● సాహోరే ‘బాహుబలి’
చిత్తూరు జిల్లా కేంద్రంలోని కొంగారెడ్డిపల్లిలో ఉండే ఓ ప్రైవేట్ పాఠశాలలో అరవింద్ అనే విద్యార్థి 2025–26 విద్యాసంవత్సరానికి ఒకటవ తరగతిలో ఆర్టీఈ విధానంలో అడ్మిషన్ పొందాడు. ఆ విద్యార్థి అడ్మిషన్ పొందుతున్నట్లు విద్యాశాఖ అధికారులు కేటాయింపు పత్రం సైతం ఇచ్చారు. అయితే ఆ పాఠశాల నిర్వాహకులు నిత్యం ఆ విద్యార్థిని ఫీజు చెల్లించలేదంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పలుసార్లు ఇంటికి పంపించిన ఘటనలు సైతం ఉన్నాయి.
తిరుపతి జిల్లా కేంద్రంలోని ఎయిర్ బైపాస్ రోడ్డులో ఉన్న ఓ కార్పొరేట్ పాఠశాలలో ఈ విద్యాసంవత్సరం ఆర్టీఈ విధానంలో 15 మంది విద్యార్థులను కేటాయించారు. ఆ విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం నుంచి ఫీజుల పేరుతో ఎటువంటి ఒత్తిడి తీసుకురాకూడదు. అయితే నిబంధనలను అతి క్రమించి ఆ పాఠశాల యాజమాన్యం పరీక్షలు నిర్వహించినప్పుడల్లా ఆ విద్యార్థులను ఫీజు చెల్లించలేదని తరగతి బయట నిలబెడుతున్నారు. ఈ విషయంపై ఆ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల నిర్వాహకులను ప్రశ్నించినా ఏ మాత్రం పట్టించుకోకుండా ఫీజు చెల్లించాలని ఇబ్బందులు పెడుతునే ఉన్నారు.
చిత్తూరు జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల సమాచారం
● సాహోరే ‘బాహుబలి’


