Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page
breaking news

ప్రధాన వార్తలు

YSRCP President YS Jagan Takes On Education System In AP1
అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు: వైఎస్‌ జగన్‌

తాడేపల్లి: ఏపీ ఈసెట్‌ రిజల్ట్స్‌ వచ్చి 45 రోజులవుతున్నా ఇంకా కౌన్సిలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. చంద్రబాబు సర్కారును నిలదీశారు ఇది ఏపీ విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనమంటూ వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్‌ చేశారు వైఎస్‌ జగన్‌.‘రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్‌ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్‌ రిజల్ట్స్‌ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్‌ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్‌ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్లకోసం 34వేల మంది పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఈసెట్‌ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు. గతనెల మే 15న ఫలితాలు వెలువడినా, ఇప్పటికీ కౌన్సెలింగ్‌ ప్రక్రియపై షెడ్యూల్‌ విడుదలచేయకపోవడం, ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు’ అంటూ విమర్శించారు.రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్‌ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్‌ రిజల్ట్స్‌ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్‌ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్‌ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 29, 2025

conspiracy theory against kethireddy pedda reddy,High Tension In Tadipatri2
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్‌

సాక్షి,అనంతపురం: కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్‌ చేయిస్తున్న తరుణంలో.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కుట్రకు దిగింది. బలవంతంగా అరెస్ట్‌ చేయించింది.ఏడాది తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వెళ్లారు. అయితే, పెద్దారెడ్డి రాకపై సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం ఉదయం తాడిపత్రిలోని తన నివాసంలో బలవంతంగా అరెస్ట్‌ చేశారు. తాడిపత్రిలో ఉండరాదంటూ ఆంక్షలు విధించారు. అనంతరం, రహస్య ప్రాంతానికి తరలించగా.. ఇప్పటికే పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లొచ్చన్న హైకోర్టు అనుమతిచ్చిన విషయాన్ని పోలీసులకు పెద్దారెడ్డి గుర్తు చేశారు. దీంతో చేసేది లేక పెద్దారెడ్డిని అనంతపురం తరలించారు. నా ఇంటికి నేను వెళితే పోలీసులకు ఇబ్బంది ఏంటి?అనంతపురం రాంనగర్‌లో తన నివాసంలో పెద్దారెడ్డిని వదిలి పెట్టారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నేను తాడిపత్రి వెళ్లొచ్చని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నా ఇంటికి నేను వెళితే పోలీసులకు ఇబ్బంది ఏంటి?. పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?.తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరిని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటా. జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పించారు. మరోవైపు పెద్దారెడ్డిపై దాడి చేసేందుకు జేసీ వర్గీయులు సమాయత్తం కావడంతో తాడిపత్రిలో ఉద్రికత్తత నెలకొంది. అంతకుముందు, పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేతకు కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదుతో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేసేలా మునిసిపల్ అధికారులు కొలతలు తీసుకున్నారు. మున్సిపల్‌ అధికారులు తన ఇంటి కొలతలు తీసుకున్నారనే సమాచారంతో పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చారు. అదే సమయంలో పెద్దారెడ్డిపై దాడులు చేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడుగు పెట్ట నివ్వడం లేదు. అడుగడుగునా కూటమి నేతలు అడ్డు తగులుతున్నారు. ఈ క్రమంలో తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డి హైకోర్టులో అనుమతి తీసుకున్నారు. అయినప్పటికీ కూటమి నేతలు పదేపదే బెదిరింపులు, దాడులతో కక్ష సాధింపు చర్యలతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో పెద్దారెడ్డి మరోమారు హైకోర్టులో కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేశారు.

Jaipur Couple Found Dead At Their House3
అన్యోన్య దాంపత్యం.. అర్ధాంతరంగా ముగిసిపోయింది..!

వారిది కచ్చితంగా అన్యోన్య దాంపత్యమనే చెప్పొచ్చు. కానీ వారి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఇక్కడ అన్యోన్య దాంపత్యం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. అది సీసీ టీవీ ఫుటేజ్‌ చెబుతున్న మాట. మనిషి మాట నమ్మని ఈ రోజుల్లో.. సీసీ టీవీ ఫుటేజ్‌ ‘మాట’ కచ్చితంగా నమ్ముతాం. వీరు శవాలుగా మారకముందు గత రెండు రోజుల సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించి చూస్తే వారు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఎంతో అన్యోన్యంగా కనిపించారు. మరి ఈ జంట ఎలా చనిపోయిందనేది ప్రశ్న. ఏమైనా చిన్నపాటి మనస్పర్థలు తలెత్తి అది ఆత్మహత్య వరకూ వెళ్లిందా? లేక ఎవరైనా హత్య చేశారా? అనేది పోలీసులు దర్యాప్తులో తేలనుంది. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగానే ఈ కేసు దర్యాప్తు చేపట్టారు పోలీసులు.రాజస్థాన్‌ రాష్ట్రంలోనే జైపూర్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ దంపతుల్లో భర్త పేరు ధర్మేంద్ర కాగా, భార్య పేరు సుమన్‌. వీరికి 11, 8 ఏళ్లు కల్గిన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారి ఇద్దరు భరత్‌పూర్‌ గ్రామంలో తమ నానమ్మ, తాతయ్యలు దగ్గర ఉంటున్నారు. సమ్మర్‌ హాలీ డేస్‌కు తాతయ్య ఇంటికి వెళ్లిన ఆ పిల్లలు ఇంకా రాలేదు.ధర్మేంద్ర- సుమన్‌ జంట ఈ శుక్రవారం(జూన్‌ 27వ తేదీ) తమ ఫ్లాట్‌లో విగతజీవులుగా కనిపించారు. అంతకుముందూ వరకూ ఎంతో ఆనందంగా ఉన్న ఈ జంట.. ఎందుకు ఇలా చేశారు అనేది చర్చగా మారింది. ధర్మేంద్ర బ్యాంక్‌ సేల్స్‌ మేనేజర్‌ గా పని చేస్తున్నాడు. అయితే శుక్రవారం ధర్మేంద్ర బ్యాంక్‌కు వెళ్లకపోవడంతో తోటి ఉద్యోగులు ఫోన్‌ చేస్తే స్పందన రాలేదు. దీంతో ఈ విషయాన్ని సదర ఉద్యోగి.. ధర్మేంద్ర బంధువులకు తెలియజేశాడు. దీంతో వారు వెళ్లి తలుపులు పగలగొట్టి చూడగా ఆ జంట విగతజీవులుగా కనిపించారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం వీరికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని బంధువులు చెబుతున్నారు. ఇటీవలే రీసెంట్‌గా ఫ్లాట్‌ కొనుగోలు చేసిన వీరి ఆర్థికపరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వారు అంటున్నారు. మూడు సీసీ ఫుటేజ్‌లో ఇలా..ఒక సీసీ ఫుటేజ్‌లో వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు కనిపించారు. వారు ఫ్లాట్‌లో కారు పార్కు చేసే క్రమంలో భార్య సుమన్‌.. భర్త ధర్మేంద్ర భుజంపై తలపెట్టుకుని అతని చేతుల్ని పట్టుకుని ఉంది. ఆపై కారు దిగి వెళ్లిపోతున్న వీడియోలో ఆమె భుజంపై భర్త ధర్మేంద్ర చేయి వేసి నడుచుకుంటూ వెళ్లినట్లు ఉంది. అయితే వారు చనిపోవడానికి ముంద రోజు గురువారం మాత్రం ఇద్దరికీ చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు కనిపించింది. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం భార్య సుమన్‌.. ఒక క్యారీ బ్యాగ్‌ తీసుకుని వెళుతున్నట్లు కనిపించింది. అదే వారు చివరిసారి సజీవంగా కనిపించడం. ఆ తర్వాత రోజే ఈ దారుణం చోటు చేసుకుంది. సుమన్‌ ఒంటిపై గాయాలుఅయితే భార్య సుమన్‌ ఒంటిపై గాయాలు కనిపించడంతో హత్యా కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి కుటుంబంలో ఎటువంటి వైవాహిక విభేదాలు ఉన్నట్లు తమకు కనిపించలేదని పోలీస్‌ అధికారి అజయ్‌ సింగ్‌ తెలిపారు. అయితే ఇద్దరూ సూసైడ్‌ చేసుకుని ఉండటంతో అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఏమైనా క్లూ దొరుకుతుందనే కోణంలో వారి మొబైల్స్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు పోలీసులు.

Raghava Lawrence Emotional Post on Child Artist Ravi Raj Rathod4
నా గుండె తరుక్కుపోతోంది.. నిన్ను కొట్టనురా.. లారెన్స్‌ భావోద్వేగం

రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence).. నటుడు, కొరియోగ్రాఫర్‌ మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా! లారెన్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఎన్నో మంచి పనులు చేశాడు. సోషల్‌ మీడియా వేదికగా ఆదుకోమని అర్థించిన ఎందరికో ఆపన్న హస్తం అందించాడు. తాజాగా ఈయన ఓ వ్యక్తిని కలుసుకోవాలని ఉబలాటపడుతున్నాడు. విక్రమార్కుడు సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన రవిరాజ్‌ రాథోడ్‌ను కొన్నేళ్ల కిందట లారెన్స్‌ దత్తత తీసుకున్నాడు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌ను చదివించాలనుకున్న లారెన్స్‌తన ట్రస్ట్‌ ద్వారా మంచి హాస్టల్‌ వసతి ఉన్న పెద్ద స్కూల్లో వేశాడు. ఇందుకోసం నెలకు లక్ష రూపాయల ఫీజు కట్టేవాడు. కానీ ఆ వయసులో ఇవన్నీ తన బాగుకోసమే అని అర్థం చేసుకోలేని రవి రాజ్‌ (Ravi Raj Rathod).. చెప్పాపెట్టకుండా స్కూల్‌ మానేసి వెళ్లిపోయాడు. తిరిగి లారెన్స్‌ దగ్గరకు ఒక్కసారి కూడా వెళ్లలేదు. పెద్దయ్యాక సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు అందరూ తనను తిప్పించుకున్నారే తప్ప ఎవరూ దారి చూపలేదని ఓ ఇంటర్వ్యూలో బాధఫడ్డాడు.గుండె తరుక్కుపోతోందిలారెన్స్‌ను కలుద్దామంటే తిడతాడో, కొడతాడో అన్న భయంతో ఆ సాహసం చేయడం లేదన్నాడు. పరిస్థితుల వల్ల మద్యానికి బానిసైనట్లు తెలిపాడు. ఈ ఇంటర్వ్యూ లారెన్స్‌ కంటపడింది. ఎప్పుడో తప్పిపోయిన రాథోడ్‌ను వీడియోలో చూసి నటుడు భావోద్వేగానికి లోనయ్యాడు. నా గుండె తరుక్కుపోతోంది. మాస్‌ సినిమా షూటింగ్‌ సమయంలో ఇతడిని కలిశాను. తనను స్కూల్‌లో చేర్పించాను. ఒక సంవత్సరం తర్వాత అతడు బడి మానేసినట్లు తెలిసింది. అప్పటినుంచి కనిపించకుండా పోయాడు. తనను వెతికి పట్టుకునేందుకు ప్రయత్నించాను, కానీ ఫలితం లేకుండా పోయింది.ఒక్కసారి చూడాలనుందిఎన్నో ఏళ్ల తర్వాత అతడినిలా చూస్తున్నందుకు కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. చదువు మధ్యలో మానేసి వెళ్లిపోయినందుకు నేను తిడతాను లేదా కొడతాను అని భయపడుతున్నాడు. నీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. నేను నిన్ను తిట్టను, కొట్టనురా. నిన్ను చూడాలనుంది. ఒక్కసారి వచ్చి నన్ను కలువురా. నీకోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను అంటూ ఎక్స్‌ (ట్విటర్‌)లో చెన్నైలోని లారెన్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ అడ్రస్‌ను పొందుపరిచాడు. ఇది చూసిన అభిమానులు.. ఇంత మంచోడివి ఏంటన్నా.. అని కామెంట్లు చేస్తున్నారు. రాఘవ లారెన్స్‌.. ప్రస్తుతం కాంచన 4, బెంజ్‌, అధిగరం, కాల భైరవ, బుల్లెట్‌, హంటర్‌ చిత్రాలు చేస్తున్నాడు. వీటిలో కాంచన 4 చిత్రాన్ని ఆయనే డైరెక్ట్‌ చేస్తున్నాడు.చదవండి: దిల్‌రాజుకు పెళ్లయిందని తెలిసి వెనకడుగు వేశా.. తేజస్విని

Indian Woman Missing In Us Days After Arriving For Arranged Marriage5
పెళ్లి కోసం అమెరికా వెళ్లి.. భారతీయ యువతి మిస్సింగ్‌

పెళ్లి కోసం అమెరికా వెళ్లిన భారతీయ మహిళ అదృశ్యమైంది. అమెరికా పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భారత్‌కు చెందిన 24 ఏళ్ల సిమ్రాన్ అనే యువతి జూన్ 20న అమెరికాకు చేరుకోగా, పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసం అమెరికాకు వచ్చినట్లు అధికారులకు చెప్పింది. అమెరికా వచ్చిన కొన్ని రోజులకే సిమ్రాన్ అదృశ్యమైనట్లు న్యూజెర్సీ అధికారులు వెల్లడించారు.జూన్‌ 25న ఆమె చివరిసారి కనిపించిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు.. ఆమె ఫోన్ చూస్తూ ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు కనిపించింది. ఆమెలో ఎలాంటి ఆందోళన కనిపించలేదని తెలిపారు. మరోవైపు, ఆమె అమెరికాకు వచ్చింది.. పెళ్లి కోసమా, లేక వేరే ఉద్దేశ్యమా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె చివరిసారిగా గ్రే స్వెట్‌ప్యాంట్స్, వైట్ టీ షర్ట్, బ్లాక్ ఫ్లిప్‌ఫ్లాప్స్ ధరించి, చిన్న డైమండ్ ఇయరింగ్స్ పెట్టుకుని కనిపించింది. ఆ యువతి వాడుతున్న ఫోన్ కేవలం వైఫై ద్వారా మాత్రమే పని చేయడంతో పోలీసులు ఆమెను ట్రేస్ చేయలేకపోతున్నారు.సిమ్రాన్‌ ఇంగ్లీష్ మాట్లాడలేదని, అమెరికాలో ఆమెకు బంధువులు కూడా ఎవరూ లేరని పోలీసులు తెలిపారు. భారత్‌లోని ఆమె బంధువులను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదన్నారు. సిమ్రాన్ రూపు రేఖలు, మిస్సింగ్‌కు ముందు ఆమె ధరించిన దుస్తులు, ఇతర వివరాలను వెల్లడించారు. ఆమె ఆచూకీ గురించి ఎవరికైనా తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

వెలగలవారిపాలెం(ఆర్‌) పాఠశాలలో ఒకే ఒక్క విద్యార్థిని6
AP: పాఠశాల ఉంది.. పాఠం వినేవారు లేరు..!

పెనుమంట్ర: పెనుమంట్ర మండలంలో విద్యా శాఖ నిర్లక్ష్యంతో పాఠశాలలు మూసివేసే పరిస్థితి నెలకొంది. సరిగా పాఠశాలల విభజన జరగకపోవడంతో కొన్ని స్కూళ్లలో కేవలం ఒకరిద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మండలంలో 47 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో వెలగలవారిపాలెం (ఆర్‌) పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు, ఎంపీపీ నాగళ్లదిబ్బ, కొయ్యేటిపాడు స్పెషల్‌ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి ఇప్పటి వరకు చేరారు. వెలగలవారిపాలెం పాఠశాలలో సింగిల్‌ టీచర్‌ ఉన్నప్పటికీ నాగళ్ల దిబ్బ, కొయ్యేటిపాడు పాఠశాలలకు ఉపాధ్యాయులు లేకపోవడంతో ఈ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ ద్వారా ఒక్కో విద్యార్థి చేరారు. ఈ పాఠశాలలకు వేరే పాఠశాల నుంచి ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై పంపుతున్నట్లు ఎంఈవో యు.నాగేశ్వరరావు శనివారం తెలిపారు.వెలగలవారిపాలెం పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు ఉన్నట్లు హాజరు చూపుతున్నప్పటికీ శనివారం ఆ పాఠశాలలో ఒక్క విద్యార్థిని మాత్రమే ఉన్నారు. దళితవాడలో పాఠశాలకు నాడు–నేడులో అధునాతన భవనాలు నిర్మించారు. గత ఏడాది ఈపాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, 30 మంది వరకు విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది ఇద్దరు ఉపాధ్యాయులతో 12 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇదే పరిస్థితి మండలంలో అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఉంది. ఇందుకు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని పలువురు తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం గవర్నమెంట్‌ పాఠశాలల్లో ఇలాంటి పరిస్థితులు అనేక చోట్ల కనిపిస్తూ ఉండటంతో దీనిపై ప్రభుత్వం ఎంత వరకూ శ్రద్ధ చూపిస్తుందనేది కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది.వెలగలవారిపాలెంలో దళితవాడలో నాడు-నేడులో నిర్మించిన భవనం

ZIM VS SA 1st Test: Keshav Maharaj Becomes The First South African Spinner To Take 200 Test Wickets7
సౌతాఫ్రికా క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం.. చరిత్ర సృష్టించిన కేశవ్‌ మహారాజ్‌

సౌతాఫ్రికా క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఆ దేశం తరఫున తొలిసారి ఓ స్పిన్నర్‌ టెస్ట్‌ల్లో 200 వికెట్లు తీశాడు. సౌతాఫ్రికా తరఫున 200 టెస్ట్‌ వికెట్ల మార్కును ఇప్పటివరకు ఏ స్పిన్నర్‌ తాకలేదు. ఆ దేశం తరఫున 200కు పైగా టెస్ట్‌ వికెట్లు తీసిన బౌలర్లంతా ఫాస్ట్‌ బౌలర్లే. సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో 200 వికెట్లు తీసిన తొలి స్పిన్‌ బౌలర్‌గా కేశవ్‌ మహారాజ్‌ రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో కేశవ్‌ ఈ ఘనత సాధించాడు. జింబాబ్వే కెప్టెన్‌ క్రెయిగ్‌ ఎర్విన్‌ వికెట్‌ కేశవ్‌కు 200వ టెస్ట్‌ వికెట్‌. కేశవ్‌ తర్వాత టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్లుగా టేఫీల్డ్‌ (170), పాల్‌ ఆడమ్స్‌ (134), పాల్‌ హ్యారిస్‌ (103), నికీ బోయే (100) ఉన్నారు. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డేల్‌ స్టెయిన్‌ (439) ఉన్నాడు. అతని తర్వాత షాన్‌ పోలాక్‌ (421), ఎన్తిని (390), రబాడ (336), డొనాల్డ్‌ (330), మోర్కెల్‌ (309), కల్లిస్‌ (291), ఫిలాండర్‌ (224) 200 కంటే ఎక్కువ వికెట్లు తీసిన వారిలో ఉన్నారు. వీరంతా ఫాస్ట్‌ బౌలర్లే.మ్యాచ్‌ విషయానికొస్తే.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బులవాయో వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో రెండో రోజు ఆట కొనసాగుతుంది. రెండో సెషన్‌ సమయానికి జింబాబ్వే 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. బ్రియాన్‌ బెన్నెట్‌ (19) రిటైర్డ్‌ హర్ట్‌ కాగా.. కైటానో 0, వెల్చ్‌ 4, క్రెయిగ్‌ ఎర్విన్‌ 36 పరుగులకు ఔటయ్యారు. సీన్‌ విలియమ్స్‌ (81), వెస్లీ మెదెవెరె (15) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో కోడి యూసఫ్‌ 2, కేశవ్‌ మహారాజ్‌ ఓ వికెట్‌ తీశారు.అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. లుహాన్‌ డ్రి ప్రిటోరియస్‌ (153), కార్బిన్‌ బాష్‌ (100 నాటౌట్‌) సెంచరీలతో కదంతొక్కారు. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (51) మెరుపు అర్ద సెంచరీతో రాణించారు.మిగతా ఆటగాళ్లలో టోని డి జోర్జి 0, బ్రీట్జ్కీ 13, ముల్దర్‌ 17, బెడింగ్హమ్‌ 0, వెర్రిన్‌ 10, కెప్టెన్‌ కేశవ్‌ మహారాజ్‌ 21, కోడి యూసఫ్‌ 27, మఫాకా 9 (నాటౌట్‌) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ 4, ముజరబానీ 2, మసరద్జ, మసెకెస తలో వికెట్‌ తీశారు.

Amit Shah Inaugurates Turmeric Board Office In Nizamabad8
దేశ ప్రజల ఆరోగ్యంలో పసుపు రైతులది కీలక పాత్ర: అమిత్‌ షా

సాక్షి, నిజామాబాద్‌: పసుపు రైతుల దశాబ్దాల కల అయిన పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఎంపీ అర్వింద్‌, ఎమ్మెల్యే ధనపాల్‌ సూర్యనారాయణ తదితరులు హాజరయ్యారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం అనంతరం పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో పసుపు ఉత్పత్తులను అమిత్‌ షా పరిశీలించారు.కిసాన్‌ సమ్మేళన్‌(రైతు సమ్మేళనం) బహిరంగ సభలో అమిత్‌ షా మాట్లాడుతూ.. దేశ ప్రజలను ఆరోగ్యంగా ఉంచడంలో పసుపు రైతులు కీలక పాత్ర వహిస్తున్నారన్నారు. పసుపు రైతులకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీ నెరవేరిందన్నారు. ఈ సందర్భంగా దేశంలోని పసుపు రైతులకు ఆయన అభినందనలు తెలిపారు. పసుపు బోర్డు వల్ల ప్రపంచంలోనే పలు దేశాలకు నిజామాబాద్‌ పసుపు వెళ్తుందన్న అమిత్‌ షా.. కొనుగోలు, రవాణా, ఎగుమతి అ‍న్నీ పసుపు బోర్డు చూసుకుంటుందన్నారు. పసుపును ప్రపంచం అద్భుత ఔషధంగా చూస్తుందని అమిత్‌ షా అన్నారు.‘‘ఒక బిలియన్‌ డాలర్లు విలువ చేసే పసుపును ఎగుమతి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులకు మంచి ధర రావాలన్నదే మా లక్ష్యం. నిజామాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌, మెట్‌పల్లిలో పసుపును అధికంగా పండిస్తారు. రైతులకు బోర్డు ద్వారా నూతన సాగు విధానంపై శిక్షణ ఇస్తాం. పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది. తెలంగాణకు పసుపు బోర్డు ఇవ్వడమే కాకుండా బోర్డు ఛైర్మన్‌గా తెలంగాణ వ్యక్తినే నియమించాం. పసుపు బోర్డు కోసం బీజేపీ ఎంపీలు ఎంతో పోరాడారు’’ అని అమిత్‌ షా ప్రశంసించారు.‘‘ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాం. పాక్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాదులను హతమార్చాం. ఆపరేషన్‌ సిందూర్‌పై రాహుల్‌ ఆధారాలు అడుగుతున్నారు. పాకిస్థాన్‌ మాట రాహుల్‌ గాంధీ నోట వినపడుతోంది. గత కాంగ్రెస్ సర్కార్ పాక్ విషయంలో మెతుక వైఖరి అవలంబించింది. మోదీ సర్కార్ ఈ పదేళ్లలో మూడుసార్లు పాక్‌కు భారత్ తడాఖా ఏంటో చూపింది.ఆపరేషన్‌ కగార్ చేయాలా? వద్దా..?. లొంగిపోవాలని హెచ్చరించినా లొంగిపోలేదు.. కాబట్టే ఆపరేషన్ కగార్ చేపట్టాం. 2026 నాటికి మావోయిస్ట్‌ ముక్త్‌ భారత్‌. బీఆర్ఎస్ సర్కార్ ఎలాంటి అవినీతికి పాల్పడిందో మీకు తెలుసు. కాళేశ్వరం బీఆర్ఎస్‌కు ఏటీఎం అయితే.. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఢిల్లీకి ఏటీఎంగా తయారైంది. తెలంగాణా జనం బీఆర్ఎస్ జెండా పీకి పారేశారు. ఇక్కడ కాంగ్రెస్‌కు కూడా నూకలు చెల్లే రోజు వస్తోంది’’ అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు.

EPF Interest Credit Update Check If 8 25pc Interest Is Credited9
వడ్డీ సొమ్ము వచ్చిందా.. ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ చూసుకున్నారా?

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సభ్యుల ఈపీఎఫ్ ఖాతాల్లో 8.25 శాతం వార్షిక వడ్డీ సొమ్మును జమ చేయడం ప్రారంభించింది. మీరు ఈపీఎఫ్ మెంబర్ అయితే మీ పాస్‌బుక్ ద్వారా ఆన్‌లైన్‌లోనే అప్డేట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. వడ్డీ సొమ్ము ఇంకా కనిపించకపోయినా కంగారు పడకండి. దీనికి మరికొన్ని రోజులు పట్టొచ్చు. ఈపీఎఫ్ఓ ఇంకా ఎటువంటి అధికారిక ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్ పంపలేదు. కానీ చాలా మందికి ఇప్పటికే తమ పాస్ బుక్‌లో వడ్డీ సొమ్ము జమ అయినట్లు కనిపిస్తోంది.వడ్డీ రేట్లకు ఆర్థిక శాఖ ఆమోదంగత ఫిబ్రవరిలో జరిగిన ఈపీఎఫ్ఓ సీబీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్) సమావేశంలో ఈపీఎఫ్‌పై ప్రతిపాదించిన 8.25 శాతం వార్షిక వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఆమోదించింది. ఈ ఆమోదం తర్వాత ఈపీఎఫ్ఓ వడ్డీ జమ చేసే ప్రక్రియను ప్రారంభించింది. దేశంలో సుమారు 8 కోట్ల ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నాయి.వడ్డీని ఎలా లెక్కిస్తారు?ప్రతి నెలా ఉద్యోగి, యజమాని ఇద్దరూ ఈపీఎఫ్ ఖాతాకు కంట్రిబ్యూషన్ చేస్తారు. ఉద్యోగి మూల వేతనంలో 12 శాతం కంట్రిబ్యూషన్ చేస్తారు. యజమాని వాటా కూడా 12 శాతం ఉంటుంది. అయితే ఇది పెన్షన్ పథకానికి 8.33%, ఈపీఎఫ్ ఖాతాకు 3.67% చొప్పున జమ చేస్తారు. ఈపీఎఫ్ఓ నెలవారీ వడ్డీని లెక్కిస్తుంది. కానీ ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత మాత్రమే జమ చేస్తుంది. చక్రవడ్డీని ఉపయోగించి వడ్డీని లెక్కిస్తారు. ఇది ఉద్యోగి, యజమాని కంట్రిబ్యూషన్స్ రెండింటికీ వర్తిస్తుంది (పెన్షన్ భాగం మినహా). సాధారణంగా జూన్ నుంచి ఆగస్టు మధ్య వడ్డీ జమవుతుంటుంది.వడ్డీ జమయిందో లేదో చూసుకోండిలా..స్టెప్ 1: ఈపీఎఫ్‌ఓ అధికారిక వెబ్‌సైట్‌ ( epfindia.gov.in )సందర్శించండిస్టెప్ 2: అవర్‌ సర్వీసెస్‌ > ఫర్‌ ఎంప్లాయీస్‌ > మెంబర్ పాస్‌బుక్‌కు వెళ్లండిలేదా నేరుగా ( passbook.epfindia.gov.in ) లింక్‌ను క్లిక్‌ చేయండి.స్టెప్ 3: యూఏఎన్, పాస్వర్డ్, క్యాప్చా ఉపయోగించి లాగిన్ అవ్వండి.స్టెప్ 4: ఇక్కడ మీ అన్ని మెంబర్ ఐడీలు (మునుపటి, ప్రస్తుత కంపెనీలతో లింక్ అయినవి)కనిపిస్తాయి.స్టెప్ 5: పాస్‌బుక్ చూడటానికి ప్రస్తుత మెంబర్ ఐడీపై క్లిక్ చేయండిపాస్‌బుక్‌లో ఉద్యోగి కంట్రిబ్యూషన్, కంపెనీ కంట్రిబ్యూషన్, జమ అయిన వడ్డీ కనిపిస్తాయి. దీన్ని పీడీఎఫ్ గా కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.వడ్డీ సొమ్ము ఇంకా కనిపించకపోతే..కొన్నిసార్లు వడ్డీ జమ అయిన తర్వాత కూడా పాస్ బుక్‌లో ప్రతిబింబించడానికి సమయం పడుతుంది. కొన్ని రోజులు వేచి చూసి మళ్లీ తనిఖీ చేయండి. అప్పటికీ కనిపించకపోతే ఆన్‌లైన్లో లేదా సమీపంలోని ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు.

Russia Hits Ukraine With Biggest Attack Of The War10
రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ చరిత్రలోనే.. అతి పెద్ద దాడి ఇదే

శనివారం రాత్రి రష్యా 477 డ్రోన్లు, 60 క్షిపణులతో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసింది. యుద్ధం మొదలైన నాటి నుంచి జరిగిన అతిపెద్ద దాడి ఇదేనంటూ ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. వీటిల్లో 249ని కూల్చేశామని.. మరో 226 ఎలక్ట్రానిక్‌ జామింగ్‌ వ్యవస్థల ప్రభావంతో కూలిపోయాయని.. గత రాత్రి అతిపెద్ద దాడే జరిగిందంటూ ఉక్రెయిన్‌ అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడి చేసినట్లు అధికారులు వివరించారు. ఈ దాడిలో ఉక్రెయిన్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానం కూలిపోయిందని.. ఒక పైలట్‌ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం రష్యా ఆరు గంటలకు పైగా దాడులు చేసింది. దేశ వ్యాప్తంగా కీలకమైన మౌలిక సదుపాయాలు దెబ్బతీన్నాయని అధికారులు పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య 2022 దాడులు కొనసాగుతున్నాయి. 36 నెలలు గడిచినా ఆగని రష్యా, ఉక్రెయిన్‌ పోరు ఆగడం లేదు.రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో వెలుగుచూసిన అతిపెద్ద వైరం ఇదే. వాస్తవానికి తాజా యుద్ధానికి పునాదులు పదేళ్ల క్రితమే పడ్డాయి. 2014లో ఉక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఉన్నపళంగా ఆక్రమించుకుంది. ఆనాటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్‌ పైకి రష్యా దండయాత్ర మొదలెట్టింది. వందల కొద్దీ చిన్నపాటి క్షిపణులు ప్రయోగిస్తూ వేలాది సైనికులను కదనరంగంలోకి దింపింది.తొలి రోజుల్లో రాజధాని కీవ్‌దాకా దూసుకొచ్చి భీకర దాడులు చేసిన రష్యా ఆ తర్వాత ఆక్రమణ వేగాన్ని అనూహ్యంగా తగ్గించింది. ఉక్రెయిన్‌ వైపు నుంచి ప్రతిఘటన కూడా దీనికి ఒక కారణం. ఉక్రెయిన్‌ తొలినాళ్లలో యుద్ధంలో తడబడినా ఆ తర్వాత అగ్రరాజ్యం, యూరప్‌ దేశాల ఆర్థిక, ఆయుధ, నిఘా బలంతో చెలరేగిపోయింది. ధాటిగా దాడులు చేస్తూ పుతిన్‌ పటాలానికి ముచ్చెమటలు పట్టించింది. దీంతో మరింత శక్తివంతమైన ఆయుధాలను రష్యా బయటకుతీయక తప్పలేదు.ఇదీ చదవండి: Russia-Ukraine war: యుద్ధం @ మూడేళ్లు

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement