవడం, ఎక్కువగా దంభాలు పలకడం, ఇతరులు చెప్పే మాటలను ఏమాత్రం వినకపోవడం, ఎదుటివారిని పదేపదే విమర్శించడం.. ఇవన్నీ అహంకారుల లక్షణాలు.అహంకారం అనేది అనర్థదాయకం. అది మానవ సంబంధాలను, వ్యక్తికి ఇతరులతో ఉన్న అనుబంధాలను కూడా దెబ్బ తీస్తుంది. అంతేకాదు.. వ్యక్తిగత పతనానికీ దారి తీస్తుంది. చరిత్ర గతిలో తాము అతి గొప్పవారమని విర్రవీగిన నెపోలియన్, అలెగ్జాండర్ వంటి వారు చివరికి ఏరకంగా నాశనమయ్యారో పరికిస్తే, హద్దులు మీరిన వారి అహంకారమే దానికి కారణమని తెలుస్తుంది. ప్రతి వ్యక్తీ విసర్జించవలసింది అహంకారం. పక్కవారిపై చూపవలసింది మమకారం. అహంకారాన్ని వీడి, ఇతరుల పట్ల మమకారాన్ని చూపించగలిగితే, ఆ లక్షణం మానవ సంబంధాలను సుధామయం చేస్తుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. – ‘అన్నమయ్య తత్వ ప్రవచన సుధాకర’ వెంకట్ గరికపాటిఅహాన్ని వీడిన మకర ధ్వజుడుఅహంకారానికి మారుపేరుగా నిలిచే పాతకాలం నాటి ఒక రాజు కథను పరికిద్దాం. కుంతల దేశాన్ని రవివర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు మహావీరుడు, అతనికి తెలియని యుద్ధవిద్య లేదు. అయితే, అతనిలోని పెద్ద బలహీనత విపరీతమైన అహంకారం. అతని మాటేశానం. ఎవరు తనకు ఎదురుచెప్పినా వినేవాడు కాదు. ఈ విధంగా పరిపాలన సాగుతున్న క్రమంలో రాజుకు ఉన్నట్టుండి ఒక వింతవ్యాధి సోకింది. రాజ్యంలో ఉన్న వైద్యులెవరూ రాజుకున్న వింతరోగాన్ని తగ్గించలేకపోయారు. దానితో మహామంత్రి, ప్రధానసైన్యాధికారి, మిగిలిన వాళ్ళందరూ అన్ని రాజ్యాలూ గాలించి, ఉజ్జయినిలో మకరధ్వజుడనే ఒక గొప్ప సిద్ధవైద్యుడున్నాడనీ, అతని హస్తవాసి చాలా మంచిదని తెలుసుకున్నారు.అయితే, ఆ వైద్యుడు ఉజ్జయినిని వీడి ఎక్కడికీ రాడనీ, ఎంత పెద్దవాడైనా అక్కడే వైద్యం తీసుకోవాలని అతని సహాయకులు తెలిపారు. సైన్యాధికారి రాజు దగ్గరికి వెళ్ళి, ‘‘మహారాజా.. అపర ధన్వంతరి లాంటి ఒక వైద్యుని గురించి విన్నాం. అయితే, చికిత్స కోసం, మీరు ఆ వైద్యుడు ఉండే ఉజ్జయిని వెళ్ళవలసి ఉంటుంది’’ అన్నాడు. అది వినగానే రవివర్మకు ఆగ్రహం తన్నుకొచ్చింది. ‘‘ నేను ఎవరనుకున్నావు. ఆ వైద్యుని దగ్గరకు వెళ్ళి యిక్కడికి రమ్మని చెప్పు. రాకపోతే బలవంతంగా తీసుకురా..’’ అన్నాడు. చేసేదేం లేక సైన్యాధికారి ఉజ్జయిని వెళ్ళాడు. ఆ వైద్యుని దగ్గర రోగులు తండోపతండాలుగా ఉన్నారు. వాళ్ళందరికీ ఎంతో ఓపికగా ఔషధాలను యిస్తున్నాడు మకరధ్వజుడు.అందరూ ఆ వైద్యుని దైవంలా కీర్తించడం గమనించాడు సైన్యాధికారి. కుంతలదేశపు రాజైన రవివర్మ తన రోగ నివారణకు మందులు యివ్వడం కోసం తమ రాజ్యానికి రమ్మంటున్నారని సైన్యాధికారి వైద్యునికి తెలపగా, అతనితో మకరధ్వజుడు ‘‘నాయనా.. నన్ను నమ్ముకుని రోగులు విభిన్న రాజ్యాలనుంచి ఉజ్జయినికి వస్తారు. కాబట్టి వారిని వదిలి నేను ఎక్కడికీ రాలేను..’’ అన్నాడు. అది విని ఆగ్రహించిన సైన్యాధికారి వైద్యునిపై బలప్రయోగం చేయబోయాడు. అక్కడే ఉన్న జనులందరూ కోపగించి, సైన్యాధికారికి దేహశుద్ధి చేశారు. పలాయనం చిత్తగించి, వెంటనే కుంతల రాజ్యానికి తిరుగు పయనమయ్యాడు సైన్యాధికారి. రాజు దగ్గరికి వెళ్ళి, ‘‘మహారాజా.. మకరధ్వజుడు మహావైద్యుడు.కానీ, అసంఖ్యాకమైన రోగులను నిత్యమూ చూడాలి కాబట్టి, ఆయన ఎక్కడికీ రాలేడు. తమరు ఉజ్జయినికి వెళితే, అతి తక్కువ వ్యవధిలో తమ రోగం నయమవుతుందన్న నమ్మకం నాకు ఉంది.’’ అన్నాడు. ఈ లోగా రాజు ఆరోగ్యం మరికొంత క్షీణించింది. ఇక, తప్పనిసరై, తన అహంకారాన్ని వదిలి, ఉజ్జయినికి వెళ్ళిన రాజుకు మకరధ్వజుడు తన నైపుణ్యంతో వైద్యం చేసి, అతని రోగాన్ని నయం చేశాడు. అమితమైన ఆనందానికి గురైన రవివర్మ మకరధ్వజుని వైద్యశాలకు వచ్చే రోగులకు ఉపయోగపడేలా ఎన్నో హంగులు సమకూర్చడమే గాక, తన అహంకారాన్ని తగ్గించుకుని ప్రజారంజకంగా పరిపాలన కొనసాగించాడు.

ఇరుకు దారులకు చురుకైన కారు..!
ఇరుకు దారుల్లో ద్విచక్ర వాహనాలు ఎలాగోలా ప్రయాణించగలవు గాని, కార్లు ముందుకెళ్లడం అంత సులువు కాదు. ఈ సమస్యను అధిగమించాలనే ఆలోచనతోనే ఇటాలియన్ మెకానిక్ ఆండ్రియా మరాజీ ప్రపంచంలోనే అతి సన్నని కారును రూపొందించాడు. అలాగని అతడేమీ కొత్తగా కారును తయారు చేయలేదు. తన షెడ్డులో మూలపడిన 1993 మోడల్ ‘ఫియట్ పాండా’ కారు రూపురేఖలను తాను కోరుకున్న రీతిలో మార్పులు చేసి, ఇలా అతి సన్నని కారుగా మార్చేశాడు. దీనికోసం ఆండ్రియా ఏకంగా పన్నెండు నెలలు శ్రమించాడు. రోడ్ల మీద పరుగులు పెట్టేలా దీనిని తీర్చిదిద్దడానికి పూర్తిగా ఫియట్ కంపెనీకి చెందిన ఒరిజినల్ విడి భాగాలనే ఉపయోగించాడు. కారుకు ఉన్న పాత పెట్రోల్ ఇంజిన్ను తొలగించి, ఎలక్ట్రిక్ ఇంజిన్ను ఏర్పాటు చేసి, బ్యాటరీని అమర్చాడు. బ్యాటరీని ఒకసారి చార్జ్ చేస్తే, పాతిక కిలోమీటర్లు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. ఈ కారు ఎత్తు 140 సెం.మీ., పొడవు 340 సెం.మీ., వెడల్పు 50 సెం.మీ. మాత్రమే! ఈ కారులోనే చక్కర్లు కొడుతూ ఆండ్రియా యూట్యూబ్ సంచలనంగా మారాడు.(చదవండి: జైలు శిక్షనే శిక్షణగా మార్చుకున్న జీనియస్ ఖైదీ..!)

బహుత్ అచ్చీ..'బాత్' హై..!
నగర జీవనం అత్యాధునికం, సంకేతికం అవుతోంది.. రోజు రోజుకూ అందుబాటులోకొస్తున్న టెక్నాలజీ పుణ్యమాని కొత్త కొత్త ట్రెండ్స్ నడుస్తున్నాయి. ఇందులో మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో చెప్పుకోదగిన విషయం ఏదైనా ఉందంటే అది బాత్రూమ్ ట్రెండ్స్.. సగటు మానవుని జీవితం మూడేళ్లపాటు బాత్రూమ్స్లోనే గడుపుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. అంతేకాదు.. ‘ఛేంజింగ్ ఫేస్ ఆఫ్ బాత్రూమ్స్’ పేరిట నగరంలో ఓ సెమినార్ కూడా నిర్వహించారట.. దీన్ని బట్టి స్నానాల గదికి ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు.. దీన్ని దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక హంగులను అద్దుతున్నారు. ఇంటీరియర్ డిజైనింగ్లోనూ కీలకపాత్ర పోషిస్తోందనడంలో సందేహం లేదు..ఇటీవల కాలంలో మొబైల్స్ పుణ్యమాని మానవులు, మరీ ముఖ్యంగా నగరవాసులు సగటున మూడేళ్ల పాటు సమయాన్ని బాత్రూమ్స్లోనే గడుపుతున్నారని ఓ అధ్యయంనలో తేలింది. అంతేకాదు ఏడాదికి 70 లక్షల మంది తమ మొబైల్స్ను పోగొట్టుకుంటున్నారని మరో అధ్యయనం తేలి్చంది. అదీ ఎక్కడో కాదు.. బాత్రూమ్స్లోనే.. మన జీవితంలో ఏడాదికి 2500 సార్లు రెస్ట్రూమ్స్ వినియోగిస్తామని మరో స్టరీ పేర్కొంటోంది..ఇక దేశంలో దంపతుల మధ్య గొడవలకుగల కారణాల్లో బాత్రూమ్దే ప్రధాన పాత్ర అని మరో స్టడీ చెబుతోంది.. ఇలా చూస్తే.. డ్రాయింగ్ రూమ్స్, జిమ్స్ వంటి వాటికన్నా బాత్రూమ్ కోసమే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారట. స్నానాలగది గురించి ఇంతకు మించిన ఆసక్తికరమైన అంశాలు చాలానే ఉన్నాయి.. బాత్ చుట్టూ బాతాఖానీ.. ‘ఛేంజింగ్ ఫేస్ ఆఫ్ బాత్రూమ్స్’ పేరిట నగరంలో జరిగిన ఓ సెమినార్లో ఇలాంటి విషయాలెన్నో చర్చకు వచ్చాయి. ‘బాత్రూమ్లు మన జీవనశైలిలో అత్యంత ప్రధానమైన భాగంగా మారాయి. ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు, నిర్మించుకునేటప్పుడు సిటిజనులు బాత్రూమ్లకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. బిల్డర్స్ కూడా అత్యధికంగా వ్యయం చేసి వినూత్నంగా తీర్చిదిద్దిన, బాత్రూమ్స్తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు’ అని చెప్పారు నగరంలోని ఓ భవన నిర్మాణ సంస్థకు చెందిన చైతన్య. వీటిని ఇప్పుడు డిజైనర్ బాత్ రూమ్ స్పేసెస్ అని వ్యవహరిస్తున్నారు అని అన్నారాయన. ఒత్తిడి చిత్తు.. రీచార్జ్ ఎత్తు.. ‘బాత్రూమ్స్ అంటే కొత్త ఐడియాలకు పుట్టినిల్లు’ అని చెప్పారు ఓ స్టార్టప్ కంపెనీ యజమాని సందీప్. అంతేకాదు ఇవి ఐ కెన్ డూ అనిపిస్తాయి. నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్ అని వెన్ను తడతాయి. నెగెటివ్ ఆలోచనల్ని నురగతో పాటు కొట్టుకుపోయేలా చేస్తాయి. ఒత్తిడిని దూరం చేసి రిలాక్స్డ్ మైండ్ని అందిస్తాయని, మెదడులో డోపమైన్ హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయని పరిశోధకులు అంటున్నారు. స్విమ్మింగ్, జాగింగ్ వంటివాటితో వచ్చే లాభాలతో సమానంగా బాత్రూమ్ పనిచేస్తుంది.గతంలో బాత్రూమ్స్ నిర్లక్ష్యానికి గురి అయిన ప్లేసులు. అయితే ప్రస్తుతం వీటికి బాగా ప్రాధాన్యం పెరిగింది. విశాలంగా అవసరమైన అన్ని సౌకర్యాలు, ఫిట్మెంట్స్ ఏర్పరచుకుంటున్నాయి. ఇందులో భాగంగా తడి, పొడి ప్రదేశాలుగా బాత్ రూమ్ని రెండు భాగాలుగా విభజిస్తారు. వెట్ ప్లేస్లో షవర్, టబ్లు ఉంటాయి. గ్లాస్తో విభజించి మరో భాగంలో శానిటరీ, వాష్ బేసిన్, మిర్రర్.. ఉంటాయి.హైలెట్ టైల్స్ : బాత్రూమ్లో ఒక ప్లేస్లో పెడితే బాత్రూమ్ మొత్తాన్ని హైలెట్ చేసే హైలైటర్స్లో వాల్ పేపర్స్/టైల్స్/మిర్రర్స్ ఉన్నాయి. ఇవి రూ.50 వేల నుంచి ధరల్లో అందుబాటులో ఉన్నాయి. బాత్రూమ్ ప్లేస్ని బట్టి ఖరీదు ఉంటుంది. కింద ఫ్లోరింగ్ చూస్తే అచ్చం వాటర్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఓషన్ థీమ్లా లేదా మరే థీమ్ అయినా తీసుకోవచ్చు.ప్లాంట్స్ : బాత్రూమ్లో వాల్కి పక్కన, లేదా బాత్టబ్ పక్కన ప్లాంట్స్ని ఏర్పాటు చేస్తున్నారు. మంచి పరిమళాలు పంచే బోన్సాయ్ మొక్కలైన హైపర్ బోల్స్, సిల్క్ ఫ్లవర్, టైడ్ రిబ్బన్స్తో పాటు అలోవీరా, స్పైడర్ ప్లాంట్ వంటివి పాపులర్ అయ్యాయి. ఇవి రూ.10వేల నుంచి లభిస్తున్నాయి. బోన్సాయి అయితే రూ.25వేల నుంచి ప్రారంభమవుతాయి. గ్రీనరీ లుక్ కోసం విండో ప్లేస్లో ఐరన్ బదులు బ్యాంబూ పెడతారు. చిన్న చిన్న లైట్స్ దీనికి అమరుస్తారు.వానిటీ : టవల్స్, షేవింగ్ కిట్స్, అవసరమైతే బుక్స్ పెట్టుకోడానికి బాత్రూమ్లోనే వార్డ్రోబ్స్ పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు హోటల్స్కి పరిమితమైనవి.. ఇప్పుడు ఇళ్లలోకి కూడా వచ్చేశాయి.జెట్ మసాజెస్ : ఇవి అమర్చుకుంటే మన మీద పడే నీళ్లతోనే మనకు మసాజ్ అనుభూతి కలుగుతుంది. నీళ్ల వేగానికి శరీరం రిలాక్స్ అవుతుంది. షవర్ ప్యానెల్లో లేదా టబ్లో అయితే అడుగున లేదా ఇరుపక్కల అమరుస్తారు. వాటర్ ప్రెజర్ని మనం తగ్గించుకునే, పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. రూ.15వేల నుంచి వీటి ధర మొదలవుతుంది. అయితే నిర్మాణ సమయంలో ముందస్తు ప్లాన్స్ చేసుకుని గోడలో ఉండే పైప్లోనే ప్రెషర్ వాల్ ఉండేలా చూడాలి.ఇ–టబ్స్ : బాత్రూమ్ టబ్స్లో రేడియో, ఎఫ్ఎం, బ్లూటూత్, మొబైల్ కాలింగ్ కూడా ఉంటాయి. టబ్కి రైట్సైడ్ టచ్ స్క్రీన్ ఉంటుంది. దీనిని ఆపరేట్ చేసుకోవచ్చు. నీళ్లలో తడిచినా ఆ టచ్స్క్రీన్కు ఏమీ కాదు. ఇది టబ్తో పాటు కలిపి వస్తుంది. దీన్ని తర్వాత ఫిట్ చేసుకోవడం కుదరదు. ఇవి రూ.2లక్షల నుంచి మొదలువుతాయి.స్ట్రిప్ లైట్స్ : సీలింగ్లో లైటింగ్ కోసం మిర్రర్ కానీ స్ట్రిప్ లైట్స్ కానీ ఎక్కువగా వినియోగిస్తారు. దీని వల్ల కొంచెం ఎక్కువ వెలుగు వస్తుంది. సీలింగ్ కోసం 3డీ వాల్పేపర్స్ కూడా వాడుతున్నారు. చూడడానికి టేకు చెక్కతో చేసినవిలా అనిపించే డబ్ల్యూపీవీసీ సీలింగ్ ప్యానెల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఒకరకమైన ప్లాస్టిక్ తరహాలో ఉండే ఇవి రిమూవబుల్ కూడా.సిరి ఉంటే ఆవిరి : మరింత రిలాక్సేషన్ కోసం. స్టీమ్బాత్ సౌకర్యం ఏర్పాటు చేసుకుంటున్నారు. స్టీమ్ ఉంటే ఫాల్స్ సీలింగ్ చేయించకూడదు. త్రీడీ వాల్ పేపర్స్, టైల్స్ మాత్రమే వాడతారు. వీటినే జకోజీ బాత్రూమ్స్గా పిలుస్తున్నారు. వీటి విలువ కనీసం రూ.5లక్షల నుంచి మొదలవుతుంది. స్టీమ్ బాత్, షవర్ ఏరియా, జెట్స్ మసాజ్ అన్నీ కలిపి షవర్ యూనిట్ అంటారని చెప్పారు నగరానికి చెందిన ఇంటీరియర్ డిజైనర్ కాత్యాయని..
ఫొటోలు
అంతర్జాతీయం

కిస్ కిస్ కిస్సిక్.. కొంపముంచిన కోల్డ్ప్లే
ప్రముఖ మ్యూజిక్ కాన్సర్ట్ ‘కోల్డ్ ప్లే’ ఆ కంపెనీ సీఈవో కొంపముంచింది. తన సహోద్యోగినితో సన్నిహితంగా మెలుగుతూ.. ముద్దు పెట్టుకొన్న వీడియో వైరల్ కావడం తెలిసిందే. ఈ ఎపిసోడ్ ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఆయన ఏకంగా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మరోవైపు.. నాలుగు రోజుల తర్వాత కూడా ఆ వీడియో విపరీతంగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ప్రముఖ కంపెనీలు సైతం తమ ప్రచారాలకు ఆ వీడియోను వాడేసుకుంటున్నాయి. ఆస్ట్రానమర్ సీఈవో ఆండీ బైరోన్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తాను కంపెనీ వీడుతున్నట్లు శనివారం ఆయన ప్రకటించారు. ఆ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిస్టిన్ క్యాబెట్ను కౌగలించుకుని.. ముద్దాడుతున్న వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. బుధవారం మాసెచూసెట్స్ స్టేట్ బోస్టన్లోని గిల్లెట్ స్టేడియంలో జరిగిన కోల్డ్ ప్లే కాన్సర్ట్లో వీళ్లిద్దరి ఇలా కెమెరా కంటపడ్డారు. ఆ వెంటనే నాలుక్కరుచుకొని ఇద్దరు విడిపోయి దాక్కొన్నారు. దీంతో కోల్డ్ప్లే క్రిస్ మార్టిన్ ‘‘వారు అఫైర్లో అయినా ఉండి ఉండాలి.. లేదా సిగ్గుతో దాక్కొని ఉండాలి’’ అంటూ కామెంట్ చేయడంతో అది మరింత వైరల్ అయ్యింది. మరోవైపు.. Andy Byron, CEO of Astronomer, was caught at a Coldplay concert apparently having an affair with the company’s CPO, Kristin Cabot.Both Byron and Cabot are married to other people.Most awkward moment of 2025?pic.twitter.com/bVOTq6XgF8— Paul A. Szypula 🇺🇸 (@Bubblebathgirl) July 17, 2025ఈ వ్యవహారం కంపెనీకి తలవంపులుగా మారింది. దీంతో సీఈవో ఆండీ బైరోన్ను సస్పెండ్ చేస్తున్నట్లు కంపెనీ సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రకటించింది. ఈ విషయం వైరల్ కావడంతో ఆస్ట్రానమర్ కంపెనీ అంతర్గత దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో ఆండీ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని లింక్డిన్లో ఆ కంపెనీ ఒక పోస్టు ద్వారా తెలియజేసింది. After a video of him with his company’s HR head at a Coldplay concert went viral, Andrew Byron, the CEO of U.S. tech company Astronomer, has resigned from his position. The New York-based company shared this information on LinkedIn.#Coldplay #AndrewByron pic.twitter.com/QA6iTGDxqq— Bipin Singh (@bipinsinghreal) July 20, 2025‘‘మా కంపెనీ లీడర్లు నడవడిక, బాధ్యత విషయంలో అత్యున్నత స్థాయి ప్రమాణాలు పాటిస్తారని ఆశిస్తాం. ఇటీవల ఆ స్థాయి ప్రమాణాలను నిలబెట్టుకోలేదు. ఆండీ తన రాజీనామా సమర్పించారు. దీనిని బోర్డ్ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించారు’’ అని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆస్ట్రానమర్ అనేది న్యూయార్క్ కేంద్రంగా నడుస్తున్న ఒక టెక్నాలజీ కంపెనీ.క్రిస్ట్రిన్ క్యాబెట్కు గతంలో వివాహం.. విడాకులు అయ్యాయి. ఆండీ బైరోన్కు వివాహం అయ్యింది. ఆయన భార్య మేగన్ కెరిగన్ బైరోన్.. ఓ ప్రముఖ విద్యాసంస్థకు అసోషియేట్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అయితే ఆండీ వీడియో వైరల్ కావడంతో ఆ కాపురంలోనూ కలతలు చెలరేగినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

పాక్లో వర్ష బీభత్సం.. 200 మంది మృతి
ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వర్షాకాలంలో ముఖ్యంగా జూన్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో పాక్లో భారీ వరదలు సంభవిస్తుంటాయి. ఫలితంగా కొండచరియలు విరిగిపడుతూ, అపారనష్టం వాటిల్లుతుంటుంది.ఇటువంటి విపత్తుల కారణంగా ఇటీవలి కాలంలో 100 మంది పిల్లలతో సహా 200 మందికి పైగా జనం ప్రాణాలను కోల్పోయారని, 500 మందికి పైగా జనం గాయపడ్డారని పాకిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్ఎండీఏ) తెలిపింది.అధికారిక డేటా ప్రకారం పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ అత్యధికంగా 123 మంది మృత్యువాత పడ్డారు. అలాగే ఖైబర్ పఖ్తుంఖ్వాలో 40, సింధ్లో 21, బలూచిస్తాన్లో 16,ఇస్లామాబాద్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఫైసలాబాద్లో వర్షాల కారణంగా గణనీయమైన నష్టం వాటిల్లింది. రెండు రోజుల్లో చోటుచేసుకున్న 33 ఘటనలలో 11 మంది మృతి చెందారు. 450 మి.మీ కంటే అధిక వర్షపాతం నమోదైన చక్వాల్లో 32 రోడ్లు కొట్టుకుపోయాయి. మౌలిక సదుపాయాల నష్టంతో పాటు, కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయాయి. అనేక ప్రాంతాలలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదు.

20 ఏళ్లుగా కోమాలో.. సౌదీ ‘స్లీపింగ్ ప్రిన్స్’ కన్నుమూత
సౌదీ అరేబియా ప్రిన్స్ అల్వలీద్ బిన్ ఖలెద్(36) ఇక లేరు. గత 20 ఏళ్లుగా కోమాలో ఉన్న ఆయన.. శనివారం కన్నుమూశారు. ఈ కారణంగానే సౌదీ అరేబియా స్లీపింగ్ ప్రిన్స్గా ఈయనకంటూ ఓ పేరు ముద్రపడిపోయింది. ప్రిన్స్ అల్వలీద్ బిన్ ఖలెద్ సౌదీ అరేబియా రాజ కుటుంబానికి చెందినవారు. ఆయన ప్రిన్స్ ఖలెద్ బిన్ తలాల్ అల్ సౌద్ పెద్ద కుమారుడు. 2005లో లండన్లోని మిలిటరీ అకాడమీలో చదువుకుంటున్న టైంలో ఖలెద్ కారు ప్రమాదంలో గాయపడ్డాడు. మెదడులో రక్తస్రావం జరిగి.. వెంటిలేటర్పై కోమాలో ఉంటూ ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఖలెద్ కోసం అమెరికా, స్పెయిన్ నుండి నిపుణులు కూడా చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జూలై 20న రియాద్లో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. Statement On the Passing of Prince Alwaleed bin Khaled bin Talal Al Saud pic.twitter.com/st19kxb7lC— Global Imams Council (GIC) (@ImamsOrg) July 19, 2025 View this post on Instagram A post shared by @arabianroyalagency

అమెరికాలో తప్పిన ఘోర విమాన ప్రమాదం
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. డెల్టా ఎయిర్లైన్స్ బోయింగ్ 767 ఇంజిన్లో మంటలు చెలరేగడంతో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. వీడియోలో బోయింగ్ విమానం ఎడమ ఇంజిన్ నుండి మంటలు రావడం కనిపిస్తోంది. అట్లాంటాకు వెళ్లాల్సిన ఈ డెల్టా ఎయిర్ లైన్స్ విమానం లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.❗️Boeing 787 Makes Emergency Landing in LA 🇺🇸 - Engine ON FIRE 🔥Video claims to show a Delta Airlines flight bound for Atlanta on Friday making an emergency landing at LAX. The engine reportedly caught fire shortly after take-off.📹 @LAFlightsLIVE https://t.co/t1HBVLDi0P pic.twitter.com/vYNgkpZJcq— RT_India (@RT_India_news) July 19, 2025శుక్రవారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఇంజిన్ మంటల్లో చిక్కుకున్నట్లు గుర్తించడంతో.. అట్లాంటాకు వెళ్లాల్సిన డెల్టా ఎయిర్ లైన్స్ విమాన్నాన్ని లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఎల్ఏఎక్స్)కి తిరిగి మళ్లించి, అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ విమాన ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, అగ్నిమాపక సిబ్బంది రన్వేపై మంటలను చల్లార్చడంతో ముప్పు తప్పిందని అధికారులు తెలిపారు. ఏవియేషన్ A2Z నివేదిక ప్రకారం ఈ విమానం విమానాశ్రయం నుండి బయలుదేరిన వెంటనే ఇంజిన్లో మంటలు వ్యాపించాయి. విమాన సిబ్బంది అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) విమానాన్ని తిరిగి విమానాశ్రయానికి మళ్లించేలా మార్గనిర్దేశం చేసింది. ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ విమానం దాదాపు 25 సంవత్సరాల క్రితం నాటిది.డెల్టా ఇలాంటి సమస్యను ఎదుర్కోవడం ఈ ఏడాది ఇదేమీ మొదటిసారి కాదు. గత ఏప్రిల్లో ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా విమానం మంటల్లో చిక్కుకుంది. అట్లాంటాకు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో 282 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సహాయకులు, ఇద్దరు పైలట్లు ఉన్నారు. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
జాతీయం

ఎమ్మెల్యే కొడుకుపై అత్యాచార ఆరోపణలు..?
కర్ణాటక: కాబోయే భార్యను అత్యాచారం, మోసం చేశాడని ఆరోపణలు వచ్చిన బీదర్ జిల్లా ఔరాద్ బీజేపీ ఎమ్మెల్యే ప్రభు చౌహాన్ కుమారుడు ప్రతీక్ చౌహాన్ గొడవ ఆ పార్టీ నేతల మధ్య చిచ్చు పెట్టింది. ప్రతీక్ చౌహాన్పై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆమె శనివారంనాడు బెంగళూరులో మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. 2023 డిసెంబరులో తమకు నిశ్చితార్థం అయ్యింది, అప్పటినుంచి కలిసి మెలిసి తిరిగామని పేర్కొంది. తామిద్దరం గదిలో ఉన్నట్లు సాక్ష్యాలను విడుదల చేసింది. నిశ్చితార్థానికి ముందే ప్రతీక్ చౌహాన్ తనను బెంగళూరులోని రేస్కోర్స్ సమీపంలోని హోటల్కు తీసుకొచ్చాడని, అక్కడ ఏకాంతంగా గడిపామని తెలిపింది. మహారాష్ట్రలోని ఓ హోటల్కు కూడా తీసుకెళ్లి లైంగికంగా వాడుకున్నాడని వాపోయింది. చివరకు గొడవలు పుట్టించి పెళ్లి చేసుకోనని వంచించారని ఆరోపించింది. వారి నిశ్చితార్థం ఫోటోలు వైరల్ అయ్యాయి. అంతా కుట్ర: ప్రభుచౌహాన్ ఇదంతా కుట్ర, ఇందులో బీజేపీ మాజీ కేంద్రమంత్రి భగవంత ఖూబా అనుచరుల హస్తం ఉన్నట్టు ప్రభు చౌహాన్ ఆరోపించారు. ఆదివారంనాడు బీదర్లో విలేకరుల భేటీ ఏర్పాటు చేసి మాట్లాడారు. తనపై, కుమారునిపై కుట్రతోనే ఇదంతా చేస్తున్నారన్నారు. యువతికి ఖూబా అనుచరుల అండదండలు ఉన్నాయన్నారు. తన కుమారునికి ఎలాంటి పరీక్షలు అయినా చేసుకోవచ్చని, అతడు అలాంటి వ్యక్తి కాదని అన్నారు.

‘ఎమర్జెన్సీ’ ఎత్తేసిన రోజున..’.. జైశంకర్ యూపీఎస్సీ అనుభవాలు
న్యూఢిల్లీ: ‘అది 1977, మార్చి 12.. దేశంలో అత్యవసర పరిస్థితిని ఎత్తేసిన రోజు.. సరిగ్గా అదే రోజున నా యూపీఎస్సీ ఇంటర్బ్యూ జరిగింది’ అంటూ తన యూపీఎస్సీ జర్నీని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వెల్లడించారు. నాడు తనకు జీవితంలో అగ్ని పరీక్ష ఎదురయ్యిందని న్యూఢిల్లీలో సంకల్ప్ ఫౌండేషన్ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో జైశంకర్ పేర్కొన్నారు. సివిల్ సర్వీసుల్లోకి ప్రవేశించిన కొత్త బ్యాచ్ సభ్యుల సమావేశంలో జైశంకర్ ప్రసంగించారు.విదేశాంగ మంత్రి జైశంకర్ తన యూపీఎస్సీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, దేశంలో అత్యవసర పరిస్థితి రద్దు చేసిన రోజున తనకు యూపీఎస్సీ ఇంటర్య్యూ జరిగిందని తెలిపారు. నాడు తనకు జీవితంలో నిజమైన సవాలు ఎదురయ్యిదని అన్నారు. నాడు ఎమర్జెన్సీని రద్దుచేయడంతో షాజహాన్ రోడ్లో జరిగే ఇంటర్వ్యూ కు హాజరయ్యాను. ఆ రోజు ఇంటర్వ్యూకు హాజరైన తొలి వ్యక్తిని తానేనని ఆయన తెలిపారు. తాను రాజకీయ శాస్త్రం విద్యార్థిని కావడంతో 1977 ఎన్నికల గురించి తనను అడిగారన్నారు. #WATCH | Delhi: "My interview (Civil Services) was on March 21, 1977. That was the day the Emergency was revoked. I go in for an interview at Shahjahan Road, the first person that morning..." says EAM Dr S Jaishankar at Guru Samman and felicitation programme for new entrants in… pic.twitter.com/g5QsmfmdM7— ANI (@ANI) July 20, 2025దీనిసమాధానం ఇస్తున్న తరుణంలో తాను ఇంటర్వ్యూలో ఉన్నాననే సంగతిని మరచిపోయి పలు విషయాలు తెలియజేశానని జైశంకర్ తెలిపారు. తాము 1977 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నామని, అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పనిచేశామని చెబుతూ, విద్యార్థిగా తనకు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్యూ)తో ఉన్న అనుబంధాన్ని జైశంకర్ వివరించారు. కాగా విదేశాంగ కార్యదర్శిగా కూడా పనిచేసిన జైశంకర్.. ప్రభుత్వంతో ముడిపడిన పలు విషయాలను ప్రజలకు తెలియజేయడంలో ఎవరినీ నొప్పొంచకుండా వ్యవహరించడం చాలా కష్టమన్నారు.మోదీ ప్రభుత్వం ఇటీవల అత్యవసర పరిస్థితికి 50 ఏళ్లు గడచిన తరుణాన్ని గుర్తుచేసుకుంటుంది. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1975, జూన్ 25న అత్యవసర పరిస్థితిని విధించారు. 1977 మార్చి 21న దానిని ఎత్తివేశారు.ఈ అత్యవసర పరిస్థితి తర్వాత జనతా పార్టీ 1977 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించింది. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఎన్నికయ్యారు.

కర్నాటకలో 4 వేల ఏళ్ల నాటి ఆవాస ప్రాంతం
రాయచూర్: మానవాళి గతకాలపు జ్ఞాపకాలు, సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టే ప్రాచీన నాగరికత అంటే ఎంతో మందికి మక్కువ. అలాంటి 4,000 ఏళ్లనాటి భారతీయ నాగరికత తాలూకు అవశేషాలు తాజాగా కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో బయటపడ్డాయి. మస్కి పట్టణంలోని మల్లికార్జున కొండ, ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో తవ్వకాలు జరపగా ప్రాచీననాగరికతను తెలిపే రాళ్లసముదాయం బయల్పడింది. వీటితోపాటు ఆనాటి శిల్ప కళాఖండాలు లభించాయి. భారత ప్రాచీన నాగరికత పరంగా మస్కి ఎంతో కీలకమైన ప్రాంతమని మరోసారి నిరూపితమైంది. దశాబ్దాల క్రితం ఇదే మస్కి పట్టణంలో బ్రహ్మీ లిపిలో చెక్కిన అశోకుని కాలంనాటి శిలాశాసనాన్ని గుర్తించారు. ఎనిమిది లైన్ల ఆ శాసనంలో దేవనంప్రియ, ప్రియదర్శి అనే పదాలు అశోకుని మారుపేర్లు అని అప్పట్లో చర్చ జరిగింది. భారత్తోపాటు అమెరికా, కెనడాలకు చెందిన 20 మందితోకూడిన పురాతత్వ పరిశోధకుల బృందం ఈ తవ్వకాలను స్వయంగా పర్యవేక్షించింది. క్రీప్తూపూర్వం 11 లేదా 13వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో మానవుడు నివసించినట్లు ఆధారాల బట్టితెలుస్తోందని పరిశోధనా బృందం తెలిపింది. కళాత్మకమైన వస్తువులు, మట్టి కుండలు, చిన్నపాటి ఉపకరణాలు, పరికరాలు, వంట పాత్రలు ఇక్కడి తవ్వకాల్లో లభించాయని బృందం వెల్లడించింది. అప్పటి ఆచార, సంప్రదాయాలను పాటిస్తూనే ఆనాడు అభివృద్ధి చెందిన సాంకేతికతను ఉపయోగించినట్లు ఇక్కడ లభ్యమైన వస్తువులను బట్టి తెలుస్తోంది. అమెరికాలోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యాపకుడు డాక్టర్ ఆండ్రూ ఎం.బేయర్, కెనడాలోని మెక్గిల్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ పీటర్ జి.జోహాన్సెన్, భారత్లోని శివ్నాడార్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. భారత పురాతత్వ విభాగం(ఏఎస్ఐ) నుంచి పూర్తిస్థాయి అనుమతులు వచ్చాక గత మూడు నెలలుగా విస్తృతస్థాయిలో పరిశీలన తర్వాత ఎంచుకున్న ప్రదేశాల్లో ఈ బృందం తవ్వకాలు మొదలెట్టి సత్ఫలితాలను సాధించింది. తొలుత 271 ప్రాంతాలను తవ్వకాల కోసం ఎంచుకున్నా తుదకు కొన్ని చోట్ల మాత్రమే తవ్వకాలు చేపట్టారు. 4,000 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో చాన్నాళ్లపాటు మానవుడు స్థిరనివాసం ఏర్పర్చుకుని ప్రశాంత జీవనం కొనసాగించినట్లు ఆధారాలను బట్టి తెలుస్తోందని బృందంలోని రీసెర్చర్ కాదంబి చెప్పారు. దక్షిణభారత దేశ ప్రాచీన నాగరికత ఘన చరితకు ఈ ప్రాంతం అద్దంపడుతోందని అన్నారు. తుంగభద్రకు ఉపనది అయిన మస్కీ నదీతీరంలో ఈ మస్కి పట్టణం వెలసింది. మహాసంఘ, మాసంగిపుర అనే పేర్ల నుంచి మస్కి అనే పేరు పుట్టిందని తెలుస్తోంది. 1915లో బ్రిటన్కు చెందిన బంగారు గనుల ఇంజనీర్ సి.బీడన్ ఈ ప్రాంతంలో కలియతిరుగుతూ ఇక్కడి కొండమీది శిలాశాసనాన్ని గుర్తించారు.

నిద్రమాత్రలతో అతడికి ఏమీ కాలేదు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ మహిళ భర్తను చంపేందుకు చేసిన ప్రయత్నాలు తెలిసి పోలీసులే షాకయ్యారు. ఆమె సెల్ చాటింగ్ వివరాలు పోలీసులకు దొరికాయి. అందులో ఆమె..‘అతడికి ఆహారంలో చాలా నిద్రమాత్రలు కలిపి ఇచ్చాను. అయినా ఏమీ కాలేదు..బాగానే ఉన్నాడు. ఇప్పుడిక కరెంట్ షాకివ్వడమొక్కటే దారి. ఎంత సేపు షాకివ్వాలి?’అంటూ ప్రియుడిని సలహా అడిగింది. అందుకా ప్రియుడు..‘ముందుగా అతడి నోటిని, రెండు చేతులను టేప్తో కట్టేసి, ఆ తర్వాత కరెంట్ షాకివ్వాలి’అంటూ దారి చూపడం గమనార్హం. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలోని ఉత్తమ్నగర్కు చెందిన కరణ్(36) భార్య సుశ్మిత, వరుసకు మరిది అయ్యే రాహుల్తో అక్రమ సంబంధం సాగిస్తోంది. వీరిద్దరూ కలిసి కరణ్ను చంపాలని ప్లాన్లు వేస్తున్నారు. ఈనెల 13వ తేదీన మాతా రూప్రాణీ హాస్పిటల్ నుంచి పోలీసులకు కరణ్ అనే వ్యక్తి విద్యుత్ షాక్తో చనిపోయినట్లు సమాచారం అందింది. కరణ్ కుటుంబీకులు తమకు సుశ్మితపై అనుమానం ఉందని, ఆమె రాహుల్తో సన్నిహితంగా ఉంటోందంటూ వివరించారు. పోలీసుల విచారణలో సుశ్మిత దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించింది. ఈ నెల 12న రాత్రి సుశ్మిత సుమారు 15 నిద్రమాత్రలను కరణ్కు వడ్డించిన భోజనంలో కలిపినట్లు తెలిపింది. అయినా కరణ్ చనిపోలేదని రాహుల్కు తెలిపింది. అతడి సలహా మేరకు విద్యుత్షాక్కు గురిచేసింది. చనిపోయాడని నిర్థారించుకున్నాక సమీపంలోని అత్తమామల ఇంటికి వెళ్లి కరణ్ అపస్మారక స్థితిలో ఉన్నాడని తెలిపింది. అంతా కలిసి కరణ్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడు అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. మరణానికి కారణం కరెంట్ షాకని శవపరీక్షలో తేలింది. అదేవిధంగా, కరణ్ సోదరుడు సుశ్మిత–రాహుల్లు ఇన్స్టాలో చేసిన చాటింగ్ వివరాలను పోలీసులకు అందజేశాడు.
ఎన్ఆర్ఐ

టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సింగపూర్ బోనాల జాతర
‘తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)’ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ వేడుకలు ఆదివారం (13 జూలై 2025) సాయంత్రం అత్యంత వైభవంగా జరిగాయి. వర్షం కారణంగా కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ..భక్తులందరూ ఉత్సహంగా పాల్గొని బోనాల పండగని విజయవంతం చేశారు. భాగ్యనగరంలో ఉజ్జయిని మహంకాళి బోనాలు జరిగిన రోజున సింగపూరులో కూడా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సభ్యులు తెలిపారు. ఈ బోనాల వేడుకలను స్థానిక ‘సుంగే కేడుట్’ లోని శ్రీ అరసకేసరి శివాలయంలో ఘనంగా జరుపుకున్నారు.ప్రముఖ సెలెబ్రిటీ సంజయ్ తుమ్మ - వాహ్ చెఫ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంజయ్ తుమ్మ గారి ఆట పాటలతో బోనాల ఊరేగింపులో అందరికీ ఉత్తేజాన్ని కలిగించారు. ఈ బోనాల ఊరేగింపులో పోతురాజులు, పులి వేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో సింగపూర్లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా.. తెలుగు వారందరితో తో కలిపి సుమారు 650 నుండి 750 మంది వరకు భక్తులు పాల్గొన్నారు. బోనాల ఊరేగింపులో అమ్మ వారి భక్తి మరియు బోనాలకు సంబందించిన ప్రత్యేక పాటలకు చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆడిపాడారు. తెలంగాణ మహిళలు భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరికి మహంకాళి తల్లి ఆశీస్సులు ఉండాలని టీసీఎస్ఎస్ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా టీసీఎస్ఎస్ వారు తొలిసారి 2017 లో బోనాల పండుగను నిర్వహించి సింగపూర్ కు ఈ పండుగ ప్రాముఖ్యతని పరిచయం చేసిన రోజులను గుర్తు చేసుకొని సంతోషించారు. మన ఈ తెలంగాణ సంప్రదాయం లో ప్రధాన భూమిక పోషించే బోనాల పండుగతో ప్రేరణ పొంది తెలుగు వారందరు బోనాల వేడుకను జరుపుకోవడం సంతోషకరం అని బోనాల్లో పాల్గొన్న వారు అన్నారు.బోనాల జాతరలో పోతురాజు మరియు పులివేషాలతో జాతరకు కళ తెచ్చిన నేరెళ్ల శ్రీనాథ్, గౌడ లక్ష్మణ్, అయిట్ల లక్ష్మణ్, లక్ష్మిపతి, అరవింద్లకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఈ ఏడాది బోనం సమర్పించిన ఫ్యామిలీస్ లో రమేష్ గడప, వివేక్ బుర్గోజు, శశిధర్ రెడ్డి, నిఖిల్ ముక్కావర్, సందీప్ రెడ్డి పుట్టా, శ్వేత కుంభం, శ్రీనివాస్ గర్రెపల్లి, అలేఖ్య తడిసిన, అలేఖ్య దార, బండ శ్రీ దేవి, అనిత రెడ్డి చాడ, చీర్లవంచ రాజు, మనోహర్ సల్లా, మోతే శ్రీనివాస రెడ్డి, వేముల సురేష్, హర్షిణి కషాబోయినా, రాధాకృష్ణ ఎం.వి.ఎస్., విజయ్ అనూష, దీపా రెడ్డి మండల ఉన్నారు. బోనం సమర్పించిన భక్తులకు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు రిటర్న్ గిఫ్ట్ ను అందచేశారు. అమ్మవారికి బోనం సమర్పించిన భక్తులు ఇంట్లో వండి తెచ్చిన అన్న తీర్థ ప్రసాదాన్ని పంచి సంతోషాన్ని వెలిబుచ్చారు. వీరితో పాటు గడప రమేశ్ అమ్మవారి కోసం తొట్టెలను స్వయంగా పేర్చి తీసుకుకొచ్చారు.బోనాలు పండుగ లో పాల్గొన్న భక్తులందరూ కమిటీ ఏర్పాటు చేసిన అన్న ప్రసాద (పులిహోర , పెరుగు అన్నం మరియు కేసరి ) వితరణలో పెద్ద ఎత్తులో సంతోషంగా పాల్గొని అందరూ అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సింగపూర్ బోనాలు - 2025 పండుగలో పాల్గొని విజయవంతం చేసిన మరియు ఎల్లప్పుడూ సొసైటీ వెన్నంటే ఉండి సహకారం అందిస్తున్న ప్రతీ ఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ మొదలగు వారు మాట్లాడుతూ సొసైటీకి సహాయ సహకారాలు అందిస్తున్న సింగపూర్ లో ఉన్న తెలంగాణ వాసులకు, అందరూ తెలుగు వారికి మరియు స్పాన్సర్స్ కు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు.అందరి పై ఉజ్జయిని మహంకాళీ ఆశీస్సులు ఉండాలని సొసైటి సభ్యులు ఆకాంక్షించారు.ఎలాంటి తొక్కిసలాట జరగకుండా తీసుకున్న జాగ్రత్తలకు సొసైటీ చేసిన ఏర్పాట్లను భక్తులు అభినందించారు. ముఖ్య అతిథి సంజయ్ తుమ్మ - వాహ్ చెఫ్ గారిని సన్మానించి టిసి ఎస్ ఎస్ జ్ఞాపికను వారికి అందజేయడం జరిగింది. సంజయ్ తుమ్మ గారి ఆతిథ్యంలో సహకరించిన సూపర్ డీలక్స్ కిచెన్ యాజమాన్యానికి కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారుఈ వేడుకలకు సహకారం అందించిన సంపంగి రియాలిటి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ.ఎస్.బి.ఎల్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్, గారెంటో అకాడమీ, వజ్ర బిల్డర్స్ బిల్డింగ్ వాల్యూస్, మై హోమ్ గ్రూప్ కంస్ట్రక్షన్స్, అభిరామి జ్యూవెల్లర్స్, ఎవోల్వ్, సూపర్ డీలక్స్ కిచెన్ సరిగమ గ్రాండ్ రెస్టారెంట్ & బిస్ట్రో , జి.ఆర్.టి జ్యూవెల్లర్స్, చంద్రశేఖర్ దోర్నాల, నగేష్ టేకూరి, అజయ్ నందగిరి, పవన్ కుమార్ అంబల్ల, స్వాతి ఖానాపురం తదితరులకు దేవాలయ యాజమాన్యానికి సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ పండుగను యూట్యూబ్లో లైవ్ కవరేజ్ చేసిన సింగపూర్ తెలుగు టీవీ మరియు నిర్వాహకులు రాధాకృష్ణ గణేశ్న గారికి, ఫొటోగ్రఫీ కవరేజ్ చేసిన కృష్ణ నెల్లుట్ల, సౌండ్ సాంకేతికతలో సహకరించిన రజనీకాంత్ మెరుగు, కార్యక్రమంలో సహకరించిన పూర్వ కమిటీ కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్ రాజు కల్వ పండుగ విజయవంతంగా జరగడానికి తోడ్పడిన ప్రతిఒక్కరికి పేరు పేరున కమిటీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.

లక్షల మంది హృదయాల్లో భగవద్గీత జ్ఞానాన్ని నింపిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ
వాషింగ్టన్: గత 65 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా, ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికను పంచుతూ, ఆ శక్తిని, భక్తిని అందరికీ అందించడమే కాకుండా అనేక దేవతా ఆలయాలను భారతదేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో నిర్మించి, మన సనాతన సంప్రదాయాలను పరిరక్షిస్తున్నారు. పరపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. లక్షల మందికి మంత్రోపదేశాలు చేసి వారి జీవితంలో ఆధ్యాత్మిక ప్రగతిని అందించారు శ్రీ స్వామీజీ. శ్రీ కృష్ణ పరమాత్మ మానవాళికి అందించిన భగవద్గీతను ప్రపంచవ్యాప్తంగా వున్న అసంఖ్యాకమైన భక్తులకు ప్రచారం చేస్తూ వారి జీవన మార్గాన్ని సుగమం చేస్తున్నారు శ్రీ స్వామీజీ.అలా పూజ్య స్వామీజీ చూపిన మార్గంలో భగవద్గీతను కంఠస్థం చేసి ఎందరో తమ జీవితాల్లో మార్పును చూస్తున్నారు. మన సనాతన ధర్మం ద్వారా సమసమాజ నిర్మాణానికి అహర్నిశం శ్రమిస్తూ ఆధ్యాత్మికతను సుస్థిరం చేస్తున్న మహనీయులు, అవధూత పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద మహాస్వామీజీ. అంతే కాకుండా గత 10 సంవత్సరాలుగా విశేషంగా భగవద్గీతను అమెరికాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు శ్రీ స్వామీజీ. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరంలో నిర్వహించిన విధంగా పది వేలమంది భక్తులతో అమెరికా దేశంలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ ఫ్రీస్కో నగరంలోని అలెన్ స్టేడియంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని భగవద్గీతను పఠించారు.

లండన్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు
కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుక సంబరాలు అంబరాన్నంటాయి. శుక్రవారం రోజున బండి సంజయ్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని లండన్ ఇల్ఫార్డ్లోని బీజేపీ శ్రేణులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్, స్వీట్లు, పంపిణి మొక్కలు నాటడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టారు.బీజేపీ లండన్ అధ్వర్యంలో ఇల్ఫార్డ్ లోని బండి సంజయ్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, స్వీట్లు, పూల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాటిపల్లి సచిందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ క్షేత్రస్థాయిలో దిగ్విజయనేత అని కొనియాడారు. కార్పొరేటర్ నుండి ఎంపీ, కేంద్రమంత్రి స్థాయికి బండి సంజయ్ ఎదిగిన తీరు కార్యకర్తలకు ఆదర్శం, స్ఫూర్తిదాయకమన్నారు. సరస్వతీ శిశు మందిరం లో విద్యనభ్యసించిన బండి సంజయ్ కుమార్ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని అన్నారు.ఆర్ఎస్ఎస్లో ఘటన్ నాయక్ గా, ముఖ్య శిక్షక్ గా ప్రాథమిక విద్యా స్థాయిలోనే బండి సంజయ్ పని చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో, బిజెపి కరీంనగర్ పట్టణ ఉపాధ్యక్షుడిగా, అధ్యక్షులుగా, జిల్లా , రాష్ట్ర కార్యవర్గాల్లో వివిధ హోదాల్లో బిజెపిలో ఆయన బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ కేరళ, తమిళనాడు రాష్ట్రాల ఇన్చార్జిగా ను ఆయన పని చేశారని, ఎల్కే అద్వానీ చేపట్టిన రథయాత్రలోనూ బండి సంజయ్ కుమార్ భాగం పంచుకున్నారని , 35 రోజులపాటు దేశవ్యాప్తంగా జరిగిన ప్రచారంలో పాల్గొన్నారని తెలిపారు. 1994 _ 2003 మధ్యకాలంలో బండి సంజయ్ కుమార్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా పని చేశారన్నారు.2005లో కరీంనగర్ 48వ డివిజన్ నుండి కార్పొరేటర్గా బండి సంజయ్ విజయం సాధించారని, వరుసగా మూడుసార్లు ఆయన కార్పొరేటర్ గా గెలుపొందారన్నారు.2019 లో కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారని తెలిపారు. అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ కుమార్ పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన సారాధ్యంలో బిజెపి రాష్ట్రంలో పుంజుకుందన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణ వ్యాప్తంగా బండి సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్రతో బీజేపీ గ్రామ గ్రామానికి చేరిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై, వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ, అధికార పార్టీపై తీవ్రస్థాయిలో బండి సంజయ్ కుమార్ విరుచుకుపడ్డారని తెలిపారు.బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో రాష్ట్రంలో జరిగిన దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలు జిహెచ్ఎంసి ఎన్నికలు చరిత్ర సృష్టించాయన్నారు. బండి సంజయ్ దిశా నిర్దేశంలో రాష్ట్రంలో బిజెపి గ్రాఫ్ పెరిగిందన్నారు. అనంతరం బండి సంజయ్ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారని తెలిపారు. కరీంనగర్ చరిత్రలోనే భారీ మెజారిటీతో రెండోసారి బండి సంజయ్ పార్లమెంట్ సభ్యునిగా గెలుపొంది, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారని తెలిపారు. ప్రస్తుతం దేశ, రాష్ట్ర బిజెపి కీలక నేతల్లో బండి సంజయ్ ఒకరని చెప్పారు.ప్రధానంగా కరీంనగర్ పార్లమెంటు సర్వతో ముఖాభివృద్ధి కోసం బండి సంజయ్ కుమార్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, రెండు టర్ములలో పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజారిటి తో గెలుపొంది రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా పనిచేసి కేంద్రమంత్రి గా కొనసాగుతూ స్థానికంగా ప్రజలకి అందుబాటులో ఉంటున్నారని కొనియాడారు ఈ కార్యక్రమం లోఓవర్సీస్ బీజేపీ నాయకులు వాస భరత్, బండ సంతోష్, కోమటిరెడ్డి శివ ప్రసాద్ రెడ్డి, జయంత్, సంజయ్, బద్దం చిన్న రెడ్డి, సురేష్, చార్లెస్, జేమ్స్, ఆంథోనీ తదితరులు పాల్గొన్నారు.

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాల పండుగ వైభవంగా జరిగింది. శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో సుమారు 900 మంది భక్తులతో ఈ వేడుకు ఘనంగా జరిగింది. అంతర్జాలం ద్వారా మరో 7,000 మంది వీక్షించారు. తెలంగాణ జానపద గేయాలు, భక్తిగీతాలు, నృత్యప్రదర్శనలు ఉత్సవానికి విశేష ఆకర్షణగా నిలిచాయి.బోయిన స్వరూప, పెద్ది కవిత, సరితా తులా, దీపారెడ్డి, మోతే సుమతి, గంగా స్రవంతి, సంగీత తదితర మహిళలు కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. మొదటి నుంచి చివరి వరకు సాంప్రదాయభరితంగా, సాంస్కృతిక ఘనతతో కొనసాగిన ఈ కార్యక్రమంలో తెలుగు కుటుంబాలు, కార్మిక సోదరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.మహిళలు, చిన్నారులు ఉత్సాహంతో నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. కాళికా అమ్మవారికి వేపచెట్టు రెమ్మలు, పసుపు, కుంకుమతో అలంకరించి, దీపం వెలిగించిన బోనాలను అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించారు. మట్టి కుండల్లో అన్నం, పాలు, పెరుగు, బెల్లంతో చేసిన బోనాలను తలపై మోస్తూ, డప్పులు, పోతురాజులు, ఆటగాళ్లతో ఆలయానికి తరలివచ్చారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను పంచిపెట్టారు. పెద్దపులి ఆట, పోతురాజు వేషధారణ, సాంస్కృతిక నృత్యాలు కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సింగపూర్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని నిర్వాహకుడు బోయిన సమ్మయ్య తెలిపారు.బోనాలు తెలంగాణకు ప్రత్యేకమైన సాంప్రదాయక పండుగ అని, తక్కువ సమయంలో పెద్ద ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిచారంటూ సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అభినందించారు. ఈ ఏడాది సమాజం సువర్ణోత్సవాలను కూడా ప్రకటించారు. కార్మిక సోదరులు పెద్దఎత్తున హాజరయినందుకు ఉపాధ్యక్షులు పుల్లన్నగారి శ్రీనివాసరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షులు కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి స్పాన్సర్ వజ్ర రియల్ఎస్టేట్కు అభినందనలు తెలిపారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సింగపూర్ తెలుగు సమాజం, అరసకేసరి దేవస్థానం సభ్యులకు, ఆహుతులకు, హాజరైన భక్తులు అందరికీ గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.కోశాధికారి ప్రసాద్, ఉపకోశాధికారి ప్రదీప్, ఉపాధ్యక్షులు నాగేష్, మల్లిక్, కార్యదర్శి స్వాతి, కమిటీ సభ్యులు గోపి కిషోర్, జనార్ధన్, జితేందర్, భైరి రవి, గౌరవ ఆడిటర్లు ప్రీతి, నవత తదితరులు ఈ వేడుకలో భాగం పంచుకున్నారని, తెలుగు వారంతా బోనాల స్ఫూర్తితో పాల్గొని మన ఐక్యతను చాటారని నిర్వాహకులు పేర్కొన్నారు.
క్రైమ్

బరితెగించిన మానవ మృగం! తప్పించుకుని మరో బాలికను రక్షించి..
పట్టపగలే ఓ మానవ మృగం రెచ్చిపోయింది. తన అమ్మమ్మ ఇంటికి వెళ్తున్న ఓ చిన్నారిని ఎత్తుకెళ్లి కాటేసింది. చిన్నారి పారిపోయేందుకు ప్రయత్నించగా.. తీవ్రంగా గాయపరిచింది. అయినా ఆ చిన్నారిని వణికిపోలేదు. ధైర్యం తెచ్చుకుని.. ఎలాగోలా తప్పించుకుంది. అదే దారి వెంట వస్తున్న మరో చిన్నారిని ఆ కిరాతకుడి బారిన పడకుండా రక్షించగలిగింది. తమిళనాడులో హృదయవిదారకమైన ఘటన జరిగింది. తిరువళ్లూరులో పదేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఓ వ్యక్తి ఆ చిన్నారిని వెంబడించి మరీ ఎత్తుకెళ్లి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. తీవ్ర కలకలం రేపిన ఈ పోక్సో కేసులో అనుమానితుడి ఫొటోలను, ఓ వీడియోను జిల్లా పోలీసులు విడుదల చేశారు. అతనికి సంబంధించిన సమాచారం అందించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జులై 12వ తేదీ జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. పదేళ్ల చిన్నారి తన అమ్మమ్మ ఇంటికి ఒంటరిగా వెళ్తోంది. ఆ సమయంలో ఆమెను వెంబడించిన ఓ వ్యక్తి ఎత్తుకెళ్లి సమీపంలోని మామిడి తోటల్లో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, అతను మళ్లీ లాక్కెళ్లి కొట్టాడు. అయితే, ఈలోపు ఆ వ్యక్తికి ఫోన్ కాల్ రావడంతో అతని దృష్టి మరలింది. ఈ అవకాశాన్ని ఉపయోగించి చిన్నారి తప్పించుకుంది. కాస్త ముందుగా వెళ్లగా అదే దారిలో కిడ్నాప్ వైపు వెళ్తూ మరో చిన్నారి కనిపించింది. బాధిత చిన్నారి ఆ బాలిక వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి.. అటు వెళ్లొద్దంటూ అక్కడి నుంచి ఊరిలోకి తీసుకెళ్లింది. ఆపై ఇంటికి చేరి అమ్మమ్మకు జరిగినదాన్ని వివరించింది. బాధిత కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చిన్నారిని వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తమిళనాట దుమారం రేపుతోంది. పౌర సంఘాలతో పాటు విపక్ష పార్టీలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. డీఎంకే పాలనలో మహిళలకే కాదు.. చిన్నారులకూ రక్షణ లేకుండా పోతోందంటున్నాయి. అన్నామలై వర్సిటీ ఘటన, కదిలే రైలులో గర్బిణిపై జరిగిన దారుణాలను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంకోవైపు తిరువళ్లూరు ఘటనలో నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. రన్నింగ్ ట్రైన్లో వచ్చిన నిందితుడు.. బాలికను వెంబడించాడని, ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో నమోదు అయ్యాయని అన్నారు. అతని ఫోన్ రింగ్ టోన్ హిందీ పాట ఉందని బాధిత బాలిక చెప్పిన ఆచూకీతో ఉత్తరాధి నుంచి వచ్చిన వలస కూలీ అయి ఉంటాడని పోలీసులు ఓ అంచనాకి వచ్చారు.The suspect in the photos/video is involved in a heinous crime of sexually assaulting a child. It is requested to communicate any information pertaining to him on 9952060948 pic.twitter.com/QBCdi5mQ2K— Thiruvallur District Police (@TNTVLRPOLICE) July 20, 2025

ఎమ్మెల్యే కొడుకుపై అత్యాచార ఆరోపణలు..?
కర్ణాటక: కాబోయే భార్యను అత్యాచారం, మోసం చేశాడని ఆరోపణలు వచ్చిన బీదర్ జిల్లా ఔరాద్ బీజేపీ ఎమ్మెల్యే ప్రభు చౌహాన్ కుమారుడు ప్రతీక్ చౌహాన్ గొడవ ఆ పార్టీ నేతల మధ్య చిచ్చు పెట్టింది. ప్రతీక్ చౌహాన్పై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆమె శనివారంనాడు బెంగళూరులో మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. 2023 డిసెంబరులో తమకు నిశ్చితార్థం అయ్యింది, అప్పటినుంచి కలిసి మెలిసి తిరిగామని పేర్కొంది. తామిద్దరం గదిలో ఉన్నట్లు సాక్ష్యాలను విడుదల చేసింది. నిశ్చితార్థానికి ముందే ప్రతీక్ చౌహాన్ తనను బెంగళూరులోని రేస్కోర్స్ సమీపంలోని హోటల్కు తీసుకొచ్చాడని, అక్కడ ఏకాంతంగా గడిపామని తెలిపింది. మహారాష్ట్రలోని ఓ హోటల్కు కూడా తీసుకెళ్లి లైంగికంగా వాడుకున్నాడని వాపోయింది. చివరకు గొడవలు పుట్టించి పెళ్లి చేసుకోనని వంచించారని ఆరోపించింది. వారి నిశ్చితార్థం ఫోటోలు వైరల్ అయ్యాయి. అంతా కుట్ర: ప్రభుచౌహాన్ ఇదంతా కుట్ర, ఇందులో బీజేపీ మాజీ కేంద్రమంత్రి భగవంత ఖూబా అనుచరుల హస్తం ఉన్నట్టు ప్రభు చౌహాన్ ఆరోపించారు. ఆదివారంనాడు బీదర్లో విలేకరుల భేటీ ఏర్పాటు చేసి మాట్లాడారు. తనపై, కుమారునిపై కుట్రతోనే ఇదంతా చేస్తున్నారన్నారు. యువతికి ఖూబా అనుచరుల అండదండలు ఉన్నాయన్నారు. తన కుమారునికి ఎలాంటి పరీక్షలు అయినా చేసుకోవచ్చని, అతడు అలాంటి వ్యక్తి కాదని అన్నారు.

నిద్రమాత్రలతో అతడికి ఏమీ కాలేదు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ మహిళ భర్తను చంపేందుకు చేసిన ప్రయత్నాలు తెలిసి పోలీసులే షాకయ్యారు. ఆమె సెల్ చాటింగ్ వివరాలు పోలీసులకు దొరికాయి. అందులో ఆమె..‘అతడికి ఆహారంలో చాలా నిద్రమాత్రలు కలిపి ఇచ్చాను. అయినా ఏమీ కాలేదు..బాగానే ఉన్నాడు. ఇప్పుడిక కరెంట్ షాకివ్వడమొక్కటే దారి. ఎంత సేపు షాకివ్వాలి?’అంటూ ప్రియుడిని సలహా అడిగింది. అందుకా ప్రియుడు..‘ముందుగా అతడి నోటిని, రెండు చేతులను టేప్తో కట్టేసి, ఆ తర్వాత కరెంట్ షాకివ్వాలి’అంటూ దారి చూపడం గమనార్హం. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలోని ఉత్తమ్నగర్కు చెందిన కరణ్(36) భార్య సుశ్మిత, వరుసకు మరిది అయ్యే రాహుల్తో అక్రమ సంబంధం సాగిస్తోంది. వీరిద్దరూ కలిసి కరణ్ను చంపాలని ప్లాన్లు వేస్తున్నారు. ఈనెల 13వ తేదీన మాతా రూప్రాణీ హాస్పిటల్ నుంచి పోలీసులకు కరణ్ అనే వ్యక్తి విద్యుత్ షాక్తో చనిపోయినట్లు సమాచారం అందింది. కరణ్ కుటుంబీకులు తమకు సుశ్మితపై అనుమానం ఉందని, ఆమె రాహుల్తో సన్నిహితంగా ఉంటోందంటూ వివరించారు. పోలీసుల విచారణలో సుశ్మిత దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించింది. ఈ నెల 12న రాత్రి సుశ్మిత సుమారు 15 నిద్రమాత్రలను కరణ్కు వడ్డించిన భోజనంలో కలిపినట్లు తెలిపింది. అయినా కరణ్ చనిపోలేదని రాహుల్కు తెలిపింది. అతడి సలహా మేరకు విద్యుత్షాక్కు గురిచేసింది. చనిపోయాడని నిర్థారించుకున్నాక సమీపంలోని అత్తమామల ఇంటికి వెళ్లి కరణ్ అపస్మారక స్థితిలో ఉన్నాడని తెలిపింది. అంతా కలిసి కరణ్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడు అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. మరణానికి కారణం కరెంట్ షాకని శవపరీక్షలో తేలింది. అదేవిధంగా, కరణ్ సోదరుడు సుశ్మిత–రాహుల్లు ఇన్స్టాలో చేసిన చాటింగ్ వివరాలను పోలీసులకు అందజేశాడు.

పక్కలోకి వస్తేనే సంతకం పెడతా
బెల్లంకొండ: రేషన్ కార్డులో పిల్లల పేర్లు నమోదు చేయాలంటూ వచ్చిన ఓ వివాహితను వీఆర్వో లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. రేషన్ కార్డులో పేర్ల మార్పు చేర్పుల కోసం వివాహిత కొద్ది రోజుల క్రితం దరఖాస్తు చేసింది. వీఆర్వో వెంకయ్య నాగిరెడ్డిపాలెం గ్రామంలో కొన్నేళ్లుగా ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఆఫీసుకు వెళ్లి వచ్చిన తర్వాత ఆ గదిలోనే ఉంటూ అర్జీదారులను అక్కడికే పిలిపించుకుంటూ కార్యకలాపాలు సాగిస్తుంటాడు. వారం రోజుల నుంచి వివాహిత వీఆర్వో వద్దకు వస్తుండగా కాలయాపన చేస్తూ పలుమార్లు తిప్పాడు. తన కోరిక తీరిస్తేనే సంతకం పెడతానంటూ ఆమెను వేధించాడు. దీంతో 2 రోజుల క్రితం వీఆర్వో ఉంటున్న గది వద్దకు వివాహిత వెళ్లి ఆయన వేధింపులను సెల్ఫోన్లో వీడియో తీసి, శనివారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు వీఆర్వోపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై తహశీల్దార్ టీ.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ..ఈ ఘటనను ఉన్నతాధికారులకు తెలియజేసి, వీఆర్వోపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.