Chittoor District News
-
No Headline
ప్రభుత్వశాఖలు బకాయిలు (రూ.కోట్లలో) మున్సిపాలిటీలు 10 ఆర్డబ్ల్యూఎస్ 2.67 విద్యాశాఖ 1.76 పంచాయతీరాజ్ 1.70 రెవెన్యూ 1.53 మెడికల్ 1.35 ఇరిగేషన్ 91.82 లక్షలు వెల్ఫేర్ 67 లక్షలు అగ్రికల్చర్ 60 లక్షలు ట్రాన్స్పోర్ట్ 31 లక్షలు పోలీసుశాఖ 22.87 లక్షలు -
బకాయిల షాక్
● ప్రభుత్వ కార్యాలయాలకు గుదిబండగా విద్యుత్ బిల్లులు ● 11 శాఖల విద్యుత్ బకాయి రూ.22 కోట్లు ● అత్యధికంగా గ్రామ పంచాయతీ బకాయి రూ.420 కోట్లు చిత్తూరు కార్పొరేషన్ : నిధుల సమస్యతో బిల్లుల చెల్లింపులో జాప్యం నెలకొందని ఆయా శాఖల అధికారులు పేర్కొంటున్నారు. పేదలు గడువులోపు బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ తొలగిస్తారు. గడువు దాటితే అపరాధ రుసుం వసూలు చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోవడం ఏమిటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. 11 శాఖలు రూ.22 కోట్లు జిల్లాలో ప్రధానంగా 12 శాఖల ద్వారా రూ.22 కోట్ల బకాయిలు జనవరి నెల వరకు ఉంది. ఇందులో మున్సిపాలిటీలు అధికంగా ఉన్నాయి. ఎక్కువగా పలమనేరు మున్సిపాలిటీ నుంచి రూ.3.76 కోట్లు రావాల్సి ఉంది. ఆ తర్వాత జిల్లా గ్రామీణ నీటి సరఫరాశాఖ (ఆర్డబ్ల్యూఎస్), విద్యాశాఖ, పంచాయతీరాజ్, రెవెన్యూశాఖలు ఉన్నాయి. ఆరు నెలలుగా నిధులు సమస్యలు ఎదురవుతున్నాయని అందుకే సకాలంలో బిల్లులు చెల్లించలేకపోతున్నామని ఆయా ప్రభుత్వ కార్యాలయాల అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ శాఖ బకాయిలు వసూలు తప్పనిసరిగా చేయాలని గతంలో ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. నష్టాల పేరుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అయిదు నెలల్లోనే విద్యుత్ చార్జీలు పెంచింది. అయితే ప్రభుత్వ శాఖ విద్యుత్ బకాయిలకు నిధులు సకాలంలో విడుదల చేయడం లేదు. వీటిని వసూలు చేయడంలో అధికారులు నామ మాత్రపు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీల బకాయిలు రూ.420 కోట్లు చిత్తూరు జిల్లాలో మొత్తం 697 పంచాయతీలున్నాయి. కొన్నినెలలుగా మేజర్ పంచాయతీల పరంగా రూ.38.9 కోట్లు, మైనర్ పంచాయతీల పరంగా రూ.381.46 కోట్లు బకాయిలు ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు సర్కార్ స్మార్ట్ మీటర్లను బిగిస్తోంది. ఇది పూర్తి స్థాయిలో అమలయ్యాక తర్వాత ప్రీపెయిడ్ మీటర్గా మార్చనున్నారు. అప్పుడు రీచార్జ్ చేసుకుంటేనే కార్యాలయాలకు కరెంటు వస్తుంది. అంటే ఈ వందల కోట్లు బకాయిలు కొరకరాని కొయ్యగా విద్యుత్శాఖ నెత్తి మీద పడనుంది. సామాన్యుడు బిల్లు కట్టడం ఆలస్యమైతే ఇంటికెళ్లి ఫ్యూజ్ తీసుకొని నానా తిప్పలు పెట్టడం సిబ్బందికి అలవాటు. మరీ ప్రభుత్వ శాఖలపై ఎందుకు కనీస చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. డిమాండ్ నోటీసులు ఇస్తున్నాం జిల్లాలోని వివిధ శాఖల విద్యుత్ బకాయిలు రూ.22 కోట్లకు చేరాయి. ఎక్కువగా పంచాయతీ బకాయిలు రూ.420 కోట్ల వరకు ఉంది. వీటి వసూలుకు తగిన చర్యలు చేపట్టాం. ఈ బిల్లులను వీలైనంత త్వరగా చెల్లించి సంస్థ అందించే మెరుగైన సేవల్లో భాగస్వాములు కావాలి. ప్రతి నెలా డిమాండ్ నోటీసులు ఇచ్చి, బిల్లులు చెల్లించాలని కోరుతున్నాం. – ఇస్మాయిల్ అహ్మద్, ఎస్ఈ , ట్రాన్స్కో -
అయ్యా.. నాబిడ్డను కాపాడండి!
వైద్యానికి డబ్బులేదని ఆవేదన చెందుతున్న తల్లి పలమనేరు : కొన్నేళ్ల కింద ట ఇంటి నుంచి వెళ్లిపోయి హైదరాబాదులో మతిస్థిమితం లేక అక్కడి ఓ అనాథశ్రయంలో ఉంటూ ఇటీవల సోషల్ మీడియా ద్వారా ఇంటికి చేరిన బైరెడ్డిపల్లి మండలం రామనపల్లికి చెందిన జగన్నాథగౌడు విషయం తెలిసిందే. వా రం రోజుల కిందట దాతల సాయంతో స్వగ్రామానికి చేరుకున్న ఇతను అప్పటి నుంచి తీవ్ర అనారోగ్యానికి గురైయ్యాడు. దీంతో అతని తల్లి లక్షుమమ్మ బైరెడ్డిపల్లి పీహెచ్సీకి శుక్రవారం తీసుకెళ్లింది. జగన్నాథగౌడను పరిశీలించిన అక్కడి వైద్యులు అతడికి హెచ్బీ 2.7 ఉన్నందున వెంటనే ఏదైనా పెద్దాసుపత్రిలో వెంటనే రక్తం ఎక్కించాలని సూచించారు. అయితే కుప్పం పీఈఎస్ లేదా ఇతర ఆస్పత్రులకు వెళ్లేందుకు కనీసం చార్జీలకు కూడా డబ్బులు లేవని తల్లి ఆవేదన చెందుతోంది. ఎవరైనా దాతలు తన బిడ్డ బతికేందుకు సాయం చేయాలని వేడుకుంటోంది. శాపంలా మారిన పేదరికం... గ్రామానికి చెందిన లక్ష్ముమమ్మ భర్త క్రిష్ణప్పగౌడు 24 ఏళ్ల కిందట మృతి చెందాడు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు వాసు ఇంటర్ దాకా చదివి తల్లికి సాయంగా ఓ పాడి ఆవును మేపుకుంటూ కుటుంబానికి ఆసరాగా మారాడు. ఉండేందుకు ఇల్లు లేక అద్దెఇంట్లో ఉంటున్నారు. ఇతని సోదరుడే జగన్నాథగౌడు సైతం ఇంటర్ దాకా చదివి ఆపై హైదరాబాదులో ఉద్యోగం కోసం వెళ్లి మానసిక సమస్యతో అక్కడే కొన్నేళ్లుండిపోయాడు. ఎట్టకేలకు ఇటీవల మళ్లీ సోషల్ మీడియా ద్వారా స్వగ్రామానికి వచ్చాడు. ఇప్పుడు అనారోగ్యానికి గురై చావుబతులకు మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. రేషన్కార్డులో జగన్నాథగౌడు పేరు లేనందున ఆరోగ్యశ్రీ సైతం వర్తించడం లేదు. ఎవరైనా దాతలు కనీసం ఆస్పత్రి ఖర్చులకై నా సాయం చేయాలని ఆ తల్లి ప్రాధేయపడుతోంది. మనసున్న దాతలు సాయం చేయదలిస్తే ఇతని అన్న వాసు 97049 30278 నంబరును సంప్రదించాలని కోరుతున్నారు. -
అమ్మగీసిన..అపురూపం
● జిల్లా కేంద్రంలోని సంసిద్ధ్ క్యాంఫోర్డ్లో కవలల సమూహం ● కవలల జన్మ ఓ ప్రత్యేకం ● నేడు అంతర్జాతీయ కవలల దినోత్సవం చిత్తూరు కలెక్టరేట్ : ఒకే ప్రసవంలో ఒక్కరి కన్నా ఎక్కువ మంది జన్మిస్తే వారిని కవలలుగా.. ఒకే గర్భం నుంచి జన్మించిన ఇద్దరు పిల్లలు కవలలే.. కవలల జన్మ ఓ ప్రత్యేకం. ఒకే రోజు నిమిషాల వ్యవధిలో తల్లి గర్భం నుంచి కవలలుగా జన్మించి సంబ్రమాశ్చర్యం కలిగించటం చూస్తూనే ఉంటాం. వారిలో ఎవరు చిన్న, ఎవరు పెద్ద తెలుసుకోవటానికి తికమక పడతాం. అలాంటి కవలలను కన్న తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. కవలలకు ఒకేలా దుస్తులు, స్కూల్ యూనిఫామ్ వేస్తే వారిని అడిగి తెలుసుకుంటే తప్ప గుర్తించలేం. అంతగా దగ్గరి పోలికలతో ఉంటారు. కవలల దినోత్సవం మొట్టమొదట పోలెండ్లో 1976 లో జరుపుకున్నారు. పోలెండ్లో జన్మించిన మోజస్, ఆరన్ విల్కాక్స కవల సోదరులు మరణించిన రోజును అంతర్జాతీయ కవలల దినోత్సవంగా ఏటా ఫిబ్రవరి 22న జరుపుకుంటున్నారు. కళ్లెదుట అనేక మంది కవలలను చూస్తుంటాం. వారిలో కొంత మందిపై కథనం.అందరూ ఒకే ఫ్రేమ్లో... ఒకే కాన్పులో పుట్టిన కవలలు అపురూపంగా ఉంటారు. చూసేవారిని తికమక పెడుతారు. వారి ఆలోచనలు, అభిరుచులు ఒక్కటిగానే ఉంటాయి. కొందరిని అస్సలు గుర్తుపట్టడం అంత తేలికకాదు. కవలల దినోత్సవం సందర్భంగా చిత్తూరు సంసిద్ధ్ క్యాంఫోర్డ్ పాఠశాలలో 24 కవలల జంటలు ఒకే ఫ్రేమ్లో కనువిందు చేశారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల కరస్పాండెంట్ మహేష్, అధినేత శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఒకే రూపంలో ఉండే కవలలు ఒకే పోలికతో సమరూప, సహజాత కవలలు అనిపించుకుంటున్నారన్నారు. అనంతరం కవలల విద్యార్థులకు ఆ పాఠశాలలో శుక్రవారం క్రీడా పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. -
గుర్తుపట్టడం కష్టమే
చిత్తూరు రూరల్ పీబీ అగ్రహారానికి చెందిన నీరజాక్షులు, శకుంతల దంపతులకు భావన, భవిష్య అనే కవలలున్నారు. ముచ్చట గొలిపేలా వీరిద్దరు యూనిఫాంతో స్కూల్కు వెళ్తుంటే గుర్తించేందుకు పలువురు తికమక పడుతుంటారు. అలాగే పాఠశాల ఉపాధ్యాయులు, స్నేహితులు కూడా ఒక్కసారిగా చూస్తే గుర్తించడం కష్టమేనని చెప్పాలి. ప్రస్తుతం వీరిద్దరూ 6వ తరగతి చదువుతున్నారు. – భావన, భవిష్య ఒకరంటే మరొకరికి ప్రేమ నగర సరిహద్దులోని దొడ్డిపల్లిలో ఉంటున్న కిశోర్కుమార్, నదియ దంపతుల కుమార్తెలు ప్రవీణ, ప్రీతి కవలలు. వీరు ఒకరికి ఒకరు ప్రతిరూపంగా కనిపిస్తారు. ఒకరిని వదిలి ఇంకొకరు ఉండలేరు. అభిప్రాయాలు, ఇష్టాలు, అభిరుచులు అన్నీ ఒకే తీరుగా ఉంటాయి. ఒకరంటే ఒకరు అవాజ్యమైన ప్రేమ కనబరిచే వీరిద్దరు నాలుగో తరగతి చదువుతున్నారు. – ప్రవీణ, ప్రీతి -
భక్తుడికే తొలి పూజ!
● శ్రీకాళహస్తీశ్వరాలయంలో అంగరంగ వైభవంగా భక్తకన్నప్ప ధ్వజారోహణం ● తరలివచ్చిన భక్తజనం శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం కన్నప్ప ధ్వజారోహణంతో ఆగమోక్తంగా అంకురార్పణ చేపట్టారు. తొలి పూజను భక్తునికే చెందేలా శివుడు వరమిచ్చాడు. ఈ క్రమంలో భక్తకన్నప్ప ధ్వజారోహణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అలంకార మండపంలో స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. భక్తుడైన కన్నప్ప ఉత్సవమూర్తికి అభిషేక పూజలు నిర్వహించారు. ముక్కోటి దేవతలకు ఆహ్వానం కన్నప్ప ఉత్సవమూర్తిని మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ కొండపైకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. కొండపై వెలసిన కన్నప్ప ఆలయం వద్ద ఉత్సవమూర్తిని కొలువుదీర్చి గణపతి పూజ, పుణ్యాహ వచనం, మండప ఆరాధన, ధ్వజపూజ నిర్వహించారు. అనంతరం ధర్బ, మామిడాకులతో కట్టి తెల్లదారంతో దవళపతాకం, హారాన్ని ఎగురవేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ముల్లోకాల్లోని ముక్కోటి దేవతలకు సంకల్ప పూజతో వేదపండితులు శాస్త్రోక్తంగా ఆహ్వానం పలికారు. సంప్రదాయం..నైవేద్య సమర్పణం తర్వాత కన్నప్ప ఉత్సవమూర్తిని తిరిగి ఆలయం వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి సన్నిధి వీధిలో ఉభయదారులైన బోయ కులస్థులు ఏర్పాటు చేసిన విడిదిలో కొలువుదీర్చారు. బోయలు సంప్రదాయం ప్రకారం వస్త్రం, నైవేద్యం సమర్పించారు. అక్కడి నుంచి గ్రామోత్సవం ప్రారంభంమైంది. రాజగోపురం నుంచి చతుర్మాడ వీధీల్లో కన్నప్ప గ్రామోత్సవం వైభవంగా జరిగింది. శాస్త్రోక్తంగా వాస్తు శాంతి పూజలు శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం రాత్రి వాస్తుశాంతి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. గ్రామోత్సవం ముగిసిన తర్వాత ఆలయంలో వేదపండితులు గణపతి హోమం చేపట్టారు. అలాగే ఆలయానికి వాస్తు శాంతి హోమం నిర్వహించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి తల్లి బృందమ్మ, ఈవో బాపిరెడ్డి పాల్గొన్నారు. -
మొక్కుబడిగా చైర్మన్ పర్యటన
– సమస్యల పరిష్కారంపై నోరు మెదపని వైనం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఏపీ మాల వెల్ఫేర్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ విజయకుమార్ పర్యటన మొక్కుబడిగా సాగింది. సమావేశం మమ అనిపించేలా నిర్వహించి కలెక్టర్ను కలిసి వెళ్లిపోయారు. ఎస్సీ కార్పొరేషన్ను బలోపేతం చేస్తాం ఎస్సీ కార్పొరేషన్ను బలోపేతం చేసి ఎస్సీలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర మాల వెల్ఫేర్ కో ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్ విజయకుమార్ అన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2047లో ఎస్సీ కుటుంబాల నుంచి పారిశ్రామిక వేత్తలను తయారు చేస్తామన్నారు. మాల సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని చైర్మన్ అన్నారు. సలహాలు, సూచనలు తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 1000 యూనిట్లు అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చిన్నయ్య, డైరెక్టర్లు బాబు, కుమారి, యుగంధర్, డీవీఎంసీ సభ్యులు రాజ్కుమార్, మునస్వామి, వరలక్ష్మి పాల్గొన్నారు. -
రైలు ఢీకొని విద్యార్థి దుర్మరణం
పుత్తూరు : రైలు ఢీకొన్న ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి చెందిన ఘటన గురువారం రాత్రి పుత్తూరు రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకొంది. రైల్వే ఎస్ఐ రవి కథనం మేరకు.. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం అంజూరు గ్రామానికి చెందిన ఎం.బాలాజీ (20) పుత్తూరు బీసీ హాస్టల్లో ఉంటూ.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. రైల్వే స్టేషన్ సమీపంలోనే హాస్టల్ ఉండడంతో గురువారం రాత్రి 8 గంటల సమయంలో పట్టాలు దాటుతుండగా రేణిగుంట నుంచి చైన్నె వెళుతున్న కొల్లాం ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లోకో పైలట్ రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. డివైడర్ను ఢీకొన్న బైక్ – ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు తవణంపల్లె : మండలంలోని తిరుపతి– బెంగుళూరు హైవేలో తెల్లగుండ్లపల్లె సమీపంలో డాబా వద్ద అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొనడంతో ముగ్గురు గాయపడినట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కిరణ్కుమార్ (11) చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. ఎస్ఐ కథనం మేరకు తిరుపతికి చెందిన వినయ్, కిరణ్కుమార్, నిరూప ముగ్గురూ ద్విచక్ర వాహనంలో వస్తుండగా వినయ్ వేగంగా ద్విచక్ర వాహనం నడిపి డివైడర్ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కిరణ్కుమార్ తలకు తీవ్రమైన గాయం కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. బైక్ నడుపుతున్న వినయ్, కిరణ్కుమార్ తల్లి నిరూప కూడా గాయపడ్డారు. మృతుడు కిరణ్కుమార్ తల్లి నిరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మద్యం స్వాధీనం బంగారుపాళెం : మండలంలోని తుంబకుప్పంలో శుక్రవారం అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మునిరత్నంరెడ్డి తన ఇంటి వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు సిబ్బందితో కలసి దాడి చేసినట్లు పేర్కొన్నారు. అతడి వద్ద నుంచి 30 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
అందరూ తికమకే..
చిత్తూరు నగరంలోని రామమూర్తి కుమార్తెలు దాక్షిత, దాక్షికలను చూస్తే అందరూ తికమకపడాల్సిందే. ఒకేలా ఉండటమే కాకుండా ఒకే అభిరు చులు, ఇష్టాలతో అందరినీ తికమక పెట్టేస్తుంటారు. ఒకే రూపుతో ఆకట్టుకునే ఈ అక్కాచెల్లెళ్లలో తల్లిదండ్రులు ఒకరి కోసం ఏ వస్తువు కొన్నా మ రొకరికి అదే కొనాల్సిందే. అది కూడా ఒకే డిజైన్తో ఉండాల్సిందే. డ్రస్సు లు, ఆభరణాలు, ఆట వస్తువులు ఇలా ఇద్దరికీ ఒకేలా ఉన్నవే కొనాలి. లేకపోతే ఆ రోజు గొడవే. జ్వరం వచ్చినా, జబ్బు చేసినా ఇద్దరికీ ఒకేసారి వస్తుంది. భోజనం, అల్పాహారం ఇద్దరి ప్లేట్లలో ఒకేలా ఉండకపోతే ఏడ్చేస్తారు. పాఠశాలకు ఒకరు డుమ్మా కొడితే మరో అమ్మాయి పోనని మారం చేస్తుంది. ఏ పనిచేసినా ఇద్దరూ ఒకేలా చేస్తుండడమే ఇందుకు కారణమని తల్లిదండ్రులు తెలిపారు. – దాక్షిత, దాక్షిక -
రేపటి నుంచి మొగిలీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
బంగారుపాళెం : మండలంలోని మొగిలి గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీకామాక్షి సమేత మొగిలీశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ కార్యనిర్వహణాధికారి మునిరాజ, ధర్మకర్త విజయకుమార్ తెలిపారు. 23వ తేదీ నుంచి మార్చి 5వ తేదీ వరకు 11 రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. మొగిలీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా 23న అంకురార్పణ, రాత్రి మూషిక వాహనంపై వినాయ కోత్సవం, 24న కలశస్థాపన, ధ్వజారోహణం, రాత్రి హంస వాహన సేవ, 25న అభిషేకం, అధికార నంది వాహనం, రాత్రి సింహ వాహన సేవ, 26న మహాశివరాత్రి ప్రత్యేక పూజలు, రాత్రి లింగోద్భవ అభిషేకం, వృషభ వాహన సేవ, 27న కై లాసగిరి రావణ బ్రహ్మ వాహనం, రాత్రి శేష వాహనం, 28న గజవాహనం, రాత్రి కామధేను వాహనం, మార్చి 1వ తేదీ అభిషేకం, బృంగి వాహనసేవ, సాయంత్రం కల్యాణోత్సవం, రాత్రి అశ్వవాహన సేవ, 2న తోపు ఉత్సవం, అభిషేకం, బ్రహ్మ రథోత్సవం, 3న ఉదయం అభిషేకం, రాత్రి పుష్ప పల్లకి సేవ, 4న సూర్యప్రభ వాహనం, సాయంత్రం వసంతోత్సవం, త్రిశూల స్నానం, ధ్వజా రోహణం, రాత్రి చంద్ర ప్రభ వాహనం, శయనోత్సవం, 5న అభిషేకం, రాత్రి తెపోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. పరమశివుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ మొగిలీశ్వరస్వామి, కామాక్షమ్మ వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. -
కుప్పం డిపో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
కుప్పం : రాష్ట్ర ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారక తిరులమలరావును శుక్రవారం విజయవాడలో ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ అభివృద్ధిపై చర్చించినట్లు తెలిపారు. అదే విధంగా కుప్పం ఆర్టీసీ డిపో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేసినట్లు, దీన్ని పరిగణలోకి తీసుకొని కుప్పం ఆర్టీసీ అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు తెలిపారు. ఆయన వెంట మాజీ తిరుపతి గంగమ్మ ఆలయ చైర్మన్ బి.ఎం.కె.రవిచంద్రబాబు పాల్గొన్నారు. స్కూటర్ నుంచి పొగలు.. తప్పిన ప్రమాదం చిత్తూరు అర్బన్ : చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఓ స్కూట ర్ నుంచి పొగలు రావడంతో స్థానికులు ఆందోళన ప డ్డారు. ఆస్తి పన్ను చెల్లించడానికి ఓ మహిళ శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చారు. అనంతరం స్కూటర్ తీయడానికి వస్తుండగా ఉన్నట్టుండి లోపల నుంచి పొగలు వ్యాపించాయి. దీంతో కార్పొరేషన్ సి బ్బంది నీళ్లు పోసి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. దీంతో ప్రమాదం తప్పింది. వేడికి స్కూటర్లో వైర్లు షార్ట్ సర్క్యూట్ అయినట్లు తెలిసింది. వక్ఫ్ ఇన్స్పెక్టర్పై కేసు నమోదు అభ్యంతరకరం సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా వక్ఫ్ ఇన్స్పెక్టర్పై పోలీస్ కేసు నమోదు చేయడంపై అభ్యంతర వ్యక్తం చేస్తూ ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ రాష్ట్ర డీజీపీకు శుక్రవారం లేఖ రాశారు. చిత్తూరులోని ఇక్తేదార్ అలీ ఖాన్ షాహిద్ దర్గాకు చెందిన వక్ఫ్ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించారని, ఆక్రమణదారులకు వక్ఫ్ చట్టం 1995 ప్రకారం నోటీసులు జారీచేసినట్టు తెలిపారు. ఆక్రమణదారులపై వక్ఫ్ ఇన్స్పెక్టర్ చిత్తూరు ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారని అన్నారు. ఈ ఫిర్యాదును పట్టించుకోకుండా, కబ్జాదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని తప్పుబట్టారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. వక్ఫ్ ఆస్తులను అనధికారికంగా ఆక్రమించి, అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసే విధంగా జిల్లా ఎస్పీని ఆదేశించాలని సూచించారు. ఇరువర్గాల ఘర్షణ – ముగ్గురికి తీవ్రగాయాలు గుడిపాల : ఇరువర్గాల ఘర్షణలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు వివరాలు.. చింతగుంటూరు గ్రామానికి చెందిన విజయప్రసాద్రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి బంధువులు. విజయప్రసాద్రెడ్డి ఇంటి వద్ద ప్రహరీ నిర్మించేందుకు పూడికతీత పనులు చేపట్టారు. ఇక్కడ తనకు సంబంధించి భూమి ఉందంటూ సుబ్రమణ్యంరెడ్డి అడ్డు చెప్పాడు. దీంతో ఇరువురు పోలీస్స్టేషన్కు వెళ్లి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు గుడిపాల తహశీల్దార్ కార్యాలయానికి ఇద్దరిని పంపించగా వెంటనే మండల సర్వేయర్ సంఘటనా స్ధలానికి వెళ్లారు. భూమికి సంబంధించిన రికార్డులను సుబ్రమణ్యంరెడ్డి చూపించారు. విజయప్రసాద్రెడ్డి చూపించలేకపోవడంతో 23వ తేదీకి తిరిగివస్తామని సర్వేయర్ చెప్పి వెళ్లిపోయారు. ఇంతలో ఇరువురికి మాటామాట పెరిగి ఘర్షణకు దిగారు. ఇందులో విజయప్రసాద్రెడ్డి(60), కస్తూరి(55), గోపి(45) గాయపడ్డారు. వెంటనే చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ ద్వారా చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మాతృభాషా దినం.. మరిచిన వర్సిటీ అధికారులు
– ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భాషాభిమానులు కుప్పం : ద్రావిడ భాషల పరిరక్షణకు ప్రత్యేకంగా ఎంతో ఉన్నతాశయంతో కుప్పంలో ఏర్పాటు చేసిన ద్రావిడ విశ్వవిద్యాలయంలో మాతృభాషా దినోత్సవాన్ని విస్మరించారు. శుక్రవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా అన్ని విద్యాలయాల్లో విద్యార్థులకు మాతృభాషపై అవగాహన కల్పిస్తారు. అయితే ఉన్నత విద్యాలయమైన ద్రావిడ వర్సిటీలో మాత్రం ఇందుకు భిన్నగా మారింది. చిన్న, పెద్ద భాషలన్నింటిని రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మన జీవ వైవిధ్యం కాపాడుకోగలుగుతామన్న ఉద్దేశంతో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడకలను జరుపుకుంటారు. విద్యార్థి దశ నుంచే మాతృభాషా ప్రాముఖ్యంపై అవగాహన కల్పించాల్సిన వర్సిటీ అధికారులు అసలు మాతృభాషా దినోత్సవాన్నే విస్మరించారు. దీనిపై భాషాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశ్వంలో సైనిక్ ఉచిత నమూనా పరీక్ష రేపు తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి వరదరాజ నగర్లోని విశ్వం విద్యాసంస్థలో ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఉచితంగా సైనిక్ నమూనా ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆ మేరకు ఆ విద్యాసంస్థ అధినేత డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. సైనిక్ స్కూల్లో 6, 9 తరగతుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఏప్రిల్ 5వ తేదీన నిర్వహించే ప్రవేశ పరీక్షకు అనుగుణంగా నమూన పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే సైనిక్ ప్రవేశ పరీక్ష, పరీక్షా విధానం తదితర అంశాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు 86888 88802, 93999 76999నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. 23న గంటా కమలమ్మ సాహితీ పురస్కారం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈనెల 23వ తేదీన గంటా కమలమ్మ సాహితీ పురస్కారం నిర్వహించనున్నట్లు ట్రస్టు నిర్వాహకులు గంటామోహన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 23వ తేదీ నగరంలోని మిట్టూరులో ఉన్న విజయం డిగ్రీ కళాశాలలో ఉదయం 9 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గంటా కమలమ్మ స్మారక కవితా పురస్కారం–2024 పోటీల్లో ఎంపికై న ‘నాలుగు రెక్కల పిట్ట (సాంబమూర్తి లండ (శ్రీకాకుళం), చింతల తొవ్వ’ (తుల శ్రీనివాస్, నల్గొండ)కు పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ పురస్కారాల పోటీలకు ఉభయ రాష్ట్రాల నుంచి 35 కవితా సంపుటాలు వచ్చినట్లు చెప్పారు. న్యాయనిర్ణేతలుగా ప్రముఖ సాహితీవేత్తలు డాక్టర్ రాధేయ (అనంతపురం), ఆచార్య డాక్టర్ రఘు (ఉస్మానియా యూనివర్శిటీ, హైదరాబాద్) వ్యవహరించారన్నారు. పురస్కార గ్రహీతలకు రూ.10 వేల నగదు, జ్ఞాపికతో సత్కరించనున్నట్లు తెలిపారు. సమష్టి కృషితోనే పీవీకేఎన్కు నాక్ ‘ఏ’ గ్రేడ్ చిత్తూరు కలెక్టరేట్ : అందరి సమష్టి కృషితోనే పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నాక్ ‘ఏ’ (3.13 సీజీపీఏ) గ్రేడ్ వచ్చిందని ఆ కళాశాల ప్రిన్సిపల్ డా.జీవనజ్యోతి అన్నారు. శుక్రవారం ఆ కళాశాలలో నాక్ ‘ఏ’ గ్రేడ్ సర్టిఫికెట్ను ఆవిష్కరించి, అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఎంతో చరిత్ర కలిగిన పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రెండవసారి నాక్ ఏ గ్రేడ్ లభించడం గర్వకారణమన్నారు. గ్రేడ్ సాధనకు అధ్యాపక బృందం ప్రణాళికతో కష్టపడ్డారని అభినందించారు. భవిష్యత్త్లో పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల యూనివర్శిటీ అయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. అనంతరం ప్రిన్సిపల్, అధ్యాపకులు నాక్ ఏ గ్రేడ్ సర్టిఫికెట్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ మీరాసాహెబ్, సీనియర్ అధ్యాపకులు హరిప్రసాద్ , శరవణ, గోపినాయక్, భాను, పలువురు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో 30 కంపార్ట్మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 59,776 మంది స్వామివారిని దర్శించుకోగా 22,386 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.24 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
ముగిసిన లక్ష కుంకుమార్చన
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో మాఘమాసం నెలలో అత్యంత వైభవంగా నిర్వహించే లక్ష కుంకుమార్చన పూజలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛరణాల మధ్య ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ మూర్తికి ప్రత్యేక పూజలు చేసి దంపతులకు పూజా సామగ్రి అందజేశారు. అమ్మవారి ఉత్సవమూర్తి ఎదుట ప్రత్యేక పూజలు, గణపతి, చండీ హోమం, పూర్ణాహుతి, మహా మంగళహారతి చేశారు. 145 మంది దంపతులు హాజరై కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయంలో రద్దీ నెలకొంది. లక్ష కుంకుమార్చన పూజలో పెద్దిరెడ్డి సతీమణి బోయకొండ గంగమ్మ ఆలయంలో మూడు రోజులు గా జరుగుతున్న లక్ష కుంకుమార్చన కార్యక్రమానికి మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి స్వర్ణమ్మ శుక్రవారం హాజరై పూ జలు చేశారు. అనంతరం ఈఓ అమ్మవారి తీర్థ ప్రసాదాలతో పాటు జ్ఞాపికను అందజేసి సత్కరించారు. -
బింబం, ప్రతిబింబం..
చిత్తూరు నగరానికి చెందిన న్యాయ వాది కృష్ణకిశోర్, మంజులరాణి దంపతులకు జన్మించిన అర్జున్, అంజన్ అందరినీ ఆకర్షిస్తున్నారు. ఒకే ముఖ కవళికలతో కన్పిస్తుంటారు. బింబ, ప్రతిబింబాలుగా నిలుస్తారు. వారి అభిలాష ఒకే విధంగా ఉంటాయి. వీరిద్దరి అభిరుచులు దాదాపు ఒకటిగానే ఉంటాయి. ఎంతో చలాకీగా ఉంటారు. ఈ ఇద్దరి జన్మదినం కూడా కవలల దినోత్సవం రోజునే కావడం మరో విశేషం. ప్రస్తుతం వీరిద్దరూ 8వ తరగతి చదువుతున్నారు. – అర్జున్, అంజన్ నగరంలోని చంద్రశేఖర్, లక్ష్మిదేవి దంపతులకు బబిత, భవిష్య కవలలున్నారు. అల్లరిలో వారి ఇద్దరూ ఇద్దరే. ఎక్కడికెళ్లినా ఇద్దరినీ తీసుకెళ్లాల్సిందే. ఏది తెచ్చినా ఇద్దరికీ తీసుకురావాల్సిందే. ఇద్దరూ ఒకే రకమైన ఆహారాన్ని ఇష్టపడుతారు. వీరిని పోల్చుకునేందుకు తల్లిదండ్రులు తంటాలు పడుతుంటారు. పాఠశాలలో ఇద్దరినీ గుర్తుపట్టలేక టీచర్లు తికమకకు లోనవుతుంటారు. – బబిత, భవిష్య చిత్తూరులోని మధు, సాయిరాణి దంపతుల కవలలు హేమచంద్ర, అభినవ్. వీరిద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. ముఖ్యంగా ఇద్దరి ఆహారపు అలవాట్లు, అభిరుచుల విషయంలో ఒక్కలాగా ప్రవర్తిస్తారని తల్లిదండ్రులు చెబుతున్నారు. వారు పెరుగుతున్న కొద్దీ ప్రతి దాంట్లో పోటీ ఎక్కువగా ఉంటోదంటున్నారు. చూడటానికి సన్నగా ఉన్నా వారి ఉత్సాహాన్ని చూసి ఉపాధ్యాయులే ముచ్చట పడుతుంటారు. – హేమచంద్ర, అభినవ్ గుర్తుపట్టలేనంతగా ... ఒకేలా పనులు -
టీటీడీ బోర్డు సభ్యుడిని తొలగించాలి
– మాజీ మంత్రి ఆర్కేరోజా నగరి : టీటీడీ ఉద్యోగిపై అనుచితంగా ప్రవర్తించిన బోర్డు సభ్యుడిని తొలగించాలని మాజీ మంత్రి ఆర్కేరోజా ఎక్స్లో డిమాండ్ చేశారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానమని, అలాంటి గొప్ప వ్యవస్థలో భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఉద్యోగులు సేవలు అందిస్తున్నారని తెలిపారు. విధి నిర్వహణలో వున్న ఉద్యోగిపై బోర్డు సభ్యుడు అనుచితంగా ప్రవర్తించడం తగదన్నారు. ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నడూ జరగలేదని, కూటమి ప్రభుత్వంలోనే జరుగుతున్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఎదుటే చైర్మన్, ఈఓ నిందించుకున్నారంటే పాలన ఎంత బాగుందో అర్దమవుతోందన్నారు. జగనన్న పాలనలో ఇలాంటి ఘటనలు ఏ రోజూ జరగలేదన్నారు. పాలకుడు అంటే భయం ఉంటే పరిస్థితులు సవ్యంగా ఉంటాయన్నారు. వెంటనే బాధ్యతా రహితంగా ప్రవర్తించిన బోర్డు సభ్యుడిని ప్రభుత్వం తొలగించాలన్నారు. ఆత్మ గౌరవం కోసం ఆందోళన చేస్తున్న టీటీడీ ఉద్యోగులకు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నానన్నారు. మామిడిలో తెగుళ్ల నివారణకు చర్యలు బంగారుపాళెం : మామిడిలో సస్యరక్షణ చర్యలు పాటించాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి మధుసూదన్రెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలోని గోవర్ధనగిరి, తగ్గువారిపల్లె గ్రామాల్లో రైతుల మామిడి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం మామిడి తోటల్లో పూత దశలో కనిపించే పురుగు, తెగుళ్ల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పూత దశలో గొంగళి పురుగు నివారణకు ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లేదా రోగర్ 2 మి.లీ, వేపనూనె 2 ఎంఎల్ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. లేదా జంప్ 0.4 గ్రాములును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. మామిడిలో కవర్ల ఏర్పాటు చేసుకోవడం ద్వారా నాణ్యమైన పంటను పొందేందుకు అవకాశం ఉందన్నారు. మామిడి కవర్లను ఉద్యానశాఖ ద్వారా 50 శాతం రాయితీతో రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. రాయితీ మామిడి కవర్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి సాగరిక, సిబ్బంది పాల్గొన్నారు. వైభవంగా ఆవులపబ్బం చౌడేపల్లె : మండలంలోని పరికిదొన గ్రామంతో పాటు మరో పదకొండు గ్రామాల్లో రెండు రోజులుగా నిర్వహించిన ఆవులపబ్బం పండుగ శుక్రవారంతో ముగిసింది. గడ్డంవారిపల్లె, పరికిదొన, ఆమినిగుంట పంచాయతీల్లోని పన్నెండు గ్రామాలకు చెందిన మహిళలు ఊరేగింపుగా కాటమరాజుల ఆలయం వద్దకు చేరుకొన్నారు. అనంతరం భక్తి శ్రద్ధలతో కాటమరాజు స్వామికి , నడివీధి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండేలా కరుణించాలని శాంతి పూజలు చేశారు. అత్త చెయ్యి నరికిన అల్లుడు గంగవరం: తన భార్యపై కత్తితో దాడికి ప్రయత్నించిన ఓ వ్యక్తి... అడ్డువచ్చిన అత్త చెయ్యి నరికేశాడు. ఈ ఘటన గంగవరం మండలంలోని గండ్రాజుపల్లి పంచాయతీ పెద్ద ఉగిణి గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... పెద్ద ఉగిణి గ్రామానికి చెందిన యూనిస్, సాల్మాకు రెండేళ్ల కిందట వివాహమైంది. యూనిస్ మద్యానికి బానిసగా మారి తనను వేధిస్తున్నాడని సల్మా వారం కిందట పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి రోజూ యూనిస్ మద్యం తాగి అత్తవారింటికి వెళ్లి గొడవ చేస్తున్నాడు. గురువారం రాత్రి కూడా మద్యం తాగిన యూనిస్ అందరూ నిద్రిస్తున్న వేళ కత్తి తీసుకుని అత్తవారింటికి వెళ్లి భార్య సల్మాపై దాడికి ప్రయత్నించాడు. ఆమె భయంతో ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంది. ఆ సమయంలో అడ్డువచ్చిన అత్త షమీలపై యూనిస్ కత్తితో దాడి చేయగా, ఆమె చెయ్యి తెగి పడింది. సల్మా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గంగవరం పోలీసులు శుక్రవారం యూనిస్ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన షమీలను చికిత్స కోసం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లగా, మెరుగైన చికిత్స కోసం తిరుపతికి రెఫర్ చేశారు. -
అక్రమార్కులకు ఉపాధి
కాణిపాకం : పూతలపట్టు మండలం వావిల్తోట పంచాయతీలో ఉపాధిహామీ పనుల పేరుతో అక్రమాలు జరుగుతున్నట్లు అధికారులకు కొందరు ఫిర్యాదు చేశా రు. పనులు జరగకుండానే..కాలువ పని పేరుతో రో జుకు 180 మందికి మస్టర్ వేస్తున్నారని అందులో పేర్కొన్నారు. 10 మందితో 180 మంది పనిచేస్తున్న ట్లు చిత్రీకరిస్తున్నారని, 10 మందిని వివిధ చోట్ల పనిచేస్తున్నట్లు చూపిస్తున్నారని ఫొటోల సహా ఆన్లైన్ వివరాలను పంపారు. ఇలా వారానికి రూ.3 లక్షల వ రకు కొల్లగొట్టారని అందులో ఆరోపించారు. ఆరు నె లల కాలంలో రూ.30 లక్షలు మింగేశారని గ్రామస్తులు ఫిర్యాదులో వివరించారు. కూటమి నేతలు, ఫీల్డ్ అసిస్టెంట్లు కుమ్మక్కై ఉపాధి డబ్బులు దోచేస్తున్నా రు. ఇష్టానుసారంగా పనులు చేస్తూ అయిన కాడికి దండుకుంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా బోగస్ కూలీలను సృష్టిస్తూ మస్టర్లో మాయజాలంను సృష్టిస్తున్నారు. సాంకేతికతకు చుక్కలు చూపిస్తున్నారు. వేతనం గిట్టుబాటు లేకపోవడంతో కూలీలు అల్లాడిపోతున్నారు. చివరకు కూలీలే ఛీకొట్టే పరిస్థితి దాపురించింది. ఈ తతంగంపై ఉపాధిహామీ అధికారులు చూ సీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అనుకూలమైన వారిని నియమించుకొని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల్లోని కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. వారి స్థానంలో స్థానిక కూటమి నేతలకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకున్నారు. కూటమి నేతలతో వారు కుమ్మకై ్క ఉపాధిలో అక్రమాల వేటను మొదలుపెట్టారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తప్పుల తడకగా మస్టర్లు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కొందరు నేతలు ఉపాధిని లక్ష్యంగా చేసుకున్నారు. మేట్లను అడ్డుపెట్టుకుని ఉపాధి పనుల్లో కాసులు దండుకుంటున్నారు. రెండేళ్ల కిందట మ్యానువల్గా మస్టర్లు వేసేవారు. ఈ మస్టర్లు తప్పులు తడకగా ఉండడంతో పాటు పలు అక్రమాలు వెలుగు చూశాయి. ఫొటోలతో మాయ.. 10 మందిని తీసుకొచ్చి... వాళ్లతో పలుచోట్ల పని చేయిస్తున్నట్లు ఫొటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. ఆ పంచాయతీలోని కూలీలు రాకుంటే పక్క గ్రామంలో 10 మందిని తీసుకొచ్చి ఫొటోలతో పనిచేసినట్లు సృష్టిస్తున్నారు. ఇలా రోజువారీ 100 నుంచి 180 మంది బినామీ పేర్లు పెట్టి పనిచేయిస్తున్నట్లు ఆన్లైన్లో మస్టర్లు వేస్తున్నారని అధికారులకు ఫిర్యాదులు వెలుతున్నాయి. యంత్రాలతో పనులు పంట సంజీవని, ఇతర పనులను యంత్రాలతో పనులు చేయించి బినామీ కూలీలతో బిల్లులు చేసుకుంటున్నారని చెబుతున్నారు. కూటమి నేతలు, ీఫీల్డ్ అసిస్టెంట్లు కుమ్మక్కు పనులు చేయకుండానే బిల్లులు చేసిన చోటే మళ్లీ పనులు బోగస్ కూలీల నమోదు తనిఖీలున్నా..తగ్గేదేలే.. ఉపాధి హామీలో జరుగుతున్న పనులకు సంబంధించి ఏటా సామాజిక తనిఖీలు చేపడుతుంటారు. ఇందుకు సీఆర్పీలు, డీఆర్పీలు, ఎస్ఆర్పీలు బృందంగా వెళ్లి పనులను పరిశీలిస్తుంటారు. ఏవైనా అక్రమాలుంటే వెంటనే బహిరంగ సభలో బహిర్గతం చేయాల్సి ఉంటుంది. వీటిని సైతం లెక్క చేయకుండా కూటమి నేతలు, క్షేత్ర సహాయకులు అధికారం ఉందని అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టి తనిఖీలను మట్టుపెట్టవచ్చునని భావిస్తున్నారు. ఆ సయమానికి కాసులిచ్చి అక్రమాలను కప్పిపుచ్చుకోవచ్చని నిర్భయంగా ఉపాధి నిధులను బినామీల పేరుతో కాజేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఉపాధిహామీ పనుల్లో జరుగుతున్న అక్రమాలకు కళ్లెం వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధి హామీ పనులు కొందరి కూటమి నేతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. వలసలు నివా రించేందుకు ఉద్దేశించిన పథకం అక్రమార్కులకు వరంగా మారింది. చేసిన పనులనే మళ్లీ చేయ డం..బోగస్ హాజరు పెట్టి దండుకోవడం.. పను లు చేయకున్నా బిల్లులు పొందడం.. కూలీలు రాకుండానే వచ్చినట్లు మస్టర్లు సృష్టించడం.. సాంకేతికతను పక్కదారి పట్టించి ..అధికారుల కళ్లకు గంతలు కట్టి దర్జాగా ఉపాధి నిధులను నిలువు దోపిడీ చేస్తున్నారు.చర్యలు తీసుకుంటాం.. వావిల్తోటలో జరిగిన పనులపై ఫిర్యాదులు అందా యి. దీనిపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చేపట్టిన పనులపై ఆరా తీస్తున్నారు. రెండు రోజుల్లో ఏం జరిగిందో వాళ్లే చెబుతారు. ఉపాధి హామీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసులు, క్లస్టర్ ఏపీడీ, పూతలపట్టు మండలం పంచాయతీలు గుర్తించిన పనులు మస్టర్ల సంఖ్య పనికి హాజరవుతున్నవారు చిత్తూరు 17 47 113 610 గుడిపాల 27 55 149 860 బంగారుపాళ్యం 41 90 295 1209 ఐరాల 28 129 228 1540 పూతలపట్టు 25 103 172 1127 తవణంపల్లి 32 68 123 589 యాదమరి 26 36 103 740 -
స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టాలి
– కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో స్కానింగ్ సెంటర్లపై డెకాయి ఆపరేషన్లు నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పీసీపీఎన్డీటీ చట్టం అమలుపై సమీక్ష నిర్వహించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం–1994 (పీసీపీఎన్డీటీ) అమలును జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జిల్లాలో ప్రతి 1000 మంది మగ శిశువులకు 954 మంది ఆడ శిశువులు ఉన్నారన్నారు. ఆడ పిల్లలను కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భ్రూణ హత్యలకు పాల్పడితే చర్యలు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలైన లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలకు పాల్పడితే కఠిన చర్యలు, న్యాయపరమైన శిక్షలు అమలు చేయాలన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ, పోలీసు, విజిలెన్స్ శాఖలు నిఘా పెట్టాలన్నారు. డెకాయి ఆపరేషన్లు చేపట్టండి.... ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో డెకాయి ఆపరేషన్లు చేపట్టాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా డీఎంఅండ్హెచ్ఓ వద్ద అనుమతులు పొందాలన్నారు. సమావేశంలో డీఎంఅండ్హెచ్ఓ సుధారాణి, డీసీహెచ్ఎస్ ప్రభావతి, డీఈఓ వరలక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చెన్నయ్య, మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న టెంపో
వి.కోట : పట్టణంలోని బాలికల వసతి గృహం సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని ఓ టెంపో గురువారం అర్ధరాత్రి ఢీకొంది. దీంతో పట్టణంలో గురువారం అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి పట్టణం అంతా అంధకారం నెలకొంది. టెంపో డ్రైవర్ మద్యం మత్తులో వేగంగా వెళుతూ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఆ తీవ్రతకు స్తంభం విరిగి శాంతిపురం నుంచి వి.కోట సబ్ స్టేషన్కు సరఫరా అయ్యే లైన్ తెగిపోయింది. శుక్రవారం ఉదయం ట్రాన్స్కో సిబ్బంది విద్యుత్ స్తంభాన్ని మార్చి సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. -
పకడ్బందీగా ఇంటర్వ్యూలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సీ్త్ర శిశు సంక్షేమశాఖలోని పలు పోస్టులకు పకడ్బందీగా ముఖాముఖి నిర్వహించారు. గురువారం కలెక్టరేట్లోని డీఆర్ఓ సమావేశ మందిరంలో ట్రైనీ కలెక్టర్ హిమవంశీ ఇంటర్వ్యూలు చేపట్టారు. ఐసీడీఎస్ పరిధిలోని మిషన్ వాత్సల్య పథకంలోని కౌన్సిలర్, ఔట్ రీచ్ వర్కర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న పలువురు అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అభ్యర్థుల నైపుణ్యాలను ట్రైనీ కలెక్టర్ ప్రశ్నల రూపంలో ఇంటర్వ్యూ చేశారు. మెరిట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయని ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి వెల్లడించారు. -
కన్నబిడ్డ కోసం తల్లి దీక్ష
పుంగనూరు : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త .. కుమారైను చెప్పకుండా ఇంటినుంచి తీసికెళ్లి ఇద్దరూ ఎక్కడున్నారో తెలియకపోవడంతో భార్య ఆందోళన చెందుతూ మరో కుమారైతో కలసి నిరాహార దీక్ష చేపట్టిన సంఘటన గురువారం అంబేడ్కర్ సర్కిల్లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన ప్రభు, ఉషశ్రీ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారైలు ఉన్నారు. ఇలా ఉండగా చెడు అలవాట్లకు బానిసైన ప్రభు, ఉషశ్రీని వేధించడం చేసేవాడు. ఈ క్రమంలో భర్త వేధింపులు తాళలేక ఉషశ్రీ బిడ్డలను తీసుకుని నాయుడుపేటకు వెళ్లిపోయింది. ఆ సమయంలో భర్త ప్రభు భార్య ఇంటికి వెళ్లి పెద్ద కుమారైకు సైకిల్ తీసి ఇస్తానని మాయమాటలు చెప్పి తీసికెళ్లి ఇంటికి వెళ్లకుండా వెళ్లిపోవడంతో పాప, భర్త ఆచూకీ కోసం ఉషశ్రీ ఎంత గాలించిన ఫలితం లేకపోయింది. భర్త , కుటుంబ సభ్యులు పుంగనూరులో ప్రభును దాచిపెట్టారని నిరసిస్తూ దీక్షకు దిగింది. తన బిడ్డ ఆచూకీని కనుగొనాలని, భర్తపై చర్యలు తీసుకోవాలని కోరుతోంది. దళిత సంఘాలు ఆమెకు మద్దతు పలికాయి. ఈ మేరకు తహసీల్దార్, పోలీసులకు వినతిపత్రం సమర్పించింది. సీఐ శ్రీనివాసులు చర్యలు తీసుకుంటామని బాధితురాలికి హామీ ఇచ్చారు. -
500 కిలోల శ్రీగంధం స్వాధీనం?
– ముగ్గురు నిందితుల అరెస్టు పుంగనూరు : వివిధ ప్రాంతాల పొలాల్లోని శ్రీగంధం చెట్లను నరికి , ముక్కలుగా చేసి స్మగ్లింగ్ చేసే ముఠాను బుధవారం రాత్రి పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. మండలంలోని నల్లగుట్లపల్లెతండాకు చెందిన ముగ్గురు వ్యక్తులు సుమారు 500 కిలోల శ్రీగంధం ముక్కలను స్మగ్లింగ్ చేసేందుకు సిద్ధం చేస్తుండగా సమాచారం మేరకు సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేసి పట్టుకున్నట్లు సమాచారం. నిందితులను, గంధం చెక్కలను స్వాధీనం చేసుకుని సమగ్ర విచారణ చేస్తున్నట్లు తెలిసింది. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
● మోటార్ సైకిళ్లు ఢీకొని ఒకరు ● ఆర్టీసీ బస్సు ఢీ కొని మరొకరు ● ఒకరికి తీవ్ర గాయాలు వడమాలపేట (విజయపురం): మోటార్ సైకిళ్లు ఢీకొని ఒకరు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం రాత్రి వడమాలపేట మండలం కదిరిమంగళం క్రాస్ వద్ద చోటుచేసుకుంది. ఎస్ఐ ధర్మారెడ్డి కథనం.. ఎస్వీ పురానికి చెందిన మేసీ్త్ర పనిచేసే సుధాకర్ (52 తిరుపతిలో పని ముగించుకొని ద్విచక్రవాహనంపై తిరిగి ఇంటికి వస్తూ మృత్యువాత పడ్డాడు. తమిళనాడుకు చెందిన హర్ష (25) చైన్నె నుంచి ద్విచక్రవాహనంపై తిరుపతికి వస్తూ పరస్పరం కదిరిమంగళం క్రాస్ వద్ద ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుధాకర్ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన హర్షను తిరుపతికి తరలించారు. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీరంగరాజపురం మండలంలో.. శ్రీరంగరాజపురం: ఆర్టీసీ బస్సు ఢీకొని ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన 49 కొత్తపల్లి మిట్ట సమీపంలోని సీఎస్ఐ చర్చి వద్ధ చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై గరువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం...మండలంలోని కటికపల్లెకు చెందిన తిరుమలేశం(42) తన సొంత పనుల నిమిత్తం బైక్లో బంగారుపాళ్యం వెళ్లి తిరుగు ప్రయాణంలో 49 కొత్తపల్లిమిట్ట సమీపంలోని సీఎస్ఐ చర్చి వద్ధ తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు చోరీ పుంగనూరు : చిన్నతాండలో ఇంటి వద్ద పెట్టిన కారును దొంగలు చోరీ చేసిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన బెరుకలానాయక్ తనకు తెలిసిన షబినా అనే మహిళకు చెందిన కారును రాత్రి తన ఇంటి ఆవరణలో పెట్టి నిద్రించాడు. గురువారం ఉదయం లేచి చూసే సరికి కారు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు. కారు టోల్గేట్ దాటి వెళ్లడాన్ని గుర్తించి అప్రమత్తం చేశారు. -
పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నాక్ ‘ఏ’ గ్రేడ్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని ఎంతో ప్రాచుర్యం కలిగిన పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నాక్ ‘ఏ’ (స్కోర్ 3.13) గ్రేడ్ లభించింది. ఈ మేరకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గురువారం గ్రేడ్ను ప్రకటిస్తూ కళాశాలకు ఉత్తర్వులు పంపింది. పీవీకేఎన్ కళాశాలకు గతం కంటే ప్రస్తుతం న్యాక్ గ్రేడ్ మెరుగుపడింది. ప్రిన్సిపల్ డా.జీవనజ్యోతి, అధ్యాపక బృందం, పూర్వ విద్యార్థుల కృషితో కళాశాలను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఆ కళాశాలలో ఆర్థిక నిధుల కొరత ఉన్నప్పటికీ ప్రస్తుతం న్యాక్ ఏ గ్రేడ్ లభించింది. -
రేపు జెడ్పీ స్థాయి సంఘాల సమావేశం
చిత్తూరు కార్పొరేషన్ : జెడ్పీ కార్యాలయంలో శనివారం జెడ్పీ స్థాయి సంఘాల సమావేశం నిర్వహించనున్నట్లు గురువారం సీఈఓ రవికుమార్నాయుడు తెలిపారు. వినియోగంలో లేని జెడ్పీ పాత సమావేశ మందిరాన్ని బాగు చేసి అక్కడ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అందుకు సంబంధించి పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలను చేశారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సమావేశం ఉంటుందన్నారు. స్థాయి సంఘాలు, చిన్న చిన్న సమావేశాలకు పాత సమావేశ మందిరాన్ని వినియోగించుకుంటామన్నారు. సర్వసభ్య, ఇతర పెద్ద సమావేశాలకు నూతన మందిరాన్ని వాడుకోవచ్చన్నారు. అందులో భాగంగా సిబ్బందికి పలు ఆదేశాలను ఇచ్చామని తెలిపారు.నేల, సీట్లు, గోడలు మొత్తం శుభ్రం చేయాలన్నారు. అలాగే లైటింగ్, స్పీకర్లు మరమ్మతు పనులు , నీటి సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో టైల్స్ వేయాలన్నారు. ఇక జెడ్పీ సమావేశ మందిరాన్ని ఇతర శాఖలకు నామమాత్రపు అద్దెతో ఇవ్వనున్నామని చెప్పారు. బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు బంగారుపాళెం : బాల్యవివాహాలు చేస్తే అనర్థాలు తప్పవని తహసీల్దార్ బాబురాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని ఓ గ్రామంలో బాల్యవివాహం చేస్తున్నారనే ఫిర్యాదుపై అధికారులు స్పందించి అడ్డుకున్నారు. బంగారుపాళెం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి పలమనేరు మండలానికి చెందిన ఓ బాలికతో వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పలమనేరు సీడీపీఓ ద్రాక్షాయణి, బంగారుపాళెం సీడీపీఓ వాణిశ్రీదేవి, సీఐ శ్రీనివాసులు, సిబ్బంది ఆ గ్రామానికి చేరుకుని వివాహాన్ని అడ్డుకున్నారు. కుటుంబ సభ్యులను స్టేషన్కు తీసుకొచ్చారు. అనంతరం తహశీల్దార్ బాబురాజేంద్ర ప్రసాద్ ఎదుట హాజరు పరచగా ఇరువురి కుటుంబ సభ్యులకు ఆయన కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్యవివాహాల వల్ల జరిగే అనర్థాలను వారికి వివరించారు. కాణిపాకంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి కాణిపాకం : కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని గురువారం రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ భవానీ ప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికిన ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన సేవలు చేయించారు. ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, కోర్టు సిబ్బంది ఉన్నారు. వరసిద్ధుని సేవలో 20 సూత్రాల కమిటీ చైర్మన్ కాణిపాకం వినాయ క స్వామిని గురువా రం రాష్ట్ర 20 సూ త్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ ద ర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామి దర్శనం కల్పించారు. ఆర్డీఓ శ్రీనివాసులు ఉన్నారు. -
వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల కమిటీ నియామకం
తిరుపతి మంగళం : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల కమిటీల్లో పలువురిని వివిధ హోదాల్లో నియమించినట్టు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆమేరకు చిత్తూరు, తిరుపతి జిల్లాల ఉపాధ్యక్షుడిగా శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన గాది మునిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.వాసుదేవనాయుడు, సంస్థాగత కార్యదర్శిగా ఎస్.మహదేవ్రెడ్డి, కార్యదర్శులుగా సి.వరప్రసాద్నాయుడు, బాలిశెట్టి విజయ్శేఖర్ నియమితులయ్యారు. రాష్ట్ర అనుబంధ కమిటీలో జిల్లా వాసులు చిత్తూరు అర్బన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర అనుబంధ కమిటీకి సంబంధించి చిత్తూరు జిల్లాలోని పలువురికి చోటు కల్పిస్తూ గురువారం కేంద్రపార్టీ కార్యాలయం తెలిపింది. రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శిగా లీనారెడ్డి, రైతు విభాగం కార్యదర్శి గుణశేఖర్రెడ్డి, రైతు విభాగం అఫిషియల్ స్పోక్ పర్సన్ ప్రవీణ్రెడ్డి, రైతు విభాగ సంయుక్త కార్యదర్శులుగా చంద్రశేఖర్రాజు, సుధాకర్నాయుడు, శ్రీరాములురెడ్డి, పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శులుగా దిలీప్రెడ్డి, జనార్థన్, నగేష్రెడ్డి, అమర్నాథ్రెడ్డిని నియమించారు. -
మినిట్స్ వ్యవహారంపై చైర్మన్ ఆగ్రహం
● కలెక్టరేట్లో 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ చిత్తూరు కలెక్టరేట్ : ముఖ్యమైన సమావేశాలు నిర్వహించేటప్పుడు చాలా అంశాలపై సమీక్ష నిర్వహిస్తారని అలాంటి వివరాలను మినిట్స్లో రాయకపోతే ఎలా అని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలో ముఖ్యమైన శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మినిట్స్ రాయడంలో అలసత్వం వహించిన సీపీఓ కార్యాలయ సిబ్బందిపై చైర్మన్ మండిపడ్డారు. అనంతరం కలెక్టర్ జోక్యం చేసుకుని మినిట్స్ తప్పులు లేకుండా కరెక్టుగా రాయాలని సర్ధిచెప్పారు. ప్రతి శాఖలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ మాట్లాడుతూ.. జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో విజన్–2047, స్వర్ణకుప్పం 2029 కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలిపారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రతి నియోజకవర్గానికి ఏటా ప్రత్యేక బడ్జెట్లో రూ.కోటి మంజూరుకు ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లాలో మ్యాంగో బోర్డు, సెరికల్చర్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ, చిత్తూరు, కుప్పంలో కేంద్రియ విద్యాలయం, డిజిటల్ సైన్స్ సెంటర్, జిల్లాలో పర్యాటకరంగం అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ.. అడవిపల్లి రిజర్వాయర్ పనులు 82 శాతం పూర్తయ్యాయని ఇందుకు అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళిమోహన్, మేయర్ అముద, డీఆర్ఓ మోహన్కుమార్, సీపీఓ సాంబశివారెడ్డి, డ్వామా పీడీ రవికుమార్, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు చంద్రశేఖర్రెడ్డి, విజయకుమార్, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, హౌసింగ్ పీడీ గోపాల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల వెనుకడుగు
నేతల అండదండలు చిత్తూరులో జరిగిన ఘటనలో ఇద్దరు వీఆర్ఏల హస్తం ఉందని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది నుంచి పోలీసుల అందరికీ తెలుసు. ఇక ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న మహిళ, మరో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగి మూడు నెలలు కావస్తున్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఇది నిందితులను తప్పించడంతో పాటు, కేసు నీరుగారే ప్రమాదం ఉంది. గంగాధర నెల్లూరు కేసులో తనకు అనుమానం ఉన్న నిందితుల పేర్లను స్వయాన బాధితుడే ఫిర్యాదులో పేర్కొన్నా.. చర్యలు శూన్యం. దీనికి రాజకీయ కారణాలే కనిపిస్తున్నాయి. ప్రధాన నిందితుడు టీడీపీ తరపున జెడ్పీటీసీ, సర్పంచ్గా పోటీ చేయడం, స్థానిక ప్రజాప్రతినిధి అండదండలు ఉండటంతో పోలీసులు వెనకడుగు వేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. చిత్తూరు అర్బన్ : సాక్షాత్తు మండల మెజిస్ట్రేజ్ తన సంతకం ఫోర్జరీ చేశారు.. ఎవరు చేశారో నిగ్గు తేల్చండని రాత పూర్వకంగా ఫిర్యాదు చేసినా పోలీసులు మాత్రం దర్యాప్తు చేయకుండా మొండికేస్తున్నారు. మరో కేసులో సర్వేయర్ సంతకం ఫోర్జరీ చేశారని బాధితుడు ఫిర్యాదు చేసినా .. పోలీసులు అదే మౌనం పాటిస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఫోర్జరీ సంతకాలతో రూ.లక్షలు విలువ చేసే భూములు కొట్టేశారని మొత్తుకుంటున్నా ఖాకీలకు వినపడడం లేదు. వీరి వెనుక కూటమి నేతల ఒత్తిళ్తతోనే కేసు నీరుగారుస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ అంటే మండలానికే మేజిస్ట్రేట్. తన సంతకం ఫోర్జరీ చేశారంటూ స్వయంగా తహసీల్దార్ రాత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే.. ఇప్పటి వరకు కేసు అతీగతి లేదు. రూ.లక్షలు విలువ చేసే 70 సెంట్ల భూమిని కాజేయడంలో తన సంతకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఫోర్జరీ చేశారంటూ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు మౌనం వహిస్తున్నారు. చిత్తూరులో గతేడాది డిసెంబరు నెలలో వెలుగు చూసిన ఈ ఘటనపై స్థానికంగా కలకలం రేగింది. కొందరు ఇంటి దొంగల ప్రమేయంతోనే తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై తాలూక పోలీసులు కేసు నమోదు చేసి నెల కావస్తోంది. కానీ పురోగతి మాత్రం కనిపించడంలేదు. గ్రామకంఠ భూమి రిజిస్ట్రేషన్ గంగాధర నెల్లూరులో ఓ ఇంటి స్థలానికి సర్వేయర్ గ్రామకంఠ భూమిగా సర్టిఫికెట్ ఇచ్చినట్లు ఏకంగా రిజిస్ట్రేషన్ చేసేశారు. దీనిపై మహదేవమంగళంకు చెందిన పట్టాభి అనే బాధితుడు గంగాధర నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సర్వేయర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ, స్థానిక టీడీపీ నేత నటరాజ మొదలియార్తో పాటు ఆరుగురు ఈ కుట్రకు పాల్పడ్డారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదయింది. నిందితులు ఎవరో తెలుసు, ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలుసు. కానీ దర్యాప్తు మాత్రం ముందుకు కదలడం లేదు. కదలని తహసీల్దార్ సంతకాల ఫోర్జరీ కేసు చిత్తూరులో 70 సెంట్లు.. జీడీ నెల్లూరులో ఓ స్థలం తహసీల్దార్ ఫిర్యాదు చేసినా సాగని దర్యాప్తు నిందితుల్లో వీఆర్ఏ.. ప్రైవేటు ఉద్యోగులు పోలీసు అధికారులపై ఎస్పీ ఆగ్రహం? ‘పెండింగ్ కేసులు ఎందుకు దర్యాప్తు పూర్తి చేయడం లేదు..? ఎఫ్ఐఆర్ చేసిన తరువాత ఇన్విస్టిగేషన్ చేసి, నిందితులపై చర్యలు తీసుకోవాలి కదా..! చార్జ్షీట్ కోర్టుకు పంపాలి కదా..? ప్రతి సమీక్షలోనే ఈ విషయంపై సీరియస్గా తీసుకొమ్మంటే కొందరు నిర్లక్ష్యంగా ఉన్నారు. పద్ధతి మార్చుకోకుంటే నేను సీరియస్ కావాల్సి ఉంటుంది.’ – క్రైమ్ మీటింగ్లో చిత్తూరు ఎస్పీ ‘70 సెంట్ల భూమికి ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు నా సంతకాన్నే ఫోర్జరీ చేశారు. ప్రభుత్వ సీల్ మా కార్యాలయానిది కాదు. ఎక్కడో బయట తయారు చేయించినట్లు ఉన్నారు. నిందితులు ఎవరో తేల్చి, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోండి.’ – చిత్తూరు తహసీల్దార్ ఫిర్యాదు వేగవంతం చేయాలని ఆదేశం పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కలిగించాలని ఎస్పీ పదే పదే చెబుతున్నా కొందరు పోలీసు అధికారులకు ఈ మాటలు చెవికి ఎక్కడంలేదు. తహసీల్దార్ లాంటి వ్యక్తులే ఫిర్యాదు చేసిన కేసుల్లో ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్న స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు.. సామాన్యులు స్టేషన్ మెట్లు ఎక్కితే ఎలా స్పందిస్తారో ఈ రెండు ఘటనలే ప్రత్యక్ష సాక్ష్యం. దీనిపై చిత్తూరు ఎస్పీ మణికంఠ ఇప్పటికే సీరియస్గా ఉన్నట్లు తెలిసింది. సంబంధిత అధికారులకు చివాట్లు పెట్టి, దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. తాలూక స్టేషన్లో ఓ ఎస్ఐ పనితీరుపై ఆరోపణలు రావడంతో ఆయన్ను వేకెంట్ రిజర్వుకు పంపించారు. కొత్త ఎస్ఐ ఇటీవలే బాధ్యతలు తీసుకున్నారు. మరి నెల రోజుల కాలంలో ఎస్ఐ దర్యాప్తుపై దృష్టి సారించకుంటే సీఐ ఏం చేస్తున్నారనే..? ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దర్యాప్తు వేగం చేసి, నిందితులకు చట్టపరంగా శిక్షలు పడేలా చేయాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంది. -
అయ్యోర్ల జాబితా
ఉమ్మడి చిత్తూరు జిల్లా సమాచారం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు : 4,392 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు : 8,435 విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్లు : 7,534 జిల్లాలో ఉన్న స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు : 901ఎస్జీటీ పోస్టులు మంజూరు : 8,295 విధులు నిర్వహిస్తున్న ఎస్జీటీలు : 6,443 ఎస్జీటీ ఖాళీ పోస్టులు : 1,852 పనిచేస్తున్న హెచ్ఎంలు : 408 చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల సీనియారిటీ జాబితా ఆన్లైన్లో అప్లోడ్ చేయడం అంత సులువు కాదు. ఈ కసరత్తు వేసవి సెలవుల్లో నిర్వహించుకోవాల్సింది పోయి..విద్యా సంవత్సరం చివర్లో కీలక సమయంలో నిర్వహిస్తున్నారు. దీంతో పదో తరగతి విద్యార్థుల పర్యవేక్షణ, పబ్లిక్ పరీక్షలకు కేంద్రాల ఏర్పాటు, టీచర్ల సమస్యలు అటకెక్కుతున్నాయి. టీడీపీ కూటమి అనాలోచిత నిర్ణయాలతో అటు టీచర్లు...ఇటు విద్యార్థులు అవస్థలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. నెల రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రభుత్వ టీచర్ల సీనియారిటీ జాబితా కసరత్తు చేపడుతున్నా పూర్తికాని పరిస్థితి నెలకొంది. ఇతర జిల్లాల్లో ఈ కసరత్తును పూర్తి చేసినప్పటికీ చిత్తూరు జిల్లాలో వెనుకబడి ఉన్నారు. టీడీపీ కూటమి ఆర్భాటం కోసం.. వేసవి సెలవుల్లో బదిలీలు, ఉద్యోగోన్నతులు కల్పిస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ రాష్ట్ర స్థాయిలో ప్రగల్బాలు పలికారు. క్షేత్రస్థాయిలోని సమస్యలు పట్టించుకోలేదు. ఆయన పబ్లిసిటీ కోసం విద్యాశాఖ సిబ్బందికి నిద్రలేని రాత్రులను గడిపేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 4392 ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని కేడర్లలో 14,394 మంది టీచర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వారు సర్వీసులో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి వివరాలను డీఎస్సీల వారీగా సేకరించాల్సి ఉంటుంది. అలా సేకరించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి. ఇలా నమోదు చేసిన వివరాలను పలు దశల్లో పరిశీలిస్తున్నారు. అయినప్పటికీ పలు తప్పిదాలు దొర్లే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు వెల్లడిస్తున్నాయి. విడుదలలో ఇంకెన్ని సమస్యలో... ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు చేపడుతున్న సీనియార్టీ జాబితా ఆన్లైన్ నమోదు కసరత్తు నేటితో పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నారు. అయితే గురువారం సర్వర్ మొరాయించడంతో కసరత్తు పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఈ కసరత్తును ఆర్జేడీ శాఖ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం, కార్యాలయ ఏడీ విజయకుమార్, సూపరింటెండెంట్ బాబునాయక్తో పాటు డీఈఓ వరలక్ష్మి, జిల్లా విద్యాశాఖ ఏడీలు వెంకటేశ్వరరావు, రంగస్వామి పర్యవేక్షిస్తున్నారు. సీనియారిటీ జాబితా మొత్తం ఆన్లైన్ చేశాక జాబితాను విడుదల చేయనున్నారు. ఆ జాబితా విడుదల చేశాక ఇంకెన్ని సమస్యలు తలెత్తుతాయోనని ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీచర్ల సీనియారిటీ జాబితాపై కొనసాగుతున్న కసరత్తు ఎర్రర్తో డేటా తొలగిపోయి మొదటికొచ్చిన పనులు నెల రోజులుగా నిర్వహిస్తున్నా పూర్తిగాని ప్రక్రియ బడుల పర్యవేక్షణ పట్టని వైనం రాత్రింబవళ్లు కుస్తీ... టీచర్ల సీనియారిటీ జాబితాను ఆన్లైన్ చేసేందుకు డీఈఓ వరలక్ష్మితో పాటు విద్యాశాఖ సిబ్బంది రాత్రింబవళ్లు కుస్తీ పడుతున్నారు. మొదటి సారి ఎంతో కష్టపడి టీచర్ల పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. అయితే ఆ వివరాల డేటా మొత్తం టెక్నికల్ ఎర్రర్ వల్ల తొలగిపోయింది. దీంతో మళ్లీ కసరత్తు మొదటికి వచ్చింది.చేసిన పనినే మరోమారు చేయాల్సి రావడంతో రాత్రిళ్లు నిద్ర మేల్కొని కసరత్తు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ కసరత్తుతో అటు అకడమిక్, ఇటు అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలు జాప్యం అవుతున్నాయి. -
పెద్దిరెడ్డిపై కక్ష.. రోడ్లపై వివక్ష
పుంగనూరు : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పుంగనూరు నియోజకవర్గంలో రహదారులు అభివృద్ధి చేయాలని మంజూరు చేసిన పనులను తెలుగుదేశం ప్రభుత్వం కక్ష కట్టి రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారుల్లో పనులు జరుగుతున్న సమయంలో ఎన్నికలు రావడంతో పనులు పెండింగ్లో పడ్డాయి. ఆ పనులు 25 శాతం మించి జరగలేదని, మరికొన్ని పనులు ప్రారంభించలేదనే కుంటి సాకుతో రూ.56.93 కోట్ల పనులను, రూ.49 కోట్ల టెండర్ను రద్దు చేస్తూ రహదారుల శాఖ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్దండే ఉత్తర్వులు జారీ చేశారు.రద్దు చేసిన పనుల వివరాలుపుంగమ్మ చెరువు కట్టపై నుంచి ఉన్న శంకర్రాయలపేట రోడ్డు వయా బైరెడ్డిపల్లి, బెంగళూరుకు ప్రధాన రహదారి కావడంతో సుమారు 4 కిలోమీటర్ల రోడ్డులో సుమారు 300 గుంతలు ఉండటంతో ప్రయాణాల రాకపోకలు నరకంగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్ల విస్తరణ, మరమ్మతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నివేదికలు పంపారు. ఈ మేరకు అప్పటి ప్రభుత్వం పనులు చేపట్టాలని, ఇందుకు అవసరమైన రూ.7.87 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పనులను కాంట్రాక్టర్ చకచకా చేపట్టారు. 4 కిలో మీటర్లలో ఉన్న రోడ్డు కల్వర్టులను నిర్మించారు. పుంగమ్మ చెరువు కట్టను విస్తరించి బలోపేతం చేసేందుకు సైడ్ వాల్స్ నిర్మించారు. ఇలా ఉండగా ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పనులు ఆపివేయాల్సి వచ్చింది. అలాగే చౌడేపల్లె మండలం కల్లుపల్లి – చౌడేపల్లె రోడ్డు 8 కిలో మీటర్లు రూ.12.49 కోట్లు , రొంపిచెర్ల మండలం పెద్దమల్లెల – ఎర్రావారిపాళెం 14 కిలో మీటర్ల రోడ్డు రూ.20.59 కోట్లు, సోమల మండలం సోమల–పెద్ద ఉప్పరపల్లె రోడ్డు వయా నంజంపేట 5 కిలో మీటర్లకు రూ.11.42 కోట్లతో పాటు టెండర్ల స్టేజ్లో ఉన్న సదుం మండలం చెరుకువారిపల్లె – మతుకువారిపల్లె రోడ్డు 4 కిలో మీటర్లకు రూ.9 కోట్లు. చెరుకువారిపల్లె–నంజంపేట రోడ్డుకు 17 కిలో మీటర్లకు రూ.40 కోట్లు మంజూరు చేసింది. అనేక పనులు ప్రారంభించి మధ్యలో ఆగిపోయాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం మారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో పుంగనూరుపై కక్ష కట్టింది. ఎంతో అవసరమైన ప్రధాన రహదారుల పనులను నిలిపివేసి , అనుమతులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కక్షతో కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ పాలనలో మంజూరు చేసిన రూ.56 కోట్ల రోడ్డు పనులను రద్దు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. గుంతలమయంగా మారిన రోడ్లలో ప్రయాణాలు సాగించలేక నరకయాతన పడుతుంటే ప్రజల బాధ చూడలేక పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్రెడ్డి కలిసి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వాటికి రూ.7 కోట్ల నిధులు మంజూరు చేయించారు. ఆ మేరకు 4. కి.మీ మేర కల్వర్టు పనులు కూడా వేగంగా చేపట్టారు. ఈ క్రమంలో ఎన్నికలతో పనులు ఆగిపోయాయి. అనంతరం టీడీపీ అధికారంలోకి రావడంతో పనులు వేగంగా సాగుతాయని ప్రజలు ఆశించారు. కానీ మాజీ మంత్రిపై బాబు కక్షతో ప్రజలు ఎన్ని కష్టాలు పడినా తనకేమనే విధంగా కుంటిసాకులతో రోడ్ల పనులను రద్దు చేయడంతో పుంగనూరులో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.గుంతలమయంగా బెంగళూరు రోడ్డుపట్టణం నుంచి శంకర్రాయలపేట–బెంగళూరు రహదారి అధ్వానంగా ఉంది. దీంతో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. పుంగమ్మ చెరువు కట్టపై గల రోడ్డు దారుణంగా మారింది. అలాగే యాబైరాళ్ల మొరవ వద్ద పెద్ద గుంతలు పడ్డాయి. డాన్బోస్కో స్కూల్ , అరవపల్లి వద్ద, ఇటుకల బట్టీల వద్ద, ఆంజనేయస్వామి గుడి సమీపం , బైరేబండ సమీపం, కంపోస్ట్ యార్డు సమీపంలో లెక్కలేనన్ని గుంతలు పడ్డాయి. ఈ రహదారిలో కార్లు, ద్విచక్రవాహనాలు, బస్సులు ప్రయాణించాలంటే నరకయాతన పడుతున్నారు. -
పీవీకేఎన్ కళాశాలకు నాక్ ‘ఏ’ గ్రేడ్
జిల్లాలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నాక్ ‘ఏ’ గ్రేడ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.సర్వం సిద్ధం.. దక్షిణ కై లాసం శ్రీకాళహస్తి: మహాశివరాత్రి ఉత్సవాలకు శ్రీకాళహస్తి క్షేత్రం సర్వం సిద్ధమైంది. శుక్రవారం నుంచి 14 రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు జరగనున్నాయి. సోమవారం ముక్కంటికి ప్రియభక్తుడైన భక్తకన్నప్ప ధ్వజారోహణంతో ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. శ్రీకాళహస్తి పట్టణం విద్యుత్ దీపకాంతులతో విరాజిల్లుతోంది. స్వర్ణముఖి నది వంతెనపై నుంచి శ్రీకాళహస్తీశ్వరాలయం గురువారం రాత్రి శోభాయమానంగా దర్శనమిచ్చింది. శ్రీవారి దర్శనానికి 14 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 12 కంపార్ట్మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 72,745 మంది స్వామివారిని దర్శించుకోగా 24,156 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.48 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 14 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. – 8లో -
వేదన.. రోదన
సొంతంగా ఏ పని చేసుకోలేని వారు.. కొందరు పుట్టుకతో.. ఇంకొందరు అనారోగ్యం కారణంగా వైకల్యం బారిన పడినవారు. వీరంతా నిరుపేదలు.. ప్రభుత్వ సాయంతోనే నాలుగు ముద్దలు నోటికాడికి వెళుతున్న దివ్యాంగులు వీరు .. గత ప్రభుత్వాన్ని బూచిగా చూపి పింఛన్లలో కోత పెట్టాలని కూటమి నిర్ణయించింది. కానీ పునఃపరిశీలన పేరుతో సదరం కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో దివ్యాంగుల అగచాట్లు చూస్తే ఎవరికై నా గుండె తరుక్కుపోతుంది.. కానీ అధికారులు.. కూటమి ప్రభుత్వ పెద్దలు వీరిపై కనికరం చూపకుండా దివ్యాంగులను కన్నీళ్లు పెట్టిస్తున్న తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.చిత్తూరు రూరల్ (కాణిపాకం) : కూటమి ప్రభుత్వం చేపట్టిన సదరం సర్టిఫికెట్ల పునఃపరిశీలన ప్రక్రియ దివ్యాంగులకు పిడుగుపాటుగా మారింది. సదరం క్యాంపులకు చేరుకునేందుకు దివ్యాంగులు పడరాని పాట్లు పడుతున్నారు. ఏళ్ల తరబడి మంచం పట్టిన వారిని ఆస్పత్రులకు తీసుకొచ్చేందుకు.. కుటుంబ సభ్యులు అష్టకష్టాలు పడుతున్నారు. లేవలేని స్థితిలో కొందరు.. ఎక్కడికి వచ్చామో తెలియని అయోమయ పరిస్థితిలో మరికొందరు.. గంటల తరబడి నిరీక్షించలేక నీరసించి సొమ్మసిల్లి పడిపోయిన వారు కొందరు.. ఊతకర్ర సాయంతో చేరుకున్న వారు ఇంకొందరితో చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వేదికగా మారింది.కనీస సౌకర్యాలు కల్పించకసదరం క్యాంపునకు వచ్చే వారికి కనీస సౌకర్యాలను కల్పించడంలో అధికారుల తీరు ఏ మాత్రం మారడంలేదు. ఫలితంగా దివ్యాంగులకు చక్రాల కుర్చీలు దొరకడం గగనమవుతోంది. వీటిని కొంత మంది సిబ్బంది గదుల్లో ఉంచి అవసరమైన సమయాల్లో ఇతర పనులకు వినియోగిస్తున్నారు. సదరం క్యాంపులో రీ వెరిఫికేషన్ నిమిత్తం వచ్చే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇవి ఎక్కడున్నాయో ఎవరికీ తెలియడంలేదు. సదరం పరిశీలనకు వచ్చే వారితో ఓపీ విభాగం నిండిపోతోంది. భారీ సంఖ్యలో ఓపీకి రావడంతో ఆ విభాగంలో బాధితులు బారులు తీరుతున్నారు. ఇద్దరు మాత్రమే ఓపీ సేవల్లో పాలుపంచుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు.ప్రభుత్వం తీరుపై మండిపాటు...అధికారంలోకి వస్తే అందరికీ మంచి చేస్తాం. సంక్షేమ పథకాలు అందిస్తాం.. స్వర్ణయుగం లాంటి పాలన అందిస్తామంటూ కూటమి నేతలు ఎన్నికల సమయంలో నమ్మబలికారు. తీరా చూస్తే... అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సంక్షేమ పథకాలు అటకెక్కించిన సంగతి పక్కనపెడితే... దివ్యాంగత్వం పునః పరిశీలన పేరుతో దివ్యాంగులను అష్ట కష్టాలకు గురిచేయడం అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది. ఆస్పత్రుల వద్ద నిరీక్షిస్తున్న దివ్యాంగులను చూసిన వారు అయ్యో అంటూ నిట్టూర్చారు. అవయవ లోపాలతో ఇబ్బందులు పడుతున్న వారిని మళ్లీ గుర్తుచేసి వారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్న తీరును పలువురు తప్పుబట్టారు.బోగస్పై తప్పుడు ప్రచారంబోగస్ పింఛన్ల మంజూరుపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే జరిగిందని బూచిగా చూపిస్తోంది. ఇది పూర్తి అవాస్తమని వైద్యులు, పలువురు దివ్యాంగులు తిప్పికొడుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయం నుంచి జిల్లాలో సదరంలో అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఏ సమస్యలు లేకపోయినా సమస్యలు ఉన్నట్లు సదరం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఈ బోగస్ వ్యవహారం పుంజుకుంది. పింఛన్ నగదు పెరగడంతో సందరానికి ఎక్కడలేని డిమాండ్ పెరిగింది. 2014 తర్వాత వేల సంఖ్యలో సదరం సర్టిఫికెట్లు పుట్టుకొచ్చాయి. కొంత మంది డాక్టర్లు రూ.10 వేల నుంచి రూ. 15 వేలు తీసుకుని ఎలాంటి సమస్యలు లేని వారికి సదరం సర్దేశారు. దీంతో సదరం పింఛన్ల సంఖ్య జిల్లాలో భారీగా పెరిగింది. అంతే తప్ప ఈ వ్యవహారాన్ని కూటమి గత ప్రభుత్వంపై బురదచల్లాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భా గంగా పింఛన్ల కోతకు పదును పెడుతోంది. 60 నుంచి 70 శాతం వరకు పింఛన్లలో కోతలు పెట్టాలని ఆదేశాలున్నట్లు కొంత మంది అధికారులు చెబుతున్నారు.రవాణా సదుపాయం కల్పించక..ఇంటిలో మంచంపైనే ఉన్న ఎంతో మంది దివ్యాంగులు పునఃపరిశీలన కోసం ఆస్పత్రులకు వచ్చేందుకు నరకం చూశారు. వారి కోసం కనీసం రవాణా సదుపాయాలు కల్పించకపోవడంతో వ్యయ ప్రయాసల కోర్చి ఆస్పత్రులకు చేరుకున్నారు. 15 నుంచి 20 ఏళ్లుగా పింఛన్ అందుకున్నప్పటికీ మళ్లీ పునఃపరిశీలన దేనికో అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కదల్లేని, లేవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు, మానసిక దివ్యాంగులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురావడానికి వారి బంధువులు అవస్థలు పడ్డారు. ఇక్కడికి రాకపోతే పింఛన్ తొలగిస్తారని మంచంపై ఉన్న వారిని సైతం ఆస్పత్రికి అతి కష్టం మీద తెచ్చామని పలువురు వాపోయారు.పింఛన్లు కుదించాలని..జిల్లా వ్యాప్తంగా 2,55,818 మంది సామాజిక పింఛన్దారులున్నారు. ఇందులో 35,277 మందికి సదరం గుర్తింపు కార్డులు ఉన్నాయి. వీరికి పునఃపరిశీలన పేరుతో కూటమి ప్రభుత్వం పింఛన్లల్లో కోతలు పెట్టేందుకు పూనుకుంది. గత ప్రభుత్వంలో బోగస్ జరిగిపోయిందని కూటమి తప్పుడు ప్రచారం చేయించి పింఛన్ల తొలగింపునకు సిద్ధమైంది. వీలైనంత వరకు పింఛన్ల సంఖ్యను కుదించాలని కుస్తీ పడుతోంది. అందుకే డాక్టర్లను సైతం మార్పు లు చేసి ఈ పరిశీలనకు ప్రాధాన్యం ఇచ్చింది.నడవలేక..నానా అగచాట్లువీల్చైర్లు, స్ట్రెచర్ల కోసం గంటల తరబడి వెతికినా దొరకడం లేదు. అక్కడక్కడా దయదలిచి సిబ్బంది కొంత మందికి మాత్రమే ఏర్పాటు చేయగలగుతున్నారు. మిగిలిన వారి బాధలు అంతులేనివి. మరోవైపు పెద్దాస్పత్రిలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ఏ మాత్రం ఉపయోగ పడటంలేదు. వీరి కళ్ల ముందే నడవలేక దివ్యాంగులు అగచాట్లు పడుతున్నా పట్టించుకోవడం లేదు. ఇక వీల్చైర్లను వివిధ అవసరాలకు .. పుస్తకాలు, రోగుల బెడ్ షీట్లు, మందులకు సంబంధించిన మెటీరియల్ను ఉంచి నెట్టుకుంటూ వస్తున్నారు. ఇలా ఇతర పనులకు వీల్ చైర్లు దర్జాగా వినియోగిస్తున్నారు.జిల్లాలోని పింఛన్ల సమాచారందివ్యాంగ 35,277అంగవైకల్యం 19,927అంధత్వం 3,093వినికిడి లోపం 5,332మానసిక వికలత్వం 5,283బహుళ వైకల్యం 1,642నాలుగు విభాగాలు ఏర్పాటు..దివ్యాంగ పింఛన్దారులను రీ వెరిఫికేషన్ సెంటర్లకు రప్పిస్తోంది. గత నెల ప్రారంభమైన ప్ర క్రియ జూన్ వరకు కొనసాగనుంది. జిల్లాలోని 4 ఏరియా, 8 సీహెచ్సీ ఆస్పత్రులు.. చిత్తూరు నగరంలోని ప్రభుత్వ పెద్దాస్పత్రిలో కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అంధత్వం, చెవిటి, మూగ, ఎముకల సంబంధిత, మానసిక దివ్యాంగుల దివ్యాంగత్వాన్ని పునఃపరిశీలనకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఒక్కో విభాగానికి 50 మంది నుంచి 60 మంది వరకు దివ్యాంగులు వస్తున్నారు. -
అనుచితం..
●టీటీడీ పాలకమండలి సభ్యుడి అనుచిత వ్యాఖ్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి సన్నిధిలో దుర్భాషలాడడంపై మండిపడుతున్నారు. భక్తుల సేవలో నిమగ్నమైన ఉద్యోగిని అవహేళన చేయడంపై ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో టీటీడీ ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన తెలిపారు. బుధవారం ప్రెస్క్లబ్లో విలేకర్లతో మాట్లాడారు. నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తిస్తుంటే దౌర్జన్యం చేయడమేంటని ప్రశ్నించారు. ఉద్యోగిని అవమానించిన బోర్డు మెంబర్ నరేష్కుమార్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట నిరసనకు దిగనున్నట్లు స్పష్టం చేశారు. టీటీడీ ఉద్యోగిని దూషిస్తున్న బోర్డు సభ్యుడు నరేష్కుమార్ (ఫైల్)పవిత్రతను కాపాడాలి టీటీడీ ఉద్యోగిపై దౌర్జన్యా నికి పాల్పడిన బోర్డు సభ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. తద్వారా భక్తుల్లో ఆఽత్మస్థైర్యాన్ని నింపాల్సిన అవసరం టీటీడీ యాజమాన్యం, ప్రభుత్వంపై ఉంది. అత్యున్నత స్థాయి పాలక మండలిలో సభ్యుడై ఉండి కనీస మర్యాద పాటించకుండా బూతులు మాట్లాడడం అత్యంత దుర్మార్గం. ఏళ్ల తరబడి భక్తుల సేవలో ఉన్న ఉద్యోగుల పట్ల సద్భావంతో వ్యవహరించి టీటీడీ పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది. – కందారపు మురళి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి. తిరుపతి కల్చరల్ : పవిత్రమైన తిరుమల శ్రీవారి సన్నిధిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి బాలాజీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్కుమార్ తీరును వ్యతిరేకిస్తూ గురువారం నిరసనకు దిగనున్నట్లు టీటీడీ ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. ఈమేరకు బుధవారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీటీడీ వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగ సంఘ నేతలు మాట్లాడారు. టీటీడీ బోర్డు ఆదేశాల మేరకు తిరుమలలో ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. టీటీడీ నిబంధనలను మేరకు పనిచేస్తూ భక్తులకు నిరంతరం సేవలు అందిస్తున్నారని వెల్లడించారు. పవిత్రమైన టీటీడీ బోర్డులో స్థానం దక్కిన బోర్డు సభ్యులు సైతం నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు విరుద్ధంగా బోర్డు సభ్యుడు నరేష్కుమార్ కేవలం రెండు నిమిషాల్లో ఆలయ మహద్వారం ఎగ్జిట్ గేటును తీయలేదని ఓర్పును కోల్పోయి అసభ్యంగా మాట్లాడుతూ ఉద్యోగి బాలాజీని అవమానించడం దుర్మార్గమన్నారు. గత మూడు నెలలుగా ఇలాంటి ఘటనలు పునరావృత్తం కావడంతో ఉద్యోగులు బలవుతున్నారని వాపోయారు. భవిషత్తులో ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా సమష్టిగా సమావేశమై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అనుచిత వ్యాఖ్యలతో అవమానించిన టీటీడీ బోర్డు సభ్యుడిపై తక్షణ చర్యలు తీసుకోవాలని, ఉద్యోగులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్తో నిరసన చేపడుతు న్నట్లు ప్రకటించారు. ఉద్యోగిపై టీటీడీ బోర్డు సభ్యుడు వ్యవహరించిన తీరును పలువురు విమర్శించారు.టీటీడీ బోర్డు సభ్యుడి వ్యవహారశైలిపై ఉద్యోగుల ఆగ్రహం తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ నేడు పరిపాలన భవనం ఎదుట నిరసన దుర్భాషలు హేయం రాత్రి, పగలు విధులు నిర్వహిస్తూ భక్తులకు సేవలు అందించే టీటీడీ ఉద్యోగులను అవహేళనంగా దుర్భాషలాడి అవమానించడం హేయం. మహద్వారం ఎగ్జిట్ గేటు తీయకూడదని టీటీడీ యాజమాన్యం ఆదేశాలు ఇచ్చింది. అధికారుల ఆదేశాలను పాటిస్తే తప్పుగా భావిస్తూ సహనం కోల్పోయి ఉద్యోగిని అందరి ముందు తిట్టడం సరికాదు. ఇలాంటి చర్యలను ఉద్యోగులు ఖండించకపోతే భవిషత్తులో వారిపై చులకన భావనం పెరిగే ప్రమాదం. ఉద్యోగిని తిట్టిన టీటీడీ బోర్డు సభ్యుడిపై చర్యలు తీసుకునే వరకు పోరాటం సాగిస్తాం. – హేమలత, టీటీడీ పద్మావతి మహిళా అసోసియేషన్ అధ్యక్షులు క్షమాపణ చెప్పాలి సనాతన ధర్మాన్ని పాటి స్తూ ఆధ్యాత్మిక చింతనతో వ్యవహరించాల్సిన టీటీడీ బోర్డు సభ్యుడు విధి నిర్వహణలో ఉన్న టీటీడీ ఉద్యో గి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత దారుణం. మహద్వారం గేటు తీయడంలో ఆలస్యం చేశారన్న నెపంతో నిగ్రహాన్ని కోల్పోయి అందరి ముందు బూతులు తిడుతూ హేళనం చేయడమేకాక ఆలయం వెలుపలకు వెళ్లిపో అని హెచ్చరిక చేయడం హేయమైన చర్య. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి. – పి.మురళి, సీపీఐ జిల్లా కార్యదర్శి కించపరచడం తగదు నిరంతరం భక్తులకు సేవలందిస్తూ విధులు నిర్వహించే టీటీడీ ఉద్యోగి బాలాజీని టీటీడీ బోర్డు సభ్యుడు సహనానం కోల్పోయి కించపరచడం తగదు. ఆది ఆయన అజ్ఞానానికి నిదర్శనం. టీటీడీ ఉద్యోగులను అమానించే తీరుకు అందరూ స్వస్తి పలకాలి. ఇలాంటి వారిపై తక్షణ చర్యలు తీసుకొని ఉద్యోగుల్లో భద్రతా భావాన్ని పెంచేందుకు కృషి చేయాలి. – వంకీపురం పవన్, కల్యాణ కట్ట నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు -
బాలిక మృతిపై విచారణ వేగవంతం
పలమనేరు : మండలంలో పదో తరగతి చదువుతున్న బాలిక మృతిపై స్థానిక డీఎస్పీ ప్రభాకర్, సీఐ నరసింహరాజు బుధవారం గ్రామంతో పాటు బాలిక చదివిన పాఠశాలలో విచారించారు. బాలిక తొమ్మిదినెలల గర్భం దాల్చినా ఎందుకు గుర్తించలేదని అక్కడి టీచర్లును ప్రశ్నించారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. దీంతోపాటు స్థానిక ఐసీడీఎస్ సీడీపీఓ ఇందిరా, ఐసీపీస్ అధికారులు గ్రామంలో జరిగిన సంఘటనపై సమగ్రంగా విచారించారు. డీఎన్ఏ టెస్ట్ చేశాకే నిందితుల అరెస్ట్ ఇప్పటికే అనుమానితులుగా పోలీసుల విచారణ చేస్తున్న వారి డీఎన్ఏ, బాలిక ప్రసవించిన బాబు డీఎన్ఏను విజయవాడలోని ల్యాబ్లో పరిశీలించాక పోలీసులు నిందితుడిని గుర్తించేందుకు వీలుంటుంది. అనుమానితులు టీడీపీ సానుభూతి పరులేనా? బాలిక మృతి కేసులో అనుమానితులుగా ఉంటూ పో లీసులు కస్టడీలో ఉన్న ఇరువురు తాపీ పనులు చేసుకొ నే వ్యక్తులు గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతి ప రులుగా తెలుస్తోంది. ఈ కారణంగానే కూటమి నేత లు, స్థానిక ఎమ్మెల్యే గానీ కనీసం బాధితులను పరా మర్శించేందుకు సైతం రాలేదనే మాట వినిపిస్తోంది. కోలుకుంటున్న శిశువు తిరుపతి తుడా: పలమనేరు మండలంలో నవజాత శిశువుకు జన్మనిచ్చి బాలిక మృతి చెందడం తెలిసిందే. ఆ శిశువుకు తిరుపతి రుయాలో వైద్యులు మె రుగైన చికిత్స అందిస్తున్నారు. తొలి రెండు రోజులు చిన్నారి ఆరోగ్యం కుదుటపడడం కష్టతరంగా ఉందని వైద్యులు భావించారు. నెలలు నిండకనే జన్మించడం, బరువు తక్కువగా ఉండడం వంటి కారణాలను గుర్తించారు. ప్రస్తుతం ఆరోగ్యం కొంత కుదుటపడుతోందని తెలిపారు. ఆరోగ్యం మెరుగుపడడంతో మధ్యాహ్నం వెంటిలేటర్ సహాయాన్ని తొలగించి సీటాప్ మిషన్పై వైద్యం అందిస్తున్నారు. -
ఫస్ట్ఎయిడ్ నిర్లక్ష్యం
పొరపాట్లకు తావివ్వొద్దు.. పది, ఇంటర్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ● ఆర్టీసీ బస్సుల్లో ఖాళీ పెట్టెలు ● అలంకారప్రాయంగా ప్రథమ చికిత్స బాక్సులు ● ప్రమాదం జరిగితే ప్రథమ చికిత్స.. గోవిందా.. ● మోటారు వాహన చట్టానికి ఆర్టీసీ అధికారుల తూట్లు ● పట్టించుకోని రవాణా అధికారులు పార్టీకో నిబంధన పార్టీలను అనుసరించి రెవెన్యూ అధికారులు నిబంధనలు మారుస్తుండడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025చిత్తూరు రూరల్(కాణిపాకం) : ఆర్టీసీలో సురక్షిత ప్రయాణమే లక్ష్యం అనే నినాదం బాగున్నా.. కనీసం పాటించాల్సిన ప్రథమ చికిత్స బాక్స్లు ఔషధాలు లేకుండా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బస్సుల నిర్వహణలో లోపాలు తేటతెల్లమవుతున్నాయి. ప్రధానంగా ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఆర్టీసీలో అలంకారప్రాయంగా మారాయి. దీంతో ప్రమాద సమయంలో ప్రథమ చికిత్స దిక్కే లేకుండా పోయింది. మోటారు వాహన చట్టానికి ఆర్టీసీ అధికారులు తూట్లు పొడుస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. నిధులు లేక.. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స ఎంతో అవసరం. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మొదటి 15 నిమిషాలు ఎంతో విలువైనది. క్షతగాత్రుల ప్రాణాలు కాపాడాలంటే ఆ సమయంలో చేసే చికిత్స ఎంతో కీలకం. దీని కోసమే అన్ని వాహనాల్లోనూ ప్రథమ చికిత్స బాక్సులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. కానీ ఆర్టీసీ బస్సుల్లో మాత్రం వీటి నిర్వహణ అధ్వానంగా మారింది. పలు బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో ఉన్న ప్రథమ చికిత్స బాక్సుల్లో అవసరమైన మందులు మచ్చుకై నా కనిపించడం లేదు. కొన్ని బస్సుల్లో గడువు తీరిన మందులు, మరికొన్ని బస్సుల్లో ఖాళీ బాక్సులు, ఇంకొన్ని బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సుల్లో ఇతర వస్తువులు కనిపిస్తున్నాయి. ప్రథమ చికిత్స బాక్సులో ఉండాల్సినవి.. ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాల్సిన సామగ్రి 17 రకాల దాకా ఉన్నాయి. ఎలాస్టిక్ బ్యాండేజ్ రోలర్స్ 5, బెటాడిన్ అయింట్మెంట్, డెటాల్ లేదా ఐయోడిన్, స్టెరిలైజ్డ్ కాటన్ బండిల్స్, నియోసిన్ పౌడర్ డబ్బా, సర్జికల్ బ్లేడ్, బర్నాల్ ఆయింట్ మెంట్, వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్, బ్యాండ్ ఎయిడ్ ప్లాస్టర్లు, నైట్రోజన్, పెరాక్సైడ్, దూది, స్పిరిట్, పెయిన్ కిల్లర్ మాత్రలు, కడుపు నొప్పి, జ్వరం, విరేచనాలకు మాత్రలు తదితరాలు అందులో ఉండాలి. అలసత్వంలో అధికారులు ఫస్ట్ ఎయిడ్ బాక్సుల్లో మందులు ఏర్పాటు చేయకపోతే బస్సులను సీజ్ చేసే అధికారం ఆర్టీఓ స్థాయి అధికారులకు ఉంటుంది. అయినప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ నిర్వహణలో ఉన్న వాటిని ప్రభుత్వ బస్సులేనన్న భావనతో రవాణా అధికారులు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి. అనుమతుల కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లినప్పుడు మాత్రమే అలంకారప్రాయంగా వీటిని ఏర్పాటు చేస్తుంటారు. ఆ తర్వాత మళ్లీ కనిపించవు. ప్రతి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిస్పెన్సరీ ఉంది. అవి లేని చోట జిల్లా ఆస్పత్రులు ఉన్నాయి. ప్రథమ చికిత్స బాక్సుల్లో మందులు పెట్టాల్సి వస్తే ఆస్పత్రులకు ఇండెంట్ పెట్టి తీసుకోవచ్చు. అయినప్పటికీ ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. జిల్లాలోని ఆర్టీసీ బస్సుల వివరాలు.. – 8లో– 8లో– 8లోన్యూస్రీల్ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవరూ ఊహించలేం.. అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం సంభవిస్తే అందుకు తగ్గ ఏర్పాట్లు ఆర్టీసీ అధికారులు చేసుండాలి. అర్ధరాత్రి సమయాల్లో ప్రమాదం జరిగితే ఆర్టీసీ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్లో కనీసం దూది కూడా ఉండడం లేదు. రోజు లక్షల సంఖ్యలో ప్రయాణిస్తున్న బస్సుల్లో ఇంత నిర్లక్ష్యం కనిపిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రయాణికుల భద్రత గాలిలో దీపంలా మారింది. వీటిని ప్రతినెలా పర్యవేక్షించాల్సిన రవాణా అధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేసి మమ అనిపిస్తుండడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిపోల సంఖ్య 5 మొత్తం బస్సుల సంఖ్య 400 పల్లెవెలుగు 233 ఎక్స్ప్రెస్ 100 సప్తగిరి ఎక్స్ప్రెస్ 33 సూపర్లగ్జరీలు 30 ఇంద్ర 04 రోజువారి తిరిగే కి.మీ 1.50 లక్షలు రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య 1.11 లక్షలు మొక్కుబడిగా పెట్టి.. వదిలేయడం కేంద్ర మోటారు వాహన చట్టం 1939 ప్రకారం ప్రయాణికుల వాహనాల్లో విధిగా ప్రథమ చికిత్స బాక్సులు ఏర్పాటు చేయాలి. ఈ చట్టాన్ని మరింత పటిష్ఠం చేస్తూ 1988లో మరిన్ని సవరణలు చేశారు. నిబంధనల ప్రకారం ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు, ఇతర వస్తువులను బాక్సుల్లో ఉంచాలి. లైసెన్సు పొందే ముందు బస్సు డ్రైవర్, కండక్టర్ తప్పనిసరిగా వారం రోజుల పాటు ప్రథమ చికిత్స చేయడంపై శిక్షణ పొందాలని, ప్రతి మూడేళ్లకోసారి లైసెన్సును పునరుద్ధరించుకోవాలని చట్టం నిర్దేశిస్తుంది. ప్రయాణికులు గాయపడితే వారికి ప్రథమ చికిత్స చేసే సామర్థ్యం బస్సు డ్రైవర్, కండక్టర్లకు ఉంటుంది. రవాణా శాఖ అధికారుల నుంచి బస్సులకు ఫిటెనెస్ సర్టిఫికెట్ పొందే సమయంలో మాత్రమే మొక్కుబడిగా ప్రథమ చికిత్స కిట్లను చూపుతున్నారు. ఆ తర్వాత వాటి నిర్వహణను గాలికొదిలేస్తున్నారు. బస్సులు నడిపేటపుడు అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే ఒక్కోసారి కొందరు ప్రయాణికులు గాయపడుతున్న సందర్భాలు ఉంటున్నాయి. అలాంటప్పుడు ప్రథమ చికిత్స కిట్టు ఉంటే కొంతమేర ఉపశమనం ఉంటుంది. ప్రైవేటు అంబులెన్స్ల కోసం .. ఆర్టీసీ బస్సుకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేటు అంబులెన్సులు, ఆటోలు,108 వాహనాల కోసం ఎదురుచూడడం తప్ప మరో దారి లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల భద్రతపై దృష్టి సారించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఎయిడ్ బాక్సుల్లో ఔషధాల కొనుగోలుకు నిధులు మంజూరు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రమాదం జరిగితే అంతేసంగతి..ఆర్టీసీ బస్సుల్లో ప్రథమ చికిత్స పెట్టెల్లో ఔషధాలు ఉండడంలేదు. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న బస్సుల్లోనే నిబంధనలు పాటించకపోతే ప్రైవేటు బస్సుల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుందనేది వాస్తవం. ప్రయాణికుల భద్రతకు నిజంగా విలువనిస్తే ఆర్టీసీ అధికారులు వెంటనే ప్రథమ చికిత్స పెట్టెల్లో అవసరమైన మందులు ఉంచడంతో పాటు, నిర్వహణ సక్రమంగా ఉండేలా పర్యవేక్షించాలి. – బాలాజీ, చిత్తూరు డ్రైవర్లు, కండక్టర్లు నిబంధనలు పాటించాలి ఆర్టీసీ బస్సుల్లో ప్రథమ చికిత్స బాక్సుల్లో అవసరమైన మందులు ఉండేలా డ్రైవర్లు, కండక్టర్లకు సూచించాం. వాటికి తాళాలు వేసి అత్యవసర సమయాల్లో తెరిచి ప్రథమ చికిత్స చేయాలి. ప్రతి నెలా ఫస్ట్ ఎయిడ్ బాక్సులను తనిఖీ చేసుకొని వాటిలో మందులు గడువు తీరితే వెంటనే వాటి స్థానంలో కొత్తవి ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్సులను ప్రయాణికులకు ఉపయోగపడేలా నిర్వహిస్తాం. ఈ విషయంలో డ్రైవర్లు, కండక్టర్లు నిబంధనలు పాటించాలి. – జగదీష్, డీపీటీఓ, చిత్తూరు -
వైద్యులు అలసత్వం వీడాలి
● పీహెచ్సీల్లో ఎందుకు అందుబాటులో ఉండటం లేదు? ● రాత్రి వేళల్లో కచ్చితంగా అందుబాటులో ఉండాలని ఆదేశం ● వరుస సమీక్షల్లో కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది సమయపాలనలో నిర్లక్ష్యం వీడాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లో పలు శాఖలతో వరుస సమీక్షలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. జిల్లాలో 24 గంటల పాటు పనిచేసే పీహెచ్సీల్లో రాత్రి వేళల్లో సిబ్బంది ఎందుకు అందుబాటులో ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పీహెచ్సీల్లో ఓపి ఎంత ? ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ సేవలు అందించే విధానం ను పీహెచ్సీల వారీగా మెడికల్ ఆఫీసర్లతో నిత్యం సమీక్షిస్తామన్నారు. ఎన్సీడీ సర్వే కొన్ని పీహెచ్సీలలో వేగంగా జరుగుతోందని, ఇంకొన్ని చోట్ల నామమాత్రంగా చేస్తున్నారని మండిపడ్డారు. పీహెచ్సీలలో పరికరాల సమగ్ర నివేదికను ఈనెల 21 లోపు అందజేయాలన్నారు. సమీక్షలో డీఎంఅండ్హెచ్ఓ సుధారాణి, డీసీహెచ్ఎస్ ప్రభావతి పాల్గొన్నారు. మార్చి 2 లోపు సర్వే పూర్తి చేయండి జిల్లాలో దారిద్య్ర రేఖకు దిగువనున్న వారిని మార్చి 2లోపు గుర్తించి ఆర్థిక సాధికారతకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అట్టడగు స్థాయిలో ఉంటూ జీవించడానికి కనీస సౌకర్యాలు లేని వారి జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు పీ4 విధానాన్ని (పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్ షిప్) అవలంబిస్తున్నామన్నారు. దారి ద్య్రరేఖకు దిగువనున్న వారిని గుర్తించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ప్రమాణాలను అనుసరించి నేటి నుంచి మార్చి 2 వరకు సర్వే చేయాలన్నారు. సమీక్షలో సీపీఓ సాంబశివారెడ్డి, డీఎల్డీఓ రవికుమార్ పాల్గొన్నారు. -
ఎన్నికల గౌరవ వేతనం రూ.1.44 కోట్ల విడుదల
చిత్తూరు కలెక్టరేట్ : గత సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బంది గౌరవ వేతనం రూ.1.44 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మేరకు జిల్లాలో గత సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన అధికారులు, సిబ్బందికి కలెక్టరేట్ ఎన్నికల విభాగం త్వరలో జమ చేయనుంది. సులభ పద్ధతుల్లో బోధన కార్వేటినగరం : ఉపాధ్యాయులు తమ తరగతి బోధనాంశ ప్రక్రియలో గుర్తించిన సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రణాళిక వేసుకుని, అమలు చేసి వివరాలను రికార్డు చేయడమే యాక్షన్ రీసెర్స్ అని జిల్లా విద్యాశిక్షణ సంస్థ (డైట్) ప్రిన్సిపల్ డాక్టర్ శేఖర్ పేర్కొన్నారు. బుధవారం డైట్ ఆడిటోరియంలో ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. విద్యార్థులకు సులభ పద్ధతిలో అర్థమయ్యే విధంగా బోధన చేపట్టడానికి ఈ శిక్షణ దోహద పడుతుందన్నారు. ఎంపిక చేసిన ఉపాధ్యాయులు డైట్లో నిర్వహించే యాక్షన్ రీసెర్చ్కు అనుగుణంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించి ఆ అంశాలను విద్యార్థులకు బోఽధించాలని చెప్పారు. కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్లు ప్రభాకర్, చెంగల్రాజు, సునీత, నిర్మల, దేవప్రసాద్, రఫీ, అనిత, నాగరాజునాయక్, పలువురు ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మోడల్ ఫౌండేషన్ పాఠశాలలు సందర్శించండి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఉన్న మోడల్ ఫౌండేషన్ పాఠశాలలను సందర్శించాలంటూ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ వెంకట కృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు డీఈఓ కార్యాలయానికి అందాయి. ఆ మేరకు జిల్లాలోని మోడల్ ఫౌండేషన్ పాఠశాలలను సందర్శించాలని ఆదేశించారు. ఈసీసీఈ, ఎఫ్ఎల్ఎన్ కార్యకలాపాల ప్రదర్శన తరగతులను పర్యవేక్షించాలన్నారు. పర్యవేక్షించేందుకు జిల్లాలోని డైట్ అధ్యాపకులను నియమించారు. రీసర్వేను పారదర్శకంగా నిర్వహించాలి తవణంపల్లె : రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఆదేశించారు. బుధవారం సాయంత్రం చెర్లోపల్లెలో రీసర్వేను పర్యవేక్షించారు. సర్వే ఎలా చేస్తున్నారు? ఎప్పటికి పూర్తి చేస్తారని ఆరా తీశారు. పారదర్శకంగా రీసర్వే చేయాలని ఆదేశించారు. ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తగా చేపట్టాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీల గురించి చర్చించారు. తహసీల్దార్ సుధాకర్ రెవెన్యూ సదస్సులో 174 అర్జీలు వచ్చినట్లు వివరించారు. ఇందులో 86 అర్జీలను పరిష్కరించామని మిగిలిన అర్జీలను త్వరలో పరిష్కరిస్తామని వివరించారు. మండల సర్వేయర్ మురళీమోహన్, ఆర్ఐ జీవన్కుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. విలీనబడి కష్టాలు గంగాధరనెల్లూరు : మా పిల్లలను ఊరిలోని బడికి కాకుండా ప్రభుత్వం మెర్జ్ చేసిన గ్రామానికి దూరంగా ఉన్న మరో పాఠశాలకు పంపలేమని మండల పరిధిలోని కట్టకందపల్లి హరిజనవాడ గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ–1 ఆంజనేయులు శెట్టికి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఎస్ఎంసీ చైర్మన్ బాబు మాట్లాడుతూ.. కట్టకందపల్లి హరిజనవాడ నుంచి వేపంజేరి గ్రామానికి మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్నందున మా పిల్లలను ఆ పాఠశాలకు పంపలేమని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలోని పాఠశాలను వేరే పాఠశాలలో కలపడాన్ని తిరస్కరిస్తున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
తిరుపతి సిటీ : మహిళా సాధికారతే లక్ష్యంగా ప ద్మావతి యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తామని వైస్ చాన్సలర్ వి.ఉమ తెలిపారు. బుధవారం ఈ మేరకు వీసీగా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రతిష్టాత్మక విద్యాలయంలో నిపుణులు, సమర్థులైన అధ్యాపకులు ఉన్నారని వెల్లడించారు. బోధన, బోధనేతర సిబ్బంది సహకారంతో వర్సి టీని అంతర్జాతీయ స్థాయి తీసుకెళ్లేందుకు యత్నిస్తామని వివరించారు. అలాగే విద్యార్థినులను నూ తన పరిశోధనల దిశగా ప్రోత్సాహం అందిస్తామని, ఉపాధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నాణ్యమై న విద్యను అందిస్తామన్నారు. ఈ క్రమంలోనే అ న్ని విభాగాల్లో అడ్మిషన్లు పెంచేందుకు చర్యలు చే పడతామని వెల్లడించారు. విద్యార్థినులకు వర్సిటీ లో అధునాతన మౌలిక వసతులు, భద్రతకు ప్రా ధాన్యతనిస్తామని వివరించారు. రేపటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు 21న భక్తకన్నప్ప ధ్వజారోహణంతో ఆంకురార్పణ జరగనుంది. 22న స్వామివారి ధ్వజారోహణం, 26న మహాశివరాత్రి, రాత్రి నందిసేవ, 27న ఉదయం రథోత్సవం, రాత్రి నారద పుష్కరణితో తెప్పోత్సవం, 28న కల్యాణం, మార్చి 2న గిరిప్రదక్షిణ, 4న పల్లకీసేవ, 5న ఏకాంతసేవ, 6న శాంతి అభిషేకాలతో బ్రహ్మోత్సవాలు పరిపూర్ణం కానున్నాయి. -
బైక్ అదుపుతప్పి ఇంటర్ విద్యార్థి మృతి
పుంగనూరు : ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇంటర్ విద్యార్థి మృతి చెందిన సంఘటన బుధవారం పుంగనూరు– ముళబాగిల్ రహదారిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు .. మండలంలోని వనమలదిన్నె పంచాయతీ బసివినాయునిపల్లెకు చెందిన ఆదినారాయణ కుమారుడు సంతోష్ (17) పుంగనూరు బసవరాజ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం స్నేహితుడితో కలసి ద్విచక్ర వాహనంపై పుంగనూరు –ముళబాగిల్ రహదారిలో ఉన్న కత్తార్లపల్లెకు వెళ్లి తిరిగి వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడటంతో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఫుట్బాల్ సమాఖ్యకు పీడీ ఎంపిక పలమనేరు : పట్టణానికి చెందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీడీగా పనిచేస్తున్న విక్రమ్రాజ్ ఆల్ ఇండియా ఫుట్బాల్ సమాఖ్యకు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన ఎంపికల్లో జిల్లా నుంచి ఈయన మాత్రమే ఎంపిక అయ్యారు. -
బోయకొండలో లక్ష కుంకుమార్చన
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో ఏటా మాఘ మాసంలో వైభవంగా నిర్వహించే లక్ష కుంకుమార్చన కార్యక్రమం బుధవారం ప్రారంభమయింది. బోయకొండ ఆలయంలో 16 ఏళ్లుగా హిందూ సంప్రదాయ రీతిలో లక్ష కుంకుమార్చనను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛరణాల మధ్య అమ్మవారి ఉత్సవమూర్తికి ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడు రోజులపాటు సాగే కుంకుమార్చనలో భాగంగా అమ్మవారి ఉత్సవ మూర్తి ఎదుట ప్రత్యేక పూజలు, గణపతి, చండీహోమం, మహా మంగళ హారతి చేశారు. 142 మంది దంపతులు కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు. భక్తులతో ఆలయం రద్దీగా మారింది. అనంతరం ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఉభయదారులకు అమ్మవారి వెండి కాయిన్తో పాటు శేషవస్త్రం, తీర్థప్రసాదాలను దంపతులకు అందజేశారు. -
పది, ఇంటర్ పరీక్షల్లో పొరపాట్లకు తావివ్వొద్దు
– సమీక్షలో కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ చిత్తూరు కలెక్టరేట్ : పది, ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ మొదటి , ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తారన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఇంటర్ పరీక్షలకు మొత్తం 30,652 మంది పరీక్షకు హాజరు కానున్నట్లు ఇందులో మొదటి సంవత్సరం 15,482 మంది (జనరల్– ఒకేషనల్), ద్వితీయ సంవత్సరం 15,170 మంది (జనరల్– ఒకేషనల్) విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 1 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. జిల్లా వ్యాప్తంగా 118 కేంద్రాల్లో రెగ్యులర్ 20,954 మంది, ప్రైవేట్ 294 మంది మొత్తం 21,248 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు చీటింగ్కు పాల్పడిన ఎక్జామినేషన్ యాక్ట్ కింద చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్.... జిల్లాలో ఇంటర్ , పదో తరగతి పబ్లిక్ పరీక్షల కేంద్రాలు, స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ను అమలు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ మోహన్కుమార్, ఇంటర్మీడియట్ డీవీఈఓ సయ్యద్ మౌలా, డీఈఓ వరలక్ష్మి, తదితర అధికారులు పాల్గొన్నారు. -
ద్రవిడ వర్సిటీ.. ఇన్చార్జి పాలన
● పెండింగ్లో వీసీ నియామకం ● ముందుకుసాగని అభివృద్ధి పనులు కుప్పం : కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో 9 నెలలుగా ఇన్చార్జి వీసీ, ఇన్చార్జి రిజిస్ట్రార్లతో పాలనను కొనసాగిస్తున్నారు. దీంతో వర్సిటీలో అభివృద్ధి ముందుకు సాగక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారుతోంది. కూటమి అధికారంలోకి రాగానే ద్రవిడ వర్సిటీ వీసీగా ఉన్న ఆచార్య కొలకలూరి మధుజ్యోతి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే వర్శిటీ ఇన్చార్జి వీసీగా ద్రవిడ వర్సిటీ లైబ్రరియన్ ఆచార్య దొరస్వామిని, కంప్యూటర్ సైన్స్ విభాగంలోని ఆచార్య కిరణ్ కుమార్ను ఇన్చార్జి రిజిస్ట్రార్గా నియమించారు. అప్పటి నుంచి ఒక్క ఎగ్జిక్యూటివ్ సమావేశం జరగకపోవడంతో వర్సిటీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. దీంతో వర్శిటీలో ఎంతో ప్రాముఖ్యం సంతరించుకున్న న్యాక్ గ్రేడింగ్ సైతం ‘బి’ గ్రేడ్కే పరిమితం కావడంపై వర్సిటీలో తీవ్ర స్థాయిలో విమర్శలు నెలకొన్నాయి. ఏడాదిగా జీతాలు అందక .. న్యాక్ పీర్ టీమ్ సైతం వర్సిటీలో పాలనను మెరుగు పరుచుకోవాలని, ఇక్కడి పాలనపై అసహనం వ్యక్తం చేశారు. అదే రెగ్యులర్ వీసీ నియామకం జరిగి ఉంటే న్యాక్ గ్రేడింగ్ మరోలా ఉండి ఉంటుందని వర్సిటీలో కొంత మంది ఆచార్యులు చెబుతున్నారు. దీంతో పాటు వర్శిటీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంవత్సరానికి పైగా జీతాలు అందక అవస్థలు పడుతున్నారు. కేవలం 6 నెలల జీతాలను మొదట్లో అందించి చేతులు దులుపుకున్నారు. వీరికి సైతం జీతాలు అందించేందుకు అధికారులు సతమతమవుతున్నారు. పెండింగ్లోనే నియామకం రాష్ట్రంలో 9కి పైగా వర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించారు. అయితే కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయ వీసీ నియామకం ప్రకటించలేదు. దీంతో వర్సిటీ వీసీ నియామకాన్ని పెండింగ్లో పెట్టడంతో వర్సిటీలో అసంతృప్తి నెలకొంది. రెగ్యులర్ వీసీ లేకపోవడంతో ఇన్చార్జి పాలనతో బోధనా సిబ్బంది పదోన్నతులు , ఉన్నత విద్యకు సంబంధించిన పలు కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. -
మేయర్ దంపతుల హత్య కేసు నిందితుడు చింటూ విడుదల
చిత్తూరు అర్బన్ : చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ అలియాస్ చంద్రశేఖర్ బుధవారం చిత్తూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యాడు. 2015లో జరిగిన జంట హత్యల కేసులో చింటూ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. తొమ్మిదేళ్లకు పైగా ఈ కేసులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న చింటూకు ఇటీవల బెయిల్ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే చింటూపై ఉన్న ఓ పెండింగ్ కేసులో బెయిల్కు దరఖాస్తు చేసుకోకపోవడంతో విడుదల ఆలస్యమయ్యింది. తాజాగా ఆ కేసులో బెయిల్ రావడంతో.. చింటూ జైలు నుంచి విడుదలయ్యాడు. నిందితుడు తిరుపతిలో ఉండాలని, జంట హత్యల కేసు విచారణ సమయంలో మాత్రమే చిత్తూరుకు రావాలనే షరతు ఉండటంతో.. జైలు నుంచి విడుదలయ్యాక తిరుపతికి వెళ్లిపోయాడు. -
● ప్రశ్నించిన మహిళకు నరకం చూపెట్టిన క్లీనర్, డ్రైవర్ ● చిత్తూరులో దిగాల్సి ఉండగా బెంగళూరులో దించిన వైనం
చికెన్షాపు నిర్వాహకుడిపై దాడి పుంగనూరు : పట్టణంలో చికెన్షాపు నిర్వహిస్తున్న అహ్మద్బాషా(45)పై మంగళవారం రాత్రి దాడి చేశారు. బాధితుడి కథనం మేరకు వివరాలు ఇలా.. పట్టణంలోని చింతలవీధిలో నివాసం ఉన్న అహ్మద్బాషా మసీదు వద్ద చికెన్షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది రోజులుగా అతడిపై భార్యకు పలు అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అహ్మద్బాషా చికెన్షాపులో ఉండగా భార్య తస్లిమా, కుమారుడు మహమ్మద్ ఫయాజ్, మరికొంత మంది వచ్చి దాడి చేసి గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన అహ్మద్బాషాను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీతారామాపురంలో చైన్ స్నాచింగ్ వడమాలపేట (విజయపురం ) : వడమాలపేట మండలం సీతారామాపురంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. పట్టపగలే బరితెగించిన చైన్ స్నాచర్లు ఓ మహిళ మెడలో ఉన్న బంగారం గొలుసును తెంపుకుని పరారయ్యారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా.. పుత్తూరుకు వెళ్లడానికి ఓ మహిళ ఆటో కోసం సీతారామాపురం ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న ఓ బంక్ వద్ద వేచి ఉండగా ఇంతలో ముగ్గురు యువకులు బైక్పై వచ్చి బంక్కు కొద్ది దూరంలో నిలుపగా అందులో నుంచి ఓ వ్యక్తి దిగి బంక్ వద్దకు వచ్చి కూల్ డ్రింక్ కావాలని అడిగాడు. ఇంతలో అంగడి యజమాని కూల్ డ్రింక్ కోసం ప్రిజ్ వద్దకు వెళ్లగానే అక్కడ ఆటో కోసం వేచి ఉన్న మహిళ మెడలో ఉన్న బంగారం గొలుసును లాక్కొని పరారరైనట్లు ఎస్ఐ ధర్మారెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బస్సులో అయిదు సవర్ల బంగారం చోరీ చిత్తూరు అర్బన్ : బ్యాగులు బస్సులో ఉంచి ప్రయాణిస్తుండగా బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీనిపై క్లీనర్, డ్రైవర్ను నిలదీయడంతో చిత్తూరులో దిగాల్సిన మహిళా ప్రయాణికురాలిని, బస్సుల్లో ఎక్కించుకొని బెంగళూరులో దించారు. చిత్తూరులో జరిగిన ఈ ఘటనపై తాలూక పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ మల్లికార్జున కథనం మేరకు.. చిత్తూరు నగరంలోని సంతపేటకు చెందిన రమాదేవికి ఇద్దరు పిల్లలు. రెండో కుమార్తె విజయవాడలోని పెనగలూరులో నివాసం ఉంటోంది. ఈనెల 1వ తేదీన కుమార్తె వద్దకు వెళ్లిన రమాదేవి, 10వ తేదీన విజయవాడ నుంచి ఓ ప్రైవేటు బస్సులో చిత్తూరుకు టికెట్ బుక్ చేసుకున్నారు. తన బ్యాగులో అయిదు సవర్ల బంగారు నగలను ఉంచి, బస్సు డిక్కీలో ఉంచగా.. క్లీనర్ తాళాలు వేశాడు. బస్సు చిత్తూరుకు రాగా, బ్యాగుల కోసం చూడగా.. ఆభరణాలు ఉన్న బ్యాగ్ కనిపించలేదు. దీనిపై క్లీనర్, డ్రైవర్లను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. బాధితురాలు గట్టిగా అడిగేసరికి, బస్సు ఎక్కమని చెప్పి, ఆమెను బెంగళూరుకు తీసుకెళ్లి దించేసి.. నీ వల్ల అయ్యింది చేసుకో అంటూ డ్రైవర్లు వెళ్లిపోయారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా బస్సు డ్రైవర్లు కరీముల్లా, రాజేష్తో పాటు క్లీనర్ శివపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పార్టీకో నిబంధన..
● కూటమి నేతలకు అధికారుల మద్దతు ● ముడిపల్లికు ఒక నియమం.. కాకవేడుకు మరొకటి ● కనుమరుగు కానున్న కాలువలు, గట్లు నగరి : పార్టీలను అనుసరించి రెవెన్యూ అధికారుల నిబంధనలు మారుస్తుండడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రైతుల అధీనంలో ఉన్న కాలువ పొరంబోకు అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది. కాలువ పొరంబోకు అధీనంలో ఉన్న నేతలు కూటమి పార్టీకి చెందినవారైతే ఒక నిబంధన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారైతే మరొక నిబంధన అన్న చందంగా పార్టీలను అనుసరించి ఇక్కడ నిబంధనలు మారిపోతున్నాయి. అధికార పార్టీ నేతలు లిఖించిన నిబంధనలే ఇక్కడ అమలవుతున్నాయి. దీనికి మండలంలోని ముడిపల్లి, కాకవేడు ప్రాంతాల్లో కాలువ పొరంబోకుల విషయంలో అధికారుల వ్యవహార శైలి ఇందుకు అద్దం పడుతోంది. కాకవేడు ప్రాంతంలో 40 ఏళ్లుగా వైఎస్సార్సీపీ నేతల స్వాధీనంలోని కాలువ పొరంబోకును అధికారులు స్వాధీనం చేసుకొని ఓ టీడీపీ నేత పొలానికి వెళ్లేందుకు రోడ్డుకు వీలు కల్పించారు. చెరుకు పంట సాగులో ఉన్నా లెక్కచేయక మట్టి తోలి రోడ్డు వేశారు. అడిగితే కాలువ పొరంబోకు ఆక్రమించుకోకూడదన్న సమాధానం అధికారుల నుంచి వచ్చింది. అయితే ఇదే నిబంధన ముడిపల్లి పంచాయతీలోని వెంగన్న కండ్రిగకు వెళ్లేసరికి మారిపోయింది. 2022 సంవత్సరంలో టీడీపీ నేతల అధీనంలో ఉన్న కాలువ, కాలువ పొరంబోకును స్వాధీనం చేసుకొని వెంగన్న కండ్రిగ ఎస్టీ కాలనీకి చెందిన 70 కుటుంబాల వారికి శ్మశానానికి దారి వసతి కల్పించారు. దీంతోపాటు, కొండపై నుంచి జాలువారే నీరు చెరువుకు త్వరగా చేరేలా పునరుద్ధరించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 70 కుటుంబాల అవసరాలను వదిలేసి మళ్లీ టీడీపీ నేతలకే అప్పగించింది. ముడిపల్లిలో కాలువ పొరంబోకును స్వాధీనంలో ఉంచుకున్న రైతులకే అప్పగించడం, కాకవేడులో స్వాధీనంలో ఉంచుకున్న రైతుల నుంచి తీసి దారి ఏర్పాటు చేయడం అధికారుల ద్వంద వైఖరికి నిదర్శనంగా నిలుస్తోంది. దీనిపై వైఎస్సార్సీపీ నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు బుజ్జిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 కుటుంబాలకు ఉపయోగపడే ప్రాంతంలో కాలువ పొరంబోకులో వేసిన రోడ్డును టీడీపీ నేతలకే అప్పగించడం, ఒక టీడీపీ నేత కోసం వైఎస్సార్సీపీ నేతల అధీనంలో ఉన్న భూములు స్వాధీనం చేసుకోవడం చూస్తుంటే రెడ్బుక్ రాజ్యాంగమే అమలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలను అనుసరించి నిబంధనలు మార్చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంలో కలుగజేసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
డీల్ కుదిరితే..
పల్లెల్లో నిరంతరాయంగా త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం ఘనంగా ఉన్నా క్షేత్ర స్థాయిలో చతికిలపడుతోంది. జూన్ నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యం మేడి పండు చందంగా మారింది. గుత్తేదారులు పనులు చేసేందుకు వెళుతున్నా..కమీషన్లు ఇవ్వందే పనులు ముందుకు సాగనివ్వమని స్థానిక కూటమి నేతలు భయపెడుతున్నారు. దీంతో డీల్ కుదుర్చుకుంటేనే పనులు సాగనిస్తున్నారు. ఫలితంగా పనులు నత్తతో పోటీపడుతూ పల్లె ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా మరో కొన్ని నెలలు అందుబాటులోకి వచ్చే పరిస్థితి కానరావడం లేదు. జిల్లా సమాచారం మొత్తం రూరల్ ఫీడర్లు 4209.1 మీటర్ల పోల్స్ పెట్టాల్సినవి 74,000 ఇప్పటి వరకు ఏర్పాటు చేసినవి 16,800 8 మీటర్ల పోల్స్ పాతాల్సినవి 15,000 ఇప్పటి వరకు పెట్టినవి 5,200 ట్రాన్స్ఫార్మర్ల లక్ష్యం 1000 క్షేత్రస్థాయిలో ఏర్పాటు 40 మొత్తం ప్రాజెక్టు విలువ రూ.700 కోట్లు ఇప్పటి వరకు చేసిన వ్యయం రూ.74 కోట్లు చిత్తూరు కార్పొరేషన్ : ప్రతి పల్లెకు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా ఇవ్వాలని 2023లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లాలో రూ.700 కోట్లతో ఆర్డీఎస్ఎస్ (రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్) పథకాన్ని ప్రవేశపెట్టారు. పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమై వేగం పుంజుకుంటున్న సమయంలో ఎన్నికల కోడ్తో పనులు నిలిచిపోయాయి. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యం ఉండగా ఇప్పటి వరకు దాదాపు 10 శాతం నిధులు ఖర్చు చేయగా 25 శాతం పనులు మాత్రమే జరిగాయి. ప్రతిసారి అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకునే టీడీపీ కాంట్రాక్టర్లను మార్పు చేయాలని చూశారు. కుదరకపోవడంతో తమకు కమీషన్ డబ్బులు చెల్లించకుండా పనులు చేయడానికి వీల్లేదని అభివృద్ధికి అడ్డుపడ్డారు. చిత్తూరు, పూతలపట్టులో దాదాపు డీల్ కుదిరినట్లు సమాచారం. ఇక పుంగనూరులో టీడీపీ నేతతో బేరాలు చేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో మధ్యే మార్గంగా వెళుతున్నారు. దీంతో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. అసలే బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఏడుస్తుంటే కూటమి నాయకుల వేధింపులతో అల్లాడుతున్నారు. పనులు వేగం పెంచి నిర్ణీత గడువు పెంచడానికి అనుమతి కోరాలనేది వారి ఉద్దేశ్యం. కానీ క్షేత్రస్థాయిలో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. మెరుగైన సరఫరా కోసం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోని 420 ఫీడర్లలో పనులు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు పలు దశల్లో 123 ఫీడర్ల పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా లో ఓల్టేజీ సమస్య పరిష్కరించి మెరుగైన విద్యుత్ సరఫరా ఇవ్వాలని పెట్టుకున్న లక్ష్యం నీరుగారుతోంది. కేంద్రం 60 శాతం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ పరంగా పనులు చేయాలని నిర్దేశించారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేక ఫీడర్లతో విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. నత్తనడకన ఆర్డీఎస్ పనులు అభివృద్ధికి కూటమి నేతల ఆటంకం గ్రామాలకు త్రీఫేజ్ విద్యుత్ ఇవ్వాలని లక్ష్యం జిల్లాలో రూ.700 కోట్లతో పనులు 25 శాతమే పనులు జరిగిన వైనం జూన్ నాటికి ముగియనున్న గడువు అధికార పార్టీ నేతల దందా సింగిల్ ఫేజ్ విద్యుత్ లైన్ల స్థానంలో.. గ్రామాల్లోని నివాసాలు, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు త్రీఫేజ్ ఇవ్వాలనేది ఆర్డీఎస్ పథకం లక్ష్యం. గ్రామాలకు ఇప్పటి వరకు సింగిల్ ఫేజ్ విద్యుత్ లైన్లు ఉన్నాయి. ఫలితంగా పరిమిత వ్యవధిలో మంచినీటి సరఫరా సాగుతోంది. చాలా గ్రామాలు ఏళ్ల తరబడి లోఓల్టేజీ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇంత వరకూ జిల్లా, మండల కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా అవుతోంది. ఈ కారణాలతోనే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పట్టణాలు, నగరాలకు వెళ్లి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. పల్లెలో విరివిగా స్థలాలున్నప్పటికీ పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి చూపడం లేదు. ఈ సమస్యలను అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆర్డీఎస్ఎస్ పనులు ప్రారంభించారు. -
నేరాల నియంత్రణకు కఠిన చట్టాలు
మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకై నా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అన్న సినీ కవి మాటలు అక్షర సత్యమవుతున్నాయి. ఎక్కడో ఒక చోట నిత్యం మహిళలు, బాలికలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు చోటు చేసుకుంటున్నాయి. ఏ మాత్రం ఆదమరిచినా.. మానవ మృగాలు రెచ్చిపోయి కబళిస్తున్నాయి. తండ్రి స్థానంలో ఉండాల్సిన వ్యక్తులు.. విద్యా బుద్దులు నేర్పించే గురువులు.. వయస్సుతో సంబంధం లేకుండా ఆకృత్యాలకు ఒడిగడుతున్నారు. ముక్కు పచ్చలారని బాలికలపై లైంగికదాడులకు తెగబడుతున్నారు. మూడు రోజుల కిందట పలమనేరులో జరిగిన బాలిక మృతి కలకలం రేపింది. ఇలాంటివి ఒకటి కాదు.. జిల్లాలో పదుల సంఖ్యలో కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. బాలికలపై పెరుగుతున్న లైంగిక దాడులు రెచ్చిపోతున్న మానవ మృగాలు చిట్టి తల్లులకు కడుపుకోత.. అమాయక, పేదరిక బాలికలే లక్ష్యం చిన్నతనంలోనే అమ్మలవుతున్న వైనం కఠిన చర్యలు తీసుకోని అధికారులుకాణిపాకం /చిత్తూరు అర్బన్: జిల్లాలో 15 అర్బన్ హెల్త్ సెంటర్లు, 50 పీహెచ్సీలున్నాయి. వీటి పరిధిలో గత 8 నెలల కాలంలో 27,378 మంది గర్భిణులు నమోదయ్యారు. ఇందులో 2,793 మంది టీనేజీ గర్భిణులను పీహెచ్సీ వైద్యాధికారులు గుర్తించారు. ఏమీ తెలియని వయస్సులో గర్భిణులు కావడం.. ఇవేమీ బయటకు తెలియకుండానే కేసులు సంఖ్య జిల్లాలో విపరీతంగా పెరుగుతున్నాయి. చాలా మంది తెలిసి అబార్షన్లు చేయించుకుంటున్నారు. తెలియక చాలా మంది నెలలు గడవడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో తల దాచుకుంటున్నారు. ఇలాంటి కేసులు జిల్లాలో ప్రతి నెలా పదుల సంఖ్యలో బయట పడుతున్నాయి. కొంత మంది తల్లిదండ్రులు పరువు పోతుందని భావించి గుట్టు చప్పుడు కాకుండా ఉండిపోతున్నారు. కొంతమంది పోలీస్లకు ఫిర్యాదు చేస్తున్నారు. మరికొంత మంది వివిధ కారణాలతో బయట పడుతున్నారు. టీనేజీ తల్లుల నమోదు అధికం కొన్ని పీహెచ్సీ పరిధిలో టీనేజీ గర్భిణుల సంఖ్య పెరుగుతోంది. 8 నెలల కాలంలో అధికారికంగా గుడిపల్లె పీహెచ్సీ పరిధిలో 111, ఒగులో 198, పెద్దపంజాణి 84, రామకుప్పం70, కొలమాసనపల్లి 72, ముడిపాపనపల్లి 93, తుంబకుప్పం 105, పైపాళ్యం 88, పలమనేరు, బైరెడ్డిపల్లి, విజయపురం, పాతపేట, మల్లనూరు, రాళ్లబగుదూరు, రాయల్పేట, గంగవరం, పచికాపలం, కార్వేటినగరం, తవణంపల్లి తదితర పీహెచ్ల పరిధిలో సంఖ్య 50 దాటుతోంది. ఆయా ప్రాంతాల్లో ఈ కేసులను తగ్గించేందుకు అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఈ కారణంగా మాతా, శిశు మరణాలు సంభవిస్తున్నాయి. వీటిపై ప్రతి నెలా సమీక్షలు చేస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. చెడు వ్యసనాలు, పెద్దల భయం లేకపోవడం ఉచిత అంతర్జాలం, సినిమాల ప్రభావం, చెడు వ్యసనాలు తదితర కారణాలతో కొందరు మగాళ్లు మృగాలుగా మారుతున్నారు. బాధ్యతలు తెలియకపోవడం, పెద్దల భయం లేకపోవడం, అధికంగా యువకులే ఇలాంటి వాటికి పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చట్టలు ఏం చేస్తాయనే ధీమాతో లైంగిక దాడులకు ఒడిగడుతున్నారు. ఇక బాలికలకు సైతం సమాజంపై సరైనా అవగాహన లేక గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. కుటుంబ సభ్యులు గుర్తించి .. చెప్పాల్సినవి.. బాలికల అమాయకత్వం వెంటాడుతున్న పేదరికం, నిరాక్షరాస్యత తల్లిదండ్రుల పిల్లలకు శరీర భద్రత గురించి అవగాహన కల్పించాలి. చిన్న వయసు నుంచే సొంతంగా మల, మూత్ర విసర్జనకు వెళ్లడం నేర్పించాలి. శరీరంలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చదువుకోలేని అమ్మాయిలకు చెప్పడం. సహజంగా తాకడానికి ఉద్దేశపూర్వకంగా తగలడానికి ఉండే వ్యత్యాసాన్ని వివరించి చెప్పాలి. ఎవరైనా అభస్యంగా ప్రవర్తిస్తుంటే వెంటనే తల్లిదండ్రులు, బడిలో ఉపాధ్యాయులకు చెప్పమనాలి. తమతో ఎవరైనా ఇబ్బందికరంగా ప్రవర్తించినప్పుడు గట్టిగా అరవడం ద్వారా చుట్టుపక్కల వారి సాయం పొందాలని వివరించాలి. తల్లిదండ్రులకు తెలియకుండా ఎంత తెలిసిన వారివెంటైన వెళొద్దని చెప్పాలి. ఆత్మరక్షణ విద్య కచ్చితంగా నేర్పించాలి. మాయమాటలకు మోసపోతున్నారు.. పిల్లలను తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడినా కొంత మంది మానవ మృగాలుగా మారి కాసుకు కూర్చుంటున్నారు. సమాజంలో బాలికపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. వీటిపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి రోజు పిల్లల కోసం సమయం కేటాయించి..తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలి. మాయమాటలకు మోసపోకుండా చూడాలి. చాకెట్లు, బిర్యానీలు, ఇష్ట్టమైన తినుబండారాలు ఇచ్చి మాయలోకి దింపుతారు. జాగ్రత్తగా ఉండాలి. – మల్లికార్జున, తాలూకా ఎస్ఐ, చిత్తూరు ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు పిల్లల చుట్టూ ఉన్న అపరిచితులను గుడ్డిగా నమ్మరాదు. ఎదుటి వ్యక్తి వింత ప్రవర్తనను పసిగట్టాలి. పిల్లలు బాధపడుతున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రత్యేకించి దుర్మార్గమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి స్నేహితుడో, కుటుంబ సభ్యుడో, జీవిత భాగస్వామినో అయితే పిల్లల భద్రత, వారి ఆనందం పూర్తిగా మీపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. పిల్లలకు శరీరంలోని కొన్ని ప్రాంతాలు వారి సొంతమనే భావనను పెంపొందించాలి. భయపెడితే భయపెట్టిస్తారు. – జయప్రియ, మానసిక వైద్యులు, చిత్తూరు ప్రాణానికే ప్రమాదం బాధ్యత తీరిపోతుందని చాలా మంది 18 ఏళ్లలోపే పెళ్లిళ్లు చేస్తున్నారు. మరికొంత మంది మాయగాళ్ల వలలో పడి చిన్నతనంలోనే పెళ్లి చేసేస్తున్నారు. మరికొంత మంది ప్రస్తుత ప్రభావంతో దారి తప్పు తి గర్భిణులవుతున్నారు. ఇది చట్టరీత్యానేరం. అయినా ఈ విషయాన్ని మరిచిపోతున్నారు. చిన్నతనంలో తల్లులువుతున్నారు. శారీరక సమస్యలు తెచ్చుకుంటున్నారు. కొంత మంది ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. – ప్రభావతి, డీసీహెచ్ఎస్, చిత్తూరు లైంగిక దాడుల నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టానికి 2012లో ఆమోదం లభించింది. ఆ ఏడాది జూన్ 19న ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం పొందింది. జూన్ 20న గెజిట్లో నోటిఫై చేశారు. చట్టంలో పేర్కొన్న మేరకు బాలిక ఆమోదం తెలిపినా, తెలపకపోయినా 18 ఏళ్ల లోపు ఏ వ్యకి అయినా లైంగిక కలయిక జరిగితే అది లైంగిక దాడిగానే పరిగణించబడుతుంది. ఇప్పటి వరకూ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 375 ప్రకారం 16 సంవత్సరాలలోపు వ్యక్తి ఆమోదం తెలిపినా, తెలపకపోయినా అది లైంగిక దాడిగా పరిగణించబడుతుంది. కానీ, ఇప్పుడు కొత్త చట్టం, నిబంధనల ప్రకారం అది 18 సంవత్సరాల వయసు గల ఏ వ్యక్తికై నా వర్తిస్తుంది. టీనేజీ గర్భిణుల సమస్యలు ఇలా.. మాతా శిశుమరణాలు సంభవిస్తాయి.. నెలలు నిండకనే పుడుతారు బరువు తక్కువగా పుట్టడం ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం శారీరక లోపాలు కడుపు కోతలుంటాయి..మరిన్ని అనారోగ్య సమస్యలు తప్పవు. -
డీసీఈబీకి పరీక్ష!
కాణిపాకంలో ఇంటలిజెన్స్ డీఐజీ కాణిపాకం : శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని మంగళవారం ఇంటలిజెన్స్ డీఐజీ ప్రకాష్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వేద ఆశీర్వచన మండపంలో పండితులు ఆశీర్వచనాలు చేసి తీర్థప్రసాదాలు ,చిత్రపటాన్ని అందజేశారు. ఈఓ పెంచల కిషోర్, ఏఈఓ ప్రసాద్, సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, కాణిపాక ఎస్ఐ ధరణిధర ఉన్నారు. డీఐజీకి చిత్రపటం అందజేస్తున్న ఈఓ -
పండ్ల పరిశ్రమలో ఆధునిక సాంకేతికత
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలోని రైతులు అత్యధికంగా మామిడి సాగు చేస్తున్నారని, ఫలితంగా పండ్ల గుజ్జు పరిశ్రమలు ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఖర్చులు తగ్గించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని దక్షిణ భారత ఆహార శుద్ధి పరిశ్రమల దారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ బాబి అన్నారు. చిత్తూరు నగరంలోని మ్యాంగో భవన్లో మంగళవారం పరిశ్రమల ప్రతినిధులు, ఆల్ఫా లావల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పూనే, స్వీడన్ దేశ ప్రతినిధులతో యాంత్రీకరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మామిడి గుజ్జు పరిశ్రమ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు అడుగులు వేస్తూ వస్తోందన్నారు. ప్రస్తుతం చాలా పరిశ్రమలు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అసెప్టిక్ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేశాయన్నారు. ఏటా జిల్లాలో సుమారు 8 లక్షల టన్నుల మామిడి పల్ప్ ఉత్పత్తి అవుతోందన్నారు. వీటి తయారీలో ఎప్పటికప్పుడు టెక్నాలజీని పెంచుకుంటూ ఖర్చు తగ్గించే ప్రయత్నం చేయాలన్నారు. ఇందులో భాగంగానే ఆల్ఫా లావల్ ఇండియా, స్వీడన్ దేశ ప్రతినిధులు జిల్లాకు వచ్చారన్నారు. ఉత్పత్తిదారులకు ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు ఆల్ఫా లెవల్ వారు నాణ్యమైన సేవలను అందించేలా చూడాలని వివరించారు. ఆల్ఫా లావల్ స్వీడన్ దేశ ప్రతినిధి పీటర్ నెల్సన్ మాట్లాడుతూ.. తమ సంస్థ ద్వారా జిల్లాలోని మామిడి పరిశ్రమలకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పలు యంత్రాలను సరఫరా చేస్తోందన్నారు. అనంతరం పలు సమస్యలను ఫ్యాక్టరీ నిర్వాహకులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో జిల్లా పండ్ల పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు శివకుమార్, ల్ఫా లవర్ కంపెనీ స్వీడన్ దేశ ప్రతినిధులు, మార్కస్ హాఫ్మాన్, దేశ ప్రతినిధులు శుభాశీస్సు దాస్, ధర్మేశ్, హితేందర్ కుమార్, అతుల్ జోషి, భాస్కర్ ఆనంద్ పాల్గొన్నారు.● స్వీడన్ ప్రతినిధులతో అవగాహన సదస్సు -
వృత్తి విద్యకు ప్రోత్సాహకం
రొంపిచెర్ల : వృత్తి విద్య కోర్సులు ప్రతి విద్యార్థికి అవసరమని మధ్యప్రదేశ్ రాష్ట్రం రాయపూర్ పీఎంశ్రీ కార్యాలయం పరిపాలనాధికారి అజిత్మిస్ట్రా అన్నారు. పీఎంశ్రీ పథకం కింద ఎంపికై న రొంపిచెర్ల బాలుర ఉన్నత పాఠశాలను పరిశీలించేందుకు రెండు రోజుల కిందట వచ్చారు. మంగళవారం విద్యార్థులతో మాట్లాడుతూ.. వృత్తి విద్య ఎంతో అవసరమని, దీని కోసం కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు అర్థిక సాయం అందిస్తోందన్నారు. పదో తరగతి విద్యార్థుల వృత్తి విద్య దస్త్రాలను , ప్రాక్టికల్స్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు వైవా అంశాలను పరిశీలించి మదింపు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మోహన్ రెడ్డి, వృత్తి విద్య ఉపాధ్యాయులు శశికుమార్, దినేష్ పాల్గొన్నారు. -
ఆరిన ఆశా దీపాలు
ఆ పిల్లలను తల్లిదండ్రులు అపురూపంగా చూసుకున్నారు.. తమ కంటిపాపలైన పిల్లలను ఉన్నతంగా చదివించాలని ఆరాటపడ్డారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదం ఆ ఇంటి ఆశా దీపాలను ఆర్పేసింది. ఈ విషాదకర ఘటన బంగారుపాళెం మండలంలో చోటుచేసుకుంది. – బంగారుపాళెం మండలంలోని చైన్నె–బెంగళూరు జాతీయ రహదారి ఆర్ఆర్ నగర్ వద్ద మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కరిడివారిపల్లెకు చెందిన హేమశేఖర్ కుమారుడు గౌతం(21) చిత్తూరు పట్టణంలో ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తగ్గువారిపల్లె పంచాయతీ పరిధిలోని సాయినగర్కు చెందిన బాబు కుమారుడు గణేష్(14) బంగారుపాళెంలో ఓ ప్రెవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. వీరు ద్విచక్రవాహనంపై మొగిలి వెంకటగిరి నుంచి బంగారుపాళెం వైపు వస్తుండగా చిత్తూరు నుంచి పలమనేరు పోతున్న కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో గణేష్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. గౌతం తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. రోడ్డు ప్రమాదంలో తమ పిల్లలు మృతి చెందారన్న విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. విగత జీవులుగా పడి ఉన్న బిడ్డలను చూసి బోరున విలపించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు ఇద్దరు విద్యార్థులు దుర్మరణం -
కేసుల విచారణ వేగవంతం చేయాలి
కేసుల పరిష్కారానికి న్యాయవాదులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి భీమారావు పేర్కొన్నారు.స్త్రీ,శిశు సంక్షేమమే ధ్యేయం గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీ కార్యకర్తలు అందుబాటులో ఉండాలని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పేర్కొన్నారు.బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025● పలమనేరు మండలంలోని ఓ గ్రామంలోని బాలిక గర్భిణి అయింది. మూడు రోజుల కిందట మూర్చ వచ్చి చిత్తూరు జిల్లా ఆస్పత్రికి తీసుకొస్తే ఆరు నెలల గర్భిణిగా గుర్తించారు. ప్రమాదకర స్థితిలో ఉండడంతో వైద్యులు వెంటనే సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. ఆపై పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది. ఆపై పోలీసులు పొక్సో నమోదు చేశారు. ఈ బాలిక గర్భిణి కావడానికి ముగ్గురు వ్యక్తులు, ఓ మహిళ కారణమని గుర్తించినట్లు తెలిసింది. ● చిత్తూరు నగరంలోని ఓ కాలనీకి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆమె తొమ్మిదేళ్ల కుమార్తెతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు. తాను పనికి వెళ్లి వచ్చేసరికి, బాలిక ఏడుస్తోందని.. అడిగితే తనపై వెంకటేష్ లైంగిక దాడికి ప్రయత్నించాడని బాలిక చెప్పిందని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి, పిల్లలపై లైంగిక దాడుల నిరోధక చట్టం (పొక్సో) కింద కేసు నమోదు అయింది. ● చైన్నెకు చెందిన ఓ మహిళ పొట్టకూటి కోసం దుబాయ్ వెళుతూ ఇటీవల తన ఆరేళ్ల కుమార్తెను చిత్తూరు నగరంలోని తన స్నేహితురాలి ఇంట్లో వదలి వెళ్లింది. చిన్నారిపై దాడి చేయడం, ఆమె భర్త లైంగిక దాడికి పాల్పడ్డట్లు గుర్తించిన బాధితురాలి తల్లి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేశారు. ● ఇటీవల చిత్తూరులో ఓ ఆర్ఎంపీ 17 ఏళ్ల ౖబాలికను నమ్మించి పనిలో పెట్టుకున్నాడు. నాలుగేళ్లుగా బాలికపై లైంగికదాడి చేస్తుండటంతో ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడుగానీ తల్లిదండ్రులకు విషయం తెలియలేదు. ఆర్ఎంపీని అరెస్టు చేసినా, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ● చిత్తూరు నగరంలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు బాలికలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని,. ఆరు నెలలుగా బ్యాడ్ టచ్ చేస్తున్నాడని పలువురు ఉపాధ్యాయులు గుర్తించి కలెక్టర్, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారులను కీచక ఉపాధ్యాయుడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని ఆదేశించారు. ఈ మేరకు స్పందించిన అధికారులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉపాధ్యాయుడిపై ఈనెల 6వ తేదీన ఫిర్యాదు చేశారు. ఆపై అతడిని జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. – 8లో– 8లో– 8లోన్యూస్రీల్ -
ఆకతాయికి దేహశుద్ధి
ఐరాల : బ్యాంకుకొచ్చే మహిళా ఉద్యోగులను నిత్యం వేధిస్తున్న ఓ యువకుడిని స్థానికులు పట్టుకుని కరెంటు స్తంభానికి కట్టి దేహశుద్ధి చేసిన సంఘటన మంగళవారం మండలంలోని వైఎస్ గేటులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని కాణిపాకానికి చెందిన ఆకతాయి భూపాల్ వైఎస్ గేటులోని ఓ బ్యాంకు మహిళా ఉద్యోగులు చిత్తూరు నుంచి వైఎస్ గేటుకు ఆర్టీసీ బస్సులో వచ్చే సమయంలో నిత్యం వేధించేవాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆకతాయి మహిళా ఉద్యోగులను వేధించడంపై ఆగ్రహించిన స్థానికులు ఆకతాయిని బంధించి అక్కడే కరెంట్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. దీనిపై ఆకతాయి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సామాజిక మాధ్యమాలకు బానిస కావొద్దు చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థులు సామాజిక మాధ్యమాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని డీసీహెచ్ఎస్ డాక్టర్. ప్రభావతి అన్నారు. మంగళవారం నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో సంసిద్ క్యాంఫోర్డ్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అతిథిగా పాల్గొన్న డీసీహెచ్ఎస్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచి నైతిక విలువలను పెంపొందించాలన్నారు. ఉన్నత ఆశయంతో విద్యార్థులు ముందుకు సాగేలా టీచర్లు బోధన చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే బాలికలకు గుడ్టచ్..బ్యాడ్ టచ్పై అవగాహన పెంపొందించాలని తెలిపారు. అనంతరం ఆ పాఠశాల విద్యార్థులు చేసిన వ్యవసాయం, రైతుల గొప్పదనాన్ని తెలియజేసే విధంగా చేసిన నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మహేష్, పాఠశాల అధినేత శ్రీనివాసరావు, డైరెక్టర్ మాధవి, చైర్పర్సన్ కీర్తి, ప్రిన్సిపల్స్ కేశవులు, కవిత, అరుణ్, వినోద్ పాల్గొన్నారు. ముగ్గురు ఎస్జీటీలను పంపాలని ఆదేశం చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు జిల్లా నుంచి ముగ్గురు ఎస్జీటీలను పంపాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జారీచేసిన ఉత్తర్వులు మంగళవారం డీఈఓ కార్యాలయానికి చేరాయి. రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయంలో విద్యా సమీక్ష కేంద్రంలో విధులు నిర్వహించేందుకు ముగ్గురు ఎస్జీటీలను పంపాలన్నారు. కంప్యూటర్ స్కిల్స్, గణితంలో ప్రావీణ్యం ఉన్న వారిని పంపించాలంటూ డీఈఓను ఆదేశించారు. -
● అధికారి లేకపోవడంతో మూతబడిన కార్యాలయం ● సెక్రటరీ పోస్టు భర్తీలో విద్యాశాఖ నిర్లక్ష్యం ● ప్రశ్నపత్రాల సరఫరాపై ఆందోళన
కీలకమైన జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగంశాఖ 18 రోజులుగా మూతపడింది. ఆ శాఖ సెక్రటరీ గత నెలలో ఉద్యోగ విరమణ చెందారు. అయితే అప్పటి నుంచి నూతన సెక్రటరీని నియమించడంలో జిల్లా విద్యాశాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. పరీక్షల నిర్వహణలో కీలకమైన ఈ శాఖకు దిక్కెవ్వరూ లేకపోవడంతో విమర్శలు వెలువెత్తుతున్నాయి. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల పంపిణీ, ఏటా పదో తరగతి విద్యార్థులకు సంకల్పం స్టడీ మెటిరీయల్ అందజేయడంలో జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం శాఖ ( డీసీఈబీ) కీలక పాత్ర పోషిస్తుంది. ఆ శాఖకు సీనియర్ హెచ్ఎంను సెక్రటరీగా నియమిస్తారు. గత నెల వరకు ఆ శాఖ సెక్రటరీగా విధులు నిర్వహించిన పరశురామనాయుడు ఉద్యోగ విరమణ చెందారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఇంకొకరిని నియమించడంలో జిల్లా విద్యాశాఖ అలసత్వం వహిస్తోంది. దీంతో క్షేత్రస్థాయిలో సమస్యలు ఏర్పడుతున్నాయి. నూతన నియామకంలో అలసత్వం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షల నిర్వహణలో డీసీఈబీ సెక్రటరీ కీలకపాత్ర పోషిస్తారు. అలాంటి పోస్టును భర్తీ చేయడంలో జిల్లా విద్యాశాఖ ఎందుకు అలసత్వం వహిస్తుందో అని టీచర్లు గుసగుసలాడుతున్నారు. గత సెక్రటరీ జనవరిలో ఉద్యోగ విరమణ పొందారు. ఆ విషయం జిల్లా విద్యాశాఖ అధికారులకు సైతం తెలుసు. ముందస్తుగా కొత్త సెక్రటరీని నియమించేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే జిల్లా విద్యాశాఖ అధికారులు రాజకీయ ఒత్తిళ్లను భరించలేక పోస్టును భర్తీచేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యాలయం మూత.. జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం సెక్రటరీ కార్యాలయం ఉంది. ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తారు. సమ్మేటివ్ విధానాన్ని అమలు చేసిన గత 4 సంవత్సరాల నుంచి జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగంశాఖను బలోపేతం చేశారు. గతంలో సీనియర్ టీచర్లను అసెస్మెంట్ సభ్యులుగా సైతం నియమించారు. కార్యాలయ పనుల నిమిత్తం ఒక జూనియర్ అసిస్టెంట్ను కేటాయించారు. అయితే 18 రోజులుగా ఆ శాఖ సెక్రటరీ, జూనియర్ అసిస్టెంట్ ఎవరూ కూడా లేకపోవడంతో కార్యాలయం మూతపడింది. ఈ కార్యాలయం ఎప్పుడో తెరుస్తారోనని టీచర్లు ప్రశ్నిస్తున్నారు.జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల వివరాలు.. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 1,931 ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులు 56,452 ప్రాథమికోన్నత పాఠశాలలు 181 ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులు 12,054 ఉన్నత పాఠశాలలు 354 ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 85,685 ప్రశ్నపత్రాల సరఫరాపై సందిగ్ధం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం నుంచే ప్రశ్నపత్రాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు నిర్వహించే సమ్మేటివ్ పరీక్షలకు ప్రశ్నపత్రాలను త్వరలో పంపిణీ చేయాలి. అదే విధంగా ఏటా పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఈ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యే కంగా సంకల్పం మెటిరీయల్ రూపొందిస్తారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ను కేటాయిస్తుంది. బడ్జెట్ లేని పక్షంలో కలెక్టర్ అనుమతితోనైనా మెటీరియల్ను రూపొందించాలి. అయితే ఈ ఏడాది ఎలాంటి మెటీరియల్ను రూపొందించకపోవడంతో విమ ర్శలు వెలువెత్తుతున్నాయి. సంకల్పం మెటీరియల్ను అన్ని సబ్జెక్టుల నిష్ణాతులు రూపొందించేవారు. ఆ మెటీరియల్ ను చదువుకునే వెనుకబడిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేవారు. ఆ మెటీరియల్ లేకపోవడంతో ఈ విద్యాసంవత్సరం పదో తరగతి ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విద్యావేత్తలు వెల్లడిస్తున్నారు. ఈ విషయం పై విద్యాశాఖ అధికారులను సంప్రదిస్తుంటే నోరు మెదపడం లేదు. -
దోబీ ఘాట్ ఆక్రమణలు తగవు
సదుం : మండల కేంద్రంలో దోబీ ఘాట్కు కేటాయించిన స్థలంలో ఆక్రమణలు తగవని బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి తెలిపారు. మండల కేంద్రంలోని కుమారొడ్డుని చెరువు వద్ద 76/1 సర్వే నంబరులో గతంలో రెవెన్యూ అధికారులు దోబీ ఘాట్ కోసం 53 సెంట్ల స్థలం మంజూరు చేశారు. అందులో కమ్యూనిటీ భవనం నిర్మాణం పూర్తి కాగా, దోబీఘాట్ పనులు జరుగుతున్నాయి. కాగా కొందరు రియల్టర్లు ఈ స్థలంలో కొంత భాగాన్ని ఆక్రమించి.. తమ ప్లాట్ల కోసం రోడ్డును ఏర్పాటు చేసుకున్నారని పలు వురు రజకులు కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, తహశీల్దారు హుస్సేన్తో కలిసి కార్పొరేషన్ ఈడీ ఆక్రమిత ప్రదేశాన్ని పరిశీలించారు. అధికారుల సాయంతో దోబీ ఘాట్కు కేటాయించిన భూమికి హద్దులు నిర్ణయించి, జేసీబీతో ట్రెంచ్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రజక సంఘం ఏపీ అధ్యక్షుడు షణ్ముగం, సర్వే సిబ్బంది, నాయకులు బాబురెడ్డి, గోపాల్, నవీన్, గణేష్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తపై మూకుమ్మడి దాడి పలమనేరు : మండలంలోని గొల్లపల్లికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త భాను(42)పై సోమవారం రాత్రి కొలమాసనపల్లికి చెందిన వాసు తదితరులు పది మంది దాకా మూకుమ్మడిగా దాడిచేసి గాయపరిచినట్లు బాధితుడు మంగళవారం తెలిపారు. తాను ఇంటి వద్ద ఉండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గుంపుగా వచ్చి చితకబాదారని ఆపై గ్రామస్తులు అడ్డుకోవడంతో పరారైనట్లు బాధితుడు తెలిపారు. ప్రస్తుతం పలమనేరులోని ప్రభుత్వాసుపత్రిలో భాను చికిత్స పొందుతున్నాడు. జరిగిన సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సీ్త్ర,శిశు సంక్షేమమే ధ్యేయం వి.కోట : సీ్త్ర,శిశు సంక్షేమమే ధ్యేయంగా అంగన్వాడీ కార్యకర్తలు పనిచేస్తూ , నిత్యం వారికి అందుబాటులో ఉండాలని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక బాలికోన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో జ్ఞా నజ్యోతి కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జె డ్పీ చైర్మన్ హాజరయ్యారు. బాలింతలు, గర్భిణులు ,శిశువులకు పౌష్టికాహారం అందించి వారి మెరుగైన ఆరోగ్యానికి కృషి చేయాలన్నారు. ఎంఈఓ–2 మురుగేష్, అంగన్వాడీ సూపర్వైజర్ అరుణశ్రీ, ప్రధానోపాధ్యాయుడు, ఉఫాధ్యాయులు మురళీ, రాఘవేంద్ర, రియాజ్ పాల్గొన్నారు. -
వైద్యసేవల్లో అలసత్వం వహిస్తే చర్యలు
● వైద్యశాఖ సమావేశంలో కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ వెల్లడి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలందించడంలో అలసత్వం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో వైద్యఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్టీఆర్ వైద్యసేవ అమల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. జిల్లాలోని ఏరియా ఆసుపత్రులు, సీహెచ్సీలు, నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగులకు పకడ్బందీగా వైద్యసేవలందించాలన్నారు. రోగులకు వైద్యసేవలందించే విషయంలో ఆరోగ్యమిత్రలు కచ్చితంగా నియమ, నిబంధనలు పాటించాలని తెలిపారు. ఎక్కడైనా అలసత్వం వహిస్తున్నట్లు తనకు ఫిర్యాదులు అందితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్యసేవలు పొందే రోగుల నుంచి నగదు రహిత వైద్యం అందించేలా ఆరోగ్యమిత్రలు చర్యలు చేపట్టాలన్నారు. రోగుల వైద్య సేవల సమాచారం ఎప్పటికప్పుడు యాప్లో నమోదు చేయాలన్నారు. ఆరోగ్యమిత్రలు సమయపాలన పాటించి, విధులను బాధ్యతతో నిర్వర్తించాలని ఆదేశించారు. సమావేశంలో ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో ఆర్డినేటర్ డా.సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
సీనియారిటీ జాబితా పక్కాగా ఉండాలి : డీఈఓ
చిత్తూరు కలెక్టరేట్ : ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా కసరత్తులో ఎలాంటి లోపాలకు తావివ్వొద్దని డీఈఓ వరలక్ష్మి అన్నారు. మంగళవారం డీఈవో కార్యాలయంలో సీనియారిటీ జాబితా కసరత్తు పై సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను పకడ్బందీగా నియమ, నిబంధనల ప్రకారం సిద్ధం చేయాలన్నారు. టీచర్ల సీనియారిటీ జాబితాలో ఇప్పటికే పలు కేడర్ల ప్రాథమిక జాబితా సిద్ధం చేసినట్లు చెప్పారు. అయితే మరోమారు ఆ ప్రాథమిక జాబితాను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక సమస్యలున్నట్లైతే పరిష్కరించాలన్నారు. జాబితాలోని తప్పులను సరిచేయాలని ఆదేశించారు. ఎలాంటి తప్పులు లేని, పారదర్శకమైన సీనియారిటీ జాబితాను తయారు చేసేందుకు సిబ్బంది బాధ్యతతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో ఏడీలు వెంకటేశ్వర్లు, రంగస్వామి, సూపరింటెండెంట్లు వీజీ రమణ, సత్య పాల్గొన్నారు. -
కేసుల విచారణ వేగవంతం చేయాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు చిత్తూరు అర్బన్ : జిల్లాలోని పలు కేసుల పరిష్కారానికి న్యాయవాదులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. కొత్తగా చిత్తూరులో ఆరరోో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి భారతి, మొబైల్ కోర్టు న్యాయమూర్తి పి.వెన్నెల బాధ్యతలు స్వీకరించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీరికి స్వాగతం పలుకుతూ మంగళవారం సాయంత్రం స్థానిక బార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. బార్, బెంచ్ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలన్నారు. కేసుల విచారణ వేగవంతం చేసి సత్వరం తీర్పులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రమేష్, జిల్లా ఫొక్సో కోర్టు న్యాయమూర్తి శాంతి, న్యాయమూర్తులు శ్రీనివాసరావు, ఉమాదేవి, పధ్మజ, మాధవి, శ్రీనివాస్, షేక్బాబాజాన్, బార అసోసియేషన్ అధ్యక్షుడు శంకరనాయుడు, కార్యదర్శి సురేష్రెడ్డి, ఉపాధ్యక్షుడు భూప్రసన్న, న్యాయవాదులు పాల్గొన్నారు. స్కూల్ స్వీపర్స్ సంఘం ఏకగ్రీవం చిత్తూరు కార్పొరేషన్ : జిల్లా స్కూల్ స్వీపర్స్ సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజన్, జిల్లా కార్యదర్శి కోదండయ్య మంగళవారం ప్రకటించారు. మొత్తం 23 మందితో జిల్లా సమితి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా కోదండయ్య, జిల్లా అధ్యక్షురాలుగా ఆశ (గుడిపాల), జిల్లా ప్రధాన కార్యదర్శిగా జయకుమారి (కార్వేటినగరం), జిల్లా ఉపాధ్యక్షులుగా లక్ష్మి (నగరి ), తులసి (పాలసముద్రం), వనిత (బంగారుపాలెం), భువన (వెదురుకుప్పం), జిల్లా సహాయ కార్యదర్శులుగా ఇందిరా (ఎస్ఆర్పురం), మమతా (కార్వేటినగరం), కోకిల (జీడీనెల్లూరు), జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా మంజుల (ఎస్ఆర్పురం), జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా సంధ్య( చిత్తూరు), జిల్లా కోశాధికారిగా రాధ (పెనుమూరు), వీరితో పాటు ఈసీ మెంబర్లుగా రోజా, మమత, దేశమ్మ, కాజముని, రమాదేవిని ఎన్నుకోవడం జరిగిందన్నారు. వీరు మూడు సంవత్సరాల పాటు పదవిలో ఉంటారన్నారు. సైన్స్పై మక్కువ పెరగాలి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని అపోలో యూనివర్శిటీలో ఈనెల 28న జాతీయ విజ్ఞాన దినోత్సవం నిర్వహించనున్నారని కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ తెలిపారు. ఈ మేరకు జాతీయ విజ్ఞాన దినోత్సవ పోస్టర్లను మంగళవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువతకు సైన్స్పై మక్కువ పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ విజ్ఞాన దినోత్సవాలు నిర్వహించడంతో విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంపొందుతాయన్నారు. యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఫ్రొ.వినోద్భట్ మాట్లాడుతూ.. యూనివర్శిటీలో నిర్వహించే కార్యక్రమంలో స్థానిక పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు సైన్స్ ప్రాజెక్టులను రూపొందించి ప్రదర్శించవచ్చన్నారు. వివిధ రంగాల్లో మొత్తం 27 బహుమతులను అందిస్తున్నట్లు చెప్పారు. స్థానిక విద్యార్థులు తమ ఆలోచనలను ప్రాజెక్టుల రూపంలో ప్రదర్శించాలన్నారు. యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో విద్యార్థులకు ప్రాథమికంగా పరిశోధన అభివృద్ధికి ఇలాంటి వేడుకలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ప్రాజెక్టులు ప్రదర్శించేందుకు ఆసక్తి ఉన్న విద్యాసంస్థలు 99595 40302, 98850 85025, 83330 74158 నంబర్లల్లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో పలువురు అపోలో యూనివర్శిటీ సిబ్బంది పాల్గొన్నారు. -
చిన్నారి బలి
మృగాళ్ల మాయమాటలకు● తెలిిసీ తెలియని వయసులో మోసపోయిన బాలిక ● ఇందుకు సహకరించిన ఇద్దరు మహిళలు ● ఆధారాల సేకరించిన వైనం ● పోలీసుల అదుపులో నిందితులు పలమనేరు : తెలిసీ తెలియని వయసులో మృగాళ్ల దాహానికి పదో తరగతి చదువుతున్న బాలిక సోమవారం తనువు చాలించిన విషాదకర ఘటన తెలిసిందే. పేదరికం కారణంగా ఆ బాలిక తల్లిదండ్రులు పొద్దున కూలిపనులకెళితే ఎప్పుడో రాత్రికి గాని ఇంటికి రారు. దీంతో పిల్లలను చూసుకోవాల్సిన సమయం దొరకలేదు. స్కూల్ వదిలాక, సెలవు రోజుల్లో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మైనర్ బాలిక అదే గ్రామానికి చెందిన ఇరువురు మిహిళలతో కాస్త చనువుగా ఉండడమే ఈ ఘాతుకానికి కారణమైందనే సమాచారం ఇప్పుడు పలమనేరు మండలం అంతా చర్చ సాగుతోంది. ఇద్దరు మాయలేడిల మత్తులో.. పలమనేరు మండలంలోని బాలిక గ్రామానికే చెందిన ఇద్దరు మహిళలు పశువులు మేపుకొనే వారు తరచూ మైనర్ బాలిక ఇంటికి వచ్చి చనువుగా ఉంటున్నట్లు తెలిసింది. దీంతో వారు ఆ కుటుంబంలోని పదో తరగతి చదువుతున్న బాలిక, ఏడో తరగతి చదివే ఆమె తమ్ముడు, గ్రామంలో రెండో క్లాస్ చదివే మరో చెల్లితో స్నేహంగా ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ ఇరువురు యువతులకు అదే గ్రామానికి చెందిన తాపీ పనులు చేసే మంజు, నవీన్, మల్లికార్జున బాగా పరిచయస్తులు. ఈ యువతుల ద్వారా మైనర్ బాలికపై వీరు కన్నేసినట్లు తెలుస్తోంది. అభం శుభం ఎరుగని మైనర్ బాలికలు గత ఏడాదిగా వీరికి బిరియాని, తినుబండారాలు ఇస్తూ లోబరుచుకున్నట్లు బాధితురాలి సోదరి తెలిపింది. ఏదేమైనా ఇరువురు కిలాడీ లేడీల సాయంతోనే మృగాళ్లు మైనర్ బాలికను వశం చేసుకున్నట్లు గ్రామంలో అందరి నోటా వినిపిస్తోంది. గతంలో కేసులు నీరుగార్చినందుకే..అనుమానాలు గతంలోనూ మైనర్ బాలికలను గర్భిణులను చేసిన రెండు సంఘటనలు ఈ గ్రామంలో చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులో మృతి చెందిన బాలిక కుటుంబానికి న్యాయం జరగలేదనే మాట ఇప్పుడు సంచలనమైంది. ఈ కేసుల్లోని నిందితులు రాజీ మార్గాలు, రాజకీయ నేతల ద్వారా దర్జాగా తప్పించుకున్నట్లు తెలిసింది. దీంతో ఎవరిని అత్యాచారం చేసినా ఎలాగైనా తప్పించుకోవచ్చుననే భావన యువకుల్లో నెలకొంది. ఈ కారణంగానే ఇప్పుడు పదో తరగతి బాలిక మృతికి కారణమైందనే మాట గ్రామంలో అందరినోట వినిపిస్తోంది. ఇలాంటి కేసుల్లో అసలు నిందితులను వదిలి పెట్టడంతోనే ఇలాంటి దురాఘతాలకు పదే పదే జరుగుతున్నా యని గ్రామస్తులు ఆరోపిస్తుండడం విశేషం. అదుపులో నిందితులు... మైనర్ బాలికను గర్భం చేసి ఆమె మృతికి కారణమైన ఈ కేసులో ఇప్పటికే పోలీసులు పలువురు యువకులు, ఇరువురు మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. రేపోమాపో ఈ కేసుకు సంబంధించి అసలు నిందితులను పోలీసులు పట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎస్పీ మణికంట చందోలు ఆదేశాల మేరకు స్థానిక డీఎస్పీ డేగల ప్రభాకర్, సీఐ నరసింహరాజు ఈ కేసులో నిందితులను కోర్టు ముందు ఉంచేందుకు సిద్ధం అవుతున్నారు. -
అయ్యో బిడ్డా.. ఎంత ఘోరం
● బాలిక అంత్యక్రియలు ● సాయం చేసిన దాతలు ● ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదన్న మాజీ ఎమ్మెల్యే పలమనేరు : కామాంధుడి దాహానికి బలై తొమ్మిది నెలలు కడుపులో బిడ్డను మోసి తనువు చాలించిన బాలిక అంత్యక్రియలు మండలంలోని ఓ గ్రామంలో మంగళవారం అశ్రునయనాల మధ్య నిర్వహించారు. గ్రామస్థులు, బంధువుల రోదనల మధ్య ఆఖరి తంతు పూర్తి చేశారు. ఇలాంటి ఘోరం ఇంకే ఆడపిల్లకు జరగరాదంటూ కుటుంబికులు ఆక్రోశం వెల్లగక్కారు. పేద కుటుంబం కావడంతో గ్రామానికి చెందిన మునస్వామి, వైఎస్సార్సీపీ నేతలు బాలాజీనాయుడుతో కలసి అంత్యక్రియల కోసం రూ.5 వేల ఆర్థికసాయం అందజేశారు. బాలిక చదువుతున్న పాఠశాల తోటి పిల్లలు, ఉపాధ్యాయ బృందం కొంత సాయాన్ని అందించారు. దీంతో బాలిక అంత్యక్రియలు జరిగాయి. పలువురు వైఎస్సార్సీపీ నేతలు బాలిక మృతదేహానికి నివాళి అర్పించి కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఇలాంటివి పునరావృతం కారాదు... ఈ సంఽఘటనపై స్పందించిన పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ తన ప్రగాఢసానుభూతిని తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల రోజూ ఏదో ఓచోట ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనలు జరిగినప్పుడు పోలీసులు ఫొక్సో కేసులను నమోదు చేసి ఆపై చేతులు దులుపుకోవడం షరామామూలైందని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు. ఇలాంటి సంఘటనల కోసమే గత ప్రభుత్వంలో దిశా చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమైయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు, ఐద్వా, కమ్యూనిస్ట్ నేతలు, ప్రజా, మహిళా సంఘాలు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విషాదఛాయలు మైనర్ బాలిక మృతి, ఆస్పత్రిలో శిశువు ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంపై గ్రామంలో ఏ ఇంట్లో చూసినా విషాదం అలుముకుంది. కూలీనాలికెళ్లే తమలాంటి కుటుంబాల్లో బడి కెళ్లే ఆడ పిల్లలను ఎల్లవేలలా చూసుకొనే పరిస్థితి ఉండదని వాపోతున్నారు. ఏదేమైనా గ్రామంలో ఏ నోట విన్నా అయ్యో బిడ్డా ఇలా అయిందనే మాట వినిపిస్తోంది. -
మావిడాకులు
భార్య, భర్తలకు కౌన్సెలింగ్ ఇస్తున్న గృహహింస విభాగం కౌన్సెలర్ సుగుణ, పీవీ రేఖ పెళ్లంటే.. రెండు కుటుంబాలు , రెండు జీవితాలు ఒక్కటి కావడం.. మూడు ముళ్లు..ఏడడుగులు కలిసి.. కష్టం వచ్చినా..కన్నీళ్లొచ్చినా నిండు నూరేళ్లు దంపతులు చేయి విడవకుండా ఒకరిపై మరొకరు ప్రేమ, ఆప్యాయతలు , అనురాగంతో ఆనందంగా జీవితం గడపడం.. ఇది హిందూ సంప్రదాయంలోని గొప్పతనం. కానీ చిన్నవాటికే తగువు లాడుకోవడం, పట్టింపులు, పంతాలకు పోయి అందమైన జీవితాలను అంధకారం చేసుకుంటూ ఇరు కుటుంబాలకు మనోవేదన మిగులుస్తున్నారు. నేటితరం కొత్త పోకడలతో జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. ఈ కోవలోనే ఇటీవల జిల్లాలో దంపతుల విడాకుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. కార్వేటినగరం : జీవితాంతం కలసిమెలసి జీవిస్తామని అగ్ని సాక్షిగా ఒక్కటైన దంపతులు..పెళ్లిముచ్చట తీరకముందే గొడవలు పడుతున్నారు. ప్రేమ, ఆప్యాయతలతో ఆనందంగా ఉండాల్సిన వారు అపొహాలు, అనుమానాలతో విడిపోతున్నారు. నీవే నాప్రాణం..నీవు లేకపోతే చచ్చిపోతానంటూ పెళ్లి అయిన తొలినాళ్లలో ఎంతో ప్రేమ చూపేవారు.. ఆ తర్వాత వాటన్నింటిని మరిచి.. ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవడం, ఛీదరించుకోవడం, కోపడ్డం.. చివరకు విడాకులు వరకు వెళుతున్నాయి. భవిష్యత్తు అంధకారం.. చిన్న చిన్న విభేదాలు, వివాదాలతో కోర్టు మెట్లు ఎక్కుతుంటే.. మరి కొందరు కక్షల కార్పణ్యాలతో రగిలిపోతున్నారు. గృహహింస విభాగం సిబ్బంది, పోలీసుల కౌన్సెలింగ్తో కొందరు సర్దుకుపోతున్నారు. మరి కొందరు అ యితే మూర్ఖంగా వ్యవహరించి భవిష్యత్తును అంధకారం చేసుకోవడంతో పాటు వారి పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతలను దూ రం చేస్తున్నారు. తరచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడంతో పెళ్లి అంటేనే ఆడ, మగపిల్లల తల్లిదండ్రులు ఆలోచనలో పడుతున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చినా.. వివిధ కారణాలతో విడిపోయేందుకు సిద్ధపడుతున్న దంపతులను కలపడానికి ఎన్ని కౌన్సెలింగ్లు ఇచ్చినా ఫలితం లేకుండా పోతోంది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛి న్నమై చిన్నకుటుంబాలు ఏర్పడడం వల్ల సంప్రదాయాలు, సత్సంబంధాలు గురించి తెలియడం లేదు. ఒకరి నిర్ణయాలకు మరొకరు గౌరవించకపోవడం, మొండి వైఖరితో భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని పోలీసులు, గృహ హింస కౌన్సెలింగ్ విభాగం సిబ్బంది చెబుతున్నారు. ఎవరికి వారే మొండిపట్టు.. సంప్రదాయాలను గౌరవిస్తూ గతంలో ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తూ పిల్లలకు ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా నిలిచేవారు. ఏమైనా సమస్యలు వస్తే ఉమ్మడి కుటుంబాలు కావడంతో ఇద్దరికీ సర్దిచెప్పి వారి మధ్య మనస్పర్ధలను తొలగించేవారు.అప్పటికీమాట వినకపోతే ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చి దంపతులను ఒక్కటి చేసేవారు. పస్తుత పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. పెద్దల మాటలను గౌరవించని , సమాజ విలువలు పాటించని, వివాహ బంధాలను లెక్కచేయని యువతీ, యువకులు వివాదాల్లో చిక్కుకుని, కుటుంబ సభ్యులను మనోవేదనకు గురిచేస్తున్నారు. వేరు కాపురాలపై ఆసక్తి.. ఉమ్మడి కుటుంబంలో కలసి జీవించేందుకు అధిక శాతం మంది యువతులు సుముఖత చూపడం లేదు. అదేమని అడిగితే అత్త, మామలు, ఆడపడుచుల దెప్పి పొడుపులు ఉంటాయని చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని ఆలోచిస్తున్నారు. ఉమ్మడి కుటుంబంలో తమ కుమార్తె హాయిగా జీవించగలదనే భరోసా కల్పించలేకపోతున్నారు. కారణం ఏదైనా చిన్న కుటుంబంగా జీవించడం అలవాటు పడుతున్న నేటి పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబాలకు ససేమిరా అంటున్నారు. ఇది కూడా పండంటి కాపురాలకు అవరోధంగా మారింది. పెళ్లి అయిన కొన్నిరోజులకే విడిపోతున్న జంటలు మూడు ముళ్ల బంధం.. మూణ్నాళ్ల ముచ్చటే..! కూలుతున్న పచ్చని కాపురాలు బలహీన పడుతున్న వివాహ బంధం గృహహింస విభాగాన్ని ఆశ్రయించిన 207 బాధితులు రాజీ పడుతున్న జంటలు కొన్నే.. గొప్పలకు పోయి నాశనం చేసుకుంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది దంపతులు ఉన్నత చదువులు చదువుకున్న వారే. ఆర్భాటాలు, గొప్పలకుపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కుటుంబ జీవితంపై అవగాహన ఉండాలి. ఉన్నంతలో సర్దుకుపోవడానికి ప్రయత్నించాలి. పిల్లలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి. కుటుంబ వ్యవస్థకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలి. వివిధ కారణాలతో గృహహింస విభాగాన్ని ఆశ్రయించే వారికి చెబుతున్నాం. సాధ్యమైనంత వరకు కలిపేందుకు ప్రయత్నిస్తున్నాం. అప్పటికీ రాజీ పడని వారికి కోర్టులో కేసు ఫైల్ చేస్తాం. – డి.వెంకటేశ్వరి, గృహహింస విభాగం ప్రాజెక్టు డైరెక్టర్, చిత్తూరువివిధ కారణాలతో కోర్టుకు... పెళ్లయిన కొద్ది రోజులకే భర్త పట్టించుకోకపోవడం లేదని, అత్తమామలు, ఆడపడుచులు వేధిస్తున్నారని మహిళలు గృహహింస విభాగాన్ని ఆశ్రయిస్తున్నారు. మరికొంత మంది పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నారు. మరికొందరు నేరుగా కోర్టులో కేసు పెడుతున్నారు. గత ఏడాది ఏప్రిల్లో 207 మంది గృహహింస విభాగాన్ని ఆశ్రయించారు. వీరిలో 145 మంది గృహహింస విభాగం సిబ్బంది ఇచ్చిన కౌన్సెలింగ్లో రాజీ పడ్డారు. 45 కేసులు కోర్టుకు ఫైల్ చేశారు. అందులో ఒక్కటి కోర్టు ఆర్డర్ అయింది.17 కేసులు కౌన్సెలింగ్ ప్రాసెస్లో ఉన్నాయి. – సుగుణ, గృహహింస విభాగం సోషల్ అండ్ లీగల్ కౌన్సెలర్, చిత్తూరు -
మహిళా వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఉమ
తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఉమను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె 40 ఏళ్లపాటు బోధన, పరిశోధన రంగాల్లో పనిచేశారు. జాతీయ, అంతర్జాతీయ పబ్లికేషన్తో పాటు స్టేట్ బెస్ట్ టీచర్గా ప్రశంసలు పొందారు. మహిళా వర్సిటీకి రెక్టార్గా, ఇన్చార్జి వీసీగా పనిచేసిన ఆమెకు వర్సిటీ పాలనపై అవగాహన ఉంది. ప్రస్తు తం ఇన్చార్జ్గా వీసీగా కొనసాగుతున్న ఆమె బుధ వారం పూర్తి స్థాయి బాధ్య తలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధకారితే లక్ష్యంగా వర్సిటీని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు. -
చేయూత కోసం.. చిన్నారి ప్రాణం
వి.కోట : దాతల సాయం కోసం ఓ చిన్నారి ఎదురుచూస్తోంది. బిడ్డ ప్రాణం కాపాడాలని ఓ తండ్రి వేడుకోలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాలు.. వి.కోట మండలం గాండ్లపల్లె గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన కుమార్తె రక్ష(8)కు ప్రమాదవశాత్తు నిప్పంటుకుని శరీరం చాలా వరకు కాలిపోయింది. వేలూరు సీఎంసీలో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. వైద్యానికి దాదాపు రూ.15 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు. దీంతో దాతల సాయం కోసం బాధిత తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. మనసున్న వారు ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు దుర్గాప్రసాద్ నంబర్ 8618134582కు సాయం అందించాలని విన్నవిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. టీటీడీ అధికారుల సమాచారం మేరకు స్వామి వారి సర్వదర్శనం సుమారు 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఆదివారం అర్ధరాత్రికి 79,705 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 24,836 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.67కోట్లుగా అధికారులు తెలిపారు. -
అనుమానిత పెరాలసిస్ కేసు గుర్తింపు
చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు నగరంలోని చవటపల్లె పీహెచ్సీ పరిధిలో సోమవారం ఏఎఫ్బీ(అక్యూట్ ఫాల్సీ పెరాలసిస్) అనుమానిత కేసును జిల్లావైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. అందిన సమాచారం మేరకు.. డీఐఓ హనుమంతరావు ఆ ప్రాంతంలో ఆకస్మికంగా ఇంటింటా పరిశీలన చేశారు. ఈ పరిశీలనలో ఓ అనుమానిత కేసు బయటపడింది. ఆ కేసు మలం శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం తమిళనాడులోని చైన్నెకి పంపారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించాలని గ్రామస్తులకు సూచించారు. భవనంపై నుంచి పడి యువకుడి మృతి కుప్పం : పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద నిర్మిస్తున్న భవనంపై నుంచి సోమవారం ప్రమాదశాత్తు జారి పడి ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. కొత్తయిండ్లు గ్రామానికి చెందిన మురుగేష్(25) పెయింటింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మూడంతస్తుల భవనంలో పనిచేస్తుండగా కాలుజారి కిందపడ్డాడు. ఈ క్రమంలో గుడుపల్లె మండలం చీకటిపల్లెకు చెందిన బాలాజీ మురుగేష్ను కాపాడేందుకు యత్నించగా ఇద్దరు కింద పడ్డారు. మురుగేష్ అక్కడికక్కడే మృతి చెందగా, బాలాజీ తీవ్రంగా గాయపడి పీఈఎస్ మెడికల్ కళాశాలలో చికత్స పొందుతున్నాడు. ఈ మేరకు కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సర్వర్ సమస్య..సహనానికి పరీక్ష!
తిరుపతి తుడా: దివ్యాంగులకు ప్రభుత్వం మరో మారు పరీక్ష పెడుతోంది. వైకల్యంతో అవస్థలు పడుతున్నారనే కనికరం కూడా లేకుండా వేధిస్తోంది. పింఛన్ సొమ్ముతో పొట్ట పోసుకొనే వారి ఆత్మాభిమానం పై దాడి చేస్తోంది. పింఛన్దారుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా వ్యూహం రచిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ వైద్యుల చేత సదరం సర్టిఫికెట్లను పొంది వారికి మరోమారు పరీక్ష పెడుతోంది. గడిచిన నెల రోజులుగా వారంలో తొలి మూడు రోజులు సదరం సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్ నిర్వహిస్తోంది. వ్యయ ప్రయాసలకోర్చి మరోమారు తమ వైకల్యాన్ని నిరూపించుకునేందుకు లబ్ధిదారులు క్యూ కడుతున్నారు. దీంతో తిరుపతి రుయా ఆస్పత్రి కిక్కిరిసిపోతోంది. వసతుల ఏర్పాట్లలో నిర్లక్ష్యం సదరం ఫ్రీ వెరిఫికేషన్ కోసం రోజుకు 150 నుంచి 200 మంది దివ్యాంగులు రుయా ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. అయితే దివ్యాంగులకు కనీస వసతులను కల్పించడంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. సదరం రీ వెరిఫికేషన్ క్యాంపుల పర్యవేక్షణ బాధ్యతలను డీఆర్డీఏకు ప్రభుత్వం అప్పగించింది. ఆ శాఖ అధికారులు ఆటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ఒక షామియానా, 20 కుర్చీలు వేసి చేతులు గెలుపుకున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు దివ్యాంగులు అక్కడే ఉండాల్సి వస్తోంది. కనీసం తాగునీటి సౌకర్యాన్ని కూడా కల్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి విధులు కోసం వచ్చిన డాక్టర్ల పట్ల కూడా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వారికి వసతి, ట్రాన్స్ఫోర్ట్, భోజన సౌకర్యాలను కల్పించకపోవడం వారి నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతోంది. గంటల తరబడి నిరీక్షణ సదరం వెరిఫికేషన్ కోసం వచ్చిన దివ్యాంగులకు నిరీక్షణ తప్పడం లేదు. కొన్ని సమయాల్లో సర్వర్ మొరాయిస్తుండడంతో రీ వెరిఫికేషన్ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. సౌకర్యాల లేమి, నిరీక్షణతో మరింత వేదనకు గురవుతున్నారు. -
సీఎం చంద్రబాబుకు సాదర స్వాగతం
శ్రీకాళహస్తి రూరల్ (రేణిగుంట): అంతర్జాతీయ దేవాలయాల కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సాదర స్వాగతం లభించింది. రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఈఓ శ్యామలరావు, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు, కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్దన్ రాజు, జేసీ శుభం బన్సల్, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్రెడ్డి, నెలవల విజయశ్రీ, కోనేటి ఆదిమూలం, కురుగొండ్ల రామకృష్ణ, భానుప్రకాష్, మురళీమోహన్, డా.వీయం. థామస్, మాజీ ఎంఎల్ఏ సుగుణమ్మ, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీఓలు భానుప్రకాష్రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం ఆయన తిరుపతికి రోడ్డు మార్గాన పయనమయ్యారు. సీఎంకు సాదర వీడ్కోలురేణిగుంట విమానాశ్రయంలో సీఎం చంద్రబాబునాయుడుకు సాదర వీడ్కోలు లభించింది. మంత్రితోపాటు టీటీడీ ఈఓ ఇతర అధికారులు ఆయనకు వీడ్కోలు పలికారు. అమ్మవారి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయిచండి తిరుమల: ముంబైలో అమ్మవారి ఆలయం, టీటీడీ సమాచార కేంద్రాన్ని నిర్మించేందుకు స్థలం కేటాయించాలని కోరుతూ టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ద్వారా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు వినతి పత్రం అందజేశారు. సోమవారం తిరుపతిలో ఆయనను కలసి విన్నవించారు. ఇప్పటికే నవీ ముంబైలో ఉల్వే ప్రాంతంలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం 3.61 ఎకరాల స్థలాన్ని లీజు ప్రాతిపదికన కేటాయించారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరో 1.5 ఎకరాల స్థలంలో అమ్మవారి ఆలయాన్ని కూడా నిర్మించాలని టీటీడీ నిర్ణయించిందని, ఈ మేరకు స్థలాన్ని కేటాయించాలని, బాంద్రాలో టీటీడీ సమాచార కేంద్రానికి కొంత స్థలాన్ని కేటాయించాలని టీటీడీ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. -
సమస్యలు.. వెల్లువెత్తిన వినతులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సోమవారం కలెక్టరేట్కు వివిధ సమస్యలతో ప్రజలు తరలివచ్చారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా అర్జీలు అందించారు. ఈ మేరకు కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ, జేసీ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ హిమవంశీ, డీఆర్ఓ మోహన్కుమార్ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ అధికారులు మాట్లాడుతూ వివిధ సమస్యలపై మొత్తం 248 అర్జీలు వచ్చినట్లు వెల్లడించారు. ‘గేటు’ వసూలుపై ఆవేదన నగరి మున్సిపాలిటీ పరిధిలో గేటు రుసుము కింద రోజూ రూ.30 చొప్పున వసూలు చేస్తున్నారని ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ పట్టణంలో దాదాపు 400 మంది ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆటో డ్రైవర్ల నుంచి ప్రతి రోజు రూ.30 వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి గేటు వసూలు లేదన్నారు. పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. మెయిన్ సెంటర్లుగా మార్చండి జిల్లాలోని అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్ఫర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు, యూనియన్ జిల్లా కార్యదర్శి షకీలా డిమాండ్ చేశారు. సోమవారం ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదన్నారు. 2019 నుంచి నేటి వరకు అంగన్వాడీ కార్మికుల జీతాలు పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సంఘ నాయకులు సుజిని, మమత పాల్గొన్నారు.బస్షెల్టర్ నిర్మాణం కోసం.. బస్షెల్టర్ నిర్మించాలని ఐరాల మండలం పొలకల గ్రామం అగ్రహారంపల్లె దళితవాడ వాసులు విన్నవించారు. వారు మాట్లాడుతూ తమ గ్రామంలో బస్షెల్టర్ లేకపోవడంతో విద్యార్థులు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారని వెల్లడించారు. ప్రజల సౌకర్యార్థం బస్షెల్టర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ను కోరారు. కలెక్టరేట్ గ్రీవెన్స్కు 248 అర్జీలు -
యంత్రం.. ‘పచ్చ’తంత్రం
పల్లె ప్రాంతాల్లో పేదలకు పని కల్పించాలి.. వలసలు నివారించాలి.. కూలీల జీవితాలకు భరోసా అందించాలి.. ఇదే లక్ష్యంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభించారు. ఈ మేరకు రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులకు చేయూతనందిస్తున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం బడుగుల నోటి కాడ ముద్దను లాగేసుకుంటున్నారు. జేసీబీలతో ఉపాధి పనులు చేయించేస్తున్నారు. బినామీ కూలీల పేరుతో యథేచ్ఛగా నిధులు బొక్కేస్తున్నారు. అందులో భాగంగా శాంతిపురం మండలం కొలమడుగు పంచాయతీ రెడ్లపల్లి సమీపంలోని గుడిముందరి గుట్ట వద్ద సోమవారం జేసీబీతో ఫారంపాండ్ తవ్వకం చేపట్టారు. గోవిందపల్లె–తుమ్మిశి ప్రధాన రహదారి పక్కన దర్జాగా యంత్రాలతో ఉపాధి పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే నల్లగట్టుచేనులో మరో ఫారంపాండ్ను ఇప్పటికే జేసీబీతో తవ్వించేశారు. అధికారులు, సిబ్బందిని మామూళ్ల మత్తులో జోకొట్టి ఇష్టారాజ్యంగా ఉపాధి నిధులను దోచుకుంటున్నారు. – శాంతిపురం -
కక్షగట్టి వేధింపులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పనిచేశానని కక్షగట్టి వేధిస్తున్నారని, దౌర్జన్యంగా మా షాపులకు తాళం వేశారని బాధితులు ఇమ్రాన్, సుమియా దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం చిత్తూరు ప్రెస్క్లబ్లో వారు మాట్లాడారు. 2021లో చిత్తూరు వన్ డిపో పరిధిలోని ఓ ఖాళీ స్థలానికి టెండర్ దక్కించుకుని సొంత ఖర్చులతో షాపులు కట్టుకున్నామన్నారు. నిబంధనల ప్రకారం ముందస్తు డిపాజిట్ కింద రూ. 3లక్షల వరకు చెల్లించామని వెల్లడించారు. ఆ షాపుల మీదే ఆధారపడి కుటుంబీకులను పోషించుకుంటున్నామని చెప్పారు. అయితే నాలుగు నెలలుగా షాపు ఖాళీ చేయాలని ఆర్టీసీ డీపీటీఓ జగదీష్ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. టెండర్ ప్రకారం 14 నెలల కాల పరిమితి ఉన్నప్పటికీ దుకాణానికి తాళం కూడా వేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రశ్నిస్తే కూటమి పార్టీలకు చెందిన గోకుల్ తమ ఒత్తిడి తెస్తున్నారని డీపీటీఓ చెప్పారని మండిపడ్డారు. దీనిపై హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. తాము చెల్లించిన డిపాజిట్ డబ్బులను కూడా తిరిగి ఇచ్చేది లేదని బెదిరిస్తున్నారని వెల్లడించారు. షాపుల నిర్మాణానికి రూ.25లక్షలు వెచ్చించామని, ఇప్పుడు ఖాళీ చేసి వెళ్లమనడం దారుణమని వివరించారు. ఉన్నతాధికారులు స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. -
నిందితుడి అరెస్ట్కు డిమాండ్
పుంగనూరు : మండలంలోని వనమలదిన్నె పంచాయతీ అప్పిగానిపల్లెలో చిన్నమ్మ అనే మహిళను కులం పేరుతో దూషించిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని మాల మహానాడు, మాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం ఈ మేరకు అంబేడ్కర్ కూడలిలో ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ మేకంజామనపల్లెకి చెందిన నిందితుడు రాజానాయుడుపై పోలీసులు తూతూమంత్రంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో దళితుల ప్రాణాలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ శ్రీనివాసులు ఘటనాస్థలానికి చేరుకుని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు ఎన్.అశోక్, శ్రీనివాసులు, జేవీ నాగరాజారెడ్డి, ఆనంద, ఆంజప్ప, వెంకటరమణ పాల్గొన్నారు. చెరువులో పడి రైతు మృతి తవణంపల్లె : మండలంలోని తెల్లగుండ్లపల్లెలో పాడి ఆవును చెరువులో కడుగుతూ అదుపుతప్పి పడిపోయి రైతు మృతి చెందినట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు. వివరాలు.. గ్రామానికి చెందిన అన్నదమ్ములు లోకనాథనాయుడు(46), ప్రభాకర్నాయుడు తమ పశువులను కడిగేందుకు చెరువుకు సోమవారం తీసుకెళ్లారు.. ప్రభాకర్నాయుడు పశువును కడిగి ఇంటికి వెళ్లిపోయాడు. లోకనాథనాయుడు ఆవును కడుగుతుండగా అది చెరువు మధ్యలోకి వెళ్లింది. ఆవును పట్టుకొనే క్రమంలో నీటిలో మునిగి మరణించాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భార్య వరకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. సారా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ పుంగనూరు : సారా తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాసులు సోమవారం తెలిపారు. మండలంలోని నల్లగుట్లపల్లెతాండాకు చెందిన గిరిబాబు సారా తరలిస్తుండగా నల్లగట్లపల్లితాండా సమీపంలో దాడులు నిర్వహించి పట్టుకున్నట్లు వెల్లడించారు. నిందితుడి నుంచి 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. -
‘సదస్సు’ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ
చిత్తూరు కలెక్టరేట్ : రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిష్కరించిన ప్రతి అర్జీని ఆడిట్ చేస్తామన్నారు. ఎండార్స్మెంట్ విషయంలో వీఆర్ఓలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రణాళిక ప్రకారం మార్చి 8వ తేదీలోపు వినతులన్నీ పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అసైన్మెంట్ కమిటీ ఆమోదం అనంతరం దరఖాస్తుదారులకు ఇంటి పట్టాలు అందించనున్నట్లు తెలిపారు. అలాగే రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తుకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎంపీడీఓలు, పురపాలక కమిషనర్లు తమ పరిధిలోని బోర్లు, పంపుసెట్ల పరిశీలించి మరమ్మతులు ఉంటే వెంటనే చేపట్టాలన్నారు. తాగునీటి ట్యాంకులను నిత్యం పరిశుభ్రం చేయించాలని సూచించారు. ఈ క్రమంలో 15వ ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సమావేశాల్లో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, డీపీఓ సుధాకరరావు, డీఎల్డీఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంకెప్పుడు..?
మాకు ప్రత్యేక పరికరాల అవసరం ఏంటో ప్రభుత్వానికి తెలియదా..? జిల్లా మొత్తం వరసగా క్యాంపులు పెట్టారు. నాలుగు వేలకు పైగా దరఖాస్తులు వస్తే, వాటిని అధికారులు భద్రంగా దాచుకున్నట్టున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి నెలలు గడుస్తున్నా, పరికరాలు ఇవ్వకుంటే ఎట్లా..? ఓ దివ్యాంగుడికి ట్రైసైకిల్ మంజూరు చేయించేందుకు ఏడీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా స్పందన లేదు. అయితే కార్యాలయం వద్ద ఉన్న ట్రైసైకిళ్లు తుప్పు పట్టిపోతున్నా పట్టించుకోవడం లేదు. – కొణతం చంద్రశేఖర్, నిరుద్యోగ వికలాంగ సంఘం జేఏసీ అధ్యక్షుడు -
ట్రాన్స్కో ఉద్యోగుల బదిలీకి చర్యలు
చిత్తూరు కార్పొరేషన్: ట్రాన్స్కో ఉద్యోగుల బదిలీలను ఈనెలాఖరులోపు పూర్తి చేయాలని సీఎండీ సంతోషరావు ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. తిరుపతి, చిత్తూరులోని ఎస్ఈ కార్యాలయాల పరిధిలో మొత్తం 55 మంది ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కమిటీలో సీజీఎం ఓఎన్ఎం, సీజీఎం రెవెన్యూ, ఆడిట్, తిరుపతి, చిత్తూరు ఎస్ఈ సభ్యులుగా ఉన్నారు. ఉద్యోగుల బదిలీ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. తిరుపతి నుంచి చిత్తూరుకు బదిలీ చేసిన ఉద్యోగులు రెండు నెలలుగా దాగుడుమూతలు ఆడుతున్న విషయం తెలిసిందే. వీటిపై ఉన్నతాధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. పుంగనూరులో దేవాంగపిల్లి పుంగనూరు : స్థానిక డాన్బాస్కో పాఠశాల ఆవరణలో సోమవారం అరుదైన దేవాంగపిల్లి ప్రత్యక్షమైంది. స్కూలు సిబ్బంది సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు చేరుకుని దేవాంగపిల్లిని స్వాధీనం చేసుకున్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కిరణ్ కిషోర్ మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. 22 నుంచి ప్రాజెక్టుల మహాసభ చిత్తూరు రూరల్(కాణిపాకం) : సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో 25శాతం నిధులు కేటాయించాలని కోరుతూ ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు వైఎస్సార్ జిల్లా కడపలో ప్రాజెక్టుల మహాసభ నిర్వహించనున్నట్లు ఏపీ రైతు సంఘం ఉపాధ్యక్షుడు రామానాయుడు, నేత జనార్ధన్ వెల్లడించారు. సోమవారం చిత్తూరు సమీపంలోని హంద్రీ–నీవా కాలును సీపీఐ నేతలతో కలిసి పరిశీలించారు. అనంతరం మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే హంద్రీ–నీవా ప్రాజెక్టుకు రూ.5వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే గాలేరు–నగరి, ఎస్ఎస్ కెనాల్ ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నిధులు పేర్కొనాలని కోరారు. రాయలసీమను నిర్లక్ష్యం చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ప్రాజెక్టు మహాసభకు పెద్దసంఖ్యలో రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.నాగరాజు, వీసీ గోపీనాథ్. మణి, దాసరి చంద్ర, విజయ్ కుమార్, విజయ గౌరి,, రమాదేవి, కుమారి, రఘు, లతా రెడ్డి, కవిత పాల్గొన్నారు. గ్రామ కంఠం రక్షణకు వినతి చిత్తూరు రూరల్ (కాణిపాకం): మండలంలలోని ఎగువమసాపల్లెలో కూటమి నేత నుంచి గ్రామ కంఠం భూమిని రక్షించాలని గ్రామస్తులు కోరారు. సోమవారం ఈ మేరకు చిత్తూరు రూరల్ తహసీల్దార్ లోకేశ్వరికి వినతిపత్రం అందించారు. గ్రామ కంఠం భూమిని సదరు నేత ఆక్రమించుకుని గోకులం షెడ్డు నిర్మించారని, దీనిపై ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. నకిలీ పత్రాలు సృష్టించి అధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని వెల్లడించారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసినా తమను ఏం చేయలేరని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కబ్జాలను తొలగించాలని కోరారు. సత్వర న్యాయమే లక్ష్యం చిత్తూరు అర్బన్: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి వినతిని క్షేత్రస్థాయిలో విచారించి, బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ మణికంఠ ఆదేశించారు. సోమవారం చిత్తూరులోని ఆర్ముడ్ రిజర్వు కార్యాలయంలో నిర్వహించిన పరిష్కార వేదికలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇందులో భూ వివాదాలు, మోసాలు, కుటుంబ తగాదాలు, వేధింపులు, ఆస్తి సమస్యలకు సంబంధించిన 33 ఫిర్యాదులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. -
● దేవాలయాల పరిరక్షణే లక్ష్యం
హాజరైన ఏపీ, గోవా, మహారాష్ట్ర ముఖ్యమంత్రులుదేశంలోని అన్ని దేవాలయాల అనుసంధానం, పరిరక్షణే లక్ష్యంగా టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో తిరుపతి మంగళంలోని ఆశా కన్వెన్షన్ వేదికగా సోమవారం ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ ఎక్స్పో ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 19 వరకు జరగనున్న ఈ కార్యక్రమానికి గోవా, మహారాష్ట్ర, ఏపీ సీఎంలు ప్రమోద్ సావంత్, దేవేంద్ర పడ్నవీస్, చంద్రబాబు హాజరయ్యారు. 58 దేశాల్లోని సుమారు 1,581 దేవాలయాలను అనుసంధానించడం, భద్రతపై చర్చించారు. – తిరుపతి సిటీ -
ఐసీడీఎస్లో రేపటి నుంచి ఇంటర్వ్యూలు
చిత్తూరు కలెక్టరేట్ : ఐసీడీఎస్ శాఖలో ఖాళీ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 19, 20 వ తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పీడీ వెంకటేశ్వరి తెలిపారు. సోమవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. మిషన్ వాత్సల్య పథకం కౌన్సిలర్, అవుట్రిచ్ వర్కర్ పోస్టు ఉద్యోగాలను ఈ నెల 19న , మిషన్ శక్తి పథకంలో ఖాళీగా ఉన్న పోస్టులకు 20 న ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు. పోస్టుల వారీగా అర్హత పొందిన అభ్యర్థుల వివరాలను www.chittoor.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసినట్లు వివరించారు. అభ్యర్థులు ఒరిజనల్ గుర్తింపు కార్డు, విద్యార్థత సర్టిఫికెట్లు, అనుభవం, కుల ధ్రువీకరణపత్రాలతో కలెక్టరేట్లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. పరిశోధనలో పరస్పర సహకారం తిరుపతి సిటీ: పరిశోధనలో ఎస్వీయూ, అమెరికాలోని పార్థు యూనివర్సిటీ పరస్పర సహకారం అందించుకోనున్నట్లు యూఎస్ఏ ప్రతినిధి జూలియానా కస్తవన్ తెలిపారు. ఆమె సోమవారం ఎస్వీయూ ఫిజిక్స్ విభాగాన్ని సందర్శించారు. ఆ విభాగం హెడ్ ప్రొఫెసర్ దేవప్రసాద్ రాజు, ఇతర ప్రొఫెసర్లతో ఆమె సమావేశమయ్యారు. గతంలో వర్సిటీతో తమ యూనివర్సిటీ ఎంఓయూ చేసుకుందనీ, ఈ ప్రకారం బోధన, పరిశోధన విషయాల్లో పరస్పరం సహకారం ఉంటుందని తెలిపారు. అనంతరం జూలియానా కస్తవన్ను ఫిజిక్స్ అధ్యాపకులు జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు విజయలక్ష్మి, అపర్ణ, రుద్రమదేవి పాల్గొన్నారు -
● హంద్రీ–నీవా ప్రాజెక్టుకు రూ.3,500 కోట్లు కేటాయించాలని ప్రతిపాదన ● ఉమ్మడి చిత్తూరు జిల్లాకే రూ.2 వేల కోట్లు అవసరం ● పెండింగ్ పనులకు రూ.729 కోట్లు తప్పనిసరి ● బడ్జెట్లో ప్రాధాన్యమివ్వాలని కోరుతున్న రైతాంగం
పెద్దతిప్పసముద్రంలో పుంగనూరు ఉపకాలువకు లైనింగ్ పనులు బి.కొత్తకోట : హంద్రీ–నీవా ప్రాజెక్టులోని ప్రధాన కాలువ, ఉప కాలువలు, రిజర్వాయర్లకు కృష్ణా జలాలు చేరాలంటే 2025–26 బడ్జెట్లో ఉదారంగా నిధులు కేటాయించాలి. ఈ మేరకు కూటమి ప్రభుత్వం పుష్కలంగా నిధులు కేటాయిస్తుందా లేక వైఎస్సార్సీపీ హయాంలో మంజూరు చేసిన నిధులనే పేర్కొని చేతులు దులుపు కుంటుందా అన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రాజెక్టును పూర్తి చేసి పొలాలకు కృష్ణా జలాలు అందిస్తారనే ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే గత టీడీపీ ప్రభుత్వంలో ఏనాడూ అవసరమైనంత నిధులను బడ్జెట్లో కేటాయించలేదు. దీంతో పనులు ముందుకు సాగలేదు. వైఎస్సార్సీపీ హయాంలో చేపట్టిన అదనపు పనులను కూటమి ప్రభుత్వం కక్షగట్టి రద్దు చేసేసింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు నిధులుఇస్తారా అని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రతిపాదనలు పంపారు సరే.. హంద్రీ–నీవా ప్రాజెక్టు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ ఉమ్మడి జిల్లాల్లో సాగుతుంది. ఈ ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న, చేపట్టబోయే పనులకు రూ.3,500 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి బడ్జెట్ ప్రతిపాదనలను ఉన్నతాధికారులు పంపారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కాలువ వెడల్పు, కాంక్రీటు, మట్టి పనులను రూ.1,240 కోట్లతో చేపట్టారు. ఇవి కాక ప్రధాన కాలువకు సంబంధించి మరో రూ.503 కోట్లతో పనులు సిద్ధం చేశారు. ఈ మొత్తం పనులకే రూ.1,700 కోట్లు కావాలని నివేదించారు. ఇవి కాక కర్నూలు జిల్లాకు రూ.450 కోట్లు పోను, మిగిలిన రూ.1,350 కోట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పనులను చేపట్టాల్సి ఉంటుంది.ఆమోదం వచ్చేనా..? లైనింగ్కే రూ.684 కోట్లు పుంగనూరు ఉపకాలువ వెడల్పు పనులను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం కాలువ లైనింగ్ పనులకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో ప్రస్తుత అన్నమయ్య జిల్లాలోని పెద్దతిప్పసముద్రం మండలం నుంచి చిత్తూరు జిల్లాలోని పెద్దపంజాణి మండలం వరకు పుంగనూరు ఉపకాలువకు లైనింగ్ పనులను రూ.480 కోట్లతో, పెద్దపంజాణి నుంచి కుప్పం వరకు కుప్పం ఉపకాలువకు రూ.204 కోట్లతో లైనింగ్ పనులను చేపట్టారు. ఇది కాక కుప్పం కాలువకు సంబంధించి ఇంకా రూ.59 కోట్ల పనులు జరగాల్సి ఉంది. ప్రభుత్వం చెబుతున్నట్టు ఆరునెలల్లో ఈ లైనింగ్ పనులు పూర్తి కావాలంటే బడ్జెట్లో అందుకు తగ్గట్టు నిధులు కేటాయించాలి. కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుప్పానికి రూ.535 కోట్లతో యామిగానిపల్లె వద్ద 0.7 టీఎంసీలు, మాదనపల్లె వద్ద 0.3 టీఎంసీలతో రిజర్వాయర్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. వీటిని సద్వినియోగం చేసుకుని బడ్జెట్లో అనుమతి ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. విభజిత అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ప్రాజెక్టు పనులు పూర్తి కావడానికి ఇంచుమించు రూ.2 వేల కోట్లు అవసరమవుతాయి. అలాగే అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు రూ.729 కోట్లు కేటాయించాలని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఈ నిధుల్లో రూ.250 కోట్లతో ప్రధానకాలువపై చిన్నమండెం మండలం పడమటికోన, కలకడ వద్ద కాలువ తవ్వకం, 12 చోట్ల కాంక్రీటు నిర్మాణాలు పెండింగ్లో ఉన్నాయి. ఇవి పూర్తి చేస్తే కానీ అడవిపల్లె, శ్రీనివాసపురం రిజర్వాయర్లకు కృష్ణా జలాలు వెళ్లవు. ఈ రూ.250 కోట్లకు ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చేనా అని రైతులు ఎదురుచూస్తున్నారు. -
‘పరికరాలు’..
చిత్తూరు అర్బన్ : కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విభిన్న ప్రతిభావంతులకు పరికరాలు మంజూరు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహించింది. గంగాధరనెల్లూరు, చిత్తూరు, నగరి, పలమనేరు, పూతలపట్టు, కుప్పం ప్రాంతాల్లో క్యాంపులు చేపట్టింది. ఎవరెవరికి ఏయే ఉపకరణాలు కావాలో వినతులు ఇవ్వాలని కోరింది. దీంతో 4,697 మంది ప్రతిభా వంతులు ప్రత్యేక పరికరాల కోసం దరఖాస్తులు అందజేశారు. అయితే, ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఎలాంటి పరికరం అందించలేదు. ఈ క్రమంలో మండల కార్యాలయాల నుంచి కలెక్టరేట్ వరకు పరికరాల కోసం దివ్యాంగులు తిరుగుతూనే ఉన్నారు. ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసి, ఉపకరణాలు పంపితే తప్ప తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి పెద్ద పీటవేసింది. కళ్లు కనిపించని వాళ్లకు ఫోల్డింగ్ స్టిక్స్, కాళ్లు పనిచేయని వాళ్లకు కర్రలు, పూర్తి వైకల్యంతో బాధపడే వాళ్లకు బ్యాటరీ ట్రై సైకిళ్లు, వీల్చైర్లు, వినికిడి సమస్యతో ఉన్న వాళ్లకు మిషన్లు, డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్లకు ల్యాప్టాప్లు, టచ్ ఫోన్లను పంపిణీ చేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు ఉమ్మడి జిల్లాలో ఎంపీలుగా పనిచేసిన పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, రెడ్డెప్ప ద్వారా ఎంపీ నిధుల నుంచి దాదాపు రూ.12 కోట్లు విడుదల చేయించింది. సుమారు 32 వేల మంది విభిన్న ప్రతిభావంతులకు పరికరాలను అందించింది. కానీ, ప్రస్తుతం జిల్లాలో ప్రత్యేక అవసరాలున్న వారికి కనీసం చేతికర్ర కూడా అందకపోవడం గమనార్హం.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో.. ప్రత్యేక ఉపకరణాల కోసం 8 నెలలుగా నిరీక్షిస్తున్న దివ్యాంగులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న దరఖాస్తుదారులు ప్రభుత్వం నిర్లక్ష్యంతో విభిన్న ప్రతిభావంతుల అవస్థలు కనీసం మాత్రం పట్టించుకోని అధికారులు -
వృద్ధుడి ఆత్మహత్య
గంగవరం : అనారోగ్య సమస్యలతో వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో ఆది వారం చోటుచేసుకుంది. మండలంలోని మర్రిమాకులపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణప్ప (61) కూలి పనులతో జీవనాధారం. ఆయన కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అప్పుడప్పుడూ తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నాడు. మనస్తాపం చెంది ఉదయం పొలం వద్దకు వెళ్లి జిల్లేడుపాలు తాగాడు. గమనించిన స్థానికులు వృద్ధుడి చికిత్స కోసం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూ తగాదాతో దాడి – నిల్వ కొయ్యలకు నిప్పు పెట్టిన వైనం చౌడేపల్లె : భూ తగాదా విషయమై పాత కక్షలతో తనపై దాడి చేశారని మొరంకిందపల్లెకు చెందిన వెంకటరమణారెడ్డి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి కథనం మేరకు వివరాలు.. గ్రామానికి సమీపంలోని భూముల్లో వెంకట రమణారెడ్డి టమాటా పంట సాగు చేయడానికి ఏర్పాట్లు చేస్తుండగా అదే గ్రామానికి చెందిన మునస్వామి, సుబ్రమణ్యం, బాలకృష్ణ తనపై దౌర్జన్యం చేసి, దాడికి తెగబడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా తన పొలంలో సుమారు రూ.లక్ష విలువ చేసే టమాటా సాగు కోసం నిల్వ చేసిన కట్టెలకు నిప్పంటించినట్లు తెలిపారు. తనతో పాటు తన కుటుంబానికి వీరి వలన ప్రాణహాని ఉందని రక్షక్షణ కల్పించాలని పోలీసులకు వెంకట రమణారెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
● డివిజన్ పరిధిలో 54 ఖాళీలు ● ప్రతిభకు ప్రాధాన్యం
పోస్టాఫీస్లో ఉద్యోగాలు చిత్తూరు కార్పొరేషన్ : తపాలా కొలువుల భర్తీకి ఆ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల భర్తీలో భాగంగా ప్రతిభ ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేయనున్నారు. బ్రాంచ్ పోస్ట్మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్)లను పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఖాళీల వివరాలు ఇలా డివిజన్ పరిధిలో మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. చిత్తూరు హెచ్ఓ–3, మిట్టూరు బీఓ, మురకంబట్టు, తుమ్మిందపాళ్యం, వరత్తూరు, వెంగనపల్లె, గుడిపాల, నంగమంగళం, నరహరిపేట, బైరుపల్లి, బసినికొండ, బేలుపల్లి, బురకాయలకోట, చెల్దిగానిపల్లి, చెరుకువారిపల్లి, చౌడేపల్లి ఎస్వో–2, దేవళచెరువు, ఈడిగపల్లి, గొల్లపల్లి, గొల్లపల్లి బీఆరేకే, గుడుపల్లె, ఐరాల, కడపనత్తం, కగతి, కనమనపల్లి, కట్టకిందపల్లి, కీరమంద, కోసువారిపల్లి, మదనపల్లి హెచ్ఓ–3, మద్దినాయనిపల్లి, మల్లన్ ఆర్ఎస్, మందిపెట్కూరు, ముదివేడు, ముసలికుంట, ముస్టూరు, ముత్తుకూరు, నరసింహాపురం, నెలవాయి, బడ్డేపల్లె, పల్లికుప్పం, పట్నం, పెద్దబంగారునత్తం, పెద్దచెల్లారగుంట, పీటీఎం, రిషివ్యాలీ, రాయల్పేట, సింహరాజపురం, ఎద్దులవారిపల్లె, ఎర్రేపల్లె బీఓలు ఖాళీగా ఉన్నాయి. అర్హతలు ఇవీ.. పదో తరగతి ఉత్తీర్ణులై వయస్సు 18–40 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయో పరిమితి ఉంది. దీని కోసం అభ్యర్థులు ఆన్లైన్లో ఇండియా పోస్ట్ జీడీఎస్ వెబ్సైట్లో మార్చి 3 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. అధికారులు అన్నింటిని పరిశీలించి తుది జాబితాను ప్రకటించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తపాలాశాఖ సూపరింటెండెంట్ లక్ష్మణ్ వివరించారు. -
జిల్లాకు చేరిన ఇంటర్ ప్రశ్నపత్రాలు
చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాలు జిల్లా కేంద్రానికి చేరాయి. రాష్ట్ర విద్యాశాఖ నుంచి ప్రత్యేక వాహనంలో పకడ్బందీ బందోబస్తు నడుమ ప్రశ్నపత్రాలను జిల్లా కేంద్రానికి పంపారు. వీటిని జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న స్ట్రాంగ్రూంలో భద్రపరిచారు. స్ట్రాంగ్రూం వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా మార్చి 1 నుంచి ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రస్తుతం జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్ ప్రయోగ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. హాజరుకానున్న 30,713 మంది విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా 139 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల నుంచి 30,713 మంది విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రథమ సంవత్సరంలో 15,639, ద్వితీయ సంవత్సరంలో 15,074 మంది విద్యార్థులు పరీక్షక్షలు రాయనున్నారు. పరీక్ష పత్రాలను 24, 25 తేదీల్లో ప్రత్యేక పోలీసు బందోబస్తు నడుమ జిల్లాలోని మండలాలకు సరఫరా చేయనున్నారు. పర్యవేక్షించిన అధికారులు జిల్లాకు చేరిన ప్రశ్నపత్రాలను అధికారులు పర్యవేక్షించారు. ఈ ప్రక్రియను ఇంటర్మీడియెట్ డీవీఈవో సయ్యద్ మౌలా, డీఎస్పీ సాయినాథ్ పీసీఆర్ జూనియర్ కళాశాలలో ప్రక్రియను పర్యవేక్షించారు. స్ట్రాంగ్ రూం వద్ద సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ హేమలత, దయానందరాజు పాల్గొన్నారు. పకడ్బందీగా ఏర్పాట్లు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఆదివారం జిల్లా కేంద్రానికి మొదటి సెట్ ఇంటర్ ప్రశ్నపత్రాలు విచ్చేశాయి. వాటిని పకడ్బందీగా భద్రపరిచాం. – సయ్యద్ మౌలా, ఇంటర్మీడియట్ డీవీఈఓ -
కూటమిలో కుంపటి
– మరోసారి బయటపడ్డ వర్గపోరు శ్రీరంగరాజపురం : గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కూటమి పార్టీలో మరొసారి వర్గపోరు బట్టబయలు అయింది. ఎమ్మెల్యే డాక్టర్ థామస్కు ప్రభుత్వ విప్ పదవి కేటాయించడంతో మండలంలోని పుల్లూరు గ్రామంలో జనసేన తరపున సన్మాన సభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నియోజకవర్గం ఇన్చార్జ్ రాజేంద్ర, టీడీపీ మండల అధ్యక్షుడు, నాయకులు ఆహ్వానం లేకపోవడంతో పాల్గొనలేదు. ఎటుచూసిన జనసేన జెండాలు దర్శనమిచ్చాయి, టీడీపీ, బీజేపీ జెండాలు కనిపించకపోవడంతో అక్కడికి వచ్చిన కార్యకర్తలు అసహనంతో వెనుతిరిగారు. స్థానిక ఎమ్మెల్యేకు సమస్యలకు తెలియజేయాలన్నా వాట్సాప్లోనే తెలియజేయాలని ఎమ్మెల్యే అనడంతో అక్కడికి వచ్చిన ప్రజలు ఖంగుతున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్ అన్నారు. అనంతరం జనసేన ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్పొన్న ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ భవ్య, మండల జనసేన అధ్యక్షుడు చిరంజీవి, నాయకులు గుండయ్య, పవన్, మురళీమోహన్, కుప్పయ్య, సుమన్, చంద్రమౌళి, రాఘవ పాల్గొన్నారు.