మేసీ్త్ర కుమార్తె సన్‌షైన్‌ అవార్డుకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

మేసీ్త్ర కుమార్తె సన్‌షైన్‌ అవార్డుకు ఎంపిక

Apr 14 2025 12:26 AM | Updated on Apr 14 2025 12:26 AM

మేసీ్త్ర కుమార్తె సన్‌షైన్‌ అవార్డుకు ఎంపిక

మేసీ్త్ర కుమార్తె సన్‌షైన్‌ అవార్డుకు ఎంపిక

● ఇంటర్‌ ఫలితాల్లో మెరిసిన కూలీబిడ్డ ● ఈనెల 15న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డు స్వీకరణ

చిత్తూరు కలెక్టరేట్‌ /రొంపిచర్ల : మేసీ్త్ర పనులు చేసుకుంటూ జీవ నం సాగిస్తున్న శివన్న, దేవమ్మ దంపతుల కుమార్తె శ్రావంతి ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించింది. జిల్లాలోని రొంపిచెర్ల కేజీబీవీ (కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయ)లో ఇంటర్మీడియట్‌ సీఈసీ గ్రూపు పూర్తి చేసింది. ఈ నెల 12న విడుదలైన ఫలితాల్లో ఆ విద్యార్థిని 1000 మార్కులకు గాను 935 మార్కులు సాధించింది. పేద కుటుంబంలో జన్మించి ఉత్తమ ఫలితాలు సాధించిన శ్రావంతి రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్న సన్‌షైన్‌ అవార్డుకు ఎంపికై నట్లు జిల్లా సమగ్రశిక్ష ఏపీసీ వెంకట రమణ వెల్లడించారు. పేద కుటుంబంలో జన్మించిన ఆ విద్యార్థిని మట్టిలో మాణిక్యంలా ఉత్తమ ఫలితాలు సాధించడంపై పలువురు అభినందించారు. అవార్డుకు ఎంపికై న ఆ విద్యార్థిని ఈనెల 15వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రి లోకేష్‌ చేతుల మీదుగా విజయవాడలో సన్‌షైన్‌ అవార్డును స్వీకరించనుంది. ఉత్తమ ఫలితాలు సాధించిన కేజీబీవీ విద్యార్థినిని డీఈవో వరలక్ష్మి, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ, టీచర్లు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement