Chittoor District News
-
పేదలకు బియ్యం కోత..!
● జిల్లాలో అరకొరగా బియ్యం సరఫరా ● వేలిముద్రలు వేసుకుని బియ్యం ఇవ్వని వైనం ● ముగిసిన పంపిణీ గడువు కాణిపాకం: కూటమి ప్రభుత్వం పేదల కడుపు కొడుతోంది. డీలర్ల చేతివాటానికి కార్డుదారులను బలి చేస్తోంది. పలుచోట్ల వేలిముద్రలు వేసుకుని బియ్యం ఇవ్వకుండా డీలర్లు చేతులు దులుపుకున్నారు. రేషన్ పంపిణీ గడువు సోమవారంతో ముగియడంతో కార్డుదారులు లబోదిబోమంటున్నారు. అయినా పౌరసరఫరాల శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని 1,390 చౌక దుకాణాల పరిధిలో 5,36,686 రేషన్ కార్డులున్నాయి. వంద శాతం రేషన్ పంపిణీకి మిగులు బియ్యం ఆధారంగా ప్రతి నెలా జిల్లాకు 9 నుంచి 10 టన్నుల రేషన్ బియ్యం అవసరమవుతోంది. అయితే ఈ నెల 8,300 టన్నుల బియ్యం మాత్రమే సరఫరా జరిగింది. కోతలిలా.. జిల్లాలో ఈ నెలకు 9 వేల టన్నుల రేషన్ బియ్యం అవసరం కాగా కేవలం 8 వేల టన్నులు మాత్రమే ప్రభుత్వం సరఫరా చేసింది. వెయ్యి టన్నుల వరకు జిల్లాకు కోత పెట్టింది. ఆ తర్వాత 300 టన్నుల బియ్యాన్ని సరఫరా చేసి చేతులు దులుపుకుంది. ఈ లెక్కన్న 6 షాపులకు సరిపడ బియ్యం ఉందని ప్రభుత్వం సరఫరాను ఆపేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 40 షాపులకు 10 శాతం బియ్యం సరఫరా చేసినట్లు చెబుతున్నారు. మరికొన్ని షాపులకు 20 నుంచి 30 శాతం వరకు మాత్రమే సరుకు చేరిందని వెల్లడించారు. దీని దెబ్బకు జిల్లా వ్యాప్తంగా రేషన్ పంపిణీ గందరగోళంగా మారింది. కొన్ని చోట్ల రేషన్ సకాలంలో ఇవ్వక ఇబ్బంది పెట్టేశారు. మరికొన్నిచోట్ల కార్డుదారుల నుంచి ముందుగానే వేలిముద్రలు వేసుకుని, బియ్యం వరకు సర్దుబాబు చేశారు. కొన్ని షాపుల్లో వేలిముద్రలు వేసుకుని సరుకులు లేదని చెప్పేశారు. కొంత మంది అసలు రేషన్ రాలేదని తిప్పి పంపించేశారు. సోమవారం సాయంత్రానికి జిల్లా వ్యాప్తంగా 5,36,686 కార్డులదారులగాను 4,69,468 మంది రేషన్ తీసుకున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఈ లెక్కన్న 67,218 మంది రేషన్కు దూరమయ్యారు. ఐరాలలో మండలంలో ఇలా.. బియ్యం పంపిణీ గడువు ముగిస్తున్నా బియ్యం ఇవ్వకపోవడంతో ఆదివారం ఐరాల మండలం పుల్లూరు గ్రామానికి చెందిన కార్డుదారులు రేషన్ కార్డులు చూపుతూ నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీఆర్వో ద్వారా సరుకులు ఇస్తున్నారని.. ఆయన వేలిముద్రలు వేసుకుని సరుకులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. 70 మందికి ప్రతినెలా సరుకులు ఇవ్వడం లేదని తక్షణమే అధికారులు చర్యలు తీసుకుని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రెండు నెలలుగా ఇవ్వలేదు.. ప్రభుత్వం ఇచ్చే రేషన్ సరుకులతోనే మూడు ముద్దలు తింటున్నాం. ఆ బియ్యం రెండు నెలలుగా రేషన్ ఇవ్వకపోతే మేం ఎట్టా బతకాలి. డీలర్ షాప్కు వస్తే స్టాక్ రాలేదంటున్నారు. బయట ఇదే రేషన్ బి య్యం కేజీ రూ.20 నుంచి రూ.25కు అమ్ముతున్నా రు. సన్నబియ్యం కేజీ రూ. 60 ఆ ధరలు చూస్తేనే మా కడుపులు మండిపోతున్నాయి. –సుధాకర్, పుల్లూరు, ఐరాల మిగులు ఏమైనట్టో.. జిల్లాలో 250 చౌక దుకాణాల పరిధిలో ఈ నెల బియ్యం కొరత వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగిన పంపిణీలో సగటున లెక్క వేసి, బియ్యం డీలర్లకు సరఫరా చేశారు. గత నెల మిగులు బియ్యం, తాజాగా సరఫరా అయిన స్టాక్తో ఏ సమస్య రాకూడదు. అయితే గత రెండు, మూడు మాసాలుగా బియ్యం కొరత వస్తోందంటున్నారు. దీనికి కారణమేమిటో అధికారులే చెప్పలేకపోతున్నారు. జిల్లాలో రేషన్ వివరాలు ఎంఎల్ఎస్ పాయింట్లు 41 చౌకదుకాణాలు 1390 మొత్తం రేషన్కార్డులు 5,36,686 రేషన్ తీసుకున్న కార్డుదారులు 4,69,468 రేషన్ తీసుకోనివారు 67,218 పుంజుకున్న అక్రమ వ్యాపారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో రేషన్ అక్రమ వ్యాపారం పుంజుకుంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జిల్లాలో 250 మందిపైగా డీలర్లను తొలగించారు. దీంతో అక్కడి నుంచి ఆరంభమైన అక్రమవ్యాపారం..జోరుగా సాగింది. గత పది నెలల కాలంలో 80 మెట్రిక్ టన్నుల బియ్యం పట్టుబడగా, అందుకు సంబంధించిన వ్యాపారులంతా కూటమి పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. ఇట్టా చేస్తే ఎట్టా... మేము పేదోళ్లం. మా కడుపులు కొడితే ఎట్టా. రేషన్ ఇవ్వకుండా మానేస్తే ఏం చేయాలి..ఏం తినాలి. దీనే నమ్ముకుని బతుకుతుండాం. ఈనెల రేషన్ ఇవ్వకుండా చేస్తే...దిక్కుమొక్కుల లేన్నోళ్లం. ప్రతి నెల ఇది మాదిరిగానే జరిగితే కష్టం. అధికారులు ఓ తూరి మా బతుకులు చూసి రేషన్ ఇచ్చేలా చూడండా. –అదెమ్మ, పుల్లూరు గ్రామం, ఐరాల -
రైతుల రక్తం పీల్చేస్తున్నారు!
● చిత్తూరులో కూటమి పార్టీ దౌర్జన్యాల ‘గేటు’ ● పేదల నుంచి రైతుల వరకు ఇష్టారాజ్యంగా వసూలు ● అడిగే దిక్కులేదు.. అడగాల్సిన అధికారుల మౌనం ● ‘మార్కెట్ గేట్’ పేరిట జనం నుంచి రూ.లక్షల లూఠీ బలవంతపు వసూళ్లు చిత్తూరులో రోడ్లపై చిన్నపాటి వ్యాపారాలు చేసుకునేవారు, రైతుల రక్తాన్ని పీలుస్తూ.. వారి కష్టాన్ని దర్జాగా దోచుకోవడానికి ‘గేటు’ అనే పేరు పెట్టుకున్న కూటమి పార్టీకి చెందిన నాయకులు నడిరోడ్డుపై చేస్తున్న దౌర్జ న్యాలను ప్రశ్నించే దిక్కు కనిపించడంలేదు. ఎక్కడో మారుమూల పల్లెలో పనులు దొరకని రైతులు పండించుకున్న కూరగాయాలను చిత్తూరులో విక్రయించుకుని, నాలుగు రూపాయలు సంపాదించుకోవడాని కి వస్తుంటే.. వాళ్ల రక్తాన్ని పీల్చేస్తున్నారు. చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లోని మండలాల రైతులు, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు చెందిన రైతులు చిత్తూరు నగరానికి కూరగాయలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. కార్పొరేషన్ అధికారులు నిర్ణయించిన ధరలు కాకుండా.. గేటు కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తులు ఇష్టారాజ్యంగా బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ రైతుల ఉసురు పోసుకుంటున్నారు. తాటి ముంజెలు అమ్ముతున్న వ్యక్తి నుంచి రూ.50 గేటు వసూలు చేస్తున్న కలెక్షన్ బాయ్ ‘‘మండుటెండల్లో కొబ్బరికాయలు అమ్ము తున్న ఈ రైతు పేరు సుబ్రమణ్యం. రోజూ కొబ్బరికాయల కోసం చెట్టు ఎక్కే కొడుకు.. అదే చెట్టు పైనుంచి పడి చనిపోతే, వయసైపోయిన భార్య ను పోషించడానికి, ఈ పెద్దాయనే ప్రస్తుతం చెట్టు ఎక్కి కొబ్బరికాయలు కోసుకొచ్చి చిత్తూరు లో అమ్ముతున్నాడు. ఇందుకోసం ఈ రైతు రోజూ చెల్లిస్తున్న కప్పం రూ.50. వాస్తవానికి కట్టాల్సిన గేటు రూ.20 మాత్రమే.’’ ‘‘రెండు రోజుల కిందట చిత్తూరు ప్రశాంత్ నగర్ వద్ద బలవంతపు గేటు వసూళ్లపై చిత్తూరుకు చెందిన జగ్గా, జంగాలపల్లెకు చెందిన కిరణ్ అనే ఇరువర్గాలు రోడ్లపై కొట్టుకున్నాయి. వా రపు సంతలో గేటు ఎవరు వసూలు చేయాలో తెలియక ఇరువర్గాలు కొట్టుకోవడంతో యాద మరి పోలీసులు కేసులు నమోదు చేశారు.’’ చిత్తూరు అర్బన్: నగరంలో మార్కెట్ గేటు పేరిట కూటమి పార్టీకి చెందిన నేతల బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నారు. రోజూ వేలాది మంది రైతులు, రోడ్లపై పూసలు అమ్మేవారు, కూరగాయలు, బొమ్మలు, పండ్లు, ఆకు కూరలు విక్రయించే వారు.. ఇలా ప్రతి ఒక్కరి నుంచి దౌర్జన్యంగా మార్కెటు గేటును వసూలు చేస్తున్నారు. అసలు ఎవరు గేటు చెల్లించాలి..? ఎవరికి మినహాయింపు ఉంది..? తట్టలో వ్యాపారం చేస్తే ఎంత..? బుట్ట పెట్టుకునే వాళ్లు ఎంత ఇవ్వాలి..? అనే ప్రశ్నలకు కార్పొరేషన్ అధికారులు నోరువిప్పి మాట్లాడకపోవడం, కనీసం నగరంలో గేటు ధరలు తెలిపే బోర్డులు పెట్టకపోవడం ఈ దౌర్జన్యాలకు ఊతమిచ్చినట్లవుతోంది. నెలకు రూ.20 లక్షలకు పైనే.. చిత్తూరు నగరానికి ఐదు కిలో మీటర్ల పరిధిలో జరుగుతున్న గేటు దౌర్జన్యకాండను అటు పాలకులు, ఇటు అధికారులు పట్టించుకోవడంలేదు. రోజుకు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు గేటు వసులు చేస్తున్నారు. నెలకు సగటున రూ.20 లక్షల చొప్పున, ఏటా రూ.2 కోట్లపైనే వసూలు చేస్తున్నారు. గేటు వసూలు చేయడం చట్టవిరుద్ధం కాదు. కానీ వసూలు చేయాల్సిన దానికన్నా ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తుండడమే సమస్యకు కారణం. చాలా మంది రైతులు వాళ్ల కన్నీళ్లను దిగమింగుకుని ఈ గేటు చెల్లిస్తున్నారు. గేటు వసూళ్లల్లో వచ్చిన విభేదాలు నాటి టీడీపీ ప్రభుత్వ హయంలో అప్పటి మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ జంట హత్యలకు కారణమనే విషయం చిత్తూరు ప్రజలకు తెలిసిన బహిరంగ సత్యం. అలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ బలవంతపు గేటుకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది.చిన్న సన్నకారులు రైతులు.. చిన్న కమతాల్లో వ్యవసాయం.. అరకొర దిగుబడులు.. ఆ పంట ఉత్పత్తులు చిత్తూరులో విక్రయం.. వచ్చిన సంపాదనతో జీవనం.. అయితే ఆ బడుగుజీవులనూ కూటమి నేతలు విడవడం లేదు. కాసులపై ఆశతో మార్కెట్ గేట్ పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. అడిగే దిక్కులేక పోవడంతో ఆ కర్షకులు కక్కలేక మింగలేక తమకు వచ్చిన అరకొర ఆదాయంలో వారడిగినంత ముట్టజెప్పుతున్నారు. -
రక్తహీనత రహిత సమాజమే లక్ష్యం
గంగాధరనెల్లూరు: రక్తహీనత రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా శిశు సంక్షేమ శాఖ పీడీ వెంకటేశ్వరి అన్నారు. సోమవారం గంగాధర నె ల్లూరు మండలంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా గర్బిణులు, బాలింతలకు పౌష్డికాహారం ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. పీడీ మాట్లాడుతూ పోషణ్ పక్వాడ్ కార్యక్రమంపై గ్రామాల్లో అవగాహన కల్పించి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి రక్తహీనత లేని సమాజాన్ని నిర్మూలించాలని సూచించారు. అనంతరం గర్భిణులకు సీమంతాలు నిర్వహించి, చిన్నారులకు పీడీ వెంకటేశ్వరి, సీడీపీఓ వినీతాశ్రీ, అన్నప్రాసన్న చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హరిప్రసాద్రెడ్డి, ఎంఈఓ గుణశేఖర్రెడ్డి, సీహెచ్ఓలు శ్రీనివాసులు, జ్ఞానశేఖర్, సర్పంచ్ సుబ్రమణ్యం, పర్యవేక్షకులు అనురాధ, బిందు, మాలతి, నాగరత్నమ్మ, భాగ్యలక్ష్మి, సంగీత పాల్గొన్నారు. -
ఇంటర్ డీఐఈఓగా శ్రీనివాసులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా ఇంటర్మీడియట్ డీఐఈఓగా ఏ. శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోనశశిధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మేరకు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూ రు జిల్లా కేంద్రంలో డీకే ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్న ఏ శ్రీనివాసులును చిత్తూరు డీఐఈఎగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆయనకు వైఎస్సార్కడప జిల్లా ఇంటర్మీడియట్ విద్య ఆర్జేడీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో చిత్తూరు డీఐఈఓగా పనిచేస్తున్న సయ్యద్ మౌలా తన పూర్వపు స్థానం కణ్ణన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా కొనసాగనున్నారు. నూతన డీఐఈఓ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. వరసిద్ధుడికి రూ.1.77 కోట్ల ఆదాయం కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామివారి ఆలయానికి హుండీల ద్వారా రూ.1.77 కోట్ల ఆదాయం వచ్చిందని ఈఓ పెంచలకిషోర్ తెలిపారు. కాణిపాకంలోని వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో హుండీల్లోత భక్తుల సమర్పించిన కానుకలను సోమవారం ఆలయాధికారులు లెక్కించారు. హుండీల ద్వారా దేవస్థానానికి రూ.1.71,77,943 ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.13,814, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.42,436 వచ్చిందన్నారు. 309 యూఎస్ఏ డాలర్లు, 10 యూరోలు, 50 కెనడా డాలర్లు, 5 ఆస్ట్రేలియా డాలర్స్, 4 మలేషియా రింగిట్స్, 135 యూఏఈ దిర్హామ్స్ వచ్చాయన్నారు. బంగారం 165 గ్రాములు, వెండి 1.350 కిలోలు భక్తులు కానుక రూపంలో సమర్పించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ధనంజయ, ప్రసాద్, నాగేశ్వరరావు, కోదండపాణి, శ్రీధర్బాబు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు గ్రీవెన్స్కు 55 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: నగరంలో నిర్వహించిన పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో 36 వినతులు అందాయి. చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర్రాజు స్థానిక ఏఆర్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి త గాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. పలు ఫిర్యా దులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌజ్ అధికారులతో మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యపై విచారణ జరిపి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే చిత్తూరు పోలీసు శిక్షణ కేంద్రం డీఎస్పీ రాంబాబు సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు. పదో తరగతి ఫలితాలు రేపు చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈ నెల 23వ తేదీన విడుదల చేస్తారని డీఈఓ వరలక్ష్మి వెల్లడించారు. ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు. 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల చేస్తారన్నారు. పరీక్షలు రాసిన విద్యార్థులు bre.ap.gov.in మనమిత్ర వాట్సా ప్, లీప్ యాప్లలో చూసుకునేలా వెసులుబాటు కల్పించారన్నారు. వాట్సాప్లో 95523 00009 నంబర్కు ఏజీ (హాయ్) అని మెసేజ్ పంపి రోల్ నంబర్ నమోదు చేస్తే ఫలితాల పీడీఎఫ్ను పొందవచ్చని డీఈఓ వెల్లడించారు. -
రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీల విజేత విక్రాంత్రెడ్డి
రొంపిచెర్ల: రాష్ట్రస్థాయి దివ్యాంగుల రన్నింగ్ డేస్ పోటీల్లో రొంపిచెర్ల ఆదర్శ పాఠశాల దివ్యాంగ విద్యార్థి విక్రాంత్ రెడ్డి విజేతగా నిలిచాడు. చిత్తూరు జిల్లా సదుం మండలం ఎర్రాతివారిపల్లెకు చెందిన విక్రాంత్ రెడ్డి రొంపిచెర్ల ఆదర్శ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సోమవారం జరిగిన దివ్యాంగుల రాష్ట్రస్థాయి పరుగుపందెం పోటీల్లో విక్రాంత్ రెడ్డి విజేతగా నిలిచారని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సరళ, భవిత పాఠశాల ఉపాధ్యాయురాలు అములు తెలిపారు. విన్నర్స్గా నిలిచిన విద్యార్థి విక్రాంత్ రెడ్డిని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంఈఓలు ఇందిర, శ్రీనివాసులు, ఉపాధ్యాయులు అభినందించారు. కక్ష కట్టి దాడులు చిత్తూరు రూరల్ (కాణిపాకం):కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్షకట్టి దాడులకు పాల్పడుతున్నారని, దౌర్జన్యంగా పెద్దిరెడ్డి కుటుంబంపై తప్పడు కేసులు బనాయిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ ధ్వజమెత్తారు. చిత్తూరు నగరంలోని ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్రెడ్డిపై పెట్టిన తప్పుడు కేసులపై ఎలాంటి ఆధారాలు లేవని, నియోజకవర్గంలో నిజాయితీగా అభివృద్ధికి పాటుపడ్డారన్నారు. కూటమి ప్రభుత్వంవారిపై లేనిపోని నిందలు మోపడమే పనిగా పెట్టుకుందని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం మానుకుని, రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రశ్నించే వారిని ఇబ్బంది పెట్టవద్దని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా పదవి ఇవ్వడం పట్ల అధినేత జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
అయ్యా..సమస్యలు పరిష్కరించండి!
● కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక ● అర్జీలు స్వీకరించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ● 258 అర్జీలు నమోదు చిత్తూరు కలెక్టరేట్ : ‘అయ్యా దూర ప్రాంతాల నుంచి ప్రతి సోమవారం కలెక్టరేట్కు విచ్చేస్తున్నాం. సమస్యల పరిష్కారం కోసం అర్జీలు ఇస్తూనే ఉన్నాం. అయితే క్షేత్రస్థాయిలో తమ సమస్యలు ఏ మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. సమస్యల పరిష్కారానికి ఇంకెన్ని సార్లు కార్యాలయాల చుట్టూ తిరగాలయ్యా అంటూ అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దయచూపి తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు.’ 258 అర్జీలు నమోదు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ శాఖలకు సంబంధించి 258 అర్జీలు నమోదయ్యాయి. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించిన అర్జీలే 213 ఉండడం గమనార్హం. మిగిలిన శాఖలకు సంబంధించి పోలీసు 6, డ్వామా 1, ఆర్అండ్బీ 1, డీఆర్డీఏ 26, డీసీహెచ్ఎస్ 1, మున్సిపల్ కమిషనర్ నగరి 2, డీఎస్ఓ 4, పశుసంవర్థకశాఖ 2, హౌసింగ్ 3 మొత్తం 258 అర్జీలను ప్రజలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అనుపమ, విజయలక్ష్మి, వెంకటశివ, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గుడి స్థలం ఆక్రమిస్తున్నారు గుడి స్థలాన్ని కొందరు ఆక్రమణకు ప్రయత్నిస్తున్నా రని గంగాధరనెల్లూరు మండలం పిళ్లారికుప్పం ప్రజలు రామప్ప, సుజిత్ తదితరులు వాపోయారు. వారు మాట్లాడుతూ తమ గ్రామంలో దాదాపు 100 సంవత్సరాల నుంచి శ్రీరామకృష్ణ భజన మందిరం ఉండేదన్నారు. కాల క్రమేణా ఆ మందిరం శిథిలావస్థకు చేరుకోగా భజనమందిరం వెనుక వైపున తాత్కాలికంగా దేవుడి పటాలు ఏర్పాటు చేశామన్నా రు. అక్కడే దూపదీపనైవేద్యాలు సమర్పిస్తున్నామన్నారు. నూతన భభజన మందిరం నిర్మాణానికి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సర్వే చేసి, సర్వే నంబర్ 366/1లో 0.04 సెంట్ల భూమిని కేటాయించి హద్దు రాళ్లు నాటారని చెప్పారు. అయితే ఆ భూమిని ప్రస్తుతం ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఫీల్డ్ అసిస్టెంట్లంటే చిన్నచూపెందుకు? ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లంటే సర్కారుకు చిన్నచూపెందుకని క్షేత్రసహాయకుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నామలై ప్రశ్నించారు. ఆ సంఘ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అకారణంగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం అన్యాయమని చెప్పారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఈ నెల 28 నుంచి విధులను బహిష్కరించి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి జిల్లాలోని నగరి మండలం నత్తంకండ్రిగ దళితవాడలో 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న దళిత కుటుంబాలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఆ పార్టీ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ నగరిలోని 9వ వార్డులో నెత్తంకండ్రిగ దళితవాడలో నివాసం ఉంటున్న ఇళ్లకు ఇంటిపట్టాలు మంజూరు చేయాలన్నారు. పార్టీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, చిత్తూరు పట్టణ కార్యదర్శి గోపినాథ్, నాయకులు దాసరి చంద్ర,మణి,విజయ్ కుమార్, నత్తం కండ్రిగ గ్రామ కమిటీ నాయకులు రాజు వేలు,యేసయ్య,హరి తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటున్నారయ్యా! ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటున్నారయ్యా అంటూ వెదురుకుప్పం మండలం యనమలమంద గ్రామానికి చెందిన ప్రజలు గణేష్, మునెమ్మ, గిరి, గోవిందమ్మ తదితరులు వాపోయారు. ఆ గ్రామస్తులు ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు అర్జీని అందజేశారు. వారు మాట్లాడుతూ వెదురుకుప్పం మండలం యనమలమంద గ్రామం ఆళ్లమడుగు లెక్కదాఖలాలో సర్వే నంబర్ 435/2 లో 2.87ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందన్నారు. ఆ స్థలాన్ని గ్రామానికి చెందిన శ్రీరాములురెడ్డి కబ్జా చేస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని అనేక సార్లు వెదురుకుప్పం తహసీల్దార్కు విన్నవించుకున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్రమించుకుంటున్న స్థలాన్ని కాపాడి ఇళ్లు లేని పేదలకు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామానికి చెందిన నరసింహులు, వంశీ, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. -
కూర్చున్నా.. పరిగెడుతున్నా..తింటున్నా..పడుకున్నా..సెల్ చెంతనే ఉండాల్సిందే. ఇది లేని జీవితాన్ని ఊహించడం కష్టసాధ్యంగా మారుతోంది. పిల్లలు పెద్దల ప్రమేయం లేకుండానే గేమ్లు ఆడుతున్నారు. తమకు కావాల్సిన ఆటలు డౌన్లోడ్ పెట్టుకుంటున్నారు. ఈ పరిణామం ఆందోళన కలిగిస
● సోషల్ మీడియాకు బానిసలువుతున్న విద్యార్థులు ● పెరిగిన సోషల్ మీడియా వినియోగం ● అనవసర వీక్షణ ● ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పది లక్షలు దాటిన సెల్ఫోన్ యూజర్లు ● అతివాడకంతో ఆరోగ్య సమస్యలు తప్పవంటున్న వైద్యులు ఎక్కువ మంది యూట్యూబ్ వీక్షకులే స్మార్ట్ఫోన్ వాడుతున్న వారిలో 80 శాతం మంది యూట్యూబ్ చూస్తుండగా, 60 శాతం మంది వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ర్ట్రాగామ్ను వాడుతున్నట్టు గూగూల్ చేసిన సర్వేలో తేలింది. విద్యార్థులు, యువతలో 50 శాతం మంచి ఆన్లైన్లో గేమ్స్ కోసం సమయాన్ని వెచ్చిస్తున్నారు. మహిళలు పనిపాట చేసుకుంటూ కూడా సీరియళ్లను సెల్లోనే చూసేవారి సంఖ్య పెరుగుతోంది. ఇక చిన్నపిల్లలు సైతం స్మార్ట్ఫోన్లో కార్టూన్ స్టోరీస్ చూడకుండే ఏడుపు మొదలు పెట్టడం చూస్తూనే ఉన్నాం.పలమనేరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్మార్ట్ఫోన్ల వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎలాంటే.. ఒక నిమిషం చేతిలో సెల్ లేకుంటే బతకలేమన్నట్టుగా తయారయ్యారు నేటి విద్యార్థులతు, పిల్లలు, యువకులు. డ్రగ్స్కు బానిసైనట్టు స్మార్ట్ఫోన్ కారాగారంలో నేటి తరం బందీలుగా మారారు. ఇప్పుడు పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా స్మార్ట్ఫోన్ల వాడకం విద్యార్థుల్లో ఎక్కువైంది. పిల్లాడు అన్నం తినాలంటే మొబైల్, బడికి రెడీ కావాలంటే మొబైల్, బడి నుంచి రాగానే సెల్ఫోన్ చేతిలో పెట్టాల్సిందే. పసిబిడ్డలు సైతం ఏడుపు ఆపాలంటే తల్లిపాలు పట్టడం కంటే చేతిలో సెల్ పెట్టగానే సైలెంట్ అవుతున్నారు. మొబైల్ లేకుంటే మనషులకు బుర్ర కూడా పనిచేయడం లేదు. మితిమీరిన సెల్ వాడకం మనిషి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నా మార్పు రావడం లేదు. ఇప్పటికే చాలామంది వారికి తెలియకనే మానసిక రోగుల్లా మారారు. ఇంకొందరు అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు స్టార్ట్ఫోన్లకు బానిసలుగా మారిపోవడం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పది లక్షల స్మార్ట్ఫోన్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1990లో కీప్యాడ్ఫోన్ల వాడకం మొదలైంది. తొలుత తిరుపతి, చిత్తూరు, కుప్పం, మదనపల్లెలో రిలయన్స్ మొబైల్ టవర్ల ద్వారా నెట్వర్క్ను అందిస్తూ సేవలను మొదలు పెట్టారు. ఆపై పలు సెల్ కంపెనీలు మార్కెట్లోని వచ్చాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 8 వేల దాకా సెల్ఫోన్ టవర్లున్నాయి. ఉమ్మడి జిల్లా జనాభా 44 లక్షలు కాగా వీరిలో సెల్ఫోన్లు (కీఫ్యాడ్, టచ్ మొబైల్)వాడే వారి సంఖ్య ప్రస్తుతం 10 లక్షలకు చేరింది. గత నాలుగేళ్లుగా సెల్ఫోన్ల వాడకం ఏటా 15 శాతం పెరుగుతున్నట్టు ట్రాయ్(టెలీఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) లెక్కలు చెబుతున్నాయి. స్మార్ట్ఫోన్లను వాడేవారిలో రోజుకు సగటున యువత 4 గంటలు, విద్యార్థులు 2 గంటలు, గృహిణిలు 2 గంటలు, అధికారులు 1.30 నిమిషాలు, పిల్లలు గంటపాటు సమయాన్ని కేటాయిస్తున్నట్టు తెలిసింది. అనారోగ్య సమస్యలు తప్పనట్టే సెల్ చూస్తున్న కారణంగా నిద్రలేమి ప్రధాన సమస్యగా మారుతోంది. దీంతో మనిషి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత దెబ్బతింటోందని(డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో తెలిపింది. శరీరంలో మెలటోనియన్ నిల్వలు నశించి డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నిద్రలేమి కారణంగా అధిక బరువు, లావెక్కడం జరుగుతుంది. పిల్లలకు తలనొప్పి, చూపు మందగించి కంటి అద్దాలను వాడాల్సిందే. అలాగే పలు అనారోగ్య సమస్యలు తప్పవు. – మమతారాణి, ఏరియా ఆస్పత్రి సూపరిండెంటెంట్, పలమనేరు మంచి కంటే చెడే ఎక్కువ పుట్టిన పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇప్పుడు సెల్ఫోన్ ఓ లోకంలా మారిపోయింది. కొందరైతే కనీసం టూజీబీ ఖాళీ చేస్తే గానీ మనసు కుదుటపడదు. ముఖ్యంగా చిన్నపిల్లలు బడి నుంచి ఇంటికి రాగానే చేతిలో సెల్ ఉండాల్సిందే. విద్యార్థులకు సైతం స్మార్ట్ఫోన్ వ్యామోహం పెరిగింది. వీటిని తల్లిదండ్రులు నియంత్రించాలి. ఎక్కువగా సెల్ వాడకంతో మంచికంటే చెడే ఎక్కువ అని గ్రహించి సమాజంలో మార్పు రావాలి. – డాక్టర్ రాజేంద్రరెడ్డి, విశ్రాంత ప్రిన్సిపల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పలమనేరు సోషల్ మీడియా వాడకం పరిస్థితి ఇదీ! ఇటీవల యాన్యువల్ స్టేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ నివేదికలో వెల్లడించిన అంశాలు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. సోషల్ మీడియా బానిసలైన వారిలో 14 ఏళ్లలోపు పిల్లలు 79 శాతం, 15 నుంచి 20 ఏళ్ల వయసున్న వారిలో 82 శాతం, మహిళలు 75 శాతం ఉండడం కొసమెరుపు. ఇదిగో సాక్ష్యం.. పలమనేరు పట్టణంలో ఇంజినీరింగ్ చదవుతున్న ఓ విద్యార్థిని సెల్ఫోన్ అతిగా వాడొద్దని తల్లిదండ్రులు మందలించారు. దీంతో అప్పటికే సెల్కు బానిసైన ఆ విద్యార్థి తన గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని పదో తరగతి చదివే బాలికకు సెల్ఫోన్ కొన్విలేదని తన చేతిని బ్లేడ్తో కోసుకుని ఆస్పత్రి పాలైంది. సెల్ ఇవ్వలేదని ఐదో క్లాస్ చిన్నారి ఇంటి నుంచి పరారయ్యాడు. ఇలాంటి సంఘటనలు జిల్లాల్లో నిత్యకృత్యంగా మారాయి. -
కొడుకు చేతిలో గాయపడిన తండ్రి మృతి
– గ్రామస్తుల సహకారంతో అంతిమ వీడ్కోలు చౌడేపల్లె: కొడుకు, కోడలి దాడిలో గాయపడిన తండ్రి మనోవేదనతో మృతి చెందిన ఘటన ఏ.కొత్తకోట పంచాయతీ అంకుతోటపల్లెలో సోమవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. అంకుతోటపల్లెకు చెందిన చిన్నప్పరెడ్డి(90), రాజమ్మ దంపతులకు కుమారుడు మనోహర్రెడ్డి, కోడలు సరస్వతమ్మ ఉన్నారు. కొడుకు,కోడలు కలిసి గత మార్చి 30వ తేదీన చిన్నప్పరెడ్డిని చితకబాదడంతో కాలు విరిగి పోయింది. ఈ ఘటనపై సాక్షిదినపత్రికలో ‘కడుపున పుట్టినోళ్లా...తోడేళ్లా’ అనే శీర్షికన వృద్ధ దంపతుల ధీనగాథపై ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ కథనంపై స్పందించిన ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు చౌడేపల్లె పోలీసులు కొడుకు, కోడలిపై కేసు నమోదు చేశారు. కాగా తీవ్రంగా గాయపడి కాలు విరిగిన చిన్నప్పరెడ్డిను మాజీ సర్పంచ్ విజయకుమార్రెడ్డి సహకారంతో గ్రామస్తుల కలిసి మదనపల్లెలో ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. వారం రోజుల క్రితం డిస్చార్జి కాగా ఇంటికి వచ్చిన చిన్పప్పరెడ్డి మనోవేదనకు గురై అస్వస్థకు గురై సోమవారం మృతి చెందాడు. కుటుంబసభ్యులెవరూ సహకరించకపోవడంతో ఇలాంటి కష్టం మరెవరికీ రాకూడదంటూ మృతుడు భార్య రాజమ్మ చేసిన రోదన పలువురిని కలిచివేశాయి. గ్రామస్తుల సహకారంతో అంతిమయాత్ర నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో మదరసా హజ్రత్ మృతి పలమనేరు: చైన్నె– బెంగళూరు జాతీయ రహదారిపై స్థానిక హెచ్పీ పెట్రోల్ బంకు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగమంగళం మదరసా హజ్రత్ సోహైల్ అహ్మద్(35) అక్కడిక్కడే మృతి చెందాడు. పట్టణంలో నుంచి స్కూటీలో నాగమంగళంలోని మదరసాకు వెళతుండగా ఎదురుగా సేలం నుంచి తిరుపతికి వెళుతున్న తమిళనాడు ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొంది. దీంతో ఆయన తలకు తీవ్ర గాయమై మృతి చెందాడు. ఆయనకు భార్య ముగ్గురు ఆడపిల్లలున్నారు. విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. భూసమస్యల పరిష్కారమే ప్రత్యేక అజెండా పలమనేరు: భూ సమస్యల పరిష్కారమే ప్రత్యేక అజెండాగా చేసుకుని వీటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతామని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ వెల్లడించా రు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఎస్సీ మణికంఠ చందోలు, జేసీ విద్యాధరి, ఎ మ్మెల్యే అమరనాథరెడ్డితో కలసి గ్రీవెన్స్డే నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇక్కడొచ్చిన సమస్యల్లో 95 శాతం రెవెన్యూ సమస్యలే ఉన్నాయన్నారు. వీటి పరిష్కారానికి ఆయా తహసీల్దార్లు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. రానున్న మూడు నెలల్లో ప్రతి సోమవారం ఇక్కడే గ్రీవెన్స్డేను నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లాలో పీజీఆర్ఎస్ ద్వారా 53 వేల వినతులందగా వీటిల్లో 12వేల అర్జీలు కుప్పం నియోజకవర్గంనుంచే ఉన్నాయన్నారు. త్వరలో కుప్పంలోనూ ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపా రు. గతంలో పుంగనూరులో జమీందారి వ్యవస్థ, పలమనేరు ప్రాంతంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఎక్కువగా సమస్యలున్నాయని ఎమ్మెల్యే అమరనాథరెడ్డి తెలిపారు. -
చెక్డ్యామ్ ధ్వంసం
శాంతిపురం: రాళ్లబూదుగూరు పంచాయతీలోని సాతు వద్ద ఉపాధి హామీ నిధులతో ని ర్మించిన చెక్ డ్యామ్ను గుర్తు తెలియని వ్య క్తులు ధ్వంసం చేశారు. రెడ్డివారిపల్లి నుంచి సాతు కొత్త చెరువుకు నీరు వెళ్లే వంకపై పదేళ్ల క్రితం చెక్ డ్యామ్ నిర్మించారు. ఇక్కడ నీరు నిండితే సమీపంలోని బోర్లలో నీటి మట్టం పెరిగి రైతులకు ఉపయోగంగా ఉండేది. కానీ ఇటీవల ఎవరో చెక్ డ్యామ్ను పగులగొట్టినట్టు స్థానికులు గుర్తించారు. చెక్ డ్యామ్నకు గండి కొట్టడంతో వర్షాలు కురిసి వంకలో నీరు వచ్చినా రైతులకు ఉపయోగపడని పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. అధికారులు స్పందించి చెక్ డ్యామ్ మరమ్మతులు చేసి, దాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి శిక్షించాలని వారు కోరుతున్నారు. సీఆర్సీ నిధులు దుర్వినియోగంపై ఫిర్యాదు గుడుపల్లె: ప్రభుత్వ పాఠశాలకు ఏటా ఇచ్చే మెయిన్టెన్స్ గ్రాంట్ నిధులను సీఆర్సీ ఇన్చార్జ్లు దుర్వినియోగం చేశారని పాఠశాల ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. గుడుపల్లె మండలంలో గుడుపల్లె, శెట్టిపల్లె, పొగురుపల్లె, యామగానిపల్లె, సోడిగానిపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలను 5 క్లస్టర్ పాఠశాలలు ఉన్నాయి. 2024–25 సంవత్సరానికి గాను ఒక్కొక్క క్లస్టర్కు రూ.లక్ష వంతున రూ.5 లక్షలు నిధులు మంజూరు చేశారు. ఈ నిధులను క్లస్టరు పాఠశాలకు మెయిటెన్స్ కోసం ఖర్చు చేయాలన్నారు. కానీ గుడుపల్లె క్లస్టర్కు సంబంధించిన రూ. లక్ష నిధులు దుర్వినియోగం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. క్లస్టర్ సమావేశం నిర్వహించకుండా ఉపాధ్యాయుల సూచనలు తీసుకోకుండా బినామి బిల్లులు పెట్టారన్నారు. గతంలో నా డు– నేడు కార్యక్రమంలో తీసుకువచ్చిన ఫర్నిచర్, బుక్స్లు, మెటీరియల్తోపాటు పాత వస్తువులను చూపి, కొత్త బిల్లులు సృష్టించారు. ఈ బిల్లులు ప్రకారం 2024–25 సంవత్సరానికి సంబంధించిన ఈసీలను ఉన్నతాధికారులకు అందించారన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
● పనిచేయని బాలసంజీవని 2.0 ● పూర్వప్రాథమిక విద్య బలోపేతం పేరుతో పనిఒత్తిళ్లు ● సాంకేతిక సమస్యలు పరిష్కరించకుండా కొత్త యాప్లు ● పనిచేయని ఫోన్లు వెనక్కి ఇచ్చేందుకు సిద్ధమవుతున్న కార్యకర్తలు ● సెల్ఫోన్ల స్థానంలో ట్యాబ్లు ఇవ్వాలని డిమాండ్
జిల్లా సమాచారంకార్వేటినగరం : అంగన్వాడీ కేంద్రాల నుంచి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు రేషన్ సరుకులను మరింత పకడ్బందీగా పంపిణీ చేయాలని ప్రభుత్వం యాప్లో మార్పులు, చేర్పులు చేసింది. అప్పటి నుంచి అంగన్వాడీలకు కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్లు మొబైల్ ఫోన్లలో ఇన్స్టాల్ కాక అంగన్వాడీలు అవస్థలు పడుతున్నారు. యాప్ల నిర్వహణలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సరుకులు పంపిణీ చేయాలని ఒత్తిడి చేస్తుండటంతో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తాజాగా బాలసంజీవని 2.0 వెర్షన్తో కొత్త యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ యాప్లో వర్కర్లు, హెల్పర్లు ఫొటో క్యాప్సర్ చేసి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ చేయాల్సి ఉంది. అయితే తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతో అంగన్వాడీలు పోషకాహార పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొత్తగా అమల్లోకి వచ్చిన యాప్ సక్రమంగా పనిచేయకపోవడంతో కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో పనిని మూడు యాప్ల్లో వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉండటం, యాప్లో సాంకేతిక లోపం కారణంగా పనిచేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు. హాజరు ఇలా.. భోజనం ఎలా? ప్రతి రోజు విధిగా ఉదయం 9 గంటలకు, తిరిగి సాయంత్రం 4 గంటలకు ఫేస్ యాప్ వేయాలి. అలాగే వచ్చిన వెంటనే పిల్లల హాజరు ఫొటో తీయాలి. ఎంత మంది హాజరైతే అంత మంది చిన్నారులకు మాత్రమే ఆహారం అందించాల్సి ఉంది. మూడేళ్లల్లోపు చిన్నారులు కావడంతో జిల్లాలోని చాలా అంగన్ఽవాడీ కేంద్రాల్లో ఉదయం 10.30 గంటల వరకు పిల్లలు వస్తూనే ఉంటారు. ముందుగానే యాప్ నమోదు చేసిన కారణంగా తర్వాత వచ్చిన పిల్లలకు ఆహారం అందించేందుకు అవకాశం లేకపోవడంతో వండిన ఆహారాన్నే అందరికి సరిపెట్టాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సమస్యను అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదని అంగన్వాడీలు వాపోతున్నారు. పనిచేయని ఫోన్లతో ఇబ్బందులు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన బాలసంజీవని యాప్ సక్రమంగా పనిచేయడం లేదు. ప్రస్తుతం ఉన్న ఫోన్లలో యాప్ ఇన్స్టాల్ అయినా సర్వర్లు మొరాయిస్తుండటంతో వివరాలు నమోదు చేసేందుకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం అంతంత మాత్రంగానే ఉంది. నెట్ లేకపోతే యాప్ ఓపెన్ కావడం లేదు. – విజయ, సీఐటీయూ ఆధ్యక్షురాలు, కార్వేటినగరం ప్రాజెక్టు, శ్రీరంగరాజపురం ట్యాబ్లు పంపిణీ చేయాలి బాలసంజీవని 2.0 యాప్తో అంగన్వాడీలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇచ్చిన మొబైల్ ఫోన్లలో ఈ యాప్ పనిచేయడం లేదు. పాత ఫోన్లను వెనక్కు తీసుకుని ఆ స్థానంలో 5జీ ట్యాబ్లు పంపిణీ చేసి అంగన్వాడీలకు యాప్ కష్టాలు తొలగించాలి. యాప్ల నిర్వహణతో అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీలు పడుతున్న అవస్థలు తొలగించాలి. – మమత, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి, కార్వేటినగరం ప్రాజెక్టు, కార్వేటినగరం పనిభారం తగ్గించాలి అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలపై పనిభారం అఽధికమైంది. కేంద్రాల్లో యాప్ల నిర్వహణతో సతమతమవుతున్నారు. ఈ పనులే కాకుండా ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కావాలని ఒత్తిళ్లు చేస్తున్నారు. అరకొర వేతనం ఇస్తూ అంగన్వాడీలతో వెట్టి చాకిరి చేయించడం సరికాదు.అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు వారిపై పనిభారం తగ్గించకుంటే రాబోయే రోజుల్లో ఆందోళనలు చేపడుతాం. – వాడ గంగరాజు, సీఐటీయూ జిల్లా గౌరవాధ్యక్షుడు, చిత్తూరుసెల్ఫోన్లు వెనక్కి తీసుకుని 5జీ ట్యాబ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న అంగన్వాడీలు అంగన్వాడీ కేంద్రాలు 2420 సీడీపీఓలు 12 మంది మొత్తం కార్యకర్తలు 2420పర్యవేక్షకులు 70 మంది గత ప్రభుత్వంలో పకడ్బందీగా సేవలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రాల్లో స్మార్ట్ఫోన్ల వినియోగంతో పకడ్బందీగా సేవలు అందాయి. ఆరు యాప్లు అమలు చేసి పారదర్శకతకు పెద్దపీట వేసింది. పోషణ ట్రాకర్ యాప్, వైఎస్సార్ సంపూర్ణ పోషణ యాప్, హాట్కుక్ యాప్ తదితర యాప్లతో ప్రభుత్వం నిత్యం పర్యవేక్షించింది. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల, గర్భిణులు, బాలింతలకు తాగునీరు, మరుగుదొడ్లకు సంబంధించి వినియోగించుకునేందుకు నీరు అందుబాటులో ఉంచింది, లేనిది యాప్ వివరాలు నమోదు చేస్తే ఆర్డబ్ల్యూస్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన నీటి సమస్య పరిష్కరానికి చర్యలు తీసుకునేలా కృషి చేసింది. గుడ్ల సరఫరాకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చి అమలు చేసింది. -
పెనుమూరు..గంజాయి జోరు
● దాణా పేరుతో విచ్చలవిడిగా అమ్మకాలు ● చీకటి పడితే బీడు భూముల్లో ముఠాలు ● పక్క రాష్ట్రాల నుంచి యఽథేచ్ఛగా దిగుమతి ● నిద్ర మత్తులో అధికారులు సాక్షి టాస్క్ఫోర్స్ : గంజాయి, మట్కా, గుట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పెనుమూరు మండల కేంద్రం నిలయంగా మారింది. మత్తుకు యువత బానిసలై తమ నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పెనుమూరు మండల కేంద్రంలో కొన్ని నెలలుగా గంజాయి అమ్మకాలు జోరందుకున్నాయి. కొందరు దాణా వ్యాపారం పేరుతో గంజాయి అమ్మకాలు చేస్తూ చాపకింద నీరులా తమ అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటున్నారు. అలాగే కొన్ని నిత్యావసర సరుకుల దుకాణాల్లో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పెనుమూరు మండల కేంద్రం చుట్టూ ఉన్న బీడు భూముల్లో చీకటి పడితే చాలు గంజాయి కేంద్రాలుగా మార్చేస్తున్నారు. మహిళలు బహిర్బూమికి వెళ్లాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లాకు సమీపంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఉండడంతో అక్రమ వ్యాపారులు కొందరు ప్రయాణికుల్లా ఎవరికీ అనుమానం లేకుండా చేతి సంచులు, కట్టె బ్యాగుల్లో రహస్యంగా ఆర్టీసీ బస్సుల్లో తెచ్చుకుంటున్నట్లు సమాచారం. ఎక్కువగా కర్ణాటక రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గంజాయి మత్తుకు బానిసలైన యువత, విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దుకాణాల్లో తనిఖీలు లేకపోవడంతో అక్రమ వ్యాపారాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. అక్రమ వ్యాపారులు గంజాయితో రూ.లక్షలు గడిస్తూ పెనుమూరును గంజాయి వ్యాపారానికి కేంద్రంగా మారుస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు నిద్రమత్తును వీడి గంజాయి అమ్మకాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
● బాబు జన్మదిన కానుకగా నోటిఫికేషన్ ● దళితులకు, బీసీలకు ఇచ్చే ఉచిత శిక్షణపై మండిపాటు ● తొలిసారిగా సీబీటీ విధానంలో పరీక్షలంటూ మెలిక ● జిల్లాలో 1,478 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఉమ్మడి చిత్తూరు జిల్లా సమాచారం ప్రాథమిక పాఠశాలలు 3,766ప్రాథమికోన్నత పాఠశాలలు 444 ఉన్నత పాఠశాలలు 705ఉమ్మడి జిల్లాలో 1,478 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ చిత్తూరు కలెక్టరేట్ : అధికారంలోకి రాగానే డీఎస్సీ పరీక్షను నిర్వహిస్తామంటూ గత ఎన్నికల సమయంలో టీడీపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక సీఎంగా ప్రమాణ స్వీకారం రోజున చంద్రబాబు మెగా డీఎస్సీ పరీక్ష ఫైల్పై తొలి సంతకం చేశారు. అయితే పరీక్షల నోటిఫికేషన్ జారీ చేయకుండా నెలల తరబడి సాగదీశారు. చివరికి క్షేత్ర స్థాయిలో నిరుద్యోగుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. తాజాగా ఈనెల 20న చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆర్భాటంగా నోటిఫికేషన్ను మంత్రి లోకేష్ విడుదల చేశారు. కాగా సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామంటూ మెలిక పెట్టడంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. నిధులను కాజేసేందుకేనా.. సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహించాలంటే అందుకు సరిపడే సౌకర్యాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కేంద్రాల్లో లేవు. ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ ఇంజినీరింగ్, మరికొన్ని కంప్యూటర్ కేంద్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రైవేట్ కేంద్రాల్లో సీబీటీ విధానంలో డీఎస్సీ పరీక్షల నిర్వహణకు రూ.కోట్ల కొద్ది బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. అదే పాత విధానంలో ఒకే రోజు డీఎస్సీ పరీక్షను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల కేంద్రాల్లో నిర్వహిస్తే ప్రభుత్వానికి తక్కువ ఖర్చుతో సరిపోయేది. అలా కాకుండా డీఎస్సీ పరీక్షను నెల రోజుల పాటు ఇంజినీరింగ్ కళాశాలల్లో నిర్వహించి నిధులను నొక్కేసేందుకు ప్రణాళిక రచించినట్లు విమర్శలున్నాయి. మొక్కుబడిగా ఉచిత శిక్షణలు డీఎస్సీ పరీక్షకు ఉచిత కోచింగ్ హామీ ప్రకారం నోటిఫికేషన్కు కనీసం అయిదు నెలల ముందు శిక్షణ ఇచ్చి ఉంటే నిరుద్యోగులకు ఉపయోగం ఉండేది. ఉచిత కోచింగ్ అంటూ ప్రచారం చేసిందే తప్ప శిక్షణ ఇచ్చిన పాపాన పోలేదు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ప్రారంభించినప్పటికీ 5 మంది అభ్యర్థులు కూడా లేరు. ఎస్సీ అభ్యర్థులకు ఇటీవలే శిక్షణ ప్రారంభించారు. శిక్షణ కేంద్రాల్లో నైపుణ్యం కలిగిన అధ్యాపకులు లేకపోవడంతో అభ్యర్థులు ఉచిత శిక్షణ పై నమ్మకం లేక ప్రైవేట్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఉచిత శిక్షణ లోనూ ప్రభుత్వం నిరుద్యోగులను మోసగించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రకారం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పాఠశాలల్లో వివిధ కేడర్లలో 1,473 పోస్టులను భర్తీ చేయనున్నారు. అధికంగా ఎస్జీటీ పోస్టులు 979 పోస్టులను భర్తీ చేయనున్నారు. మిగిలిన స్కూల్ అసిస్టెంట్ కేడర్లో 499 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దళితులను మోసగించింది ఉచిత డీఎస్సీ శిక్షణ ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం దళితులను మోసగించింది. దూర ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి రొడ్డెక్కేలా చేసింది. ప్రణాళిక ప్రకారం ఎస్సీ నిరుద్యోగులకు ఇవ్వాల్సిన ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇప్పించడంలోప్రభుత్వం విఫలమైంది. – నాగరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఇబ్బంది పెట్టడం సరికాదు డీఎస్సీ నిరుద్యోగులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం సరికాదు. ప్రమాణ స్వీకారం రోజున సంతకం చేశారు. నోటిఫికేషన్ ఇచ్చేందుకే పది నెలలకు పైగానే సమయం పట్టింది. అభ్యర్థులకు ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉచిత శిక్షణ సక్రమంగా ఇచ్చారా అంటే అదీ లేదు. – శివారెడ్డి, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి పరీక్షలు నెలరోజులా.. డీఎస్సీ పరీక్షను ఈసారి తొలిసారిగా సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని నోటిఫికేషన్లో తెలియజేశారు. సీబీటీ విధానం ప్రకారం పరీక్షలను నెల రోజుల పాటు నిర్వహించనున్నారు. గతంలో ఒక్క రోజులోనే డీఎస్సీ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేవారు. ఉద్ధేశపూర్వకంగా ఏదో ఒక మెలిక పెట్టాలనే ఇలా నిర్వహిస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. -
నేడు పలమనేరులో ప్రజాసమస్యల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) సోమవారం పలమనేరు ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పలమనేరు ఆర్డీఓ కార్యాలయంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను వినతుల రూపంలో అందజేయాలని కోరారు. నేడు పోలీసు గ్రీవెన్స్చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని వన్టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ చందోలు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు. ముఖ్యమంత్రా..మజాకా! – సీఎం జన్మదినం.. ప్రత్యేక పూజలకు ఉత్తర్వులా? కాణిపాకం : హవ్వా..నవ్విపోదురుగాక నాకేంటి అనే చందంగా మారింది కూటమి పరిస్థితి.. సీఎం జన్మదినానికి..ప్రత్యేక పూజలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఆధ్యాత్మికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఇలా.. సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆదివారం కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ప్రత్యేక గణపతి హోమం చేశారు. ఎమ్మెల్యే మురళీ మోహన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అన్నదానం చేశారు. అయితే సీఎం జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక పూజల కోసం ఉత్తర్వులు జారీ చేయడం కాణిపాకంలో చర్చనీయాంశంగా మారింది. ఆలయ చర్రితలో ఇలాంటి ఉత్తర్వులు ఎప్పుడూ లేదంటూ కాణిపాక గ్రామస్తులు, ఉభయదారులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సీఎం చంద్రబాబు.. డీఎస్సీ తొలి సంతకానికే దాదాపు 11 నెలలు సాగదీశారు.. ఇక నిరుద్యోగ అభ్యర్థుల ఒత్తిడి తాళలేక ఎట్టకేలకు బాబు జన్మదిన కానుకగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. కాగా పరీక్ష ఎప్పడూ ఒకే రోజు నిర్వహించే డీఎస్సీని ఇప్పుడు నెల రోజులు నిర్వహించేలా మెలిక పెట్టారు. ఎందుకు ఇలా చేశారంటే.. ప్రజాధనాన్ని ప్రైవేటు సంస్థలకు దోచిపెట్టడం కోసమే ఇలా జరిపిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. కాగా కనీసం అయిదు మాసాలు ఉచిత డీఎస్సీ శిక్షణ ఇవ్వాల్సిన ప్రభు త్వం కేవలం ప్రచార ఆర్భాటానికే పరిమితం కావడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. -
ఇంత కక్కుర్తా.. హుస్సేన్
● చర్చనీయాంశంగా తహసీల్దార్ ఏసీబీ కేసు చిత్తూరు కలెక్టరేట్ : రైతు నుంచి రూ.1.50 లక్షలు డిమాండ్ చేసి రూ.75 వేలు లంచం తీసుకుంటూ సదుం మండల ఇన్చార్జి తహసీల్దార్ మారుఫ్ హుస్సేన్ ఏసీబీ వలలో చిక్కిన విషయం విధితమే. ఆయన అయిదుగురు కలెక్టర్ల వద్ద సీసీగా విధులు నిర్వహించారు. 2018లో అప్పటి కలెక్టర్, ప్రస్తుతం సీఎం సెక్రటరీ పీఎస్ ప్రద్యుమ్న, నారాయణ భరత్గుప్తా, హరినారాయణన్, షణ్మోహన్, ప్రస్తుత కలెక్టర్ సుమిత్ కుమార్ వద్ద సీసీ (క్యాంప్ క్లర్క్) గా ఏడున్నర సంవత్సరం పాటు విధులు నిర్వర్తించారు. ఆయనకు జిల్లాలోని వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న జిల్లా అధికారులతో పాటు, సెకండ్ కేడర్ అధికారులంతా సుపరిచితమే. అంతేకాకుండా జిల్లా స్థాయి కేడర్ నుంచి రాష్ట్ర స్థాయి కేడర్లోనూ పలుకుబడి పెట్టుకున్నారు. ఆరుగురు కలెక్టర్ల వద్ద క్యాంప్ క్లర్క్ గా విధులు నిర్వర్తించిన హుస్సేన్ లంచానికి కక్కుర్తి పడి ఏసీబీకి దొరకడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం ఈ విషయం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ అసోషియేషన్ జిల్లా అధ్యక్షులుగా.. ఏసీబీకి చిక్కిన సదుం ఇంచార్జి తహసీల్దార్ హుస్సేన్ జిల్లా రెవెన్యూ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఉన్నతమైన పదవిలో ఉన్న ఆయన లంచానికి కక్కుర్తి పడి ఏసీబీకి చిక్కడం రెవెన్యూశాఖతో పాటు ఆ సంఘానికి మాయనిమచ్చని తీసుకొచ్చింది. కలెక్టరేట్లో ఏ ఇద్దరు ఉద్యోగులు కలిసినా ఈ అంశంపైనే చర్చించుకుంటున్నారు. సదుం ఇన్చార్జి తహసీల్దార్ ఏసీబీకి చిక్కడంతో అధికారులు కలెక్టరేట్కు నివేదికలు పంపిన వెంటనే ఆయనను సస్పెండ్ చేసి మరొకరిని ఇన్చార్జి తహసీల్దార్ గా నియమించనున్నారు. -
అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం
– రూ.3 లక్షల ఆస్తి నష్టం పుత్తూరు : మండల పరిధిలోని కృష్ణసముద్రంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సుకన్య పెంకుటింటిలో నివాసం ఉంటోంది. ఆదివారం తెల్లవారుజామున ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలో ఇల్లు పూర్తిగా మంటలు వ్యాపించాయి. పుత్తూరు నుంచి అగ్నిమాపక వాహనం వచ్చేలోపే ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ అగ్ని ప్రమాదంలో రూ.3 లక్షలు విలువైన వస్తువులు, ఇంటి సామగ్రి, 4 సవర్ల బంగారు నగలు పూర్తిగా దగ్ధమయ్యా యి. సుకన్య తన ఇద్దరు పిల్లలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. సుకన్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నాటు బాంబు పేలి యువతికి గాయాలు గంగాధర నెల్లూరు : నాటుబాంబు పేలి యువతికి గాయాలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గంగాధర నెల్లూరు మండలం తూగుండ్రం పంచాయతీ ఆవల కొండ గ్రామానికి చెందిన కమ్రతాజ్ శనివారం తన పొలంలో కొబ్బరి కాయలు కోస్తుండగా అడవి జంతువుల వేట కోసం గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన నాటు బాంబుపేలి చేయి, కాలికి గాయాలయ్యాయి. వెంటనే జీడీ నెల్లూరులో ఒక ప్రైవేటు వైద్యుడి వద్ద చికిత్స తీసుకున్నట్లు కుటుంబికులు తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు పంట పొలాల్లో నాటు బాంబులు పెడుతున్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
● బంతిపూల ధరలు నేల చూపు ● పెట్టుబడి ఖర్చులు దక్కని వైనం ● అన్నదాతల ఆవేదన ● అధిక దిగుబడే కారణమంటున్న వ్యాపారులు ● ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్
కుప్పం రూరల్ : కుప్పంలో బంతిపూల ధరలు నేల చూపు చూస్తున్నాయి. రైతులు పెట్టుబడి రాక పూలను తోటల్లోన్నే వదిలిపెడుతున్నారు. కుప్పం మార్కెట్లో కిలో రూ.5 నుంచి 10 రూపాయలు పలుకుతున్నాయి. దీంతో రైతులు కోత కూలీ కూడ రాదని ఆవేదన చెందుతున్నారు. కొంత మంది రైతులు ధరలు లేకపోవడంతో మార్కెట్ బయటే పారబోసి వెళ్తున్నారు. మిగిలిన పూల ధరలు ఓ మోస్తరుగా ఉన్నా బంతి పూల ధరలు మాత్రం పతనమయ్యాయి. వ్యాపారులు మాత్రం అధిక దిగుబడే కారణమంటున్నారు. వివిధ రాష్ట్రాలకు ఎగుమతి మూడు రాష్ట్రాల కూడలిగా ఉన్న కుప్పానికి పూలసాగులో ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ పండిన పూలు రాష్ట్రాలు చుట్టి వస్తున్నాయి. ప్రస్తుతం కుప్పం మార్కెట్ నుంచి విజయవాడ, హైదరాబాద్, చైన్నె, బెంగళూరు నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. అన్ని రకాల పూల ధరలు ఓ రకంగా ఉన్నా బంతిపూల ధరలు మాత్రం నేలకు దిగిపోయాయి. కుప్పం మార్కెట్లో వారం రోజులుగా సరాసరిన కిలో రూ.10 పలుకుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పూలను కోయక తోటల్లోన్నే వదిలిపెడుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలి ఎకరాకు 40 వేలు ఖర్చు చేసి బంతిపూలు సాగు చేస్తే కనీసం కూలీ ఖర్చులు కూడా రావడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. బంతిపూల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఎన్నో ఆశలతో సాగు చేస్తే ధరల రూపంలో ఇలా రైతుల నెత్తిన బండ పడుతోందని వాపోతున్నారు. ప్రతిసారి ఇలాగే జరుగుతుండడంతో రైతులు పూలసాగు వదిలిపెట్టాల్సి వస్తోందని నిరాశ చెందుతున్నారు. బంతి సాగులో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు కనీసం రూ.20 వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. సాగు ఖర్చులు రావడం లేదు.. ఎకరా బంతి సాగు రూ.40 వేలు ఖర్చు అవుతుండగా ప్రస్తుతం ధరలతో కోత కూలీ రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఎకరాకు 7,500 మొక్కలను నాటాల్సి ఉంటుంది. ఒక్కో మొక్క ధర రూ.2.50 రూపాయలుగా ఉంది. ఇలా దుక్కులు చేయడం, మొక్కలు నాటడం, ఎరువులు వెరసి ఎకరా సాగుకు రూ.40 వేలు ఖర్చు వస్తోంది. ధరలు పతనం కావడంతో సాగు ఖర్చులు వచ్చే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు. మిగిలిన పూలైన చామంతి కుప్పం మార్కెట్లో కిలో రూ.150 – 170, రోజా రూ.80–100, కనకాంబరం రూ.600, మల్లె రూ.280– 320, సంపంగి రూ.60, జాజిమల్లె రూ.240 పలికింది. కానీ బంతి మాత్రమే కిలో రూ.5–10 రూపాయలు పలుకుతున్నాయి. అధిక దిగుబడి రావడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. కుప్పంలో టమాట తరువాత రైతులు ఎక్కువ మొత్తంలో బంతి పూలు సాగు చేయడం ధరల పతనానికి కారణంగా చెబుతున్నారు. సాగు వదులుకోవాల్సిందే.. రూ.40 వేలు పెట్టుబడి పెట్టి 45 రోజుల పాటు ఆరుగాలం కష్టపడి సాగు చేస్తే బంతిపూలు చేతికి వస్తాయి. ఈ మధ్యలో చీడపీడలు ఆశిస్తే పంట చేతికి రాదు. నీరు అందుబాటులో లేకపోయిన మధ్యలోనే పంట నష్టపోవాల్సి ఉంది. పంట చేతికి రాగానే ధరల రూపంలో రైతులకు గుదిబండ పడడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. పండుగలు, శుభకార్యాల సమయంలో మాత్రం ఓ మోస్తరుగా ఉంటుంది. మిగిలిన రోజుల్లో బంతి ధరలు అంతగా ఉండడం లేదు. ధరలు ఇలాగే కొనసాగితే రైతులు బంతి సాగును నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. – చిన్నప్పకాంతరాజ్, రైతు, పెద్ద బంగారునత్తం -
ప్రొఫెషనల్ కోర్సులకు దరఖాస్తుల వెల్లువ
స్థానిక వర్సిటీల్లో అడ్మిషన్లు పెరిగే అవకాశం విదేశీవిద్యకు ఆంక్షలు విధించడంతో స్వదేశంలోనే ఉన్నత విద్యనభ్యసించేందుకు విద్యార్థు లు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది పీజీ సెట్లకు సైతం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ప్రధానంగా ప్రొఫెషనల్ కోర్సుల్లో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మెరిట్ స్టూడెంట్లు స్వదేశీ విద్యనభ్యసిస్తే విద్యారంగంలో పరిశోధనలు కొత్త పుంతలు తొ క్కే అవకాశం ఉంటుంది. ఎస్వీయూలో కొత్తగా ప్రవేశ పెట్టిన ఎంఎస్ డేటా అనలాసిస్, ఏఐ వంటి కోర్సులతోపాటు ఎంబీఏ, ఎంసీఏలోనూ అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంది. –సీహెచ్ అప్పారావు, వీసీ, ఎస్వీయూ ఎన్ఈపీతో ఉద్యోగావకాశాలు మెండు నూతన విద్యావిధానంతో విద్యార్థులకు ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయి. విదేశీ విద్య తో సమానంగా స్వ దేశంలోనూ పలు వర్సిటీల్లో ప్రొఫెషనల్ కోర్సుల్లో అంతర్జాతీయ స్థా యి సిలబస్ అమలులో ఉంది. రూ.లక్షలు ఖ ర్చు పెట్టి విదేశీ విద్య కోసం ప్రయత్నించడం కంటే ఎన్ఈపీ విధానం అమలులో ఉన్న వర్సిటీల్లో ఉన్నత విద్యనభ్యసించడం ఎంతో ఉత్తమం. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ మెరుగుపడడంతో విద్యార్థులు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎఫ్1 వీసా కఠినతరంతో ఈ ఏడాది వర్సిటీల్లో అన్ని పీజీ కోర్సులకు అడ్మిషన్లు పెరగనున్నాయి. –ప్రొఫెసర్ పద్మావతమ్మ, ప్రిన్సిపల్, సైన్స్ కళాశాల, ఎస్వీయూ ‘తిరుపతికి చెందిన రవిచంద్ర పేరొందిన ఇంజినీరింగ్ కళాశాలలో గత ఏడాది బీటెక్ పూర్తి చేశాడు. ఎలాగైనా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సౌతర్న్ కాలిఫోర్నియాలో పీజీ చేయాలన్న చిరకాల కోరికతో ఏడాది కాలం ఆర్థిక వనరులతోపాటు వీసా ప్రయత్నాలు చేసుకుని సన్నద్ధమయ్యాడు. ఈ ఏడాది ఽఎఫ్1 వీసాకు దరఖాస్తు చేసుకుని ఎంతో ఖర్చు పెట్టాడు. కానీ నిరాశ మిగిలింది. వీసాకు అనర్హుడంటూ ఈమెయిల్ ద్వారా సమాచారం అందింది. దీంతో పీజీ సెట్కు దరఖాస్తు చేసి ప్రిపరేషన్ మొదలు పెట్టాడు.’ విదేశీ విద్య నేటి విద్యార్థుల కల. ట్రంప్ కఠిన నిబంధనలు..వీసాలపై ఆంక్షలు.. అనర్హులని తిరస్కరణ.. పార్ట్టైమ్ ఉద్యోగాలకు అవకాశాలలేమి.. ఆర్థిక సమస్యలు.. ఇంత కష్టపడినా విద్యకు దక్కని భరోసాతో అది యువతకు ఎండమావిగా మారింది. వెరసి.. విద్యార్థిలోకం విదేశీ విద్య వద్దు... స్వదేశీ విద్యే ముద్దు అంటూ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పలు కోర్సులు చేయడానికి మొగ్గు చూపుతోంది. ఫలితంగా పలు ప్రవేశపరీక్షలకు దరఖాస్తుల సంఖ్య పదిరెట్లు పెరిగింది. తిరుపతి సిటీ: ట్రంప్ అన్నంత పని చేశాడు..స్టూడెంట్స్ వీసాలపై కఠిన నిబంధనలు విధించడంతో పాటు యూఎస్ఏలో విద్యనభ్యసిస్తున్న ఇండియన్ విద్యార్థులపై ఆంక్షలు విధించి ఇంటికి పంపుతున్నాడు. దీంతో 2025–2026 విద్యాసంవత్సరంలో విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలని కలలు కన్న తెలుగు విద్యార్థుల ఆశలు అడియాసలయ్యాయి. దీంతో స్వదేశీ విద్యకు డిమాండ్ పెరిగింది. ఇటీవల రాష్ట్రంలోని పలు వర్సిటీలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. దీంతో పీజీ కోర్సులకు దరఖాస్తు చేసేందుకు విద్యార్థులు ఎగబడుతున్నారు. గత ఏడాదికంటే పీజీ సెట్లకు దరఖాస్తులు పదిరెట్లు పెరిగాయి. విదేశీ విద్యపై మొగ్గు చూపని విద్యార్థులు తిరుపతి జిల్లా నుంచి గత ఏడాది విదేశీ విద్య కోసం సుమారు 9,871 మంది ఎఫ్1 వీసా కోసం దరఖాస్తు చేసుకోగా ఇందులో 6,245 మంది విద్యార్థులు అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియాల్లోని పలు వర్సిటీలలో వీసా సాధించి ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. కానీ ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా కేవలం ఇప్పటివరకు ఎఫ్1 వీసా కోసం కేవలం 761 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అమెరికా ఆశలపై నీళ్లు చల్లారు తిరుపతిలో బీటెక్ పూర్తి చేశా. అమెరికాలో ఎంఎస్ చేయాలనే కోరిక ఉండేది. అమెరికా వెళ్లి ఎంఎస్ పూ ర్తి చేసి, అక్కడే గ్రీన్కార్డు సాధించాలనే కోరిక ఉండేది. కానీ ట్రంప్ విధించిన ఆంక్షలతో వీసాకు దరఖాస్తు చేసుకున్నా టోఫెల్తోపాటు ఇంటర్వ్యూ పూర్తి చేశా. కానీ ఎలిజిబిలిటీ రాలేదు. దీంతో ఎస్వీయూలో ఎంబీఏ చేసేందుకు ఐసెట్కు దరఖాస్తు చేసుకున్నా. –ప్రదీప్కుమార్, విద్యార్థి, తిరుపతి విదేశీ విద్యపై మొగ్గు చూపని యువత ట్రంప్ కఠిన నిబంధనలతో విద్యార్థిలోకం బెంబేలు పీజీ ప్రొఫెషనల్ కోర్సులకు దరఖాస్తుల వెల్లువ ఐసెట్, ఏపీఈసెట్కు పదిరెట్లు పెరిగిన అప్లికేషన్లు ఎఫ్1 వీసాల ఆంక్షలతో వెనుకడుగు ప్రధానంగా ఇంటర్, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు ఆర్థిక స్తోమత అంతంతమాత్రంగా ఉన్నా ఆమెరికాలో ఎంఎస్, ఎంటెక్, మెడికల్, పీజీ కోర్సులు చేయాలనే ఆశతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ట్రంప్ విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లారు. కఠిన నిబంధనలు విధించడంతో జిల్లాలో ఈ ఏడాది విదేశాల్లో విద్యాభ్యాసానికి వీసాలకు దరఖాస్తు చేసుకున్న వారు 40 శాతం కూడా లేదని అమెరికన్ రాయబార కార్యాలయం తేల్చిచెప్పడం గమనార్హం. దరఖాస్తు చేసుకున్న వారిలోనూ 50 శాతం మంది విద్యార్థులను పలు సాకులు చూపించి (ఎఫ్1) స్టూడెంట్ వీసాలకు అర్హులు కాదని ముద్ర వేస్తున్నారు. ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపి వీసా కచ్చితం అనుకున్న విద్యార్థులకు సైతం ఏదో రూపంలో వీసాకు అన్ఫిట్ అంటూ ముద్రవేస్తున్నారు. దీంతో విదేశీ విద్యపై విద్యార్థులు వెనుకడుగువేస్తున్నారు. జిల్లాలోని పలు యూనివర్సిటీల్లో ప్రొఫెషనల్ కో ర్సులకు డిమాండ్ పెరుగుతోంది. ఐసెట్, ఏపీఈ సెట్, పీజీసెట్లకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నా యి. గత ఏడాది ఏపీఈసెట్కు 3వేలకు మించని దరఖాస్తులు ఈ ఏడాది 30 వేల పైచిలుకు వచ్చా యి. దీంతోపాటు ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నిర్వహించనున్న ఐసెట్కు సైతం అదే తరహాలో దరఖాస్తులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నత వి ద్యకు ఈ ఏడాది ఎస్వీయూ, మహిళా వర్సిటీల్లో పోటీ ఎక్కువగా ఉంటుందని, కటాఫ్ మార్కులు సైతం ఊహించని రీతిలో ఉంటాయని విద్యావేత్తలు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఐసెట్కు దరఖాస్తు చేశా.. యూఎస్లో ఎంఎస్ చే యాలన్నది నా కల. కానీ ట్రంప్ ఆంక్షలతో భయమేస్తోంది. అక్కడ చదువుతు న్న మా బంధువుల పిల్ల లు సైతం ఇక్కడికి రావదని చెబుతున్నారు. దీంతో మా తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం ఎంసీఏ చేయడం కోసం ఐసెట్కు దరఖాస్తు చేశా. ఇక్కడే మంచి వర్సిటీలో ఎంసీఏలో చేరి పేరొందిన పరిశ్రమలో ఉద్యోగం సాధిస్తా. –ప్రియాంక, విద్యార్థిని, తిరుపతి పీజీసెట్లకు పెరుగుతున్న దరఖాస్తులు పీజీ సెట్ పరీక్షలకు గత ఏ డాది కంటే ఈసారి దరఖాస్తు ల సంఖ్య పెరుగుతోంది. ట్రంప్ ఎఫెక్ట్ విదేశీ విద్యపై పెద్ద ప్రభావం చూపుతోంది. పీజీ ప్రొఫెషనల్ కోర్సులకు ఇప్పటికే ఊహించని రీతిలో దరఖాస్తులు వస్తున్నాయి. ఏపీ ఈ సెట్ గడువు ముగిసింది. గత ఏడాది 3,500 దర ఖాస్తులు రాగా ఈ ఏడాది 35 వేలకు మించడం ఊహించని పరిణామం. –ప్రొఫెసర్ సురేంద్ర బాబు, కో కన్వీనర్, ఏపీ పీజీసెట్, ఎస్వీయూ -
సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ కూలీ మృతి
– మరొకరి పరిస్థితి విషమం పుంగనూరు: సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు వచ్చిన ఇద్దరు కూలీలు అందులో చిక్కుకుని , ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. అగ్నిమాపకశాఖ అధికారి సుబ్బరాజు తెలిపిన మేరకు వివరాలు ఇలా.. పట్టణంలోని శాంతినగర్లో నివాసం ఉంటున్న యుగంధర్ నాయుడు తన ఇంటి సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేసేందుకు మదనపల్లెలోని సంతపేటకు చెందిన హేమంత్ , రాయలపాడుకు చెందిన రవి అనే కూలీలను పిలిపించాడు. ఆ ఇద్దరు కూలీలు మధ్యాహ్నం ట్యాంకులోనికి దిగి క్లీన్ చేసే సమయంలో విష వాయువులు ఒక్కసారిగా రావడంతో ఊపిరాడక ట్యాంకులో చిక్కుకున్నారు. దీనిపై యజమాని అగ్నిమాపకశాఖ కార్యాలయానికి , 108కు ఫిర్యాదు చేశారు. తక్షణమే రెండుశాఖల వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపకశాఖ అధికారి సుబ్బరాజు, సిబ్బంది సెప్టిక్ ట్యాంకులో చిక్కుకున్న వారిని తాళ్ల సాయంతో వెలికితీశారు. వారిలో హేమంత్(27) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు రవి (35)ని 108లో ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
● అందరూ 15 ఏళ్లలోపు వారే ● అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో పనులు చేస్తున్న వైనం ● అక్కడే తిని అక్కడే మకాం పెడుతున్న పిల్లలు
అలిగి తిరుమలకు చేరుతున్న బాలురు పలమనేరు : పిల్లలు చిన్న చిన్న విషయాలకే తల్లిదండ్రులపై అలిగి ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. తిరుమల కొండ చేరుతున్నారు. తాజాగా పలమనేరు మండలం టి.వడ్డూరుకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి బంగారుపాళెం ఎస్సీ హాస్టల్ నుంచి అదృశ్యమయ్యాడు. హాస్టల్ వార్డెన్లు తిరుమలలో పది రోజులు గాలించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఇల్లు చేరాడు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందల మంది పిల్లలు తిరుపతి, తిరుమలలో ఉన్నట్లు తెలుస్తోంది. పలమనేరు సమీపంలోని టి.వడ్డూరు, గొబ్బిళ్లకోటూరు గ్రామాలకు చెందిన 15 ఏళ్లలోపు వారే పదుల సంఖ్యలో తిరుమలలో ఉన్నట్లు తెలిసింది. కొందరు తల్లిదండ్రులు వెతికి పట్టుకొస్తుండగా.. మరికొందరు కొండపైనే చిరువ్యాపారాలు చేస్తున్నట్లు సమాచారం. మెట్లదారుల్లో చిన్నపాటి అమ్మకాలు తిరుమలకు వెళ్లే అలిపిరి, శ్రీవారిమెట్టు ప్రాంతాలు పిల్లలకు ఆవాసాలుగా మారాయి. అక్కడ వ్యాపారాలు చేస్తున్న వారు పిల్లలతో పని చేయించుకుని కొంత కమీషన్ ఇస్తున్నారు. ముఖ్యంగా నడకదారుల్లో పచ్చిమామిడి కాయలు, జామకాయలు, వాటర్ బాటిళ్లు విక్రయిస్తున్నారు. మరికొందరు భక్తులకు తిరునామాలు పెట్టి వారిచ్చినంత పుచ్చుకుంటున్నారు. మరికొందరు హోటళ్లలో దినసరి కార్మికులుగా పనిలో ఉంటున్నారు. అక్కడి యాత్రికుల మధ్య ఈ బాలురు ఆలయానికి వెళ్తున్నారా లేదా అక్కడ ఏమి చేస్తున్నారో గుర్తించడం కష్టంగా మారుతోంది. పలమనేరు సమీపంలోని టి.వడ్డూరు, గొబ్బిళ్లకోటూరు, బైరెడ్డిపల్లి, వి.కోట మండలాలకు చెందిన గ్రామాలు, బంగారుపాళెం మండలంలోని కొన్ని గ్రామాల నుంచి పిల్లలు ఎక్కువ మంది తిరుమల కొండపై ఉన్నట్టు తెలుస్తోంది. రాత్రుళ్లు వీరి ఆవాసాలెక్కడంటే.. ఇంటి నుంచి అలిగి తిరుమల చేరిన పిల్లలు రాత్రిళ్లు సీఆర్వో కార్యాలయం, బాలాజీ బస్టాండు, సీఆర్వో వెనుక వైపునున్న యాత్రికుల వసతి నిలయాలు, కళ్యాణకట్ట ముందున్న ప్రాంతం, హెచ్పీటీఎల్ తదితర ప్రాంతాల్లో నిద్రిస్తున్నట్లు సమాచారం. అక్కడి స్నానపు గదులను ఉపయోగించుకోవడం, భక్తులు పెట్టే భోజనాలు తినడం మళ్లీ పగలు పెట్టుబడిలేని చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ గడుపుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా తల్లిదండ్రులు లేని పిల్లలు, ఎవరూ పట్టించుకోనివారు, తల్లిదండ్రులపై అలిగిన వారు ఇక్కడికి చేరుతున్నట్లు సమాచారం. తిరుమలలో విజిలెన్స్, పోలీసులు పూర్తిస్థాయిలో నిఘా ఉంచితేగాని పిల్లలను పట్టుకోవడం కష్టమే. చదువుకోవాల్సిన వయసులో బాల కార్మికులుగా మారుతున్న చిన్నారులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కిక్కిరిసిన బోయకొండ● పెరిగిన భక్తుల రద్దీ ● ఆలయానికి రూ.11.98 లక్షల ఆదాయం చౌడేపల్లె : కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పేరుగాంచిన మండలంలోని బోయకొండ గంగమ్మతల్లి దీవెనల కోసం భక్తులు బోయకొండకు ఆదివారం తరలివచ్చారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధ వాహనాల్లో తరలివచ్చారు. ఒక్క రోజే సుమారు 20 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూలు, బంగారు ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయంవద్ద భక్తులకు విక్రయించిన వివిధ సేవా టికెట్ల ద్వారా ఆలయానికి రూ.11.98 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ ఏకాంబరం తెలిపా రు. వీటితో పాటు అన్నదానం నిర్వహణకు రూ.25 వేలు భక్తులు విరాళాలు ఇచ్చారని పేర్కొన్నారు. -
ఉత్తమ సామాజిక విజేతలు
ఉత్తమ విద్యార్థులను తయారు చేయడమే ఉపాధ్యాయుల బాధ్యత కాదని వారిని ఉత్తమ సామాజిక విజేతలుగా తీర్చిదిద్దాల్సి అవసరం ఉంది. రేపటి తరానికి ఉపయోగపడే స్థాయిలో ఆర్గానిక్ వ్యవసాయ విధానాల ప్రాముఖ్యం, ఉపయోగాలను ప్రాథమిక పాఠశాల నుంచే పాఠ్యాంశాలుగా చేర్చాల్సిన అవసరం ఉంది. సమాజంలో జరుగుతున్న, జరగాల్సిన మార్పులపై విద్యార్థులకు అవగాహన అవసరం. రసాయన వ్యవసాయం వల్ల సమాజానికి జరుగుతున్న ఆర్ధిక, ఆరోగ్య నష్టాలను విద్యార్థులకు తెలియచేసి వారిని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధానాన్ని సుదుమూరు పాఠశాల విద్యార్థులు పక్కాగా అమలు చేయడం ఆనందంగా ఉంది. – వెంకటరమణ, ఈఎండీపీ కో ఆర్డినేటర్, చిత్తూరు జిల్లా -
పల్లెల పరిశుభ్రతలో భాగస్వాములుకావాలి
బంగారుపాళెం : గ్రామాల పరిశుభ్రతలో ప్రజలు భాగస్వాములైనప్పుడే స్వచ్ఛాంధ్రప్రదేశ్ వైపు అడుగులు సాధ్యమని కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ అన్నారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం బంగారుపాళెం మేజరు పంచాయతీలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. తొలుత పాలేరు సమీపంలోని డంపింగ్ యార్డును సందర్శించి మొక్కను నాటి నీరు పోశారు. గ్రీన్ అంబాసిడర్లతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రీన్ అంబాసిడర్లకు పంచాయతీ కార్యదర్శులతో చర్చించి బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డీపీఓను ఆదేశించారు. నెలకు ఒక్కసారి తాగునీటి ట్యాంకులను శుభ్రం చేసి ప్రజలకు శుద్ధజలం అందించాలని ఆదేశించారు. కలుషిత నీరు తాగి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత పడాలని హెచ్చరించారు. హైప్లజర్ క్లీనింగ్ మిషన్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రం చేసే విధానం గురించి డీపీఆర్సీ కో ఆర్డినేటర్ షణ్ముగం కలెక్టర్కు వివరించారు. వేసవిలో పశువుల దాహార్తి తీర్చేందుకు ఎన్ఆర్ఈజీఎస్ కింద నూతనంగా నిర్మించిన నీటి తొట్టెలను, ఈ– వ్యర్థాల సేకరణ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం బంగారుపాళెంలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. సిబ్బంది సమయ పాలన పాటించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శిరీషను ఆదేశించారు. చివరగా స్థానిక ముత్యాలమ్మ ఆలయం వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ కుమార్రాజా, తహశీల్దార్ బాబురాజేంద్రప్రసాద్, ఇన్చార్జి ఎంపీడీఓ శ్రీధర్, స్థానిక సర్పంచ్ ఉమాదేవి, ఉప సర్పంచ్ కామరాజు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
ఉద్యోగ భద్రత కల్పించాలని నిరసన
చిత్తూరు రూరల్ (కాణిపాకం):ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్/కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్(సీహెచ్ఓ) అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశా ఖ కార్యాలయం ఎదుట శనివారం వారు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ జరగాలన్నారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలన్నారు. ఈపీఎఫ్ఓను పునరుద్ధరించాలని, క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని, నిర్ధిష్టమైన జాబ్ చార్ట్ అందించాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఆర్ఎస్ నుంచి సీహెచ్ఓలకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఉద్యోగ భద్రతతో పాటు హెచ్ ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్, ఎక్స్గ్రేషియా, పితృత్వ సెలవులు అమలు చేయా లని విజ్ఞప్తి చేశారు. అధ్యక్షులు కల్పన, ఉపాధ్యక్షులు భానుప్రియ, కార్యదర్శి కీర్తి ప్రియ, సభ్యులు దివ్య భారతి, అరుణకుమారి, కవిత, గంగమణి, మోహన కుమారి, సురేష్కుమారి, రషీద్, సుధీర్ పాల్గొన్నారు. -
స్వచ్ఛ నిర్లక్ష్యం
పుంగనూరు:ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రతి మూడో శనివారం కార్యాలయాలు, విద్యా సంస్థలు , మున్సిపాలిటీలు , గ్రామాల్లో పరిసరాలను శుభ్రం చేయాలని నిర్ధేశించింది. అయితే పుంగనూరు శుభా రాం డిగ్రీ కళాశాలలో చీపుర్లకు బదులు కట్టె పుల్లలతో చెత్తను ఊడ్చి.. ప్రిన్సిపల్ డాక్టర్ రాజశేఖర్తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు బ్యానర్లు పట్టుకుని ఫొటోలకు పోజులివ్వడం విస్మయానికి గురిచేసింది. విద్యార్థులకు గురువులు నేర్పించే పద్ధతి ఇదేనా అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో భాగస్వామ్యమవ్వడం ఇలానేనా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. -
రైలు నుంచి జారిపడి యువకుడు మృతి
పూతలపట్టు (కాణిపాకం) : రైలు నుంచి జారి పడి ఓ యువకుడు శనివారం మృతి చెందాడు. వివరాలు ఇలా ..గంగాధర నెల్లూరు మండలానికి చెందిన ప్రవీణ్(21) అనే యువకుడు తిరుపతి నుంచి చిత్తూరు వస్తున్నారు. ఈ క్రమంలో పూతలపట్టు మండలం మృత్తిరేవులు గ్రామం వద్ద రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దూదేకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గఫూర్ వెదురుకుప్పం : రాష్ట్ర నూర్ బాషా (దూదేకుల) ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మండలంలోని నల్లవెంగనపల్లె పంచాయతీ ఏపేరి గ్రామానికి చెందిన ఏఎంసీ మాజీ డైరెక్టర్ డీజీ గఫూర్ను ఎన్నుకున్నట్లు ఆ సంఘం నేతలు ప్రకటించారు. శుక్రవారం విజయవాడలో జరిగిన మైనారిటీ సమావేశంలో రాష్ట్ర దూదేకుల సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్సయ్యద్బాజీ నేతృత్వంలో ఎన్నకున్నట్లు తెలిపారు. -
ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో అనర్థం
చిత్తూరు అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారం మెరుగైన పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక లక్ష్యంతో కార్యక్రమాలను చేపడుతోందని కలెక్టర్ సుమిత్కుమార్ పేర్కొన్నారు. ‘ఈ–చెక్ ’థీమ్తో నిర్వహించిన కార్యక్రమాన్ని చిత్తూరు నగరపాలక కార్యాలయంలో కలెక్టర్, ఎమ్మెల్యే జగన్ మోహన్, మేయర్ అముద, చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, కమిషనర్ నరసింహ ప్రసాద్ ప్రారంభించారు. చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ‘ఈ–చెక్’ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 5 వేల మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తి అవుతుందని అంచనా ఉందన్నారు. వీటిని సరైన పద్ధతుల్లో రీసైక్లింగ్ చేయకపోవడం వల్ల ప్రమాదకర మూలకాలు భూమి, వాతావరణంలో కలుస్తున్నాయన్నారు. ఈ–వేస్ట్ (ఎలక్ట్రానిక్ పరికరాలు) నియంత్రించడంలో భాగంగా రానున్న నెల రోజుల పాటు క్షేత్ర స్థాయిలో చేపట్టనున్న ఈ–చెక్ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తమ గృహాలు, దుకాణాల్లోని వృథాగా ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాల పరిధిలోని సచివాలయాల్లో అప్పగించాలని కోరారు. అనంతరం ప్రజా ప్రతినిధులు అధికారులు ‘స్వచ్ఛ ప్రతిజ్ఞ’ చేశారు. జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, ఎంహెచ్వో డా. లోకేష్, నగర పాలక అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
అవినీతి సామ్రాజ్యం!
తహసీల్దార్● కూటమి ప్రభుత్వం రాకతో చెలరేగిన వైనం ● చిన్నపనికై నా ప్రజలకు తప్పని వేధింపులు , వసూళ్లు ● హైకోర్టులో కేసులు, కలెక్టర్కు ఫిర్యాదులు ● చివరకు ఏసీబీకి పట్టుబడిన మండల మేజిస్ట్రేట్ పుంగనూరు : రైతు నుంచి లంచం తీసుకుంటూ సదుం మండల ఇన్చార్జి తహసీల్దారు మారుఫ్ హుస్సేన్, వీఆర్ఓ మహబూబ్ బాషా శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సదుం తహసీల్దార్ బాగోతం అంతా ఇంత కాదు ఆ వివరాలు ఇలా.. ఆయన ఓ మండల మేజిస్ట్రేట్ .. సామాన్యులను కూడా వదలకుండా వేధించడం ఆయన నైజం.. చిన్న పనికై న రోజుల తరబడి కార్యాలయానికి తిప్పించుకోవడం , లొంగకపోతే తన తహసీల్దార్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తన హోదాతో ఆదేశాలు ఒక్కొక్కశాఖకు ఇవ్వడం ఆ శాఖ ద్వారా రైతులు , ప్రజలను వేధించడం ఆయనకు నిత్యకృత్యంగా మారింది. దీనికి బెంబేలెత్తిపోయిన ప్రజలు నేరుగా కలెక్టర్కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఆయన అక్రమాలపై రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. అంత జరిగినా తహసీల్దారు మారుఫ్ హుస్సేన్ బుద్ధి మాత్రం మారలేదు. కార్యాలయానికి వచ్చే వారిని పిలిపించుకుని రూ. లక్షల రూపాయలు వసూలు చేసుకుంటూ అవినీతికి కేరాఫ్గా సదుం మండలంలో నిలిచిపోయారు. కూటమి నేతలతో చెలరేగాడు సదుం తహసీల్దార్గా కూటమి ప్రభుత్వంలో బదిలీపై హుస్సేన్ పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఆరు నెలల కాలంలో ఆయన చేసిన అవినీతి అక్రమాలు అంతులేకుండా పోయింది. కూటమి నేతల అండతో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాడు. తహసీల్దార్ బాధితులు సదుం మండల తహసీల్దార్ హుస్సేన్ అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పలువురు ఆయన బాధితులు మండలంలో ఉన్నారు. దిగువకురప్పల్లెకి చెందిన మల్లయ్య అనే వ్యక్తికి తిమ్మానాయునిపల్లె గ్రామ దాఖల సర్వే నంబరులో 13.1లో 3.58 ఎకరాల పొలం ఉంది. ఇందులో ప్రభుత్వం పొలాన్ని ప్రాజెక్టుకు తీసుకుంది. మిగులు భూమితో పాటు బోరు బావితో మల్లయ్య పంటలు సాగు చేసుకుంటున్నాడు. తహసీల్దార్ డిమాండ్లకు తలవంచకపోవడంతో అతనిని వేధింపులకు గురి చేశాడు. ఆయన రెండు సార్లు హైకోర్టులో కేసు వేసి తహసీల్దార్ ఉత్తర్వులను రద్దు చేయించుకున్నాడు. అలాగే గొంగివారిపల్లెకి చెందిన ప్రసాద్, సుగుణ, చిన్నక్క, రమణ, రాజమ్మలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎర్రాతివారిపల్లెకి చెందిన ఎన్.సురేంద్ర తహసీల్ధార్ అక్రమాలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తహసీల్దారు ఇంట్లో ఏసీబీ తనిఖీలు చిత్తూరు అర్బన్ : సదుం మండల ఇన్చార్జి తహసీల్దారు హుస్సేన్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబడటంతో.. చిత్తూరులోని ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు. శనివారం సాయంత్రం తిరుపతి నుంచి వచ్చిన ఏసీబీ ప్రత్యేక బృందం చిత్తూరు నగరంలోని రామ్నగర్ కాలనీలో ఉన్న హుస్సేన్ ఇంట్లో దాదాపు రెండు గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు పత్రాలు, కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. మా ఉసురు కొట్టుకుంది... నేను టమాట పండించా. నన్ను రకరకాలుగా వేధిస్తూ తహసీల్దార్ ఉత్తర్వులు ఇచ్చారు. వాటిపై నేను హైకోర్టులో రెండు రిట్ పిటిషన్లు దాఖలు చేసి, తహసీల్దార్ ఉత్తర్వులు రద్దు చేయించుకున్నా. నేను లొంగకపోవడంతో కక్ష కట్టి రోజుకొక ఆర్డర్ ఇచ్చి వేధించాడు. బోరుకు విద్యుత్ కనెక్షన్ తొలగించాలని ఆర్డర్ ఇచ్చాడు. అప్పటికీ లొంగకపోవడంతో భూమి, బోరును ప్రజా అవసరాలకు స్వాధీనం చేసుకుంటామంటూ ఆర్డర్ ఇచ్చాడు. ఈలోపు మా ఉసురు కొట్టుకుని తహసీల్దార్ జైలుకు వెళ్లాడు. మాకెంతో సంతోషంగా ఉంది. – మల్లయ్య, దిగువకురప్పల్లె, రైతు, సదుం మండలం -
ఏటా దిగుబడి 5,47,320 టన్నులు
రుచికి, పోషకాలకు మామిడి పెట్టింది పేరు. అందుకే ఇది పండ్లల్లో రారాజుగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఏటా మామిడి వినియోగం తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ మోజులో పడి యువత మామిడి రుచిని ఆస్వాదించలేకవడం ఒక విధంగా అవగాహనా రాహిత్యమేనని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కళాశాలలు, పాఠశాలల స్థాయి నుంచే మామిడి వినియోగంపై అవగాహన పెంచాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రైతుల సంఖ్య 80 వేల మందిమామిడిని ట్రేలకు ఎత్తుతున్న వ్యాపారులు కాణిపాకం: మామిడి సాగు సంక్షోభంలో చిక్కుకుపోయింది. మామిడి గుజ్జుకు డిమాండ్ పడిపోయింది. పరిశ్రమల్లో నిల్వలు పేరుకుపోయాయి. గత ఏడాది వివిధ ఫ్యాక్టరీలు 2.75 లక్షల టన్నుల మామిడి గుజ్జును తయారు చేసి నిల్వ చేశాయి. ఈ గుజ్జు అత్యధికంగా యూరఫ్ దేశాలకు ఎగుమతి చేయాల్సి ఉంది. కానీ అక్కడ యుద్ధాల కారణంగా గతేడాది నుంచి గుజ్జు ఎగుమతులు స్తంభించాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 40 శాతం మేర గుజ్జు ఎగుమతి చేసినట్టు అధికారులు చెబుతున్నారు. మామిడి గుజ్జు కిలో రూ.60 నుంచి రూ.65 వరకు అమ్ముడు పోవాల్సి ఉండగా ప్రస్తుతం రూ.36 పలుకుతోంది. దీంతో ఏంచేయాలో తెలియక రైతులు.. పరిశ్రమల నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో మామిడిలో అధిక పోషకాలు ఉన్నాయని, దీని వినియోగం పెరిగితే అటు రైతుకు.. ఇటు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. కూల్డ్రింక్స్తో ప్రమాదం కూల్డ్రింక్స్ వినియోగం అమాంతం పెరిగిపోతోంది. చిన్న పాటి ఫంక్షన్ నుంచి పెళ్లిళ్లు, ఇతర శుభాకార్యాల వరకు భారీ స్థాయిలో కూల్డ్రింక్స్ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న నేపథ్యంలో కూల్డ్రింక్స్ అమ్మకాలు జోరందుకున్నాయి. ఇదే అదునుగా పెద్దపెద్ద మాల్స్లో కూల్డ్రింక్స్ను ఆఫర్ల పేరుతో అమ్మేస్తున్నాయి. తక్కువ ధరకు వస్తుందని చాలా మంది కూల్డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇవి తాగడం వల్ల అజీర్ణం, వాంతులు, అధిక బరువు, డయాబెటిక్, ఫ్యాటీ లివర్, గుండె, కీళ్ల సమస్యలు, పంటి సమస్యలతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మామిడితో ఉపయోగాలెన్నో మామిడి పండ్లు, జ్యూస్లో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇవి రక్తపోటు సమస్యను నివారిస్తాయి. విటమిన్–సీ, పైబర్ శరీరంలోని హానిచేసే కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలను, చిగుళ్ల నుంచి రక్తం కారడం లాంటి సమస్యలను దూరం చేస్తాయి. నోటిలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. దంతాలు శభ్రపడుతాయి. పంటిపై ఎనామిల్ కూడా దృఢంగా ఉంటుంది. మామిడి మంచి జీర్ణకారి. సహజమైన బరువు పెంచేందుకు దోహదం చేస్తోంది. మామిడి రసంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు గుండె జబ్బు రాకుండా కాపాడుతాయి. వృద్ధాప్య సమస్యలను తగ్గిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ● జిల్లాలో విస్తారంగా మామిడి సాగు ● యూరప్లో యుద్ధాల కారణంగా అమ్ముడుపోని గుజ్జు ● ఆపసోపాలు పడుతున్న అన్నదాతలు ● స్థానికంగానే వినియోగం పెంచాలంటున్న వైద్య నిపుణులు మామిడిని గ్రేడింగ్ చేస్తున్న సిబ్బందిఎనర్జీ డ్రింక్ల మోజులో పడొద్దు యువత ఎక్కువగా ఎనర్జీ డ్రింక్ల మోజులో పడుతోంది. కిక్ అంటూ వెంటపడుతున్నారు. అయితే దాని వల్ల వచ్చే ప్రమాదాలను గుర్తించలేకపోతున్నారు. కాలేజీలు, పాఠశాలల్లో పండ్ల రసాల వినియోగంపై అవగాహన పెంచాలి. ఎనర్జీ డ్రింక్స్లు తాగితే వచ్చే అనర్థాలను వివరించాలి. –గోవర్దన్బాబి, మామిడి పండ్ల గుజ్జు పరిశ్రమలశాఖ జిల్లా అధ్యక్షుడు, చిత్తూరు మామిడి ఆరోగ్యానికి మంచిది మామిడి రసం, పండ్లల్లో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే బీట కెరాటిన్ అనేది సమృద్ధిగా ఉంటుంది. ఫైబర్ కావాల్సినంత ఉంటుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఎనర్జీ పెంచుతుంది. బరువు తక్కువగా ఉన్న పిల్లలు ఎక్కువగా తీసుకోవచ్చు. కంటి చూపునకు మేలు చేసే గుణాలు మ్యాంగోలో అధికం. – సునీతాదేవి, చీఫ్ డైటీషియన్, స్విమ్స్, తిరుపతి -
25 నుంచి ఉరుసు ఉత్సవాలు
పుంగనూరు : పట్టణంలోని చెరువు కట్టపై గల హజరత్ సయ్యద్ నూర్షావలిబాబా ఉరుసు ఈనెల 25న ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు పోస్టర్లు , కరపత్రాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 25న గంధం, 27న ఖవ్వాలి, 28న తహలీల్ ఫాతేహా నిర్వహిస్తారు. ఈ మేరకు దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఎన్ఎస్.పేటలోని కళాశాల మైదానంలో ఉరుసు సందర్భంగా దుకాణాలు, రంగుల రాట్నాలు ఏర్పాటు చేస్తున్నారు. ఉరుసు కార్యక్రమానికి వేల మంది ప్రజలు రానుండటంతో ఏర్పాట్లు చురుగ్గా చేపడుతున్నారు. ఈ మేరకు సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఎస్ఐ లోకేష్ ట్రాఫిక్ ఏర్పాట్లు , పార్కింగ్పై కమిటీ సభ్యులతో చర్చలు జరుపుతున్నారు. -
పుత్తూరులో పట్టపగలు దోపిడీ
● మార్వాడీ షాపులో రూ.6.30 లక్షలు దోచుకొన్న దొంగలు ● షాపు యజమానిని కత్తులతో గాయపరిచి దోపిడీకి పాల్పడిన వైనం ● మోటార్ సైకిల్పై పరారైన ముగ్గురు అగంతకులు ● ముగ్గురూ 25 ఏళ్ల లోపు యువకులే పుత్తూరు : ఓ మార్వాడీ షాపులోకి ముగ్గురు అగంతకులు చొరబడి షాపు యజమానిని గాయపరిచి రూ.6.30 లక్షలు దోచుకెళ్లిన ఘటన పుత్తూరు పట్టణంలో శనివారం ఉదయం చోటు చేసుకొంది. సీఐ సురేంద్రనాయుడు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పుత్తూరు పట్టణంలో నివాసం ఉండే రంజిత్జీ అనే మార్వాడీ స్థానిక నగరి రోడ్డులో కొంత కాలంగా మీనాక్షి ఏజెన్సీని నడుపుతున్నాడు. శనివారం ఉదయం 7 గంటలకు రంజిత్జీ కుమారుడు మహేంద్రకుమార్ (28) షాపును తెరిచాడు. ముందుగా వచ్చిన ఒక కస్టమర్కు రూ.2 లక్షలకు పాన్ మసాలా సరుకును విక్రయించాడు. అనంతరం పిచ్చాటూరు నుంచి వచ్చిన మరో కస్టమర్ ఠాగూర్(24) అతని డ్రైవర్ ఏలుమలైలు రూ.4.30 లక్షలు చెల్లించి పాన్ మసాలా సరుకును వ్యాన్లోకి లోడ్ చేశారు. అదే సమయానికి షాపు ముందు బుల్లెట్ మోటార్ సైకిల్పై 25 ఏళ్ల వయస్సున్న ముగ్గురు యువకులు వచ్చి ఆగారు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి బైక్ పైనే ఉండగా ఇద్దరు దిగి వచ్చి మహేంద్ర కుమార్ను గల్లాలోని డబ్బు ఇవ్వాలంటూ కత్తులు చూపి బెదిరించారు. గల్లాలో ఏమీ లేదంటూ చెప్పడంతో మహేంద్ర కుమార్ను భుజంపై కత్తితో దాడి చేశారు. అడ్డువచ్చిన షాపు అసిస్టెంట్ సునీల్ను మరో యువకుడు కత్తితో కాలిపై గాయపరిచాడు. వెంటనే గల్లాలోని డబ్బు బ్యాగ్ను తీసుకోవడంతో పాటు మహేద్రకుమార్, సునీల్ వద్ద నుంచి సెల్ ఫోన్లను లాక్కొని మోటార్సైకిల్పై ముగ్గురూ పరారయ్యారు. వెంటబడిన మహేంద్రకుమార్ షాపు సమీపంలోని ఆర్డీఎం గేట్ వద్ద డ్యూటీలో ఉన్న పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే సీఐ సురేంద్రనాయుడు అప్రమత్తం అయ్యి మహేంద్రకుమార్, సునీల్ ఫోన్ నంబర్లను టేస్వుట్ చేయగా అవి స్థానిక చర్చి కాంపౌండ్ వద్ద లొకేషన్ను చూపాయి. అక్కడికి చేరుకొన్న సీఐకి రెండు సెల్ ఫోన్లు అక్కడ లభ్యమయ్యాయి. దుండగులు ఫోన్లను అక్కడ పడేసి పరారైనట్లు గుర్తించి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కస్టమర్ ఠాగూర్తో పాటు అనుమానాస్పద వ్యక్తులను గుర్తించిన పోలీసులు వారి కాల్ డేటాలను పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని త్వరలోనే కేసును ఛేదిస్తామని సీఐ సరేంద్రనాయుడు వెల్లడించారు. -
చెరువులో పడి అవ్వామనవడి మృతి
గుడుపల్లె: పశువులను కడిగేందుకు చెరువులోకి వెళ్లి అవ్వామనవడు మృతి చెందిన సంఘటన గుడుపల్లె మండలం బిజిగానిపల్లెలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని బిజిగానిపల్లె గ్రామానికి చెందిన మునెమ్మ(65) ఆమె మనుమడు జయప్రదీప్(14) గ్రామానికి సమీపంలోని నాగరప్ప చెరువులోకి తమ పశువులను కడగడానికి తీసుకు వెళ్లారు. పశువులను చెరువులో కడుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఇద్దరు లోతుగా ఉన్న నీటి కుంటలో పడి మృతి చెందారు. స్థానికులు గమనించి వెంటనే చెరువులోకి వెళ్లి చూడగా వారి మృతి చెందారు. జయ ప్రదీప్ 9వ తరగతి చదువుతున్నారు. సెలవులలో ఇంటి వద్ద ఉండి చెరువులో పడి మృతి చెందడంతో కుటుంబంలో విషాదచాయలు కమ్ముకున్నాయి. లారీని ఢీకొన్న ఐషర్ వాహనం శ్రీరంగరాజపురం : ఆగి ఉన్న లారీని ఐషర్ వాహనం ఢీకొన్న సంఘటన మండలంలోని పెద్దతయ్యూరు వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గురువారం రాత్రి పళ్లిపట్టు నుంచి చి త్తూరు వైపు వెళుతున్న ఐషర్ వా హనం మండలంలోని పెద్దతయ్యూరు వద్ద చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఐషర్ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఐషర్ వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతినింది. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జ రగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించా రు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. -
పండ్ల తోటల పెంపకానికి దరఖాస్తులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఉపాధి హా మీ పథకంలో పండ్ల తోటల పెంపకానికి అర్హత, ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని డ్వామా పీడీ రవికుమార్ తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. 2025–2026 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం, ఉద్యాన శాఖ సంయుక్తంగా పండ్ల తోటల పెంపకం పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఐదువేల ఎకరాలలో పండ్ల తోటల పెంపకం చేపడుతున్నామన్నారు. మామిడి, జామ, కొ బ్బరి, దానిమ్మ, అల్ల నేరేడు, చింతకాయ, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, జామ, జామ (బ్లాక్, బండ్), సీతాఫలం (బ్లాక్, బండ్), యాపిల్ బెర్రీ, కొబ్బరి, మల్లె పూలు, రోజా, మునగ, ఆయిల్పామ్, జీడిపప్పు, తైవాన్జామ, అంజీర, చింత, బండ్ ప్లాంటేషన్ తదితర పండ్ల మొక్కలు పెంపకం చేపట్టవచ్చన్నారు. అలాగే పూల సాగుకు సంబంధించి మల్లె, రోజా పంటలపై ఆసక్తిగల రైతులు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన చిన్న, సన్నకార రైతులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మండల పరిధిలోని ఉపాధి హామీ పథక కార్యాలయంలో దరఖాస్తులు చేసుకునేలా వెసులుబాటు కల్పించామన్నారు. పూడి రైల్వే గేట్ వద్ద స్తంభించిన ట్రాఫిక్ వడమాటపేట (విజయపురం): పూడి రైల్వే గేటు వద్ద శుక్రవారం గేటు దాటే క్రమంలో అటువైపు వచ్చిన లారీ పైభాగం ప్రమాద ఘంటికలు సూచించే పైపునకు తగులుకోవడంతో ముందుకు వెళ్లలేక ఆగిపోయింది. దీంతో వాహనాలు రోడ్డుపై చాలావరకు ఆగిపోయాయి. వెంటనే రైల్వే సిబ్బంది స్టేషన్ మాస్టర్కు తెలపడంతో అక్కడకు చేరుకున్న రైల్వే సిబ్బంది ప్రమాద ఘంటికల సూచీని తొలగించడంతో లారీ ముందుకు కదిలింది. ఆ తర్వాత ట్రాఫిక్ క్లియరైంది. -
● పది తర్వాత కొలువుకు దగ్గర మార్గంలా పాలిటెక్నిక్ కోర్సులు ● డీసీసీపీ కోర్సుతో ఉద్యోగ అవకాశాలు మెండు ● శ్రీహరికోట షార్లో మంచి డిమాండ్ ● అప్రెంటిస్షిప్ పూర్తితో ప్రైవేటు రంగాల్లో ఆఫర్లు
షార్లో ట్రైనింగ్.. ప్రొఫైల్ చూసి అసెంచూర్లో జాబ్ పలమనేరులోని పాలిటెక్ని క్ కళాశాలలో డీసీసీపీ కో ర్సు చదివి శ్రీహరికోటలో ఏడాది పాటు అప్రెంటిస్షి ప్ చేశా. నా ఈ ఫ్రొఫైల్ చూడగానే ఇంటర్వ్యూలో బెంగళూరులోని అసెంచూర్ సంస్థలో ఉద్యోగం దక్కింది. పీ2పీ (ప్రొక్యూర్మెంట్ టు పే న్యూ అసోసియేషన్)గా మంచి ప్యాకేజీతో జాబ్ చేస్తున్నా. పలమనేరులో ఇలాంటి కోర్సులున్నాయని చాలామందికి తెలియదు. – హేమావతి, బెంగళూరు డీసీసీపీ కోర్సులో కంప్యూటర్ ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థినిలు విద్యార్థినులను అభినందిస్తున్న కళాశాల అధ్యాపక బృందం(ఫైల్)పలమనేరు: పాలిటెక్నిక్ కోర్సులు పదో తరగతి తరువాత తక్కువ ఖర్చు, సమయంలో ఉపాధి అవకాశాలు పొందడానికి దోహదపడతాయి. ఈ నేపథ్యంలోనే పదో తరగతి పూర్తయ్యాక పాలిసెట్ రాసే విద్యార్థులు.. పాలిటెక్నిక్ అంటే బీటెక్కు సులభమైన దారిగానే భావిస్తుంటారు. చాలామంది ఈ కోర్సులో బ్రాంచ్లైన సివిల్, మెకానికల్, ఈసీఈ, ఈఈఈ, సీఎస్ఈ వైపే చూస్తుంటారు. స్పెషల్ కోర్సులను పట్టించుకోరు. కానీ, ఇవే త్వరగా ఉపాధి పొందేందుకు సోపానాలు అని తెలుసుకోవడం లేదు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపే వారికి మంచి అవకాశాలుంటాయి. ఇప్పటికే ఈ కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నవారు ఈ నెల 30వ తేదీన పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. ర్యాంకు వచ్చిన బాలికలు పలమనేరు, నెల్లూరులోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలల్లోని కొన్ని కోర్సులు చేస్తే 19 ఏళ్లకే షార్లో ఉద్యోగం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. డీసీసీపీ అంటే ఏమిటి? డీసీసీపీ.. కామర్స్తోపాటు పూర్తిస్థాయి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని నేర్పే మూడేళ్ల డిప్లొమా కోర్సు. ఇందులో కామర్స్, డిగ్రీ మొదటి సంవత్సరం ఇంగ్లిష్, ఇంగ్లిష్ షార్ట్హ్యాండ్, హయ్యర్, మోడరన్ ఆఫీస్ మేనేజ్మెంట్, బిజినెస్ కరస్పాండెన్స్, స్టాటిటిక్స్, బిజినెస్ లా, మార్కెటింగ్ ప్రిన్సిపుల్స్, అనలటికల్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్, డీటీపీసీ, టాలీ ప్రోగ్రామింగ్స్ ఉంటాయి. కోర్సులో ఏడాది అప్రెంటిస్షిప్ తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్గా విస్తృత అవకాశాలున్నాయి. కోర్సు పూర్తి చేసిన వారు బీకాం కంప్యూటర్స్ డిగ్రీలో లేటరల్ అడ్మిషన్ కింద సెకండ్ ఇయర్లో చేరవచ్చు. ఆపై ఎంబీఏ, సీఏ, సీఎస్ లాంటి ఉన్నత కోర్సులు చదవచ్చు. ● తల్లిదండ్రులు ఇలాంటి కోర్సులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.బాలికలకు ప్రత్యేక పాలిటెక్నిక్ చిత్తూరు జిల్లా పలమనేరు, నెల్లూరులో ప్రత్యేకించి మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. వీటిలో డిప్లొమా ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ (డీసీసీపీ) కోర్సు చేసినవారు ఏటా తిరుపతి జిల్లా శ్రీహరికోట షార్లో కంప్యూటర్ అనలిస్ట్గా అప్రెంటిస్షిప్నకు ఎంపికవుతున్నారు. షార్లోనే కాక ఎన్ఆర్ఎస్సీ (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హైదరాబాద్) హెచ్ఏఎల్ (హిందూస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్) వంటి పేరుగాంచిన కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. వీటిలో అప్రెంటిస్షిప్తో నైపుణ్యం సాధించినవారికి ప్రైవేట్ రంగంలోని ప్రముఖ కంపెనీలు భారీ వేతనాలను ఆఫర్ చేస్తున్నాయి. పలమనేరులోని కళాశాలలో డీసీసీపీ కోర్సు పూర్తి చేసుకున్న 90 శాతం మందికి ఏటా వెంట నే ఉపాధి లభిస్తోంది. పదేళ్లలో వివిధ కోర్టులు, రాష్ట్ర సచివాలయం, పోస్టల్, ప్రైవేటు బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో 400 మంది దాక ఉద్యోగాలు పొందడం విశేషం. టెన్త్ తర్వాత మంచి కోర్సు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాలిసెట్ ర్యాంకు ఆధారంగా పలు కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో చక్కటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. పేద, మధ్యతరగతి పిల్లలకు పాలిటెక్నిక్ విద్య ఎంతో మేలు. తద్వారా బీటెక్లోనూ ప్రవేశించి ఉన్నత విద్య అభ్యసించవచ్చు. – డా.బెహరా శ్రీనివాస్, ప్రిన్సిపల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, పలమనేరు ఇక్కడ చదివితే జీవితంలో సెటిల్ కోర్ బ్రాంచ్లే కాదు స్పెషల్ బ్రాంచ్ల్లో చదివినవాళ్లూ మంచి ఉపాధి అవకాశాలను పొందవచ్చు. డీసీసీపీ కోర్సు చేసిన చాలామంది షార్ లాంటి గొప్ప సంస్థల్లో ఉద్యోగాల్లో ఉన్నారు. కొందరు ఉన్నత చదువులకు వెళుతున్నారు. పాలిటెక్నిక్లోని ఇలాంటి కోర్సుల గురించి చాలామందికి తెలియదు. – మహమూద్, సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్, పలమనేరు ఏటా పది మందిపైనే షార్లో శిక్షణకు.. ఏటా షార్కు ఇక్కడినుంచి పదిమంది పైగా విద్యార్థినులు శిక్షణకు వెళుతున్నారు. ఆపై ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఈసారి సైతం ఇక్కడ చదివిన సిమ్రాన్ (సదుం), డిల్లీ (బంగారుపాళెం), శశిప్రియ (నిమ్మనపల్లి), భవాని (గుడుపల్లి) పలువురు షార్లో పనిచేస్తున్నారు. – శ్రీవిద్య, డీసీసీపీ డిపార్ట్మెంట్ హెడ్, పలమనేరు -
ఉపాధికి‘షార్’్ట కట్
పాలిటెక్నిక్ కోర్సులు ఉపాధికి దోహదపడు తున్నాయి. ఈ కోర్సు చేసిన బాలిక లకు షార్లో అవకాశాలొస్తున్నాయి.శనివారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025చిత్తూరు కలెక్టరేట్ : పేదింటి పిల్లలు ప్రపంచంతో పో టీపడేలా, తరతరాల తలరాతలను మార్చాలని గత ఐదేళ్ల పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యాశాఖలో సంస్కరణ విప్లవం తెచ్చింది. ఒక చదువుతోనే పేదరికాన్ని అధిగమించడం సాధ్యమని బలంగా విశ్వసించి ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థలో ఎన్నడూ లేని విధంగా గత ఐదేళ్ల పాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఇంటర్ విద్యార్థులకు అమ్మఒడి, విద్యాకానుక, నా డు నేడు తదితర పథకాలను అమలు చేసి పేద విద్యార్థు ల ఉన్నత చదువులకు భరోసా కల్పించింది. నాటి సంస్కరణలే..నేటి ఉత్తమ ఫలితాలు వైఎస్సార్సీపీ సర్కారు పాలనలో అమలు చేసిన సంస్కరణలే నేడు ఇంటర్మీడియట్ ఉత్తమ ఫలితాలకు దో హదం చేశాయి. జిల్లా వ్యాప్తంగా 32 మండలాల్లో 74 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ఈ కళాశాల ల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేసేందుకు పలు కార్యక్రమాలు గ త ఐదేళ్లల్లో చేపట్టారు. ఎన్నో సంవత్సరాలుగా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్నప్పటికీ వారి సమస్యలు పరిష్కారం కాని పరిస్థితి ఉండేది. గత సర్కారులో కాంట్రాక్ట్ లెక్చరర్ల డిమాండ్లు నెరవేర్చి, వారి జీతా లు సైతం పెంచారు. దీంతో ఆ లెక్చరర్లు విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేశారు. పాఠశా ల స్థాయి విద్యార్థులతోపాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు అమ్మఒడి పథకం అమలు చేసి ఆర్థిక సహా యం అందజేశారు. ఆ ఆర్థిక సహాయంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పలు చేయాల్సిన అవసరం లేకుండా తమ పిల్లలను సజావుగా చదివించుకున్నారు. సన్షైన్ అవార్డులు స్వీకరించిన ఆరుగురు విద్యార్థులు గత సర్కారులో ఉత్తమ విద్యాబోధన, విద్యాసంస్కరణతో ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. జిల్లాలోని పలమనేరు టీకేసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో చదువుతున్న హర్షిత వొకేషనల్ గ్రూపులో 971 మార్కులు సాధించింది. కుప్పం ప్రభుత్వ ఒకేషనల్ కళాశాలలో చదివిన సుస్మిత 976 మార్కులు, అదే కళాశాలలో శ్రీనివాసులు 952 మా ర్కులు, రొంపిచెర్ల కేజీబీవీలో సీఈసీ చదివిన శ్రవంతి 935, కుప్పం నడిమూరు మోడల్ స్కూల్లో సీఈసీ చదివిన అశ్విని 969 మార్కులు సాధించారు. ఈ ఐదుగురు విద్యార్థులు ఈ నెల 15వ తేదీన విజయవాడలో ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశా ఖ మంత్రి లోకేశ్ చేతుల మీదుగా అవార్డులు, ల్యాప్టాప్ స్వీకరించారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం తండ్రి ట్రాక్టర్ డ్రైవర్.. తల్లి దినసరి కూలీగా కుటుంబాన్ని నెట్టుకొస్తూ తమ ముగ్గురి పిల్లలను పలమనేరులోని సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్లో పెట్టి చదివించారు. తల్లిదండ్రుల కష్టాలను చూసిన వారు కష్టపడి చదువుతూ తల్లిదండ్రులకు మంచిపేరు తెచ్చిపెడుతున్నారు. వీరిలో పెద్దకుమార్తె తోటి హర్షిత స్థానిక ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో లైవ్స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డెయిరీ టెక్నాలజీ కోర్సులో వెయ్యికి 971 మార్కులను సాధించి స్టేట్ టాపర్గా నిలిచింది. ప్ర భుత్వం ఇంటర్ ఫలితాల్లో వివిధ గ్రూపుల్లో టాపర్లుగా నిలిచిన 54 మందిని రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసింది. ఇందులో భాగంగా షైనింగ్స్టార్ అవార్డుకు హర్షిత ఎంపికై విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డు స్వీకరించింది. – 10లోన్యూస్రీల్ గత ప్రభుత్వ సంస్కరణలతోనే నేడు ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సత్తా చాటిన సర్కారు విద్యార్థులు వైఎస్సార్సీపీ పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యత సన్షైన్ అవార్డులు స్వీకరించిన జిల్లా విద్యార్థులు విద్యతోనే పేదరికం దూరం..అభివృద్ధి సాధ్యం అని నమ్మింది వైఎస్సార్ సీపీ ప్రభుత్వం. ఆ దిశగా అడుగులు వేసింది. విద్యకు పెద్ద పీట వేసింది. విద్యాశాఖలో పెను మార్పులు చేసింది. సంస్కరణలు తీసుకొచ్చింది. పలు పథకాలు అమలు పరిచింది. పేద విద్యార్థులకు నాణ్యతతోకూడిన మెరుగైన విద్య అందింది. వారంతా క్రమశిక్షణతో చదివి, నేడు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించి, మెరిశారు. ఇందంతా నాటి వైఎస్సార్ సీపీ సర్కారు సంస్కరణల ఫలితంగా సాధ్యమైందని, వారి ఆలోచన, ఆచరణ అ‘ద్వితీయ’ం అని విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కూటమి దురాగతాలను ఎండగట్టాలి
వెదురుకుప్పం: కూటమి దురాగతాలను ఎండగట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. శుక్రవారం మండలంలోని ఆళ్లమడుగులో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. పది నెలలుగా సూపర్సిక్స్ పథకాల్లో ఏ ఒక్కటీ అమలు చేయని దౌర్భాగ్య పర్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని చెప్పారు. పథకాలను అమలు చేయాలని అడిగితే అక్రమ కేసులతో అణచివేతకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తానే తప్పు చేస్తూ ప్రతిపక్ష పార్టీపై నెట్టి వారిపైనే నిందలు, అభాండాలు వేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అరాచకాలకు హద్దుల్లేవన్నారు. పేదల ఉసురు తగిలితే ఎలాంటి పార్టీ అయినా కోలుకోలేదన్నారు. రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, దురాగతాలను ఎండగట్టేందుకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పేద ప్రజల తలరాతలు మారాలంటే మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు సుకుమార్, ఎంపీటీసీ సభ్యురాలు రమణమ్మ, కో–ఆప్షన్ సభ్యుడు వెంకటేశ్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కామసాని పద్మనాభరెడ్డి, మండల ఉపాధ్యక్షులు చిరంజీవిరెడ్డి, గోవిందన్, కార్యదర్శులు బొజ్జారెడ్డి, కేశవులు, వెంకటేశ్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రామయ్య, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు బట్టే సుబ్రమణ్యం, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు బండి హేమసుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పురుషోత్తం పాల్గొన్నారు. –మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి -
వక్ఫ్ సవరణ వద్దని రోడ్డెక్కిన ముస్లింలు
పుంగనూరు: వక్ఫ్ చట్ట సవరణ వద్దని ముస్లింలు పుంగనూరులో శుక్రవారం రోడ్డెక్కారు. కేంద్ర ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తిరస్కరిస్తున్నామని, తమ సత్తా చాటుతామని, రాజీపడే ప్రసక్తే లేదని ముస్లింలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వందలాది మంది ముస్లింలు నమాజ్ పూర్తి చేసుకుని, ర్యాలీగా పట్టణంలోని ఇందిరా సర్కిల్ చేరుకున్నారు. నల్ల జెండాలు, ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యదేశంలో మతాలకార్చిచ్చుకు ప్రభుత్వమే పునాది వేస్తోందని ముస్లిం నేతలు మండిపడ్డారు. హిందు మతానికి చెందిన వాటిలో ముస్లింలకు సభ్యత్వం ఉండదని, అలాంటి నిబంధనలు ఉన్న సమయంలో ముస్లింలపైన, వారి ఆస్తులపైన అన్యమతస్తులకు పెత్తనం చెలాయించేందుకు అధికారం ఎలా ఇస్తారంటు నిలదీశారు. ప్రభుత్వం ఈ విషయంపై చర్యలు తీసుకుని, వక్ఫ్ బోర్డు బిల్లును ఉపసంహరించుకోవాలని, లేకపోతే ఐకమత్యంతో పోరాటం చేసి, సాధించుకుంటామని హెచ్చరించారు. ఈ ర్యాలీలో ముస్లిం నాయకులు ముజాహిద్, యూనస్, జవహార్, అయాజ్, మమ్ము, జమీర్, రఫిక్, నూర్, అయూబ్, అస్లాం, ఎస్.రఫిక్, ఇమ్రాన్, సల్మాన్, పర్వేజ్, యాసిన్, నజీర్ తో పాటు వక్ఫ్ బోర్డు కమిటి సభ్యులు పాల్గొన్నారు. -
వరసిద్ధుని సేవలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి
కాణిపాకం: వరసిద్ధి వినాయక స్వామివారిని శుక్రవారం చిత్తూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ సారిక దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆమె స్వామి వారి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. వారికి ఆలయాధికారులు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. వేదపండితులు ఆశీర్వచనాలు పలికి, తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, స్వామివారి చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, చిత్తూరు కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. వరసిద్ధుని దర్శించుకున్న రాష్ట్ర కమిషన్ వరసిద్ధి వినాయకస్వామివారిని రాష్ట్ర శిశు, చిన్నపిల్లల సంక్షేమ కమిషన్ కేసలి అప్పారావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయాధికారులు ఘన స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. వేద ఆశీర్వచన మండపంలో పండితులు వారికి ఆశీర్వచనాలు పలికి, స్వామి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. అనంతరం స్థానిక మణికంఠే శ్వరస్వామి, వరదరాజుల స్వామిని దర్శించుకున్నారు. -
మేసీ్త్ర పనులు చేస్తూ కుమార్తెను చదివిస్తూ..
జిల్లాలోని రొంపిచెర్ల కేజీబీవీ విద్యార్థిని స్రవంతి ఇంటర్మీడియట్ ఫలితాల్లో 935 మార్కులు సాధించింది. సన్షైన్ అవార్డుకు ఎంపికై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డు సైతం స్వీకరించింది. కర్నూలు జిల్లాకు చెందిన శివన్న, దేవమ్మకు ఇద్దరు కుమార్తెలు. శివన్న తిరుపతిలో మేసీ్త్ర పనులు చేసుకుంటూ ఇద్దరు కుమార్తెలను చదివించుకుంటున్నారు. స్రవంతిని కేజీబీవీ పాఠశాలలో చదివిస్తున్నారు. గత ఐదు సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వం కేజీబీవీ పాఠశాలల్లో అనేక మార్పులు తీసుకొచ్చిందని, ఆ మార్పులతోనే తాను ఉత్తమ ఫలితాలు సాధించినట్లు స్రవంతి వెల్లడించింది. -
జిల్లా జడ్జిగా అరుణ సారిక బాధ్యతల స్వీకరణ
చిత్తూరు అర్బన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా అరుణ సారిక శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. చిత్తూరులోని జిల్లా కోర్టులోని ఛాంబర్లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన న్యాయమూర్తుల బదిలీల్లో మచిలీపట్నం జిల్లా జడ్జిగా పనిచేస్తున్న అరుణ సారికను చిత్తూరు జిల్లా జడ్జిగా నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చిత్తూరులో పనిచేస్తున్న ఇ.భీమారావును అనంతపురం జిల్లా జడ్జిగా బదిలీ చేశారు. నేడు జిల్లాలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 19వ తేదీన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. శుక్రవారం ఆయన క్షేత్రస్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా ప్రకటించిందన్నారు. ఈ నెల 19వ తేదీన పారిశుద్ధ్యం పరిశుభ్రతను పెంపొందించేందుకు స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అందరి భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఇ –చెక్ అనే ప్రధాన అంశంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇ– చెక్ అంటే అన్ని మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాలలోని గృహాలు, దుకాణాల్లో ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను పూర్తిగా సేకరించి, రీ యూజ్ చేయడమని తెలిపారు. ఇందుకు షాపులు, ఇళ్లల్లో ఉన్న ఎలక్ట్రానిక్ వేస్ట్ను పూర్తిగా సేకరించాలనన్నారు. ఈ వేస్ట్ని సేకరించేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు బాధ్యతలు అప్పగించామన్నారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ శాఖలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించి వెబ్సైట్లో ఫొటోలను అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్లో జేసీ విద్యాధరి, డీఆర్వో మోహన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చిన్నపనైనా.. చేయి తడపాల్సిందే!
● అవినీతికి అడ్డాగా చిత్తూరు రెవెన్యూ కార్యాలయం ● నకిలీ పత్రాలకు కేంద్ర బిందువు ● గొలుసు పడితే కాసులు ● పట్టాలంటే పైసలతోనే పని ● ప్రతి పనికి బహిరంగంగా వసూలు ● చిత్తూరు నగరంలోని ఓ గ్రామకంఠం భూమిలో పూర్వీకులు ఇల్లు కట్టుకున్నారు. వాటికి ఎలాంటి డాక్యుమెంట్లు లేవు. కానీ వంశపారపర్యంగా వారు ఆ గ్రామ కంఠం భూమిలోనే నివాసం ఉంటున్నారు. ఉన్న పాత ఇల్లు కొట్టేసి..కొత్త ఇల్లు కట్టుకోవాలంటే పొజిషన్ అవసరం. కానీ రెవెన్యూ అధికారులు పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు. ● చిత్తూరులోని మరో చోట గ్రామకంఠ భూమి ఖాళీగా ఉంది. ఆ భూమి తమ అనుభవంలోనే ఉందని ఇద్దరు వ్యక్తులు కార్యాలయానికి వచ్చారు. పక్కాగా పని చేసి పెట్టేవారిని పట్టుకున్నారు. ఇంకేముంది మూడు రోజుల్లో ముచ్చటగా చేతిలో పొజిషన్ పెట్టేశారు. తీరా వారు అడిగినంత ఇచ్చుకున్నట్లు సమాచారం. ● చిత్తూరు నగరానికి చెందిన ఓ భూమి రకం తప్పుగా నమోదైంది. దాన్ని మార్చుకుని కన్వర్షన్ పెట్టుకునేందుకు భూ యజమాని ఆరునెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. తొలుత భూమి సబ్ డివిజన్ కోసం ఓ సర్వేయర్కు రూ. 20 వేలు ఇచ్చుకున్నాడు. అయినా ఇంత వరకు పని కాలేదు. ● చిత్తూరు మండలంలోని ఓ రైతు సర్వే చేసి హద్దులు చూపించుకునేందుకు ఓ సర్వేయర్కు రూ.60వేలు ఇచ్చుకున్నాడు. ఆ పనికాకపోవడంతో ఆ రైతు కొన్ని నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఆ సర్వేయర్ను అదనపు పనుల నిమిత్తం వేరే ప్రాంతానికి మార్చడంతో ఆ రైతు విస్తుపోతున్నాడు. ఇలా ఓ టీడీపీ కార్యకర్త కూడా రూ.10 వేలు ఇచ్చుకున్నా సర్వే కాలేదు. దీంతో అధికారంలో ఉండి కూడా ఏందీ తంటా అంటూ ఆ కార్యకర్త తల పట్టుకుంటున్నాడు. ఇలాంటి కేసులు ఇదొక్కటే కాదు..పదుల సంఖ్యలో వస్తున్నాయి. సాక్షి టాస్క్ఫోర్స్: చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డగా మారింది. నకిలీ పత్రాల తయారీకి కేంద్ర బిందువుగా పేరు తెచ్చుకుంది. ప్రతి పనికీ బహిరంగంగా కాసులు వసూలు చేస్తున్నారు. పట్టా ఇవ్వాలన్నా.. సర్వే చేయాలన్నా లంచాలు ఇవ్వాల్సివస్తోంది. చిత్తూరు నగరం మిట్టూరులో అర్బన్, వేలూరు రోడ్డులో రూరల్ తహసీల్దార్ కార్యాలయాలున్నాయి. ఇక్కడకి నిత్యం 200 మందికిపైగా వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. సర్వే, పట్టాదారు పాసుపుస్తకం, మార్పులు, సర్వే నంబర్లల్లో తప్పులు తదితర సమస్యల పరిష్కారానికి వస్తుంటారు. వీరి అవసరాలను అసరా చేసుకుని కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. దొంగ పట్టాలకు కేంద్ర బిందువు చిత్తూరు అర్బన్ తహసీల్దార్ కేంద్రం దొంగ పట్టాలకు కేంద్ర బిందువుగా మారింది. తప్పుడు పత్రాలు సృష్టించి కొందరు అధికారులు, సిబ్బంది, దళారులు కాసులు దండుకుంటున్నారు. ప్రశాంత్నగర్, తిమ్మసముద్రం, ఇరువారం, తదితర ప్రాంతాల్లో పట్టా ఉన్న స్థలాలకు మళ్లీ డూఫ్లికేట్ పట్టాలు సృష్టించి ఇచ్చేస్తున్నారు. ఇందులో ఇదివరకు పనిచేసిన తహసీల్దార్లు, విశ్రాంత తహసీల్దార్ల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. వారు పనిచేసిన తేదీల్లో పట్టా ఇచ్చినట్లు పత్రాలు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి తప్పుడు పత్రాలు వేలల్లో ఉన్నట్లు అధికారుల అంచనా. సర్వేకూ సమర్పించుకోవాల్సిందే! ప్రస్తుతం సర్వేకు సంబంధించిన సమస్యలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. దీని ఆసరాగా చేసుకుని కొందరు సర్వేయర్లు వసూళ్లకు పాల్పడుతున్నారు. సర్వేకు డబ్బులు..కట్టినా, కట్టపోయినా కాసులిస్తే వాలిపోతున్నారు. కొందరు నగదు రూపేణ తీసుకుంటే..మరికొందరు ఫోన్పే, జీ పే ద్వారానే కాసులు వసూలు చేసుకుంటున్నారు. ఇదంతా సాయంత్రం 6 గంటల తర్వాతే జరుగుతుంటాయి. పనుల ఆధారంగా లంచం రెవెన్యూలో ప్రతి పనికీ కొందరు అధికారులు నిర్భయంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. పట్టామార్పునకు స్థలం, దాని విలువ ఆధారంగా వసూలు చేస్తున్నారు. సాధారణ ఫీజుగా రూ.20 వేలుగా ఫిక్స్ చేశారని విమర్శలు వస్తున్నాయి. సర్వే నంబర్లలో తప్పులు సరిదిద్దుకునేందుకు రూ.10 వేలు అడుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. అన్లైన్లో దొర్లిన తప్పులు సరిదిద్దడానికి రూ.10వేలు, కరెంటు సర్వీసు రూ.10 వేలు, సబ్ డివిజిన్ చేసుకునేందుకు ఎంత డబ్బులిస్తే అంత తొందరగా పనులు అవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
రెవెన్యూ సమస్యలు చిత్తశుద్ధితో పరిష్కరించండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని తహసీల్దార్లు రెవెన్యూ సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. గురు వారం కలెక్టరేట్లో తహసీల్దార్లతో రెవెన్యూ సమస్యల పరిష్కారంపై వర్క్షాప్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లు అధిక ప్రాధాన్యత ఇచ్చి, ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాలని తెలిపారు. మ్యూటేషన్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలన్నారు. ఆర్ఓఆర్ సమస్యలు అధికం జిల్లాలోని అన్ని మండలాల్లో ఆర్ఓఆర్ సమస్యలు అధికంగా ఉన్నాయని కలెక్టర్ అన్నారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆర్ఓఆర్ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు ఆర్డీఓలు అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తమకు కేటాయించిన మండలాల్లో భూ అలినేషన్, అసైన్మెంట్ భూమి, రెగ్యులరైజేషన్, ఆర్ఓఆర్, వెబ్ల్యాండ్, రీ సర్వే సమస్యలను గుర్తించాలన్నారు. వెబ్ల్యాండ్లో సవరణలు చేసే సమయంలో తహసీల్దార్లు రికార్డులను పరిశీలించడంతోపాటు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అనంతరం చర్యలు చేపట్టాలన్నారు. రీ సర్వే పురోగతికి వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లు తరచూ సమీక్షించాలన్నారు. ఈ వర్క్షాప్లో జేసీ విద్యాధరి, డీఆర్వో మోహన్కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు పాల్గొన్నారు. -
ఆధునిక పద్ధతిలో సాగు చేయండి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): రైతులు ఆధునిక పద్ధతిలో పంట సాగు చేసి, లాభాలు ఆర్జించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణ అన్నారు. చిత్తూరు నగరంలోని జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో గురువారం వ్యవసాయ రంగంలో డ్రోన్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిసాన్ డ్రోన్ గూపు కన్వీనర్లు, కో కన్వీనర్లు, అధికారులు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ డ్రోగో టెక్నాలిజీస్ డ్రోన్ ధర రూ. 9.80 లక్షలుంటే రాయితీతో రూ.7.84 లక్షలతో అందిస్తారన్నారు. విహజ్ఞ టెక్నాలజీస్ వారి డ్రోన్ ధర రూ.9.81 లక్షలుంటే రాయితీతో రూ.7,84,800కే ఇస్తారన్నారు. రైతులకు దీనిపై పూర్థి స్థాయిలో అవగాహన కల్పించి, ఆధునిక పద్ధతుల్లో వ్యవయసాయాన్ని వృద్ధి చేసుకునేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ట్రైబుల్ వెల్ఫేర్ అధికారి హరీష్, ఎల్డీఎం హరీష్, డీసీసీబీ సీఈఓ శంకర్బాబు, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు. -
పంటకు రక్ష.. భక్షకులకు శిక్ష
పలమనేరు: ప్రతి సమస్యకూ ఓ మార్గం ఉన్నట్టు ఓ రైతు తన మొక్కజొన్న తోటలో పిట్టలు, వానరాలను తరిమేందుకు ఓ వినూత్న ఆలోచన చేశారు. పాత రేకులతో భారీ శబ్ధాలు వచ్చేలా చేసి, నిశ్చింత అయ్యాడు. పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి మండలం చీలంపల్లికి చెందిన రైతు జగదీష్ తన పొలంలో మొక్కజొన్న సాగు చేశాడు. ప్రస్తుతం కంకులు ముదిరిన దశలో ఉన్నాయి. దీంతో పక్షులు, వానరాలు తోటలోకి వచ్చి రైతుకు నష్టం కలిగిస్తున్నాయి. దీన్ని గమనించిన కేకలు పెట్టినా అవి వెళ్లకపోవడంతో ఓ పాత ఇనుప రేకును వంచి దానికి ఓ తాడును కట్టాడు. ఇది గాలి వచ్చినప్పుడు రేకులు రాసుకుని శబ్ధం వచ్చేలా చేశారు. గాలి లేనప్పుడు రైతు రేకులకు కట్టిన ధారాన్ని లాగుతూ శబ్ధాన్ని పుట్టిస్తున్నాడు. దీంతో అతని మొక్కజొన్న తోటలోకి ఇప్పుడు పక్షులు, వానరాలు రాకుండా పోయాయి. రైతు ఐడియాను చూసిన జనం వారెవ్వా అంటున్నారు. -
పలమనేరులో విజృంభిస్తున్న బ్లేడ్బ్యాచ్లు
పలమనేరు: పట్టణంలో వైఎస్సార్సీపీ నాయకుల బ్యానర్లను గుర్తుతెలియని బ్లేడ్ బ్యాచ్ రాత్రిపూట కోసేస్తోంది. ఇంతకూ ఎవరు వీటిని కట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. పట్టణంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల బ్యానర్లున్నప్పటికీ కేవలం వైఎస్సార్సీపీ నాయకుల బ్యానర్లనే ఈ బ్యాచ్ టార్గెట్ చేస్తోంది. నాయకుల పుట్టినరోజు, లేదా అభినందనలు ఇలా ఏ బ్యానర్ పట్టణంలో ఏర్పాటు చేసిన తొలిరోజే బ్లేడ్ గాట్లు తప్పడంలేదు. గత కొన్నాళ్లుగా ఈ తంతు పట్టణంలో సాగుతోంది. ముఖ్యంగా వైఎస్సార్సీపీ యువనేత క్యూడీ ఎస్ రాజేష్ బ్యానర్లను వీరు టార్గెట్ చేసి మరీ కోసేస్తున్నారు. దీనిపై సీసీ కెమెరాల ద్వారా నైనా స్థానిక పోలీసులు ఈ బ్లేడ్బ్యాచ్ను గుర్తించి, శిక్షించాలని బాధిత నాయకులు కోరుతున్నారు. వైఎస్సార్సీపీ బ్యానర్లే వారి టార్గెట్ -
కారును ఢీకొన్న కంటైనర్
బంగారుపాళెం: మండలంలోని మొగిలిఘాట్లో గురువారం చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై కారును కంటైనర్ ఢీకొంది. దొరచెరువు వద్ద బెంగళూరు నుంచి చిత్తూరు వైపు వెళుతున్న కారును వెనుక నుంచి కంటైనర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు వెనుక భాగం దెబ్బతినింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రహదారిపై ప్రమాదానికి గురైన కారును పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కబేళాలకు 30 పశువులు ● పట్టుకున్న పోలీసులు పుంగనూరు: చట్టవిరుద్ధంగా కబేళాలకు తరలిస్తున్న 30 పశువులను పట్టుకుని, టీటీడీ గోశాలకు తరలించినట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ పట్టణ సమీపంలోని రాంపల్లె వద్ద ఓ కంటైనర్లో పశువులను తరలిస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ విషయమై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పశువులను స్థానిక మార్కెట్ యార్డుకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, వాటిని టీటీడీ గోశాలకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. కాశిరాలలో జాతీయ బృందం పర్యటన యాదమరి: జలజీవన్ పథకంలో చేసిన పనులను పరిశీలించడానికి ఢిల్లీ నుంచి జాతీయ బృందం మండలంలో పర్యటించింది. గురువారం మండలంలోని కాశిరాల పంచాయతీలో జాతీయ బృందం సభ్యులు ఏడుగురు తాగునీటి ట్యాంకులు, నీటి కొళాయిలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆ బృందం సభ్యుడు అన్బజ్గన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ మంచి నీటిని అందించడమే జల్ జీవన్ మిషన్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. స్థానిక సచివాలయంలోని జల జీవన్ మిషన్కు సంబంధించి రికార్డులను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ నీటిపారుదల శాఖ డీఈలు శ్రీనివాసులు, రవికిరణ్, ఏఈ ఉషారాణి, ఈఓపీఆర్టీ సుకుమార్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శిరీష పాల్గొన్నారు. -
దొరికితేనే దొంగలు!
● చిత్తూరు కేంద్రంగా నకిలీ పత్రాల దందా ● తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్లు ● బ్యాంకును బురిడీ కొట్టించేందుకు యత్నం ● రెవెన్యూ ఉద్యోగేసూత్రధారి ● అన్ని తెలిసినా రెవెన్యూ అధికారులు మౌనం ● సాక్షి కథనంతో నకిలీ భాగోతంపై కదలికలు ● గుట్టురట్టు చేసిన పోలీసులు చిత్తూరు అర్బన్/కాణిపాకం: చిత్తూరులో తహసీల్దార్ కార్యాలయ కేంద్రంగా నకిలీ పత్రాల దందా పెచ్చుమీరింది. ఇంటి దొంగలే ఫోర్జరీ గ్యాంగ్ను సృష్టించారు. తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్లు.. బ్యాంకును బురిడీ కొట్టించేందుకు యత్నించారు. ఈగ్యాంగ్లో రెవెన్యూ ఉద్యోగే కీలక సూత్రధారిగా వ్యవహరించారు. తహసీల్దార్ సీలును దొంగలించారు. ఏకంగా తహసీల్దార్ సంతకాలనే ఫోర్జరీ చేశారు. రూ.కోట్ల విలువ చేసే భూములపై తప్పుడు పత్రాలు సృష్టించారు. దీనిపై సాక్షి దినపత్రిక కథనాలు వండిపెట్టింది. దీంతో ఫోర్జరీ వ్యవహరంపై కదిలికలొచ్చాయి. వెంటపడిన పోలీసులు, ముఠా గుట్టును రట్టు చేశారు. చివరకు ఫోర్జరీ ముఠా కటకటలపాలైంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు నగరంలోని అర్బన్ తహసీల్దార్గా పనిచేసిన కళావతి సంతకం ఫోర్జరీ చేసిన ఓ పత్రం ఈ ఏడాది జనవరిలో వెలుగులోకి వచ్చింది. తిమ్మసముద్రంలోని ఓ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తప్పుడు ఎంజాయిమెంట్ సర్టిఫికెట్తో కూడిన ఓ దరఖాస్తు సబ్ రిజిస్ట్రార్ వద్దకు వెళ్లింది. తహసీల్దార్ సంతకాన్ని అనుమానించిన ఆ రిజిస్ట్రార్ ఆ పత్రాన్ని పరిశీలనలో పెట్టారు. అప్పటి తహసీల్దార్ ఇది తన సంతకం కాదని స్పష్టం చేశారంటూ చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులకు ఆ ఫోర్జరీ లొసుగులు వెలుగులోకి తీసుకొచ్చారు. ఆపై దీనిని బయటకు పొక్కనివ్వకుండా కూటమి నేతలు అడ్డుపడ్డారు. పోలీసులకు పరీక్షే... ఫోర్జరీపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ తరుణంలో కూటమి నేతల నుంచి అడ్డంకులు వచ్చి పడ్డాయి. దీనిపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేసు ముందుకు కదిలింది. ఫోర్జరీ గుట్టును రట్టు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో దొంగిలించిన తహసీల్దార్ సీలు, గ్రీన్ ఇంక్ ఫెన్ స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ కేసు ఛేదించడం పోలీసులకు పెద్ద పరీక్షే అని చెప్పువచ్చు. కూటమి నేతలు సిఫార్సులను పట్టించుకోకుండా పోలీసు బాధ్యతలను గుర్తు చేసుకుంటూ ముఠా చిట్టా విప్పి..కటకటాల్లోకి నెట్టారు. కలిసొచ్చిన అవకాశం... అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలుంటే ఓ రెవెన్యూ ఉద్యోగి పేరిట ఆరు నెలలు మరో వ్యక్తి పని చేయడానికి అవకాశం ఉంది. అయితే రెవెన్యూ అధికారులు తండ్రి పేరుతో పనిచేసే వారిని ఏళ్ల తరబడి కొనసాగిస్తున్నారు. వాళ్లను అడ్డం పెట్టుకు ని వసూళ్లకు తెరలేపుతున్నారు. వాళ్ల చేతికే లాగిన్లు, రికార్డులు ఇచ్చి పెట్టి రెవెన్యూ సేవలను అమ్మకానికి పెట్టారు. ఇలా రూ.లక్షల్లో డబ్బులిచ్చే వారికి అప్పన్నంగా భూములను కట్టబెట్టేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇందుకు ప్రతిఫలంగా కార్లు బహుమతులు తీసుకున్నారనే చర్చ జోరందుకుంటున్నాయి. బెంగళూరు తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి పార్టీలు, పబ్బ్ల్లో ముంచెత్తేవారని కార్యాలయ సిబ్బంది విమర్శిస్తున్నారు. తనిఖీ చేయాల్సిన ఆర్డీఓ, జేసీలు కూడా పర్యవేక్షణను పూర్తిగా మరిచిపోయారని, గతంలో జేసీగా పనిచేసిన గిరీ షా మాత్రం కార్యాలయాన్ని తనిఖీ చేసి వీఆర్వో లు, అధికారులను మందలించారని గుర్తు చేస్తు న్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రెవెన్యూ కార్యాలయంలో ఇంటి దొంగలు రెచ్చిపోయారనే వాదన వినిపిస్తోంది. తహసీల్దార్ కార్యాలయంఈ గ్యాంగ్ లీడర్ ఎవరంటే... 2018 ముందు నుంచే తహసీల్దార్ కార్యాలయంలో ఫోర్జరీ వ్యవహరం నడుస్తున్నట్లు ఆరోపణులున్నాయి. చంద్రశేఖర్ తహసీల్దార్గా పనిచేస్తున్న సమయంలో తహసీల్దార్ సీలు విరిగింది. ఆ సీలు దొంగ పత్రాలు సృష్టించే వ్యక్తులే ఎత్తుకెళ్లారని కార్యాలయ సిబ్బంది కోడైకూస్తూ వచ్చింది. అప్పట్లో అధికారులు మాత్రం దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఇన్నాళ్ల తర్వాత ఇంటి దొంగలే ఈపని చేశారనేది పోలీసుల విచారణలో తేలింది. చిత్తూరు మండలంలోని పెరుమాళ్ల కండ్రిగ రెవెన్యూ వీఆర్ఏగా వ్యవహరిస్తున్న మోహన్ ఈ సీలు చోరీ చేసి.. ఇంట్లో దాచి పెట్టి దొంగ పత్రాలకు వాడుకున్నట్లు పోలీసు విచారణలో బయటపడింది. రూ.వేలల్లో డబ్బులు తీసుకుని దొంగ సంతకాలు పెట్టడం, సీలు వేయడం, తప్పుడు పత్రాలతో బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు పెద్ద ముఠాను ఏర్పరుచుకున్నాడని ఈకేసులో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కీలకంగా వ్యహరించిన మోహన్ మరో వీఆర్ఏగా ఉన్న రాజశేఖర్, డాక్యుమెంట్ రైటర్ గజేంద్రకుమార్ సహకారంతో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న గౌతమ్, జాన్సీ సహకారంతో బ్యాంకులను రూ.లక్షల్లో బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించారన్న నిజాలు వెల్లడయ్యాయి. కాగా ఈ కేసుకు సంబంధించి మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫోర్జరీపై ‘సాక్షి’ పట్టు ఫోర్జరీ పత్రాల సృష్టిపై గత కొన్నేళ్లు సాక్షి దినపత్రికలో పలు వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. ఎవరెవరూ..ఎలా చేస్తున్నారనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది.అయితే ఇంటి దొంగల ము సుగులో పడిన అధికారులు తేలికగా తీసుకున్నా రు. తహసీల్దార్ కళావతి సంతకం ఒకటి బయటికి రాకపోయి ఉంటే ఈ ఇంటి దొంగల మరింత రెచ్చిపోయి ఉంటారు. ఈ సంతకం ఫోర్జరీ దందాను సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. కూట మి నేతల అడ్డంకులు ఉన్న వెంబడించి వార్తా కథనలు ప్రచురించింది. దీనిపై స్పందించిన తహసీల్దార్ కళావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫోర్జరీ దందా బహిర్గతమైంది. ఇంటి దొంగలతో పాటు మరో ముగ్గురు రిమాండ్లోకి వెళ్లారు. పెరుమాళ్లకండ్రిగలో సమస్యలు కుప్పలు తెప్పలు తండ్రి పేరుతో పెరుమాళ్ల కండ్రిగకు వీఆర్ఏగా వ్యవహరిస్తున్న మోహన్ రెవెన్యూ అధికారులను గుప్పట్లో పెట్టుకుని చక్రం తిప్పాడనే ఆరోపణలున్నాయి. సర్వే నంబర్లను మార్చడం, సరిహద్దుల్లో హెచ్చు తగ్గులున్నాయని సమస్యలను సృష్టించి ఆదాయ వనరులు మార్చుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గ్రామ కంఠం భూములను తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించడం, ప్రభుత్వ భూములను కుటుంబసభ్యులు, బంధువుల పేరుతో పట్టాలిప్పించినటు్ల్ వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో పాటు తిమ్మసముద్రం, ప్రశాంత్నగర్, ఇరువారం ప్రాంతాల్లో తప్పుడు పత్రాలు సృష్టించి, పలు స్థలాలకు పట్టాలు ఇచ్చినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక్కొ పట్టాకు రూ. లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు వసూలు చేసినట్లు కార్యాలయ సిబ్బంది ఆరోపిస్తున్నారు. -
రెండు బైక్లు ఢీకొని ముగ్గురికి గాయాలు
చౌడేపల్లె: చౌడేపల్లె– తిరుపతి ప్రధాన రహదారిలోని ఆంజనేయస్వామి వద్ద ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో గురువారం ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. బెంగళూరుకు చెందిన వేణుగోపాల్ బెంగళూరు నుంచి సదుం మండలం తిమ్మానాయనపల్లెలోని బంధువుల ఇంటికి బయలు దేరాడు. ఇదే మార్గంలో లద్దిగం గ్రామానికి చెందిన రెడ్డెప్ప, షఫీ మరొక బైక్లో సదుం నుంచి చౌడేపల్లె వైపునకు వస్తుండగా బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గరికి తీవ్ర గాయాలయ్యాయి. 108కు సమాచారం ఇచ్చినా వాహనం ఆలస్యంగా రావడంతో కడియాల మహేష్బాబు ప్రథమి చికిత్స చేయించి వాహనంలోకి ఎక్కించే చర్యలు తీసుకున్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పంటకు రక్ష.. భక్షకులకు శిక్ష
ఓ రైతు వినూత్న ఆలోచనతో పంటకు రక్షణ కలగగా, దాన్ని తినివేయడానికి వచ్చే పక్షులు, వానరాలకు శిక్షగా మారింది.– 10లో●దమ్ముంటే గోశాలకు అనుమతించాలి టీడీపీ అధ్యక్షుడు ఎక్కడో కూర్చొని సవాల్ విసరడం కాదని, దమ్ముంటే సవాల్ను స్వీకరించిన భూమన కరుణాకరెడ్డిని గోశాలకు పిలిపించుకుని నిజాలు నిగ్గుతేల్చాలి. టీటీడీ నిర్లక్ష్యం లేకుంటే మమ్మల్ని ఎందుకు గోశాలకు రానివ్వలేదు. చంద్రబాబుకు అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య. సనాతన ధర్మ పరిరక్షకుడైన పవన్కళ్యాన్ కూడా టీటీడీలో జరుగుతున్న అపచారాలను ఎందుకు ప్రశ్నించడం లేదు. తప్పులను సరిదిద్దుకోకుండా తిరిగి వైఎస్సార్సీపీ నాయకులతో పాటు జగనన్నపై ఎదురుదాడులకు దిగడం సిగ్గుచేటు. – ఆర్కే.రోజా, మాజీ మంత్రి స్వామితోనే రాజకీయమా బాబు? సాక్ష్యాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామితో చంద్రబాబు చేసిన రాజకీయం కార ణంగానే తిరుమలలో ఇ న్ని అపచారాలు జరగుతున్నాయి. శ్రీవారి లడ్డూ లో ఆవు, పంది కొవ్వు కలిసిందని ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టు చంద్రబాబుకు మొట్టిక్కాయలు వేసింది. అయినప్పటికీ చంద్రబాబుకు బుద్ధి రాలేదు. ఇప్పుడు గోశాలలో గోవులు మృతి చెందితే ఒక్క ఆవు కూడా చనిపోలేదని అబద్ధాలు చెబు తున్నారు. – కే.నారాయణస్వామి, మాజీ డిప్యూటీ సీఎం వందకుపైగా గోవులు మృతి గత పది నెలలుగా టీటీడీ గోశాలలో వందకు పైగా గోవులు మృతి చెందాయి. దీనిపై టీడీపీ అధ్యక్షుడు సవాల్ విసిరి నిజాలు నిగ్గు తేల్చకుండా అడ్డుకోవడం దారుణం. ఆయన సవాల్ను తమ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి స్వీకరించి గోశాలకు బయలు దేరితే పోలీసులచేత అడ్డుకోవడం ఏంటి?. సవాల్ను ఎదుర్కొనే దమ్ములేదా?. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది. తప్పిదాలను సరిదిద్దుకునే పరిస్థితి కనిపించడంలేదు. – భూమన అభినయ్రెడ్డి, తిరుపతి నియోజకవర్గ సమన్వకర్త హిందువుల మనోభావాలతో ఆటలా? హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం, టీటీడీ వ్యవహరిస్తోంది. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని తప్పులు చేస్తున్నారు తప్ప వాటిని సరిదిద్దుకోవడంలేదు. గోశాలలో గోవుల మృతిపై సీఎం చంద్రబాబుతో పాటు టీటీడీ చైర్మన్, ఈవో, స్థానిక ఎమ్మెల్యేలు వారికి తోచినట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. రాజకీయాలు మానుకుని గోశాలలో గోవుల మృతిపై నిజాలు అందరికీ తెలియజేయాలి. – చెవిరెడ్డి మోహిత్రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ సమన్వకర్త -
2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
ఏర్పేడు(రేణిగుంట): 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే అవకాశం ఉందని 16వ ఆర్థిక సంఘం చైర్మన్, తొలి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డా.అరవింద్ పనగారియా అన్నారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీని ఆయన గురువారం సందర్శించారు. ‘భారతదేశం గ్లోబల్ ఎకానమీలో తదుపరి దశాబ్దం’ అనే అంశంపై ఆయన ఐఐటీ హ్యూమానిటీస్ – సోషల్ సైన్సెస్ విభాగం నిర్వహించిన సమావేశంలో పాల్గొని, ప్రసంగించారు. ఆయనకు ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కెఎన్.సత్యనారాయణ స్వాగతం పలికి, మూడో జనరేషన్ ఐఐటీగా తిరుపతి ఐఐటీ ప్రస్థానం గురించి, పదేళ్లలో ఐఐటీ సాధించిన ప్రగతిని గురించి ఆయనకు వివరించారు. 16వ ఆర్థిక సంఘం సభ్యులు, ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ మనోజ్ పాండా, ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఈ సమావేశంలో పాల్గొని, ప్రసంగించారు. ప్రొఫెసర్ అరవింద్ పనగరియా మాట్లాడుతూ రెండు దశాబ్దాలలో భారత్ ఎన్నో సంక్షోభాలను అధిగమించి 8–9 శాతం వృద్ధి రేటు సాధించినట్టు వెల్లడించారు. అటల్ సేతు, కొత్త పార్లమెంట్ భవనం వంటి ప్రాజెక్టులు దేశ సామర్థ్యాన్ని చూపిస్తున్నాయని అన్నారు. రాబోయే దశాబ్దంలో భారతదేశంలో 9–10 ట్రిలియన్ ఎకానమీగా మారే అవకాశం ఉందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ తిరుపతి ఐఐటీలో మూడో వంతు మంది విద్యార్థులు పీహెచ్డీ ప్రోగ్రామ్లలో ఉన్నారని, అధ్యాపకులు 200మందికి పైగా పరిశోధన ప్రాజెక్టులలో పాల్గొంటున్నారని తెలిపారు. -
సిండికేట్.. అ‘ధర’హో!
హెచరీల సిండికేట్తో చికెన్ ధర కొండెక్కి కూర్చుంది. ప్రాంతం, సీజన్ల వారీగా రేట్లు పెంచుతున్నాయి.శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025గోశాలకు వెళ్లకుండా భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఇతర నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు (ఇన్సెట్) ఎంపీ గురుమూర్తితో కూటమి నేతల వాగ్వాదంఆర్టీసీలో టెండర్ల ఆహ్వానం చిత్తూరు రూరల్ (కాణిపాకం):చిత్తూరు జిల్లాలోని ఆర్టీసీ పరిధిలో ఉన్న వివిధ షాపుల నిర్వహణకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డీపీటీఓ జితేంద్రనాథ్రెడ్డి తెలిపారు. ఆసక్తి గల వారు ఈనెల 24వ తేదీ లోపు ఆయా డిపోల పరిధిలో టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. చిత్తూరు నగరం ఆర్టీసీ బస్టాండ్లోని డీపీటీఓ కార్యాలయంలో 25వ తేదీ టెండర్ల ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు www.aprrtc.ap.gov.inలో చూ సుకోవచ్చని పేర్కొన్నారు. ఒకటో తరగతిలో అడ్మిషన్లకు ఆన్లైన్ దరఖాస్తులు చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో అడ్మిషన్లకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ వరలక్ష్మి తెలిపారు. గురువారం డీఈఓ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 2025–26 విద్యాసంవత్సరంలో ఒకటో తరగతి అడ్మిషన్ల కు ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఐబీ, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్లు అమ లు చేయాలన్నారు. ఆయా యాజమాన్యాల్లో ఒకటో తరగతిలో విద్యనభ్యసించేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 28 నుంచి మే 15వ తేదీలోపు www.cre.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ కోరారు. వెబ్సైట్లో ఏకీకృత సీనియారిటీ జాబితాచిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్అసిస్టెంట్ల ఏకీకృత సీనియారిటీ జాబితాను వెబ్సైట్లో పొందుపరిచినట్లు డీఈ ఓ వరలక్ష్మి తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. స్కూల్ అసిస్టెంట్ కేడర్ నుంచి హెచ్ఎం కేడర్ ఉద్యోగోన్నతికి మెరిట్ ప్రకారం సిద్ధం చేసిన ఏకీకృత సీనియారిటీ జాబితాను ఈ నెల 17వ తేదీన విడుదల చేశామన్నారు. ఈ జాబితాను స్కూల్ అసిస్టెంట్లు సరిచూసుకోవాలన్నారు. ఏవైనా అభ్యంతరాలున్నట్లైతే తగు ఆధారాలతో ఈ నెల 20 వ తేదీలోపు డీఈఓ కార్యాలయంలో అందజేయాలన్నారు. గడువు తేదీ తర్వాత వచ్చే అభ్యంతరాలను స్వీకరించబడవని డీఈఓ వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 13 కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ టీబీసీ వద్దకు చేరింది. బుధవా రం అర్ధరాత్రి వరకు 70,372 మంది స్వామివారిని దర్శించుకోగా 24,463 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.25 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. శ్రీవారికి నాణ్యమైన సేవలు తిరుపతి కల్చరల్: శ్రీవారి భక్తుల సేవ నిరంతరం అని, మరింత నాణ్యమైన సేవలు అందిస్తూ శ్రీవా రి అనుగ్రహానికి పాత్రులు కావాలని ఏపీ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుల్ల జోగేశ్వరరావు సూచించారు. పద్మావతి అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ఏపీ అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్, సభ్యులు, టీటీడీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జోగేశ్వరరావు మాట్లాడుతూ అంచనాల కమిటీ చేసిన పలు సూచలను పరిగణనలోకి తీ సుకుని మరింత నాణ్యంగా సేవలు అందించాల న్నారు. వసతి గదుల నిర్వహణపై నిత్యం పర్యవేక్షణ ఉండాలని సభ్యులు సూచించారు. స్వామి వారి కీర్తనలు, గోవిందనామావళిని రాత్రి 10 గంటల వరకు వినిపించేలా చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. టీటీడీ ఈఓ శ్యామలరావు సమాధానం ఇస్తూ ఇప్పటికే ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. తిరుమలలో అందిస్తున్న సేవలపై శాఖల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీటీడీ అదనపు ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరి, ఏపీ అంచనాల కమిటీ సభ్యులకు వివరించారు. ఏపీ అంచనాల కమిటీ సభ్యులు భూమా అఖిలప్రియ, నిమ్మక జయకృష్ణ, వెంకటరాజు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీటీడీ గోశాలలో గోవుల మృతిపై లెక్కతేలకుండా కూటమి నేతలు అడ్డుకట్టకు యత్నించారు. తప్పులు కప్పిపుచ్చేందుకు అధికార మదంతో రెచ్చిపోయారు. కుట్రపూరితంగా సవాల్ విసిరి రెచ్చగొట్టారు. ఆపై పోలీసులను రంగంలోకి దింపి వైఎస్సార్సీపీ నాయకులు గోశాలకు వెళ్లకుండా నిర్బంధకాండకు పూనుకున్నారు. ఈ ఘటన గురువారం తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తప్పుడు ప్రకటనలు..కప్పిపుచ్చే యత్నాలు టీటీడీ గోశాలలో వరుసగా గోవులు మృత్యువాత పడుతున్నాయంటూ ఇటీవల వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి సంచలన విషయాలు తెరపైకి తెచ్చారు. నాటి నుంచి కూటమి నేతలు ఆ తప్పుని కప్పిపుచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. మొదట తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ పరస్పర విరుద్ధ ప్రకటనలకు దిగారు. 40 గోవులు మృతి చెందాయని ఒకరంటే.. కాదుకాదు 20 నుంచి 22 గోవులు మాత్రమే మృతి చెందాయని ఇంకొకరు చెప్పుకొచ్చారు. మరో వైపు టీటీడీ ఏకంగా ఈఓ మీడియా సమక్షంలోనే గత మూడు నెలల కాలంలో 43 గోవులు మృతి చెందాయని కుండబద్ధలు కొట్టేశారు. మొదటి రోజు గోవులు చనిపోలేదని ప్రకటన చేసి.. మరుసటి రోజు గోవులు మరణించాయని ప్రకటన చేయడాన్ని కూటమి శ్రేణులే తీవ్రంగా తప్పుపడుతున్నారు. సవాల్ విసిరి..నిజాలు దాచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయారు. టీటీడీ గోశాలలో గోవులు మృతిచెంది ఉంటే నిరూపించాలంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డికి సవాల్ విసిరారు. దీనిపై భూమన కరుణాకరరెడ్డి స్పందించారు. గురువారం ఉదయం 10గంటలకు టీటీడీ గోశాలకు వస్తాను అని ప్రకటన చేయగా.. పల్లా రమ్మని ఆహ్వానించారు. తీరా పల్లా శ్రీనివాసరావు రాకపోగా.. కూటమి నేతలను గుంపుగా గోశాలకి పంపించారు. వైఎస్సార్సీపీ నాయకులను గోశాలకు వెళ్లకుండా అడ్డుకట్టకు తెరలేపారు. బుధవారం అర్ధరాత్రి నుంచి కూటమి నేతలు ఆడిన నాటకాలు చూసి స్థానికులు నవ్వుకుంటున్నారు. – 10లో– 10లోన్యూస్రీల్కూటమి నేతలు కపట నాటకాలకు తెరదీశారు. జరిగిన తప్పుని సరిదిద్దాల్సింది పోయి బుకాయింపులకు దిగారు. టీటీడీ గోశాలలో గోవుల మృత్యుఘోషను ప్రపంచానికి వినిపించకుండా.. కళేబరాలు కనిపించకుండా చేయాలని విశ్వప్రయత్నాలు చేశారు. చివరకు సవాల్ విసిరి నిజాలు నిగ్గుతేలుతాయని భయపడిపోయారు. పోలీసులను రంగంలోకి దింపి ఎక్కడికక్కడ అడ్డుకుంటూ చెలరేగిపోయారు. వీరి నాటకాలు చూసిన జనాలు ఔరా..? అంటూ ముక్కున వేలేసుకున్నారు. గోసంరక్షణను గాలికొదిలేసి ఇలా బరితెగించడం ఎంతవరకు కరెక్ట్ అని ఎదురుదాడికి దిగారు. ఈ ఘటన గురువారం తిరుపతిలో చర్చనీయాంశంగా మారింది. టీటీడీ గోశాల ఘటనపై హైడ్రామా సవాల్ విసిరి స్వీకరించకుండా అడ్డగింపులు వైఎస్సార్సీపీ నేతలు వెళ్లకుండా పోలీసుల నిర్బంధం నిజాలు నిగ్గుతేలకుండా ఇదేం పని అంటున్న స్థానికులు ఇదేనా సనాతన ధర్మం తామే సనాతన ధర్మానికి ప్రతినిధులమని, హిందువులు, గోమాతలంటే భక్తి అని చెప్పుకునే కూటమి నేతలు.. టీటీడీ గోశాలలో ఉన్న పవిత్రమైన శ్రీవేణుగోపాలస్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో చెప్పులు ధరించి తిరిగారు. ఆలయం అరుగుపై చెప్పులతోనే నిల్చొని ఫొటోలకు ఫోజులిచ్చారు. దీనిపై కూటమి శ్రేణులే ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. నిజాలు నిగ్గుతేల్చేందుకు సిద్ధం తిరుపతి మంగళం : టీటీడీ గోశాలలో గోవుల మృతిపై టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్రావు విసిరిన సవాల్ను తమ పార్టీ జిల్లా అధ్యక్షులు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్వీకరించి గోశాలకు వస్తామంటే పోలీసులచేత అడ్డుకోవడం ఏంటని మాజీ మంత్రులు ధ్వజమెత్తారు. తిరుపతి పద్మావతీపురంలో పార్టీ క్యాంప్ కార్యాలయం నుంచి గురువారం గోశాలకు వెళ్లేందుకు బయలుదేరిన భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, నియోజకవర్గ సమన్వయకర్తలు భూమన అభినయ్రెడ్డి, చెవిరెడ్డి మోహిత్రెడ్డి, నూకతోట రాజేష్ను పోలీసులచేత ఎందుకు నిర్బంధించారని ప్రశ్నించారు. -
పుంగనూరు అభివృద్ధిని ఓర్వలేకే విమర్శలు
● ఒక నియోజకవర్గాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ● జెడ్పీలో శాసనసభ అంచనాల కమిటీ సమావేశం ● కూటమి ఎమ్మెల్యేలకు చురకలంటించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ● పలు శాఖల అధికారులతో సమీక్షించిన కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు చిత్తూరు కలెక్టరేట్ : ప్రజలకు చేయాల్సిన, చేసిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించేందుకు శాసనసభ అంచనాల కమిటీ బుధవారం సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఈ సమావేశం నిర్వహించారు. సమావేశం నియమ నిబంధనల ప్రకారం సమీక్ష నిర్వహించాల్సి ఉండగా కూటమి ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగా పుంగనూరు నియోజకవర్గంపై అక్కసుతో ప్రసంగించారు. పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ఓర్వలేక సూటిపోటి మాటలు గుప్పించారు. కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలకు కమిటీ సభ్యురాలు ఎమ్మెల్సీ కళ్యాణి ధీటుగా సమాధానం ఇచ్చారు. పుంగనూరు నియోజకవర్గంలో ఎందుకు అంత నిధులు ఖర్చు పెట్టారని, మిగిలిన నియోజకవర్గాల్లో ఎన్ని పనులు చేశారని ఆరా తీశారు. ఇందుకు ఎమ్మెల్సీ కళ్యాణి స్పందిస్తూ.. ఇది జిల్లా సమీక్ష అని, ప్రత్యేకంగా ఒక నియోజకవర్గాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ధీటుగా బదులిచ్చారు. నియోజకవర్గం పరిస్థితులను బట్టి పనులు మంజూరు చేస్తారని, కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు వెంటపడి పనులు చేసుకోవడం సహజమన్నారు. గత పాలనలో జరిగిన అభివృద్ధిని ఓర్వలేక ఇలా చేయడం సబబు కాదన్నారు. అలాగైతే గత పది సంవత్సరాల నివేదికలను సిద్ధం చేసి సమీక్ష నిర్వహించాలన్నారు. అలా చేస్తే ఏ ప్రభుత్వం పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో తెలుస్తుందని చురకలంటించారు. శాఖల వారిగా ఖర్చుల వివరాలు సరిగ్గా లేవు.. జిల్లాలో శాఖల వారిగా చేసిన ఖర్చుల వివరాలు సరిగ్గా లేవని శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఖర్చు చేసిన పనులను విభజించి ఎంత మొత్తం ఖర్చు చేశారో నివేదికలు సిద్ధం చేసి కమిటీకి పంపాలన్నారు. జిల్లాలో శాసనసభ అంచనాల కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. తాగునీటి పనులకు ప్రాధాన్యం జిల్లా పరిషత్ నిధులతో తాగునీటి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఎక్కువగా మామిడి, టమాట, పూలసాగు, ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఏరియా, సీహెచ్సీ, పీహెచ్సీలలో ప్రస్తుతం కేటాయిస్తున్న నిధులను పెంచాలని చెప్పారు. మిషన్ వాత్సల్య పథకంలో నగదు మొత్తాన్ని పెంచాలన్నారు. సమీక్షలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్్ , శాసనసభ అంచనాల కమిటీ డిప్యూటీ సెక్రటరీ రాజకుమార్, డీఆర్వో మోహన్ కుమార్, జిల్లా అధికారులు సత్యనారాయణ, చంద్ర శేఖర్ రెడ్డి, విజయ్ కుమార్, జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, వరలక్ష్మి, వెంకటరమణ, శ్రీదేవి, చిన్నారెడ్డి, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే ప్రసంగంపై విమర్శలు జిల్లాలో శాసనసభ అంచనాల కమిటీ సమావేశం నిర్వహణలో స్టేజీ పై కమిటీ సభ్యులతో పాటు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కూర్చుని ప్రసంగించడం విమర్శలకు దారితీసింది. శాసనసభ అంచనాల కమిటీలో నిబంధనల ప్రకారం ప్రభుత్వం సభ్యులను నియమించింది. కమిటీలో ఉన్న సభ్యులు మాత్రమే స్టేజీ పై కూర్చుని సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. అయితే చిత్తూరు ఎమ్మెల్యే కమిటీ సభ్యుడు కానప్పటికీ స్టేజీ పై కూర్చుని ప్రసంగించడం ఏమిటని పలు శాఖల అధికారులు గుసగుసలాడారు. సభ్యుల ప్రసంగం ఇలా... కమిటీ సభ్యులు పార్థసారథి వాల్మీకి మాట్లాడుతూ.. జిల్లా పరిషత్ నిధులతో కేటాయించిన నిధులలో తాగునీరు, విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ.. అధికారులు సమీక్షకు సంబంధించి అందజేసే నివేదికలను పూర్తి సమాచారంతో ఇవ్వాలన్నారు. వ్యవసాయశాఖకు సంబంధించి నిధులు కేటాయింపులను విభాగాల వారిగా నివేదికను అందజేయాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో అమలయ్యే పథకాల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన వివరాల నివేదికలను సమర్పించాలని పాసిం సునీల్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాము, కుక్కకాటుకు మందులతో పాటు అవసరమైన ఇతర మందులను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని వరాహ వెంకట సూర్యనారాయణ రాజు కోరారు. శాసనసభ అంచనాల కమిటీ సమీక్షలో వివిధ శాఖలకు కేటాయించిన నిధులు ఖర్చు చేసిన అంశాలపై గత పదేళ్ల కాల వ్యవధిలో సమీక్షించేందుకు అవకాశం ఉందని ఎమ్మెల్సీ తెలిపారు. ఫొక్సో కేసుల్లోని బాధితులకు వారి పిల్లల సంరక్షణ అంశాలపై ఐసీడీఎస్ అధికారులు నివేదికలు సమర్పించాలని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పేర్కొన్నారు. -
వాహనం ఢీకొని జింక మృతి
బంగారుపాళెం : మండలంలోని నలగాంపల్లె వద్ద బుధవారం రాత్రి చైన్నె–బెంగళూరు జాతీయ రహదారి దాటుతున్న జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందింది. సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి జాతీయ రహదారిని దాటే క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో జింక తీవ్రంగా గాయపడి మృతి చెందింది. స్థానికులు జింక మృతి సమాచారాన్ని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన జింకను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించిన తరువాత కాల్చివేయనున్నట్లు తెలిపారు. -
సమస్యల పరిష్కారానికి రూ.30 లక్షల నిధులు
కుప్పం : కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు సామగుట్టపల్లెలోని పలు సమస్యల పరిష్కారం కోసం కడా పీడీ వికాస్ మరమ్మత్ రూ. 30 లక్షలు మంజూరు చేశారు. బుధవారం రెండో వార్డులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా యలాజనూరు, చీగలపల్లి, సామగుట్టపల్లి గ్రామస్తులు ప్రధానంగా డ్రైనేజీలు, పైపు లైన్లు ఏర్పాటు చేయాలని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పాటు పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారానికి గాను వెంటనే రూ.30 లక్షలు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్ర కటించారు. ప్రస్తుతం వేసవి సందర్భంగా తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, నాయకులు పాల్గొన్నారు. కంటైనర్లో అగ్నిప్రమాదం కుప్పం : కుప్పం మీదుగా కోల్కతాకు వెళ్తున్న కంటైనర్లో బుధవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగి ప్రమాదానికి గురైంది. పాల పదార్థాలు తీసుకుని కోల్కతా వెళ్తున్న ఏసీ కంటైనర్ పట్టణం బైపాసు రోడ్డు విజలాపురం సర్కిల్ వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. అప్పటికే రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. మిగిలిన రూ.10 లక్షల పదార్థాలను మంటల నుంచి కాపాడారు. కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్ఎస్యూలో యూజీసీ బృందం పర్యటన తిరుపతి సిటీ : జాతీయ సంస్కృత వర్సిటీలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రాజభాషా సమితి బృందం బుధవారం విస్తృత పర్యటన చేపట్టింది. ఇందులో భాగంగా వర్సిటీ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, అధికారులతో బృందం సభ్యులు డాక్టర్ కిశోర్ కుమార్, వీకే సుదర్శన దేవి సమావేశమయ్యారు. వర్సిటీలో రాజభాషగా ఉన్న హిందీ భాషను కార్యాలయ ఆదేశాలలో ఎంత వరకు అమలు చేస్తున్నారనే విషయంపై ఆరా తీశారు. అనంతరం బృందం సభ్యులు మాట్లాడుతూ వర్సిటీలో రాజభాష హిందీ అమలు తీరు సంతృప్తి కరంగా ఉందన్నారు. హిందీ భాషను వర్సిటీలో మరింత విస్తృతం చేసేందుకు అధికారులు, అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. అకడమిక్ డీన్ రజనీకాంత శుక్లా, అధికారులు పాల్గొన్నారు. -
ఇస్రో ఆధ్వర్యంలో ఆర్ఎల్వీని అభివృద్ధి
సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆర్బిటల్ రీ–ఎంట్రీ ఎక్స్పరిమెంట్ డిప్లాయిబుల్ లాండింగ్ గేర్(ఆర్ఎల్వీ)ను అభివృద్ధి చేస్తోంది. ఇస్రో చైర్మన్ డాక్టర్ వీ నారాయణన్, విక్రమ్ సారాభాయ్ స్సేస్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్, షార్ డైరెక్టర్ ఏ రాజరాజన్, ఐఐఎస్యూ డైరెక్టర్ పద్మకుమార్ సమక్షంలోని ల్యాండింగ్ గేర్ డ్రాప్ టెస్ సౌకర్యాన్ని ప్రారంభించారు. విమానం తరహాలో రెక్కలు కలిగిన పునర్వినియోగ లాంచింగ్ వెహికల్ పుష్పక్ కోసం డిప్లాయిబుల్ ల్యాండింగ్ గేర్ సిస్టం పరీక్ష అర్హత కోసం తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ)లో అత్యాధునిక ల్యాండింగ్ గేర్ డ్రాప్ట్ టెస్ట్ ఫెసిలిటీని ప్రారంభించారు. అయితే పుష్పక్ వాహనం ఆరోహణ క్రమంలో కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. కొన్ని కక్ష్యల తరువాత పుష్పక్ వాతావరణంలోకి ప్రవేశించి డిప్లాయిబుల్ ల్యాండింగ్ గేర్ సిస్టంను ఉపయోగించి రన్వేపై ల్యాండ్ అవుతుంది. ల్యాండింగ్ గేర్ డ్రాప్ సౌకర్యానికి టెలిస్కొపిక్, ఆర్టిక్యులేటెడ్, సెమీ ఆర్టిక్యులేటెడ్ వంటి వివిధ రకాల ల్యాండింగ్ గేర్లను పరీక్షించే సామర్థ్యాన్ని కలిగి వుంటుంది. తారు, కాంక్రీట్, పొడి, తడి, మంచుతో నిండిన ఉపరితలాల వంటి విభిన్న రన్వేలపై ల్యాండింగ్ చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉండేలా దీన్ని రూపొందిస్తున్నారు. అయితే భవిష్యత్తులో చంద్రుడిపై వ్యోమగాములను పంపి, తిరిగి తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగానే ఈ ప్రయోగాత్మక పరీక్షలను చేస్తున్నామని కూడా ఇస్రో తెలియజేసింది. అధునాతనమై ఆర్ఎల్వీలు, విమాన సాంకేతికతల అభివృద్ధి అర్హతను వేగవంతం చేసే సామర్థ్యాన్ని ఇస్రో కలిగి వుంది. -
టీచర్ల సీనియారిటీ జాబితా పూర్తికి చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : పాఠశాల విద్యాశాఖ కార్యకలాపాలన్నీ ఒకే యాప్లో నిర్వహించడం జరుగుతుందని వైఎస్సార్ కడప జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్ అన్నారు. బుధవారం ఆయన డీఈవో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో పలు అంశాలు వెల్లడించారు. రాష్ట్ర విద్యాశాఖ, టీచర్ల కార్యకలాపాలకు లీప్ (లెర్నింగ్ ఎక్సెలెన్స్ ఏపీ ) అనే యాప్ ను ఆవిష్కరించినట్లు తెలిపారు. ఈ యాప్ బుధవారం నుంచే అందుబాటులోకి వచ్చిందన్నారు. చిత్తూరు జిల్లాలో 8416 మంది టీచర్లు యాప్ ను డౌన్లోడ్ చేసుకోగా మిగిలిన 08 మంది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉందన్నారు. టీచర్ల సీనియారిటీ జాబితా పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ఉద్యోగోన్నతుల సీనియారిటీ జాబితాల్లో ఎస్జీటీ కేడర్ నుంచి స్కూల్ అసిస్టెంట్ కు 30, స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎంకు 38 మొత్తం 68 అభ్యంతరాలు వచ్చాయన్నారు. 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పై తరగతుల ప్రమోషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఆర్జేడీ హెచ్చరించారు. కార్యక్రమంలో డీఈవో వరలక్ష్మి, ఏపీసీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఒకే యాప్లో విద్యాశాఖ కార్యకలాపాలు డీఈవో కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆర్జేడీ -
ఆటో బోల్తా : విద్యార్థులకు గాయాలు
బంగారుపాళెం : మండలంలోని పాలేరు సమీపంలో బుధవారం విద్యార్థులను తరలిస్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని పాలేరు, పాలమాకులపల్లెకు చెందిన పలువురు విద్యార్థులు బంగారుపాళెంలోని ప్రభుత్వ పాఠశాల, తగ్గువారిపల్లెలోని భవిత పాఠశాల, స్థానిక చైతన్య పాఠశాలలో చదువుకుంటున్నారు. మధ్యాహ్నం పాఠశాల ముగిసిన తరువాత రోజూ వెళ్లే ఆటోలో 10 మంది విద్యార్థులు బంగారుపాళెం నుంచి ఆటోలో కొత్తపల్లె సర్వీసు రోడ్డు మీదుగా స్వగ్రామాలకు బయలుదేరారు. పాలేరు అండర్ బ్రిడ్జికి కిలో మీటరు దూరంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడగా పాలమాకులపల్లెకు చెందిన ప్రకాష్ కుమారుడు యువతేజ, పాలేరుకు చెందిన జీవన్ కుమారై సౌమ్య, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
సారూ.. నదిలో ఇసుక తవ్వకాలు ఆపండి
నగరి : నదిలో ఇసుక తవ్వకాలు ఆపి .. మాపై దయచూపండి అంటూ మండలంలోని తెరణి దళితవాడకు చెందినవారు ఆర్డీఓ కార్యాలయంలో ఏవో, తహసీల్దార్ ధనంజయులుకు వినతిపత్రం అందించారు. కుశస్థలి నదిలో ఇసుక విచ్చలవిడిగా తోడేస్తున్నారని, శ్మశానాన్ని వదలడం లేదని వాపోయారు. పూర్తి స్థాయిలో ఇసుక తోడేయడంతో నదిలో ఇసుక పూర్తిగా అయిపోయి రాళ్లు తేలాయని, డైయింగ్ నీరు నదిలో వదిలేయడంతో అడుగులో పేరుకుపోయిన రసాయన వ్యర్థాలు, ఉప్పు బయటపడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుకాసురులు ఉచిత ఇసుక పేరుతో ఊడేస్తున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయిదు మండలాలకు చెందిన వందల ట్రాక్టర్లు తెరణి ప్రాంతంలో కుశస్థలి నదిలోనే ఉన్నాయన్నారు. ఇలాగైతే మా మనుగడే ప్రశ్నార్థం అవుతుందని సమస్యను పరిష్కరించాలని అధికారులను దళితవాడ కాలనీ వాసులు కోరారు. -
బోయకొండలో తమ్ముళ్ల తన్నులాట
● టీడీపీ ఇన్చార్జి చల్లాకు స్వాగతం పలకడంలో వర్గపోరు ● టీడీపీ వర్గీయుల పరస్పర దాడులు చౌడేపల్లె : తెలుగు తమ్ముళ్లు పరస్పరం కొట్టుకొన్న ఘటన బుధవారం బోయకొండ వద్ద చోటు చేసుకుంది. బోయకొండ గంగమ్మ దర్శనం కోసం వచ్చే యాత్రికుల కోసం విజయవాడకు చెందిన దాత సౌమినిరెడ్డి సహకారంతో ఆర్ఓఆర్ ప్లాంటును ఏర్పాటు చేశారు. ఈ ప్లాంటును టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి ప్రారంభోత్సవానికి బోయకొండకు వచ్చారు. టీడీపీ కన్వీనర్ శివప్పనాయుడు, రామకృష్ణ, మల్లికార్జుననాయుడు వర్గీయులు, టీడీపీ మండలాధ్యక్షుడు రమేష్రెడ్డి, బోయకొండ సుబ్బు ఇతర మండల నేతలు కలిసి చల్లాకు స్వాగతం పలికేందుకు ఎవరికి వారు వేర్వేరుగా స్వాగతం పలికి ప్రారంభోత్సవ కార్యక్రమ తంతు ముగించేశారు. కార్యక్రమం పూర్తి అయ్యాక ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి తిరుగు ప్రయాణమై వెళ్లిపోయారు. బోయకొండ –మదనపల్లె మార్గంలోని గల శివప్ప నాయుడు అతని అనుచరులతో కలిసి ఇంటికి కారులో కలిసి వెళ్తుండగా ఇరువర్గాల వారు పరస్పరం దాడులు చేసుకొన్నట్లు తెలిసింది. దీంతో టీడీపీలో వర్గపోరు బట్టబయలైంది. మాకు న్యాయం చేయండి : టీడీపీ ప్రభుత్వంలోనే మా పార్టీ నేతల నుంచి మాకు ప్రాణ హాని ఉంది..మాకు న్యాయం చేయండని టీడీపీ కన్వీనర్ శివప్ప నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి రామకృష్ణ బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. దౌర్జన్యాలను ప్రశ్నించినందుకే పార్టీ మండల అధ్యక్షుడు రమేష్రెడ్డి ప్రోత్సాహంతోనే బోయకొండ సుబ్బు అతని అనుచరులు, తమపై తమ పార్టీకి చెందిన నాయకులే వచ్చి పక్షిరాజపురం సమీపంలో కారును అడ్డగించి ధ్వంసం చేసి శివప్పనాయుడు, రామకృష్ణ, మల్లికార్జున నాయుడులపై దౌర్జన్యంగా దాడిచేసినట్లు ఆరోపించారు. -
ఫోర్జరీ ముఠా కటకటాలపాలు
● కొలిక్కి వచ్చిన తహసీల్దార్ సంతకంఫోర్జరీ కేసు ● ఆరుగురు నిందితుల అరెస్టు ● నిందితుల్లో ఇద్దరు రెవెన్యూ సిబ్బంది.. నలుగురు పరారీ చిత్తూరు అర్బన్ : తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి భూములను రిజిస్ట్రేషన్ చేస్తున్న ముఠా ఎట్టకేలకు కటకటాలపాయ్యింది. చిత్తూరు తహసీల్దా ర్ కార్యాలయంలో వీఆర్ఏలుగా చలామణి అవుతున్న పెరుమాల్ మోహన్(45), ఎం.రాజశేఖర్(32), ఫైనా న్స్ కంపెనీలో పనిచేస్తున్న జి.గౌతం(24), కె.జాన్సి (28), డాక్యుమెంట్ రైటర్ కె.గజేంద్ర కుమార్(52) అనే అయిదుగురు నిందితులను బుధవారం తాలూక పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి తహసీల్దార్, తహసీల్దార్ కార్యాలయ రాజముద్రలు, ఓ గ్రీన్ ఇంకు పెన్నును స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా కొందరు నకిలీ అధికారులు పలు రాజముద్రలు కలిగిన సీళ్లను ఉంచుకుని, తహసీల్దార్ సంతకాలను ఫోర్జరీ చేస్తున్నారనే విషయంపై ‘సాక్షి’ దినపత్రికలో ఈ ఏడాది జనవరి 4వ తేదీన ‘ఆగని ఫోర్జరీ దందా’ శీర్షికన కథనం ప్రచురితమయ్యింది. దీంతో అప్పటి తహసీల్దార్ కళావతి తన సంతకాలు ఫోర్జరీ అయ్యాయని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు కేసును ముందుకు వెళ్లనీయకుండా మిన్నకుండిపోయారు. అయితే దీనిపై ఎస్పీ మణికంఠ సీరియస్గా తీసుకుని, కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని తాలూక ఎస్ఐ మల్లికార్జునను ఆదేశించారు. అనంతరం కేసు దర్యాప్తు పట్టాలెక్కింది. తహసీల్దార్ సంతకాలు ఫోర్జరీచేసి, తిమ్మసముద్రం గ్రామంలోని భూమికి ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఈ పత్రం ద్వారా ఓ ప్రైవేటు ఫైనాన్స్లో భారీగా రుణం తీసుకోవాలన్నది నిందితుల పథకం. వచ్చే రుణంలో 20 శాతం తమకు ఇవ్వాలని జాన్సి, గౌతం ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో, ఇవి తప్పుడు ధ్రువీకరణ పత్రంగా సబ్–రిజిస్ట్రార్ గుర్తించారు. అనంతరం కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏలుగా చెలామణి అవుతున్న ఇద్దరితో పాటు ఓ డాక్యుమెంట్ రైటర్, ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఇంకా ఈ కేసులో నలుగురు పరారీలో ఉన్నారు. వాళ్లను సైతం త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఫోర్జరీ కేసులో ఇద్దరు వీఆర్ఏల సస్పెన్షన్ గతంలో పనిచేసిన తహసీల్దార్ కళావతి సంతకం పోర్జరీ కేసులో ఇద్దరు వీఆర్ఏలపై కేసు నమోదైందని, వారిని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. వారు తండ్రి పేరుతో పనిచేస్తుంటే వాళ్ల తండ్రులను బాధ్యులు చేస్తూ..విధుల నుంచి తొలగిస్తామన్నారు. ఇకపై తండ్రి పేర్లతో పనిచేస్తామంటే కుదరదని, అలా ఆరు నెలల వరకే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
● వక్ఫ్బిల్లు సవరణపై నిరసన ● సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ న్యాయపోరాటంపై హర్షం ● వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
చిత్తూరు కార్పొరేషన్ : వక్ఫ్బిల్లు చట్ట సవరణను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో న్యాయ పోరాటానికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్సీపీ మైనార్టీల ఆధ్వర్యంలో బుధవారం నగరంలో హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం సంతోషకరమని ముస్లింలు చెబుతున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ‘షుక్రియ జగన్ భయ్యా’ అంటూ నినాదాలు చేశారు. జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద పలువురు ముస్లింలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. మైనార్టీ నాయకులు చాంద్బాషా, నౌషద్, నవాజ్, అల్తాఫ్, చాపు, చామంతి, ఇమ్రాన్, అక్రం, ఖాదర్, షరీఫ్, సాదిక్, జలాలుద్దీన్, హుస్సేన్, అఫ్జల్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ●అణగదొక్కే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో వచ్చినప్పటి నుంచి ముస్లింలను అణగదొక్కాలని చూస్తోంది. ఎప్పుడు మా విషయంలో వారు వ్యతిరేకంగానే ఉంటున్నారు. అప్పట్లో ఎన్ఆర్సీ అంటూ వేధింపులకు గురిచేశారు. దేశంలోని 9.40 లక్షల ఎకరాల వక్ఫ్ భూములను కబ్జా చేయాలని కేంద్రం కుట్ర పన్నింది. టీడీపీ వారికి మద్దతు పలకడం అన్యాయం. – మహ్మద్షఫీ, న్యాయవాది, వైఎస్సార్సీపీ నాయకుడు ఆస్తులపై కన్నేశారు పూర్వీకులు దానం చేసిన భూములపై కేంద్రం తమ అధీనంలో తీసుకోవాలని చూడటం నేరం. ముస్లింలు అంటే బీజేపీకు నచ్చదు. కానీ వారి ఆస్తులపై కన్నేశారు. వక్ఫ్ బిల్లు సవరణకు టీడీపీ మద్దతు పలకడం ప్రజలను వంచించడమే.. బిల్లుకు టీడీపీ మద్దతు తెలుపకపోతే బాగుంటుందని ఆ పార్టీలోని ముస్లింలు ఆశించారు. – ఆను, కోఆప్షన్ సభ్యుడు ముస్లింలకు అండగా వైఎస్సార్సీపీ మొదటి నుంచి మైనార్టీల పక్షపాతిగా వైఎస్సార్సీపీ నిలుస్తోంది. జగనన్న మాకు మద్దతుగా సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయడం గొప్ప విషయం. వైఎస్సార్ పాలనలో ముస్లింలకు రిజర్వేషన్ అమలు చేశారు. దాంతో ఎంతో మంది చదువుకొని ఉద్యోగాలు సాధించారు. ఆయన వారసుడిగా జగనన్న నిలుస్తూ అండగా ఉంటున్నారు. – మస్తాన్ఖాన్, నియోజక వర్గ అధ్యక్షుడు, మైనార్టీ విభాగం వైఎస్సార్సీపీ రాజ్యాంగ విరుద్ధం కూటమి పాలనలో ముస్లిం అంటే విలువ లేకుండా పో యింది. వక్ఫ్ బిల్లు సవరణ పై సీఎం, డిప్యూటీ సీఎంలు బీజేపీతో వ్యతిరేకించలేదు. మసీదు, దర్గా, మదరాస, సందర్శించాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలా..? అదే విధంగా మరణిస్తే శ్మశానంలో పూడ్చటానికి వారి అంగీకారం కావాలా. వీటిని అందరూ వ్యతిరేకించాలి. – కౌసర్, కల్చరల్ విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు, వైఎస్సార్సీపీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్బిల్లు చట్ట సవరణను అడ్డగోలుగా చేయడంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ముస్లింలకు అండగా నిలిచేందుకు నడుంబిగించారు. ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వక్ఫ్బిల్లు చట్ట సవరణను సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టులో న్యాయపోరాటానికి దిగింది. ముస్లింల అభ్యంతరాలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా బీజేపీ ప్రభుత్వం ఏక పక్షంగా సవరణ చేయడం రాజ్యాంగ విరుద్ధమని విన్నవించింది. రాజ్యాంగాన్ని మార్పు చేయడం ముస్లింల హక్కులను కాలరాయడమే నినదించింది. వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులు కేంద్రం చేతుల్లోకి వెళ్లేందుకే చట్ట సవరణ చేశారని వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నో ఏళ్లుగా ఉన్న వక్ఫ్ ఆస్తులను లెక్కకట్టేందుకే అని చెప్పి ముస్లిం మనోభావాలను కేంద్రం దెబ్బతిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ముస్లింలకు అండగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు జిల్లాలోని ముస్లింలు ధన్యవాదాలు తెలిపారు. -
చట్టాలపై అవగాహన అవసరం
గంగాధర నెల్లూరు : రాజ్యాంగంలో ప్రజలకు కల్పించిన హక్కులు, చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని జిల్లా న్యాయ సేవాధికారి సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి పేర్కొన్నారు. మండలంలోని నాసంపల్లిలో బుధవారం న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా గిరిజనుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజనులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి భారతి మాట్లాడుతూ.. చట్టం, హక్కుల గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కుల, మత, ప్రాంతం, లింగ భేదం లేకుండా అందరూ చట్టం ముందు సమానులేనన్నారు. ముఖ్యంగా, బలహీన వర్గాలకు రాజ్యాంగం కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పించిందని తెలిపారు. వాటి గురించి తప్పకుండా తెలుసుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం గురించి చాలా మందికి తెలిసి ఉండవచ్చన్నారు. ఈ చట్టం వివక్ష , హింస నుంచి కాపాడుతుందని అన్నారు. ఏదైనా అన్యాయం జరిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే న్యాయస్థానాలు మీకు అండగా నిలబడుతాయని చెప్పారు. ఉచిత న్యాయ సహాయం పొందే అవకాశం ఉందని , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అర్హులైన వారికి ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తారని వీటిని వినియోగించుకోవాలని కోరారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎస్.మూర్తి , మండల స్థాయి అధికారులు, సర్పంచ్ నీలావతి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజలకు అండగా నిలబడదాం
నగరి : ప్రజలకు అండగా నిలబడి పార్టీని బలోపేతం చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వయిజర్ కమిటీ సభ్యులు ఆర్కే రోజా పేర్కొన్నారు. బుధవారం తన కార్యాలయం వద్ద మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులకు ఆమె దిశా నిర్దేశం చేశారు. పార్టీ ఇచ్చిన పదవిని బాధ్యతగా స్వీకరించి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలన్నారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బీడీ భాస్కర్, మున్సిపల్ పార్టీ ఉపాధ్యక్షుడు మునివేలు, ఏవీ పీతాంబరం, ప్రధాన కార్యదర్శులు శశికుమార్, తనికాచలం, నూర్ మహ్మద్, కార్యదర్శులు లోకనాథం, మేషాక్, ధనపాల్, చంద్రన్, షణ్ముగం, నాయకులు అయ్యప్ప, ఎల్లప్పరెడ్డి, మురుగ, ఆనంద్కుమార్, హమీద్, కన్నాయిరం, చంద్రబాబు, ఉమాపతి పాల్గొన్నారు. ఈనెల 20 వరకు రేషన్ పంపిణీ పొడిగింపు చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఈనెల 20వ తేదీ వరకు రేషన్ పంపిణీని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఎస్ఓ శంకరన్ తెలిపారు. ఇప్పటి వరకు 87 శాతం రేషన్ పంపిణీ జరిగిందన్నారు. మిగిలిన కార్డుదారులు రేషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో పంపిణీని ఈనెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి : ఎస్పీ
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని కమాండ్ కంట్రోల్ విభాగాన్ని ఎస్పీ మణికంఠ చందోలు బుధవారం పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, డయల్–112 పనితీరు విభాగం, ఫిర్యాదులపై ఎంత సమయంలో స్పందిస్తున్నారనే విషయాలను ఆయన తనిఖీ చేశారు. మహిళలు, పిల్లల సంరక్షణ కోసం వినియోగిస్తున్న ‘శక్తి’ యాప్లో ఫిర్యాదు వస్తే ఎలా స్పందిస్తున్నారు..? నగరంలోని ప్రధాన కూడళ్లల్లో ఏర్పాటు చేసిన కెమెరాల పర్యవేక్షణ..? పై ఆరా తీశారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుపై ఎప్పటికప్పుడు స్పందించాలని ఆదేశించారు. ఎస్పీ వెంట కమాండ్ కంట్రోల్ ఎస్ఐ సహదేవి, కమ్యూనికేషన్ ఎస్ఐ భరత్ ఉన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జడ్జీల బదిలీ చిత్తూరు అర్బన్ : చిత్తూరు ఉమ్మడి జిల్లాలోని పలు కోర్టుల్లో పనిచేస్తున్న న్యాయమూర్తులను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు బుధవారం ఉత్తర్వు లు జారీ చేసింది. చిత్తూరు అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఎస్పిడి.వెన్నెలను గుంటూరు జిల్లా రేపల్లెకు, ఈమె స్థానంలో పీలేరులో పనిచేస్తున్న కె.రవిను చిత్తూరుకు బదిలీ చేశారు. మదనపల్లె ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న డి.వెంకటేశ్వర్లును అనంతపురం జిల్లా హిందూపురానికి , ఈయన స్థానంలో కృష్ణా జిల్లా గన్నవరంలో పనిచేస్తున్న కె.జయలక్ష్మిను నియ మిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జలజీవన్ పనులను పరిశీలించిన కేంద్ర బృందం కార్వేటినగరం : కార్వేటినగరం మండలంలో జలజీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పనులను కేంద్ర బృందం బుధవారం పరిశీలించింది. ఈ సందర్భంగా కార్వేటినగరం దళితవాడలో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ను నీటిని పరిశీలించారు. జలజీవన్ మిషన్ కేంద్ర నిపుణులు అన్బ్జగన్ మాట్లాడుతూ.. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. మండల వ్యాప్తంగా చేపట్టిన పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఈఈ నరేంద్రకుమార్, డీఈ సతీష్ కుమార్, ఏఈ గిరిష్ కుమార్, సర్పంచ్ ధనంజయవర్మ, కార్యదర్శి నా గరత్నమ్మ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
స్వర్ణరథంపై వరసిద్ధుడి అభయం
● ఘనంగా సంకటహర చతుర్థి పూజలు కాణిపాకం : కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో బుధవారం సంకటహర చతుర్థి గణపతి వ్రతంను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చతుర్థి సందర్భంగా అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలకు సుగంధ పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లి ఆస్థాన మండపంలో కొలువుదీర్చారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి గణపతి వ్రతంను చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వ్రతంను ఆచరించారు. కార్యక్రమంలో ఈవో పెంచల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మాడ వీధుల్లో ఊరేగింపు స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి రాత్రి ఆలయ మాడ వీధులలో స్వర్ణ రథంపై విహరించారు. ఆలయ అధికారులు ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామి వారి స్వర్ణ రథంలో కొలువు దీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం స్వర్ణ రథం ఆలయ మాడ వీధులలో అభయమిస్తూ ఊరేగారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. -
● తాగి రోడ్డెక్కితే బాదుడే! ● డ్రంక్ అండ్ డ్రైవ్లో రూ.కోటి దాటిన జరిమానాలు ● జిల్లాలో ఏడాదిన్నర కాలంలో 1540 మందిపై కేసులు ● పట్టుబడిన వారిలో ఎక్కువ మంది యువతే ● ప్రజల ఆలోచనలు మారితేనే రోడ్డు ప్రమాదాల నివారణ ● మందుబాబులకు చుక్కలు చూపిస్తున్న పోలీసులు
చిత్తూరు అర్బన్ : మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారికి చిత్తూరు ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. పోలీసులు చూపించిన చుక్కల విలువ ప్రస్తుతం రూ.కోటి దాటింది. అవును.. డ్రంక్ డ్రైవ్లో పట్టుబడ్డ మందుబాబులకు న్యాయస్థానం విధించిన జరిమానా రూ.కోటి దాటడం ఓ సరికొత్త రికార్డును సృష్టించింది. సిఫార్సులు పట్టించుకోకుండా చిత్తూరు ట్రాఫిక్ పోలీసులు కొన్నాళ్లుగా ఒకటే లక్ష్యంతో పనిచేస్తున్నారు. తాగి రోడ్డుపైన వాహనం నడపకూడదు. పట్టుబడిన వ్యక్తి తమవాడేనని ఎవరు చెప్పినా వినకూడదని గట్టిగా అనుకున్నారు. అనుకున్న లక్ష్యాన్ని రోడ్డుపైనే ఏడాదిన్నరగా అమలు చేశారు. మద్యం తాగి స్కూటర్ నడపడం, కార్లు, లారీలు, ట్రాక్టర్లు ఇలా ఏ వాహనం నడిపినా మందుబాబులను బ్రీత్ ఎనలైజర్ ద్వారా చెక్ చేయడం.. తాగినట్లు తేలితే వాహనాన్ని అక్కడికక్కడే సీజ్ చేయడం చేస్తున్నారు. ఆపై వాహనం నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నారు. ఇలా ఏడాదిన్నర కాలంలో ఏకంగా 1540 మందిపై చిత్తూరు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసులు నమోదు చేశారు. వీళ్లను న్యాయస్థానంలో హాజరు పరచగా.. తొలుత రూ.2 వేలు ఉన్న జరిమానా ఇటీవల మోటారు వాహన యాక్టును సవరణ చేయడంతో రూ.10 వేలకు చేరింది. ఫలితంగా మద్యం తాగి వాహనం నడిపి పట్టుబడ్డ వాళ్లకు ఒక్కొక్కరికీ న్యాయస్థానం రూ.10 వేలు చొప్పున జరిమానాలు విధిస్తూ వస్తోంది. తాగి బండి నడిపిన వారి తాట తీస్తున్నారు జిల్లా పోలీసులు.. ఇలా పట్టుబడిన వారిలో ఎక్కువ మంది యువతే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఏడాదిన్నర కాలంలో జరిమానాలు ఏకంగా రూ. కోటి దాటాయంటే ఎంత విచ్ఛలవిడిగా తిరుగుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జరిమానాలతో పాటు జైలు శిక్ష విధించినా కేసుల సంఖ్య తగ్గడం లేదు. గతంలో కంటే ప్రస్తుతం జరిమానాలు రెట్టింపు చేసినా మందుబాబుల్లో మార్పు రావడం లేదు. ప్రతి ఒక్కరి ఆలోచనల్లో మార్పు వస్తేగానీ వీటిని కట్టడి చేయడం అంత సులువు కాదు. జైలు శిక్షలు కూడా.. ప్రస్తుతం అమల్లో ఉన్న మోటారు వాహన చట్టం ప్రకారం మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే మొదటిసారి కోర్టు రూ.10 వేల జరిమానా విధిస్తోంది. అదే వ్యక్తి రెండోసారి పట్టుబడితే రూ.15 వేల జరిమానా.. మూడేళ్ల వరకు జైలు శిక్ష కూడా విధిస్తారు. చిత్తూరులో ఇప్పటి వరకు 1540 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రుజువు కావడం ఏకంగా రూ.1,03,62,000 జరిమానాలు విధించారు. వీళ్లల్లో 32 మందికి ఒక్క రోజు నుంచి మూడు రోజుల వరకు జైలు శిక్షలు కూడా విధించారు. జరిమానాలు, జైలుశిక్షల విషయం పక్కన పెడితే.. రోడ్డు ప్రమాదాలకు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రధానం కారణం. వాహన చోదకుల్లో మార్పు వస్తే తప్ప ఈ తరహా కేసుల నమోదుకు విరామం లభించదు. మార్పు కోసమే.. మద్యం తాగి వాహనాలు నడిపేవాళ్లను కోర్టు ముందు ఉంచాలని, జరిమానా విధించాలని, జైలుకు పంపించాలన్నది మా లక్ష్యం కాదు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికే ఈ విషయంలో గట్టిగా పనిచేస్తున్నాం. రోజుకు సగటున ఆరు కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నాం. పట్టుబడుతున్న వారిలో 22–45 ఏళ్ల మధ్య వాళ్లే ఉక్కువగా ఉంటున్నారు. కొన్నిసార్లు మైనర్లు పట్టుబడుతున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఈ విషయంపై దృష్టి సారించాలి. – నిత్యబాబు, సీఐ, చిత్తూరు ట్రాఫిక్ -
నేడు జిల్లాకు అసెంబ్లీ పద్దుల కమిటీ రాక
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర అసెంబ్లీ పద్దుల కమిటీ బుధవారం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ పద్దుల కమిటీ చైర్మన్ జోగేశ్వరరావుతో పాటు 11 మంది సభ్యులు మంగళవారం చిత్తూరుకు వస్తారన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మధాహ్నం 2 గంటలకు సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్తారన్నారు. ఈ కమిటీ సభ్యులుగా ఎమ్మెల్యేలు భూమా అఖిల ప్రియ , బండారు సత్యానంద రావు, జయకృష్ణ, కందుల నారాయణ రెడ్డి, మద్దిపాటి వెంకట రాజు, పార్థసారథి వాల్మీకి, పాసిం సునీల్ కుమార్, ఏలూరి సాంబశివ రావు, ఎంఎల్సీలు పర్చూరి అశోక్ బాబు, డా.వెంకట సూర్య నారాయణ రాజు, కళ్యాణి విచ్చేస్తారని కలెక్టర్ వెల్లడించారు. వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించాలి చిత్తూరు కలెక్టరేట్ : నిర్భంధ వెట్టిచాకిరీ చట్టరీత్యా నేరమని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో నిర్బంధ వెట్టిచాకిరీ బారిన పడుతున్న కూలీలకు విముక్తి కలిగేంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. నిర్బంధ వెట్టిచాకిరీ విధానం పౌల్ట్రీ, పరిశ్రమలు, ఇటుకల తయారీ ప్రాంతాలలో చాలా వరకు అమలవుతుంటాయన్నారు. వెట్టిచాకిరీ వల్ల ఆర్థిక, శ్రమ దోపిడీతో ఇబ్బందులకు లోనవుతుంటారని తెలిపారు. అటువంటి వ్యక్తులను గుర్తించేందుకు ఆర్డీవో డివిజన్ స్థాయిలో తహసీల్దార్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్మిక శాఖ, డీఆర్డీఏ, డ్వామా, జెడ్పీ సీఈవో, తదితర అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు. నిర్భంధ కూలీలకు పునరావాసం కల్పించిన అనంతరం సంక్షేమ పథకాలతో ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం వెట్టిచాకిరీ, మానవ అక్రమ రవాణా తదితర అంశాలపై ముద్రించిన గోడపత్రికలు, కరపత్రికలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ఓంకార్, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, రోప్స్ సంస్థ చైర్మన్ ధనశేఖర్ పాల్గొన్నారు. -
విద్యార్థుల ట్యాబ్లు లాక్కున్న ఇన్చార్జ్ హెచ్ఎం
అప్రమత్తతతోనే అగ్నిప్రమాదాల నివారణ అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపకశాఖ అధికారి పెద్దిరెడ్డి తెలిపారు.సీనియారిటీ జాబితాలో అభ్యంతరాలు తెలపండిభూ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ భూసమస్యలపై వీఆర్ఓలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి పేర్కొన్నారు.బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025పది నెలలుగా అన్నీ అపచారాలే.. ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు పొందిన పవిత్ర పుణ్యక్షేత్రంలో గత 10 నెలలుగా అన్నీ అపచారాలే జరుగుతున్నాయి. శ్రీవారి క్షేత్రంలో మద్యం బాటి ళ్లు, బిర్యానీలు, మాంసం, మందుబాబుల వికృత చేష్టలు, పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించే యత్నం, డ్రోన్ కెమెరాల హల్చల్, పాపవినాశం తీర్థంలో బోట్ల విహారం, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో గోవుల మరణ మృదంగం, ముంతాజ్ హోటల్ అనుమతులు తదితర సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటిపై సాక్షాత్తు స్వామిజీలు మండిపడి, టీటీడీ, ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా ధర్నాలు చేసిన ఘటనలు సామాన్య భక్తులతో పాటు స్థానికులను కలవరపెట్టాయి. వీటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం, టీటీడీ అధికారులు లోపాలను ఎత్తి చూపుతున్న సామాన్యులపైనా, భక్తులపై కక్ష్య సాధింపు చర్యలు దిగడం దారుణమని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రపుణ్యక్షేత్రంలో జరిగే అపచారాలపై దృష్టి పెట్టకుండా రాజకీయ కోణంలో చూస్తూ అధికారులు వ్యవహరించడం సమజసం కాదంటూ స్థానికులు, భక్తులు, ప్రజాసంఘాలు, మేధావులు హితవు పలుకుతున్నారు. తిరుమలలో మద్యం మత్తులో వీరంగం చేస్తున్న యువకుడు(ఫైల్)అపచారాలకు అడ్డుకట్ట వేయలేరా? కొన్ని నెలలుగా తిరుమల పుణ్యక్షేత్రంలో జరుగుతున్న దారుణమైన ఘటనలకు టీటీడీ అధికారులు అడ్డుకట్ట వేయకపోవడం విచారకరం. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మద్యం, మాంసం, బహిరంగంగా దొరకడం అపచారం. తిరుమలలో అకతాయితీలు మద్యం సేవించి గొడవలు పడిన సంఘటన బాధించే అంశం. టీటీడీ గోశాలలో గోవుల మరణాలపై వస్తున్న వార్తలు గో ప్రేమికులు, శ్రీవారి భక్తులను మరింత క్షోభకు గురిచేశాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ చర్యలు చేపట్టాలి. లోపాలను ఎత్తి చూపడం భక్తుల బాధ్యతగా అధికారులు గుర్తించాలి. – తుమ్మ ఓంకార్, తిరుక్షేత్రాల రక్షణ సమతి అధ్యక్షులు, తిరుపతి వివరణ కాదు.. విచారణ జరపాలి టీటీడీ అధికారుల నిర్ల క్ష్యం కారణంగా గోశాల లో గోవులు అధిక సంఖ్య లో మరణించాయని వస్తు న్న ఆరోపణలపై టీటీడీ అధికారులు ప్రెస్ మీట్లు పెట్టి వివరణ ఇవ్వడం దారుణం. వాటి పై వాస్తవాలను వెలికితీసేందుకు విచారణ చేప ట్టి నిజాలను నిగ్గు తేల్చాలి. మూగజీవులు ఇంత పెద్ద సంఖ్యలో మృతి చెందడం, అనారోగ్యానికి గురికావడం భక్తుల, జంతు ప్రేమికుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. తక్షణం అఖిలపక్షం ఆధ్వర్యంలో పరిశీలన జరపాలి. నిర్లక్ష్యం కారణమైతే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – వందవాసి నాగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి, తిరుపతి గొంతు నొక్కడం భావ్యమా? టీటీడీలో ప్రతినిత్యం ఏ దో ఒక అపచారం జరగ డం బాధించే అంశం. అధికారులు బేషాజాలకు పోకుండా భక్తుల మనోభావాలను కాపాడాలి. నిషేధి త వస్తువులను తిరుమలకు చేరకుండా పటిష్ట తనిఖీలు నిర్వహించాలి. పార్టీలకతీతంగా శ్రీవారి సన్నిధిలో అపచారం జరిగితే లోపాలను ఎత్తి చూపడం భక్తుల హక్కు, కర్తవ్యం కూడా. అలాంటి లోపాలు జరిగినప్పుడు వెంటనే అధికారులు వాటిని సరిదిద్దేందుకు సిద్ధపడాలే తప్ప, గొంతు నొక్కడం, కేసులు బనాయించడం విచారకరం. – నరసింహులు, స్థానిక భక్తుడు, తిరుపతికలియుగ వైకుంఠం.. పరమ పవిత్రం..ఆధ్యాత్మిక నిలయం..భక్తులకు అది అపురూపం.. అంతటి తిరుమల క్షేత్రం నేడు అపవిత్రం.. మద్యం, మాంసం, పాదరక్షలతో ఆలయ ప్రవేశ యత్నం.. గోశాలలో గో మరణ మృదంగం.. శ్రీవారి ఆలయంపై డ్రోన్ల సంచారం ఒకటేమిటీ వరుస సంఘటనలు చోటు చేసుకోవడం మహా అపచారం.. వెరసి భక్తుల దెబ్బతిన్న మనోభావం.. ప్రశ్నించిన గొంతు నొక్కే ప్రయత్నం.. ఎదురుదాడి.. తమ పాపం ఎదుటి వారిపై నెట్టే ప్రచారం జరుగుతోంది. ఏడుకొండలపై అసలేం జరుగుతోంది.. ఏమై పోతోంది.. అంతా సత్యం వధ.. ధర్మం చెరేనా? అని భక్తులు మదనపడుతున్నారు. ప్రశ్నించే గొంతు నొక్కేస్తారా? ● లోపాలను ఎత్తి చూపితే.. పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదే ● భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలి ● ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం దారుణం ● తిరుమలలో అపచారాల కట్టడికి చర్యలు తీసుకోలేరా? ● 10 నెలలుగా సాక్షాత్తు తిరుమలలో జరిగిన ఘటనలకు బాధ్యులెవరు? ● ఇప్పటికై నా అధికారులు, ప్రభుత్వం అపచారాలను అడ్డుకోవాలి ● టీటీడీ అధికారులకు స్థానికులు, భక్తులు, మేధావుల హితవు తిరుపతి సిటీ: కలియుగ వైకుంఠంలో గత పది నెలలుగా సత్యం వధ.. ధర్మం చెరగా పాలన సాగుతోంది. దీన్ని ప్రశ్నించే గొంతుకలపై ఎదురుదాడి జరుగుతోంది. ఆధ్యాత్మిక సంస్థలో జరిగే లోటుపాట్లు సున్నిత పరిష్కారానికి చర్యలు లేకపోగా.. టీటీడీలో పచ్చపాలకులు, ఏజెంట్లు, అల్లరి మూకలు చేస్తున్న తప్పిదాలను రాజకీయకోణంలో చూపుతూ ప్రత్యర్థులపై నెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇదంతా చూస్తే అసలు తిరుమల, తిరుపతి దేవస్థానంలో ఏమి జరుగుతోంది.. అసలు తిరుమల.. ఆధ్యాత్మిక క్షేత్రమా.. పచ్చ పాపాలకు వ్యాపార నిలయమా?.. అని భక్తులు మనోవేదనకు గురికావాల్సిన దుస్థితి నెలకొంటోంది. రాజకీయ ఏజెంట్లుగా అధికారులు టీటీడీలో జరుగుతున్న అపచారాలను కప్పిపుచ్చేందుకు పచ్చనేతలు ఆ ధార్మిక సంస్థలో అధికారులనే రాజకీయ ఏజెంట్లుగా మార్చుతున్నారని భక్తులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే వారు పవిత్ర పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అపచారాలను ఎత్తి చూపితే.. వాటిని పక్కదారి పట్టించేందుకు సాక్షాత్తు కార్యనిర్వాహణాధికారి స్థాయి అధికారులే ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. అలాగే వారు చేసిన నేరాలు ప్రశ్నించే వారిపై నెట్టేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తూ వారికి అనుకూల మీడియాల్లో ప్రచారం చేస్తూ టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. గంగవరం : విద్యార్థుల నుంచి గత ప్రభు త్వం ఉచితంగా అందజేసిన ట్యాబ్స్ను ఇన్చార్జ్ హెచ్ఎం స్వాధీనం చేసుకున్న సంఘటన మండలంలోని కల్లుపల్లి జెడ్పీ హైస్కూల్లో చోటు చేసుకుంది. విద్యార్థులు, తల్లిదండ్రుల కథనం.. గత ప్రభుత్వంలో కల్లుపల్లి జెడ్పీ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్ పంపిణీ చేశారు. ఎలాంటి ప్రభుత్వ ఆదేశాలు, అనుమతి లేకుండా స్థానిక ఇన్చార్జి హెచ్ఎం నరసింహయ్య విద్యార్థుల ట్యాబ్స్ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని సెకండ్ హ్యాండ్ ధరలకు విక్రయాలు చేసుకోవడం కోసమేనా అంటూ ఆ ఇన్చార్జి హెచ్ఎంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. దీనిపై ఎంఈవో–1 వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ..విద్యార్థుల నుంచి ట్యాబ్స్ లాక్కోవాలన్న ప్రభుత్వ ఆంక్షలు ఎక్కడా లేవన్నారు. ఒకవేళ కల్లుపల్లి హైస్కూల్లో విద్యార్థుల నుంచి ట్యాబ్స్ వాస్తవంగా తీసుకున్నట్లు తెలిస్తే ఆ పాఠశాల ఇన్చార్జి హెచ్ఎంపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ కేడర్ నుంచి హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతికి విడుదల చేసిన జాబితాలో అభ్యంతరాలు తెలపాలని డీఈవో వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె విలేకరులతో మాట్లా డారు. ఈనెల 13వ తేదీన సీనియారిటీ జాబితా విడుదల చేసినట్లు చెప్పారు. ఉద్యోగోన్నతుల ప్రక్రియకు ఏకీకృత సీనియారిటీ జాబితాను రూపొందించి www.chittoor deo.com వెబ్సైట్ లో పొందుపరిచినట్లు తెలిపారు. అన్ని మేనేజ్మెంట్ల టీచర్ల జాబితాను వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. జిల్లాలోని టీచర్లు జాబితాల్లో సర్వీస్, సీనియారిటీ వివరాలను సరిచూసుకోవాలన్నారు. ఏవైనా అభ్యంతరాలున్నట్లైతే బుధవారం డీఈవో కార్యాలయంలో లిఖిత పూర్వకంగా ఆధారాలతో తెలియజేయాలని ఆదేశించారు. గడువు తర్వాత వచ్చే అభ్యంతరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించమని డీఈవో స్పష్టం చేశారు.– 8లో– 8లో– 8లోన్యూస్రీల్ మండిపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట పడేనా? పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు అపకీర్తి తీసుకువచ్చే చ ర్యలను అధికారులు అడ్డుకో వాలి. మందు, మాంసం, డ్రోన్ కెమెరాల హల్చల్, అ కతాయితీల వికృత చేష్టలను ప్రశ్నించే హక్కు ప్రతి భక్తునికీ ఉంటుంది. వాటిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. అప చారం జరిగిన ఘటనపై ప్రత్యేక దృష్టి సారించి పున రావృతం కాకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకోవాలి. గోవుల మృతి వార్తలు భకులు, జంతు ప్రేమికులను బాధించాయి. –మహాలక్ష్మి, శ్రీవారి భక్తురాలు, శ్రీకాళహస్తి అధికారుల అప్రమత్తత అవసరం టీటీడీలో తరచూ జరుగుతు న్న ఘటనలు భక్తులను బా ధిస్తున్నాయి. శ్రీవారి సన్నిధి లో ఇలాంటి అపచారాలు జరగకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అధికారులు అప్రమత్తంగా ఉండి, తిరుమల పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది. డ్రోన్ కెమెరాలతో ఫొటోషూట్ చేయడం ఎంత అపచారం. డ్రోన్ కెమెరాను ఎలా అనుమతించారో? అధికారులే సమాధానం చెప్పాలి. తిరుమలలో అభద్రతాభావం నెలకొంటే ప్రమాదమే. అధికారులు మేలుకోవాలి. –సెల్వకుమార్, తమిళ భక్తుడు, వేలూరు -
అమ్మో..ఐస్
● చల్లని పానీయాలు.. ఐస్గడ్డ విక్రయాలు ● తయారీలో కానరాని శుభ్రత ● వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు ● హెచ్చరికలు జారీ చేస్తున్న వైద్యనిపుణులు కాణిపాకం : జిల్లాలో జ్యూస్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వీధికి రెండు నుంచి మూడు షాపులుంటాయి. వేసవి కాలం వస్తే రోడంతా చల్లటి జ్యూస్ షాపులు కిటకిటలాడుతుంటాయి. ఇంటి నుంచి బయటకొచ్చిన వారిలో 40 శాతం మంది వీటిని గబగబా తాగేస్తుంటారు. వీరంతా చల్లటి ఐస్ వేస్తే తప్ప ఆ జ్యూస్ ముట్టుకోవడం లేదు. ఇక వేసవి సీజన్లో జరిగే ప్రతి శుభకార్యంలోనూ ఈ చల్లటి ఐస్ ముక్కలు వేసి కలిపిన జ్యూస్లు విచ్చలవిడిగా ఇస్తుంటారు. ఈ ఐస్ గడ్డలు తయారు చేసే కేంద్రాలు చాలా చోట్ల అధ్వాన్నంగా కలుషిత నీటితో తయారీ చేస్తుంటారని, రోగాలు తప్పవని వైద్య నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో ఐస్ గడ్డ తయారీ కేంద్రాలు 40 దాకా ఉన్నాయి. ఒక్కో షాపు నుంచి రోజువారిగా సుమారు 500 కిలోలు అమ్ముడుపోతాయని అంచనా. ఈ లెక్కన జిల్లాలో 20 వేల కిలోల ఐస్ గడ్డలు అమ్ముడుపోతుంటాయి. దీనికి తోడు జిల్లా సరిహద్దు ప్రాంతాలకు తమిళనాడు నుంచి ఐస్ గడ్డలు విపరీతంగా సరఫరా అవుతున్నాయి. ఇలా ఐస్ గడ్డల విక్రయాల ద్వారా జిల్లాలో రూ. 8 లక్షలకు పైగా వ్యాపారం నడుస్తున్నట్లు వారు లెక్కలు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా.. ఐస్ గడ్డల తయారీ సీజనల్ వ్యాపారమే అయినా తక్కువ పెట్టుబడి .. అధిక లాభాలున్నాయి. అయితే ఐస్ తయారీ కేంద్రాలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. పరిశ్రమల శాఖ, ట్రేడ్ లైసెన్స్, కాలుష్య నియంత్రణ బోర్డు, విద్యుత్ శాఖ ద్వారా వాణిజ్య విద్యుత్తు కనెక్షన్, భవనానికి సంబంధించి పట్టణ ప్రణాళిక, అగ్నిమాపక శాఖల నుంచి అనుమతులుండాలి. చాలా చోట్ల ఈ రకమైన అనుమతులు లేవు. చాలా వరకు ఇళ్ల మధ్య, రేకుల షెడ్లలో నిర్వహిస్తున్నారు. అపరిశుభ్రమైన ఐస్ వాడకంతో.. అపరిశుభమైన ఐస్ వాడటం వల్ల అనారోగ్య సమస్యలు ముంచెత్తుతున్నాయి. విష జ్వరాలు, టైపాయిడ్, దగ్గు దడ పుట్టిస్తున్నాయి. గొంతు నొప్పి, ఊపిరితిత్తుల సమస్యలు బాధేస్తున్నాయి. చిన్న పిల్లలకు గవద బిళ్లలు వచ్చే ప్రమాదం ఉంటుంది. రోటా, అడినో, హైపటైటిస్–ఏ వంటి వైరస్ల వల్ల ఊపిరితిత్తులు, పచ్చకామెర్లు వస్తుంటాయి. ఈ–కోలీ, సిగెల్లా వంటి వైరస్ల వల్ల వాంతులు, విరేచనాలు అవుతుంటాయని ప్రజలు జాగ్రత్త పడాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి ఎండలో తిరిగాం.. చల్లటి జ్యూస్ తాగుదామని అనుకుంటే కచ్చితంగా ప్రతి ఒక్కరూ శుభ్రతను పరీక్షించుకోవాలి. చల్లగా ఉందని గటగటా తాగితే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. వాంతులు, విరేచనాలవుతాయి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు అవుతాయి. ఎండా కాలంలో కచ్చితంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లటి జ్యూస్లకు బదులు తాజా పండ్లు, అధిక నీటిని తీసుకుంటే చాలు. సబ్జా గింజలు రోజుకు 15 గ్రాములు నానబెట్టి తీసుకుంటే శరీరం వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. – నందీశ్వర్, వైద్య నిపుణులు, చిత్తూరు -
అంబేడ్కర్ జయంతిలో దళితులకు అవమానం
పూతలపట్టు (కాణిపాకం) : పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకలకు సొంత పార్టీ దళిత నేతలకే ఆహ్వానం దక్కలేదని టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి, నేషనల్ దళిత ఫోరం అధ్యక్షుడు ఆనగల్లు మునిరత్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. పూతలపట్టు మండల కేంద్రంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 40 ఏళ్లుగా పార్టీలకతీతంగా అంబేడ్కర్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడలతో అధికార దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. జయంతి ఉత్సవాలకు ఏకపక్ష ధోరణితో రాజకీయం చేయడం తగదన్నారు. అధికారుల ద్వారా ప్రలోభాలు పెట్టి డ్వాక్రా మహిళలతోనే జయంతి ఉత్సవాలను చప్పగా ముగించడం కరెక్టు కాదని విరుచుకుపడ్డారు. ఏటా అన్ని పార్టీల కలయికతో జరిగే ఉత్సవాలకు ఈసారి పార్టీ రంగు వేశారని, ఇలా చేయడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 18న విద్యుత్ గ్రీవెన్స్ చిత్తూరు కార్పొరేషన్ : వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం విద్యుత్ గ్రీవెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని ట్రాన్స్కో ఈఈ మునిచంద్ర తెలిపారు. స్థానిక గాంధీ రోడ్డులోని ఈఈ కార్యాలయంలో చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల పరిధిలోని వినియోగదారులు సమస్యలు తెలపవచ్చన్నారు. సమస్యలను వినతి రూపంలో ఇవ్వాలని వివరించారు. చూడ కార్యదర్శి బదిలీ చిత్తూరు అర్బన్ : చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (చూడ )కార్యదర్శిగా పనిచేస్తున్న ఆర్. రమేష్ బాబును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేస్తున్న రమేష్ బాబును కడప మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ గా బదిలీ చేశారు. -
అప్రమత్తతతోనే అగ్నిప్రమాదాల నివారణ
చిత్తూరు కలెక్టరేట్ : అగ్నిమాపక ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద మాక్డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఎండలు పెరిగాయని, అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉంటాయన్నారు. ప్రమాదాల నివారణకు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ఏటా ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఆలస్యం చేయకుండా అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ అగ్నిమాపక శాఖ అధికారి కరుణాకర్, లీడింగ్ ఫైర్మెన్ ఏసుపాదం, సురేష్ పాల్గొన్నారు. -
పేదింటి ఆణిముత్యాలకు పురస్కారాలు
పలమనేరు : వారిది రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబ.. తండ్రి ట్రాక్టర్ డ్రైవర్.. తల్లి దినసరి కూలీగా కుటుంబాన్ని నెట్టుకొస్తూ తమ ముగ్గురి పిల్లలను పలమనేరులోని సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్లో పెట్టి చదివించారు. తల్లిదండ్రుల కష్టాలను చూసిన వారు కష్టపడి చదువుతూ తల్లిదండ్రులకు మంచిపేరు తెచ్చిపెడుతున్నారు. వీరిలో పెద్దకుమార్తె తోటి హర్షిత స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లైవ్స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డెయిరీ టెక్నాలజీ కోర్సులో 1000/971 మార్కులను సాధించి స్టేట్ టాపర్గా నిలిచింది. ప్రభుత్వం ఇంటర్ ఫలితాల్లో వివిధ గ్రూపుల్లో టాపర్లుగా నిలిచిన 54 మందిని రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసింది. ఇందులో భాగంగా షైనింగ్స్టార్ అవార్డుకు హర్షిత ఎంపికై ంది. ఆ మేరకు మంగళవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నుంచి అవార్డు అందుకుంది. హర్షిత పదో తరగతి దాకా వలసపల్లి నవోదయ పాఠశాలలో చదివింది. హర్షితతో పాటు చెల్లి శ్రావణి సైతం ఇదే కోర్సు చదివింది. మొన్నటి ఫలితాల్లో శ్రావణి 900 పైగా మార్కులను సాధించింది. వీరి తమ్ముడు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కేజీబీవీ విద్యార్థినికి మంత్రి అభినందన రొంపిచెర్ల : కేజీబీవీ విద్యార్థిని శ్రావంతిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రొంపిచెర్ల కేజీబీవీ విద్యార్థిని శ్రావంతి సీఈసీలో 935 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలోని కేజీబీవీల్లో మొదటి స్థానంలో నిలి చారు. కర్నూల్ జిల్లాకు చెందిన శివన్న, దేవమ్మకు ఇద్దరు కుమారైలు..వీరిలో పెద్ద కుమారై శ్రావంతి రొంపిచెర్ల కేజీబీవీలో ఇంటర్ పూర్తి చేసింది. రెండో కుమారై దీక్షా 9వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు తిరుపతిలో మేస్త్రి పని చేసుకుని పిల్లలను చదివిస్తున్నారు. కేజీబీవీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలలో 26 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 100 శాతం ఫలితాలు సాధించారు. మంగళవారం అమరావతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థిని శ్రావంతికి ల్యాప్ టాప్ను ప్రదానం చేశారు. అలాగే వందశాతం ఫలితాలు సాధించిన కస్తూర్బా విద్యాలయం ప్రిన్సిపల్ సుజాత, అధ్యాపకులను మంత్రి అభినందించారు. -
వైఎస్సార్సీపీ వాళ్లా.. మర్యాదగా వెళ్లిపోండి
● టీడీపీతో కలిసి వస్తే న్యాయం చేస్తామన్న తహసీల్దార్ ● దళిత గ్రామం సాకుతో క్వారీకి పట్టా భూమిలో రోడ్డు వేసిన కూటమి నేతలు ● మాజీ డిప్యూటీ సీఎం వద్ద గోడు వెళ్లబోసుకున్న బాధితులు పెనుమూరు (కార్వేటినగరం) : మీరు వైఎస్సార్సీపీ వాళ్లా.. మర్యాదగా బయటకు వెళ్లిపోండి.. కూట మి నాయకులతో కలిసి వస్తారా.. లోపలకి రండి అంటూ ఓ తహసీ ల్దారు పచ్చనేతలకు బానిసై, ఒక పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నాడని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి ఆరోపించారు. పెనుమూరు మండలం, చెర్లోపల్లి గ్రామానికి చెందిన హేమాద్రి నాయుడు, దాము కలిసి మంగళవారం మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వద్ద కూటమి నాయకులు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలను వివరించారు. స్పందించిన మాజీ ఉప ముఖ్యమంత్రి జిల్లా ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. అయినా స్పందించక పోవడంతో అసహనాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందన్నారు. సర్వే నం.381/1, 384/ సీ/1లో హేమాద్రినాయుడు, దాముకు చె ందిన భూమిలో దళితవాడకు దారి పేరు తో టీడీపీ నాయకుల క్వారీ కోసం పట్టా భూమిలో దౌర్జన్యంతో అగ్రకులస్తులు కర్రలు, రాడ్లు పట్టుకొని దళితులను భ యబ్రాంతులకు గురిచేసి రోడ్డు వేయడం అన్యాయమన్నారు. బాధితులకు అండగా నిలవాల్సిన అధికారులు కూటమి నేతల ఒత్తిడికి తలొగ్గి ప్రజలను హేళనగా మాట్లాడడం మంచిది కాదని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక వనరుల విధ్వంసమే రెడ్ బుక్ లక్ష్యం గంగాధరనెల్లూరు : వైసీపీ వాళ్ల ఆర్థిక వనరుల విధ్వంసమే కూటమి ప్రభుత్వం రెడ్బుక్ లక్ష్య మని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తీవ్రంగా మండిపడ్డారు. గంగాధర్ నెల్లూరు మండలం, కుప్పనపల్లి గ్రామంలో రైతు శంకర్రెడ్డి పొలంలో కూటమి నాయకులు దౌర్జన్యంగా పచ్చని మామిడి చెట్లను నరికి వేసిన ఘటనలో రైతును పరామర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా వైసీపీ వాళ్లపై దౌర్జ న్యాలు, ఆర్థిక వనరుల నిర్వీర్యమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. సీనియర్ నాయకు లు బండి హేమసుందర్రెడ్డి, వెంకటరెడ్డి, రాష్ట్ర రైతు నాయకులు చెందురాజు, కమాలర్రెడ్డి, హరి రెడ్డి పాల్గొన్నారు. -
● వినియోగదారుల్లో కానరాని ఆదరణ ● కనిపించని విద్యుత్ శాఖ ప్రచారం ● విద్యుత్ లోడ్ క్రమబద్ధీకరణకు రాయితీ
చిత్తూరు కార్పొరేషన్ : మారుతున్న కాలానుగుణంగా విద్యుత్ పరికరాల వినియోగం అధికమవుతోంది. ఈ క్రమంలో అవగాహన లేక వినియోగదా రులపై భారం పడుతోంది. గతంలో వారు విద్యుత్ కనెక్షన్ తీసుకున్న రోజున లోడుకు నేడు విని యోగిస్తున్న లోడుకు సంబంధం లేదు. దీంతో అధికారులు తనిఖీ చేసిన సమయంలో క్రమబద్ధీ కరణకు చెల్లించాలని నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్శాఖ అదనపు లోడ్ క్రమబద్ధీకరణకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వినియోగదారులకు ధరలో 50 శాతం రాయితీ ఇస్తోంది. కిలోవాట్కు రూ.2250 బదులు రూ.1,250 చెల్లిస్తే సరిపోతుంది. ఈ అవకాశం జూన్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. గృహ వినియోగదారులకు ఇంత మొత్తంలో రాయితీ కల్పిస్తున్నా తగినంత ప్రచారం లేదు. అధికారులు పత్రికా ప్రకటనలు కాకుండా సెక్షన్, సబ్ డివిజన్ల వారీగా వీటిపై అవగాహన కల్పించాలి. ఏఈ, డీఈ, ఈఈ, ఈఆర్వో కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లో బ్యానర్లు ఏర్పాటు చేయాలి. ప్రతినెలా విద్యుత్ బిల్లులు ఇచ్చేటప్పుడు వినియోగదారులకు వీటిపై అవగాహన కోసం కరపత్రాలను ఇవ్వాలి. జిల్లాలో మొత్తం 4,37,377 గృహ సర్వీసులు ఉన్నాయి. స్వచ్ఛందలోడ్ కాబట్టి ఎంత మందికి ఇది అవసరమో గణాంకాలు అధికారుల వద్ద లేవు. ఇప్పటి వరకు జిల్లాలో 1,893 మంది క్రమబద్ధీకరణ చేసుకోగా వాటి ద్వారా సంస్థకు రూ.20 లక్షలు వచ్చింది. ఎక్కడ చేసుకోవాలి మీ కరెంటు బిల్లు తీసుకుని బిల్లు వసూలు కేంద్రానికి వెళ్లాలి. లోడ్ రెగ్యులైజేషన్, 50 శాతం రాయితీ అని చెబితే సరిపోతుంది. ఒక కిలోవాట్కు రూ.1000 ఇతర రుసుములు రూ.250 కలిపి రూ.1250 కట్టించుకుంటారు. అదే రెండు కిలోవాట్లు అయితే రూ.2450, 3 కిలోవాట్లు అయితే రూ.3,650 చెల్లించాలి. అదే ఆన్లైన్లో చెల్లించాలి అంటే ఏపీఎస్పీడీసీఎల్ సైట్లోకి వెళ్లాలి. అందులో వాలంటరీ అడిషనల్ లోడ్ స్కీము 50 శాతం రాయితీ డెవలప్మెంట్ చార్జీస్ అనే వాటిని క్లిక్ చేయాలి. అందులో విద్యుత్ సర్వీసు నంబర్ ఇచ్చి డిటెయిల్స్లోకి వెళ్లాలి. అందులో విత్ అవుట్ ఎస్టిమేట్ నమోదు చేసి మొబైల్ నంబరును కొట్టాలి. ఉన్న లోడ్, అడిషనల్ లోడ్ను నమోదు చేయాలి. తర్వాత కరెంటు బిల్లు, ఐడీ ఫ్రూఫ్ను పీడీఎఫ్లో ఆప్లోడ్ చేసి డిమాండ్ను చెల్లించాలి. వచ్చే నెల నుంచి మీ లోడ్ వివరాలు కనిపిస్తాయి. జూన్ వరకు నిరీక్షించొద్దు స్వచ్ఛందంగా అదనపు లోడ్ క్రమబద్ధీకరణకు గడువు చివరి వరకు వేచి ఉండద్దు. జూన్ వరకు సమయం ఉందని పలువురు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అంతలోపు సిబ్బంది తనిఖీలు చేసి నోటీసులు ఇస్తే రాయితీ రాదు. విద్యుత్ బిల్లులు చెల్లింపు కేంద్రాల వద్ద ప్రచార బ్యానర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. వినియోగదారులు 50 శాతం రాయితీ అవకాశాన్ని వినియోగించుకోండి. – ఇస్మాయిల్ అహ్మద్, ఎస్ఈ ట్రాన్స్కో మీ నివాసం లోడ్ ఎంత? చాలా మందికి తమ ఇంటి విద్యుత్ కనెక్షన్ లోడ్ ఎంతో తెలియదు. సంవత్సరాల కిందట కనెక్షన్లు తీసుకున్న వారు వేల మంది ఉన్నారు. అప్పట్లో ఒక కిలోవాట్ అంత కన్నా తక్కువ కట్టించుకుని కనెక్షన్లు ఇచ్చారు. ఇప్పుడు ప్రతి నివాసంలో పరికరాలు సంఖ్య పెరిగింది. దీనికి తోడు వేసవిలో ఫ్యాన్, కూలర్, ఏసీలు పెరుగుతున్నాయి. దీంతో లోడ్ పెరిగి ట్రిప్ సమస్యలతో సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. కాంట్రాక్ట్ లోడ్ మీ ఇంటి విద్యుత్ లోడ్ను తెలియజేస్తుంది. విద్యుత్ బిల్లులో ఉన్న ఆ లోడ్ను పరిశీలించి ఇంట్లో వాడుతున్న పరికరాల కెపాసిటీ ఆధారంగా సింపుల్గా లెక్కకట్టి అదనపు లోడ్ ఎంత అవసరమో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు 10 సంవత్సరాల కిందట 1 కేవీతో సర్వీసు తీసుకున్న వారు ప్రస్తుతం ఏసీ, వాషింగ్ మెషిన్, మోటారు, మిక్సీ ఇలా పరికరాల సంఖ్య పెరిగి ఉంటుంది. 1 టన్ ఏసీకే తీసుకున్న కెపాసిటీ సరిపోతుంది. మిగిలిన వాటికి తక్కువనుకున్నా 2 కేవీ క్రమబద్ధీకరణ చేసుకోవాల్సి ఉంది. వీటికి సిబ్బంది తనిఖీ చేయక ముందే స్వచ్ఛందంగా చెల్లిస్తే రూ.4,450 కాకుండా రూ.2,450 చెల్లిస్తే సరిపోతుంది. నోటీసులు ఇస్తే మొత్తం చెల్లించాలి వాడే విద్యుత్ను బట్టి ఇంట్లో ఉన్న ఉపకరణాలను అంచనా వేయవచ్చు. బిల్లు ఎక్కువగా వస్తుంటే అదనపు లోడ్ వాడుతున్నట్లు గుర్తిస్తారు. ఇలాంటి వారి సర్వీసులను అధికారులు తనిఖీ చేసి అదనంగా ఎంత లోడ్ వాడుతున్నారో నమోదు చేస్తారు. దానికి డబ్బులు చెల్లించాలని నోటీసులు ఇస్తారు. అధికారులు తనిఖీ చేసి నోటీసులు ఇస్తే కిలోవాట్కు నిర్దేశించిన మొత్తం చెల్లించాలి. అందులో ఎటువంటి రాయితీలు రావు. ఒక ఇంట్లో 4 ట్యూబ్లైట్లు, 3 ఫ్యాన్లు, వాషింగ్ మెషిన్, ఏసీ, ఫ్రిడ్జ్, ఐరన్బాక్స్ , ఎలక్ట్రికల్ కుక్కర్, టీవీ, కంప్యూటర్ ఉంటే వీటి సామర్థ్యం దాదాపు 6 కిలోవాట్లు. మీ ఇంటి కనెక్షన్ 2 కిలోవాట్లు అయితే అదనంగా 4 కేవీ వాడుకుంటున్నట్లే. ఇలా అదనంగా వాడుకునే దానికి 50 శాతం రాయితీతో రెగ్యులరైజ్ జూన్ 30 లోపు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. కుప్పంలోని గుణ రోజువారి కూలీగా జీవనం సాగిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు దాడులు నిర్వహించి ఆయన అదనంగా 2 కిలోవాట్ల విద్యుత్తు వినియోగిస్తున్నారని గుర్తించారు. ఆయనకు రూ.4,450 చెల్లించాలని నోటీసు ఇచ్చారు. నగరి పరిధిలో ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్న ప్రైవేటు ఉద్యోగి రమేష్ అనే వ్యక్తి ఇంటికి వచ్చిన విద్యుత్శాఖ సిబ్బంది తనిఖీలు చేశారు. తీసుకున్న లోడు కంటే వాడే లోడ్ 4 కిలోవాట్లు అదనంగా వినియోగిస్తున్నారని తెలుసుకున్నారు. అందుకు గాను రూ.8,850 చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. -
భూ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ
పాలసముద్రం : మండల పరిధిలోని రైతుల భూసమస్యలపై వీఆర్ఓలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి కులశేఖర్నాయుడు పేర్కొన్నారు. మంగళవారం రెవెన్యూ కార్యాలయంలో వీఆర్ఓలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వీఆర్ఓలతో రీసర్వే, రెవెన్యూ సదస్సులు రైతుల వద్ద నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? వాటిలో ఎన్నింటిని పరిష్కరించారని అడిగి తెలుసుకున్నారు. శ్రీకావేరిరాజుపురం వీఆర్ఓ తంగరాజ్ రెవెన్యూ సదస్సు, రీ సర్వేలో వచ్చిన అర్జీలు ఎన్ని పరిష్కరించారని అడిగితే సక్రమంగా సమాధానం చెప్పకపోవడంతో ఆయనపై మండిపడ్డారు. నోస్నల్ ఖాతాల్లో పడిన సర్వే నంబర్లను రైతుల వద్ద నుంచి పత్రాలు తీసుకుని ఆన్లైన్లో అప్డేట్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్ఆర్ దేవి, వీఆర్ఓ శ్రీనివాసులు, రమణయ్య, రమేష్ పాల్గొన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి పుత్తూరు : మండల పరిధిలోని పరమేశ్వరమంగళం గ్రామ సచి వాలయ వద్ద జా తీయ రహదారి పై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ ఓబయ్య తెలిపారు. రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొ నడంతో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియరావాల్సి ఉందన్నారు. మృతుడి వయస్సు (60) ఉంటుందని, తెలుగు రంగు షర్ట్, పంచ ధరించి ఉన్నాడని తెలిపారు. కడుపు కుడి, ఎడమల వైపు నల్లటి పుట్టు మచ్చ లు ఉన్నాయన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సారా స్వాధీనం.. నలుగురి అరెస్టు పుంగనూరు : వివిధ ప్రాంతాలలో సారా విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు మంగళవారం ఎకై ్సజ్ సీఐ సురేష్ తెలిపారు. మండలంలోని పెద్దతండా సమీపంలో సారా విక్రయిస్తున్న పద్మను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుంచి 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నామన్నా రు. అలాగే పట్రపల్లె సమీపంలో సారా విక్రయిస్తున్న రమణా నాయక్ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 30 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నామన్నారు. అదే గ్రామానికి చెందిన తిప్పానాయక్ ను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించామన్నారు. అ లాగే సారా తయారీకి బెల్లం విక్రయిస్తున్న వెంకట రమణారెడ్డిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. ఈ దాడుల్లో చిత్తూరు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ జవహర్బాబు, ఇన్స్పెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి, ఎస్.వేణుగోపాల్రెడ్డి, సిబ్బంది ఢిల్లీబాబు, సుబ్రమణ్యంగౌడు, నాగరాజు, సురేంద్రబాబు, వినోద్, శ్వేత, మమత, నరేంద్రరెడ్డి, దశరథ, రాజేశ్వరి పాల్గొన్నారు. -
● జేసీకి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్ వినతి
అంబేడ్కర్ భవనాన్ని ఇప్పటికై నా నిర్మించరూ! పలమనేరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్కు నివాళుర్పించడం కాదు..ఆయన పేరిట పలమనేరులో భవన నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు రావాలని పలమనేరు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్ నేతలు సోమవారం జిల్లా కేంద్రంలోని జేసీ విద్యాధరిని కలిసి కోరారు. వారు మాట్లాడుతూ అంబేడ్కర్ భవనం కోసం రెండు దశాబ్దాలపాటు పోరాటం చేస్తే గతంలో దండుమిట్ట వద్ద 46 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందన్నారు. అప్పట్లో నిధులు మంజూరైనా పనులు మొదలుకాక ఇప్పటికీ ఆ స్థలం ఖాళీగానే ఉందని ఆమె దృష్టికి నివేదించారు. అక్కడ భవనం నిర్మిస్తే నియోజవర్గంలోని 37వేల మంది ఎస్సీ, ఎస్టీల శుభకార్యాలు, వివాహాలు, సమావేశాలకు అనువుగా ఉంటుందని తెలియజేశారు. జేసీని కలిసిన వారిలో పుష్పరాజ్, జయరామ్ తదితరులున్నారు. ఒంటరి ఏనుగు వీరంగం పులిచెర్ల(కల్లూరు): పులిచెర్ల మండలంలో నెల రోజులుగా రైతన్నలకు కంటికి కునుకు లేకుండా చేస్తున్న ఒంటరి ఏనుగు సోమవారం తెల్లవారుజామున సైతం వీరంగం సృష్టించింది. కమ్మపల్లె పంచాయతీ దిన్నెపాటిలో పంటలకు నష్టం కలిగించింది. మామిడి చెట్లను విరిచేయడంతోపాటు డ్రిప్ పరికరాలను ధ్వంసం చేసింది. అటవీ శాఖ అధికారులు కూడా దీనిని కట్టడి చేయడంలో చేతులెత్తేసున్నారని రైతులు లబోదిబోమంటున్నారు. -
పార్టీ మారారంటూ తప్పుడు ప్రచారం
బంగారుపాళెం: ‘వైఎస్సార్సీపీ కార్యకర్తలను భోజనానికి ఆహ్వానించారు. వారికి జనసేన కండువాలు కప్పి పార్టీలో చేరినట్లుగా ఆపార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమార్ అన్నారు. సోమవారం పార్టీ మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని కూర్మాయిపల్లెకు చెందిన సుధాకర్రెడ్డి, గజేంద్రరెడ్డి, వాసుదేవరెడ్డి, మొగిలిరెడ్డి వైఎస్సార్సీపీని వీడి జనసేన పార్టీలో చేరినట్లు సోషియల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసుకున్నారన్నారు. ఆది వారం ఓ కార్యక్రమం ఉందని, మీరు తప్పకుండా భోజనానికి రావాలని వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్తలను ఆహ్వానించారన్నారు. దీంతో వారు వెళ్లగానే బలవంతంవగా వారి మెడలో కండువాలు వేసి ఫొటోలు తీసి, జనసేన పార్టీలో చేరినట్లుగా తప్పుడు ప్రచారం చేసుకోవడం సమంజసం కాదన్నారు. ఇలాంటి రాజకీయాలను జనసేన నాయకులు మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ కుమార్రాజా, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, వైస్ ఎంపీపీ శిరీష్రెడ్డి, కూర్మాయిపల్లె సర్పంచ్ హేమలత, బాబురెడ్డి, పాలాక్షిరెడ్డి, ఽథామస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూకాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ ఏటీజేహెచ్ వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 79,100 మంది స్వామిని దర్శించుకున్నారు. 32,791 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కాను కల రూపంలో హుండీలో రూ.3.52 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. 22 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 22 నుంచి మే 10వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు వర్సిటీ అధికారులు కళాశాలలకు పరీక్షల షెడ్యూల్ పంపించారు. విద్యార్థులకు ఈ నెల 19 నుంచి హాల్ టికెట్లు అందజేయనున్నారు. -
అంబేడ్కర్ అంటే చిన్నచూపెందుకు?
● జిల్లాస్థాయి కార్యక్రమానికి హాజరుకాని ప్రజా ప్రతినిధులు ● దళితులు ప్రశ్నిస్తారనే గైర్హాజరయ్యారేమో? ● తూతూమంత్రంగా అధికారిక అంబేడ్కర్ జయంతి ● విమర్శలు గుప్పిస్తున్న దళితులు, సంఘ నాయకులు చిత్తూరు కలెక్టరేట్ : ఎంతో ఘనంగా నిర్వహించాల్సిన అంబేడ్కర్ జయంతి అధికారిక వేడుకలకు కూటమి ప్రజాప్రతినిధులు దూరమయ్యారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవనంలో సోమవారం నిర్వహించిన అధికారిక కార్యక్రమానికి కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు కార్యక్రమానికి హాజరవుతారని ఎదురు చూసిన దళితులు, దళిత సంఘ నాయకులకు నిరాశే మిగిలింది. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్కు కూటమి ప్రజాప్రతినిధులిచ్చే గౌరవం ఇదేనా? అంటూ దళితులు, దళిత సంఘ నాయకులు పెదవి విరిచారు. గత ఐదేళ్లపాటు అంబేడ్కర్ జయంతి అధికారిక కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి సర్కారు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ వేడుకలను తూతూమంత్రంగా నిర్వహించింది. దీనిపై పలువురు పెదవి విరుస్తున్నారు. దళితులు ప్రశ్నిస్తారనే గైర్హాజరయ్యారా? కూటమి అధికారంలోకి వచ్చిన గత పది నెలలుగా దళితుల అభ్యున్నతికి చేసిందేమీ లేదు. దళితుల సమస్యలు పరిష్కరించకపోవడంతో దళితులు అందజేసిన వినతులు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి. జిల్లాలోని అన్ని దళితుల కాలనీల్లో మౌలిక వసతులు కల్పించని పరిస్థితి. గత ఐదేళ్ల పాటు దళితులకు అందిన సంక్షేమ పథకాలు, కూటమి పాలనలో వారి దరిచేరని దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అంబేడ్కర్ జయంతి వేడుకలకు హాజరైతే ఎక్కడ ప్రశ్నిస్తారేమోనని కూటమి ప్రజాప్రనిధులు గైర్హాజరై, ఉంటారని దళితులు, ఆ సంఘ నాయకులు గుసగుసలాడారు. అంబేడ్కర్ అంటే కూటమి ప్రజాప్రతినిధులకు చిన్నచూపెందుకని? దళిత సంఘ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. విద్యతోనే గౌరవం సాధ్యం విద్యతోనే సమాజంలో గౌరవం దక్కుతుందని జాయింట్ కలెక్టర్ విద్యాధరి అన్నారు. సోమ వారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవనంలో అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన జేసీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. దళితులు ఆర్థికంగా అభ్యున్నతి చెందాల న్నారు. సమాజంలో గౌరవం సంపాదించాలంటే విద్య ఎంతో ముఖ్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యాభ్యాసానికి అన్ని సౌకర్యాలున్నాయన్నారు. డ్వాక్రా సంఘాల్లో మహిళలు రుణాలు తీసుకుని చిన్నచిన్న వ్యాపారాలతో ఆర్థికాభివృద్ధి సాధించి, సమాజంలో గౌర వంగా జీవించాలన్నారు. ప్రతి ఇంట్లో ఒక వ్యా పార, పారిశ్రామికవేత్త ఉండేలా ఎదగాలన్నారు. ఈ వేడుకల్లో సాంఘిక సంక్షేమ శాఖాధికారి చిన్నయ్య, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, ఎస్సీ, ఎస్టీ సంఘ నాయకులు గోవిందన్, రాష్ట్ర మాల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్బాబు, డీవీఎంసీ సభ్యులు రాజ్కుమార్, ధనశేఖర్, శంకర్, రవి, దేవరాజులు, మునస్వామి, డేవిడ్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సీతారాముల కల్యాణ వైభోగమే!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): వీధంతా పందిరి.. మదినిండా భక్తి...జనకరాజ పుత్రిక జానకీదేవికి దశరథ సుతుడు శ్రీరామచంద్రుడి కల్యాణం సోమ వారం కనులపండువగా సాగింది. చిత్తూరు నగరంలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో సోమవా రం సీతారాముల కల్యాణం వైభవంగా సాగింది. ఉదయం అష్టోత్తర శతకలశ, మహా తిరుమంజనంను నిర్వహించారు. అభిషేక పూజలతో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం ప్రత్యేక కల్యాణ వేదికను తీర్చిదిద్దారు. ఉభయదారులు సీతారాముల కల్యాణ వైభోగానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తర్వాత సీతారాముల వారిని అందంగా అలంకరించి కల్యాణ వేదికపై కొలువుదీర్చా రు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణఘట్టం ప్రారంభించారు. సుముహుర్తాన మాంగల్య ధారణ గావించారు. మహా మంగళ హారతితో కల్యాణమహోత్సవాన్ని ముగించారు. రెండు గంటలకు పాటు సాగిన ఉత్సవంలో భక్తులు రామనామస్మరణ చేస్తూ తన్మయత్వం పొందారు. రాత్రి పుష్పపల్లకి సేవలో స్వామి వారు విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. -
నవవధువు అనుమానాస్పద మృతి
● భార్య కుటుంబ సభ్యులపై భర్త అనుమానం ● కేసు నమోదు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు చిత్తూరు అర్బన్: నాలుగేళ్ల ప్రేమ. వివాహానికి పెద్దల నిరాకరణ. కులమతాలు వేరుకావడమే ప్రధాన సమస్య. పెద్దల్ని ఎదిరించి పెళ్లిచేసుకున్నారు. ఇప్పుడే రెండు నైలెంది. నాన్న దిగులుగా ఉన్నాడు.. వచ్చి చూసి వెళ్లమని బతిమిలాడితే పుట్టింటికి వెళ్లింది. గంటలోపే శవమైంది. చిత్తూరు నగరంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనపై వాస్తవాలేమిటీ ఎవరికీ తెలియడంలేదు. ఈ ఘటనపై పోలీసులు అనుమానానస్పద మృతి కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. టూటౌన్ పోలీసులు, మృతురాలి భర్త కథనం మేరకు.. చిత్తూరు నగరంలోని బాలాజీ కాలనీకి చెందిన షౌకత్అలీ మూడో కుమార్తె యాస్మిన్ (26) నగరంలోని ఓ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసింది. బీటెక్ చదువుతుండగానే పూతలపట్టు మండలం పోటుకనుమ దళితవాడకు చెందిన సాయితేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దాదాపు నాలుగేళ్ల పాటు వీళ్ల ప్రేమ ప్రయాణం కొనసాగింది. అయితే యాస్మిన్కు చిత్తూరు నగరానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న పెళ్లి జరగాల్సి ఉండగా, 6వ తేదీన ఆమె సాయితేజతో వెళ్లిపోయి, అతడ్ని వివాహం చేసుకుంది. పెద్దల నుంచి ప్రాణహాని ఉండొచ్చని తిరుపతి పోలీసులను ఆశ్రయిస్తే, ఇరుపక్షాల కుటుంబ సభ్యుల్ని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పూతలపట్టులోనే సాయితేజ, యాసిన్ కాపురం పెట్టారు. ఇటీవల యాసిన్ తన అక్కలు, అమ్మతో తరచూ ఫోన్లో బాగానే మాట్లాడేది. యాసిన్ వెళ్లిపోయినప్పటి నుంచి తండ్రి దిగులుగా ఉన్నాయని, ఓ సారి వచ్చి చూసి వెళ్లాలని కుటుంబ సభ్యులు కోరారు. ఆదివారం సాయితేజ, యాసిన్ ఇద్దరూ కారులో చిత్తూరుకు వచ్చారు. యాసిన్ ఇంటి వద్దకు వెళ్లడానికి సాయితేజ భయపడి, పీసీఆర్ కూడలిలో యాసిన్ను దిగబెట్టి.. వాళ్ల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. ఓ కారులో వచ్చిన యాసిన్ కుటుంబ సభ్యులు, ఆమెను బాలాజీ కాలనీలోని ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి రాగానే యాసిన్ తండ్రి షౌకత్ ఆమైపె ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘ మా పరువు మొత్తం తీశావు, ఇప్పుడెందుకు వచ్చావు..? వెళ్లిపో ఇక్కడి నుంచి..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనే బయటకు వెళ్లిపోయాడు. కొద్దిసేపు తరువాత తలుపుతెరచి చూస్తే, యాసిన్ చున్నితో ఫ్యాన్కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. స్థానికుల సాయంతో ప్రభుత్వాస్పత్రికి తరలిస్తే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా యాసిన్ మృతికి ఆమె కుటుంబ సభ్యులే కారణమంటూ సాయితేజ ఆరోపిస్తున్నాడు. దీనిపై టూటౌన్ సీఐ నెట్టికంటయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా యాసిన్ బలవన్మరణానికి పాల్పడిందా..? కుటుంబ సభ్యులు ఏమైనా చేశారా..? అనే కోణాల్లో ద ర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు యాసిన్ను పీసీఆర్ కూడలి నుంచి ఇంటికి కారులో తీసుకెళ్లిన యువకులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. కాగా ఇంటి నుంచి వెళ్లిన యశ్విన్ తండ్రి షౌకత్ అలీ ఆచూకీ తెలియ రాలేదు. దీంతో యశ్విన్ది హత్య..? ఆత్మహత్య..? అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మృతురాలి మెడ వెనుక ఉన్న ఎముకను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. యువతి తనకు తానుగా ఆత్మహత్య చేసుకుందా? ఎవరైనా గొంతుకు చున్ని బిగించి చంపేశారా? అనే అంశంపై పోలీసులు కూడా ఎటు తేల్చుకోలేక పోతున్నారు. -
వరసిద్ధుడి సేవలో సినీ రచయిత
కాణిపాకం వినాయకస్వామివారిని సినీ రచయిత విజయేంద్రప్రసాద్ సోమవారం దర్శించుకున్నారు.అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన అవసరం చిత్తూరు కలెక్టరేట్ : ప్రతి ఒక్కరూ అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి అన్నారు. సోమవారం అగ్నిమాపక వారోత్సవాలను జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఎండాకాలంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకునే అవకాశాలుంటాయన్నా రు. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై వా రం రోజుల పాటు క్షేత్రస్థాయిలో అవగాహ న కల్పిస్తామన్నారు. అగ్నిప్రమాదాల నివారణకు ఏటా ప్రభుత్వం అగ్నిమాపక వారో త్సవాలను నిర్వహిస్తోందన్నారు. అనంత రం గుడిపాల మండలం పశుమంద గ్రా మంలో ఉన్న కంపెనీలో అవగాహన కార్య క్రమం నిర్వహించారు. అగ్నిమాపక సేవలందిస్తూ మృతి చెందిన పలువురు సిబ్బందికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ అగ్నిమాపక శాఖ అధికారి కరుణాకర్, లీడింగ్ ఫైర్ మెన్లు శోభభన్, ఏసుపాదం, సిబ్బంది కుశలన్, గిరిబాబు, రాజు, నవీన్, రాజేంద్ర పాల్గొన్నారు. – 8లో -
వరసిద్ధుడి సేవలో సినీ రచయిత
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామివారిని సోమవారం తెలుగు సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయాధికారులు దగ్గరుండి స్వామి దర్శనం కల్పించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో పండితుల ఆశీర్వచనాలు పలికి, ప్రసాదం, చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో సిబ్బంది కోదండపాణి, బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనుల పరిశీలన చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు రైల్వేస్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, చిత్తూరు, పూతలపట్టు, చంద్రగిరి ఎమ్మెల్యే లు గురుజాల జగన్ మోహన్నాయుడు, మురళీమోహన్, నాని పరిశీలించారు. వారు సోమవారం రైల్వేస్టేషన్కు వచ్చి మీడి యాతో మాట్లాడారు. తిరుపతి–కాట్పాడి డ బ్లింగ్లైన్ ఏర్పాటుతో పలు రంగాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అమృత్ భారత్ కింద చి త్తూరు రైల్వే స్టేషన్లో చేపట్టిన పనులు సగం కూడా పూర్తికాకపోవడంతో కాంట్రాక్టరుపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ అముద, చుడా చైర్మన్ హేమలత, రాజన్, స్టేషన్ మాస్టర్ ముత్తుస్వామి, ఆర్పీఎఫ్ సీఐ కుమార్, జీఆర్పీ ఎస్ఐ ప్రవీణ్ పాల్గొన్నారు. ఉద్యోగం పేరిట మోసం.. కేసు నమోదు చిత్తూరు అర్బన్: ఉద్యోగం పేరిట నగదు మోసం చేసిన ఘటనపై సోమవారం కేసు నమోదు చే సినట్లు తాలూకా ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. చిత్తూరులోని ప్రశాంత్నగర్కు చెందిన పురుషోత్తం అనే వ్యక్తి ఉద్యోగం పేరిట మోసపోయాడు. ఐటీ ఉద్యోగం ఇప్పిస్తామని బెంగళూరుకు చెందిన నాగర్జున అనే వ్యక్తి రూ.16.50 లక్షలు తీసుకున్నాడు. తీరా మో సం అని తెలిసి పురుషోత్తం చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నాగర్జునపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. వేటకు వెళ్లొద్దు వాకాడు: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో చేపల వేట నిసేధించారని, వేటకు ఎవ రూ వెళ్లొద్దని జిల్లా మత్స్యశాఖ అధికారి రాజేష్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. మత్స్యశాఖ నిషేధ ఆజ్ఞలు ఉల్లంఘించిన వా రిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎపీ ఎంఆర్ఎఫ్ 1994 సెక్షన్(4)ను అనుసరించి శిక్షార్హులు అవుతారని, అలాగే వా రి బోట్లలో ఉండే మత్స్య సంపదను స్వాధీనం చేసుకుంటామన్నారు. -
గోమాతల మృతిపై పవన్ స్పందించాలి
చిత్తూరు కార్పొరేషన్: సనాతన హిందూ ధర్మ పరిరక్షకుడని చెప్పుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోమాతల మృతిపై స్పందించాలని వైఎస్సార్ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం చిత్తూరులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బీఆర్ నాయు డు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీటీడీ అప్రతిష్టపాలవుతోందని, పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. వైకుంఠ ఏకాదశి రోజు భక్తులు మృతి బాధాకరమన్నారు. ఘాట్ రోడ్డులో ప్రమాదాలు పెరుగుతున్నాయని విమర్శించారు. టీటీడీ గోశాలలో 100 గోవులు చనిపోయాయని, దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిజా లు మాట్లాడితే ఆరోపణలు చేయడం సరికాదన్నా రు. నిజాలను కప్పిపుచ్చాలనుకుంటే దాగవన్నారు. మొదట బీఆర్ నాయుడు పొరబాటు జరిగిందని, తర్వాత అటువంటిది లేదని రెండు నాలుకల ధోరణిలో మాట్లాడడం తగదన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు కు అధికార పార్టీ మద్దతు పలికిందని, రాబోయే రోజుల్లో చర్చిలను కూడా కై వసం చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ అధ్యక్షుడు జ్ఞానజగదీష్, నాయకులు రజనీకాంత్, కృష్ణమూర్తి, జయపాల్, కృష్ణరెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నిజాలు మాట్లాడితే ఆరోపణలు అంటారా..? విజయానందరెడ్డి -
20 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
పెళ్లకూరు: 71వ నంబరు జాతీయ రహదారి మార్గంలో దిగువచావలి ఫ్లైఓవర్పై శ్రీకాళహస్తి నుంచి నెల్లూరుకు రేషన్ బియ్యం లోడ్డుతో వెళ్తున్న వాహనం టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తాపడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, అధికారుల సమాచారం మేరకు.. శ్రీకాళహస్తి నుంచి నెల్లూరుకు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాహనం మార్గమధ్యంలో దిగువచావలి గ్రామం ఫ్లై ఓవర్పై టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. వెంటనే బియ్యం వ్యాపారులు వాహనంలోని 20 టన్నుల బియ్యాన్ని గ్రామంలోని రహస్య ప్రదేశానికి తరలించారు. స్థానికుల సమాచారంలో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ నాగరాజు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లై డీటీ గోపీనాథరెడ్డి, తహసీల్దార్ ద్వారకానాథ్రెడ్డికి సమాచారం అందించారు. పట్టుబడిన రేషన్ బియ్యాన్ని వీఆర్వోలు రమేష్, వంశి నాయుడుపేట గోదాముకు తరలించి కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
● పేదల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు ● రాజ్యాంగ నిర్మాతను యువత ఆదర్శంగా తీసుకోవాలివెదురుకుప్పం: కనికాపురంలో నేల కొరిగిన వృక్షం అభినవ అంబేడ్కర్ వైఎస్ జగన్ శ్రీరంగరాజపురం: అంబేడ్కర్ ఆశయ సాధనకు కట్టుబడి పేదల అభ్యున్నతికి కృషి చేస్తూ అభినవ అంబేడ్కర్గా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిచారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. శ్రీరంగరాజుపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలు, బాలికలు, దళితులకు రక్షణ కరువైందన్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. విజయవాడలో దాదాపు 20 ఎకరాల్లో రూ.400 కోట్ల వ్యయంతో 250 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడితే, జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వం ఆ మహానీయుడి విగ్రహంపై దాడులు చేసిన పట్టించుకోలేదన్నారు. చౌడేపల్లె: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధన కోసం నేటితరం యువత కృషి చేయాలని జెడ్పీ చైర్మ న్ శ్రీనివాసులు సూచించారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో అంబేడ్కర్ జ యంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నా రు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరించారు. ఆయన మాట్లాడుతూ పే ద కుటుంబంలో జన్మించి ఉన్నత చదు వులు చదివి భారత రాజ్యాంగకర్తగా నిలిచా రన్నా రు. ఆయన పేదల అభ్యున్నతికి కృషి చే సిన మహనీయులన్నారు. ఆదర్శంగా తీసు కోవా లని కోరారు. జెడ్పీటీసీ సభ్యుడు దా మోదరరాజు, ఎంపీపీ రామమూర్తి, ఎంపీటీసీ సభ్యు లు శ్రీరాములు, లక్ష్మీనర్సయ్య, ఎంపీడీఓ లీలామాధవి, సూపరింటెండెంట్ షబ్బీ ర్ అహమ్మద్, ఈఓపీఆర్డీ కృష్ణవేణి పాల్గొన్నారు.రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం పుత్తూరు: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం కావాలంటే మళ్లీ జగనన్న సీ ఎం కావాల్సిందేనని మాజీ మంత్రి, వైఎ స్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు ఆర్కే రోజా స్పష్టం చేశారు. సోమవారం అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని పుత్తూరులో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మా ట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అంబేడ్కర్ స్ఫూర్తితో పరిపాలన సాగించారన్నారు. నేటి కూటమి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు దళితులను ఎక్కడికక్కడ అణగదొక్కుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ హరి, వైస్ చైర్మన్లు శంకర్, జయప్రకాష్, ఎంపీపీ మునివేలు, వైస్ ఎంపీపీ మునస్వామిరెడ్డి, వైఎస్సార్సీపీ దళిత నాయకులు లక్ష్మణమూర్తి, బాలసుబ్రమణ్యం, ప్రతాప్, సుబ్రమణ్యం, శివ, వేలాయుధం, రాంబత్తయ్య, గంగాధరం, రామ్మూర్తి, మస్తాన్, ఉదయ్, బాబు, ప్రభు, బొజ్జయ్య, పార్టీ నాయకులు మాహీన్, ఏకాంబరం, అన్నాలోకనాథం, భాస్కర్యాదవ్, చిరంజీవియాదవ్, మురళీయాదవ్, భాస్కర్యాదవ్, ప్రసాద్, గోపి, మునిరత్నం, చిన్నా, మురళీరెడ్డి, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. జగన్ది అంబేడ్కర్ రాజ్యాంగం చిత్తూరు కార్పొరేషన్: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంబేడ్కర్ రాజ్యాంగం మేరకు పాలన సాగించారని వైఎస్సార్ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. విజయానందరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ రాష్ట్రాన్ని మరో బీహార్గా మార్చారని విమర్శించారు. సమాజంలో అందరూ సమానంగా ఉండాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భావించారని మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి తెలిపారు. జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి రజనీకాంత్, పార్టీ గుడిపాల మండల అధ్యక్షుడు ప్రకాష్, కార్పొరేటర్ లక్ష్మణ స్వామి, నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్, రూరల్ పార్టీ మండల అధ్యక్షుడు జయపాల్, జెడ్పీటీసీ సభ్యుడు బాబునాయుడు, నాయకులు జ్ఞానజగదీష్, సూర్యప్రతాప్రెడ్డి, కృష్ణమూర్తి, కృష్ణారెడ్డి, అంజలిరెడ్డి, భాగ్యలక్ష్మిరెడ్డి, ఆను, మధుసూదన్రాయల్, రాజేంద్ర, త్యాగ, రాబర్ట్, స్టాండ్లీ, ప్రసాద్, గిరిధర్రెడ్డి, ప్రేమ్, అల్తాఫ్, చాన్బాషా, నారాయణ, సాల్మన్, ఇరువారం ప్రేమ్, ప్రతిమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గాలీవాన బీభత్సం
అంబేడ్కరంటే చిన్నచూపెందుకు? అంబేడ్కర్ జయంతి వేడుకలకు కూటమి నేత లు గైర్హాజరుకావడంతో ఆయనంటే చిన్నచూపెందుకన్న విమర్శలొచ్చాయి.మంగళవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025చిత్తూరు అర్బన్: పోలీస్.. అర్ధరాత్రి వేళ వీధుల్లో గస్తీ కాస్తూ ప్రజల మానప్రాణాలను కాపాడే రియల్ హీరో. రోడ్లపై దుమ్ము, ధూళిలో నిలబడి ట్రాఫిక్ నియంత్రణ చేసే ఓ సంఘ సేవకుడు. సమాజం కోసం తిండి తిప్పలు లేకుండా 24 గంటల్లో ఏ క్షణమైనా అధికారులు పిలిస్తే ఇట్టే వాలిపోయే ఓ సూపర్ మ్యాన్. చట్టం, న్యాయం, ధర్మానికి ప్రతిరూపాలైన మూడు సింహాల్లో.. కనిపించని నాలుగో సింహమే పోలీస్. అలాంటి నాలుగో సింహం పరిస్థితి ప్రస్తుతం బాలేదు. ఒత్తిళ్ల మధ్య నలిగిపోతోంది. కనీసం వారంలో ఒక్క రోజంటే ఒక్కరోజు.. సెలవు అడిగితే ఇచ్చే దిక్కులేదు. నాటి చరిత్ర ఇదీ.. పోలీసులంటే క్రమశిక్షణకు మారుపేరు. స్టేషన్లో పనిచేసే పైఅధికారి ఏం చెబితే అది చేయాలి. నోరెత్తి ఎందుకు..? అని అడిగితే అంతే సంగతులు. ఇక నెలకు ఓ రోజు సెలవు కావాలని చిట్టీ రాసుకెళితే, అగ్గిమీద గుగ్గిలమై అధికారులు భగ్గుమనే వాళ్లు. అలాంటి పోలీసులశాఖలో గత వైఎస్సార్ సీపీ సర్కారు ‘వీక్ఆఫ్’ (వారాంతపు సెలవు) తీసుకొచ్చి, ఖాకీల పాలిట అండగా నిలిచింది. పోలీసుల సాధకబాధలను ఆలకించి తీసుకున్న వీక్ ఆఫ్ నిర్ణయం ఆ శాఖలో ఓ సరికొత్త సంచలనం నమోదు చేసింది. అసలు పోలీసులకూ ఓ కుటుంబం ఉందని, వారితో వారంలో ఒక్కరోజైనా గడపాలని వారాంతపు సెలవులను తీసుకొచ్చి సరికొత్త చరిత్ర సృష్టించింది. పని ఒత్తిడి కారణంగా ఏ ఒక్కరినీ బలి కోరకూడదని భావించి, ఎందరో పోలీసుల పని ఒత్తిడిని అర్థం చేసుకుని, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన వీక్లీ–ఆఫ్ సంస్కరణ జిల్లాలోని కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు ప్రతిఒక్క పోలీసు అధికారి ఉపయోగించుకున్నవారే. ఆ చరిత్ర నేడు కనుమరుగు.. ప్రస్తుతం జిల్లా పోలీసుశాఖలో వీక్ ఆఫ్ పేరును ఖాకీలు దాదాపు మరిచిపోయారు. నిత్యం పనిలో ఒడిదుడుకులు, అధికారుల అరుపులు, క్షణం తీరిక లేని పరుగులతో సగటు పోలీసన్న బిజీ అయిపోయాడు. ఇలాంటి తరుణంలో కుటుంబంతో కలిసి వారంలో ఓ రోజు గడిపే పరిస్థితి కనుమరుగైంది. ఇటీవల జిల్లాలో జరిగిన పోలీసు సిబ్బంది బదిలీల్లో చిత్తూరు నుంచి రొంపిచెర్ల, సదుం, పుంగనూరు, సోమల లాంటి పోలీసుస్టేషన్లకు పదుల సంఖ్యలో సిబ్బంది బదిలీ అయ్యారు. భార్యాబిడ్డలు చిత్తూరులో.. కుటుంబ పెద్ద పుంగనూరు నియోజకవర్గంలో విధులు. వారంలో ఓ రోజు భార్య, బిడ్డల్ని చూద్దామని సెలవు అడిగితే, ఆ మాటను వినిపించుకునే నాథుడే లేరు. సెలవుపై డీఎఫ్ఓ చిత్తూరు కార్పొరేషన్: డీఎఫ్ఓ భరణి వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లారు. ఆమె ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు ఐదు రోజుల పా టు సెలవు పెట్టారు. అంత వరకు ఇన్చార్జిగా తిరుపతి డీఎఫ్ఓ వివేక్కు బాధ్యతలు అప్పగిస్తూ సీసీఎఫ్ యశోదబాయి ఆదేశాలు జారీ చేశారు. ఏపీ జీఈఏ ఐక్యవేదిక కోచైర్మన్గా బాలాజీ చిత్తూరు కలెక్టరేట్ : ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉద్యోగ ఉపాధ్యాయ కా ర్మిక పెన్షనర్ల ఐక్యవేదిక (ఏపీ జీఈఏ ఐక్యవేదిక) కోచైర్మన్గా శవన్న గారి బాలాజీ ఏకగ్రీవంగా ఎ న్నికయ్యారు. ఈయన ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 13 న విజయవాడలోని విద్యాధరపురంలో ఏపీ జీఈఏ చైర్మన్ సూర్యనారాయణ అధ్యక్షన ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఉపా ధ్యాయ సంఘంలో మండల స్థాయి నుంచి ఎదిగి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుతం బాలజీ సే వలందిస్తున్నారు. టీచర్ల సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఆయనకు ఏపీ జీఈఏ కోచైర్మన్గా అదనపు బాధ్యతలను అ ప్ప జెప్పారు. ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో కల్పించిన నూతన బాధ్యతలను కర్తవ్యంతో నిర్వహిస్తామని చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తానని తెలిపారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వెంకట సత్యనారాయణ, రాష్ట్ర సంఘటన కార్యదర్శి సిహెచ్ శ్రావణ్ కుమార్, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని టీచర్లు హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాతకు నివాళి చిత్తూరు అర్బన్: భాతర రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని నగరంలోని జిల్లా ఆర్ముడు రిజర్వు కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుంచే తీవ్ర సామాజిక వివక్షను ఎదుర్కొన్న అంబేడ్కర్, రాజ్యాంగ నిర్మాతగా మారినతీరు నేటి యువతరానికి ఆదర్శమన్నారు. ఆయన సూక్తు లు ప్రజల్ని ధర్మం, న్యాయం వైపు నడిచేలా చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ, ఎస్బీ సీఐ భాస్కర్, చంద్రశేఖర్, పోలీసు సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఉదయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వెదురుకుప్పం: చిత్తూరు జిల్లాలో పలు చోట్ల సోమవారం గాలీవాన బీభత్సం సృష్టించింది. వెదురుకుప్పం మండలంలోని ఎగువ కనికాపురంలో ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వైర్లు తెగి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భారీ వృక్షాలు నేలకూలాయి. ఇళ్లపై పడడంతో పాక్షికంగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కనికాపురం, ముఠాలం గ్రామాల్లో అకాల వర్షంతో వరి పంట నేల కొరిగి నష్టాల పాలైనట్లు అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలులకు పంటలు ధ్వంసమయ్యాయి. మండలంలో కొన్ని గ్రా మాల్లో వడగండ్ల వానకు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగడంతో ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. నేలరాలిన మామిడి పులిచెర్ల(కల్లూరు): మండలంలోని పలు పంచాయతీల్లో ఆదివారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షం, ఈదురుగాలులకు మామిడి కాయలు నేల రాలాయి. ఉరుములతో కూడిన వర్షం రావడంతో ఎండ తాపం నుంచి కొంత ఉపసమనం కలిగినా, కొన్ని చోట్ల మామిడి పంటకు నష్టం వాటిల్లింది. నేలకొరిగిన వరి తవణంపల్లె: మండలంలో ఆదివారం రాత్రి పెనుగాలులతో కూడిన వర్షం కురిసింది. మండలంలో 4.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెనుగాలులకు వరి పంట నేలకొరిగింది. మండలంలో 475 ఎకరా ల్లో వరి పంట వివిధ దశలో సాగులో ఉంది. ఈ దశలో అకాల వర్షంతో రైతులు న ష్టపోతున్నారు. వర్షానికి, పెనుగాలులకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. – 8లో– 8లోన్యూస్రీల్జిల్లాలో పోలీసుశాఖ బలగం హోదా పోస్టు ఎస్పీ: 1 ఏఎస్పీ: 1 డీఎస్పీలు: 6 సీఐలు: 30 ఎస్ఐలు: 41 ఏఎస్ఐలు: 103 హెడ్కానిస్టేబుళ్లు: 250 కానిస్టేబుళ్లు: 627 ఆర్ముడు రిజర్వు: 360 మినిస్టీరియల్ స్టాఫ్: 35 సెలవు కరువు పోలీసుశాఖలో కానరాని వారాంతపు సెలవు సెలవు అడిగితే..అధికారుల కన్నెర్ర ఖాకీలకు వీక్లీ ఆఫ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వ చొరవే మానసిక వేదనలో పోలీసులు పోలీస్ ఉద్యోగం.. కత్తి మీద సాములాంటిది. విధి నిర్వహణలో పనిభారం.. కేసుల దర్యాప్తునకు ఉరుకులు, పరుగులు.. ఉన్నతాధికారుల ఒత్తిళ్లు, వేధింపులు.. రాజకీయ నేతల జోక్యం.. అనధికార బదిలీలు.. చార్జ్ మెమోలు.. వీటన్నింటికీ తోడు కుటుంబాలకు దూరం కావడంతో నాలుగో సింహం నలిగిపోతోంది. గతంలో ఉన్న వీక్ ఆఫ్ కరువు కావడంతో మానసిక వేదనకు గురవుతోంది. ఇటీవల జిల్లా పోలీసు శాఖలో జరుగుతున్న ఘటనలే ఇందుకు నిదర్శంగా నిలుస్తున్నాయి. ‘ఈ చిత్రంలో నిర్జీవంగా పడి ఉన్న వ్యక్తి రాజశేఖర్. చిత్తూరు పోలీసు విభాగంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ (ఎస్టీఎఫ్)లో పనిచేసేవారు. పెళ్లి చూపులకు వెళ్లేందుకు సెలవు అడిగితే ఉన్నతాధికారులు నిరాకరించారు. సెలవు అడిగిన ప్రతిసారీ ఇతనికి నిరాశే ఎదురయ్యేది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురై 2018 ఏప్రిల్ 20న చిత్తూరులోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలోనే విధులు నిర్వర్తిస్తూ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.’ సం‘క్షామం’.. పోలీసు సిబ్బంది సంక్షేమానికి ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటామని, సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పే ఉన్నతాధికారులు వీక్ ఆఫ్ను ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. ఇక పోలీసులకు కష్టమొస్తే తామున్నామనే భరోసా ఇవ్వడానికి ఏర్పాటైన పోలీసు సంక్షేమ సంఘం జిల్లాలో ఉందో, లేదో కూడా తెలియని పరిస్థితి. వాళ్ల ఉనికిని కాపాడుకోవడం మాత్రమే యూనియన్ ఉందని తోటి సిబ్బంది బహిరంగంగానే దుమ్మెత్తిపోస్తున్నా.. నోరు మెదపని పరిస్థితి. ఏపక్షంగా జరిగిన బదిలీలను ఆపలేక, అడగలేకపోయిన యూనియన్ నాయకులు.. వారాంతపు సెలవు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టడానికి కూడా వెనుకంజ వేయడం విమర్శలకు తావిస్తోంది.పిడుగుపాటుకు రెండు ఆవుల మృతి గంగవరం: పిడుగు పాటుకు రెండు పాడి ఆవులు మృతి చెందిన ఘటన మండలంలో సోమవారం జరిగింది. మండలంలోని కీలపల్లి పంచాయతీ జేఆర్ కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు సుబ్రమణ్యం తన పొలంలోని చెట్ల కింద నాలుగు పాడి ఆవులు కట్టి ఉంచాడు. అయితే వర్షం కురుస్తున్న సమయంలో అక్కడ పిడుగు పడి రెండు పాడి ఆవులు ఘటనా స్థలంలోనే మృతి చెందాయి. దాదాపు రూ. 2 లక్షలు విలువ చేసే పశువులు ప్రమాదంలో మరణించడంతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదన చెందుతోంది. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని బాధితులు కోరారు. -
● ముస్లింల నిరసన
వక్ఫ్బోర్డు చట్టంరద్దు చేయండితిరుపతి మంగళం : దేశంలో ముస్లిం, మైనారిటీలను అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ఇందులో భాగంగానే వక్ఫ్బోర్డు చట్టం తీసుకొచ్చిందని వైఎస్సార్సీపీ ముస్లిం నాయకులు సయ్యద్ షఫీ అహ్మద్ఖాదరీ, మహ్మద్కాసీమ్బాషా, షేక్ ఇమ్రాన్ బాషా ఆరోపించారు. వక్ఫ్బోర్డు బిల్లును వెంటనే రద్దు చేయాలంటూ తిరుపతి మ హతి ఆడిటోరియం వద్ద ఉన్న పెద్ద మసీదు వద్ద సోమవారం వైఎస్సార్సీపీ ముస్లిం, మైనారిటీ నగర అధ్యక్షులు మహ్మద్ కాసీమ్బాషా(చోటాబాయ్) ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం భారత రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున వక్ఫ్బోర్డ్డు చ ట్టానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టినట్టు తెలిపారు. భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ కేంద్ర ప్ర భుత్వం ఆమోదించిన వక్ఫ్ బోర్డు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోట్లాది మంది ముస్లింల భూములను కొట్టేసేందుకు కేంద్ర ప్రభు త్వం కుట్రలతో వక్ఫ్బోరు చట్టం ప్రవేశపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు టీడీపీ జనసేన పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి మద్దుతు ఇచ్చి ముస్లింలకు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. ము స్లింల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, పవన్కళ్యాణ్కు వక్ఫ్బోర్డు బిల్లును వ్యతిరేకించాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. నిత్యం ముస్లింల సంక్షేమాన్ని ఆకాంక్షించే మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి వక్ఫ్బోర్డ్ బిల్లును వ్యతిరేకించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ముస్లిం నాయకులు ఖాదర్బాషా, గఫూర్, కజీర్, ఇస్మాయిల్, ముజాబింద్, జారీద్, మొదిసీన్, చాన్బాషా, అన్వర్, హాజి షేక్ ఫరీతాప్, షేక్ సలీమ్, ఎస్కె.కలీమ్, ఎస్. అమీర్బాషా పాల్గొన్నారు. సముద్రంలోకి 440 తాబేళ్ల పిల్లలు వాకాడు: మండలంలోని నవాబుపేట సముద్ర తీ రంలో సోమవారం ఫారెస్టు అధికారుల సమక్షంలో పిల్లలు ఉత్పత్తి చేసే ఆలీవ్రిడ్లీ తాబేళ్ల పిల్లలను స ముద్రంలో విడిచి పెట్టారు. ఈ ఏడాది మూడో ద ఫా నవాబుపేట వద్ద ఉన్న తాబేళపిల్లల సంరక్షణా కేంద్రం(హేచరీ)లో దాదాపు 475 గుడ్లను సేకరించి పొదిగించారు. అందులో 440 పిల్లలు ఆరోగ్యంగా బయటకు రావడంంతో వాటిని సముద్రంలో విడిచి పెట్టారు. తాబేళ్లను చంపినా, వేటాడినా చట్టరీత్యా నేరమని ఫారెస్టు అధికారులు తెలిపారు. -
పేదలపై ప్రభుత్వం చిన్నచూపు
–మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వెదురుకుప్పం : కూటమి ప్రభుత్వం పది నెలలుగా చేసింది కేవలం మోసాలతో ప్రజలను బురిడీ కొట్టించి పేదల కడుపుకొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలేనని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వా మి ఆరోపించారు. ఆదివారం ఆయన పుత్తూరులోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా పేదలను చిన్న చూపు చూస్తోందని విమర్శించారు. అక్రమ కేసులు బనాయిస్తూ అవలంబిస్తున్న నిరంకుశత్వ ధోరణిని నేనెప్పుడూ చూడలేదన్నారు. జగనన్నకు భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని పక్కన పెట్టి హోం మంత్రి అనిత వెటకారంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతున్నట్లు చెప్పారు. ప్రజల తిరుగుబాటు మొదలైతే ఎలాంటి వారైనా ప్రజాగ్రహానికి గురౌతారని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో అంబేడ్కర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా కూటమి ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎస్సీ నేతలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరును తప్పు పడుతూ హైకోర్టు మొట్టి కాయలు వేస్తున్నా మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇటీవల జరిగిన మేయర్, డిప్యూటీ మేయర్, ఎంపీపీ ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో ఉన్న నాయకులు ఎలాంటి ప్రలోభాలు, బెదిరింపులకు వెరవకుండా కూటమి అరాచకాలకు ఎదురొడ్డి పార్టీకి వెన్నుదన్నుగా నిలబడడం విశ్వసనీయత, నిబద్దతతకు నిదర్శనమన్నారు. పీఏసీలో సభ్యుడుగా తనకు స్థానం కల్పించినందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు శివాజి, సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
రొంపిచెర్ల : పూతలపట్టు మండలం బండపల్లె వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రొంపిచెర్లకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి జాహిద్ (22) మృతి చెందాడు. దీంతో విద్యార్థి స్వగ్రామం ఫజులుపేటలో విషాదం అలుముకుంది. ఫజులుపేటకు చెందిన మహబూబ్బాషా కుమారుడు ముత్తిరేవుల వద్ద ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కళాశాలలో శనివారం జరుగుతున్న కార్యక్రమానికి ద్విచక్ర వాహనంలో రొంపిచెర్ల నుంచి బయలుదేరగా బండపల్లె వద్ద ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో విద్యార్థి జాహిద్ అక్కడికక్కడే మృతి చెందాడు. సెల్ఫోన్ దొంగ పట్టివేత శ్రీరంగరాజపురం : సెల్ఫోన్ దొంగను స్థానికులు పట్టుకున్న సంఘటన మండలంలోని 49 కొత్తపల్లిమిట్ట కూరగాయల సంతలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు 49 కొత్తపల్లిమిట్టలో ప్రతి ఆదివారం కూరగాయల సంత జరుగుతుంది. ఈ సంతకు శ్రీరంగరాజపురం, గంగాధర నెల్లూరు, వెదురుకుప్పం మండలాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ఈక్రమంలో ప్రతి వారం సెల్ఫోన్ దొంగతనాలు జరిగేవి. ఆదివారం సాయంత్రం ఓ వృద్ధుడు నుంచి ముగ్గురు నిందితులు సెల్ఫోన్ దొంగలించడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సెల్ఫోన్ దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంత నిర్వహించే ప్రదేశంలో పోలీసులతో నిఘా ఏర్పాటు చేయాలని సంత నిర్వాహకులు, ప్రజలు కోరుతున్నారు. -
‘గల్లా’ స్వీయ చరిత్రపై వెబ్ సిరీస్
● మహిళలకు స్ఫూర్తిగా స్వీయ చరిత్ర పుస్తకం ● ప్రముఖ రచయిత, మాజీ పార్లమెంటు సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ తవణంపల్లె : కల్మషం..అబద్ధం లేకుండా మహిళలకు స్పూర్తిదాయకంగా ముద్రించిన గల్లా ‘అరుణకుమారి స్వీయ చరిత్ర’లోని కొన్ని అద్భుతమైన అంశాలు ద్వారా వెబ్ సిరీస్ తీయడానికి ఆలోచిస్తున్నానని ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ కథా రచయిత, మాజీ పార్లమెంటు సభ్యుడు వి.విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆదివారం మండలంలోని దిగువ మాఘంలోని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి స్వగృహానికి విచ్చేశారు. ఆయనకు మాజీ మంత్రి అరుణకుమారి, అమరరాజ బ్యాటరీస్ అధినేత రామచంద్రనాయుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. తండ్రికి మంచి కుమార్తెగా.. భర్తకు మంచి భార్యగా, తన పిల్లలకు మంచి తల్లిగా రాజకీయాల్లో రాణిస్తూ ప్రజలకు సేవలు అందించే నాయకురాలుగా ఎదిగిన అరుణమ్మ మహిళలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆమె సమ్మతిస్తే మంచి సినిమా, వెబ్సిరీస్ తీయవచ్చునని అభిప్రాయపడ్డారు. సినీ హీరో గల్లా అశోక్కు మంచి కథ రాసి హిట్ చేయించి సినిమా రంగంలో రాణించేలా చూడాలని స్థానికులు కోరారు. కార్యక్రమంలో స్థానికులు, సర్పంచ్ గోపి పాల్గొన్నారు. -
మేసీ్త్ర కుమార్తె సన్షైన్ అవార్డుకు ఎంపిక
● ఇంటర్ ఫలితాల్లో మెరిసిన కూలీబిడ్డ ● ఈనెల 15న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డు స్వీకరణ చిత్తూరు కలెక్టరేట్ /రొంపిచర్ల : మేసీ్త్ర పనులు చేసుకుంటూ జీవ నం సాగిస్తున్న శివన్న, దేవమ్మ దంపతుల కుమార్తె శ్రావంతి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించింది. జిల్లాలోని రొంపిచెర్ల కేజీబీవీ (కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయ)లో ఇంటర్మీడియట్ సీఈసీ గ్రూపు పూర్తి చేసింది. ఈ నెల 12న విడుదలైన ఫలితాల్లో ఆ విద్యార్థిని 1000 మార్కులకు గాను 935 మార్కులు సాధించింది. పేద కుటుంబంలో జన్మించి ఉత్తమ ఫలితాలు సాధించిన శ్రావంతి రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్న సన్షైన్ అవార్డుకు ఎంపికై నట్లు జిల్లా సమగ్రశిక్ష ఏపీసీ వెంకట రమణ వెల్లడించారు. పేద కుటుంబంలో జన్మించిన ఆ విద్యార్థిని మట్టిలో మాణిక్యంలా ఉత్తమ ఫలితాలు సాధించడంపై పలువురు అభినందించారు. అవార్డుకు ఎంపికై న ఆ విద్యార్థిని ఈనెల 15వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రి లోకేష్ చేతుల మీదుగా విజయవాడలో సన్షైన్ అవార్డును స్వీకరించనుంది. ఉత్తమ ఫలితాలు సాధించిన కేజీబీవీ విద్యార్థినిని డీఈవో వరలక్ష్మి, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ, టీచర్లు అభినందించారు. -
ఆవు పిడకలు...ఆరోగ్యం
తీర్థ యాత్రలో విషాదం పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద ఓ టీచ ర్ కుటుంబం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. టీచర్ మృతిచెందింది. కాణిపాకం.. భక్తజన సంద్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. వరుస గా సెలవులు రావడంతో రద్దీ నెలకొంది.సోమవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025నగరి : పీల్చే గాలి కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలనే సదుద్దేశంతో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా నగరి మండలం రాజులకండ్రిగకు చెందిన రైతు సుబ్బరాజు అగ్నిహోత్ర పిడకలు తయారు చేస్తున్నారు. రైతుగా సేంద్రియ పద్ధతిలో నూతన పంటలు సాగు చేసి అందరి మెప్పు పొందిన ఆయన పాడి రైతుగాను ఆరోగ్యమిచ్చే అంశాలపైనే దృష్టిసారించారు. హోమ పూజలు, ఇళ్లలో దూపం వేసే సమయంలోనూ వచ్చే పొగ ఆరోగ్యాన్ని ఇవ్వాలనుకునే ఆయన పర్యావరణ రక్షణకు సంబంధిత ఆయుర్వేద గ్రంథాలు చదవడం, సంబంధిత శాఖలోని వారిని కలిసి వారి వద్ద సలహాలు, సూచనలు పొంది అగ్నిహోత్ర పిడకల తయారీకి పూనుకున్నారు. కష్టంతో కూడుకున్న పనే అయినా పర్యావరణ రక్షణపై ఉన్న వ్యామోహంతో ఇంటి వద్దే ఒక పాక వేసుకొని అగ్నిహోత్ర పిడకల తయారీ చేస్తున్నారు. ఒక్కో పిడక రూ.30 10 కిలోల ఆవు పేడతో పిడకలు తయారు చేయాలంటే 3 కిలోల నెయ్యి , పాలు, పెరుగు, పంచితం అవసరం. వీటితో పాటు వేసే మూలికలు స్థానికంగా లభించవు. కొన్ని వస్తువులు చైన్నెలోని ఆయుర్వేద షాపునకు వెళ్లి తీసుకొస్తున్నారు. ఇలా తయారు చేయాలంటే ఒక్కో పిడకకు రూ.25 ఖర్చు అవుతోందని చెబుతున్నారు. వీటిని రూ.30కి విక్రయిస్తున్నారు. లాభాల కన్నా ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లు రైతు సుబ్బరాజు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చుట్టు పక్కల ఉన్న ఆలయాలలో జరిగే హోమ పూజలు, ఇళ్లలో జరిగే పూజలకు వాడటంతో పాటుతో తమిళనాడు, కర్ణాటకలలో జరిగే హోమ పూజలకు అగ్నిహోత్ర పిడకలు నగరి నుంచి తీసుకొని వెళతారు. ఒక్కసారి ఈ పిడకలు వాడి వాటి ప్రయోజనాలు తెలుసుకున్నవారు వాటిని వదలరు. – 8లో– 8లో– 8లోన్యూస్రీల్ అగ్నిహోత్ర పిడకలు.. ఆరోగ్యధాతువులు నగరి మండలం రాజులకండ్రిగలో తయారీ ఒక్కో పిడక తయారీకి రూ.25 ఖర్చు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్న వైనం ఆరోగ్యాన్ని పంచడమే లక్ష్యమంటున్న రైతు సుబ్బరాజు వినియోగించడం ఎలా.. ఇంట్లో హోమ ద్రవ్యంగాను , అగ్నిహోత్రంగా, ధూపంగా వేసినట్లైతే మూలికలతో తయారైన ఈ పిడకల నుంచి వచ్చే పొగ రోగ కారక క్రిములను అంతరిపంజేసి, వాతావరణ కాలుష్యం నివారించి ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ విరివిగా లభిస్తుంది. ఆరోగ్యంతో పాటు సుగంధ భరితమైన సువాసనలతో ఇంటి వాతావరణం ఆధ్యాత్మికతను సంతరించుకుంటుంది. ఆవుపేడ కదా అందులో ఏముంది అనుకునే వారికి దాని విలువ తెలియకపోవచ్చు.. ముందు తరాలవారు దాని విశిష్టతను గుర్తించారు. వారికి దాని ఉపయోగాలు తెలుసు..అందుకే ఆవు పేడ నీటితో కళ్లాపి చల్లేవారు.. పేడ అలికిన ఇల్లు శుభదాయకమని చెప్పేవారు. మట్టి గోడలకు పేడను అలికేవారు.. ఇలా క్రిమి కీటకాలను ఆవుపేడ నశింపజేస్తుందని వారు ముందే పసిగట్టారు. పేడ విలువను గుర్తించిన నేటితరం ఆవుపేడతో చెయ్యలేనిది ఏమీ లేదని నిరూపిస్తున్నారు. ఇప్పటికే ఆవు పేడతో సేంద్రియ ఎరువులు, బయోగ్యాస్ , పిడకలు, విభూతి, పళ్లపొడి, రాఖీలు, ప్రమిదలు, బొమ్మలు, దేవుళ్ల ప్రతిమలు, కుండీలు, జపమాలలు, అగరొత్తులు అంటూ ఎన్నో రకాలుగా ఆవు పేడను వినియోగిస్తున్నారు. ఇలా ఆవు పేడలో మూలికలు కలిపి అగ్నిహోత్ర పిడకలు తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు రాజుల కండ్రిగ రైతు సుబ్బరాజు. ఆరోగ్యం కోసమే చేస్తున్నా ఆరోగ్యకరమైన పంటల కోసం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. అలాగే గాలి కూడా వీలైనంత మేర ఆరోగ్యకరంగా ఇవ్వాలనే ఆలోచనే ఈ పిడకల తయారీకి దారి తీసింది. పూర్వీకులు ఉదయాన్నే సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాల నుంచి వెలువడే రేడియేషన్ను నిర్మూలించేందుకు ఆవుపేడను నీళ్లలో కలిపి కళ్లాపి చల్లేవారని ఈ మధ్య కాలంలో జరిపిన ప్రయోగాల్లో కనుగొన్నారు. ఒక పిడక మీద సెల్ ఫోన్ ఉంచినప్పుడు అది వెలువరించే రేడియేషన్ పరిమాణం తగ్గినట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపినట్లు పత్రికల్లో చదివాను. ఆయుర్వేద గ్రంథాలలో వాయు కాలుష్య నివారణకు సూచించిన మార్గాలను తెలుసుకొని ఆయుర్వేదానికి సంబంధించి కొందరి సలహాలతో అగ్నిహోత్ర పిడకలను తయారు చేస్తున్నా. లాభాల కన్నా ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే వీటిని తయారు చేస్తున్నా. – సుబ్బరాజు, పాడి రైతు, రాజులకండ్రిగ తయారీ ఇలా.... దేశీవాళీ గిర్ ఆవుల పేడలో నెయ్యి, పాలు, పెరుగు, పంచితం, హోమ ద్రవ్యాలైన రావి, మోదుగ, జమ్మి, అర్క, గరిక, దర్భ, మేడి, చండ్ర, సరస్వతీ, తామర మొదలగు సమిధలతో పాటు సాంబ్రాణి, సర్జారసం, తెల్ల గుగ్గులు, వస, జటామాన్సి, ఆవాలు, కస్తూరి పసుపు, అపరాజిత, వేప, సుగంధి పాల, గ్రంథి తగర, చెంగాల్వ కోస్తు, పచ్చ కర్పూరం మొదలగు సుగంధ భరిత ద్రవ్యాలను కలిపి ముద్దలు చేసి కావాల్సిన ఆకారంలో చేసి ఎండబెడతారు. ఇలా శాస్త్రోక్తంగా పవిత్రంగా ఈ పిడకలు తయారవుతాయి. కావాల్సిన సామగ్రి సమకూర్చడానికి మాత్రమే ఎక్కువ సమయం పడుతుంది. అన్ని వస్తువులు ఉంటే రోజుకు ఒక మనిషి 300 పిడకలు చేసి ఎండబెట్టవచ్చు. -
జిల్లా జడ్జి భీమారావు సేవలు స్ఫూర్తిదాయకం
చిత్తూరు అర్బన్ : జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు సేవలు స్ఫూర్తిదాయకమని స్థానిక మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రమేష్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జిల్లా కోర్టు భవనంలో బదిలీ అయిన భీమారావును సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి రమేష్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో భీమారావు అందరికీ ఆదర్శమని కొనియాడారు. అనంతరం భీమారావును న్యాయమూర్తులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మూడో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి గురునాథ్, 8వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీదేవి, తొమ్మిదో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు, ఎరచ్రందనం కేసుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి, న్యాయసేవాసదన్ జిల్లా కార్యదర్శి భారతి, న్యాయమూర్తులు పద్మజ, వెన్నెల, ఉమాదేవి, శ్రీనివాస్, బాబ్జాన్, న్యాయమూర్తులు పాల్గొన్నారు. అలాగే జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావును కోర్టు అధికారులు, ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా కోర్టు పరిపాలనాధికారి నిర్మల అధికారులు, ఉద్యోగుల పాల్గొన్నారు. నేడు పోలీసు గ్రీవెన్స్ రద్దు చిత్తూరు అర్బన్ : అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. అలాగే నగరపాలక సంస్థలో కూడా వేదికను వాయిదా వేస్తూ నగర కమిషనర్ నరసింహ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. -
● జిల్లాలో సిజేరియన్లే అధికం ● ప్రైవేటుతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ కోతలే.. ● తగ్గుముఖం పట్టిన సాధారణ ప్రసవాలు ● కోతలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవ వివరాలు నెల సుఖ ప్రసవం సిజేరియన్ మొత్తం సెప్టెంబర్ 575 280 855 అక్టోబర్ 599 257 856 నవంబర్ 611 261 872 డిసెంబర్ 510 283 793 జనవరి 493 222 715 ప్రైవేటు ఆస్పత్రిలో ప్రసవ వివరాలు నెల సుఖ ప్రసవం సిజేరియన్ మొత్తంసెప్టెంబర్ 403 308 711 అక్టోబర్ 440 293 733 నవంబర్ 466 281 747 డిసెంబర్ 459 271 730 జనవరి 446 242 688 ఫిబ్రవరి 414 220 634 ఆధునిక వైద్య విధానంలోనూ అమ్మలకు కడుపు కోతలు తప్పడం లేదు. ఏటా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ సిజేరియన్లు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ స్థాయిలో సిజేరియన్ ప్రసవాల్లో మన రాష్ట్రం అయిదో స్థానంలో ఉండడం వైద్య నిపుణులను కలవరానికి గురిచేస్తోంది. సిజేరియన్లు తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నా అనుకున్న లక్ష్యాలు సాధించడంలో వెనుకబడుతున్నారు. ఇప్పటికై నా వైద్యాధికారులు మేల్కొనకపోతే తల్లులు మరింత ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. – కాణిపాకంజిల్లాలో గర్భిణులు బలహీనమవుతున్నారు. పౌష్టికం అందక అల్లాడుతున్నారు. దీంతో గర్భిణులు కడుపు కోతలకు చేరువుతున్నారు. ఇక ఆస్పత్రులు అవసరాన్ని ఆసరాగా చేసుకుని కడుపుకోతలు పెడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు తేడా లేకుండా సిజేరియన్లు పుంజుకుంటున్నాయి. అత్యవసర పరిస్థితిని ఆసరాగా చేసుకొని బలవంతంగా ప్రసవాలు చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రక్తం తగ్గిందని, బిడ్డ ఉమ్మనీరు తాగేసిందని, బరువు ఎక్కువగా ఉందని, రక్తపోటు అధికమైందని, బిడ్డ అడ్డం తిరిగిందని.. ఇలా రకరకాల కారణాలు చెబుతూ ఆపరేషన్్ వైపు ఆసక్తి చూపుతున్నారు. లక్షల రూపాయల పేరిట ఫీజులు వసూలు చేస్తున్నారు. బాధితుల్లో ఎక్కువగా పేదలు, సామాన్యులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. సిజేరియన్ ప్రసవాల్లో రాష్ట్రం ఐదో స్థానంలో నిలిచింది. 60 శాతం ప్రసవాలు సిజేరియన్లే ఉన్నాయని వీటిని 30 శాతానికి కుదించాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆపరేషన్ ప్రసవాలే అధికం పేరుకే ప్రభుత్వాస్పత్రుల్లో సుఖ ప్రసవాలని చెప్పుకొస్తున్నారు. ప్రచార ఆర్భాటం చేస్తున్నారు. గత ఆరు నెలల కాలంలో మొత్తం 8,983 ప్రసవాలు జరగగా సాధారణ ప్రసవాలు 5,851 జరగగా ఆపరేషన్లు 3132 జరిగాయి. గతేడాది కూడా ఇదే ఇదే పరిస్థితి. ప్రస్తుతం జిల్లాలో 55 నుంచి 60 శాతం వరకు సిజేరియన్లు జరుగుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ రికార్డు స్థాయిలో ఆపరేషన్ల ద్వారా ప్రసవాలు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. నిబంధనలకు పాతర గర్భిణులకు శస్త్ర చికిత్స చేస్తే అందుకు గల కారణాలను రిపోర్ట్లో స్పష్టంగా నమోదు చేయాలి. కానీ అనారోగ్య కారణాలు చూపుతూ ఇష్టారాజ్యంగా శరీరంపై కత్తిగాట్లు పెడుతున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నా..అత్యవసరమని చెప్పి శస్త్ర చికిత్సలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. గర్భిణిని తొలి నుంచి పరిశీలించాలి. ఆశా కార్యకర్తలు నిత్యం పరిశీలించాలి. జిల్లాలో అదెక్కడా జరిగిన దాఖలాలు లేవు. శని, ఆదివారాలు వస్తే చాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు కనిపించడంలేదు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ.. ధనార్జనే ధ్యేయంగా ప్రైవేటు ఆస్పత్రులు కడుపు కోతలు పెడుతున్నాయి. ఆస్పత్రికి వచ్చిన వారి నుంచి డబ్బు వసూలు చేసి శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. సాధారణ ప్రసవం జరిగే అవకాశం ఉన్నా పట్టించుకోవడంలేదు. రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు కడుపు కోతలకు ఫీజు వసూళ్లు చేస్తున్నారు. దీని కారణంగా భవిష్యత్తులో మహిళలకు అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. అయినా గర్భిణులు చేసేది లేక వైద్యుల మాటలు విని శస్త్ర చికిత్స చేయించుకుంటున్నారు. మరికొందరు ముహూర్తం పేరుతో శస్త్ర చికిత్సకు మొగ్గు చూపుతున్నారు. ఇంకొంత మంది మహిళలు పురిటి నొప్పులు భరించలేక ఆపరేషన్కు సిద్ధమవుతున్నారు. ఈ ముహూర్తాల ప్రసవాలు ప్రైవేటు ఆస్పత్రుల్లో జోరుగా సాగుతున్నాయి. దీంతో సాధారణ ప్రసవాల కంటే సిజేరియన్లే అధికమవుతున్నాయి. సిజేరియన్ కారణాలు.. టీనేజీ గర్భిణులు బిడ్డ బరువు పెరగడం బిడ్డ అడ్డం తిరగడం ఉమ్మనీరులో తేడా బిడ్డ తక్కువ బరువు ఆక్సిజన్ సమస్య హైరిస్క్ సమయాల్లో... తల్లులు ఆరోగ్య సూత్రాలు పాటించకపోవడం లేట్ ప్రెగెన్సీ నొప్పులు భరించలేని సమయంలో... నివారణ ఎలా అంటే .. గర్భిణులు తొలి నుంచి మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలి. మందులు, మాత్రలు వాడాలి. బీపీ, మధుమేహం కట్టడిలో ఉంచుకోవాలి. ప్రసవ సమయానికి ఆస్పత్రిలో చేరాలి. ముహూర్తాల పేరుతో ఆపరేషన్లు చేయించుకోకూడదు. గతేడాది డిసెంబర్ నెలలో చిత్తూరుకు చెందిన ఓ గర్భిణి ప్రసవం కోసం అర్ధరాత్రి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆశ్రయించింది. బిడ్డ పరిస్థితి క్రిటికల్గా ఉందని..సిజేరియన్ చేస్తే తల్లీ, బిడ్డ ఇద్దరు సురక్షితమని అక్కడి డాక్టర్లు గర్భిణి కుటుంబీకులకు వివరించారు. వారు చెప్పే మాటలకు భయపడ్డ కుటుంబీకులు వెంటనే తమిళనాడులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు సుఖ ప్రసవం చేశారు. తల్లీబిడ్డ ఇద్దరు సురక్షితంగానే ఉన్నారు. గుడిపాలకు చెందిన ఓ గర్భిణి ఆరు నెలల కిందట ప్రసవం కోసం చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చింది. అక్కడ అన్ని పరీక్షలు చేసి అత్యవసరమంటూ వెంటనే ఆపరేషన్కు సిద్ధపడిపోయారు. ఆపరేషన్కు రూ.80 వేలు అవుతుందని చెప్పారు. ఆపై వారు బంధువుల సలహా తీసుకున్నారు. తమిళనాడులోని ఓ ఆస్పత్రి వైద్యులు మాత్రం తొలి చెకప్ నుంచి సుఖ ప్రసవమంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆలోచనలో పడ్డ ఆమె భర్త వెంటనే అంబులెన్స్ ద్వారా వేలూరుకు తీసుకెళ్లారు. అక్కడ సుఖ ప్రసవం చేశారు. రూ.35 వేలతో బయటపడ్డారు. హైరిస్క్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ రకరకాల కారణాల వల్ల సిజేరియన్లు జరుగుతుంటాయి. వీటిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను అప్రమత్తం చేస్తూ వస్తున్నాం. గర్భిణుల నమోదు విషయంలో తక్షణ స్పందించేలా చేస్తున్నాం. చాలా మంది మూడో నెలో, ఐదో నెలలో నమోదు చేసుకుంటున్నారు. అలాంటి వారిని ముందుగానే గుర్తించి వైద్య సూచనలు, సలహాలు ఇస్తున్నాం. హైరిస్క్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. టీనేజీ గర్భిణులపై దృష్టి సారిస్తున్నాం. ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్ల కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం. – సుధారాణి, డీఎంఅండ్హెచ్ఓ, చిత్తూరు పౌష్టికాహారం తీసుకోవాలి జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. తినే తిండిలో బలం ఉండాలి. జంక్ ఫుడ్స్ వద్దు. మంచి పౌష్టికం ఉన్న పదార్థాలను తీసుకోవాలి. మూఢ నమ్మకాలు వీడాలి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వైద్య సూచనల మేరకు మందులు, మాత్రలు వాడాలి. పురిటి నొప్పులు భరించలేక ఆపరేషన్ల జోలికి వద్దు. బిడ్డకు జన్మనివ్వడం దేవుడు ఇచ్చిన వరం. – ఉషశ్రీ, గైనిక్ వైద్యురాలు, చిత్తూరు -
అంతా నిజం.. అడిగితే అబద్ధం!
కలియుగ వైకుంఠనాథుని సన్నిధిలోని టీటీడీ గోశాలలో మృత్యుఘోష భక్తులను ఆవేదనకు గురిచేస్తోంది. పరమ పవిత్రంగా పూజించే గోమాత దుస్థితి హృదయాలను కలచివేస్తోంది. పదుల సంఖ్యలో గోవులు మరణించిన ఘటన కూటమి సర్కారును కుదిపేస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్దలందరూ వేర్వేరుగా ప్రెస్మీట్లు పెట్టేశారు. వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన వైఎస్సార్సీపీ నేతలపై విరుచుకుపడ్డారు. గోవులు మరణించడం నిజం అంటూనే.. భూమన అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. ఒకరికొకరు పొంతన లేకుండా అలవోకగా అబద్ధాలు వల్లించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పిస్తామని బెదిరింపులకు తెగబడ్డారు. సాక్షి టాస్క్ఫోర్స్ : టీటీడీ గోశాలలో గోవుల మృతి కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికంగా మారింది. అమరావతి నుంచి వచ్చిన ఆదేశాలతో తిరుపతిలో ఆదివారం కూటమి నేతల హడావుడి కనిపించింది. ఎవరికి వారు విలేకరుల సమావేశం నిర్వహించి వైఎస్సార్సీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చెప్పినవన్నీ అసత్యాలు అంటూనే.. ప్రస్తుత టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గోవులు మృతి చెందడం వాస్తవమేనని ఒప్పుకున్నారు. అయితే వందకుపై చిలుకు కాదని, 40 అని ఎమ్మెల్యే, 20 నుంచి 22 వరకు అని టీటీడీ చైర్మన్ వెల్లడించడం గమనా ర్హం. ఎస్వీ గోశాలలో గోమాతలు మృత్యువాత పడు తున్నాయని టీటీడీ మాజీ చైరర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆధారాలతో బయటపెట్టిన విషయం తెలిసిందే. దీంతో కూటమి సర్కారు ఉలిక్కిపడింది. ఏం చే యాలో దిక్కుతోచక.. భూమన ఆరోపణలను టీటీడీ కొట్టిపారేసినా.. నిజం దాగదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రకటనల తో నిరూపితమైంది. వృద్ధాప్యం, వివిధ కారణాలతో గోవులు మృతి చెందడం సర్వసాధారణమని బీఆర్ నాయుడు ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆరణి మాత్రం.. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ‘ఎస్వీ గోశాలలో 40 గోవులు మృతి చెందాయని వెల్ల డించారు. అయితే అవన్నీ అనారోగ్యంతో మరణించాయని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆదివారం తాజాగా టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యుడితోపాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గోశాలను సందర్శించారు. ఈ సందర్భంగా 20 నుంచి 22 వరకు మృతి చెంది ఉండొచ్చని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మరోసారి స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా ‘ఇంట్లో మనుషులు చనిపోరా? గోశాలలో ఆవులు వృద్ధాప్యంతో మరణించి ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చా రు. గోవు కళేబరాల ఫొటోలు చూపిస్తూ ఇవన్నీ మార్ఫింగ్ అని, ఎక్కడో మృతి చెందినవి అంటూ కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే.. టీటీడీ గోశాలలో ఉండాల్సిన డాక్టర్ల కంటే తక్కువగా ఉన్నారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. మామూలుగా ఇక్కడ ఆరుగురు డాక్టర్లు ఉండాలని, ప్రస్తుతం ఒకరు పరారీలో ఉన్నారని, మరొకరు ఏదో కారణంతో రాలేదని టీటీడీ చైర్మన్ మీడియా సమక్షంలోనే ఒప్పుకున్నారు. కూటమి సర్కారును కుదిపేస్తున్న టీటీడీ గోశాల ఘటన గోవుల మృతి నిజమేనని మరోసారి ఒప్పుకున్న టీటీడీ చైర్మన్ 20 నుంచి 22 వరకు మరణించాయన్న బీఆర్ నాయుడు 40 మృత్యువాత పడినట్లు ఎమ్మెల్యే ఆరణి వెల్లడి వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన భూమనకు బెదిరింపులు కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పుతామని హెచ్చరికలు ప్రశ్నించే గొంతుకను నొక్కేసే కుట్ర టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందుతున్నాయని భూమన కరుణాకరరెడ్డి వెల్లడించిన వాస్తవాలపై ఎల్లో మీడియా ప్రతినిధులు ‘భూమనపై కేసులు నమోదు చేస్తారా? అంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని పదే పదే ప్రశ్నించారు. ఎల్లో మీడియా ఒత్తిడి మేరకు భూమన కరుణాకరరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చైర్మన్ ప్రకటించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదుచేస్తామని, ఇప్పటికే కొందరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారంటూ పరోక్షంగా పోసాని కృష్ణమురళిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీటీడీపై అసత్య ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ఈ మేర కు రాబోయే బోర్డు సమావేశంలో తీర్మానం కూడా చేస్తామని భాను ప్రకాష్రెడ్డి ప్రకటించడం గమనార్హం. గత వైఎస్సార్సీపీ హయాంలో టీటీడీపై అస త్య ప్రచారాలు చేసిన ఇదే నాయకులు నేడు ఇలా మాట్లాడుతుండడంపై ఆశ్చర్యపోతున్నారు. -
ఆకట్టుకుంటున్న మెగా ఎడ్యుకేషన్ ఎక్స్పో
తిరుపతి సిటీ: స్థానిక ఆర్టీసీ ఓవర్ బ్రిడ్జి సమీపంలోని చింతలచేను శ్రీరామ తులసి కళ్యాణ మండపం వేదికగా విద్యాస్ఫూర్తి పేరుతో ప్రముఖ యాడ్ 6 అడ్వర్టైజింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రెండు రోజుల మెగా ఎడ్యుకేషన్ ఎక్స్పో – 2025 ప్రారంభమైంది. ఇందులో నగర ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తొలి రోజు బెంగళూరు మార్తనహల్లిలోని హిందుస్తాన్ ఏవియేషన్ అకాడమీ, జాలహల్లి ఈస్ట్లోని సంభ్రమ్ ఇన్స్టిట్యూట్, కృష్ణరాజపురంలోని ఎస్ఈఏ(సీ) ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం, విద్యారంగ నిపుణులు పాల్గొని అడ్మిషన్ల ప్రక్రియ, ఫీజుల వివరాలు, క్యాంపస్ ప్లేస్మెంట్స్, పారిశ్రామిక రంగ అవసరాలకు అనుగుణంగా అందించే కోర్సులు, అంతర్జాతీయ కోర్సులపై అవగాహన కల్పించారు. నిర్వాహకులు రఘుకిషోర్ మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరగనున్న మెగా ఎడ్యుకేషన్ ఎక్స్పోకు ఊహించని రీతిలో స్పందన రావడం ఆనందంగా ఉందన్నారు. బెంగళూరు లాంటి సిటీలో విద్యనభ్యసించి ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలనే విద్యార్థులకు ఇది సరైన వేదికని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
నేడు అంబేడ్కర్ జయంతి వేడుకలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలో సోమవారం అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అంబేడ్కర్ జయంతి వేడుక లు సోమవారం జిల్లా కేంద్రంలో ఉదయం 9 గంటలకు దర్గా సర్కిల్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. అక్కడ నుంచి అంబేడ్కర్ చిత్ర పటంతో ర్యాలీగా మెసానికల్ మైదానం వద్ద ఉన్న అంబేడ్కర్ భవనానికి వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, అధికారులు, విద్యార్థులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 14 వ తేదీన డాక్టర్. బీఆర్ అంబేడ్కర్ జయంతి ప్రభుత్వ సెలవుదినం కావడంతో ప్రజా సమస్యల వేదిక రద్దు చేయడం జరిగిందన్నారు. మామిడి చెట్లు నరికి భూ ఆక్రమణ – టీడీపీ నాయకుల దౌర్జన్యం గంగాధర నెల్లూరు : కూటమి ప్రభుత్వం అండతో ఓ టీడీపీ నేత చెలరేగిపోతున్నాడు. తహసీల్దార్ కార్యాలయంలో మకాం వేసి వైఎస్సార్సీపీ నాయకులనే టార్గెట్ చేస్తున్నారు. వారి భూములను దౌర్జన్యంగా ఆక్రమించి దాడులకు తెగబడుతున్నారు. బాధితుడి కథనం మేరకు గంగాధర నెల్లూరు మండలంలోని కుప్పనపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త శంకర్రెడ్డికి చెందిన సర్వే నం.840లో మూడెకరాల 30 సెంట్లు పొలం ఉంది. ఈ భూమిలో మామిడి చెట్లు, టేకు చెట్లను పెంచుతూ వ్యవసాయం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే శంకర్రెడ్డికి చెందిన భూమిలో దాదాపు 110 మామిడి చెట్లు, 50 టేకు చెట్లను అదే గ్రామానికి చెందిన టీడీపీకి చెందిన యువరాజురెడ్డి, గంగిరెడ్డి నరికివేసి భూ ఆక్రమణకు తెగబడ్డారని పేర్కొన్నారు. ఈ మేరకు బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మూడేళ్ల కిందట రూ.లక్షలు ఖర్చు చేసి చెట్లు పెంచి పెద్దవి చేయగా నేడు కూటమి ప్రభుత్వం రాగానే ఇలా దౌర్జన్యకాండ చేస్తున్నారని వాపోయారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శ్రీవారి దర్శనానికి 20 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ ఎంబీసీ వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 72,923 మంది స్వామివారిని దర్శించుకోగా 35,571 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.33 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 20 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. పత్రికా స్వేచ్ఛను కాపాడండి – ‘సాక్షి’పై అక్రమ కేసులు ఎత్తివేయాలని ఆందోళన కుప్పం : కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను అణగదొక్కేందుకు జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తోందని కుప్పం జర్నలిస్టు సంఘాలు ఆందోళనకు దిగాయి. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు మరో ఆరుగురు పాత్రికేయులపై అక్రమ కేసులు నమోదు చేయడంపై నిరసన చేపట్టారు. అనంతరం కుప్పం అర్బన్ ఎస్ఐ బాబుకు వినతిపత్రాన్ని అందజేశారు. అక్రమ కేసులను ఉపసంహరించుకొని పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ఈ సందర్భంగా జర్నలిస్టులు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అక్రమాలను వెలికితీస్తున్న ‘సాక్షి’ పత్రికపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తప్పుడు కేసులు నమోదు చేసి జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయడం చట్టరీత్యా నేరమన్నారు. ‘సాక్షి’పై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకొని ప్రజల పక్షాన నిలబడుతున్న పత్రికను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వెంకటాచలం, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉదయ్ రెడ్డి, స్థానిక పాత్రికేయులు హరినాథ్, నాగరాజ్, గణేష్, రవికుమార్, వెంకటేష్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
తీర్థయాత్రలో విషాదం
● టీచర్ కుటుంబాన్ని కబళించిన రోడ్డు ప్రమాదం ● మహిళా టీచర్ మృతి ● భర్త, కుమార్తె పరిస్థితి విషమం పుంగనూరు : ఉపాధ్యాయ దంపతులు నూతన కారు కొనుగోలు చేశారు.. అదే సమయంలో కుమారై ఇంటర్లో అధిక మార్కులు సాధించడంతో సంతోషంగా తీర్థ యాత్రలకు వెళ్లి తిరిగీ ఇంటికి వెళ్లే సమయంలో తీర్థయాత్ర అంతిమ యాత్రగా మారింది. ఓ లారీ మృత్యువు రూపంలో వచ్చి ఆ సంతోషాన్ని క్షణాల్లో చిదిమేయడంతో తల్లి మృతి చెందగా భర్త , కుమారై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న విషాదకర సంఘటన ఆదివారం జరిగింది. దీంతో మూడు జిల్లాల్లో విషాదం నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. పుట్టపర్తి జిల్లా కదిరి పట్టణంలో నివాసం ఉన్న వెంకటరమణ (48) , శారద (45) ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. వీరికి కుమారై కీర్తన (17) , కుమారుడు శ్రీకర్ (12) ఉన్నారు. ఇలా ఉండగా వెంకటరమణ నూతనంగా కారు కొనుగోలు చేశారు. కుమారై ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 976 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. కుమారుడు శ్రీకర్ గుడివాడలో 7వ తరగతి చదువుతున్నాడు. అంతా సంతోషంగా పున్నమి రోజున శనివారం తమిళనాడులోని తిరువణ్నామలైలో గిరి ప్రదక్షిణానికి వెళ్లారు. స్వామి వారిని భక్తితో పూజించుకుని , మొక్కులు చెల్లించుకుని ఆదివారం ఉదయం అక్కడి నుంచి కదిరికి బయలు దేరారు. మార్గ మధ్యలో పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్దకు కారు రాగానే ఎదురుగా మదనపల్లె నుంచి అతివేగంగా వచ్చిన ఐషర్ లారీ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో శారద అక్కడికక్కడే మృతి చెందింది. వెంకటరమణ, కుమారై కీర్తన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి బాధితులను మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టంకు తరలించి, దర్యాప్తు చేపట్టారు. మూడు జిల్లాల్లో విషాదం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శారద, వెంకట రమణ కుటుంబం పుట్టపర్తి జిల్లా కదిరిలో నివాసం ఉన్నారు. శారద అదే మండలం బాలప్పగారిపల్లెలో టీచర్గా పనిచేస్తున్నారు. అలాగే వెంకటరమణ అన్నమయ్య జిల్లా సోంపల్లెలో స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. కాగా వెంకటరమణ స్వగ్రామం కలకడ మండలం ఎర్రయ్యగారిపల్లె కావడంతో అంత్యక్రియలు అక్కడ నిర్వహించనున్నారు. ఈ ప్రమాద వార్త తెలియగానే మూడు జిల్లాల్లో విషాదం చోటు చేసుకుంది. ఉపాధ్యాయులు, బంధుమిత్రుల రోదనలు పలువురిని కలచివేసింది. -
కుక్కలదాడిలో లేగ దూడ మృతి
పులిచెర్ల(కల్లూరు) : మండలంలోని ముల్లంగివారిపల్లెలో కుక్కల దాడికి లేగ దూడ మృతి చెందింది. కుక్కల బెడద ఎక్కువగా ఉండడంతో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకొని కుక్కల బెడద లేకుండా చూడాలని కోరుతున్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడి మృతి తవణంపల్లె : మండలంలోని కాణిపాకం రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వృద్ధుడు మృతి చెందినట్లు తవణంపల్లె ఎస్ఐ చిరంజీవి తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు వివరాలు ఇలా ...ఈనెల 10వ తేదీన మండలంలోని సరకల్లు హరిజనవాడకు చెందిన ఎ.కాళయ్య(64) కాణిపాకం దైవ దర్శనానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా కాణిపాకం రోడ్డులోని సీడీఎం కల్యాణ మండపం వద్ద గుర్తు తెలియని (నంబరు ప్లేటు లేని వాహనం) ద్విచక్ర వాహనం ఢీకొనడంతో బలమైన గాయాలయ్యాయి. 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించగా శనివారం మృతి చెందాడు. మృతుడి కుమారుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి శ్రీరంగరాజపురం : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని 49 కొత్తపల్లిమిట్ట సీఎస్ఐ స్కూల్ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు పట్టణం కట్టమించిలోని వినాయకగుడి వీధిలో షణ్ముగం (44) నివాసం ఉండేవారు. భార్య నాగవేణి తన పుట్టిల్లు అయిన ఒడ్డుపల్లెకు వెళ్లింది. దీంతో షణ్ముగం శుక్రవారం రాత్రి చిత్తూరు నుంచి ద్విచక్ర వాహనంలో అత్తగారింటికి వస్తుండగా 49 కొత్తపల్లిమిట్ట సీఎస్ఐ పాఠశాల వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డుపై పడింది. తలకు తీవ్రగాయం కావడంతో స్థానికులు గుర్తించి 108 వాహనం ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి షణ్ముగం మృతి చెందినట్లు తెలిపారు. భార్య నాగవేణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 31 కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 70,462 మంది స్వామిని దర్శించుకున్నారు. 25,393 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.01 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన వారికి సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళితే లోనికి అనుమతించరని స్పష్టం చేసింది. -
రేపు ప్రజాసమస్యల పరిష్కార వేదిక రద్దు
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈనెల 14న రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 14వ తేదీన డాక్టర్. బీఆర్ అంబేడ్కర్ జయంతి ప్రభుత్వ సెలవు దినం కావడంతో రద్దు చేయడం జరిగిందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. వైఎస్సార్సీపీ హయాంలోనే ఆలయాల నిర్మాణం కార్వేటినగరం : వైఎస్సార్సీపీ హయాంలోనే రాష్ట్రంలో అత్యధికంగా ఆలయాల నిర్మాణం చేపట్టారని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని టీటీ కండ్రిగ గ్రామంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టిన శ్రీకృష్ణుని ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి.. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలోనూ ఆలయాల నిర్మాణం చేపట్టిన ఘనత వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. 2014 ఎన్నికల అనంతరం అనేక ఆలయాలను కూల్చి వేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. డిప్యూటీ సీఎంగా నియోజకవర్గంలో సుమారు 84 ఆలయాల నిర్మాణం చేపట్టానన్నారు. వీటితో పాటు వరద వేంకటేశ్వరస్వామి ఆలయం, కలిగిరి వేంకటేశ్వరస్వామి పురాతన ఆలయాలను టీటీడీలో విలీనం చేయించానని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కావస్తు న్నా ఒక్క ఆలయ నిర్మాణం చేపట్టిన పాపాన పోలేదని విమర్శలు గుప్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ సర్వేశ్వర్, జేసీఎస్ కన్వీనర్ పురంధర్, జిల్లా రైతు విభాగం కార్యదర్శి చందురాజు, మాజీ సర్పంచ్ ధర్మయ్య, మాజీ సింగిల్విండోఅధ్యక్షుడు లోకనాథరెడ్డి పలువురు పాల్గొన్నారు. -
వేడుకగా పుష్పపల్లకి
కాణిపాకం: చిత్తూరు నగరంలోని శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయంలో శనివారం రాత్రి పుష్పపల్లకి సేవను వేడుకగా నిర్వహించారు. దీంతో ఆల యంలో పంగుణి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవంలో భాగంగా స్వామివారికి ఉదయం అభిషేకం చేసి భక్తులకు దర్శన సేవలు కల్పించారు. రాత్రి పలు రకాల పుష్పాలు తెచ్చి పుష్ప సేవను ముస్తాబు చేశారు. ఉత్సవమూర్తిని పల్లకిలో ఆశీనులు చేసి పుష్ప పల్లకి సేవను ప్రారంభించారు. రాత్రి 9 గంటల సమయంలో ప్రారంభమైన సేవ అర్ధరాత్రి వరకు కొనసాగింది. భక్తులు అడుగడుగున స్వామి వారికి కర్పూర హారతులు పట్టారు. సెలెస్టాలో మీనాక్షి సందడి ● ముగిసిన ఉత్సవం కాణిపాకం : డింగ్..డింగ్..బావా అంటూ మీనాక్షి స్టెప్పులేసి కేక పుట్టించింది. చిత్తూరు నగరంలోని ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారంతో సెలెస్టా 2కే 25 ఉత్సవం ఘనంగా ముగిసింది. తొలుత విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అబ్బురపరిచాయి. ఈ ముగింపు ఉత్సవానికి మీనాక్షి చౌదరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేదికపై నాజుగ్గా నాలుగు స్టెప్పులు వేసి సినిమా విశేషాలను పంచుకుంది. తర్వాత చిత్ర యూనిట్ వేదికపై సందడి చేసింది. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ రావూరి వెంకటస్వామి, రావూరి శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఆశయాలు ప్రతి పల్లెకు తీసుకెళ్లాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఈనెల 14వ తేదీన వాడ వాడలా డా.బీఆర్. అంబేడ్కర్ జయంతిని పండుగలా జరుపుకోవాలని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినాయకం కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తమ సంఘం తరపున డాక్టర్. బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులు 100 మందిని సత్కరించనున్నట్లు చెప్పారు. అంబేడ్కర్ ఆశయాలను ప్రతి పల్లెకు తీసుకెళ్లి అక్షరాభ్యాసాన్ని పెంచేందుకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరుల్మని, జిల్లా అధ్యక్షుడు మురళి పాల్గొన్నారు. -
● గాడి తప్పిన ఇంటర్మీడియట్ విద్య ● ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో అట్టడుగు స్థానం ● సీఎం సొంత జిల్లా చిట్టచివరి స్థానం ● ప్రభుత్వ కళాశాలల్లో అధ్వాన్నంగా ఇంటర్ ఫలితాలు ● గుణపాఠాలు నేర్వని విద్యాధికారులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 32 మండలాల్లో 139 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలున్నాయి. ఈ కళాశాలల నుంచి ప్రస్తుత విద్యా సంవత్సరంలో జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 28,261 మంది పరీక్షలకు హాజరయ్యారు. గత ఐదు సంవత్సరాల్లో వైఎస్సార్సీపీ సర్కారు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాడు– నేడు పథకం అమలు చేసింది. ఆ పథకంలో కార్పొరేట్ కళాశాలలకు తలదన్నే విధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలను అభివృద్ధి చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందేలా గత సర్కారు చర్యలు చేపట్టింది. అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ కళాశాలలపై చిన్నచూపు చూస్తోంది. దీంతో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో ఆఖరి స్థానంలో నిలిచింది. డీలా పడ్డ సర్కారు కళాశాలలు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాల్లో సర్కారు జూనియర్ కళాశాలలు డీలా పడ్డాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరంలోనూ ప్రైవేట్ కళాశాలలతో పోల్చుకుంటే అట్టడుగు స్థాయికి చేరుకున్నాయి. ఎంతో అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్నప్పటికీ ఫలితాల సాధనలో ఎందుకు పరుగులు పెట్టలేకపోతున్నారనే ప్రశ్నలు విద్యావేత్తల్లో తలెత్తుతున్నాయి. లోపం ఎక్కడుంది ? ఎందుకు విద్యార్థులు చదువులో రాణించలేకపోతున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంటర్మీడియట్ అధికారులు, కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ప్రభుత్వ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. జిల్లాలో ఫలితాలు ఇలా ... జిల్లా వ్యాప్తంగా మొదటి సంవత్సరం ఫలితాల్లో చిత్తూరు జిల్లా 54 శాతం ఫలితాలతో రాష్ట్రంలో చిట్టచివరి 26వ స్థానంలో నిలిచింది. అదే విధంగా ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 74 శాతం ఫలితాలతో రాష్ట్రంలో 24వ స్థానంలో నిలిచింది. మే 12వ తేదీ నుంచి సప్లిమెంటరీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను మే 12వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఫెయిలైన వారు, ఇంప్రూవ్మెంట్ రాయాలనుకునే విద్యార్థులు పరీక్ష ఫీజును సంబంధిత కళాశాలల్లో ఈనెల 15వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు చెల్లించాల్సి ఉంటుంది. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు 22వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రీ వెరిఫికేషన్కు ఒక్కో సబ్జెక్ట్కు రూ.1300, రీ కౌంటింగ్ ఒక్కో సబ్జెక్ట్ కు రూ.260 చెల్లించాల్సి ఉంటుంది. ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు ఆర్ట్స గ్రూపునకు రూ.1350, సైనస్ గ్రూపునకు రూ.1600 చెల్లించాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ల వారీగా ప్రథమ సంవత్సరం ఫలితాలు ఇలా.. మేనేజ్మెంట్ పరీక్షలకు హాజరైన ఉత్తీర్ణత చెందిన ఫెయిల్ అయిన విద్యార్థులు విద్యార్థులు విద్యార్థులు ప్రభుత్వ 2,481 1,172 1,309 ప్రైవేట్ 9,362 5,189 4,173 హైస్కూల్ ప్లస్ 361 140 221 మోడల్ స్కూల్స్ 511 312 199 కేజీబీవీ 176 133 43 ఏపీ రెసిడెన్షియల్స్ 292 222 70 మొత్తం 13,183 7,168 6,015 మేనేజ్మెంట్ల వారీగా ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఇలా.. మేనేజ్మెంట్ పరీక్షలకు హాజరైన ఉత్తీర్ణత చెందిన ఫెయిల్ అయిన విద్యార్థులు విద్యార్థులు విద్యార్థులు ప్రభుత్వ 2,160 1,514 646 ప్రైవేట్ 8,321 6,175 2,146 హైస్కూల్ ప్లస్ 288 185 103 మోడల్ స్కూల్స్ 441 349 92 కేజీబీవీ 227 180 47 ఏపీ రెసిడెన్షియల్స్ 325 271 54 మొత్తం 11,762 8,674 3,088 తొందరపాటు నిర్ణయాలొద్దు విద్యార్థులు క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 54 శాతం, ద్వితీయ సంవత్సరంలో 74 శాతం ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో 47 శాతం, ద్వితీయ సంవత్సరంలో 70 శాతం ఫలితాలు నమోదయ్యాయి. ఫెయిల్ అయిన విద్యార్థులు, ఇంప్రూవ్మెంట్ కు సంబంధిత కళాశాలల్లో ఫీజు చెల్లించి మే 12 వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు హాజరుకావచ్చు. – సయ్యద్ మౌలా, జిల్లా ఇంటర్మీడియట్ డీవీఈవో -
రఘురామా.. ఏమిటయ్యా ఇదీ !
● ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు ● చర్యలు చేపట్టని ఉన్నతాధికారులు పుత్తూరు : పుత్తూరులో ఓ ప్రభుత్వ ఉద్యోగి తన విధులను పక్కకు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను భుజానకెత్తుకున్నాడు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి. పుత్తూరు పట్టణానికి చెందిన కె.రఘురామ్ కొంత కాలంగా స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయంలో జూనియర్ అకౌంట్ ఆఫీసర్ (జేఏఓ)గా పనిచేస్తున్నారు. అయితే ఆయన ఈనెల 1వ తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అవతారం ఎత్తి, పుత్తూరు మున్సిపాలిటీ 10వ వార్డు గోవిందపాళెం గ్రామంలో పింఛన్లను తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. అలాగే నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఫొటోలకు ఫోజులు ఇస్తున్నవి వైరల్ అవుతున్నాయి. ఇంతటితో ఆగకుండా అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ భూమిని ఆక్రమించి పక్కా భవనాలు నిర్మించినట్లు ఆరోపణలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇలా ఇష్టానుసారం ప్రవర్తిస్తుంటే సంబంధిత శాఖాధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కారు బోల్తా.. 10 మందికి గాయాలు
దేవరపల్లి : అతి వేగంగా వెళుతున్న కారు 16వ నంబర్ జాతీయ రహదారిపై అదుపు తప్పి, పంట పొలాల్లో బోల్తా పడి, ఒకే కుటుంబానికి చెందిన 10 మంది గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బందార్లపల్లికి చెందిన 10 మంది కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో శనివారం మధ్యాహ్నం 2.40 గంటల సమయానికి తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం వద్దకు చేరుకున్నారు. అక్కడ కారు ఒక్కసారిగా అదుపుతప్పి హైవే పై నుంచి పల్టీలు కొడుతూ పంట పొలాల్లో పడింది. ఈ ప్రమాదంలో కారులోని 10 మంది కుటుంబ సభ్యులు స్వల్పంగా గాయపడ్డారు. కారులోని వారిని స్థానికులు బయటకు తీసి, హైవే అంబులెన్స్లో గోపాలపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి ప్రాణాపాయం లేదని పోలీసులు చెప్పారు. గాయపడిన వారిలో గౌరక్క (కోతుల లత), గౌరక్కగారి చిన్నమ్మాయి, కోతుల సోమశేఖర్, కోతుల యశ్వంత్, కోతుల చందన, భార్గవి, పభ్రేష్, లలిక, శిరీష, కారు డ్రైవర్ శ్రీకాంత్ ఉన్నారు. సంఘటన స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు దేవరపల్లి ఎస్సై ఇ.సుబ్రహ్మణ్యం తెలిపారు. -
ఇంటర్ ఫలితాల్లో శ్రీధర్స్ ప్రభంజనం
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి శ్రీధర్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారని కళాశాల చైర్మన్ మద్దినేని శ్రీధర్ తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో సి.ఉమామహేశ్వర్ 465, కె.నిత్యశ్రీకల్యాణి 464, వి.శ్రీకర్రెడ్డి 463, ఎస్.యామిని, కె.పనుష్య, పి.వాసవి, పి.మానస 462, సి.షామితారెడ్డి, పి.యశ్విత 460 మార్కులు సాధించారన్నారు. జూనియర్ బైపీసీ విభాగంలో సి.జ్యోష్ణ 433, వీఎస్ రక్షిత 426, ఎం.దివ్య 422, సి.ధన్యత, వి.ప్రియదర్శిని 419 మార్కులు సాధించినట్లు చెప్పారు. అలాగే సీనియర్ ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో బి.వన్షిక, మహమ్మద్ ఇమ్రాన్ 987, పి.నిఖిలేశ్వర్ 985, ఆర్.యుక్త 984, మహమ్మద్ తాలిబ్, డి.షోషిత 980 మార్కులు సాధించినట్టు తెలిపారు. ఈ మేరకు విద్యార్థులను అభినందించారు. -
వైఎస్సార్సీపీ పీఏసీ మెంబర్లుగా నారాయణస్వామి, రోజా
తిరుపతి మంగళం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ‘పొలిటికల్ అడ్వైజర్ కమిటీ’ని పూర్తి స్థాయిలో పునర్ వ్యవస్థీకరించి పీఏసీ మెంబర్లను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఈ మేరకు పీఏపీ మెంబర్లుగా మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, మాజీ మంత్రి ఆర్కే రోజాను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులను జారీచేసింది.రేపు అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలో ఈ నెల 14వ తేదీన డాక్టర్.బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కు మార్ గాంధీ వెల్లడించారు. శనివారం ఆ యన విలేకరులతో మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవనంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు దర్గా సర్కిల్లోని అంబేడ్కర్ విగ్రహానికి నివాళుల ర్పించడం జరుగుతుందన్నారు. అనంతరం అ క్కడ నుంచి అంబేడ్కర్ చిత్రపటంతో మెసానికల్ మైదానం వద్ద ఉన్న అంబేడ్కర్ భవనానికి ర్యాలీ నిర్వహిస్తారన్నారు. ఈ వేడుకలకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మి కులు, విద్యార్థులు హాజరు కావాలని కలెక్టర్ కోరారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘ ఉపాధ్యక్షుడిగా రవి పలమనేరు : పట్టణానికి చెందిన బీసీ నేత పూసల రవి జాతీయ బీసీ సంక్షేమ సంఘ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆ మేరకు హైదరాబాదు బీసీ భవన్లో శనివారం జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. క్రిష్ణయ్య నుంచి నియామక పత్రాన్ని అందుకున్నట్లు చెప్పారు. ఈ పదవి రాకతో మరింత బాధ్యతగా పనిచేస్తానని ఆయన తెలిపారు. -
వేడుకగా పుష్పపల్లకి
చిత్తూరు పట్టణంలోని అగస్తీశ్వర స్వామి ఆలయంలో శనివారం వేడుకగా పుష్పపల్లకి నిర్వహించారు.సగం కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిల్ చిత్తూరు కార్పొరేషన్ : రెండో శనివారం ప్రభుత్వ సెలవురోజు అయినప్పటికీ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను తెరిచారు. కానీ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో క్షేత్ర స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగలేదు. జిల్లాలో మొత్తం 8 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అందులో సగం కార్యాలయాల్లో బోణి కూడా అవ్వలేదు. ఉదయం నుంచి ఉద్యోగులు వేచి ఉన్నా ఎవరు కార్యాలయం వైపు రాలేదు. జిల్లాలో మొత్తం 43 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. అత్యధికంగా పలమనేరులో 21 డాక్యుమెంట్ల ద్వారా రూ.4.06 లక్షలు, పుంగనూరులో 12 డాక్యుమెంట్ల నుంచి రూ.3.15 లక్ష లు, చిత్తూరు అర్బన్లో ఎనిమిదింటికి రూ. 1.59 లక్షలు, బంగారుపాళ్యం రెండింటికి రూ.7850 ఆదాయం వచ్చింది. కాగా చిత్తూరు రూరల్స్, కుప్పం, కార్వేటినగరం, నగరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. వేణుగోపాలుడిగా కోదండరాముడు కాణిపాకం: వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు నగరంలో వెలసిన శ్రీకోదండరామస్వామి ఆలయంలోని స్వామి వారు శనివారం వేణుగోపాలుడిగా అభయమిచ్చారు. మూలవర్లకు ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. ఉదయం ఉత్సవమూర్తిని సుందరమయంగా అలంకరించారు. ఉత్సవంలో భాగంగా స్వామివారు వేణుగోపాలుడిగా దర్శనమిచ్చారు. నగరవీధుల్లో ఊరేగారు. రాత్రి అశ్వ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. భక్తులు భక్తిప్రపత్తులతో తరించారు. దోపిడీ కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు చిత్తూర్ అర్బన్ : చిత్తూరు నగరంలో గత నెల జరిగిన దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు సుబ్రహ్మణ్యంరెడ్డిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గాంధీ రోడ్డు కూడలిలో ఉన్న ఫ్యాన్సీ స్టోర్లో గత నెల 12న ఏడుగురు నిందితుల ముఠా దోపిడీకి ప్రయత్నించి విఫలమైన విషయం తెలిసిందే. వీళ్లను పట్టుకోవడానికి చిత్తూరులోని పదుల సంఖ్యలో పోలీసులు.. ఆక్టోపస్ బలగాలు రావడం అప్పట్లో సంచలనంగా నిలిచింది. కాగా ఈ కేసులో ఆరుగురు నిందితులను గతనెల అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిగా ఉన్న సుబ్రహ్మణ్యంరెడ్డికి కాళ్లు విరగడంతో అతడిని నెల రోజులుగా ఆసుపత్రిలో ఉంచి ౖచికిత్స అందించారు. తాజాగా సుబ్రహ్మణ్యంరెడ్డి కోలుకోవడంతో అరెస్టు చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా రిమాండ్కు ఆదేశించారు. – 8లో -
సమన్వయంతో నగరాభివృద్ధి
చిత్తూరు కలెక్టరేట్ : అన్ని వర్గాల ప్రజల సమన్వయంతో నగర అభివృద్ధికి చర్యలు చేపట్టేలా కృషి చేస్తున్నామని చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ జిల్లా అధ్యక్షుడు తాండవమూర్తి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పెన్షనర్స్ భవనంలో సమావేశం నిర్వహించారు. నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజల సమస్యలను గుర్తించేందుకు తమ సంఘం చర్యలు చేపడుతోందన్నారు. నగరంలోని ముఖ్య కూడళ్లల్లో మూత్రశాలల నిర్మాణానికి స్థలాలను గుర్తించి కమిషనర్కు పంపినట్లు తెలిపారు. సొసైటీ జిల్లా కార్యదర్శిగా పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల ప్రొపెసర్ గోపీనాయక్, ఉపాధ్యక్షుడిగా రిటైర్డ్ ఎస్సై మురళిని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు సత్య, చంద్రబాబు, కేశవరెడ్డి, శ్రీనివాసబాబు, చంద్ర, నాగేంద్ర, శాంత పాల్గొన్నారు. -
రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సురేంద్రరెడ్డి
చిత్తూరు కలెక్టరేట్ : ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పట్నం సురేంద్రరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్ కడప జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల నూతన కార్యవర్గం ఎన్నికల్లో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆయన ఆ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గుండారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు జయరాం, ప్రధాన కార్యదర్శి పెద్దిరాజుల చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రైవేట్ డిగ్రీ కళాశాలల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతానని చెప్పారు. ముగిసిన గ్రేడ్–3 ఏఎన్ఎంల కౌన్సెలింగ్ చిత్తూరు రూరల్ (కాణిపాకం) : రెండు రోజుల పాటు చేపట్టిన గ్రేడ్–3 ఏఎన్ఎంల ఉద్యోగోన్నతి ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. చిత్తూరు నగరంలోని కలెక్టరేట్ ప్రజావేదిక భవనంలో కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు ఉద్యోగోన్నతి ప్రక్రియను గతేడాది ప్రారంభించారు. 307 మందితో కూడిన జాబితాను సిద్ధం చేశారు. జాబితా చివరి దశకు చేరుకుని కౌన్సెలింగ్ పూర్తి చేసుకుంది. కలెక్టర్ అనుమతి పూర్తి అయితే ఉద్యోగోన్నతికి అర్హులైన వారికి ఆర్డర్ కాపీలు ఇవ్వనున్నారు. -
దిక్కు దిక్కునా ధనం
● పొరిగింటి రోడ్లపై రూ.కోట్లు కుమ్మరింపు ● పోటీ తప్పిస్తూ.. సింగిల్ టెండర్లకు ఆమోదం ● ‘పచ్చ’ నేతలకే పనులు.. ఇద్దరికే రూ.కోట్ల కట్టలు ● పీఆర్, ఆర్అండ్బీ రోడ్లకు మున్సిపల్ నిధులు చిత్తూరు అర్బన్: మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుతం నిధుల ప్రవాహం పారుతోంది. ఖజానాలోని నిధులను పాలకవర్గం ఓ స్థాయిలో ఖర్చు చేస్తోంది. నగర అభివృద్ధికి నిధులు ఖర్చుపెట్టడంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందేమీ ఉండదు. పైగా అందరూ స్వాగతిస్తారు. కానీ తమకు సంబంధం లేని రోడ్లపై రూ.కోట్లు కుమ్మరిస్తున్నారు. కాగా నగర నడిబొడ్డున, శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల గురించి ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ప్రధాన రోడ్లపై పనులు చేయడం సులభంగా ఉండడం, పైగా రూ.పది పెట్టుబడి పెడితే.. రూ.4 లాభం వస్తుండడంతో కాంట్రాక్టర్లకు ఇష్టారాజ్యంగా పనులు అప్పగిస్తున్నా రు. తొమ్మిది నెలల కాలంలో దాదాపు రూ.3.5 కోట్ల విలువైన పనులను ఇద్దరు ‘పచ్చ’ నేతలకే అప్పగించారు. కొత్త సంప్రదాయం.. రూ.50 లక్షల్లోపు అభివృద్ధి పనులకు పాన్, ఐటీ రిటర్న్స్, కంపెనీ రిజిస్ట్రేషన్ ఉంటే రెండో దశలో ఫైనాన్స్ బిడ్ చూస్తారు. రూ.50 లక్షలకు పైబడిన పనులకు అనుభవం తప్పనిసరి. ఇందులో తక్కువ మొత్తం కోట్ చేసిన వారికి పనులు ఇవ్వాలి. కానీ ఓ పని చేయడానికి ఇద్దరి కంటే ఎక్కువ టెండర్లు దా ఖలైతే పోటీలో ఉన్న కాంట్రాక్టర్ల నుంచి ‘తాము ఈ టెండర్ల నుంచి తప్పుకుంటున్నట్లు’ ఓ కాగితంతో రాసి సంతకాలు పెట్టి, అధికారులకు ఇస్తున్నారు. దీంతో పోటీలో ఉన్న ఒకే వ్య క్తికి పనులు అప్పగిస్తూ అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. 40 పనులకు ఆన్లైన్ టెండర్లు పిలిస్తే.. అన్నీ సింగిల్ టెండర్లనే ఆమోదించారు. రామ్నగర్ కాలనీలోని జనసేన పార్టీకి చెందిన కాంట్రాక్టర్ చేత బలవంతపు సంతకాలు తీ సుకున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక అధికార పార్టీకి చెందిన కీలక వ్యక్తి చక్రం తిప్పుతున్నట్లు ఆ పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. కూటమికి చెందిన ఒకే ఒక్క కాంట్రాక్టర్కు రూ.5 కోట్ల విలువైన 30 పనులు అప్పగించారు. చిక్కులు తప్పవా? నగరంలో ఫారెస్టు–పీవీకేఎన్ కళాశాల దారిలో దాదాపు రూ.80 లక్షల కార్పొరేషన్ నిధులు వెచ్చించి రోడ్డు పనులు చేస్తున్నారు. వాస్తవానికి ఇది పంచాయతీరాజ్ శాఖకు చెందిన రోడ్డు. ఆ శాఖలో నిధులు లేవా..? అంటే పుష్కలంగా ఉన్నా యి. అయినా సరే కాంట్రాక్టర్కు లాభం చేకూర్చడానికి ఇలా చేస్తున్నారనే విమర్శలున్నాయి. పీసీఆర్ పాఠశాల కూడలిలో దాదాపు రూ.40 లక్షల వ్యయంతో పండ్ల దుకాణాల కోసం షెడ్లు వేసి, నిర్మాణాలు పూర్తి చేశారు. ఇది ఆర్అండ్బీ శాఖకు చెందిన రోడ్డు. భవిష్యత్తులో రోడ్డు విస్తరణ జరిగితే ఈ షెడ్లు మొత్తం తీసేయాల్సిందే. అయినా సరే పాలకులు కార్పొరేషన్ నిధులను నేలపాలు చేస్తున్నారు. జిల్లా కోర్టు వద్ద నిర్మిస్తున్న ప్రహరీ గోడకు రూ.40 లక్షలపైనే నిధులు వెచ్చిస్తున్నారని, ఇ ది ఆర్అండ్బీ శాఖకు చెందిన రోడ్డని ఇటీవల డిప్యూటీ మే యర్ చంద్రశేఖర్ కౌన్సిల్ సమావేశంలో నిలదీసినా స్పందనలేదు. పాలకులు చెప్పిందల్లా చేస్తూ పోతే, చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సిందేననే విషయాన్ని అధికారులు విస్మరిస్తున్నారు.నగరంలో వసతులు శూన్యం కార్పొరేషన్ పరిధిలోని శివారు ప్రాంతాల్లో కనీస వసతుల్లేవు. నగరం నడిబొడ్డున ఉన్న ప్రజల సదుపాయాల కోసం కొట్టుమిట్టాడుతున్నారు. ఇవేమీ పట్టని పాలకు లు నలుదిక్కులా ఉన్న పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్ల కోసం నిధులను మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఇది విమర్శలకు దారితీస్తోంది. -
సెలెస్టాలో తళుక్కుమన్న ...నేపాలీ తార
కాణిపాకం : సెలెస్టాలో నేపాలీ తార నితిషా తళుక్కుమంది. చిత్తూరు నగరంలోని ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం సెలెస్టా 2కే 25 ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత సంప్రదాయ కళలు, జానపద సాహిత్యం, ఆధునిక హిప్ హాఫ్ షోలు అదుర్స్ అనిపించాయి. బ్యాండ్ షో మోత మోగించింది. అనంతరం నేపాలీ తార నితిషా విద్యార్థులతో ముచ్చటిస్తూ ఉత్సాహ పరిచారు. తదనంతరం ఎస్పీ మణికంఠ ఛందోలు మాట్లాడుతూ.. విద్యార్థి దశ అత్యంత కీలకమన్నారు. ఈ దశ నుంచి భవిష్యత్తును ఎంచుకోవాలన్నారు. ఇప్పటి నుంచే గోల్ కోసం పట్టుపట్టాలన్నారు. కార్యక్రమంలో కాలేజీ చైర్మన్లు రావూరి వెంకట స్వామి, రావూరి శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఫలితాలపై పరేషాన్ వద్దు !
పరీక్షా ఫలితాల సమయంలో ర్యాంకులు రాలే దని కొందరు.. మార్కులు తక్కువ వచ్చాయని ఇంకొందరు.. ఎక్కువ మార్కులు రాలేదని మరికొందరు..ఫెయిల్ అయ్యామని కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. పరీక్షా ఫలితాల వేళ క్షణికావేశ నిర్ణయాలు మంచివికాదు. విద్యార్థి ప్రతిభకు మార్కులు గీటురాయి కాదు. మార్కుల ఆధారంగా తెలివితేటలు అంచనా వేయడం సరైందికాదు. పిల్లల మార్కులను తల్లిదండ్రులు ప్రతిష్టగా భావించడం తప్పు. ప్రపంచంలోని మేథావులంతా ఎక్కువ మార్కులు సాధించిన వారేంకాదు.. విద్యా సంస్థల యాజమాన్యాలు మార్కుల వెంట పరుగెత్త కూడదు. పరీక్షలే సర్వస్వం కాదు.. జీవితం ఎంతో ఉందని విద్యావేత్తలు, మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నేడు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులపై ప్రత్యేక కథనం. చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్ మూల్యాంకనం పూర్తి అ య్యింది.. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాల విడుదల సమయం రానే వచ్చింది. శనివారం ఉదయం 11 గంటలకు పరీక్షా ఫలితాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అయింది. ఫ లితాల సమయంలో విద్యార్థులు క్షణికావేశంలో ఎ లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విద్యావేత్తలు, మానసిక వైద్యనిపుణులు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 139 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలున్నాయి. ఈ కళాశాలల నుంచి విద్యార్థులు 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షలకు దాదాపు 30 వేల మంది హాజరయ్యారు. విద్యార్థులకు మంచి జీవితం ఇవ్వాలని ఆశించేది తల్లిదండ్రులే. కంటికి రెప్పలా చూసుకుంటూ.. వారి బంగారు భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేది తల్లి దండ్రులే. పిల్లలకు ఏ చిన్న దెబ్బ తగిలినా తమకే తగిలినట్లు విలవిలలాడేది తల్లిదండ్రులే. అయితే అలాంటి తల్లిదండ్రులకు ధైర్యంగా ఉండాల్సిన విద్యార్థులు పలుచోట్ల ఆత్మహత్యలకు పాల్పడి మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. అయితే తల్లిదండ్రులు కూడా అంత గా ప్రేమించే వారిపై మార్కుల ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదని విద్యావేత్తలు చెబుతున్నారు. దండించొద్దు..ధైర్యం చెప్పండి.. ఇంటర్ ఫలితాలు శనివారం విడుదల కానున్న నేపథ్యంలో ఫలితాల్లో ఎవరైనా ఫెయిల్ అయితే వారిని దండించకుండా ధైర్యం చెప్పాలి. ఇంటర్ ఫెయిల్ అయినప్పటికీ విద్యార్థులకు సప్లిమెంటరీ రూపంలో మరో అవకాశం ఉంటుంది. అది రాసి మళ్లీ పాస్ కావచ్చు. ఉన్నత విద్యకు అర్హత సాధించవచ్చు. ఫెయిల్ అయ్యామని చులకనగా చూసే సమాజం ముందే తలెత్తుకుని జీవించవచ్చు. అవేమీ ఆలోచించకుండా క్షణికావేశంలో విద్యార్థులు మనోవేదనకు లోనుకావద్దు. పరీక్ష తప్పామని, ర్యాంకులు రాలేదని, ఎక్కువ మార్కులు తెచ్చుకోలేదని, వారిని ఒత్తిడికి గురిచేస్తే క్షణికావేశానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. తల్లిదండ్రులు ఫలితాల సమయంలో పిల్లలపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకూడదని విద్యావేత్తలు వెల్లడిస్తున్నారు. క్షణికావేశం కాదు.. క్షణం ఆలోచించండి ప్రతిభకు మార్కులు కొలమానం కాదు పరీక్షలే సర్వస్వం అనుకోవద్దు నేడు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విడుదల ఫలితం ఎలా ఉన్నా.. పరీక్షల ఫలితాలు అంటేనే చాలా మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో కంగారు ఉండటం సహజమే. ఫలితాలు ఎలా ఉంటాయో....తమకు ఫలితాలు ఎలా వస్తాయోనని విద్యార్థులు సైతం టెన్షన్ పడటం సహజమే. కానీ, పరీక్షల ఫలితం ఎలా వచ్చినా ఆందోళన చెందకూడదని, రిజల్ట్స్ ఎలా ఉన్నా పాజిటివ్ గా స్పందించాలని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. అనుకున్న దాని కంటే తక్కువ మార్కులు వచ్చాయని, చదివిన చదువుకు తగిన ఫలితాలు రాలేదని అతిగా స్పందించాల్సిన అవసరం లేదంటున్నారు. ఒక్క ఓటమితోనే తమ చదువు ముగిసిపోదని, ఉత్తమ ఫలితాలు సాధించగానే హీరోలైపోరని గుర్తించాలని వెల్లడిస్తున్నారు. జీవితం నష్టపోదనే భరోసా ఇవ్వాలి ఒకసారి పరీక్షలో తప్పితే జీవి తం నష్టపోదనే భరోసానివ్వా లి. మళ్లీ చదివి పాస్ కావచ్చనే ధైర్యం నింపాలి. పాస్ కాలేదని తిట్టకుండా, వేధించకుండా స ముదాయించాలి. తిరిగీ మంచిగా చదివి పాసయ్యే లా ప్రోత్సహించాలి. విద్యార్థులు కూడా క్షణికావేశానికి లోనుకాకుండా సమస్యను స్నేహితులు, తల్లిదండ్రులు, సన్నిహితంగా ఉండే టీచర్లతో చర్చించాలి. మార్కులు కాదు విజ్ఞానమే ముఖ్య మనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. – డాక్టర్ ప్రవీణ్కుమార్, మెడికల్ ఆఫీసర్, గంగాధర నెల్లూరు ఓ కన్నేసి ఉంచాలి... నేడు ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల అవుతున్నాయి. ఈ సమయంలో విద్యార్థులు క్షణికావేశానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అధ్యాపకులు, తల్లిదండ్రులు మార్కులు తక్కువ వచ్చినా.. ఫెయిల్ అయిన విద్యార్థులను చిన్నచూపు చూడకూడదు. విద్యార్థి ప్రతిభకు మార్కులు కొలమానం కానే కాదు. విద్యాసంస్థల యాజమాన్యాలు మార్కుల కోసం పిల్లలపై ఒత్తిడి తీసుకురాకూడదు. జీవితంలో ఏదైనా సాధించాలనే కసి, పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిగిన వారే ఏదైనా సాధిస్తారు. ప్రపంచ విజేతలుగా నిలుస్తారు. – సయ్యద్ మౌలా, ఇంటర్మీడియట్ డీవీఈఓ, చిత్తూరు జిల్లా ఈ విషయాలు మరువొద్దు.. ఫలితాలు ఎలా వచ్చినా.. విద్యార్థులు పాజిటివ్గా తీసుకోవాలి. విద్యార్థులతో పాటు కుటుంబం, స్నేహితులు, అధ్యాపకులు, చుట్టు పక్కల వారు ప్రవర్తించే తీరు ప్రభావం చూపుతుంది. ఫెయిలైన విద్యార్థి ఇంతటితోనే అంతా అయిపోయిందనే భావనను వీడాలి. ఓ పరీక్షలో మాత్రమే ఫెయిలయ్యామని, జీవితంలో కాదన్న విషయాన్ని గ్రహించాలి. ప్రధానంగా క్షణికావేశానికి గురికాకూడదు. తొందరపాటుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. తమలోని బాధను పంచుకోవడంతో పాటు నెగిటివ్ ఆలోచనలను దూరం పెట్టాలి. సభ్యులు, స్నేహితులు, చుట్టు పక్కల వారు ఫెయిలైన విద్యార్థులపై చులకన భావంతో ఉండకూడదు. స్నేహితులు, బంధువులు వారిని ఎగతాళి చేసినట్లు మాట్లాడొద్దు. వారికి తల్లిదండ్రులు, స్నేహితులు ఎలాంటి ప్రోత్సాహం అందిస్తారో, ఫెయిలైన వారిని కూడా అలాగే వెన్నుతట్టి ప్రోత్సహించాలి. ఫెయిలైనా జీవితంలో విజేతలుగా నిలిచిన వారి గురించి తెలియజేయాలి. ఆలోచిస్తూ బాగా చదివేలా వారిని ప్రోత్సహించాలి. ఇన్ని చెప్పినా విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడు తున్నట్లు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. -
నేడు యథావిధిగా రిజిస్ట్రేషన్ సేవలు
చిత్తూరు కార్పొరేషన్ : రెండో శనివారం ప్రభుత్వం సెలవు రోజు అయినప్పటికీ యథావిధిగా రిజిస్ట్రేషన్ సేవలు కొనసాగుతాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. క్రయవిక్రయదారులకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. వీటితో పాటు జిల్లా రిజిస్ట్రార్, డీఐజీ కార్యాలయాలు పనిచేస్తాయని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్నారు. శాస్త్రోక్తంగా పునఃనిర్మాణ పూజలు కాణిపాకం : కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ వీరాంజనేయస్వామి ఆలయ పునఃనిర్మాణ పూజలను శుక్రవారం శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయంలో విగ్రహ ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట, బింబ స్థాపన పూజలను వేద మంత్రోచ్ఛరణాలతో నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీమోహన్, ఈవో పెంచల కిషోర్, మాజీ చైర్మన్ మోహన్రెడ్డి, మణినాయుడు, సర్పంచ్ శాంతిసాగర్రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో నియామకాలు చిత్తూరు కార్పొరేషన్ : వైఎస్సార్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలో నియమాకాలు చేపట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన పలువురికి రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలో పలు హోదాల్లో చోటు కల్పించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం వివరాలను ప్రకటించింది. రాష్ట్ర విద్యార్థి విభాగంలో ఉపాధ్యక్షుడిగా ఓబుల్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా యుగంధర్, కార్యదర్శిగా నరేష్, సంయుక్త కార్యదర్శిగా కలయన్ భరత్, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగంలో ప్రధాన కార్యదర్శులుగా ఉపేంద్రరెడ్డి, పదార్థి రాధకృష్ణారెడ్డి, కార్యదర్శిగా అనిల్కుమార్రెడ్డి, రాష్ట్ర ఇంటలెక్ఛువల్ ఫోరం ఉపాధ్యక్షుడిగా అవిలా లోకనాథరెడ్డి, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ విభాగంలో కార్యదర్శిగా డాక్టర్.సైమన్సీజర్బండారు, సంయుక్త కార్యదర్శిగా సురేంద్రకుమార్ను నియమించారు. -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 31 కంపార్ట్మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 57,462 మంది స్వామివారిని దర్శించుకోగా 22,998 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.94 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
పూలే స్ఫూర్తితో అన్ని రంగాల్లో రాణించాలి
చిత్తూరు కలెక్టరేట్ : మహాత్మ జ్యోతిబాపూలే స్ఫూర్తితో అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీసీ భవన్లో మహాత్మ జ్యోతిబాపూలే 199వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మొదట పీసీఆర్ సర్కిల్ లోని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అందజేసే సంక్షేమ పథకాలు ఉపయోగించుకుని ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలన్నారు. జ్యోతిబా పూలే సంఘ సంస్కర్తగా ఎన్నో సేవలందించారన్నారు. బడుగు, బలహీన వర్గాల మహిళలకు చదువు నేర్పించాలనే ఉద్దేశంతో పూలే సతీమణి సావిత్రిబాయి పూలే దేశంలో మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సేవలందించారని తెలిపారు. ఆమె చూపిన బాటలో నేడు ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలు పిల్లలను ఉన్నతంగా చదివించుకోవాలని కోరారు. జాయింట్ కలెక్టర్ విద్యాధరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో యువత, మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. మహిళలకు కుట్టు మిషన్ ల శిక్షణ ఇప్పించి కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నారన్నారు.జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మాట్లాడుతూ.. మానవ వికాసానికి, మనుగడకు ప్రధాన భూమిక పోషించే విద్య ప్రాధాన్యంను పూలే తెలియజేశారన్నారు. ఆ నాటి సమాజంలో ఉన్న అసమానతలను వివక్షను రూపుమాపేందుకు విశేష కృషి చేశారన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళిమోహన్ మాట్లాడుతూ.. పూలే సేవలు చిరస్మరణీయమన్నారు. అనంతరం జిల్లాలోని బీసీ మహిళలకు, యువతకు 535 మందికి రూ.11.58 లక్షల విలువ చేసే వివిధ పథకాల మెగా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో నగర మేయర్ అముద, చుడా ఛైర్మన్ కఠారి హేమలత, బీసీ సంక్షేమ శాఖ అధికారి మునీంద్రయ్య, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి, బీజేపీ నాయకులు అట్లూరి శ్రీనివాసులు, బీసీ సంఘాల నాయకులు రవి, చోడప్ప, నాగరాజు, భరత్ పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛ హరించడం సబబుకాదు
చిత్తూరు అర్బన్: పాత్రికేయులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, జర్నలిస్టులను అణగదొక్కాలని చూస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చిత్తూరులో పాత్రికేయలోకం కదం తొక్కింది. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్, చిత్తూరు ప్రెస్క్లబ్, వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, గంగాధరనెల్లూరు నియోజకవర్గ ప్రెస్క్లబ్, తవణంపల్లె ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరు నగరంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లోకనాథన్, మురళీకృష్ణ, చిత్తూరు ప్రెస్ క్లబ్ కార్యదర్శి కాలేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వన్టౌన్ స్టేషన్ నుంచి గాంధీ విగ్రహం, ఆర్డీఓ కార్యాలయం వరకు పాత్రికేయులు వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు లోకనాథన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల గొంతుపై కేసులు పెట్టి పాత్రికేయులను లోబరచుకోవాలని చూస్తోందన్నారు. పల్నాడులో వైఎస్సార్ సీపీ కార్యకర్త హత్యకు గురైన వార్తలు రాసినందుకు ఆరుగురు పాత్రికేయులతోపాటు, సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. పత్రికలో ప్రచురితమైన వార్తలో అభ్యంతరం ఉంటే ఖండించడం, న్యాయపరంగా ముందుకు వెళ్లడం చేయాలే తప్ప, ఎవరో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ రాజ్యాగం కల్పించిన భావవ్యక్తీకరణ ప్రకటనను హరించడమేనన్నారు. రాష్ట్ర డీజీపీ సైతం కనీస న్యాయ సలహా తీసుకోకుండా పాత్రికేయులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించడం మంచిది కాదన్నారు. ఈ నిరసన కార్యక్రమం అనంతరం చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులను కలిసి సాక్షి పాత్రికేయులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి అశోక్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జయప్రకాష్, ఉపాధ్యక్షులు శివకుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు సురేష్, వెంకటేష్ , చిత్తూరు ప్రెస్క్లబ్ ఉపాధ్యక్షులు పవన్, శివకుమార్, కార్యవర్గ సభ్యులు చంద్ర, రాజేష్, బాలసుందరం, గంగాధర నెల్లూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తిరుమలయ్య, నరేష్, తేజ, ఎంజీఆర్, తవణంపల్లి ప్రెస్క్లబ్ అధ్యక్షుడు జగన్నాథం, శివకుమార్, అనంత్ కుమార్, పాత్రికేయులు హేమంత్ కుమార్, ప్రవీణ్, జయకుమార్, ఐరాల చిన్న, కిషోర్ పాల్గొన్నారు. ● పలమనేరు ఆర్డీఓకు వినతిపత్రం అందజేత పలమనేరు: పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వాలు హరించడం సబబుకాదని, పత్రికలను అణగదొక్కాలని గతంలో అనుకున్న పార్టీలు ఆపై కనిపించకుండా పోయాయని పలమనేరు వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్యామ్, దిలీప్ అన్నా రు. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై కేసు నమోదుకు వ్యతిరేకంగా స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడి యా ప్రతినిధులతో కలసి శుక్రవారం నిరసన తెలిపి ఆపై స్థానిక ఆర్డీఓ భవానీకి వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రికల్లో వెలువడే వార్తలను పార్టీలకు అంటగడుతూ ఎడిటర్లపై కేసులు నమోదు చేయడం కరెక్ట్ కాదన్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. పత్రికలో వచ్చిన వార్త తప్పుగా ఇంటే దానిపై ఖండన, రీజయిండర్ ఇవ్వాలి గానీ, ఇలా కేసులు పెట్టడం, దాన్ని పోలీసులు అమలు చేయడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాసామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాపై కేసులు పెట్టడం భవిష్యత్తులో అనర్థాలకు దారితీయడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. ఇలాంటి తప్పుడు కేసులపై ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఇలాంటి సంస్క్రృతి కొనసాగితే రేపు మరోపార్టీ అధికారంలోకి వచ్చాక ఇలాంటివి పునరావృత్తం కావడం ఖాయమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఇలాంటి తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. ఇందులో ప్రెస్క్లబ్ సభ్యు లు రెడ్డెప్ప, సుబ్రమణ్యం, రంజిత్, సూర్యబాబు, సాక్షి మణి, మోహన్మురళి, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
మామిడి ఉత్పాదకత పెంచాలి
● రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమలశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ ● చిత్తూరు నగరంలో ఉద్యాన పంటల సదస్సు ● హాజరైన మామిడి రైతులు, కొనుగోలుదారులు ● గిట్టుబాటు ధర కల్పించాలన్న జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు జిల్లాలో మామిడి పంట సాగు విస్తీర్ణం పెరిగిందని, ఉత్పాదకత పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ కె.శ్రీనివాస్ పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు భవనంలో శుక్రవారం మామిడి రైతులు, కొనుగోలుదారులతో ఉద్యాన పంటల సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖల డైరెక్టర్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులతో పాటు చిత్తూరు నగర మేయర్ అముద, పూతలపట్టు ఎమ్మెల్యే కె.మురళీ మోహన్, చుడా చైర్పర్సన్ కఠారి హేమలత తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లాలో మామిడి ఉత్పాదకత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఒక హెక్టార్కు 12 మెట్రిక్ టన్నులు ఉండగా..దేశంలోని గుజరాత్ లాంటి రాష్ట్రాలలో ఒక హెక్టార్కు 15 వేల మెట్రిక్ టన్నుల ఉత్పాదకత ఉందని, ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మన దేశంలో ఒక హెక్టార్కు సుమారు 9 మెట్రిక్ టన్నులు ఉండగా బ్రెజిల్ లాంటి దేశాలలో 20 నుంచి 25 మెట్రిక్ టన్నులు ఉత్పాదకతను కలిగి ఉందన్నారు. ఉత్పాదకత లేని మామిడి తోటలను తిరిగీ పునరుజ్జీవం చేసేలా పంట తెగులు నివారణపై శాస్త్రజ్ఞులతో పరిశోధనలు చేయిస్తున్నామని, బయో లిక్విడ్ వాడకం ద్వారా భూసారం పెంచగలిగితే ఉత్పాదకత పెరిగే పరిస్థితి ఉందని, తద్వారా గతంలో రూ. 5 వేల వరకు ఆదాయం పొందే రైతు రూ.30 వేల వరకు ఆదాయం చూడొచ్చన్నారు. 70 వేల హెక్టార్లలో మామిడి.. జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఉత్పత్తి పరంగా, నాణ్యతా పరంగా చిత్తూరు జిల్లా మామిడికి చాలా ప్రాధాన్యం ఉందన్నారు. జిల్లాలో దాదాపు 75 వేల మంది రైతులు మామిడి పంటపై ప్రధానంగా ఆధారపడి ఉన్నారన్నారు. దాదాపు 90 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు ఉండగా అందులో 70 వేల హెక్టార్ల వరకు మామిడి ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.25 కోట్లతో మామిడి పంట విస్తరణ, క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. మామిడికి మార్కెట్ సౌకర్యం కల్పించాలి జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మాట్లాడుతూ.. జిల్లాలో రైతులు అధికంగా మామిడి పంటపై ఆధారపడి జీవిస్తున్నారని, మామిడి పంట, ఇతర పంటలను విక్రయించడానికి తగిన మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. మామిడి రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు. పూతలపట్టు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఒక సదస్సును ఏర్పాటు చేసి పరిష్కార మార్గం చూపాలని భావించిందన్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు క్యూ లైన్ , నడకదారిలో ఉచితంగా అందిస్తున్న ఆహారం, పాలు, మజ్జిగతో పాటు మామిడి జ్యూస్ను కూడా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని అసెంబ్లీలో నివేదించామన్నారు. రైతు సంఘ నాయకులు మామిడిబోర్డు ఏర్పాటు చేయాలని వినతి చేశారు. ఉద్యాన పంటల మార్కెటింగ్కు సంబంధించి కల్గుడి–ఫో కనెక్ట్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు హరినాథ్ రెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్ మైక్రో ఇరిగేషన్ వెంకటేశ్వర్లు, ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ దేవ మునిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా ఉద్యాన, వ్యవసాయ, ఏపీ ఎంఐపీ, పట్టు పరిశ్రమ శాఖల అధికారులు మధుసూదన్ రెడ్డి, మురళీ కృష్ణ, బాల సుబ్రమణ్యం, శోభారాణి, సైంటిస్ట్లు సంబంధిత అధికారులు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టు పనుల కోసం.. కల్వర్టును కూల్చిన ఘనుడు
● ప్రశ్నించేందుకు భయపడుతున్న అధికారులు ● ఇదీ ఓ తెలుగు తమ్ముడి నిర్వాకంసాక్షి టాస్క్ఫోర్స్ : కాంట్రాక్టు పనుల కోసం బాగున్న కల్వర్టును కూల్చిన ఓ తెలుగు తమ్ముడి ఘన కార్యమిది.. కూటమి నాయకుల కుట్రలకు .. జగనన్న కాలనీ లబ్ధిదారులకు శాపంగా మారింది. మండలంలో ఒక షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఓ చోటా తెలుగు తమ్ముడు తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఎమ్మెల్యేకి నేను ఎంత చెబితే అంతే అంటూ.. వారితో కలిసి దిగిన ఫొటోలను అధికారులకు చూపించి అక్రమాలు చేస్తూ చెలరేగిపోతున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా.. కత్తెరపల్లి పంచాయతీ పరిధిలోని సిద్ధేశ్వర ఆలయ సమీపంలో 2014లో అప్పటి ప్రభుత్వం డంపింగ్ యార్డు నిర్మాణం చేసింది. అయితే కృష్ణాపురం జలాశయం ఎడమ కాలువ అడ్డంగా ఉండడంతో కాలువపై కల్వర్టు నిర్మాణం చేశారు. అనంతరం 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం డంపింగ్ యార్డు సమీపంలో జగనన్న కాలనీ పేరుతో పక్కా గృహాలు మంజూరు చేసింది. అయితే జగనన్న కాలనీకి వెళ్లే లబ్ధిదారులు, వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులకు, సిద్ధేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు అనుకూలంగా ఉన్న కల్వర్టును ఆ చోటా తెలుగు తమ్ముడు రాత్రికి రాత్రే జేసీబీతో కల్వర్టును కూల్చి అందులో ఉన్న సిమెంట్ పైపులను తన సొంతానికి వాడుకున్నాడు. అలాగే అదే కల్వర్టు స్థానంలో నూతనంగా కల్వర్టు నిర్మాణం చేసి ప్రజాధనాన్ని దోచుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కల్వర్టును కూల్చిన సమాచారం తెలిసినా ప్రశ్నిస్తే ఉద్యోగాలు ఉంటాయో.. ఊడుతాయోననే భయంతో అధికారులు నోరెత్తడం లేదు. ఆ పచ్చనేత ఆగడాలు మండలంలో మితిమీరి పోతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పరిహారం కుదింపుపై ఆందోళన
బైరెడ్డిపల్లి : పరిహారం మరీ ఇంత తక్కువ ఇవ్వడం ఏంటి సార్ అంటూ ఎక్స్ప్రెస్ హైవేలో భూములు పోగొట్టుకున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండగానే అధికారులు, పోలీసుల బందోబస్తు మధ్య స్థలాలను స్వాధీనం చేసుకున్న ఘటన మండల కేంద్రమైన బైరెడ్డిపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎక్స్ప్రెస్ హైవే వారు స్థలాల్లో జేసీబీలు, టిప్పర్లతో చదును చేసేందుకు రాగా రైతులు అడ్డుకున్నారు. దీంతో పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్న పోలీసులు రైతులను పక్కకు తప్పించి స్థలాలను ఎక్స్ప్రెస్హైవే వారికి స్వాధీనం చేయించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇందుకు సంబంధించిన వివరాలు బాధితులు తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి. బెంగళూరు– చైన్నె ఎక్స్ప్రెస్ హైవేలో భాగంగా బైరెడ్డిపల్లిలో జంక్షన్ కోసం భూములను సేకరించారు. ఇందులో చెక్పోస్ట్ పక్కన ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసిన 25 మంది దాకా ఉన్నారు. ఇంటి స్థలాలు కాబట్టి అప్పటి సబ్ కలెక్టర్ వీరికి అడుగుకు రూ.1640 చొప్పున అవార్డు ఇచ్చేలా నిర్ణయించారు. కానీ ఆపై జేసీ వచ్చి ఈ ధరను రూ.154కు తగ్గించారు. దీనిపై కడుపు మండిన కొందరు బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. కొందరు మాత్రం అధికారుల మాట నమ్మి ఇందుకు అంగీకరించారు. దీంతో ఇన్నాళ్లు ఇక్కడి పనులు పెండింగ్ పడ్డాయి. అయితే ఎక్స్ప్రెస్ హైవే అధికారులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించడంతో పోలీసుల పహారా మధ్య భూములు, స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. నష్ట పరిహారం తక్కువ అనుకునే రైతులు జేసీ కార్యాలయంలో ఆర్భిట్రేషన్కు రావాలని అధికారులు సూచించారు. పనులను అడ్డుకున్న రైతులను పోలీసులు పక్కకు తప్పించి పనులు చేయించారు. దీంతో మొత్తంగా చదును జరిగిపోయింది. చేసేదీ లేక రైతులు బాధ పడుతూ నిరాశతో తిరుగుముఖం పట్టారు. అడుగుకు రూ.154 పరిహారంపై మండిపాటు బైరెడ్డిపల్లి ఎక్స్ప్రెస్ హైవే పనుల వద్ద ఉద్రిక్తత -
ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి చర్యలు
● కలెక్టరేట్లో జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం ● పాల్గొన్న కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఎస్పీ మణికంఠ చందోలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో ఈఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 21 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఆ కేసుల పరిష్కారంలో దాదాపు రూ.1,72,500 చెల్లించడం జరిగిందన్నారు. ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరిగే దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి.. సమావేశంలో డీవీఎంసీ సభ్యులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పుంగనూరు పట్టణంలోని గిరిజన గురుకుల బాలికల వసతి గృహంలో 113 మంది బాలికలున్నట్లు తెలిపారు. అయితే నాలు గే మరుగుదొడ్లు ఉండడం వల్ల బాలికలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పుంగనూరు మండలం ఎస్టీ కాలనీ వద్ద అనాథ ఆశ్రమానికి 5 ఎకరాల భూమి ని మంజూరు చేయాలన్నారు. ఎస్టీలలో సంప్రదాయ కళాకారులకు పింఛన్లు మంజూరు చేయాలని కోరా రు. సదుం మండలంలో యానాదుల అనుభవంలో ఉ న్న భూములను అగ్ర కులస్థులు ఆక్రమించుకుంటు న్నారని చెప్పారు. వారి పై చర్యలు తీసుకోవాలని కో రారు. సమావేశంలో డీఆర్వో మోహన్కుమార్, జిల్లా సాంఘీక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, ఆర్డీవోలు, డీఎస్పీలు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
న్యాయమూర్తులకు సన్మానం
చిత్తూరు అర్బన్ : చిత్తూరులో పనిచేసి బదిలీపై వెళుతున్న ఇద్దరు న్యాయమూర్తులను శుక్రవారం స్థానిక బార్ అసోసియేషన్ నాయకులు సన్మానించారు. చిత్తూరులో పనిచేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు, అదనపు జిల్లా జడ్జి బాబు నాయక్ సేవలు మరువలేనివన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో వీరు చూపిన చొరవ అభినందనీయమన్నారు. కేసుల పరిష్కారంలో న్యాయవాదులతో కలిపి కక్షిదారులకు సత్వర న్యాయం అందించారని కొనియాడారు. అనంతరం న్యాయమూర్తులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయవాద మండలి అధ్యక్షుడు నల్లారి ద్వారకనాథ రెడ్డి, చిత్తూరు బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శంకర్నాయుడు, సురేష్రెడ్డి, న్యాయమూర్తులు రమేష్ , శ్రీనివాసులు, భారతి, మాధవి, వెన్నెల పాల్గొన్నారు.దుప్పిని రక్షించిన గ్రామస్తులుబంగారుపాళెం : మండలంలోని జిల్లేడుపల్లెలో శుక్రవారం కుక్కల బారిన పడిన దుప్పిని గ్రామస్తులు పట్టుకుని అటవీశాఖ అధికారుల అప్పగించారు. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఓ దుప్పి నీటి కోసం వ్యవసాయ పొలాల సమీపంలోకి రావడాన్ని ఊర కుక్కలు గుర్తించి దాడి చేశాయి. ప్రాణ భయంతో దుప్పి జిల్లేడుపల్లె గ్రామంలోకి పరుగులు తీసింది. ఈ విషయాన్ని గుర్తించిన మాజీ సర్పంచ్ జ్యోతీశ్వర్రెడ్డి గ్రామస్తుల సహకారంతో దుప్పిని రక్షించారు. విషయాన్ని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన అటవీశాఖ అధికారులు జిల్లేడుపల్లె గ్రామానికి చేరుకొని దుప్పిని స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం దుప్పిని అటవీ ప్రాంతంలో వదలి పెట్టారు.విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతిగుడిపాల: విద్యుదాఘాతంతో ఓ పాడి ఆవు మృతి చెందింది. గుడిపాల మండలంలోని సీకేపల్లె గ్రామానికి చెందిన గోవిందరాజులునాయుడు అనే రైతు తన పాడి ఆవును పొలం వద్ద చెట్టుకు కట్టి ఉండగా విద్యుత్ తీగలు గాలికి చెట్టుకు తగలడంతో విద్యుత్షాక్కు గురై పాడి ఆవు మృతి చెందింది. పాడి తనకు జీవనాధారమని ప్రభుత్వం ఆదుకోవాలని ఆ రైతు కోరారు. -
ఉన్నతాశయంతో ముందుకు సాగాలి
చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థులు ఉన్నతాశయంతో ముందుకు సాగాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. గురువారం కలెక్టరేట్లో ఐఎన్టీఎస్ఓ ఒలంపియాడ్ పరీక్షల్లో ప్రతిభ సాధించిన శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే పోటీ పరీక్షలపై పట్టు పెంచుకోవాలన్నారు. ప్రణాళిక ప్రకారం చదివితే ఎంత కష్టమైనా విజయం సాధించవచ్చని తెలిపారు. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులు అన్ని అంశాలపై పట్టు పెట్టుకోవాలన్నారు. కాగా ఒలంపియాడ్ పరీక్షల్లో ఏడో తరగతి చదువుతున్న ఈషాప్రీతి (గ్రాండ్ బహుమతిగా ల్యాప్టాప్), నాలుగో తరగతి చదువుతున్న కీర్తన్కుమార్, ఐదో తరగతి చదువుతున్న తస్మియా ఫర్హాద్, తేజేష్, ఆరో తరగతి చదువుతున్న వెన్నెల, తొమ్మిదో తరగతి చదువుతున్న కీర్తన ట్యాబ్లు కై వసం చేసుకున్నారు. ఆ విద్యార్థులకు కలెక్టర్ బహుమతులు, సర్టిఫికెట్, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాల రీజినల్ ఇన్చార్జి చక్రధర్, ప్రిన్సిపాళ్లు సాగరిక, రేఖ, రేణుక, అకడమిక్ కోఆర్డినేటర్లు రవికుమార్, మొహమ్మద్ ఇక్భాల్ తదితరులు పాల్గొన్నారు. -
పిడుగుపడి పాడి ఆవు మృతి
గుడిపాల: మండలంలోని చిత్తపార గ్రామానికి చెందిన పాడిరైతు చంద్ర పోషిస్తున్న పాడి ఆవు గురువారం పిడుగుపాటుకు గురై మృతి చెందింది. చంద్ర పొలాల వద్ద ఇల్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈయన వ్యవసాయంతోపాటు ఐదు పాడి ఆవులు కూడా పోషిస్తున్నాడు. రాత్రి పిడుగులు పడడంతో చింతచెట్టు కింద కట్టి ఉంచిన పాడి ఆవు మృతి చెందింది. ప్రభుత్వం తనని ఆదుకోవాలని బాధితుడు కోరారు. సారా స్థావరాలపై దాడి ● ఇద్దరి అరెస్టువిజయపురం : మండలంలోని కేవీపురం దళితవాడలో గురువారం నగరి ఎకై ్సజ్ శాఖ సీఐ శ్రీనివాసరెడ్డి, తన సిబ్బందితో సారా స్థావరాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, టాటా ఎస్ మినీవ్యాన్, 10 లీటర్ల సారా, 500 కేజీల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. అనంతరం గ్రామాల్లో సారా నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సారా తయారీ చట్టరీత్యా నేరమన్నారు. ఎవరైనా సారా తయారు చేసినా, విక్రయించినా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 14405, లేదా 9440902549 నంబర్కు తెలియజేయాలని కోరారు. ఆయన వెంట ఎస్ఐ రాకేష్ , సిబ్బంది ఉన్నారు. -
ఈ ఆస్పత్రికి బిడ్డలను తెస్తే బతకడంలే!
● ఏరియా ఆస్పత్రిలో మూడు నెలల చిన్నారి మృతి ● వైద్యుల నిర్లక్ష్యమేనని తల్లిదండ్రుల ఆరోపణ పలమనేరు: ‘ఈ ఆస్పత్రికి బిడ్డలను తీసుకుని ఎప్పుడొచ్చినా ప్రాణాలతో బతకడం లేదు. ఇప్పుడు మా బిడ్డ, అంతకుముందు మా బామ్మర్థి బిడ్డ.. ప్రభుత్వాస్పత్రంటే ప్రాణాలను కాపాడాలిగానీ.. ఇలా చంపేస్తుంటే ఎలాగా?.’ అని ఆ తల్లిదండ్రులు ఆస్పత్రి వద్ద బిడ్డ శవాన్ని వడిలో పెట్టుకుని రోదిస్తుంటే అక్కడున్నవారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంఘటన పలమనేరు ప్రభుత్వ ఏరియాస్పత్రిలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పలమనేరు మండలంలోని టి.వడ్డూరు గ్రామానికి చెందిన గణేష్ కుమార్తె (3 నెలల పసికందు)కు శ్వాస ఆడడంలేదని స్థానిక ఆస్పత్రికి గురువారం ఉదయం తీసుకొచ్చారు. ఆ శిశువు పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆస్పత్రిలోని ఎన్బీఎస్యూకు తరలించారు. అక్కడ ఆక్సిజన్ పెట్టి, బేసిక్ లైఫ్ సపోర్ట్ కోసం సీపీఆర్ కూడా చేశారు. కానీ ఆ పసికందును బతికించలేకపోయారు. తల్లిపాలు పట్టించేటపుడు చిన్నారికి పొరపోయి పాలు ఊపిరితిత్తుల్లోకి చేరడంతో శ్వాస ఆడకుండాపోయిందని వైద్యులు చెబుతున్నారు. అయితే తల్లిదండ్రులు మాత్రం ఇక్కడి వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ మృతికి కారణమని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఆస్పత్రిలోని వైద్యులు డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ ఆ చిన్నారికి ఆరోగ్యం బాగోలేక తల్లిదండ్రులు చిత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సలు చేయించి ఇంటికి తీసుకొచ్చారన్నారు. ఉన్నట్టుండి శ్వాస ఆడకపోవడంతో ఇక్కడికి తీసుకొచ్చారని, తాము అన్ని రకాలుగా ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించామని తమ నిర్లక్ష్యం ఏమీ లేదన్నారు. -
భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు
● భూ సమస్యలు ఉంటే జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేయండి ● ఎస్పీ మణికఠ చందోలు కార్వేటినగరం: జిల్లాలో ఎవరైనా భూములను ఆక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వీ.ఎన్ మణికంఠ చందోలు హెచ్చరించారు. గురువారం మండలంలోని గంగమాంబాపురంలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న భూ వివాదాల నేపథ్యంలో రెవెన్యూ అధికారులతో కలిసి జిల్లా ఎస్పీ గ్రామాన్ని సందర్శించారు. పరిస్థితులేమిటో ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఇక్కడ భూ వివాదాలపై రెవెన్యూ, పోలీసు అధికారుల నివేదిక ఆధారంగా బాధితులకు న్యాయం చేస్తామని, గ్రామంలో ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. భూ ఆక్రమణలపై సైతం జిల్లా కేంద్రంలోని తమ కార్యాలయంలో ప్రతి సోమవారం ఫిర్యాదు చేయవచ్చన్నారు. అనంతరం కార్వేటినగరం సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఆయన వెంట నగరి డీఎస్పీ సయ్యద్ మహ్మద్ అజీజ్, సీఐ హనుమంతప్ప, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
జ్యోతిబా పూలే జయంతి ఘనంగా నిర్వహించండి
చిత్తూరు కలెక్టరేట్: జిల్లా కేంద్రంలో ఈ నెల 11వ తేదీన మహాత్మాజ్యోతి బా పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహాత్మా జ్యోతి బా పూలే జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీసీ భవన్లో శుక్రవారం జిల్లాస్థాయి కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఈబీసీ, కాపు, మైనారిటీ వర్గాలకు చెందిన 500 మంది లబ్ధిదారులకు రూ.11,66,30,000 విలువ గల ఆస్తులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, బీసీ కుల సంఘ నాయకులు, అధికారులు, అనధికారులు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ఉత్సాహంగా తపాలా క్రీడా పోటీలు చిత్తూరు కార్పొరేషన్: తపాలాశాఖ ఉద్యోగులకు ఎన్ఎఫ్పీఈ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం క్రీడ పోటీలు నిర్వహించారు. స్థానిక మెసానికల్ మైదానంలో క్రికెట్ టోర్నీ ఉత్సాహంగా జరిగింది. ఈ పోటీల్లో చిత్తూరు దక్షిణ సబ్ డివిజన్ జట్టు విజేతగా నిలిచింది. ఆటగాళ్లకు తపాలా శాఖ సూపరింటెండెంట్ లక్ష్మన్న పతకాలను ప్రదానంచేశారు. కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు. అలరించిన సెలెస్టా–2కే25 కాణిపాకం: చిత్తూరు నగరంలోని ఎస్పీ సెట్ ఇంజినీరింగ్ కళాశాలలో కేరళ మేళంతో సెలెస్టా–2కే25 అట్టహాసంగా ప్రారంభమైంది. తొలుత కాలేజీ కుర్రకారు స్టేజ్పై స్టెప్పులేసింది. విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు కేక పుట్టించాయి. ముఖ్యఅతిథిగా విచ్చేసిన సినీ నటుడు కిరణ్ అబ్బవరం సెలెస్టాను ఉద్దేశించి మాట్లాడారు. స్టేజ్పై స్టెఫులేసి అలరించారు. కార్యక్రమంలో చైర్మన్ రావూరి వెంకటస్వామి, రావూరి శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. రక్షణ కల్పించండి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రేమ వివాహం చేసుకున్న తమకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలని చౌడేపల్లి మండ లం బీర్జేపల్లెకు చెందిన అనూ హ్య, చిట్టిరెడ్డిపల్లెకు చెందిన వంశీ తెలిపారు. చిత్తూరు ప్రెస్క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ప్రేమజంట జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అనూహ్య మాట్లాడుతూ తాను వంశీని ఏడేళ్లుగా ప్రేమిస్తున్నానని, కులాలు వేరు కావడంతో మా తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించలేదని చెప్పారు. దీంతో తామిద్దరం ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నామని చెప్పారు. తమ ప్రాణాలకు ఎటువంటి అపాయం కలగకుండా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.అదనపు లైన్కు ప్రతిపాదనలు చిత్తూరు కార్పొరేషన్: వేసవిలో విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా నూతనంగా అదనపు లైన్కు ప్రతిపాదన పెట్టినట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ తెలిపారు. గురువారం చిత్తూరు రూరల్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. డివిజన్ పరిధిలోని ఎస్ఎస్ కొండ, వెదురుకుప్పం ప్రాంతాల్లో లోడ్ పెరుగుతుందన్నారు. వీటిని సర్దుబాటు చేయడానికి మాంబేడు సబ్స్టేషన్లో 5 ఎంవీఎ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు ప్రతిపాదన పెట్టామన్నారు. అలాగే అదనంగా కొత్తపల్లెమిట్ట నుంచి వేపంజేరి, ఎస్ఎస్ కొండకు 17 కిలోమీటర్లు రూ.80 లక్షల వ్యయంతో 33 కేవీ లైన్ ఏర్పాటుకు నివేదిక పంపామన్నారు. అవసరమైన ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రూరల్ పరిధిలో విడుదల చేయాల్సిన వ్యవసాయ సర్వీసుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. ఉన్న వాటిని వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో ఈఈ సురేష్, డీఈ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.రోడ్డు ప్రమాదంలో మాజీ సైనికుడి మృతిఐరాల: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎగువ కామినాయనపల్లెకు చెందిన మాజీ సైనికుడు రాజేంద్రనాయుడు(65) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కాణిపాకం ఏఎస్ఐ కథనం మేరకు.. ఎగువ కామినాయనపల్లెకు చెందిన మాజీ సైనికుడు రాజేంద్రనాయుడు, భార్య లక్ష్మి ఇద్దరు కలిసి ద్విచక్రవాహనంలో స్వగ్రామం నుంచి బుధవారం రాత్రి సొంత పనుల నిమిత్తం జంగాలపల్లెకు వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా అదే సమయంలో తవణంపల్లె మండలం పట్నం గ్రామానికి చెందిన హరీష్ ఐరాల నుంచి పట్నం వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో జంగాలపల్లె బస్స్టాప్ వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో రాజేంద్రనాయుడు, హరీష్కు తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు ఇద్దరిని 108లో జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం రాజేంద్రనాయుడుని వేలూరు సీఎంసీకి తరలించారు. రాజేంద్రనాయుడు అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కాగా హరీష్కు తలలో రక్తం గడ్డ కట్టడంతో రాణిపేట సీఎంసీ ఆస్పత్రిలో చేర్పించారు. మృతుడు భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సమన్వయంతో పనిచేయండి
● ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా నిలుస్తోంది ● ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ● మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వెదురుకుప్పం: అందరూ కలిసికట్టుగా ఉండి సమన్వయంతో పనిచేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. గురువారం మండలంలోని మాంబేడు గ్రామంలో పర్యటించి, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు బండి గోవర్ధన్రెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆయన నాయకులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసి, అధికారంలోకి వచ్చిందన్నారు. కక్ష కట్టుకుని పేద వారిపై వివక్ష చూపుతుందని చెప్పారు. జగనన్న హయాంలో కులం, మతం, ప్రాంతం, రాజకీయాలకతీతంగా సేవలు అంచామన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఏడాది గడవక ముందే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకుంటున్న విషయాన్ని గమనించాలన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు. కార్యకర్తలకుగా అండగా వైఎస్సార్సీపీ నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు సుకుమార్, ఎంపీటీసీ సభ్యుడు గుణశేఖర్, సర్పంచ్ గోవిందయ్య, మాజీ సర్పంచ్లు పెద్దిరెడ్డి, గోవిందన్, ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు బట్టే సుబ్రమణ్యం, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు బండి హేమసుందర్ రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు శివాజీ, యువజన విభాగం మండల అధ్యక్షుడు గణపతిరెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు నరేష్రెడ్డి, సచివాలయ కన్వీనర్ జగదీష్రెడ్డి, నాగరాజు, వెంకటేశ్, కేశవులు, ఆర్ముగం, వెంకటాచలం, విజయభాస్కర్ పాల్గొన్నారు. ఎంపీతో మాజీ మంత్రి భేటీ మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఎంపీ మిథున్రెడ్డిని గురువారం తిరుపతిలోని ఎంపీ నివాసంలో కలిసి, పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. -
మీకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాం
సదుం: పుంగనూరు నియోజకవర్గంలోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా తాము ఉంటామని, ఎవరు, ఏ కష్టానికీ భయపడాల్సిన పని లేదని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్రెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్రెడ్డి, ఎంపీపీ మాధవితో కలసి ప్రజాదర్భార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వినతులపై అప్పటికప్పుడే సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మండల ప్రజలు అధికారులపై పలు ఫిర్యాదులు చేశారు. చర్యలు తీసుకుంటామని, అమాయకులైన ప్రజలను, పార్టీ కార్యకర్తలను, నాయకులను అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులు చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎంపీ స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించడానికే ప్రజాదర్భార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించడమే తమ ఆశయమని చెప్పారు. ప్రతి ఒక్కరినీ కలసి, సమస్యలు తెలుసుకుంటానని, ప్రణాళికబద్ధంగా పరిష్కరిస్తామని ఎంపీ ప్రతి ఒక్కరికీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీని కలిసేందుకు వచ్చిన వారందరికి భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జిల్లా వ్యవసాయ మండలి మాజీ సభ్యుడు పెద్దిరెడ్డి సుధీర్రెడ్డి, పెద్దిరెడ్డి వేణుగోపాల్రెడ్డి, వైస్ ఎంపీపీ ధనుంజయరెడ్డి, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు రెడ్డెప్పరెడ్డి, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్రెడ్డి, కోఆప్షన్ సభ్యులు ఇమ్రాన్, పుట్రాజ్, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ అనుబంధ సంస్థల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. జర్నలిస్టుల ఆహ్వానం ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలకు హాజరు కావాలని ఆ సంఘం ప్రతినిధులు ఎంపీ మిథున్రెడ్డిని ఆహ్వానించారు. ఈనెల 22న చిత్తూరులో జరగనున్న సభలకు తప్పక హాజరుకావాలని కోరారు. ఎంపీని కలిసిన వారిలో ప్రతినిధులు జయరాజు, రామయ్య, సలీం, సతీష్, ప్రకాష్, సైపుల్లా, అప్ప, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. ఘన స్వాగతం అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు ఎంపీ హామీ సదుం మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు తన సొంత నిధులు కేటాయిస్తామని ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్రెడ్డి హామీ ఇచ్చారు. అంబేడ్కర్ ఆశయ సాధన కమిటీ సభ్యులు మల్లెల గిరి, లోకనాథం, శ్రీరాములు ఎంపీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎంపీ మాట్లాడుతూ తక్షణమే పనులు చేయాలని, సొంత నిధులతో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కమిటీ సభ్యులు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. సదుం మండల కేంద్రంలో పర్యటనకు వచ్చిన ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్రెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ నాయకులు బూరగమందక్రాస్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. అలాగే శాలువ కప్పి సన్మానం చేశారు. -
పూలే జయంతిని జయపద్రం చేయండి
చిత్తూరు కార్పొరేషన్: మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకల ను జయప్రదం చేయా లని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు కోరారు. శుక్రవా రం జిల్లాలోని బీసీ, కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు నివాళి కార్యక్రమంలో పాల్గొన్నాలన్నారు. పూలే విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించాలన్నారు. బలహీన వర్గాల అభ్యు న్నతికి ఆయన చేసిన కృషిని తెలియజేయాలన్నారు. ఐటీఐ పరీక్షలకు ప్రైవేట్గా హాజరు అవకాశం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, ఫిట్టర్ తదితర ట్రేడ్లలో ప్రైవేట్గా పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించారని ప్ర భుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐటీఐలో కోర్సు పూర్తి చేసిన మా జీ శిక్షణార్థుల అనుబంధ ట్రేడ్కు ప్రైవేట్ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుదారులు అనుబంధ ట్రేడ్లో ఐటీఐ పూర్తి చేసి, ఫలితాల ప్రకటన తర్వాత కనీసం ఏడాది అనుభవం ఉండాలన్నారు. సీఓఈ పథకంలో ప్రస్తు తం శిక్షణార్థులుగా ఉండాలని తెలిపారు. ఎసీవీటీ అభ్యర్థులు (ఆగస్టు 2018 సెషన్ వరకు ప్రవేశం పొందిన వారు) అయి ఉండాలన్నారు. 2025 ఏప్రిల్11వ తేదీ నాటికి 21 ఏళ్లు పూర్తి అయ్యి, ఏదైనా సంస్థలో 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని తెలిపారు. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ నెల 12వ తేదీలో దరఖాస్తుతో ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సంప్రదించాలన్నారు. వివరాలకు 7799201479 నంబర్లో సంప్రదించాలన్నారు. సర్వర్ డౌన్ చిత్తూరు కార్పొరేషన్: రిజిస్ట్రేషన్శాఖ సర్వర్ డౌన్ కావడంతో డ్యాకుమెంటెషన్లు సక్రమంగా జరగలేదు. రెండు రోజులుగా సర్వర్ నెమ్మదిగా వస్తుండడంతో ఈసీ, రిజిస్ట్రేషన్, ఈ–కేవైసీ సేవలు స్తంభించాయి. దీంతో క్రయ, విక్రయదారులు కార్యాలయాల వద్ద పడిగాపులు కాశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆగి ఆగి నెట్ రావడంతో విసుగు చెందారు. సర్వర్ వచ్చాక కార్యాలయానికి రావా లని డ్యాకుమెంటర్లు వారిని కార్యాలయం నుంచి పంపించారు. సాధారణంగా 40 వరకు జరిగే రిజిస్ట్రేషన్లు గురువారం మొత్తం 28 మాత్రమే జరిగాయి. నేడు నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం చిత్తూరు కలెక్టరేట్ : ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుపై జిల్లాస్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 11వ తేదీన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరుకావాలని కోరారు. డీసీహెచ్ఎస్ పరిధిలో పోస్టుల ప్రొవిజనల్ మెరిట్లిస్ట్ చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వైద్య విధాన పరిషత్(డీసీహెచ్ఎస్)లోని పలు పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టులను ఆన్లైన్లో ఉంచినట్లు డీసీహెచ్ఎస్ పద్మాంజలిదేవి తెలిపారు. రెండు నెలల కిందట పలు పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో వైద్యశాఖ నుంచి దరఖాస్తులు స్వీకరించామన్నారు. ఈ దరఖాస్తులకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్లిస్టును గురువారం సాయంత్రం ఆన్లైన్లో ఉంచామన్నారు. ఈ జాబితా కోసం www.chittoor.ap.gov.in లో చూసుకో వచ్చన్నారు. ఇందులో అభ్యంతరాలుంటే ఈనెల 12వ తేదీలోపు కార్యాలయంలో సమర్పించాలని ఆమె పేర్కొన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై దాడులు చిత్తూరు రూరల్(కాణిపాకం): జి ల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలపై మైనింగ్ శాఖాధికారులు దాడులు చేశారు. గురువారం సాక్షి దినపత్రికలో ‘ఇసుక తోడేళ్లు.. ఉచితం ముసుగులో లూటీకి తెగబడుతున్న పచ్చ ము ఠాలు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై వా రు స్పందించారు. పలమనేరు, తవణంపల్లి లోని ఇసుక అక్రమ కేంద్రాలపై తనిఖీలు చేప ట్టారు. అక్కడ తవ్వకాలను గుర్తించారు. సాక్షిదినపత్రికలో కథనం, అధికారులు తనిఖీల నే పథ్యంలో అక్రమ ఇసుక తవ్వకదారులు పరారయ్యారు. ఈ సందర్భంగా మైనింగ్ శాఖ డీడీ సత్యనారాయణ మాట్లాడుతూ అక్రమ తవ్వకాలపై మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నామన్నారు. సమాచారం వచ్చిన వెంటే స్పందిస్తూ...చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇసుక అక్రమ రవణాకు సంబంధించి 2024–25 ఆర్థికసంవత్సరంలో రూ.7.20 లక్షల వరకు జరిమానా విధించామన్నారు. -
మామిడి.. పండ్లలో రారాజు. మాధుర్యం..చక్కటి రుచి, సువాసనలో సాటిలేనిది చిత్తూరు మామిడి. జిల్లాలో పండే ఈ పంట ప్రపంచంలోనే పేరుగాంచింది. అందుకే ఇక్కడి మామిడి పలు విదేశాలకు ఎగుమతి.. కర్షకులకు బహుమతిగా ప్రసిద్ధి చెందింది. అయితే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడి పన్నుల
పలమనేరు : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రైతులకు ప్రధాన ఆధారం మామిడి. ఇక్కడ 70 శాతం తోతాపురి తోటలున్నాయి. జిల్లాలోని మామిడి ఉత్పత్తుల్లో 60 శాతం మ్యాంగో పల్ప్ పరిశ్రమలకు వెళ్లగా 20 శాతం దాకా టేబుల్ వైరెటీలు విదేశాలకు ఏటా ఎగుమతి అవుతున్నాయి. ఈ ఎగుమతులపై గతంలో మామిడిపై కేవలం 5 శాతం మాత్రమే పన్నులుండేవి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న అధిక పన్నుల కారణంగా చిత్తూరు జిల్లా నుంచి ఎగుమతి అయ్యే మామిడిపై 26 శాతం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యే 2.50 లక్షల టన్నుల మామిడిపై అధిక పన్ను ప్రభావం పడనుంది. గతేడాది సీజన్లో టన్ను రూ.28 వేలు వరకు ఉన్న ధరలు అమాంతం తగ్గుముఖం పట్టి టన్ను రూ.21 వేలకు చేరింది. దీంతో మామిడి రైతులకు గతేడాది నష్టాలు తప్ప లేదు. ఏటా సీజన్లో పల్ప్ యాజమాన్యాలు సిండికేట్ అయి ధరలను నియంత్రిస్తున్నట్లు మామిడి రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో అమెరికా పన్ను కేవలం 5 శాతమే.. జిల్లా నుంచి టేబుల్ రకాల మామిడి అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, బెహరైన్, నేపాల్, యూఏఈ దేశాలకు ఎగుమతులు జరిగేవి. ఎక్కువ శాతం యూఎస్ఏకు వెళ్లేది. గతంలో మామిడిపై పన్ను కేవలం 5 శాతం మాత్రమే ఉండేది. కానీ ట్రంప్ గద్దెనెక్కాక పన్నులను 26 శాతానికి పెంచేశారు. భారీగా పెరిగిన పన్నులు మామిడి ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపడం ఖాయంగా కనిపిస్తోంది. ఎగుమతి పన్ను పెరిగినందున ఇక్కడి వ్యాపారులు స్థానిక మామిడి తక్కువ ధరకు కొనాల్సి వస్తుంది. దీంతో మామిడి రైతులకు నష్టాలు తప్పేలాలేవు. ఇతర దేశాలపై దృష్టి సారించాలి ఏటా ఇక్కడి నుంచి మామిడిని ఎగుమతి చేసే పలు దేశాల్లో పన్నులు తక్కువగా ఉన్న దేశాలకు ఎగుమతులను పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు అమెరికాకు ప్రత్యామ్నాయంగా మారుతుంది. పల్ప్ ఫ్యాక్టరీల సిండికేట్ దెబ్బ జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాల్లో 30 దాకా మామిడి గుజ్జు పరిశ్రమలున్నాయి. ఇక్కడ పండిన పంటలో 50 శాతం జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని జ్యూస్ ఫ్యాక్టరీలకు చేరుతుంది. మామిడి కాయలను పల్ప్ (మామిడి గుజ్జు) తయారు చేసి, ఇతర రాష్ట్రాలకే కాక విదేశాలకు సైతం ఎగుమతులు చేస్తుంటారు. ఏటా జూన్ తొలివారం నుంచి జులై తొలి వారం వరకు తోతాపురి సీజన్ ముగుస్తుంది. ఆపై ఆగస్టు తొలివారం వరకు నీలం లాంటి టేబుల్ రకాలతో ఇక్కడి సీజన్ అయిపోతుంది. అయితే ఏటా జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాల పల్ప్ పరిశ్రమలు సైతం సిండికేట్గా మారి ధరలను తగ్గిస్తున్న విషయం ఏటా జరుగుతూనే ఉంది. దీంతో తోతాపురి రైతులకు ఏటా పండించిన మామిడికి గిట్టుబాటు దక్కకుండా పోతోంది. జిల్లాలో మామిడి సాగు వివరాలు ఇలా.. నేడు చిత్తూరులో ఉద్యానవన సదస్సు అమెరికా పన్నులు పెంచిన నేపథ్యం, స్థానికంగా పల్ప్ ఫ్యాక్టరీల సిండికేట్ వ్యవహారంపై నేడు జిల్లా కేంద్రంలో జరగనున్న ఉద్యానవన సదస్సుకు కలెక్టర్ , హార్టికల్చర్ శాఖ , చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్తో పాటు పలువురు మంత్రులు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, మామిడి రైతులు, వ్యాపారులు, పల్ప్ పరిశ్రమల నిర్వాహకులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్లోనైనా మామిడి ధరలు రైతులకు గిట్టుబాటు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మామిడి ఎగుమతులపై 26 శాతం పన్ను విధించిన అమెరికా ఫలితంగా టేబుల్ వైరెటీ ధరలపై తీవ్ర ప్రభావం భారీగా తగ్గనున్న మామిడి ఎగుమతులు ఫలితంగా ఢీలా పడనున్న మామిడి ధరలు నేడు చిత్తూరులో మామిడి వ్యాపారులు, రైతులతో హార్టికల్చర్ కాన్క్లేవ్ మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో మామిడి రైతుకు గిట్టుబాటు ధర టన్ను రూ.30 వేల దాకా ఉండాలి. ఏటా గుజ్జు పరిశ్రమల సిండికేట్తో ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తోతాపురి కాయలు కోతల కొచ్చే సమయంలో ఉన్నట్టుండి ధరలు తగ్గుముఖం పడితే రైతులకు తీవ్ర నష్టం వస్తుంది. దీనిపై ఉన్నతాధికారులు పల్ఫ్ పరిశ్రమ నిర్వాహకులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలి. – సుబ్రహ్మణ్యంనాయుడు, రామాపురం, పలమనేరు మండలంప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలి ఏపీలో పొగాకు బోర్డు ఉన్నట్టే.. మామిడికి బోర్డు ఏర్పాటు చేయాలి. దీంతో పాటు మామిడికి మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించాలి. ఏడాదంతా రైతులు పండించిన మామిడిని అమ్ముకునే సమయంలో గుజ్జు పరిశ్రమల సిండికేట్ కారణంగా తక్కువ ధరకు ఇవ్వాల్సి వస్తోంది. ఈ విడత టేబుల్ రకాల మామిడిని అమెరికాకు పంపేందుకు రైతులు అసలు ముందుకురారు. దీనిపై కేంద్రం చర్యలు తీసుకోవాలి. – ఉమాపతి నాయుడు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు -
● జిల్లాలో కరుగుతున్న కొండలు ● అక్రమంగా గ్రానైట్ దందా ● కూటమి నేతల కన్నుసన్నల్లోనే అక్రమ క్వారీలు ● మామూళ్ల మత్తులో అధికారులు ● అక్రమ మైనింగ్పై ఫిర్యాదుల పరంపర
బంగారుపాళెం మండలం కనతల చెరువు ప్రాంతంలో కూటమి నేతలు అక్రమంగా క్వారీ నడిపిస్తున్నారని ఐదు నెలల కిందట ఫిర్యాదులొచ్చాయి. వార్తా పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన అధికారులు అలా వెళ్లి ఇలా వచ్చేశారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని వారు పెదవి విరిస్తున్నారు. చిత్తూరు మండలం పెద్దిశెట్టిపల్లి ప్రాంతంలో కొండలు బద్దలవుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మామిడి తోటల్లో దాగి ఉన్న ఈ క్వారీ నుంచి అక్రమార్కులు ఎవరి కంట పడకుండా విలువైన గ్రానైట్ను దర్జాగా దోచేస్తున్నారు. అయినా పట్టించుకునే వారు కరువయ్యారు. చిత్తూరు మండలం పెద్దిశెట్టిపల్లిలో అక్రమంగా సాగుతున్న క్వారీ పొరుగు రాష్ట్రాలకు సరిహద్దుల్లోనే చిత్తూరు జిల్లాలో ప్రకృతి ప్రసాదిత క్వారీ, గ్రానైట్ గనులు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని చోట్ల ఐదు కిలో మీటర్లు.. మరికొన్ని చోట్ల ఒకటి, రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే చాలు.. పొరుగునే ఉన్న తమిళనాడుకు చేరుకోవచ్చు. ఇంకేముంది ఇదే అక్రమార్కులకు వరంగా మారింది. ఎలాంటి అనుమతులు లేకుండా అధిక మొత్తంలో గ్రానైట్ తరలించేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి, కసితీరా కొండలను కొల్లగొట్టుతున్నారు. సాక్షి టాస్క్ఫోర్స్: జిల్లాలో అక్రమంగా మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. కూటమి నేతల కన్నుసన్నల్లో విలువైన గ్రానైట్, కంకరరాయిని కొల్లగొడుతున్నారు. అవినీతి మత్తులో జోగుతున్న రెవెన్యూ, మైనింగ్ శాఖలు మొక్కుబడి తనిఖీలు, నోటీసులతో సరిపెడుతున్నాయి. ఫలితంగా పర్యావరణం దెబ్బతింటోంది. జిల్లాలో 400 వరకు గ్రానైట్ క్వారీలున్నాయి. ఇందులో 220 వరకు క్వారీలు ప్రస్తుతం నడుస్తున్నాయి. అనధికారికంగా 70కి పైగా నడుస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అలాగే 300 వరకు గ్రానైట్ ఫ్యాక్టరీలు పని చేస్తున్నాయి. చిత్తూరు, బంగారుపాళెం, యాదమరి, ఎస్ఆర్ పురం, పాలసముద్రం, వి.కోట, రామకుప్పం, కుప్పం, నగరి, గుడిపాల, జీడీనెల్లూరు తదితర మండలాల పరిధిలో గ్రానైట్ నిల్వలు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం గ్రానైట్ క్వారీల నుంచి ఘనపు క్యూబిక్ మీటరు ఆధారంగా సీనరేజ్ చెల్లించి, బ్లాక్లను పాలిషింగ్ యూనిట్కు తరలించాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారంలో వ్యాపారులు, క్వారీల నిర్వాహకులు అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కంపిస్తున్న గ్రామాలు క్వారీ పేలుళ్లలో శక్తివంతమైన జెలిటిన్ స్టిక్స్ వాడి, బండలు పేల్చడంతో ఆ పరిసర ఆ ప్రాంతాల్లోని గ్రామాలు కంపిస్తున్నాయి. ఇళ్లు బీటలు వారుతున్నాయి. బండరాళ్లుపడి వ్యవసాయ పొలాలు దెబ్బతింటున్నాయి. రాళ్లు తగిలి స్థానికులు గాయపడుతున్నారు. వ్యాధికారక రసాయనాలు గాలి, నీరులో కలిసి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గ్రామస్తులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. కూటమి నేతల గుప్పిట్లో క్వారీలు అక్రమ క్వారీల నిర్వహణ మొత్తం కూటమి నేతలు గుప్పిట్లోనే ఉన్నాయి. దీంతో మైనింగ్ శాఖ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. బడా బాబులు, రాజకీయ అండదండలు ఉన్న సంపన్నులు తాము పైకి కనిపించకుండా డమ్మీ వ్యక్తులను ముందు పెట్టి వెనుక నుంచి అక్రమ క్వారీలను నడిపిస్తున్నారు. -
అలరించిన సెలెస్టా–2కే25
చిత్తూరులో జరిగిన సెలెస్టా–2కే25 అలరించింది. సినీనటుడు కిరణ్ అబ్బవరం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.తాగునీటి సరఫరాలో అలసత్వం వద్దు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అలసత్వం వహించవద్దని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజలకు వేసవిలో ఎలాంటి తాగునీటి సమస్యలు లేకుండా స్వచ్ఛమైన నీటిని పంపిణీ చేయాలన్నారు. నగరాలు, గ్రామాల్లోని ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రతి 15 రోజులకొకసారి కచ్చితంగా శుభ్రం చేయాలన్నారు. తాగునీటి పైపులు లీకేజీ ఉన్న చోట్ల వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. డీఈ, ఏఈలు గ్రామాల్లో పర్యటించి నీటి సమస్యలున్న ప్రాంతాలను గుర్తించాలని చెప్పారు. నిత్యం పరీక్షలు చేయాలి గ్రామాల్లో సరఫరా చేసే తాగునీటిని నిత్యం పరీక్షలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేసిన పనుల బిల్లులను వెంటనే జెడ్పీకి పంపించాలన్నారు. సంబంధిత బిల్లులను జెడ్పీలో త్వరతిగతిన మంజూరు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయకుమార్, డీపీఓ సుధాకర్రావ్ పాల్గొన్నారు. హార్టికల్చర్ కాంక్లేవ్ విజయవంతంగా నిర్వహించండి మామిడి అమ్మకం, కొనుగోలుదారుల నిమిత్తం జిల్లా కేంద్రంలో ఈ నెల 11వ తేదీన నిర్వహించే హార్టికల్చర్ కాంక్లేవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం మామిడి అమ్మకందారులు, కొనుగోలుదారులతో కార్యక్రమం ఉంటుందన్నారు. మామిడి ఎగుమతికి సంబంధించి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ అనుబంధ, పౌరసరఫరాలు, డీఆర్డీఏ, డీఎల్డీఓలు సమన్వయంతో చేపట్టాలన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ, పట్టు పరిశ్రమ శాఖ జేడీ శోభారాణి, ఉద్యానవన శాఖ డీడీ మధుసూదన్రెడ్డి, డీఎస్ఓ శంకరన్, సివిల్ సప్లైస్ డీఎం బాలకృష్ణ, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, డీఎల్డీఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.– 8లో -
‘పుర’ పనులపై విజిలెన్స్ కొరడా
● 5 మంది అధికారులపై చర్యలు ● రూ.26 లక్షల రికవరీ? పుంగనూరు : పురపాలిక పరిధిలో 2014–15 సంవత్సరంలో జరిగిన అభివృద్ధి పనుల్లో నాణ్యత లేదని విజిలెన్స్ అధికారులు పదేళ్ల తరువాత నిద్రలేచి జూలు విధిల్చారు. దీనికి సంబంధించి 5 మందితో పాటు మరో ఇద్దరు అధికారులు, ఇద్దరు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఈనెల 7న ఆదేశాలు జారీ చేస్తూ 5 మంది ఇంజినీర్లను బాధ్యులుగా చేశారు. ఈ ఆదేశాలు మంగళవారం పురపాలికకు చేరాయి. మున్సిపాలిటీలో పనిచేసి బదిలీపై వెళ్లిన, రిటైర్డ్ అయిన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆదేశాలు రావడంతో ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పదేళ్ల కిందట చేసిన పనుల్లో నాణ్యత లేదని విజిలెన్స్ వారు పంపిన నివేదికలపై ప్రస్తుతం చర్యల చేపట్టడంతో ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పనుల నిర్వహణలో భాగస్వాములైన ఇంజనీర్లు డీఈఈ గా పని చేసిన నారాయణస్వామి, అలాగే విశ్రాంత డీఈఈ పద్మనాభరావు, విశ్రాంత ఏఈ సుబ్బరామయ్యతో పాటు ప్రస్తుత డీఈఈలు ఇతర మున్సిపాలిటీల్లో పని చేస్తున్న రవీంద్రారెడ్డి, కృష్ణకుమార్పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా సదరు పనుల్లో నాణ్యత లేని కారణంగా సుమారు రూ.26 లక్షలు ఆ ఉద్యోగుల నుంచి రికవరీ చేయనున్నట్లు సమాచారం. కాగా 10 ఏళ్ల తరువాత ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
చిత్తూరంటే బస్సు ఎక్కించాల్సిందే...
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : తమిళనాడులోని వేలూరు బస్టాండులో చిత్తూరు ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో ఎక్కించడం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తిరుపతి–వేలూరు సర్వీసుల్లో చిత్తూరంటే బస్సు దిగేమంటున్నారని, అర్ధరాత్రి అవస్థలు పడుతున్నార ని ఫిర్యాదులు చేశారు. దీనిపై సాక్షి దినపత్రికలో గతవారం ‘చిత్తూరా సీటు లేదు’, ‘వేలూరు బస్టాండులో రగడ’ అనే పేరిట కథనాలొచ్చాయి. దీనిపై ఆర్టీసీ అధికారులు స్పందించారు. తమిళనాడులోని వేలూరు బస్టాండులో కౌంటర్ను ఏర్పాటు చేశారు. ఇక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వేలూరు నుంచి వచ్చే చిత్తూరు వాళ్లు రాత్రి పూట ఇబ్బంది పడకూడదని డీపీటీఓ జగదీష్కు వివరించారు. ఇకపై ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఆయనకు తెలియజేశారు.16వ తేదీన సంకటహర చతుర్థికాణిపాకం : ఈనెల 16వ తేదీన కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో సంకటహర చతుర్థి గణపతి వ్రతం జరగనున్నట్లు ఈఓ పెంచల కిషోర్ తెలిపారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6గంటల వరకు వ్రతం జరుగుతుందన్నారు. అలాగే రాత్రి 7 గంటలకు స్వర్ణ రథోత్సవం ప్రారంభమవుతోందన్నారు. ఈ సేవలకు ఆన్లైన్ ద్వారా టికెట్లు పొందవచ్చునని పేర్కొన్నారు. -
ప్రభుత్వ బడిలోనే చేర్పిద్దాం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని డీఈఓ వరలక్ష్మి కోరారు. ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లపై యూటీఎఫ్ సంఘం రూపొందించిన పోస్టర్లను బుధవారం డీఈఓ ఆవిష్కరించారు. ప్రభుత్వ బడుల గొప్పదనం తెలుపుతూ యూటీఎఫ్ సంఘం రూపొందించిన పోస్టర్లు చాలా బాగున్నాయన్నారు. ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్ల పెంపునకు యూటీఎఫ్ సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని డీఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోమశేఖరనాయుడు, మణిగండన్, జిల్లా సహాధ్యక్షులు రెహానా బేగం, రెడ్డెప్ప, ఎస్పీ భాషా, పార్థసారథి పాల్గొన్నారు. -
ఖైదీల జీవనోపాధికి బ్యాంకు రుణాలు
చిత్తూరు అర్బన్ : ఖైదీల్లో పరివర్తన తీసుకురావడానికి జైలు నుంచి విడుదలైన తరువాత వాళ్లకు బ్యాంకు రుణాలను మంజూరు చేస్తామని కలెక్టర్ సుమిత్కుమార్ హామీ ఇచ్చారు. బుధవారం చిత్తూరు నగరంలోని జిల్లా జైలులో ఖైదీలకు సంకల్ప–స్కిల్ ట్రైనింగ్లో భాగంగా మల్టీస్కిల్ ట్రేడ్ కింద శిక్షణ పొందిన ఖైదీలకు సర్టి ఫికెట్లను అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తెలిసీ తెలియక ఆవేశంలో చేసిన తప్పులకు శిక్ష ఒక్కటే పరిష్కారం కాదన్నారు. సత్ప్రవర్తనతో జైలు నుంచి విడుదలయ్యాక డీఆర్డీఏ, స్కిల్ డెవలప్మెంట్ శాఖ ఆధ్వర్యంలో ఖైదీలకు శిక్షణ ఇవ్వడంతో పాటు సప్తగిరి గ్రామీణ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ ద్వారా రుణాలు అందిస్తామన్నారు. జిల్లా జైళ్ల పర్యవేక్షణాధికారి వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ.. తొలి బ్యాచ్గా చిత్తూరు జైల్లో 34 మందికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చామన్నారు. ఖైదీల జీవనోపాధుల కోసం మెరుగైన శిక్షణ ఇవ్వడంతో పాటు ఇక్కడ ఓపెన్ స్కూల్ ద్వారా చదివే అవకాశం కల్పిస్తున్నామన్నారు. డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి గుణశేఖర్, న్యాక్ ఏడీ సతీష్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
చౌడేపల్లె : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదినెలలైందని, ఎన్నికలప్పుడు ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేదని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. బుధవారం పులిచెర్ల మండలం కొత్తపేటలో పెద్దిరెడ్డిని వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, జెడ్పీటీసీ సభ్యుడు దామోదరరాజు కలిసి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల సంగతిపై పోరాటం చేయాలని పెద్దిరెడ్డి కోరారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వంపై పోరాడి పేద ప్రజలకు న్యాయం చేయాలన్నారు. కూటమి దౌర్జన్య కాండపై ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్యం తీసుకురావాలని తెలిపారు. ఆయన వెంట ఎంపీటీసీలు శ్రీరాములు, లక్ష్మి నర్సయ్య , నేతలు మోహన్, శ్రీనివాసులు తదితరులున్నారు. -
రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
కుప్పం : కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలోని కొత్తపేట వద్ద గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో హుటాహుటిన కుప్పం వంద పడకల ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు చెప్పారు. మృతుడికి 30 సంవత్సరాల వయస్సు కలిగి, చామనఛాయ రంగు ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచినట్లు పేర్కొన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు సంబంధిత రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని సైకిలిస్టు దుర్మరణం చిత్తూరు అర్బన్ : నగర శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పార్థసారథి (55) అనే వ్యక్తి మృతి చెందాడు. కొంగారెడ్డిపల్లికి చెందిన ఆయన చిత్తూరు సైకిల్ రైడర్స్ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్నారు. రోజూ తలకు హెల్మెట్ ధరించి సైకిల్ రైడ్కు వెళ్లడం పార్థసారథికి అలవాటు ఈ క్రమంలో తిరుపతి రోడ్డు నుంచి చిత్తూరు వైపు వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో దురదృష్టవశాత్తు హెల్మెట్ ఇంట్లో మరిచిపోయి.. అలాగే సైకిల్ రైడ్కు వచ్చేశారు. సైకిల్ నుంచి కిందపడి ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పార్థసారథి మృతిపై చిత్తూరు సైకిల్ రైడర్స్ అసోసియేషన్ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. బాలుడిని ఢీకొట్టిన వ్యాను చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని ప్రశాంత్నగర్ కాలనీ సమీపంలో లీలాద్రి (8) అనే బాలుడిని వ్యాను ఢీ కొట్టడంతో పరిస్థితి విషమంగా మారింది. తమిళనాడుకు చెందిన రాజా అనే వ్యక్తి రాజంపేట నుంచి అరటికాయలను తీసుకుని వానియంబాడీకు వెళ్లడానికి గూగుల్ మ్యాప్ ద్వారా వ్యాను నడుపుతూ బయలుదేరాడు. వాహనం ప్రశాంత్నగర్ కాలనీలోని వైఎస్సార్ కాలనీ సమీపానికి వస్తుండగా రోడ్డు దాటుతున్న లీలాద్రి అనే బాలుడిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడి పక్క టెముకలు విరగడంతో రాణిపేటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాలూకా ఎస్ఐ మల్లికార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ బోల్తా..తప్పిన ప్రమాదం గంగవరం : మండలంలోని చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిలో గోశాల వద్ద శనగల లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి చిత్తూరు వైపు వస్తున్న లారీ గోశాల వద్ద అదుపు తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు పుంగనూరు : పట్టణంలోని ఉబేదుల్లా కాంపౌండుకు చెందిన అష్రఫ్ (25) ద్విచక్ర వాహనంపై వస్తుండగా కారు ఢీకొని గాయపడ్డాడు.వివరాలు ఇలా.. బుధవారం ద్విచక్ర వాహనంలో బయటకు వెళ్లి తిరిగి పుంగనూరుకు వస్తుండగా మార్గ మధ్యలోని గుడిసెబండ సమీపంలో కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అష్రఫ్ను స్థానికులు గమనించి అంబులెన్స్లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుపతి–కాట్పాడి డబ్లింగ్కు ఆమోదం
ఈ రైళ్లు ఆపండి సారూ.. తిరుపతి–రామేశ్వరం, హౌరా–పాండిచ్చేరి, ఓకా–రామేశ్వరం, తిరుపతి–రామేశ్వరం, టాటా–యశ్వంత్పూర్ రైళ్లు చిత్తూరు మీదుగా వెళ్తున్నప్పటికీ ఇక్కడ స్టాపింగ్స్ లేవు. ఈ రైలులో ప్రయాణించాలంటే పాకాల లేదా తిరుపతికి వెళ్లి ఎక్కాల్సిందే. వేలూరు నుంచి చైన్నెకు వెళ్లే రైలును చిత్తూరు నుంచి ఎక్కే సౌకర్యం కల్పించాలనే జిల్లావాసులు ప్రధాన డిమాండ్ తీర్చాలని కోరుతున్నారు. చిత్తూరు కార్పొరేషన్ : జిల్లా రైల్వే చరిత్రలో కీలక ఘట్టానికి అడుగు పడింది. ఎప్పటి నుంచో జిల్లావాసులు కోరుకుంటున్న తిరుపతి–కాట్పాడి డబ్లింగ్కు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు తిరుపతి–కాట్పాడి మధ్య 104 కిలోమీటర్లు లైన్ను రూ.1332 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. తిరుపతి–కాట్పాడి మధ్య దాదాపు 10 స్టేషన్ల మీదుగా దాదాపు 400 గ్రామాల నుంచి నిత్యం వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మార్గంలో ఎక్కువగా గోల్డెన్ టెంపుల్, కాణిపాకం, తిరుచానూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, తిరుమల, ఆలయాలకు వేల మంది భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. లైన్ డబ్లింగ్ చేయడం వల్ల ప్రయాణ సమయం తగ్గి రైళ్ల రాకపోకలు పెరగనున్నాయి. సింగిల్ లైన్ కారణంగా రైళ్ల వెయిటింగ్తో ప్రయాణికులకు చిరాకు తప్పదు. అదే డబ్లింగ్తో వేచి ఉండే సమస్య తగ్గుతుంది. పెరగనున్న రద్దీ తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలకు భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది. చంద్రగిరి కోటకు వీక్షకులు పెరగనున్నారు. తిరుపతి మీదుగా చంద్రగిరి, ముంగిలిపట్టు, పానపాకం, పాకాల, పూతలపట్టు, చిత్తూరు, సిద్దంపల్లె, రామాపురం, బొమ్మసముద్రం స్టేషన్ల మీదుగా కాట్పాడికి రాకపోకలు సాగిస్తుంటారు. అదనపు లైన్తో ఆధ్యాత్మిక, వాణిజ్య రంగాలు అభివృద్ధి కానున్నాయి. ప్రస్తుతం తిరుపతి–కాట్పాడికి 3 ప్యాసింజర్ రైళ్లు ఉండగా అవి రోజు ఆరు ట్రిప్పులు ద్వారా సుమారు 5 వేల మంది ప్రయాణికులను చేరవేస్తోంది. వీటితో పాటు శేషాద్రి, కన్యాకుమారి, శబరి, కేరళ, ఎక్స్ప్రెస్లు ద్వారా బెంగళూరు–కాకినాడ, పూణే, హైదరాబాద్, కొచ్చిన్, త్రివేండం, న్యూఢిల్లీకి వేల మంది వెళ్తున్నారు. డబుల్లైన్ వేయడం ద్వారా మరిన్ని ఎక్స్ప్రెస్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 104 కిలోమీటర్లు రూ.1332 కోట్లతో నిర్మాణం అభివృద్ధి కానున్న ఆధ్యాత్మిక, వాణిజ్య రంగాలు -
కానిస్టేబుల్కు కన్నీటి వీడ్కోలు
– అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చౌడేపల్లె : అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్ పోలీస్ స్టేషన్లో కోర్టు కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న తోటి జయప్రకాష్(42)కు చౌడేపల్లె మండలం బయ్యపల్లె గ్రామంలో బుధవారం కన్నీటి వీడ్కోలు పలికారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు మార్గ మధ్యలో జయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 5 వతేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ భరోసా ఇచ్చారు. అంత్యక్రియలకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. రూరల్ ఇన్స్పెక్టర్ కళా వెంకటరమణ, ఎస్ఐ నాగేశ్వరరావు, ఏఆర్ పోలీసులు అధికారిక లాంఛనాలతో జయప్రకాష్కు కన్నీటి వీడ్కోలు పలికారు. -
ఏఎంసీ చైర్మన్ గిరి ఎవరికో!
● పలమనేరు బీసీ మహిళలకు రిజర్వేషన్ ఖరారు ● ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఎంపికలో అధిష్టానం ● బలంగా వినిపిస్తున్న ఇద్దరి పేర్లు పలమనేరు : నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాత ప్రొటోకాల్ ఉన్న పోస్టు మార్కెట్ కమిటీ చైర్మన్. ఏఎంసీ చైర్మన్కు అన్ని మండలాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాల్లో సముచిత స్థానం ఉంటుంది. దీంతో తాజాగా కూటమి అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలోని పలు మండలాల నాయకుల కన్ను చైర్మన్ కుర్చీపై పడింది. జిల్లాలోని పది మార్కెట్ కమిటీలకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఆ మేరకు పలమనేరు ఏఎంసీ బీసీ మహిళలకి కేటాయించారు. ఇప్పటికే జిల్లాలోని కొన్ని ఏఎంసీలకు కొత్త చైర్మన్లను కూటమి ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ జాబితాలో పలమనేరు కనిపించలేదు. ఎందుకంటే దీనికి కూటమి నేతల్లో ఎక్కువగా డిమాండ్ ఉండడం, స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ఎవరిని సూచిస్తున్నారు, ఇదే సమయంలో పార్టీ అధిష్టానం ఇటీవల చేపట్టిన ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా ఎవరి పేరు వచ్చిందనే విషయం స్థానికంగా హాట్టాపిక్ మారింది. ఇప్పుడే డిమాండ్ ఎందుకంటే.. పలమనేరు సమీపంలోని క్యాటిల్ఫామ్ వద్ద 33 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ టమాట మార్కెట్ను రూ.55 కోట్లతో నిర్మించనున్నారు. ఇది జిల్లాలోనే మోడల్ మార్కెట్గా చేయాలని మార్కెటింగ్ అధికారులు నిర్ణయించారు. హైవేకు ఆనుకుని వాణిజ్య సముదాయాలను నిర్మించనున్నారు. మార్కెట్కు వచ్చిన కూరగాయలకు అక్కడికక్కడే ప్యాకింగ్, గ్రేడింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. రైతుల సౌకర్యార్థం క్యాంటీన్లు, రైతు విశ్రాంతి గదులు తదితరాల నిర్మాణాలు ఉంటాయి. దీనికి సమీపంలోనే పశువులు, గొర్రెల వారపు సంతలుంటాయి. ఇలాంటి మోడల్ మార్కెట్ రూ.33 కోట్లతో పనులు జరుగనున్న నేపథ్యంలో తమ ఆధ్వర్యంలోనే ఇక్కడ ఇంటిగ్రేటెట్ మార్కెట్ ప్రారంభించామని చెప్పుకోవచ్చు. పైగా ఇందులో వారికి తగిన ప్రతిఫలం దక్కుతుందనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఆ ఇద్దరు ఎవరు? మొన్నటి దాకా ఇక్కడి బీసీ మహిళా రిజర్వేషన్ను మార్చి జనరల్ చేస్తారనే మాట వినిపించింది. కానీ పలమనేరు నియోజకవర్గంలో ఎక్కువగా బీసీ ఓటర్లు ఉండడంతో ముందు నిర్ణయించినట్లే రిజర్వేషన్లలో మార్పు లేకుండా పోయింది. ఇక్కడ టీడీపీని అంటిపెంటుకున్న బీసీ కులాల్లో 22 వేల దాకా కురబ సామాజిక వర్గ ఓటర్లున్నారు. మిగిలిన బీసీ కులాల్లో వాల్మీకి, వడ్డెర, పల్లెగౌండర్ల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైర్మన్ గిరి కోసం గంగవరం మండలానికి చెందిన ఓ బీసీ యువనేత సతీమణి పేరు గట్టిగా వినిపిస్తోంది. మరోవైపు స్థానిక ఎమ్మెల్యేకు వీర విధేయుడైన బైరెడ్డిపల్లికి చెందిన ముఖ్య నాయకుడి సతీమణి సైతం బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజాభిప్రాయమా.. స్థానిక ఎమ్మెల్యే అనుచరులకా ఇప్పటి దాకా స్థానిక ఎమ్మెల్యే ఎవరిని సూచిస్తే వారికి ఏఎంసీ చైర్మన్ గిరి దక్కడం జరిగేది. కానీ పలమనేరు ఏఎంసీకి సంబంధించి అధిష్టానమే ఫోన్ల ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోందని తెలిసింది. ఆ మేరకు స్థానిక ఎమ్మెల్యే సూచించిన వారికే పదవి దక్కుతుందా లేదా అధిష్టానం మాట చెల్లుతుందా అనేది వేచి చూడాల్సిందే. ఏదేమైనా ఏఎంసీ చైర్మన్ విషయంలో పార్టీ కోసం కష్టపడిన బీసీలకే న్యాయం జరగాలనే మాట నియోజవర్గంలోని ఆ పార్టీ బీసీల్లో గట్టిగా వినిపిస్తోంది. -
సంఘాల అభివృద్ధికి చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : క్రెడిట్ అండ్ లైవ్లీ హుడ్ ప్రణాళికను పక్కాగా సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు పలు శాఖల అధికారులతో బుధవారం కలెక్టర్ వరుస సమావేశాలు నిర్వహించారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోరారు. సంఘాల ఆధ్వర్యంలో పొందే రుణాలను సద్వినియోగం చేసుకునేలా క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. సంఘం సభ్యులకు సంబంధించిన నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా ఇబ్బంది పెట్టే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబనకు మంజూరు చేసే రుణాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు. 11న ఉద్యానవన పంటలపై సమావేశం జిల్లా కేంద్రంలో ఎన్పీసీ కన్వెన్షన్ సెంటర్లో ఉద్యానవన పంటలపై సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈనెల 11న జిల్లా కేంద్రంలో ఉద్యాన పంటలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 72 వేల హెక్టార్లలలో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా మామిడి 25 మండలాల్లో ప్రధాన పంటగా, మామిడిలో తోతాపురి ఎక్కువగా సాగులో ఉండడం వల్ల దిగుబడి ఏటా లభిస్తోందన్నారు. మామిడి గుజ్జు తయారీకి చిత్తూరు ప్రధాన కేంద్రంగా మారిందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మామిడి పంట, దిగుబడి నిలకడగా లేకపోవడం వల్ల మామిడి గుజ్జు ఎగుమతులపై ప్రభావం చూపిందన్నారు. ఇందుకు సంబంధించి అవగాహన కల్పించేందుకు రాష్ట్రస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉద్యాన పంటల అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందన్నారు. జిల్లాలోని రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
చిత్తూరులో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఆడియో రిలీజ్
కాణిపాకం : చిత్తూరు నగరంలోని ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం రాత్రి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్ర ఆడియో అట్టహాసంగా లాంచ్ చేశారు. సినిమా హీరో నందమూరి కళ్యాణ్రామ్, హీరోయిన్ సాయి మంజ్రేకర్, నటీనటులు విజయశాంతి, పృద్వీ, దర్శకుడు ప్రదీప్ చిలకూరి, నిర్మాతలు అశోక్ వర్ధన్, సునీల్, కాలేజీ చైర్మన్లు రావూరి వెంకటస్వామి, రావూరి శ్రీనివాసులు, ఎడిటర్ తమ్మీరాజు, రైటర్ శ్రీకాంత్, ఎస్పీ మణికంఠ చందోలు పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. అనంతరం సినిమా చిత్రీకరణ, కథ అంశాన్ని వివరించారు. మ్యూజిక్, తల్లీ, కొడుకు మధ్య జరిగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయన్నారు. ఈనెల 18వ తేదీ సినిమా రిలీజ్ కానుందన్నారు. ప్రేక్షకులు, అభిమానులు సినిమాను ఆదరించాలన్నారు. అభిమానులు ఈ రిలీజ్ వేడుకకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. -
మహేశ్వరయ్య..మజాకానా!
● పంచాయతీ కార్యదర్శి ఆస్తులు రూ.30 కోట్లు ● ఏసీబీ సోదాల్లో వెలుగుచూసిన వైనం పలమనేరు : ఆయనో సాధారణ పంచాయతీ కార్యదర్శి.. ఆయనకొచ్చే జీతంతో ఆ కుటుంబానికి సరిపోతుంది. మిగిలేదేమీ పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ఆయన అందరిలాంటి వాడు కాదు.. ఏకంగా ఆ చిన్న ఉద్యోగంతోనే రూ.30 కోట్లు సంపాదించి ఔరా అనిపించారు. ఇటీవల చంద్రగిరి పంచాయతీ కార్యదర్శి మహేశ్వరయ్య ఓ కాంట్రాక్టర్ వద్ద రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా వేర్వేరుచోట్ల ఏసీబీ అధికారులు దాడులు చేయగా తిరుపతిలో రెండిళ్లు, రెండుసైట్లు, రెండు కార్లు, కేజీ బంగారం, రెండు కిలోల వెండి, 5 లక్షల నగదు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇవికాక బెంగళూరులో అపార్ట్మెంట్, బద్వేలో బంధువులపై భూములు వెలుగు చూశాయి. తాజాగా రెండు రోజుల క్రితం ఏసీబీ అధికారులు పలమనేరు, గంగవరంలలో సోదాలు చేశారు. ఇక్కడ సాయినగర్లో షాపింగ్ కాంప్లెక్స్, జీఫ్లస్ ఇళ్లు, కూర్నిపల్లి వద్ద ఫామ్హౌస్ పక్కనే నాలుగెకరాల పొలాన్ని గుర్తించారు. ఈ ఆస్తులన్నీ చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. -
అర్హులందరికీ వ్యవసాయ పరికరాలు
పలమనేరు : జిల్లాలో 50 శాతం సబ్సిడీ వ్యవసాయ పరికరాల పంపిణీలో రాజకీయ నేతల ప్రమేయం లేకుండా అర్హులైన వారికి తప్పకుండా పరికరాలను అందజేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ సృష్టం చేశారు. ఆ మేరకు తమ్ముళ్లకు యంత్రసాయం అనే శీర్షికన బుధవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. స్థానిక వ్యవసాయశాఖ ఏడీ కార్యాలయంలో పలమనేరు, కుప్పం ఆశాఖ అధికారులతో సమీక్షించారు. ఇప్పటి దాకా మండలాల వారిగా వ్యవసాయ పరికరాలకు ఎంత మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. లక్ష్యం ఎంత, ఇప్పటి దాకా ఎంత చేశారని అడిగి తెలుసుకున్నారు. ఇందులో రాజకీయాలకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు. లబ్ధిదారుల జాబితాను రాజకీయ నేతలకు ఎందుకు ఇస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని సూచించారు. జిల్లాలో మొత్తం 3.24 లక్షల మంది రైతులుండగా వీరిలో 2.25 లక్షల మంది ఇంకా రైతు గుర్తింపు కార్డులకు ఈకేవైసీ చేసుకోవాల్సి ఉందన్నారు. అనంతరం కూర్మాయి గ్రామంలో రైతు చందూల్రెడ్డి సాగు చేసిన దేశీయ వరి పంటను ఆయన సందర్శించారు. ఆపై ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన నలభై రకాల టమాట విత్తనాలను పరిశీలించారు. ఏడు మండలాల ఏవోలు, ఏడీ గీతాకుమారి, జెడ్బీఎన్ఎస్ మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. -
కాలిపోయిన కోళ్లఫాంను పరిశీలించిన పెద్దిరెడ్డి
పులిచెర్ల(కల్లూరు) : మండలంలోని చెరువు ముందరపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు నాగిరెడ్డికి చెందిన కోళ్ల ఫాం గోడౌన్ను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో గోడౌన్లోని సుమారు రూ.15 లక్షల విలువ చేసే వస్తు సామగ్రి కాలిపోయింది. విషయం తెలుసుకొన్న మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం ఆ గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అన్ని విధాల అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ముర్వత్ బాషా, నిరంజన్రెడ్డి, శివారెడ్డి, నాగిరెడ్డి, జెడీ నారాయణ పాల్గొన్నారు. నేడు, రేపు ఏఎన్ఎంల ఉద్యోగోన్నతికి కౌన్సెలింగ్ చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో గ్రేడ్–3 ఏఎన్ఎం ఉద్యోగోన్నతికి సంబంధించిన తుది జాబితా ఎట్టకేలకు పూర్తయింది. గతేడాది ప్రారంభమైన జాబితా తయారీ ప్రక్రియ...పలు ఆరోపణల నడుమ బుధవారం సాయంత్రానికి పూర్తి చేశారు. 1000 మందిపైగా గ్రేడ్–3 ఏఎన్ఎంలుంటే 307 మందితో ఈ జాబితా సిద్ధం చేశారు. గురు, శుక్రవారాల్లో ఉద్యోగోన్నతికి సంబంధించి కౌన్సెలింగ్ చిత్తూరు నగరంలోని కలెక్టరేట్లో నిర్వహించనున్నారు. డీఆర్ఓ సమక్షంలో కౌన్సెలింగ్ జరగనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. వీటిపై కొంతమంది మళ్లీ అభ్యంతరం తెలుపుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లకు ఫిర్యాదు చేశామని అంటున్నారు. -
‘పొదుపు’ డబ్బులు రూ.32 లక్షలు స్వాహా
పుంగనూరు : చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని ఒక ఆర్పీ.. మహిళలు ప్రతి నెలా పొదుపు చేసిన రూ.32 లక్షలను స్వాహా చేశారని మంగళవారం గ్రూపు మహిళలు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్కు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు పట్టణంలోని వైభవ్ లక్ష్మీ సమాఖ్యలో 280 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. రెడ్డిరాణి తన చేతివాటం ప్రదర్శించి, మహిళల వద్ద వసూలు చేసిన రూ.32 లక్షల రూపాయలు గత ఏడాది కాలంగా బ్యాంకులో పొదుపు చేయకుండా స్వాహా చేశారు. దీనిపై సభ్యులకు అనుమానం వచ్చి బ్యాంకు ఖాతాలను పరిశీలించగా పొదుపు చేసిన నిధులు బ్యాంకులో జమ కాకపోవడంతో స్వాహా అయినట్లు నిర్ధారించుకున్నారు. మంగళవారం పుంగనూరుకు వచ్చిన డీఎస్పీకి మహిళా సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. సమావేశంలో సీఐ రామ్భూపాల్, ఎస్ఐ లోకేష్ పాల్గొన్నారు. -
‘ద్రవిడం’.. తిరోగమనం!
ద్రవిడ వర్సిటీకి అనుబంధ కష్టాలు పెరిగాయి. జిల్లాలోని కళాశాలలు వర్సిటీకి అనుబంధంగా చేయకపోవడంతో ఆర్థిక సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. కొన్ని కోర్సుల్లో విద్యార్థులు చేరక ఆ బ్రాంచ్లు మూతపడ్డాయి. కొత్త కోర్సులు లేకపోవడంతో విద్యార్థులు వర్సిటీలో చేరేందుకు ఆసక్తి చూపడంలేదు. న్యాక్ గ్రేడ్ లేకపోవడంతో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచింది. సొంత జిల్లా వాసి సీఎంగా ఎన్నికవడంతో వర్సిటీ అధికారులు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం కొలువుదీరి పది నెలలు గడుస్తున్నా వర్సిటీ అభివృద్ధిపై పాలకులు నోరు మెదకపోవడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. కుప్పం : ద్రావిడ విశ్వవిద్యాలయం రోజు రోజుకు అభివృద్ధిలో తిరోగమన దిశగా పయనిస్తోంది. వర్సిటీలో అభివృద్ధి కంటే వివాదాలే ఎక్కువ నడుస్తున్నాయి. కనీసం వర్సిటీకి మెరుగైన న్యాక్ గ్రేడింగ్ రాకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. ద్రవిడ వర్సిటీని ప్రక్షాళన చేసి అభివృద్ధి చేస్తామని ఎన్నికల హామీలో ప్రకటించిన కూటమి ప్రభుత్వం నేటికీ వర్సిటీలో ఎలాంటి మార్పు తీసుకురాకపోగా కనీసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏడాదికి పైగా జీతాలు చెల్లించలేని దుస్థితి నెలకొంది. దీంతో ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దారుణమైన పరిస్థితులు దాపురించాయి. రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీకి తగినన్ని నిధులు ఇవ్వకపోగా కళాశాలల అనుబంధం అనుమతి దక్కలేదు. కొత్త కోర్సులు ప్రవేశ పెట్టకుండా ఉండడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఎటూ తేలకపోవడం ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి వేరుగా విడిపోవడంతో చిత్తూరు జిల్లాలో ఏకై క వర్సిటీగా ద్రావిడ విశ్వవిద్యాలయం ఉంది. దీంతో జిల్లాలోని అన్ని కళాశాలలను ద్రవిడ వర్సిటీకి అనుబంధం చేస్తే రెవెన్యూ మెరుగై వర్సిటీ అభివృద్ధికి తోడ్పడుతుందని ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు కళాశాలల అనుబంధం కార్యరూపం దాల్చలేదు. ఇందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి చిత్తూరు జిల్లాలుగా విడిపోయినా వీటికి సంబంధించిన బార్డర్లు తేలకపోవడంతో కళాశాలల అనుబంధం కష్టతరంగా మారింది. అయితే ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కళాశాలలు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా నడుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని కళాశాలలను ద్రవిడ వర్సిటీకి అనుబంధం చేస్తే ఎస్వీ వర్సిటీ రెవెన్యూకు గండికొట్టినట్లు అవుతుందని.. దీనిపై ఎస్వీ వర్సిటీ కోర్టును సైతం ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ద్రవిడ వర్సిటీకి ఇప్పట్లో చిత్తూరు జిల్లాలోని కళాశాలల అనుబంధం కష్టతరంగానే కనిపిస్తోంది. ఉద్యోగుల కొనసాగింపుపై అనుమతి రాకపోవడం ద్రావిడ వర్సిటీలో విధులు నిర్వహిస్తున్న 235 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో దాదాపు సగానికి పైగా ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వర్సిటీలోని ఉద్యోగులకు ఇప్పటికే 12 నెలలకు పైగా జీతాలు ఇవ్వక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వర్సిటీ అధికారులు 235 మందికి ఫైనాన్స్ అప్రూవల్ ఇవ్వాలని వినతి చేశారు. దీనిపై ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అంత మందికి అప్రూవల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పినట్లు సమాచారం. వర్సిటీలోని విద్యార్థులు, శాఖలు వంటి ప్రామాణికతకు తగ్గట్టు ఎంత మేరకు అవసరమో తెలిపితే అంత మందికి మాత్రమే అప్రూవల్ ఇచ్చేందుకు సుముఖం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో వర్సిటీ అధికారులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే వర్సిటీలో 235 మంది ఉద్యోగులు దాదాపు 15 సంవత్సరాలకు పైగా విధులు నిర్వహిస్తున్నవారే. ఇన్ని సంవత్సరాలు వర్సిటీలో విధులు నిర్వహిస్తూ.. వర్సిటీనే నమ్ముకుని తాము ఉద్యోగాలు చేస్తున్నామని, ఉద్యోగాలు కోల్పోతే తాము ఎలా బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఉద్యోగిని తొలగించిన ఎంతటి పోరాటానికై నా సిద్ధమని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం అభివృద్ధికి దూరంగా వర్సిటీ జిల్లాలోని కళాశాలల అనుబంధం సాధ్యమేనా? ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం! ఆసక్తి చూపని విద్యార్థులు ద్రావిడ వర్సిటీలో ఏటా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. వర్సిటీని పలు శాఖల్లో విద్యార్థులే లేకపోవడం గమనార్హం. దీంతో పాటు ద్రవిడ వర్సిటీలో చేరేందుకు విద్యార్థులు సుముఖత చూపడం లేదు. అదే విధంగా ఇక్కడ అధ్యాపకులు విద్యార్థులను ఆకర్షించడంలో విఫలమవుతున్నారు. -
ఇంట్లో చోరీ..
పలమనేరు పట్టణ సమీపంలోని ఓ ఇంటిలో రూ.2 లక్షల విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి.బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025పలమనేరు : జిల్లాలోని రైతు సేవా కేంద్రాల్లో యూరియా వచ్చినా ముందుగా కూటమి నేతలకు చేరాల్సిందే. ఆపై మిగిలిన వాటిని అవసరం ఉన్న రైతులకు అందజేస్తున్నారు. రాయితీతో అందే విత్తనాలు, హార్టికల్చర్ ద్వారా అందే నర్సరీ నార్లు ఇలా రాయితీ పథకాలేవైనా ముందు తమ్ముళ్లకు ఆపైనే రైతులకనే విధంగా మారింది. దీంతో తటస్థంగా ఉన్న లేదా వైఎస్సార్సీపీ సానుభూతి రైతులకు వ్యవసాయ, ఉద్యానశాఖలకు సంబంధించిన రాయితీ పథకాలకు సూటిపోటి మాటలు, అవమానాలు తప్పడం లేదు. రాయితీ పరికరాలకు నిబంధనలు ఇలా.. ఎస్ఎంఏఎం పథకంలో 17 శాతం ఎస్సీలు, 8 శాతం ఎస్టీలు మిగిలిన శాతం బీసీ, ఓసీలోని సన్న, చిన్నకారు రైతులకు అందివ్వాలి. గత ఐదేళ్లలో వ్యవసాయ పరికరాలను పొందని రైతులుగా ఉండాలి. ఆ మేరకు ఇప్పటికే పరికరాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలు ముందుగా ఆర్ఎస్కే లాగిన్ ఆపై ఏవో లాగిన్ నుంచి డీఏవో లాగిన్ ద్వారా ఎంపికలు జరుగుతాయి. ఎంపికై న రైతులు సంబంధిత పరికరం ధరలో 50 శాతం డబ్బును సంబంధిత కంపెనీకి చెల్లించి ఆ కంపెనీ ద్వారానే పరికరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. జాబితాలు కూటమి నేతల జేబుల్లోకి... ఆన్లైన్లో నమోదైన లబ్ధిదారుల జాబితాలు ఆయా మండలాల్లోని పంచాయతీ స్థాయి నాయకుల జేబుల్లోకి ఇప్పటికే చేరాయి. వీటిని అధికారులు ఎందుకిచ్చారో ఎవరి ఆదేశాలతో ఇచ్చారో అర్థంకావడం లేదు. పారదర్శకంగా సాగాల్సిన వ్యసాయశాఖ పథకాల పంపిణీలో రాజకీయ జోక్యం నెలకొంది. జాబితా జేబులో పెట్టుకున్న కూటమి చోటా నేతలు లబ్ధిదారులను చూడగానే జాబితా ఉందన్నా ఇవ్వాలా వద్దా అనే మాట వినిపిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పలువురు రైతులు ఇదేమీ కర్మరా సామీ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.– 8లో– 8లోన్యూస్రీల్ యూరియా, సీడ్స్ ఏమొచ్చినా ముందుగా పచ్చనేతలకే.. పథకమేదైనా లిస్ట్ సంబంధిత లీడర్లకు ఇవ్వాల్సిందే దరఖాస్తుదారుల జాబితా కూటమి నేతల జేబులో.. వ్యవసాయశాఖ రాయితీ పథకాల్లో సాగుతున్న తీరు రూ.2.84 కోట్లతో 1645 రకాల పరికరాలు చిత్తూరు జిల్లా వ్యవసాయశాఖ డివిజన్ పరిధిలో 2024–25 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకమైన ఎస్ఎంఏఎం( ది సబ్ మిషన్ ఆఫ్ అగ్రికల్చరల్ మెకనైజేషన్)లో రూ.2.84 కోట్ల నిధుల ద్వారా ప్లాంట్ ప్రొటెక్షన్ పరికరాలైన మాన్యువల్ స్పేయర్లు, పవర్ స్పేయర్లు, ట్రాక్టర్ బెస్డ్ బూమ్టైప్ స్పేయర్లున్నాయి. ట్రాక్టర్ డ్రాన్ పరికరాల్లో కల్టివేటర్లు, డిస్క్పడల్స్, సీడ్కం ఫర్టిలైజర్ డ్రిల్స్ తదితరాలున్నాయి. ఇక సెల్ఫ్ ప్రొఫెల్లెడ్ పరికరాలు మొత్తం 1645 పరికరాలను జిల్లాలోని రైతులకు 50 శాతం సబ్సిడీతో పంపిణీ చేయాల్సి ఉంది. – పలమనేరు మండలంలోని కొలమాసనపల్లి పంచాయతీ కల్లాడుకు చెందిన ఓ రైతు మండలంలో ఆదర్శ రైతుగా ప్రభుత్వం చేత గతంలో గుర్తింపు పొందాడు. ఇటీవల వ్యవసాయశాఖ రాయితీ పరికరాల పథకంలో పవర్ స్పేయర్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేశాడు. ఓ వైపు పరికరాల పంపిణీ ఇంకా మొదలే కాలేదు. కానీ ఆన్లైన్లో నమోదైన పేర్లు అక్కడి అధికారుల నుంచి కూటమి నేతలకు చేరిపోయాయి. దీంతో వారు సంబంధిత రైతును చూసి ఏమన్నో స్పేయర్కోసం ఆన్లైన్లో నీపేరుంది.., ఎట్టా కావాల్నా ? అంటూ ఆ రైతును అడిగారు. ఈ విషయం వీళ్లకెలా తెలుసునని ఆ రైతు షాక్కు గురయ్యాడు. ఏ పథకం వచ్చినా మొదట తమ్ముళ్ల కడుపు నిండుతోంది. తరువాతే మిగిలిన రైతులకు అందజేస్తున్నారు. ఆన్లైన్లో ఏ పథకానికి దరఖాస్తు చేసినా జాబితా నేరుగా సంబంధిత కూటమి నేతలకు చేరిపోతోంది. ఇంకేంముంది..పల్లెల్లో ఇక వారి సిఫార్సు ఉంటేనే పథకాలు అన్నదాతలకు అందుతాయి. మనసు చంపుకొని వారి వద్దకు వెళ్తేనే రాయితీ కానీ మరో పథకమైనా దక్కుతుంది..కూటమి పాలనలో పారదర్శకతకు పాతరేశారు..గతంలో వైఎస్సార్సీపీ పాలనలో కులం, మతం, వర్గం, పార్టీ చూడకుండా పథకానికి అర్హులైతే చాలు..ఇంటి వద్దకే వచ్చి సేవలు అందించేవారు..నేడు పథకాలకు తమ్ముళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే గాని అందని పరిస్థితులు దాపురించాయి. విచారణ చేస్తాం.. పథకాలను అర్హులైన వారికి అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు , యంత్రాల పంపిణీ కోసం ఆసక్తి గల రైతుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరాం. ఆయా పంచాయతీల్లో కూటమి నేతలకు లబ్ధిదారుల జాబితా ఎలా వెళ్లిందనే దానిపై విచారణ చేస్తాం. దీనిపై జిల్లా స్థాయిలో ఏఓలతో సృష్టమైన ఆదేశాలను ఇస్తాం. అర్హులైన రైతులకు పార్టీలతో సంబంధం లేకుండా సబ్సిడీ పరికరాలను అందజేస్తాం. – మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి, చిత్తూరు