ప్రధాన వార్తలు

ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు.. కొనసాగుతున్న యుద్ధం?
జెరూసలేం: పశ్చిమాశియాలో యుద్ధం పునప్రారంభమైనట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ తూట్లు పొడిచింది. ఇజ్రాయెల్పై దాడులకు తెగబడింది. దీంతో ఇజ్రాయెల్ కాల్పుల్ని తిప్పికొట్టింది. ఇరాన్పై ప్రతిదాడులకు దిగింది. దీంతో గంటల వ్యవధిలో ఇరు దేశాల మధ్య యుద్ధం పునప్రారంభమైంది.ఈ క్రమంలో ఇరాన్కు ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ప్రతి దాడులకు దిగిందని హెచ్చరించింది. అయితే, తాము ఎలాంటి కాల్పుల విరమణ ఒప్పందం చేయలేదని ఇరాన్ చెప్పింది. అయినప్పటికీ ఇరుదేశాల మధ్య కాల్పుల మోత మోగూతూనే ఉంది.

జీడిమెట్ల కేసులో విస్తుపోయే నిజాలు
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘‘మా అక్కే మా అమ్మను చంపింది’’ అని తేజశ్రీ చెల్లి తెలిపింది. ‘‘ట్యూషన్ నుంచి వస్తుంటే నన్ను మా అక్క గల్లీలోనే ఆపింది. అమ్మ ఒక ఆంటీని తీసుకుని రమ్మంది.. పదా వెళ్దామంటూ నన్ను తీసుకెళ్లింది. 20 నిమిషాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాం. అప్పటికే కిచెన్లో అమ్మ స్పృహ లేకుండా పడి ఉంది. అమ్మను లేపే ప్రయత్నం చేశా....అమ్మను నేను చూసుకుంటా నువ్వు బయటకు వెళ్లు అంటూ అక్క చెప్పింది. చుట్టూ పక్కల ఎవరికీ చెప్పవద్దని చెప్పింది.. కానీ అక్క మాత్రం అమ్మ దగ్గరికి కూడా రాలేదు. అమ్మ చనిపోయింది లేపి వేస్ట్ అని అక్క చెప్పింది. మా అమ్మ ఇంకా చనిపోలేదని తెలుసుకుని.. శివకు ఫోన్ చేసింది. మళ్లీ శివ, యశ్వంత్ వచ్చి సుత్తితో అమ్మ తలపై కొట్టాడు’’ అని తేజశ్రీ చెల్లి తెలిపింది.ప్రేమకు అడ్డు చెప్పిందనే కారణంతో కన్నతల్లిని పదో తరగతి చదువుతున్న కుమార్తె తేజశ్రీ.. ప్రియుడితో కలిసి హతమార్చిన సంగతి తెలిసిందే. బాలికకు కొన్ని నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో ఓ యువకుడు పరిచయం కాగా.. అతడితో ప్రేమ వ్యవహారం నడిచింది. దీంతో ఆ బాలిక ఇంటి నుంచి వెళ్లి పోవడంతో తన కుమార్తె కనిపించడం లేదని తల్లి జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ బాలిక మూడు రోజుల క్రితం తిరిగి ఇంటికి వచ్చింది.ఇదిలా ఉండగా.. తల్లి అడ్డు తొలగించునేందుకు ప్రియడితో కలిసి స్కెచ్ వేసింది. నిన్న(సోమవారం) సాయంత్రం నల్లగొండ నుంచి ప్రియుడు శివను రప్పించింది. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేశాడు. బెడ్షీట్తో అంజలి ముఖాన్ని శివ కప్పగా.. సుత్తితో తల్లి అంజలిపై కూతురు దాడి చేసింది. శివ తమ్ముడు యశ్వంత్ కూడా కత్తితో పీక కోశాడు.

రిషబ్ పంత్కు భారీ షాకిచ్చిన ఐసీసీ..
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఊహించని షాకిచ్చింది. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో అంపైర్తో వాగ్వదం దిగినందుకు గానూ పంత్కు ఓ డిమెరిట్ పాయింట్ ఐసీసీ విధించింది.ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8ని ఉల్లంఘించనందుకు ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. గత 24 నెలలలో ఇదే తొలి తప్పిదం అయినందున కేవలం ఒక డీమెరిట్ పాయింట్తో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సరిపెట్టింది.అసలేమి జరిగిందంటే?ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 61 ఓవర్లో బంతిని మార్చమని ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్పై పంత్ ఒత్తిడి తీసుకొచ్చాడు. బంతి కండీషన్ బాగోలేదని కొత్త బంతిని తీసుకురావాలని పంత్ సూచించాడు. కానీ ఫీల్డ్ అంపైర్లు బంతిని పరిశీలించి, మార్చాల్సిన అవసరంలేదంటూ అదే బాల్ను తిరిగి పంత్కు ఇచ్చాడు.ఈ క్రమంలో సహనం కోల్పోయిన పంత్.. బంతిని నేలకేసి బలంగా కొట్టాడు. దీంతో అంపైర్లు మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్కు ఫిర్యాదు చేశారు. పంత్ కూడా తన తప్పును అంగీకరించాడు. ఈ నేపథ్యంలోనే పంత్పై ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఈ చర్యలు తీసుకున్నారు.శతక్కొట్టిన పంత్..కాగా ఈ మ్యాచ్లో పంత్ సెంచరీలు మోత మోగించాడు. రెండో ఇన్నింగ్స్లలోనూ శతకాలు బాది సంచలనం సృష్టించాడు. ఓ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన తొలి భారత వికెట్ కీపర్గా రికార్డులకెక్కాడు. తొలి ఇన్నింగ్స్లో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 118 పరుగులు చేశాడు. కాగా తొలి టెస్టులో విజయంపై భారత్ కన్నేసింది.ఇంగ్లండ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని గిల్ సేన ఉంచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఆఖరి రోజు ఆటలో ఎవరు మెరుగ్గా రాణిస్తే వారిదే విజయం.చదవండి: రింకూ సింగ్- ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి వాయిదా!.. కారణం ఇదే!

‘ఇక బీజేపీలో చేరికా?’.. కుండబద్ధలు కొట్టేసిన శశిథరూర్
న్యూఢిల్లీ: పీయూష్ గోయల్తో సెల్ఫీ దిగడం, ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ను ఆకాశానికి ఎత్తడం, భారత ప్రధాని నరేంద్ర మోదీని పొగడడం, అదే తరుణంలో కాంగ్రెస్తో విభేదాలున్నాయని అంగీకరించడం.. ఇవన్నీ వేటికి సంకేతాలుగా భావించొచ్చు!. ఇదే విషయాన్ని తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ వద్ద ప్రస్తావించగా.. ఆయన చిరునవ్వుతో అదేం లేదంటున్నారు. తాజాగా .. సోమవారం(జూన్ 23న) The Hindu పత్రికలో శశిథరూర్ రాసిన ఓ వ్యాసం పబ్లిష్ అయ్యింది. ఆపరేషన్ సిందూర్.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విదేశాంగ ప్రచారం భారతదేశ ఐక్యతను, సంకల్పాన్ని సూచించిందని ఆ కథనంలో థరూర్ రాశారు. ఈ వ్యాసాన్ని ప్రధానమంత్రి కార్యాలయం కూడా షేర్ చేయగా.. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ స్పందిస్తూ ‘‘శశిథరూర్ వ్యాఖ్యలు కాంగ్రెస్లోని లోపాలను.. ఆ పార్టీలోని విభేదాలను బహిర్గతం చేశాయి’’ అని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ బీజేపీలో చేరికకు సంకేతాలుగా భావించొచ్చా? అని మంగళవారం ఎదురైన ప్రశ్నకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. ఇవేవీ నేను బీజేపీలో చేరతానన్న సంకేతం కాదని స్పష్టత ఇచ్చారాయన. ‘‘విదేశాంగ మిషన్ విజయాన్ని మాత్రమే నేను ఆ వ్యాసంలో ప్రస్తావించా. ఇది అన్ని పార్టీల ఐక్యతను ప్రతిబింబించే విషయం మాత్రమే’’ అని అన్నారాయన. "ప్రధాని మోదీ చొరవతో.. ఇతర దేశాలతో భారత్ సంబంధాలు మెరుగుపడ్డాయి. అయితే ఇది బీజేపీనో, కాంగ్రెస్ తీసుకొచ్చిన విదేశాంగ విధానం కాదు. ఇది భారతదేశ విదేశాంగ విధానం. సుమారు 11 ఏళ్ల కిందట పార్లమెంట్లో విదేశాంగ వ్యవహారాల కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఇదే విషయం చెప్పాను. అంత మాత్రాన నేను ప్రధాని మోదీ పార్టీలో చేరతానని కాదు. ఇది జాతీయ సమైక్యతకు సంబంధించిన ప్రకటన మాత్రమే’’ అని కుండబద్ధలు కొట్టారాయన. అంతకుముందు.. కాంగ్రెస్ అధిష్టానంతో తనకు కొన్ని విషయాల్లో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని, అయితే అవి నాలుగు గోడల మధ్య చర్చించుకుంటే పరిష్కారం అయ్యే విషయాలేనని, వాటి గురించి సమయం వచ్చినప్పుడు చెబుతానని థరూర్ మీడియా ముఖంగా ప్రకటన చేశారు.‘‘ గత నాలుగేళ్లుగా కాంగ్రెస్ కార్యకర్తలు నా విజయంలో కీలక పాత్ర పోషించారు. నేను ఇప్పటికీ కాంగ్రెస్కు విదేయుడినే. పార్టీకి అవసరమైతే పెద్ద పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇతర పార్టీలో చేరే ఆలోచన ఏమాత్రం లేదు’’ అని ఆ సమయంలో అన్నారయన. అలాగే, తాను ప్రజాస్వామ్యవాదిగా, మతతత్వానికి వ్యతిరేకంగా, సామాజిక న్యాయాన్ని నమ్మే వ్యక్తినంటూ గతంలోనూ ఆయన చాలాసార్లు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబడుతోంది. అయితే ఆ పార్టీ సీనియర్ సభ్యులు థరూర్ మాత్రం అందుకు భిన్నంగా ఆకాశానికి ఎత్తుతున్నారు. అలాగే.. ట్రంప్ మధ్యవర్తిత్వం ప్రకటన విషయంలో కాంగ్రెస్ లైన్కు భిన్నంగా థరూర్ వ్యవహరించడమూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే థరూర్ తాజా వ్యాఖ్యలతో ఆయన బీజేపీలో చేరతారన్న ఊహాగానాలకు తాత్కాలికంగా తెరపడినట్లయ్యింది.

రింకూ సింగ్- ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి వాయిదా!.. కారణం?
భారత స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh)- లోక్సభ ఎంపీ ప్రియా సరోజ్ (Priya Saroj)ల పెళ్లి వాయిదా పడినట్లు సమాచారం. ఈ ఏడాది జరగాల్సిన వీరి వివాహం (Wedding Postoponed) వచ్చే సంవత్సరంలో జరుగనున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR)కు ప్రాతినిథ్యం వహిస్తూ వెలుగులోకి వచ్చాడు ఉత్తరప్రదేశ్కు చెందిన రింకూ సింగ్.గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదిన అతడు.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో 2023లో ఐర్లాండ్తో టీ20 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. నయా ఫినిషర్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. అదే ఏడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు.ఇప్పటి వరకు భారత్ తరఫున 33 టీ20లు, 2 వన్డే మ్యాచ్లు ఆడిన రింకూ సింగ్.. ఆయా ఫార్మాట్లలో 339, 41 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ ఇప్పటికి 58 మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఈ కేకేఆర్ స్టార్.. 1099 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి.ఎంపీతో ప్రేమలో రింకూనిరుపేద కుటుంబం నుంచి వచ్చి స్టార్ క్రికెటర్గా ఎదిగిన రింకూ.. కెరీర్ పరంగా నిలదొక్కుకున్నాడు. ఇటీవలే వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు కూడా సిద్ధపడ్డాడు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారగా.. ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ ఏడాది జూన్ 8న వీరి నిశ్చితార్థం జరిగింది. మూడేళ్లుగా ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నామంటూ రింకూ- ప్రియా తమ ఎంగేజ్మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.జూన్ 8న నిశ్చితార్థంఇక లక్నోలోని ఓ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో రింకూ- ప్రియా ఉంగరాలు మార్చుకున్నారు. సమాజ్వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్తో పాటు జయా బచ్చన్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తదితరులు వీరి ఎంగేజ్మెంట్కు హాజరయ్యారు.ఈ క్రమంలో నవంబరు 18న తాజ్ హోటల్లో పెళ్లి వేడుకను జరిపేందుకు పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు. అయితే, అమర్ ఉజాలా న్యూస్పేపర్ కథనం ప్రకారం.. రింకూ- ప్రియాల వివాహం వాయిదా పడినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరుగనుందని సమాచారం. కారణం ఇదే?టీమిండియా క్రికెటర్గా రింకూ బిజీ షెడ్యూల్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ ఏడాది నవంబరులో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. నవంబరు 14- డిసెంబరు 19 వరకు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.చదవండి: పంత్ సెంచరీలపై అలా.. కేఎల్ రాహుల్ శతకంపై ఇలా! గోయెంకా పోస్ట్ వైరల్

ఐఐటీలకు ధీటుగా ఎల్పీయూ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ
భారతదేశంలో ఇంజినీరింగ్ ప్లేస్మెంట్ల విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎప్పటి నుంచో బెంచ్మార్క్ను సెట్ చేసింది. అందుకు ఏమాత్రం తీసిపోకుండా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్పీయూ)లో ఇటీవలి ఫ్లేస్మెంట్ ఫలితాలు కీలకంగా మారుతున్నాయి. ఎల్పీయూ విద్యార్థులు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల కంటే ప్రత్యర్థి సంస్థలు, కొన్ని సందర్భాల్లో వారి కంటే అధిక ఆఫర్లతో ఉద్యోగం సాధిస్తున్నారు.ఎల్పీయూలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీ నుంచి ఏడాదికి రూ.2.5 కోట్ల డొమెస్టిక్ ప్యాకేజీని పొందారు. ఈ ఏడాది భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇంజినీరింగ్ విద్యార్థికి అందించే అత్యధిక ప్యాకేజీల్లో ఇది ఒకటి.ఎల్పీయూ ప్లేస్మెంట్ జోరు అక్కడితో ఆగిపోలేదు. ఈసీఈ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డికి ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థ నుంచి రూ.1.03 కోట్ల అంతర్జాతీయ ఆఫర్ లభించింది. ఈ విజయాలు అధిక నైపుణ్యం కలిగిన ఇంజినీరింగ్ ప్రతిభను కోరుకునే టాప్ రిక్రూటర్లకు గమ్యస్థానంగా నిలుస్తున్నాయి. ఇవి ఎల్పీయూకు పెరుగుతున్న ఖ్యాతిని నొక్కిచెబుతున్నాయి.‘ఈ విజయాలు అత్యున్నత స్థాయిలో పరిశ్రమ పోటీని తట్టుకొని సిద్ధంగా ఉండే గ్రాడ్యుయేట్లను అందించడంలో ఎల్పీయూ కట్టబడి ఉంది’ అని ఎల్పీయూ కెరీర్ సర్వీసెస్ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.ఆకట్టుకునే ప్లేస్మెంట్ డ్రైవ్తో ఆకర్షణీయ వేతనాలుఆకట్టుకునే పేస్కేల్తో భారీ ఎల్పీయూ ప్లేస్మెంట్ డ్రైవ్ ఆకర్షిస్తోంది. ఎల్పీయూ గ్రాడ్యుయేట్లకు పరిశ్రమలో ఉన్న డిమాండ్ను ప్రతిబింబిస్తూ వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో విద్యార్థులకు మొత్తం 7,204 జాబ్ ఆఫర్లు అందాయి. 1,602 మంది విద్యార్థులకు బహుళ ఉద్యోగ ఆఫర్లు లభించడం వారి ఉద్యోగ సామర్థ్యాన్ని మరింత పెంచింది. టాప్ 25% విద్యార్థుల సగటు వేతన ప్యాకేజీ ఏడాదికి రూ.10.23 లక్షలుగా ఉంది. పాలో ఆల్టో నెట్వర్క్స్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సర్వీస్ నౌ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు క్యాంపస్ను సందర్శించిన టాప్ రిక్రూటర్లలో ఉన్నాయి. బీటెక్ ఈసీఈ విద్యార్థి ఆదిరెడ్డి వాసు ఏడు ఉద్యోగావకాశాలు సాధించి సంస్థాగత రికార్డు నెలకొల్పాడు.గ్లోబల్గా అధిక ప్యాకేజీ ఆకర్షిస్తున్న నైపుణ్యాలుసైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ వంటి అత్యాధునిక రంగాల్లో అసాధారణ సాంకేతిక, విశ్లేషణాత్మక నైపుణ్యం అవసరమయ్యే డొమైన్లలో విద్యార్థులు అత్యంత డిమాండ్ ఉన్న ఉద్యోగాలు పొందుతున్నారని ఎల్పీయూ తాజా ప్లేస్మెంట్ డేటా పేర్కొంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు అద్భుతమైన ఆఫర్లు ఇచ్చాయి. మైక్రోసాఫ్ట్ అత్యధిక ప్యాకేజీ ఏటా రూ.52.20 లక్షలు, అమెజాన్ రూ.46.94 లక్షలు అందించాయి. ఇది విశ్వవిద్యాలయంలోని ప్రతిభను ప్రతిబింబిస్తుంది.పరిశ్రమ దిగ్గజాల నుంచి భారీగా నియామకాలుఎల్పీయూ పరిశ్రమ భాగస్వామ్యాలు గ్లోబల్గా విస్తరించాయి. అన్ని విభాగాల్లో విద్యార్థుల ఉపాధి పట్ల లోతైన నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయి. క్యాప్ జెమినీ, మైండ్ ట్రీ, కాగ్నిజెంట్, యాక్సెంచర్, టీసీఎస్ వంటి టాప్ టైర్ రిక్రూటర్లు ఎల్పీయూ విద్యార్థులకు వందలాది ఉద్యోగాలను ఆఫర్ చేయగా, క్యాప్ జెమినీ 700 మందికి పైగా, మైండ్ ట్రీ 420+, కాగ్నిజెంట్ 400+, యాక్సెంచర్, టీసీఎస్ రెండూ 250+ విద్యార్థులను చేర్చుకున్నాయి. ఈ ఆకట్టుకునే ప్లేస్మెంట్ పనితీరు వ్యక్తిగత విజయగాథల కంటే కూడా పరిశ్రమ నిమగ్నతకు, విద్యార్థుల సంసిద్ధతకు ఎల్పీయూ క్రమబద్ధమైన విధానాన్ని హైలైట్ చేస్తుంది.టెక్ టాలెంట్కు ప్రపంచ ఖ్యాతిఎల్పీయూ క్రమంగా ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకుంది. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఇప్పుడు యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఏడాదికి రూ.1 కోటికి మించిన ప్యాకేజీలతో పని చేస్తున్నారు. రోబోటిక్స్, ఆటోమేషన్, ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ స్ట్రీమ్స్ దేశీయ, అంతర్జాతీయ ప్లేస్మెంట్ రోస్టర్లలో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి.ఐఐటీలు మాత్రమే కాదు.. ఎల్పీయూ ఎందుకంటే?ఎల్పీయూ అనుసరిస్తున్న స్కిల్-ఫస్ట్ విధానంలో ప్లేస్మెంట్ రహస్యం దాగి ఉంది. దీనికి యూనివర్సిటీ అమలు చేస్తోన్న ఎడ్యుకేషన్ రివల్యూషన్ ఫ్రేమ్ వర్క్ ఉదాహరణ. విద్యార్థులు రెండో సంవత్సరం నుంచి రియల్-వరల్డ్ ఎక్స్పోజర్, ఇండస్ట్రీ సర్టిఫికేషన్లు, డెడికేటెడ్ ప్లేస్మెంట్ ట్రెయినింగ్ పొందుతారు.‘ఎల్పీయూలో మేము విద్యార్థులను ఉద్యోగాల కోసం సిద్ధం చేయడమే కాదు.. నాయకత్వం వహించడానికి, సృజనాత్మకతకు అద్దపట్టేలా, పరిశ్రమలో ముందువరుసలో ఉండేలా సిద్ధం చేస్తాం’ అని ఎల్పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ తెలిపారు. యూనివర్సిటీ పనితీరు దేశ ఇంజినీరింగ్ విద్య, ప్లేస్మెంట్ ల్యాండ్ స్కేప్లో బలమైన పోటీదారుగా ఉంచుతుంది.త్వరలో ముగియనున్న ప్రవేశాలుఎల్పీయూలో 2025 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు త్వరలో ముగియనున్నాయి. దరఖాస్తుదారులు గ్లోబల్ కెరీర్ను ప్రారంభించడానికి, భారతదేశం అత్యంత డైనమిక్, పరిశ్రమ ఆధారిత విశ్వవిద్యాలయంలో భాగం కావడానికి సిద్ధంగా ఉంటే ఇదే మంచి సమయం. సీట్లు పరిమితంగా ఉండడంతో డెడ్ లైన్లు దగ్గరపడుతున్నాయి. దరఖాస్తుదారులు వెంటనే https://bit.ly/43340ai సందర్శించండి.

మీపేరుపై ఇంకేమైనా సిమ్కార్డులున్నాయా?
ప్రస్తుతకాలంలో చాలామంది ఒకటికంటే ఎక్కువ ఫోన్లు వాడుతున్నారు. వాటిలో రెండు కంటే ఎక్కువ సిమ్కార్డులు వినియోగిస్తున్నారు. అయితే గతంలో మీపేరుతో ఎప్పుడో ఒకపుడు తాత్కాలికంగా సిమ్కార్డులు తీసుకునే ఉంటారు. కేంద్రం నిబంధనల ప్రకారం ఒకరి పేరుమీద గరిష్ఠంగా 9 సిమ్కార్డులే ఉండాలి. కాబట్టి అనవసరమైన సిమ్కార్డులను నిలిపేయాలంటే మార్గం ఉంది. దాంతోపాటు అసలు మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు రిజిస్ట్రర్ అయ్యాయో తెలుసుకువాలంటే కింది సమాచారం తెలుసుకోవాల్సిందే.ప్రభుత్వ వెబ్సైట్ సంచార్సాతి వెబ్సైట్ ద్వారా మీరు గతంలో తీసుకున్న నంబర్లు, ప్రస్తుతం వాడుతున్న సిమ్కార్డుల వివరాలు తెలుసుకోవచ్చు. దీనిద్వారా గతంలో తీసుకుని వినియోగంలోలేని సిమ్కార్డులను నేరుగా ఆన్లైన్లో ద్వారా నిలిపేసే సౌకర్యం ఉంది. అది ఎలాగో చూద్దాం.ఇదీ చదవండి: యుద్ధంపై అనుమానాలు.. బంగారం ధరల్లో క్షీణతముందుగా ఆన్లైన్లో బ్రౌజర్ ద్వారా https://sancharsaathi.gov.in/ వెబ్సైట్లోకి వెళ్లాలి.కింద సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ కేటగిరీలో ‘Know Your Mobile Connections’పై క్లిక్ చేయాలి. ఈ సర్వీస్ను టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్జూమర్ ప్రొటెక్షన్(టీఏఎఫ్సీఓపీ) అందిస్తోంది.‘Know Your Mobile Connections’పై క్లిక్ చేసిన వెంటనే కొత్త విండో ఓపెనె అవుతుంది. అందులో ప్రస్తుతం వాడుతున్న మొబైల్నంబర్ను ఎంటర్ చేయాలి. కింద క్యాప్చా కోడ్ను ఇవ్వాలి. ‘వాలిడేట్ క్యాప్చా’ బటన్ ప్రెస్ చేయాలి.పైన ఇచ్చిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దాన్ని కింద తెలిపిన బ్లాక్లో ఎంటర్చేసి లాగిన్ అవ్వాలి. మీ పేరుతో ఏ నంబర్లు రిజిస్ట్రర్ అయ్యాయో వాటి వివరాలతో లిస్ట్ వస్తుంది.ఒకవేళ ఏదేని నంబర్ను నిలిపేయాలంటే పక్కనే ఆప్షన్లు ఉంటాయి. వాటిపై క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. చివరగా లాగ్అవుట్ చేయడం మరిచిపోకూడదు.

టీడీపీ ఎమ్మెల్యే భారీ స్కాం.. బాగోతం బట్టబయలు
సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అవినీతి బాగోతం బట్టబయలైంది. భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థలో ఎమ్మెల్యే సురేంద్ర బాబు భాగస్వామిగా ఉన్నారు.. ఆ సంస్థ అక్రమ మార్గాల్లో రూ.920 కోట్ల రుణాలు పొందింది. స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టి భారీగా రుణాలు పొందిన ఎస్ఆర్సీ సంస్థ. నకిలీ పత్రాల ద్వారా యూనియన్ బ్యాంక్ నుంచి 900 కోట్లు, టాటా క్యాపిటల్స్ నుంచి 20 కోట్ల రుణాలు పొందింది. బ్యాంకులను మోసగించిన వైనంపై ఆర్బీఐ, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విచారణ చేపట్టాయి.కళ్యాణదుర్గం టీడీపీ నేత ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబు ద్వారా వ్యవహారాన్ని నడిపిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు.. విషయం బయటపడటంతో తామే మోసపోయామంటూ ఎమ్మెల్యేకు చెందిన కాంట్రాక్టు సంస్థ పీఎస్లో ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే సురేంద్ర బాబు అనుచరుడు ఎర్రన్న అలియాస్ మీసేవ బాబు సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర బాబు స్టాంప్ డ్యూటీ స్కాంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.తెల్గీ కుంభకోణం తరహాలో భారీ కుంభకోణానికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో వెలుగు చూసిన స్టాంప్ డ్యూటీ స్కాంపై ఈడీ, సీబీఐ, ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖలకు ఫిర్యాదు చేస్తానని ఆయన పేర్కొన్నారు. సురేంద్ర బాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ వందల కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టిందని.. విషయం బయటపడేసరికి ఓ కార్యకర్త పై కేసు నమోదు చేయించి చేతులు దులుపుకునే కుట్రలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు.

Operation Sindhu: ఏపీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందులో భాగంగా.. ఇరాన్ నుంచి స్వస్థలానికి భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీ చేరుకున్న విమానంలో ఐదుగురు ఏపీ విద్యార్థులు కూడా ఉన్నారు. వీళ్లంతా కెర్మన్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నారు. అయితే.. ఏపీ ప్రభుత్వం తమను ఏమాత్రం పట్టించుకోలేదని చెబుతున్నారు వాళ్లు. ‘‘నాలుగు రోజుల నుంచి ఇరాన్ నుంచి భారతీయుల తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది. మమ్మల్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా ఢిల్లీకి తీసుకువచ్చింది. ఢిల్లీ నుంచి స్వయంగా మేమే మా ఖర్చులతో నంద్యాలకు వెళ్తున్నాం. మిగతా వాళ్లకు వాళ్ల వాళ్ల రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. కానీ, ఏపీ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సాయం అందలేదు. మాకు ఫ్లైట్ టికెట్స్ ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం చేసినట్టుగా, ఏపీ ప్రభుత్వం కూడా చేస్తే బాగుండేది.. .. మేము ఉన్న ప్రాంతంలో యుద్ధం ప్రభావం లేదు. అయినా ముందు జాగ్రత్త చర్యగా కాలేజీ యాజమాన్యం సెలవులు ఇచ్చింది. ప్రస్తుతం ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం. యుద్ధం రావడం వల్ల సెమిస్టర్ పరీక్షలు ఆగిపోయాయి. కాలేజీ యాజమాన్యం పిలిస్తే మళ్లీ వెంటనే ఇరాన్ వెళతాం అని నంద్యాలకు చెందిన నరేందర్, నారాయణలు తెలిపారు. ఆపరేషన్ సిందు గురించి.. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ ఇది. మొదటి దశలో.. జూన్ 19న 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరింది. వీరిలో 90 మంది జమ్మూ కశ్మీర్కు చెందినవారు. రెండో దశలో జూన్ 21న మరో 310 మంది భారతీయులు ఇరాన్ నుంచి తరలించబడ్డారు. ఈ విమానం ఢిల్లీలో సాయంత్రం 4:30కి ల్యాండ్ అయింది. మొత్తం ఇప్పటివరకు: 827 మందిని భారత్కు సురక్షితంగా తీసుకువచ్చినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.ఆపరేషన్ సిందు కోసం.. ఇరాన్ ప్రభుత్వం భారత పౌర విమానాల రాకపోకల కోసం తమ గగనతలాన్ని ప్రత్యేకంగా తెరిచింది. ఈ ఆపరేషన్లో రోడ్డుమార్గం ద్వారా అర్మేనియాకు తరలించి, అక్కడి నుంచి విమానాల ద్వారా భారత్కు తీసుకురావడం వంటి వ్యూహాత్మక చర్యలు కూడా తీసుకున్నారు.యుద్ధం ఇలా.. జూన్ 13వ తేదీన ఇరాన్ నుంచి ప్రపంచానికి అణు ముప్పు ఉందని చెబుతూ ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట దాడులకు దిగింది ఇజ్రాయెల్. ప్రతిగా ఇరాన్ సైతం మిస్సైల్స్తో ఇజ్రాయెల్పై దాడులు జరిపింది. చివరకు.. ట్రంప్ మధ్యవర్తిత్వంలో ఇరుదేశాలు మంగళవారం (జూన్24న) కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో పశ్చిమాసియా యుద్ధం ముగిసింది.

అంత విషాదంలో డీజే పార్టీ?ఎయిరిండియాపై తీవ్ర ఆగ్రహం, వీడియో వైరల్
భారతదేశం తన చరిత్రలోనే అత్యంత దారుణమైన విమానయాన ప్రమాదాల్లో ఒకటి అహ్మదాబాద్లో జరిగిన AI171 విమాన ప్రమాదం. అయితే ఘోర విపత్తులో దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయిన కొద్ది రోజులకే ఎయిర్ ఇండియా SATS (AISATS) ఉన్నతాధికారులు గురుగ్రామ్ కార్యాలయంలో డీజే పార్టీలో నృత్యం చేస్తూ ఎంజాయ్ చేయడం విమర్శలకు తావిచ్చింది.AISATS అనేది విమానాశ్రయ గ్రౌండ్ సేవలను అందించే సంస్థ. టాటా గ్రూప్కు చెందిన ఎయిర్ ఇండియా విమానాశ్రయ సేవలు , ఫుడ్ అందించే SATS అనే రెండు కంపెనీల (50-50) సమ భాగస్వామ్యంలో ఉన్న జాయింట్ వెంచర్ ఇది.ఎయిర్ ఇండియా SATS (AISATS) సీనియర్ అధికారులు గురుగ్రామ్ లో ఒక DJ పార్టీలో డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూన్ 20న జరిగిన ఈ పార్టీకి AISATS చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అబ్రహం జకారియా, ఎయిర్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, GM, సంప్రీత్ కోటియన్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ GM హాజరయ్యారు. విమాన ప్రమాదంలో 270 మందికి పైగా మరణించిన కొద్ది రోజులకే ఇలాంటి పార్టీ చేసుకోవడం దుమారాన్ని రాజేసింది. వందలాది మంది బాధితులు హృదయవిదారకమైన శోకం ఉంటే, ఆప్తులను కోల్పోయి కంటిమింటికి ధారగా రోదిస్తోంటే... కనీస మానవత్వం లేకుండా ఇలా కుప్పిగంతులు వేస్తున్నారంటూ దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలింది. ఈ విషాదంలో కేవలం బాధితులు మాత్రమే కాదు, యావద్దేశం దుఃఖిస్తోంది.కానీ కనీస ఇంగితలం లేకుండా అధికారులు ఇలాంటి వేడుకలు జరుపుకోవడం సరికాదని మండిపడ్డారు. దీనిపై సంబంధింత అధికారులు క్షమాపణలు చెప్పినప్పటికీ, ఇది క్షమించరానిది అంటూ ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతూనే ఉండటం గమనార్హం. It has only been a few days since the tragic Ahmedabad plane crash. Many families have not yet been able to see their loved ones for the last time; several bodies have still not been handed over. Grief hangs heavy in households, funeral pyres are yet to cool. And at such a… pic.twitter.com/rrlekBNAeD— Squint Neon (@TheSquind) June 22, 2025 "మానవత్వం చచ్చిపోయింది.. నమ్మబుద్ధి కావడం లేదు’’ అని ఒకరు, "సంతోషంగా ఉండండి,కానీ ముందుగా మృతులకు గౌరవ సంతాపం తెలియజేయడం మర్చిపోతే ఎలా? ఇంత మంది చనిపోయిన నెలరోజులలోపే, మీరు ఇలా డాన్స్ చేసి ఎయిరిండియా ఇమేజ్ను నాశనం చేస్తున్నారు. సిగ్గుచేటు ఇప్పటికే సంస్థ సేవల విషయంలో దిగజారిపోయింది, ఇప్పుడు భద్రతలో కూడా’’ మరొకరు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Puri Rath Yatra 2025 ప్రత్యేక రైళ్లు
Jagannath Rath Yatra శ్రీ జగన్నాథునికి ఖొల్లి లగ్గి సేవ
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు.. కొనసాగుతున్న యుద్ధం?
అలా చేయగలవా?.. అప్పుడు నన్ను బ్రూక్ అంటారు! పాపం వెంటనే..
Uttarakhand: బహుభార్యత్వ వివాదం.. మాజీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు
ఐశ్వర్యతోనే పిల్లల్ని కనాలని..
మంచు ఫ్యామిలీకి 7 వేల ఎకరాలు.. క్లారిటీ ఇచ్చిన బ్రహ్మాజీ
జస్ట్ ఆరు రోజుల్లో ఇంగ్లీష్, అలవోకగా 46 భాషలు..ఏకంగా 400..
రిషబ్ పంత్కు భారీ షాకిచ్చిన ఐసీసీ..
Heart Attack: ఆందోళనకరంగా గుండెపోటు మరణాలు
న్యూజిలాండ్లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్బాబు
నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు
అలాగే లాడెన్ జిందాబాద్ అని కూడా అనమంటున్నార్సార్!
దిగ్గజ క్రికెటర్ కన్నుమూత.. నివాళులర్పించిన ఇంగ్లండ్-భారత్ ఆటగాళ్లు
తెలుగు సీరియల్ నటి సీమంతం వేడుక
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
వైఎస్సార్సీపీ నాయకుడి ఇల్లు కూల్చివేత
బల ప్రయోగంతోనే శాంతి నిరూపించిన డోనాల్డ్ ట్రంప్ - ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
ఇజ్రాయెల్,అమెరికా విరుచుకు పడుతున్న వేళ.. ఇరాన్కు ప్రధాని మోదీ ఫోన్ కాల్!
రిషికేశ ఈజ్ బ్యాక్
లంచం తీసుకుంటుంటే ఉద్యోగంలోంచి తీసేశారు. లంచం ఇచ్చి మళ్లీ చేరాను!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. భూలాభాలు
జియో నుంచి 2 కొత్త ప్లాన్లు.. ప్రత్యేక బెనిఫిట్లు..
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. నూతన ఉద్యోగాలు
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
విశాఖపట్నం : వల నిండింది.. పంట పండింది (ఫొటోలు)
మహేశ్బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష
బ్యాంకు ఉద్యోగితో భార్య వివాహేతర సంబంధం.. చివరికి..!
కోరలు చాచిన కుల వివక్ష
పనివేళల్లో ‘ఉపాధి’ విందు
Puri Rath Yatra 2025 ప్రత్యేక రైళ్లు
Jagannath Rath Yatra శ్రీ జగన్నాథునికి ఖొల్లి లగ్గి సేవ
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు.. కొనసాగుతున్న యుద్ధం?
అలా చేయగలవా?.. అప్పుడు నన్ను బ్రూక్ అంటారు! పాపం వెంటనే..
Uttarakhand: బహుభార్యత్వ వివాదం.. మాజీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు
ఐశ్వర్యతోనే పిల్లల్ని కనాలని..
మంచు ఫ్యామిలీకి 7 వేల ఎకరాలు.. క్లారిటీ ఇచ్చిన బ్రహ్మాజీ
జస్ట్ ఆరు రోజుల్లో ఇంగ్లీష్, అలవోకగా 46 భాషలు..ఏకంగా 400..
రిషబ్ పంత్కు భారీ షాకిచ్చిన ఐసీసీ..
Heart Attack: ఆందోళనకరంగా గుండెపోటు మరణాలు
న్యూజిలాండ్లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్బాబు
నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు
అలాగే లాడెన్ జిందాబాద్ అని కూడా అనమంటున్నార్సార్!
దిగ్గజ క్రికెటర్ కన్నుమూత.. నివాళులర్పించిన ఇంగ్లండ్-భారత్ ఆటగాళ్లు
తెలుగు సీరియల్ నటి సీమంతం వేడుక
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
వైఎస్సార్సీపీ నాయకుడి ఇల్లు కూల్చివేత
బల ప్రయోగంతోనే శాంతి నిరూపించిన డోనాల్డ్ ట్రంప్ - ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
ఇజ్రాయెల్,అమెరికా విరుచుకు పడుతున్న వేళ.. ఇరాన్కు ప్రధాని మోదీ ఫోన్ కాల్!
రిషికేశ ఈజ్ బ్యాక్
లంచం తీసుకుంటుంటే ఉద్యోగంలోంచి తీసేశారు. లంచం ఇచ్చి మళ్లీ చేరాను!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. భూలాభాలు
జియో నుంచి 2 కొత్త ప్లాన్లు.. ప్రత్యేక బెనిఫిట్లు..
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. నూతన ఉద్యోగాలు
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
మహేశ్బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష
బ్యాంకు ఉద్యోగితో భార్య వివాహేతర సంబంధం.. చివరికి..!
కోరలు చాచిన కుల వివక్ష
Khamenei: ఈ రక్తపాతం చాలు.. ఇక తప్పుకో..!
పనివేళల్లో ‘ఉపాధి’ విందు
సినిమా

ఓటీటీలోకి వచ్చేసిన 'పంచాయత్' కొత్త సీజన్
ఇప్పుడంటే వెబ్ సిరీసుల హవా కాస్త తగ్గింది కానీ లాక్ డౌన్ టైంలో మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. అలాంటి ఓ సిరీస్ 'పంచాయత్'. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్టైనింగ్గా ఈ సిరీస్కి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. గత మూడు సీజన్లు చూసేసిన చాలామంది కొత్త సీజన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు నాలుగో సీజన్ స్ట్రీమింగ్ అయిపోతోంది.(ఇదీ చదవండి: హీరోయిన్ సమంతకు కష్టకాలం!)జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘువీర్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్కు దీపిక్ కుమార్ మిశ్రా, అక్షత్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. 2020లో తొలి సీజన్ రిలీజ్ కాగా.. 2022, 2024లో రెండు, మూడు సీజన్లు వచ్చాయి. ఇప్పుడు నాలుగో సీజన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇది కేవలం హిందీలోనే అందుబాటులో ఉంది.పంచాయత్ సిరీస్ గురించి చెప్పుకుంటే చాలా సింపుల్ స్టోరీ. సిటీలో పుట్టి పెరిగిన ఓ కుర్రాడు.. ఓ మారుమూల పల్లెలోకి పంచాయతీ సెక్రటరీగా అడుగుపెడతాడు. జాబ్ అయితే చేస్తుంటాడు గానీ అస్సలు ఇష్టముండదు. విదేశాలకు వెళ్లిపోవాలనేదే ఇతడి డ్రీమ్. అలాంటిది ఇతడిని పల్లెలోని ఉంటే కొందరు మనుషులు మార్చేస్తారు. తర్వాత ఏమైందనేదే స్టోరీ. తొలి మూడు సీజన్లు వివిధ అంశాల ఆధారంగా తెరకెక్కించారు. నాలుగు సీజన్లో పంచాయతీలో జరిగే ఎన్నికల స్టోరీతో తీశారు. ఈసారి కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండనుంది. కామెడీ ప్లస్ ఎమోషనల్గా ఉండే ఈ సిరీస్ ని తెలుగులోనూ 'సివరపల్లి' పేరుతో రీమేక్ చేశారు.(ఇదీ చదవండి: మరో హీరోయిన్తో తమన్నా మాజీ ప్రియుడు డేటింగ్?)

హీరోయిన్ సమంతకు కష్టకాలం!
హీరోయిన్గా సమంత స్టార్ హోదా చూసింది. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు చేతిలో పెద్గగా చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. కొన్నిరోజుల క్రితం 'శుభం' మూవీతో నిర్మాతగా మారింది. కంటెంట్ ఓకే అనిపించుకుంది కానీ పెట్టిన డబ్బులు అయితే వచ్చేశాయి. అలా నిర్మాతగా తొలి అడుగు పర్లేదనిపించుకుంది. కానీ నటిగానే ఈమెకు కష్టకాలం నడుస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది మరి!నాగచైతన్యకు 2021లో విడాకులు ఇచ్చిన సామ్.. తర్వాత కొన్నాళ్లకు తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు బయటపెట్టింది. ఓ వైపు చికిత్స తీసుకుంటూనే విజయ్ దేవరకొండతో 'ఖుషి' సినిమా చేసింది. ఇది పర్లేదనిపించుకోగా.. తర్వాత 'సిటాడెల్' ఇండియన్ వెబ్ సిరీస్లో నటించింది. ఇది కూడా సమంతకు పెద్దగా ప్లస్ కాలేకపోయింది. ప్రస్తుతానికైతే 'రక్త్ బ్రహ్మాండ్' అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఇప్పుడు ఇది కూడా మొత్తానికే ఆగిపోయినట్లు టాక్ వినిపిస్తుంది.(ఇదీ చదవండి: మరో హీరోయిన్తో తమన్నా మాజీ ప్రియుడు డేటింగ్?)కొన్నాళ్ల క్రితం ఈ సిరీస్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పనిచేస్తున్న ఓ వ్యక్తి.. బడ్జెట్ విషయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు బయటకొచ్చాయి. కోట్ల రూపాయల స్కామ్ చేశాడని, 25 రోజులే షూటింగ్ జరిగినప్పటికీ.. సగానికి బడ్జెట్ ఖర్చయిపోయిందని టాక్ వచ్చింది. ఇదంతా కూడా ఓ ఆడిట్ ద్వారా బయటపడింది. అకౌంటింగ్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించడంతో షూటింగ్ను ఆపేశారని టాక్ నడిచింది. ఇప్పుడు మిగిలిన బడ్జెట్ పెట్టి సిరీస్ పూర్తి చేసేందుకు నెట్ఫ్లిక్స్ పెద్దగా ఆసక్తి చూపించట్లేదట. దీంతో సిరీస్ మధ్యలోనే ఆపేశారని తెలుస్తోంది.అయితే చిత్ర నిర్మాతలైన రాజ్-డీకే మాత్రం అలాంటిదేం లేదని సన్నిహితుల దగ్గర అంటున్నారు. ఒకవేళ గనుక ఈ ప్రాజెక్ట్ ఆగిపోతే మాత్రం సమంతకు కష్టకాలమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త ప్రాజెక్టులేం లేవు. అలా అని ప్రస్తుత దర్శకులు ఈమెకు హీరోయిన్ అవకాశాలు ఇస్తారా అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్'.. నేను చేసిన పెద్ద తప్పు: దిల్ రాజు)

మరో హీరోయిన్తో తమన్నా మాజీ ప్రియుడు డేటింగ్?
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, రిలేషన్, పెళ్లి.. ఇలాంటివన్నీ చాలా సాధారణమైన విషయాలు. టాలీవుడ్లో తక్కువ గానీ బాలీవుడ్లో మాత్రం ఫలానా హీరో.. ఫలానా హీరోయిన్తో డేటింగ్లో ఉన్నాడనే రూమర్స్ ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ఇవి నిజమనేటట్లు సదరు హీరోహీరోయిన్ జంటగా కనిపించడం, బయట కూడా కెమిస్ట్రీ పండించడం లాంటివి చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. కొన్నిరోజుల క్రితం వరకు తమన్నా-విజయ్ వర్మ గురించి ఇలానే మాట్లాడుకున్నారు.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్'.. నేను చేసిన పెద్ద తప్పు: దిల్ రాజు)దాదాపు రెండు మూడేళ్ల పాటు తమన్నా.. నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేసిందనే ప్రచారం అయితే గట్టిగానే నడించింది. అందుకు తగ్గట్లు జంట పక్షుల్లా ఎక్కడపడితే అక్కడ వీళ్లిద్దరూ కనిపించేవారు. ప్రేమ, పెళ్లి గురించి ఇన్ డైరెక్ట్గా మాట్లాడేవారు కూడా. మరి ఏమైందో ఏమోగానీ ఈ జంట బ్రేకప్ చెప్పేసుకుంది. కలిసి కనిపించడమే మానేశారు. ప్రస్తుతం తమన్నా.. సినిమాలు, ఐటమ్ సాంగ్స్ చేస్తూ బిజీగా ఉంది. విజయ్ ఏం ప్రాజెక్టులు చేస్తున్నాడో తెలీదు.అలాంటిది ఇప్పుడు విజయ్ వర్మ.. మరోసారి వార్తల్లో నిలిచాడు. 'దంగల్' బ్యూటీ, హీరోయిన్ ఫాతిమా సనా షేక్తో కనిపించాడు. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారనే పుకార్లు మొదలయ్యాయి. వీటిలో ఎంత నిజముందో తెలీదు. రూమర్స్ అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. మరోవైపు విజయ్-ఫాతిమా ప్రస్తుతం జంటగా 'గుస్తాఖ్ ఇష్క్' అనే మూవీ చేస్తున్నారు. మరి ఈ సినిమా చేస్తున్నప్పుడు ఏమైనా ప్రేమలో పడ్డారా? లేదంటే ఇవి కేవలం రూమర్సేనా అనేది క్లారిటీ రావాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

'గేమ్ ఛేంజర్'.. నేను చేసిన పెద్ద తప్పు: దిల్ రాజు
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన 'గేమ్ ఛేంజర్'.. దారుణమైన ఫ్లాప్గా నిలిచింది. తొలిరోజు తొలి ఆటకే ఈ విషయం అందరికీ అర్థమైపోయింది. అయితే హీరో-నిర్మాత దీని గురించి పెద్దగా స్పందించలేదు కానీ దర్శకుడు, ఎడిటర్ మాత్రం కొన్నిరోజుల తర్వాత మాట్లాడారు. తమది తప్పు కాదన్నట్లు చెప్పుకొచ్చారు. ఏదేమైనా జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. సరే ఇదంతా పక్కనబెడితే 'తమ్ముడు' సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్మాత దిల్ రాజు మీడియా ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయనకు 'గేమ్ ఛేంజర్' ఫెయిల్యూర్ గురించి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన ముక్కుసూటిగా సమాధానం చెప్పేశారు.దిల్ రాజు అంటే ఇండస్ట్రీలో జడ్జిమెంట్, ఫిల్మ్ మేకింగ్లో అనుభవం అనే బ్రాండ్ ఉంది. మీరు తీసే సినిమాలో మీకు తెలియకుండా ఏమీ జరగదంటారు. కానీ గేమ్ ఛేంజర్ విషయంలో అలా ఎందుకు జరిగింది అని యాంకర్ ప్రశ్నించగా.. దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'పెద్ద సినిమాలు, పెద్ద దర్శకులతో చేసినప్పుడు 100 శాతం ఆ సమస్య ఉంటుంది. దిల్ రాజుకే కాదు. అందరికీ ఆ ప్రాబ్లమ్ తప్పదు. సినిమాని నాలుగున్నర గంటలు తీశారని ఎడిటర్ చెప్పింది నిజమే. పెద్ద డైరెక్టర్తో చేస్తున్నప్పుడు ఎక్కువగా జోక్యం చేసుకోలేం'(ఇదీ చదవండి: థగ్ లైఫ్ డిజాస్టర్.. క్షమాపణలు మాత్రమే చెప్పగలను: మణిరత్నం)'అయితే రోజూ కిచిడీ ఉంటుంది. రోజూ కావాలా.. మొత్తం అయిపోయాక ఒక్కసారి చూసుకోవాలా అనేది నిర్ణయించుకోవాలి. తప్పు జరిగినప్పుడు ప్రొడ్యూసర్ ఆపాలి. దానిని ఆపలేకపోయానంటే అది నా వైఫల్యమే. అలాంటి ప్రాజెక్ట్ని నేను చేసి ఉండకూడదు. నా కెరీర్లో 60 వరకు సినిమాలు తీశాను. కానీ ఎప్పుడూ పెద్ద దర్శకులతో సినిమాలు చేయలేదు. అందువల్ల నా మొదటి తప్పుడు నిర్ణంయం అదే. పెద్ద దర్శకుడితో తీస్తున్నప్పుడు ముందే కాంట్రాక్ట్లో క్లియర్గా పాయింట్లు పెట్టి సినిమాకు వెళ్లాలి. అలా చేయలేకపోయాను. అది నా తప్పు''ఆ తప్పుని అంగీకరించి దానిని అక్కడితో వదిలేశాను. అది మన స్కూల్ కాదు. అలా కానప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించడం వేస్ట్' అని దిల్ రాజు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలానే చివరి నిమిషం వరకు మీరు సినిమా చూడలేదట కదా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. అది మాత్రం తప్పు, తాను ముందే సినిమా చూశానని చెప్పారు. ఏదేమైనా దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ తప్పుని హుందాగా ఒప్పుకోవడం కూడా ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

పంత్ సెంచరీలపై అలా.. కేఎల్ రాహుల్ శతకంపై ఇలా! గోయెంకా పోస్ట్ వైరల్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant)పై ప్రముఖ వ్యాపారవేత్త, లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా (Sanjiv Goenka) ప్రశంసలు కురిపించారు. దూకుడైన ఆటకు మారుపేరంటూ పంత్ బ్యాటింగ్ తీరును కొనియాడారు. అదే సమయంలో.. భారత ఓపెనింగ్ బ్యాటర్, లక్నో మాజీ ఆటగాడు కేఎల్ రాహుల్ను కూడా సంజీవ్ గోయెంకా ప్రశంసించడం విశేషం.రెండు ఇన్నింగ్స్లోనూ శతకాలుకాగా భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య తొలి టెస్టులో రిషభ్ పంత్ శతకాలతో అదరగొట్టిన విషయం తెలిసిందే. లీడ్స్ వేదికగా తొలి ఇన్నింగ్స్లో 178 బంతులు ఎదుర్కొన్న ఈ ఐదో నంబర్ బ్యాటర్.. 12 ఫోర్లు, ఆరు సిక్సర్ సాయంతో.. 75కు పైగా స్ట్రైక్రేటుతో 134 పరుగులు సాధించాడు.ఇక రెండో ఇన్నింగ్స్లోనూ పంత్ దంచికొట్టాడు. 140 బంతుల్లోనే 118 పరుగులు రాబట్టాడు. అతడి ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. స్ట్రైక్రేటు 84.29. తన అద్భుత శతక ఇన్నింగ్స్ల ద్వారా టీమిండియా పటిష్ట స్థితిలో నిలవడంలో పంత్ కీలక పాత్ర పోషించాడు.అమోఘం.. రాహుల్కు కంగ్రాట్స్ ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని తమ కెప్టెన్ రిషభ్ పంత్ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘అమోఘం! రెండు వరుస సెంచరీలు.. దూకుడుకు మారుపేరుగా, బెదురులేని.. అద్భుత ఇన్నింగ్స్.టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన రెండో వికెట్ కీపర్గా చరిత్ర.. సూపర్’’ అంటూ క్లాప్ ఎమోజీలు జత చేశారు. అదే సమయంలో మరో శతక వీరుడు కేఎల్ రాహుల్ పేరును కూడా గోయెంకా ప్రస్తావించడం వైరల్గా మారింది. ‘‘సెంచరీ చేసిన కేఎల్ రాహుల్కు కూడా శుభాకాంక్షలు’’ అని గోయెంకా ట్వీట్ చేశారు.కాగా 2022లో ఐపీఎల్లో అడుగుపెట్టిన లక్నో జట్టుకు మూడేళ్ల పాటు కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరించాడు. 2022, 2023లో వరుసగా రెండుసార్లు జట్టును ప్లే ఆఫ్స్నకు చేర్చాడు. కానీ 2024లో మాత్రం రాహుల్ ఇదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు.రాహుల్పై ఫైర్.. ఫ్రాంఛైజీని వీడిన స్టార్ఈ నేపథ్యంలో సంజీవ్ గోయెంకా మైదానంలో బహిరంగంగా రాహుల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఇక ఈ పరిణామం తర్వాత అంటే.. 2025 మెగా వేలానికి ముందు రాహుల్ లక్నో ఫ్రాంఛైజీని వీడాడు.అనంతరం ఆక్షన్లో భాగంగా లక్నో రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు రిషభ్ పంత్ను కొనుగోలు చేసి కెప్టెన్గా నియమించింది. అయితే, బ్యాటర్, కెప్టెన్గా ఈ సీజన్లో పంత్ పూర్తిగా విఫలమయ్యాడు. పద్నాలుగు మ్యాచ్లలో కలిపి పంత్ కేవలం 269 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉండటం చెప్పుకోదగ్గ అంశం.గెలుపునకు పది వికెట్ల దూరంలోఇక పంత్ సేన తాజా ఎడిషన్లో పద్నాలుగింట ఆరు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికే పరిమితమైంది. మరోవైపు.. 2025లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించిన కేఎల్ రాహుల్ పదమూడు మ్యాచ్లు ఆడి.. ఓ శతకం సాయంతో 539 పరుగులు సాధించడం విశేషం.ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు రసవత్తరంగా మారింది. ఆఖరిదైన ఐదో రోజు ఆటలో విజేత ఎవరన్నది తేలనుంది. భారత బౌలర్లు రాణించి పది వికెట్లు కూలిస్తే.. గిల్ సేనకు శుభారంభం లభిస్తుంది. మరోవైపు.. భారత్ విధించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే ఇంగ్లండ్ మంగళవారం 350 పరుగులు చేయాలి. చదవండి: ‘లక్ష్మణ్ను కాదని అతడిని తీసుకున్నాం.. నాతో మూడు నెలలు మాట్లాడలేదు’𝘈 𝘚𝘰𝘯𝘨 𝘰𝘧 𝘐𝘤𝘦 & 𝘍𝘪𝘳𝘦 𝘢𝘵 𝘏𝘦𝘢𝘥𝘪𝘯𝘨𝘭𝘦𝘺.🔥❄️@klrahul set the foundation with a composed and elegant century while @RishabhPant17’s quickfire hundred electrified the crowd with an explosive display of fearless strokeplay! 🤩WATCH FULL HIGHLIGHTS OF DAY 4… pic.twitter.com/MQ13EvHIae— Star Sports (@StarSportsIndia) June 23, 2025

టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఒకవేళ అదే జరిగితే?
లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలిటెస్టు తుది అంకానికి చేరుకుంది. గత నాలుగు రోజుల నుంచి హోరా హోరీగా సాగుతున్న ఈ మ్యాచ్ ఫలితం మంగళవారం తేలిపోనుంది. తొలి ఇన్నింగ్స్లో అదరగొట్టిన భారత బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్లో కూడా సత్తాచాటారు.దీంతో ఇంగ్లండ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని గిల్ సేన ఉంచింది. లక్ష్య చేధనలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లీష్ జట్టు వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. దూకుడుగా ఆడి లక్ష్యాన్ని పూర్తి చేయాలని స్టోక్స్ సేన భావిస్తుంటే.. భారత జట్టు మాత్రం ప్రత్యర్ధిని ఆలౌట్ చేయాలని పట్టుదలతో ఉంది.వర్షం ముప్పు..అయితే భారత్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లే అవకాశముంది. ఐదో రోజు ఆటకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆక్యూవెధర్, బీబీసీ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో లీడ్స్లో వర్షం పడటానికి 40 శాతం ఆస్కారం ఉంది. స్ధానిక కాలమానం ప్రకారం ఉదయం 11:00 గంటలకు ఆఖరి రోజు ఆట ఆరంభం కానుంది. ఒకవేళ రిపోర్ట్స్ ప్రకారం.. మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగిస్తే తొలి టెస్టు డ్రాగా ముగిసే ఛాన్స్ ఉంది.ఆక్యూ వెదర్ రిపోర్ట్..మధ్యాహ్నం 2:30 (స్దానిక కాలమానం ఉదయం 10 గంటలకు 55% వర్షం పడే అవకాశం)మధ్యాహ్నం 3:30 (స్దానిక కాలమానం ఉదయం 11 గంటలకు 40% వర్షం పడే అవకాశం)మధ్యాహ్నం 4:30 (స్దానిక కాలమానం ఉదయం 12 గంటలకు 43% వర్షం పడే అవకాశం)సాయంత్రం 6:30 (స్ధానిక కాలమనం మధ్యాహ్యం 2 గంటలకు 47 % వర్షం పడే అవకాశం)సాయంత్రం 7:30 (స్ధానిక కాలమనం మధ్యాహ్యం 3 గంటలకు 52 % వర్షం పడే అవకాశంరాత్రి 8:30-10:30( స్ధానిక కాలమనం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు 50 % వర్షం పడే అవకాశం)చదవండి: చరిత్ర సృష్టించిన కిరాన్ పొలార్డ్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా

చరిత్ర సృష్టించిన కిరాన్ పొలార్డ్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 700 మ్యాచ్లు ఆడిన ఏకైక ప్లేయర్గా వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. పొలార్డ్ ప్రస్తుతం అమెరికా మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025లో ఎంఐ న్యూయర్క్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.మంగళవారం డల్లాస్ వేదికగా శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్, ఎంఐ న్యూయర్క్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ ఆడేందుకు మైదానంలోకి అడుగుపెట్టిన పొలార్డ్.. ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 38 ఏళ్ల పొలార్డ్ 2006లో ట్రినిడాడ్ & టొబాగో తరపున టీ20 క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత వెస్టిండీస్తో పాటు ఐపీఎల్, సీపీఎల్, బీబీఎల్, బీపీఎల్, అబుదాబి టీ20, టీ10 వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్లో భాగమయ్యాడు. ఐపీఎల్లో 2010 నుంచి 2022కు ముంబై ఇండియన్స్కు ఈ కరేబియన్ దిగ్గజం ప్రాతనిథ్యం వహించాడు.2023 సీజన్కు ముందు రిటైర్మెంట్ ప్రకటించిన పొలార్డ్.. ముంబై ఇండియన్స్ కోచింగ్ స్టాప్లో చేరాడు. ఇప్పటివరకు 700 టీ20లు ఆడిన పొలార్డ్.. 13,634 పరుగులతో పాటు 326 వికెట్లు పడగొట్టాడు. కాగా అత్యధిక టీ20లు ఆడిన జాబితాలో పొలార్డ్ తర్వాత స్ధానంలో డ్వైన్ బ్రావో(582), షోయబ్ మాలిక్(557) ఉన్నారు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఎంఐ న్యూయర్క్పై 47 పరుగుల తేడాతో శాన్ ఫ్రాన్సిస్కో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 246 పరుగుల భారీ స్కోర్ చేసింది.శాన్ ఫ్రాన్సికో కెప్టెన్ మాథ్యూ షార్ట్ (43 బంతుల్లో 91 పరుగులు), జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్ (26 బంతుల్లో 64 పరుగులు) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో న్యూయర్క్ 199 పరుగులకే పరిమితమైంది.చదవండి: IND vs ENG: 'అతడిని ఎందుకు తీసుకున్నారు.. నితీశ్ రెడ్డి వంద రెట్లు బెటర్'

'అతడిని ఎందుకు తీసుకున్నారు.. నితీశ్ రెడ్డి వంద రెట్లు బెటర్'
ఠాకూర్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. బ్యాటింగ్ ఆల్రౌండర్ నితీశ్కుమార్ రెడ్డి స్ధానంలో తుది జట్టులోకి వచ్చిన శార్ధూల్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసిన ఠాకూర్.. రెండో ఇన్నింగ్స్లోనూ అదే తీరును కనబరిచాడు. జోష్ టంగ్ బౌలింగ్లో చెత్త షాట్ ఆడి తన వికెట్ను సమర్పించుకున్నాడు. ఈ ముంబై క్రికెటర్ 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. బౌలింగ్లోనూ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 6 ఓవర్లు వేసి 38 పరుగులు సమర్పించుకున్నాడు.దీంతో భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ మరో స్పెల్ బౌలింగ్ చేసే అవకాశమివ్వలేదు. అయితే ఈ మ్యాచ్లో శార్థూల్ ఠాకూర్పై టీమిండియా మెనెజ్మెంట్ భారీ అంచనాలు పెట్టుకుంది. లోయార్డర్లో శార్ధూల్ తన అనుభవంతో పరుగులు సాధిస్తాడని భావించింది. అందుకే ఆసీస్ గడ్డపై దుమ్ములేపిన తెలుగు తేజం తీష్ కుమార్ రెడ్డిని పక్కనపెట్టి మరీ శార్దూల్ను ఆడించారు.కానీ హెడ్ కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ గిల్ నమ్మకాన్ని శార్ధూల్ వమ్ము చేశాడు. ఈ క్రమంలో టీమ్మెనెజ్మెంట్పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నాడు. శార్థూల్ను ఎందుకు అవకాశమిచ్చారు.. అతడి కంటే నితీశ్ రెడ్డి వంద రెట్లు బెటర్ అని పోస్ట్లు పెడుతున్నారు. మరోవైపు శార్దూల్కు తొలి ఇన్నింగ్స్లో కేవలం 6 ఓవర్ల మాత్రమే బౌలింగ్ ఇవ్వడాన్ని పలువురు మాజీలు తప్పబడుతున్నారు. అతడిపై మీకు నమ్మకం లేనప్పుడు జట్టులోకి ఎందుకు తీసుకున్నారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక లీడ్స్ టెస్టు ముగింపునకు చేరుకుంది. ఇంగ్లండ్ ముందు టీమిండియా 371 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. తమ రెండో ఇన్నింగ్స్ను మొదలు పెట్టిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఇంగ్లీష్ జట్టు విజయానికి ఇంకా 350 పరుగులు కావాలి. చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
బిజినెస్

మార్కెట్లో యుద్ధ భయాలున్నా లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:56 సమయానికి నిఫ్టీ(Nifty) 192 పాయింట్లు పెరిగి 25,171కు చేరింది. సెన్సెక్స్(Sensex) 620 ప్లాయింట్లు పుంజుకుని 82,526 వద్ద ట్రేడవుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేశారు. అయితే దీన్ని ఇరాన్ ఖండించింది.ఇదీ చదవండి: ఐఫోన్ కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడితో పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. క్రూడాయిల్ ధరలూ అయిదు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో నిన్నటి మార్కెట్ సెషన్లో ఐటీ, టెక్, ఆటో షేర్లలో భారీ అమ్మకాలు నెలకొన్నాయి. అయితే ట్రేడింగ్ చివర్లో దిగువ స్థాయిలో కీలక రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలు కొంత తగ్గాయి. ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న తరుణంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు మళ్లీ భగ్గుమని, కాస్త చల్లారాయి. ఈ నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్, ఏవియేషన్ రంగాల షేర్లు ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికిలోనయ్యాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

కోల్గేట్ ఇండియా నుంచి కొత్త బ్రాండ్లు
న్యూఢిల్లీ: కోల్గేట్ (పామోలివ్) ఇండియా భారత మార్కెట్లో తన పోర్ట్ఫోలియో, వ్యాపార విస్తరణపై బలమైన అంచనాలతో ఉంది. సంస్థ అంతర్జాతీయ పోర్ట్ఫోలియో నుంచి మరిన్ని బ్రాండ్లను భారత్లో విడుదల చేయాలనుకుంటున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో ప్రభా నరసింహన్ ప్రకటించారు. కోల్గేట్, పామోలివ్ బ్రాండ్లపై ఈ సంస్థ నోటి సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను విక్రయిస్తుండడం తెలిసిందే. మరిన్ని బ్రాండ్లను తీసుకురావడంపై మాతృ సంస్థతో చర్చిస్తున్నట్టు నరసింహన్ తెలిపారు. ప్రస్తుత బ్రాండ్లతోపాటు కొత్త బ్రాండ్ల పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు చెప్పారు. పామోలివ్ బ్రాండ్పై ప్రీమియం బాడీ వాష్, హ్యాండ్ వాష్ విక్రయిస్తుండగా, ఏటా ఈ విభాగం 20–30 శాతం కాంపౌండెడ్ వృద్ధి నమోదు చేయగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు సంస్థ భవిష్యత్ ప్రణాళికల గురించి ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. పామోలివ్ బ్రాండ్పై మరిన్ని విభాగాల్లో ఉత్పత్తులను ఆవిష్కరించడం గురించి ప్రశ్నించగా.. అంతర్జాతీయంగా తమ పోర్ట్ఫోలియోలో ఎన్నో ఉత్పత్తులు ఉన్నాయని వివరిస్తూ.. మరిన్ని బ్రాండ్లను ప్రవేశపెట్టడంపైనే తాము దృష్టి సారించినట్టు ఆమె చెప్పారు. ఇక్కడి వినియోగదారుల అవసరాలకు సరిపోలే ఉత్పత్తులను తీసుకువస్తామని ప్రకటించారు. న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే కోల్గేట్ పామోలివ్ 88 ఏళ్లుగా భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండడం గమనార్హం. అంతర్జాతీయ ఆదాయంలో 4–5 శాతం భారత్ నుంచే వస్తోంది. భారత మార్కెట్ ఎంతో కీలకం 140 కోట్ల జనాభా కలిగిన భారత్ మార్కెట్.. కోల్గేట్ పోమోలివ్ అంతర్జాతీయ వృద్ధికి కీలకమని ప్రభా నరసింహన్ తెలిపారు. రానున్న రోజుల్లో భారత్ వాటా మరింత పెరుగుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. కోల్గేట్కు అంతర్జాతీయంగా టాప్–5 మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉన్నట్టు చెప్పారు. వచ్చే కొన్నేళ్లలో భారత్లో మధ్యతరగతి ప్రజలు గణనీయంగా పెరగనుండడం తమకు అద్భుతమైన అవకాశాలను తెచి్చపెడుతుందన్న సంస్థ అంతర్జాతీయ సీఈవో ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారు. వేగంగా వృద్ధి చెందుతున్న క్విక్ కామర్స్ చానళ్లపై మరిన్ని డిజిటల్ ఫస్ట్ బ్రాండ్లను ఆవిష్కరించనున్నట్టు ప్రభా నరసింహన్ తెలిపారు. కోల్గేట్ పర్పుల్, మ్యాక్స్ ఫ్రెష్ సెన్సోరీస్ శ్రేణి, మౌత్ వాష్లను కోల్గేట్ ఇటీవల విడుదల చేయడం గమనార్హం. మరిన్ని ఉత్పత్తులు విడుదల ప్రణాళికతో ఉన్నట్టు ఆమె చెప్పారు. అయితే సంప్రదాయ కిరాణా స్టోర్లు తమ వ్యాపార వృద్ధికి కీలకమని పేర్కొన్నారు. క్విక్కామర్స్ ఛానళ్లకు అనుకూలంగా ఆన్లైన్లో అధిక డిస్కౌంట్లు ఇస్తుండడంతో కోల్గేట్ పోమోలివ్ ఇండియా ఉత్పత్తులను మహారాష్ట్రలో బహిష్కరించాలంటూ అఖిల భారత ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల పంపిణీదారుల సంఘం ఇటీవలి ఇచి్చన పిలుపుపై స్పందిస్తూ.. అన్ని ఛానళ్లూ వృద్ధి చెందేందుకు తగినన్ని అవకాశాలున్నట్టు అభిప్రాయపడ్డారు.వినియోగం పుంజుకుంటుంది.. ఈ ఏడాది చివరికి పట్టణ వినియోగం పుంజుకుంటుందన్న విశ్వాసాన్ని ప్రభా నరసింహన్ వ్యక్తం చేశారు. గ్రామీణ వినియోగ మార్కెట్ బలంగా ఉందంటూ, అదే వృద్ధి ఇకముందూ కొనసాగుతుందన్నారు. ‘‘కోల్గేట్ ఉత్పత్తులకు పట్టణ మార్కెట్ ఎంతో కీలకంగా ఉంది. సానుకూల స్థూల ఆర్థిక పరిస్థితులకు తోడు, ఇటీవలి ప్రభుత్వం ప్రకటించిన చర్యలు పట్టణ వినియోగానికి మద్దతుగా నిలుస్తాయి. జనాభాతో పోల్చి చూస్తే గ్రామీణ మార్కెట్ పరిమాణం ఎంతో చిన్నగా ఉంది. తగిన నోటి సంరక్షణ ఉత్పత్తులతో మరిన్ని అవకాశాలను సొంతం చేసుకోగలం’’అని వివరించారు. మాస్ మార్కెట్తోపాటు ప్రీమియం విభాగాలపై తమ దృష్టి కొనసాగుతుందని స్పష్టం చేశారు.

యూరప్ కారు.. తగ్గిన జోరు!
న్యూఢిల్లీ: ఆటో రంగ యూరోపియన్ దిగ్గజాలు భారత్లో వాహన అమ్మకాలు పెంచుకోవడంలో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. గత మూడేళ్ల డేటా పరిశీలిస్తే రెనాల్ట్, ఫోక్స్వేగన్, స్కోడా కార్ల అమ్మకాలు క్షీణిస్తూ వస్తున్నాయి. గ్లోబల్ ఆటోమోటివ్ పరిశ్రమ డేటా, అనలిటిక్స్ అందించే జాటో డైనమిక్స్ గణాంకాల ప్రకారం రెనాల్ట్ అమ్మకాలు అత్యధికంగా నీరసించాయి. 2022–23లో 78,296 వాహనాలు విక్రయించగా.. 2023–24లో 45,349కు క్షీణించాయి. గతేడాది(2024–25) మరింత తగ్గి 37,900 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఈ బాటలో స్కోడా విక్రయాలు సైతం దేశీయంగా 52,269 యూనిట్ల నుంచి 2023–24కల్లా 44,522 వాహనాలకు వెనకడుగు వేశాయి. వీటితో పోలిస్తే గతేడాది అమ్మకాలు 44,866 యూనిట్లకు స్వల్పంగా పెరిగాయి. అయితే ఫోక్స్వేగన్ 2022–23లో 41,263 యూనిట్లు విక్రయించగా.. 2023–24కల్లా ఇవి 43,197కు ఎగశాయి. గతేడాది సైతం 42,230 వాహనాలు అమ్ముడయ్యాయి. ఎస్యూవీలు కీలకం గత మూడేళ్లలో యూరోపియన్ ఆటో దిగ్గజాలకు భారత మార్కెట్లో పలు సవాళ్లు ఎదురైనట్లు జాటో డైనమిక్స్ ఇండియా ప్రెసిడెంట్ రవి జి.భాటియా పేర్కొన్నారు. తొలి దశలో వెంటో, ర్యాపిడ్, స్కాలా తదితర సెడాన్లపైనే రేనాల్ట్, వీడబ్ల్యూ, స్కోడా అధిక దృష్టిపెట్టడం అమ్మకాల క్షీణతకు కొంత కారణమైనట్లు తెలియజేశారు. భారత్లో వేగవంత వృద్ధిలో ఉన్న ఎస్యూవీ విభాగంలో పరిమిత మోడళ్లనే ప్రవేశపెట్టడం ప్రతికూల ప్రభావం చూపినట్లు వివరించారు. వీటికితోడు మోడళ్లలో ఆధునిక వేరియంట్లను ప్రవేశపెట్టడంలో ఆలస్యం అమ్మకాల క్షీణతకు కారణమైనట్లు తెలియజేశారు. అంతేకాకుండా టైర్–2, టైర్–3 పట్టణాలలో తగినస్థాయిలో నెట్వర్క్ విస్తరించకపోవడం వీటికి జత కలసినట్లు ప్రస్తావించారు. మరోవైపు భారతదేశ ప్రత్యేక పన్నుల విధానం కూడా కలసిరాలేదని పేర్కొన్నారు. అంటే సబ్4 మీటర్ల వాహనాలు తక్కువ లెవీల కారణంగా లబ్ది పొందినట్లు తెలియజేశారు. వెరసి జపనీస్, కొరియన్ కంపెనీలు తక్కువ వ్యయంలో కంపాక్ట్ కార్లను విడుదల చేయడం ద్వారా అమ్మకాలు పెంచుకున్నట్లు తెలియజేశారు. అయితే యూరోపియన్ దిగ్గజాలు సంప్రదాయ పద్ధతిలో భారీ మోడళ్లను ప్రవేశపెట్టడం ద్వారా అమ్మకాలు పెంచుకోవడంలో సమస్యలు ఎదుర్కొన్నట్లు వివరించారు. పన్ను ప్రభావమిలా ప్రస్తుత ఆటోమోటివ్ పాలసీ ప్రకారం 1200 సీసీ సామర్థ్యంవరకూ 4 మీటర్లలోపుగల ప్యాసింజర్ వాహనాల(పెట్రోల్, సీఎన్జీ, ఎల్పీజీ)పై 28 శాతం వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) విధిస్తారు. 1 శాతం కాంపెన్సేషన్ సెస్ ఉంటుంది. 4 మీటర్లలోపుగల 1500 సీసీ ప్యాసింజర్ వాహనాల(డీజిల్)పై 28 శాతం జీఎస్టీ, 3 శాతం కాంపెన్సేషన్ సస్ అమలవుతుంది. 4మీటర్లకుపైన 1500 సీసీ ప్యాసింజర్ వాహనాలపై 28 శాతం జీఎస్టీ, 17 శాతం సెస్ వర్తిస్తుంది. ఇక 1500 సీసీకి మించిన వాహనాలపై 28 శాతం జీఎస్టీ, 17 శాతం సెస్ అమలవుతుంది. 4 మీటర్లకు, 1500 సీసీకి మించిన (170 ఎంఎంకు మించిన గ్రౌండ్ క్లియరెన్స్గల) ఎస్యూవీలపై 28 శాతం జీఎస్టీ, 22 శాతం సెస్ను విధిస్తారు.దేశీ దిగ్గజాల దూకుడు దేశీ దిగ్గజాలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాసహా జపాన్ దిగ్గజం మారుతీ సుజుకీ స్థానిక విడిభాగాలకు ప్రాధాన్యత ఇవ్వడం, త్వరత్వరగా వేరియంట్లను విడుదల చేయడం, సీఎన్జీ, హైబ్రిడ్స్, బీఈవీ తదితర ప్రత్యామ్నాయ ఇంధన ఇంజిన్ల మోడళ్లను ప్రవేశపెట్టడం వంటి సానుకూలతలతో అమ్మకాలు పెంచుకుంటూ వచి్చనట్లు భాటియా పేర్కొన్నారు. తద్వారా మార్కెట్ వాటాను కొల్లగొడుతున్నట్లు తెలియజేశారు. అయితే స్కోడా ఇటీవల భారత్ మార్కెట్ కోసమే సబ్కాంపాక్ట్ ఎస్యూవీ ‘కైలాక్’ను రూపొందించి విడుదల చేసింది. తద్వారా అమ్మకాలు పెంచుకోవడంపై దృష్టి పెట్టినట్లు భాటియా తెలియజేశారు. యూరోపియన్ దిగ్గజాలు భవిష్యత్లో దేశీ తయారీ మోడళ్లను ఎగుమతులకు వినియోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా 4 మీటర్లలోపు వాహనాలు, ఆర్అండ్డీ, చౌకవ్యయ ప్లాట్ఫామ్స్పై దృష్టి పెట్టే వీలున్నట్లు వివరించారు. తద్వారా తిరిగి వాహన అమ్మకాల్లో నిలకడైన వృద్ధిని కొనసాగించే వీలున్నట్లు అంచనా వేశారు.

ఫోన్పే ఐపీవో సన్నాహాలు షురూ
న్యూఢిల్లీ: గ్లోబల్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ గ్రూప్ ఫిన్టెక్ కంపెనీ ఫోనేపే పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐపీవో నిర్వహణకు కొటక్ మహీంద్రా క్యాపిటల్, జేపీ మోర్గాన్ చేజ్, సిటీగ్రూప్, మోర్గాన్ స్టాన్లీలను నియమించుకున్నట్లు పేర్కొన్నాయి. కాగా.. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్ దిగ్గజాలు జనరల్ అట్లాంటిక్, వాల్మార్ట్, రిబ్బిట్ క్యాపిటల్, టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్, టైగర్ గ్లోబల్ నుంచి ఫోన్పే 85 కోట్ల డాలర్లు(రూ. 7,021 కోట్లు) సమీకరించింది. 12 బిలియన్ డాలర్ల (సుమారు రూ. లక్ష కోట్లు) విలువలో ఈ పెట్టుబడులు సమకూర్చుకోవడం గమనార్హం! అంతక్రితం 2022లో సింగపూర్ నుంచి భారత్కు బదిలీకావడానికి వీలుగా దేశీ ప్రభుత్వానికి పన్నుల రూపేణా ఫోన్పే బిలియన్ డాలర్లు(రూ. 8,000 కోట్లు) చెల్లించిన సంగతి తెలిసిందే. 2016లో ఏర్పాటైన కంపెనీ ఇప్పటివరకూ రూ. 18,000 కోట్ల పెట్టుబడులు సమకూర్చుకుంది. 2023–24లో ఆదా యం 74 శాతం జంప్చేసి రూ. 5,064 కోట్లను తాకింది. ఇసాప్ వ్యయాలను మినహాయిస్తే రూ. 197 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2022–23) రూ. 738 కోట్ల నష్టం ప్రకటించింది.
ఫ్యామిలీ

రెస్టారెంట్ బిజినెస్లోకి దిగిన దిగ్గజ క్రికెటర్లు వీరే..!
సిటీ వ్యాపార తెరపై బాలీవుడ్ నటీనటుల రంగ ప్రవేశం ఇప్పటికే ఊపందుకుంది. అదే బాటలో మరోవైపు క్రీడాకారులు, మరీ ముఖ్యంగా క్రికెట్ వీరులు భాగ్యనగర పిచ్పై అడుగుపెట్టడం మొదలైంది. జాతీయ స్థాయిలో వినోద, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఇతర రంగాలపై సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎక్కువగా రెస్టారెంట్ బిజినెస్పై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో వారి వ్యాపార రంగానికి నగరం ఒక తిరుగులేని గమ్యంగా కనిపిస్తోంది.వరుసగా ఇక్కడ రెస్టారెంట్స్ ప్రారంభిస్తున్న వైనం వైవిధ్యభరిత కేఫ్ల నుంచి విలాసవంతమైన ఫైన్–డైన్ స్పాట్ల వరకూ కాదే వ్యాపారమూ కాలుపెట్టేందుకు అనర్హము అన్నట్టుగా సెలబ్రిటీలు నగరంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు ఇప్పటికే విభిన్న దేశాల, వైవిధ్యభరిత రుచులతో ఆహార ప్రియులకు వెల్కమ్ చెబుతున్న నగరం పలువురు సెలబ్రిటీల కొత్త రూట్కు బాటలు వేస్తోంది. మిగిలిన మెట్రోలతో పోలిస్తే వేగవంతమైన వృద్ధితో, విస్తృతమైన వ్యాపార అవకాశాలతో స్వాగతం పలుకుతోంది హైదరాబాద్. ఈ నేపథ్యంలో నగరంలో ఆహార విపణి రంగంలో కాలు మోపిన క్రికెటర్లు, వారు నెలకొల్పిన రెస్టారెంట్ల విశేషాలు ఇవీ.. పేసర్..ఫ్లేవర్..క్రికెట్ ప్రేమికులకు చిరపరిచితమైన భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ నగరం వైపు తన బౌలింగ్ను గురిపెట్టాడు. ఆయన హైదరాబాద్లో తన సొంత విలాసవంతమైన రెస్టారెంట్, జోహార్ఫాను ఏర్పాటు చేశాడు. ఈ వారంలో ఇది ప్రారంభం కాబోతున్న ఈ రెస్టారెంట్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 3లో ఆయన నెలకొల్పారు. జోహార్ఫా.. మొఘల్, పెర్షియన్, అరేబియన్, చైనీస్ వంటకాల మిశ్రమంతో నగరవాసులకు రాచరికపు కుకింగ్ అనుభవాన్ని అందిస్తుందని ఆయన హామీ ఇస్తున్నారు. గ్రాండ్’ ఎంట్రీ.. అంతర్జాతీయంగా పేరొందిన చదరంగం క్రీడాకారుడు గ్రాండ్మాస్టర్ అంకిత్ సైతం నగరంలో క్రీడాకారుల రాకకు తన వంతు ఊపు తెచ్చారు. యోగా, వెల్నెస్ నిపుణుడు కూడా అయిన అంకిత్.. గత మార్చి నెలలో జూబ్లీహిల్స్లో ఒక వినూత్నమైన ఆరోగ్య సాధనా కేంద్రాన్ని ‘అంకితం’ పేరిట ఏర్పాటు చేశారు. పైలేట్స్, యోగా, ధ్యానంతో పాటు జిమ్ వర్కవుట్స్ సైతం అందుబాటులోకి తెస్తూ పూర్తి స్థాయి వ్యాయామాలకు, వెల్నెస్ యాక్టివిటీలకు అంకితం అయిన వెల్నెస్ స్టూడియోను ఆయన ప్రారంభించారు. రుచుల.. బ్యారక్స్.. గత ఏడాది డిసెంబర్లో సైనిక్పురిలో బ్యారక్స్ – ఆంటెరూమ్ను ప్రారంభించడం ద్వారా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా నగర ఆహార రంగంలోకి ప్రవేశించారు. మూడు అంతస్తుల్లో విస్తరించి ఉన్న ఈ విలాసవంతమైన ప్రదేశం కేవలం రెస్టారెంట్.. అంత కంటే ఎక్కువ. ఇది పూర్తి స్థాయి సోషల్ గేదరింగ్ అని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఈ జాబితాలో కొత్తగా సిరాజ్ జోహార్ఫా చేరడంతో.. మరింత మంది క్రికెటర్లు, క్రీడా ప్రముఖులు ఈ పంథాను అనుసరిస్తారని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. క్రీడల్లో అద్భుతమైన విజయాలతో నగరవాసులకు దగ్గరైన క్రీడాకారులు తమ వంటకాల్లో వైవిధ్యం ద్వారా కూడా తమను అలరిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. రన్మెషిన్.. వన్ 8తో వచ్చెన్.. భారత క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ తన ప్రసిద్ధ వన్8 కమ్యూన్ రెస్టారెంట్ను గత ఏడాది మేలో నగరంలో ప్రారంభించారు. అనతి కాలంలోనే నగరంలో అత్యంత ట్రెండీగా, లగ్జోరియస్గా మారింది. నగరంలోని నాలెడ్జ్ సిటీలో ఉన్న ఈ రెస్టారెంట్ దాని ప్రీమియం వైబ్ ప్రత్యేకమైన వంటకాలకు ప్రసిద్ధి చెందింది. ఈ రెస్టారెంట్లో గత జనవరి నెలలో ఓ గెస్ట్కి స్వీట్ కార్న్ తీసుకున్నందుకు గాను రూ.525 బిల్ వేయడం అనే ఉదంతం వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో మీమ్ ఫెస్ట్గా మారింది.(చదవండి: ఆనంద్ మహీంద్రా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! తప్పనిసరిగా ఓ 20 నిమిషాలు..)

బుక్షెల్ఫ్: పాజిటివ్... పవర్ఫుల్ పేరెంటింగ్
సైకోథెరఫిస్ట్ జి. త్రివేది, పేరెంటింగ్ ఎక్స్పర్ట్ అనఘ నాగ్పాల్ తాజా పుస్తకం... దిస్ బుక్ వోన్ట్ టీచ్ యూ పేరెంటింగ్: బట్ ఇట్ విల్ మేక్ యూ ఏ బెటర్ పేరెంట్. బెటర్ పేరెంటింగ్ స్టైల్స్, వ్యక్తిగత అనుభవాలు, ప్రాక్టికల్ చెక్ లిస్ట్లు ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ఈ కాలంలో పేరెంటింగ్కు ఎదురవుతున్న సవాళ్ల గురించి చర్చించే పుస్తకం ఇది.‘పేరెంటింగ్ గురించి బోధించడానికి ఈ పుస్తకం రాయలేదు. ఏం చేస్తే మంచిది, ఏంచేయకూడదు...ఇలా ఎన్నో విషయాల గురించి చర్చిస్తూ రైట్ పేరెంటింగ్ గురించి చెప్పడమే ఈ పుస్తక లక్ష్యం’ అంటున్నారు రచయిత్రులు. సోషల్ మీడియా, డిజిటల్ టూల్స్... మొదలైన వాటి వల్ల గతంతో పోల్చితే ఇప్పటి తల్లిదండ్రులు పేరెంటింగ్కు సంబంధించి రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వాటికి ఈ పుస్తకం పరిష్కార మార్గాలు సూచిస్తుంది. దీనికోసం ఎంతో రీసెర్చ్ చేశారు. బాల్యం నుంచి టీనేజ్ వరకు పిల్లలకు సంబంధించిన వివిధ దశల్లో తల్లిదండ్రులు ఎలాంటి విధానాలను అనుసరించాలో ఈ పుస్తకం సూచిస్తుంది. నిజ జీవిత కథలను ప్రస్తావిస్తూ పాజిటివ్ పేరెంటింగ్కు సంబంధించిన ఫ్రేమ్వర్క్, పిల్లలకు ఉపకరించే సెల్ఫ్– రిఫ్లెక్షన్ ఎక్సర్సైజ్లు, సెల్ఫ్–రెగ్యులేషన్ టెక్నిక్ల గురించి తెలియజేస్తుంది.పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ఇండియా ప్రచురించిన ఈ పుస్తకంలో ఎనిమిది చాప్టర్లు ఉన్నాయి. ‘పేరెంట్స్ తమ బాల్యంలోకి వెళ్లడానికి, ఆ జ్ఞాపకాల ఆధారంగా పిల్లల గురించి ఆలోచించడానికి, పాజిటివ్ పేరెంటింగ్ విషయంలో ప్రతి చాప్టర్ ఉపయోగపడుతుంది’ అంటున్నారు రచయిత్రులు.

రసాయనిక ఎరువుల్లో 60–70% వృథా!
‘నత్రజని కాలుష్యం’ భూగోళంపై జీవనాన్ని కష్టాలపాలు చేస్తోంది. రసాయనిక ఎరువుల వాడకం, బొగ్గు/పెట్రోలియం ఉత్పత్తుల వంటి శిలాజ ఇంధనాల వాడకం అంతకంతకూ పెరిగిపోతుండటమే ఇందుకు కారణం. మనుషుల పనుల వల్ల అతిగా పర్యావరణంలోకి వెలువడుతున్న నత్రజని.. ప్రకృతిలోని సహజ ప్రక్రియలకు అంతరాయం కలిగిస్తోంది. ‘నత్రజని కాలుష్యం’ ముఖ్యంగా మూడు రకాలుగా భూగోళంపై మూడు సంక్షోభాలను కలిగిస్తోంది. దీన్నే ‘ప్లానెటరీ ట్రిపుల్ క్రైసిస్’ అంటారు. సుస్థిర పద్ధతుల్లో నత్రజని కాలుష్యాన్ని నిర్వహించే మార్గాలపై ప్రొఫెసర్ నందుల రఘురామ్ గత పాతికేళ్లుగా విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ నైట్రోజన్ ఇనీషియేటివ్ ఎమెరిటస్ చైర్మన్గా, గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ(ద్వారాక, ఢిల్లీ)లో ప్రొఫెసర్గా డా.రఘురామ్ సేవలందిస్తున్నారు. 2017లో ప్రపంచంలోనే మొదటిగా ‘ఇండియన్ నైట్రోజన్ అసెస్మెంట్’ నివేదిక రూపొందించటంలో ఆయనది కీలకపాత్ర. దీనిపై ఐక్యరాజ్యసమితిలో అప్పట్లోనే తీర్మానం జరిగింది కూడా. డా.రఘురామ్ని ‘సాక్షి సాగుబడి’ ఇటీవల ఇంటర్వ్యూ చేసింది. రసాయనిక ఎరువుల ‘నత్రజని కాలుష్య’ తీవ్రత ఎంతో? కారణాలేమిటో? పరిష్కారాలేమిటో? ఇప్పుడు తెలుసుకుందాం.ప్రజల ఆకలి తీర్చే క్రమంలో అధిక దిగుబడుల కోసం హరితవిప్లవంలో భాగంగా వాడటం ప్రారంభించిన రసాయనిక ఎరువులు నిజానికి పంటలకు ఉపయోగపడుతున్న దానికంటే వృథా అవుతున్నది చాలా ఎక్కువ. ముఖ్యంగా నత్రజని ఎరువుల వాడకం, వృథా ఎక్కువే. ప్రొఫెసర్ నందుల రఘురామ్ మాటల్లో చెప్పాలంటే.. ‘మన దేశంలో పొలాల్లో వేస్తున్న రసాయనిక ఎరువుల్లో 30–40% మాత్రమే పంటకు ఉపయోగపడుతున్నాయి. 60–70% వృథాగా పోతున్నాయి. నీటి కాలుష్యానికి, వాయు కాలుష్యానికి, భూతాపోన్నతికి కారణమవుతున్నాయి. జలవనరుల్లో జీవవైవిధ్యానికి తూట్లు పొడుస్తున్నాయి’ అన్నారాయన. ఇదీ చదవండి: పామూ లేదు, దోమా లేదు.. ఎక్కడో తెలుసా?6 కోట్ల టన్నుల ఎరువులుమన దేశంలో పంటల సాగు కోసం 2023–24లో 6 కోట్ల మెట్రిక్ టన్నులకు పైగా రసాయనిక ఎరువులు వాడారు. యూరియా 357.81 లక్షల టన్నులు, డిఎపి 109.73 లక్షల టన్నులు, ఎంఓపి 16.45 లక్షల టన్నులు, ఎన్పికె మిశ్రమ ఎరువులు 116.80 లక్షల మెట్రిక్ టన్నుల వినియోగం జరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఈ ఎరువులపై సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా రూ. లక్షన్నర కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. మరోవైపు, ఎరువుల మోతాదు పెంచుతున్నా దిగుబడులు పెరగని స్థితి నెలకొంటున్నది. రైతులు ఏటేటా అధికంగా ఎరువులు వాడకతప్పని స్థితిని ఎదుర్కొంటున్నారు. ‘ట్రిపుల్ ప్లానెటరీ క్రైసిస్’నత్రజని కాలుష్య ప్రభావంతో ‘ట్రిపుల్ ప్లానెటరీ క్రైసిస్’ పెచ్చరిల్లుతోంది. వాతావరణ మార్పు, జీవవైవిధ్య నష్టం, కాలుష్యం అనే మూడు పరస్పర అనుసంధాన సంక్షోభాలకు ఇది నేరుగా దోహదం చేస్తోంది. 1 వ్యవసాయంలో ఎరువుల వాడకం నత్రజని కాలుష్యానికి ప్రధాన మూలం. పంటలు వాడుకోలేకపోయిన అధిక నత్రజని నీటి వనరుల్లోకి వెళ్లి భూగర్భ జలాల్లోకి చేరుతోంది. 2పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలను మండించడం వలన నైట్రోజన్ ఆక్సైడ్లు విడుదలవుతున్నాయి. ఇది వాయు కాలుష్యం, వాతావరణ మార్పులకు దోహదం చేస్తోంది.3 శుద్ధి చేయని లేదా సరిగా శుద్ధి చేయని మురుగునీటిలో అధిక స్థాయిలో నత్రజని, ఇతర పోషకాలు ఉంటాయి, ఇవి చెరువులు, రిజర్వాయర్లు, నదులు, సముద్రాలను కలుషితం చేస్తాయి. ఈ కాలుష్యం వల్ల ఆక్సిజన్ లోపించి చేపలు, ఇతర జలచరాలు చనిపోతాయి. ఆ నీటిలో విపరీతంగా నాచు పెరిగిపోతుంది. ఇది జలచరాలకు మరణశాసనంగా మారుతుంది. ఏమి చేయవచ్చు?→ నత్రజని తదితర ఎరువులను అవసరం మేరకు తగుమాత్రంగా, సముచిత పాళ్లలో ఉపయోగించాలి. → పశువుల పేడ మూత్రాన్ని సక్రమంగా సేకరించి, వినియోగించే పద్ధతులను అమలు చేస్తే నత్రజని కాలుష్యం తగ్గుతుంది. → వ్యర్థాలను తగిన రీతిలో పునర్వినియోగించటం, వనరుల వినియోగ సామర్థ్యాన్ని ప్రోత్సహించి అధిక ఎరువుల వాడకం అవసరాన్ని తగ్గించవచ్చు. → ప్రభుత్వాలు నత్రజని ఉద్గారాలను పరిమితం చేసే పద్ధతులను ప్రోత్సహించేలా విధానాల్లో మార్పులు తేవాలి. → నత్రజని కాలుష్యాన్ని అరికట్టే క్రమంలో సమాజంలో వ్యక్తుల పాత్ర కూడా కీలకం. మాంసం వినియోగాన్ని తగ్గించటం, రసాయనాల్లేని వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం, నత్రజని కాలుష్యాన్ని పరిష్కరించే విధానాల కోసం కృషి చెయ్యాలి. ఈ పోషకాలను సమర్థంగా వాడుకోలేమా?దేశంలో రోజుకు 15,000 కోట్ల లీటర్లకు పైగా మురుగునీరు ఉత్పత్తి అవుతోంది. ఈ నీటిలో 65,250 మెట్రిక్ టన్నుల నత్రజని తదితర పోషకాలు ఉంటాయి. శుద్ధి చేసి ఆ పోషకాలను పునర్వినియోగించలేక ప్రతి రోజూ 55,000 మెట్రిక్ టన్నులకు పైగా పోషకాలను కోల్పోతున్నాం. మురుగు నీటిలోని పోషకాలను పూర్తిగా రీసైకిల్ చేస్తే రసాయనిక ఎరువులు 40% వరకు ఆదా అయ్యేవని ప్రొఫెసర్ రఘురామ్ అన్నారు. అదేవిధంగా, దేశంలో 20 కోట్ల పశువులున్నాయి. రోజుకు ఒక జంతువుకు 15 కిలోల పేడ వస్తుంది. అందులో 5% ఎన్పికె పోషకాలు ఉన్నాయి. వాటి పరిమాణం 1,50,000 మెట్రిక్ టన్నులు. ఇది మనం వాడే మొత్తం రసాయనిక ఎరువుల్లో 95 శాతం. దీనికి అదనంగా, రోజుకు ఒక పశువు 15–20 లీటర్ల మూత్రం పోస్తుంది. వీటిలో 3% పోషకాలు ఉంటాయి. ఆ మొత్తం 1,20,000 మెట్రిక్ టన్నులు. సక్రమంగా మూత్రాన్ని సేకరించి వాడుకోలేక చాలా కోల్పోతున్నాం. మరో మాటలో చెప్పాలంటే.. పంట పొలాలు, జనావాసాల నుంచి వెలువడే మురుగునీటిలో 3,35,000 టన్నులకు పైగా పునర్వినియోగించదగిన పోషకాలు ఉన్నాయి. ఇది మన దేశంలో రోజువారీగా వాడుతున్న ఎరువులకు రెట్టింపు ఉంటాయని డా.రఘురామ్ వివరించారు.ఎరువు 4 రోజుల్లో మాయం!పంటలకు స్థూల పోషకాలైన నత్రజని (యూరియా), ఫాస్ఫరస్, పొటాషియం/సల్ఫర్లను 4:2:1 నిష్పత్తిలో వాడాలి. ఉదా.. వరి పంటకు సీజన్కు హెక్టారుకు అన్నీ కలిపి 120 కిలోల ఎరువు వెయ్యాలని శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తున్నారు. అయితే, రైతులు ఈ నిష్పత్తిపై సరైన అవగాహన లేక ఈ మోతాదులను పట్టించుకోవటం లేదు. పంట పచ్చబడితే చాలన్నట్లు యూరియానే పొలాల్లో కుమ్మరిస్తున్నారని, అది కూడా పంట సీజన్లో కేవలం రెండు సార్లు మాత్రమే ఎరువులు వేస్తున్నారని ప్రొఫెసర్ రఘురామ్ అన్నారు. రసాయనిక ఎరువులను పంట 2–4 రోజుల్లోనే తీసుకోగలుగుతుంది. పంట తీసుకునేది 30–40% మాత్రమే. మిగతా 60–70% ఎరువు నీటి ద్వారా, గాలి ద్వారా వృథాగా పోతున్నది. సమర్థవంతంగా ఎరువు వినియోగించకపోవటం వల్ల సుమారు రూ. లక్ష కోట్ల ఎరువుల సబ్సిడీ వృథా అవుతోందని ప్రొ. రఘురామ్ అన్నారు. ఏ ఎరువు ఎంత పాళ్లలో వేయాలో అంతే వెయ్యాలి. తక్కువ మోతాదులో, ఎక్కువ సార్లు వేస్తే ఎక్కువగా పంటకు ఉపయోగం. వృథా తగ్గుతుంది. అప్పుడే నత్రజని కాలుష్యమూ తగ్గుతుంది అన్నారాయన. అయితే, ఎక్కువ సార్లు వేయటానికి రైతులకు ఖర్చు ఎక్కువ అవుతుంది. మంచి గిట్టుబాటు ధర దక్కినప్పుడే రైతులు ఆపని చేయగలుగుతా రన్నారు.

Badi Ganta స్కూల్ బ్యాగ్ బరువు ఎంత ఉండాలి?
స్కూల్ బ్యాగ్ ఎంత బరువుగా ఉంటే ఆ స్కూల్లో అంత గట్టిగా పాఠాలు చెప్తున్నట్టు అనుకోకూడదు. స్కూల్ బ్యాగ్ విద్యార్థికి నెత్తిన మోసే మూట కాకూడదు. పిల్లల ఆరోగ్యం కోసం శ్రద్ధ చూపే తల్లిదండ్రులు స్కూల్ బ్యాగ్ బరువు విషయంలో నిస్సహాయంగా ఉంటారు. పిల్లలు బయటకు చెప్పలేని ఆ భారాన్ని మోస్తూ ఆనారోగ్యాలు కొని తెచ్చుకుంటారు. పిల్లల్ని స్కూల్కు పంపడం అంటే అవసరమైన పుస్తకాలతో పంపడం. హమాలీలుగా పంపడం కాదు. మోసి చూశారా మీ పిల్లల స్కూల్ బ్యాగ్ బరువెంతో?స్కూల్ బ్యాగ్ ఎంత బరువుగా ఉంటే ఆ స్కూల్లో అంత గట్టిగా పాఠాలు చెప్తున్నారని సంబరపడి పోతుంటారు కొందరు తల్లిదండ్రులు. విద్యార్థి మోసే బ్యాగ్ బరువును బట్టి అతని చదువును అంచనా వేస్తారు మరికొందరు. ఇవి కేవలం అపోహలు మాత్రమే. పిల్లల వీపున బండ మోయించినట్లు వారి చేత స్కూల్ బ్యాగ్ మోయించడం సబబు కాదు. పిల్లల ఆరోగ్యం కోసం శ్రద్ధ చూపే తల్లిదండ్రులు స్కూల్ బ్యాగ్ బరువు విషయంలో నిస్సహాయంగా ఉంటారు. పిల్లలు బయటకు చెప్పలేని ఆ భారాన్ని మోస్తూ అనారోగ్యాలు కొని తెచ్చుకుంటారు. పిల్లల్ని స్కూల్కు పంపడం అంటే అవసరమైన పుస్తకాలతో పంపాలి. మీరెప్పుడైనా చూశారా మీ పిల్లల స్కూల్ బ్యాగ్ బరువెంతో? ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలకు చదువు పేరుతో చాలా పని పెడుతుంటారు. కొందరు ఇది పిల్లలకు అవసరం అనుకుంటే మరికొందరు ఈ మాత్రం హడావిడి స్కూల్కు అవసరం అనుకుంటారు. అందుకే చాలా స్కూళ్ల లో రెగ్యులర్ సిలబస్తోపాటు అసైన్ మెంట్, ప్రాజెక్టులు, స్లిప్ టెస్టులు, క్లాస్ వర్క్, హోం వర్కు, రఫ్ కాపీ, గైడ్, డైరీ, డ్రాయింగ్, క్రాఫ్ట్, ఆర్ట్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ బుక్.. ఇలా విద్యార్థులకు ప్రతి సబ్జెక్ట్కు 6 నుంచి 7 నోటు బుక్స్లను కేటాయిస్తూ విద్యార్థుల వెన్ను వంచుతున్నారు. స్కూల్ బ్యాగ్ బరువు విద్యార్థి వయస్సు, ఎత్తుకు తగ్గట్టు ఉండాలని, విద్యార్థి బరువులో 10 శాతం మించకుండా ఉండాలని నిపుణులు చెప్పే మాటలు మాటలుగా ఉండిపోతున్నాయి. అధిక బరువున్న స్కూల్ బ్యాగులు పిల్లల శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వెన్నునొప్పికి దారితీస్తోంది. (పామూ లేదు, దోమా లేదు.. ఎక్కడో తెలుసా?)పిల్లల బ్యాగ్ బరువు ఎంత ఉండాలి1–2 తరగతులు: 1.5 నుండి 2 కిలోలు3–5 తరగతులు: 2 నుండి 3 కిలోలు6–8 తరగతులు: 3 నుండి 4 కిలోలు9–10 తరగతులు: 4 నుండి 5 కిలోలుబ్యాగ్ బరువును ఇలా తగ్గిద్దాం..→ పిల్లలకు అవసరమైన పుస్తకాలు, నోట్బుక్లు మాత్రమే బ్యాగ్లో ఉంచుకునేలా చూడాలి. లంచ్బాక్స్, వాటర్ బాటిల్ వంటివి విడివిడిగా ఉంచుకోవడం మంచిది.→ పుస్తకాలను బైండింగ్ చేయించడం కంటే పేపర్తో అట్టలు వేయడం ద్వారా బరువు తగ్గుతుంది. → పేరెంట్స్–టీచర్ సమావేశం జరిగినప్పుడు బ్యాగ్ బరువు విషయం స్కూల్ వారితో చర్చించాలి. వారికి తగిన సూచనలు చేయాలి.→ మీ ఇంటికి స్కూల్ దగ్గరగా ఉంటే ఒక పని చేయొచ్చు. పిల్లల్ని ΄÷ద్దున్న తరగతుల పుస్తకాలు మాత్రమే తీసుకెళ్లేలా చూసి, లంచ్ బ్రేక్ సమయంలో మీరు వెళ్లి మధ్యాహ్నం తరగతుల పుస్తకాలు ఇవ్వొచ్చు. ఉదయం తరగతుల పుస్తకాలు మీరు తీసుకు రావొచ్చు. దీనివల్ల పిల్లలపై బ్యాగ్ భారం తగ్గుతుంది.→ రేపు ఏయే పాఠాలు జరుగుతున్నాయో, ఏయే టీచర్లు సెలవులో ఉన్నారో, ఏ పుస్తకాలు అవసరమో ముందే పిల్లలకు చెప్పేలా ప్రణాళిక రూ రూపొందించమని స్కూల్ యాజమాన్యాన్ని అడగండి. దీనివల్ల అవసరమైన పుస్తకాలు మాత్రమే తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. → చాలా పాఠశాలల్లో క్లాస్ వర్క్, హోం వర్క్ అని రెండు వేర్వేరు పుస్తకాలు వాడమని పిల్లలకు సూచిస్తుంటారు. దానికన్నా ఒకే పుస్తకంలో ముందువైపు క్లాస్వర్క్, వెనక వైపు హోం వర్క్ రాసేలా చూడమని టీచర్లకు సూచించొచ్చు. → కొన్ని పాఠశాలల్లో రోజువారీ పాఠ్యపుస్తకాలు అక్కడే పెట్టి, హోం వర్క్ పుస్తకాలు మాత్రం ఇంటికి తెచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. అది అన్నిచోట్లా అమలుచేసేందుకు ప్రయత్నాలు చేయొచ్చు.నో బ్యాగ్ డే వారానికి ఒకసారి గానీ లేదా నెలలో రెండు రోజులు గానీ పిల్లలకు స్కూల్ బ్యాగ్ నుంచి స్వేచ్ఛ కల్పించడం ‘హ్యాపీనెస్ కర్రికులం’లో భాగంగా అమలు చేయాలనే ఆలోచనలు కొన్ని ప్రభుత్వాలు చేసినా అవి వాస్తవరూపం దాల్చడం లేదు. నిజానికి ఇది పిల్లలకు చాలా సంతోషాన్ని ఇచ్చే ఆలోచన. స్కూల్ బ్యాగ్ లేని రోజు పిల్లలు ఆటలు పాటలు కథలు బొమ్మలు... వీటితో గడిపితే మానసిక వికాసం కలుగుతుంది. బ్యాగ్ మోత తప్పి వెన్నుకు విశ్రాంతి లభిస్తుంది. అయితే టీచర్లు తల్లిదండ్రులు కూడా ఈ ఆలోచనను అంగీకరించరు. పిల్లలు అనునిత్యం పుస్తకాలు మోస్తూ పుస్తకాల్లో తలలు కూరి ఉంటేనే వాళ్ళు మంచిపిల్లలు అన్నది వారి భావన.
ఫొటోలు
అంతర్జాతీయం

ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనపై ఇరాన్ ఆగ్రహం
టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య సంపూర్ణ కాల్పుల విరమణను ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్ ఈ వ్యాఖ్యలను తిరస్కరించింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ లేదా సైనిక కార్యకలాపాల నిలిపివేతపై ఎటువంటి ఒప్పందం కుదరలేదని స్పష్టం చేసింది. అలాగే ట్రంప్ తీరుపై మండిపడింది. అయితే ఇజ్రాయెల్ తన చట్టవిరుద్ధమైన దురాక్రమణను నిలిపివేయాలని, ఈ సంఘర్షణను కొనసాగించడంలో తమకు ఏమాత్రం ఆసక్తి లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి పేర్కొన్నారు. ఈ యుద్ధాన్ని ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. ఇరాన్ వైపు నుంచి జరగలేదు. ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య ఎటువంటి కాల్పుల విరమణ లేదా సైనిక కార్యకలాపాల విరమణపై ఎలాంటి ఒప్పందం కుదరలేదు.అయితే ఇజ్రాయెల్ అధికారులు ఇరాన్ ప్రజలపై తన చట్టవిరుద్ధమైన దురాక్రమణను ఉదయం నాలుగు గంటలలోపు ఆపితే, ఆ తర్వాత మా ప్రతిస్పందనను కొనసాగించాలన్న ఉద్దేశ్యం తమకు లేదని అని ఆయన ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు. సైనిక కార్యకలాపాల విరమణపై తుది నిర్ణయం తరువాత తీసుకుంటామని మిస్టర్ అరఘ్చి స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: రెండేళ్లుగా ‘పహల్గామ్’ ముష్కరులు యాక్టివ్?

యుద్ధం ముగిసింది.. ఇరాన్-ఇజ్రాయెల్ వార్పై ట్రంప్ కీలక ప్రకటన
కాల్పుల విరమణను ఇరాన్, ఇజ్రాయెల్ అంగీకరించాయంటూ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం 24 గంటల్లో అమల్లోకి వస్తుందన్నారు. 12 రోజలు యుద్ధానికి ఇది ముగింపు.. యుద్ధం విరమణకు అంగీకరించిన రెండు దేశాలకు అభినందనలు అంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ‘ట్రూత్’లో పోస్ట్ చేశారు. మరో ఆరు గంటల్లో చర్యలు ప్రారంభం కానున్నాయన్న ట్రంప్.. 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుందంటూ ప్రకటించారు.కాగా, కీలక అణుక్షేత్రంపై భారీ బాంబులేసి వినాశనం సృష్టించిన అగ్రరాజ్యంపై ఇరాన్ యుద్ధాగ్రహంతో దూసుకెళ్లింది. తన క్షిపణులకు పనిచెప్పింది. ఖతార్లోని అమెరికా వైమానికస్థావంపై సోమవారం రాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. కువైట్, ఇరాక్, బమ్రెయిన్లోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలపైనా దాడిచేసినట్లు వార్తలొచ్చాయి. దోహా నగర సమీపంలోని అల్–ఉదేయిద్ అమెరికా ఎయిర్బేస్పై ఆరు స్వల్ప శ్రేణి, మధ్యస్థాయి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడులకు ఇరాన్ ‘ఆపరేషన్ బేషరత్ ఫతాహ్’ అని పేరుపెట్టింది. ఇరాక్లోని అయిన్ అల్ అసద్ బేస్పై ఇరాన్ రాకెట్లను ప్రయోగించింది. అయితే ఇక్కడ ఏ స్థాయిలో ధ్వంసం జరిగిందనేది తెలియరాలేదు. అయితే క్షిపణులను తమ గగనతల రక్షణవ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని అమెరికా ప్రకటించింది.

ఎదురులేని ఖొర్రంషహర్
ఇరాన్లోని మూడు కీలక అణు కేంద్రాలపై అమెరికా సైన్యం బంకర్ బస్టర్ బాంబులు, క్షిపణులు ప్రయోగించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్పై దాడులకు దిగింది. ఖొర్రంషహర్–4 మిస్సైల్ సహా మొత్తం 40 క్షిపణులు ప్రయోగించినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ)ప్రకటించింది. ఇజ్రాయెల్లోని లక్ష్యాలను ఛేదించామని వెల్లడించింది. ఖొర్రంషహర్–4 క్షిపణి ప్రయోగ దృశ్యాలు ఇరాన్ ప్రభుత్వ టీవీ చానల్లో ప్రత్యక్షమయ్యాయి. ఇది ఇరాన్ అమ్ములపొదిలో అత్యంత కీలకమైన అస్త్రం అని చెప్పొచ్చు. ఇరాన్కు ఇదే అతిపెద్ద క్షిపణి కావడం గమనార్హం. ఇరాన్లోని ఖొర్రంçషహర్ అనే నగరం పేరునే దీనికి పెట్టారు. ఖైబర్ మిస్సైల్ అని కూడా అంటారు. 1980వ దశకంలో ఖొర్రంషహర్లో ఇరాక్–ఇరాన్ మధ్య భారీ యుద్ధం జరిగింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్న యూదుల కోట ‘ఖేబర్’ను 7వ శతాబ్దంలో అప్పటి పర్షియా(ఇరాన్) పాలకులు అక్రమించారు. → ఖొర్రంషహర్–4ను ఇరాన్ ప్రభుత్వ రంగంలోని ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఆర్గనైజేషన్(ఏఐఓ) అభివృద్ధి చేసింది. ఇది ద్రవ ఇంధనంతో నడిచే మీడియం–రేంజ్ బాలిస్టిక్ క్షిపణి. → తొలిసారిగా 2017 జనవరిలో పరీక్షించారు. 2017 సెప్టెంబర్లో టెహ్రాన్ మిలటరీ పరేడ్లో ప్రజల కోసం మొదటిసారి బహిరంగంగా ప్రదర్శించారు. → ఈ క్షిపణి పొడవు 13 మీటర్లు. వ్యాసం 1.5 మీటర్లు. బరువు 19.5 టన్నులు. పరిధి 2,000 కిలోమీటర్లు. 1,800 కిలోల వార్హెడ్లను మోసుకెళ్లగలదు. కానీ, దీని పరిధి 2,500 కిలోమీటర్లకుపైగా ఉంటుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈజిప్టు, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, రొమేనియా, బల్గేరియా, గ్రీస్ దేశాలు ఈ మిస్సైల్ పరిధిలోకి వస్తాయి. → ఖొర్రంషహర్–4 టార్గెట్ ఏరియాకు చేరుకున్న తర్వాత ఏకంగా 80 లక్ష్యాలపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేయగలదని అంటున్నారు. అత్యంత వేగంతో ప్రయాణిస్తూ శత్రుదేశాల గగనతల రక్షణ వ్యవస్థల నుంచి సులువుగా తప్పించుకోగలదని సమాచారం. అంటే ఈ క్షిపణిని మధ్యలోనే కూలి్చవేయడం దాదాపు అసాధ్యమే. ఒక్కసారి గురిపెడితే లక్ష్యాన్ని తాకాల్సిందే. → ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థకు అసలైన ముప్పు ఖొర్రంషహర్–4 నుంచే పొంచి ఉంది. ఇజ్రాయెల్ ఐరన్డోమ్ కానీ, డేవిడ్ స్లింగ్ కానీ దీన్ని అడ్డుకోలేవు. – సాక్షి, నేషనల్ డెస్క్

చిక్కడు.. దొరకడు!
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం నానాటికీ తీవ్రరూపం దాలుస్తోంది. దాడులు, ప్రతిదాడులకు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యుద్ధంలోకి అమెరికా సైతం అడుగుపెట్టడం అగి్నకి ఆజ్యం పోసినట్లయ్యింది. ఇజ్రాయెల్తోపాటు అమెరికాపై కత్తులు నూరుతున్న అసలు కథానాయకుడు, ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఇప్పుడు ఎక్కడున్నారు? అనేది టాప్ సీక్రెట్గా మారింది. దశాబ్దాలుగా ఇరాన్ను మకుటం లేని మహారాజులా ఏలుతున్న 86 ఏళ్ల ఖమేనీ కోసం ఇజ్రాయెల్ నిఘా వర్గాలు వేట సాగిస్తున్నాయి. ఆయనకు విదేశాల్లోనే కాదు, సొంత దేశంలోనూ శత్రువులున్నారు. ఖమేనీ ఆచూకీ దొరికితే సజీవంగా బంధించి, చట్టప్రకారం శిక్షించడమో లేక అక్కడికక్కడే అంతం చేయడమో తథ్యమని పశ్చిమ దేశాల మీడియా అంచనా వేస్తోంది. ఇరాన్లో తమ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్టించాలంటే ఆయన ప్రాణాలతో ఉండడానికి వీల్లేదని ఇజ్రాయెల్, అమెరికా నిర్ణయానికి వచి్చనట్లు తెలుస్తోంది. ఖమేనీ భౌతికంగా లేకుండాపోతేనే ఈ యుద్ధం ముగస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేయడం గమనార్హం. ‘‘ఖమేనీ ఆధునిక హిట్లర్. అతడు బతికి ఉండడానికి వీల్లేదు’’ అని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ సైతం అన్నారు. చావుకు భయపడే మనిషి కాదు ఇరాన్లో ఈ నెల 12న ఇజ్రాయెల్ సైన్యం హఠాత్తుగా దాడికి దిగింది. ఆ వెంటనే ఖమేనీ ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గుర్తుతెలియని ప్రాంతంలో అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన బంకర్లో ఆయన క్షేమంగా ఉన్నట్లు ఇరాన్ అధికార వర్గాలు చెబుతున్నాయి. సుశిక్షితులైన బాడీగార్డులు ఆయనకు రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. ఖమేనీ కచి్చతంగా ఎక్కడున్నారో ఎవరికీ తెలియకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) అత్యున్నత స్థాయి అధికారులకు సైతం ఖమేనీ ఆచూకీ గురించి తెలియదని అంటున్నారు. ఇజ్రాయెల్ నిఘా వర్గాలకు ఏమాత్రం ఉప్పందకుండా ఇరాన్ సర్కారు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఖమేనీని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఉన్నత శ్రేణి భద్రతా దళం నిరంతరం ఆయనకు కాపలా కాస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఖమేనీ ప్రాణాలకు ఎవరూ హానీ తలపెట్టే అవకాశం లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఖమేనీ చావుకు భయపడే మనిషి కాదని, ఇరాన్ భవిష్యత్తు కోసం ఆయన ప్రాణాలతో ఉండడం అవసరమని అన్నారు. అమెరికా దాడుల తర్వాత బంకర్లోకి.. సాధారణ పరిస్థితుల్లో ఖమేనీ సెంట్రల్ టెహ్రాన్లోని ఓ కాంపౌండ్లో ఉంటారు. అక్కడి నుంచి విధులు నిర్వర్తిస్తారు. మిలటరీ కమాండర్లు, అధికారులతో ప్రతివారం సమావేశమవుతారు. ప్రజలతో మాట్లాడాలన్నా ఇక్కడే. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరు. ఇజ్రాయెల్ దాడులు మొదలైన వెంటనే ఖమేనీ బంకర్లోకి వెళ్లలేదని సమాచారం. బయటే ఉంటూ ప్రతిదాడికి వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది. ఈ నెల 21న అమెరికా సైన్యం యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన తర్వాతే ఆయన బంకర్లోకి చేరుకున్నారు. మూడు ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం తర్వాత ఖమేనీ మరింత అప్రమత్తమయ్యారు. తన విశ్వాసపాత్రులైన అనుచరులు, సహాయకులతోనూ కమ్యూనికేషన్ తగ్గించుకున్నారు. ఫోన్లు ఉపయోగించడం ఆపేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉంటున్నారు. శత్రువులకు తన ఆచూకీ చిక్కకుండా ఉండడానికే ఈ జాగ్రత్త. శత్రువుల చేతికి చిక్కితే మరణాన్ని చేతులారా ఆహ్వానించినట్లేనని ఖమేనీని బాగా తెలుసు. ఆయనను ఖతం చేయడానికి ఇజ్రాయెల్ ఇప్పటిదాకా చేయని ప్రయత్నమే లేదు. ఇజ్రాయెల్ ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా ఎంతోమందిని హత్య చేసింది. కొద్ది రోజుల క్రితమే పేజర్ బాంబులతో హెజ్»ొల్లా నాయకులను మట్టుబెట్టింది. ఖమేనీని మాత్రం కనీసం టచ్ చేయలేకపోయిందంటే ఆయన ఎంత సురక్షితంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ‘‘ఏదో ఒకరోజు ఇజ్రాయెల్ నన్ను చంపేయడం ఖాయం. దేశం కోసం వీరమరణం పొందడం నాకు సంతోషమే’’ అని కొన్నేళ్ల క్రితం ఖమేనీ వ్యాఖ్యానించారు. – సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో సిట్ కీలక పురోగతి
షిల్లాంగ్: మేఘాలయ హనీమూన్ హత్య కేసులో సిట్ అధికారుల దర్యాప్తులో పురోగతి సాధించారు. పెళ్లైన 11 రోజులకే తన భర్త రాజా రఘు వంశీ హత్య కేసులో సోనమ్ రఘువంశీ పాటు ఇతర నిందితుల సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సిట్ దర్యాప్తులో సోనమ్కు సహకరించిన ప్లాటు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు సోనమ్ రఘువంశీ తన భర్త రాజా రఘువంశీని హత్య చేసిన తర్వాత నిందితులు ఇండోర్లో ఓ ప్లాటును అద్దెకు తీసుకున్నారు. ఆ ఫ్లాట్ యజమాని ఓ ఇన్ఫ్రాస్టక్చర్ కంపెనీ యజమాని లోకేంద్ర తోమర్. అయితే, సోనమ్ ఉండేందుకు అద్దె ఇల్లు చూపించిన ప్రాపర్టీ డీలర్ సలోమ్ జేమ్స్ను పోలీసులు ప్రశ్నించడంతో లోకేంద్ర తోమర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక పోలీసుల దర్యాప్తులో సోనమ్ అద్దెకు ఉన్న ఇంటి నుంచి కంట్రీ మేడ్ పిస్టల్, ఆమె ఫోన్, రాజా నగలు, ఐదు లక్షల రూపాయల నగదును తీసుకెళ్లాడని పోలీసులు అనుమానిస్తున్నారు.అంతేకాదు, జేమ్స్ చెప్పిన వివరాల మేరకు.. సోనమ్ పోలీసులకు లొంగిపోయిన కొద్ది సేపటికే తోమర్.. జేమ్స్కు ఫోన్ చేశారు. సోనమ్ అద్దెకు ఉన్న ప్లాట్లో ఓ బ్యాగ్ ఉందని, వెంటనే దాన్ని తీసేయాలని కోరాడు. కానీ జేమ్స్ ఆ బ్యాగ్ను తీయించలేదు. అందుకే తమర్ ఆ బ్యాగ్ను తీసుకున్నాడు.తన ఫ్లాట్ సమీపంలోని కార్ షోరూమ్లోని సీసీటీవీ ఫుటేజ్ను తొలగించేందుకు ప్రయత్నించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. తోమర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఇండోర్లో అతని ఆచూకీ కోసం పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారని వర్గాలు తెలిపాయి. Just take a look at this wedding video of Sonam and Raja Raghuvanshi and you will agree that Sonam was clearly not happy with this marriage. Raja Raghuvanshi would have been alive if Sonam had said No to the marriage. She had the courage to hire contract killers but didn't had… pic.twitter.com/NbHlQQWzXK— Incognito (@Incognito_qfs) June 9, 2025

కులం పేరుతో దూషిస్తూ.. ఇండిగో సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్లైన్స్ ట్రైనీ పైలట్ ఒకరు.. సంచలన ఆరోపణలకు దిగారు. తనను కులం పేరుతో అతిదారుణంగా దూషించారంటూ సహచరులపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురుగ్రామ్లోని ఎయిర్లైన్స్ హెడ్క్వార్టర్స్ ఈ ఘటన జరగ్గా.. పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం చేశారు. బెంగళూరుకు చెందిన శరణ్ కుమార్(35) అనే ఇండిగో ట్రైనీ పైలట్.. ఎమ్మార్ క్యాపిటల్ టవర్ 2లో జరిగిన మీటింగ్కు హాజరయ్యారు. ఆ టైంలో మరో ముగ్గురు ఉద్యోగులు అతన్ని ఉద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. శరణ్ తండ్రి అశోక్ కుమార్ చేసిన ఫిర్యాదులో.. ‘‘కాక్ పిట్లో కూర్చుని విమానం నడిపేందుకు నీకు(శరణ్ను ఉద్దేశించి..) అర్హత లేదు. ఇండిగోలో గుమాస్తాగా కాదు కదా.. కనీసం మా బూట్లు నాకడానికి కూడా నువ్వు పనికి రావు. పోయి.. మీ తాతముత్తాతల్లాగా చెప్పులు కుట్టుకుని పని చేసుకుంటూ బతుకు’’ అంటూ తనపై వ్యాఖ్యలు చేశారని తపస్ డే, మనిష్ సహానీ, రాహుల్ పాటిల్పై శరణ్ ఫిర్యాదు చేశారు. అంతేకాదు..తన కుమారుడి విషయంలో ఎయిర్లైన్స్ వాళ్లు దారుణంగా వ్యవహరించారని.. ఈ విషయాన్ని ఇండిగో ఎయిర్లైన్స్ ఎథిక్స్ కమిటీ, ఆఖరికి ఆ సంస్థ సీీఈవో దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు లేవని అశోక్ మీడియా ముందు వాపోయారు. అంతేకాదు.. తన కొడుకు విధినిర్వహణలో సక్రమంగా ఉన్నప్పటికీ సెలవులు ఇవ్వకుండా, పైగా జీతాల్లో కోతలు పెట్టారని ఆరోపించారాయన. ఘటనపై బీఎన్ఎస్లోని పలు సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. అయితే ఈ ఘటన జరిగింది గురుగ్రామ్(హర్యానా)లోని కార్పొరేట్ ఆఫీస్ పరిధిలో. దీంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన బెంగళూరు పోలీసులు.. గురుగ్రామ్లోని డీఎల్ఎఫ్-1 పీఎస్కు కేసును బదిలీ చేశారు.

కుమార్తె ‘నీట్’ స్కోర్ తగ్గిందని.. విచక్షణ మరచి..
సాంగ్లి: మహారాష్ట్రంలో మరో విద్యాకుసుమం నేలరాలింది. సాంగ్లీ జిల్లాలో జరిగిన ఈ ఉదంతం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కుమార్తెను డాక్టర్గా చూడాలనుకున్న ఒక తండ్రి చేసిన పని అతని కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కుమార్తె మరణానికి ప్రధానోపాధ్యాయుడైన ఆ తండ్రే కారణమంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో మంచి మార్కులు సాధించలేదని తన 17 ఏళ్ల కుమార్తెపై తండ్రి దాడి చేసిన ఉదంతం వెలుగు చూసింది. సాంగ్లి జిల్లాలోని నెల్కరంజి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతిచెందిన విద్యార్ధినిని సాధన భోస్లేగా పోలీసులు గుర్తించారు. ఆమె స్థానికంగా ఉన్న ఒక పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. సాధన తండ్రి ధోండిరామ్ భోస్లే కుమార్తె చదువుతున్న పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా ఉన్నారు.కుమార్తె నీట్ మాక్ టెస్ట్లో తక్కువ మార్కులు సాధించడంతో ఆమెను తండ్రి మందలించారు. అయితే సాధన తండ్రితో వాగ్వాదానికి దిగింది. కుమార్తె మాటలు ధోండిరామ్ భోస్లేకు ఆగ్రహం తెప్పించాయి. వెంటనే ఆయన ఒక కర్రతో కుమార్తెపై తీవ్రంగా దాడి చేశాడు. గాయపడిన సాధనను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా, అలానే వదిలివేశాడు. మర్నాడు కూడా కుమార్తెను పట్టించుకోకుండా, యధావిధిగా తన స్కూలుకు వెళ్లిపోయాడు. ధోండిరామ్ భోస్లే పాఠశాల నుంచి తిరిగి వచ్చేసరికి, ఇంటిలో సాధన అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించాడు. అయితే అక్కడ చికిత్స ప్రారంభించేలోపే సాధన మృతిచెందింది. పోలీసులు నిందితుడైన తండ్రిని అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: రెండేళ్లుగా ‘పహల్గామ్’ ముష్కరులు యాక్టివ్?

Cinema Controversy: పేరులోనే అంతా ఉంది!
ఎల్లలు దాటేసిన భారతీయ సినిమా.. సొంతగడ్డపైనే చిక్కులు ఎదుర్కొంటోంది!. ‘‘ఆ పేరులో ఏముంది లే?’’ అని అనుకోవడానికి ఇప్పుడు లేదు. ఎందుకంటే.. ఆ పేరే ఇప్పుడు సినిమాకు అడ్డం పడుతోంది. జానకీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే సినిమాలో ‘జానకీ’ అనే పేరును మారిస్తేనే రిలీజ్ సర్టిఫికెట్ ఇస్తామంటోంది సెన్సార్ బోర్డు. మాలీవుడ్ స్టార్, బీజేపీ ఎంపీ.. కేంద్ర మంత్రి(సహాయ) సురేష్ గోపి ఈ చిత్రంలో కీ రోల్ పోషించడం ఇక్కడ మరో విశేషం.సినిమాను దేశం అనే బౌండరీని దాటించి.. ఇంటర్నేషనల్ ఆడియొన్స్ను అలరించేందుకు మన ఫిల్మ్మేకర్లు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న రోజులివి. ఫిక్షన్, బోల్డ్, ఒక్కోసారి సామాజిక అంశాలను స్పృశిస్తూ సక్సెస్ అవుతున్నారు. అయితే ఈ మసాలాలను అందరూ మెచ్చడం లేదు. రాజకీయ, మతపరమైన వర్గాల నుంచి ఒక్కోసారి తీవ్ర అభ్యంతరాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అదీ పేర్ల విషయంలోనే కావడం మరో విశేషం. అలాంటి కొన్ని ‘సినిమా కష్టాల’ను ఓసారి గుర్తు చేసుకుందాం.పద్మావత్2017-2018లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన చిత్రం. సంజయ్లీలా భన్సాలీ డైరెక్షన్లో దీపికా పదుకొనే, రణ్ర్ సింగ్, షాహిద్కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హిస్టారికల్ ఫిక్షన్డ్రామా. అయితే కర్ణిసేన నుంచి తీవ్ర అభ్యంతరాలతో ఈ సినిమా విడుదల అనుమానమే అనుకున్నారంతా. చివరకు పద్మావత్గా పేరును మార్చేయడంతో పాటు పలు సీన్లకు కత్తెర వేయడంతో విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది.ఎస్ దుర్గామలయాళంలో 2017లో రిలీజ్ అయిన చిత్రం. అయితే విడుదలకు ముందు ఈ చిత్రం సెక్సీ దుర్గ పేరుతో వివాదంలోకి ఎక్కింది. హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఆ తర్వాతే ఈ పేరును ఎస్ దుర్గాగా మార్చడంతో విడుదలకు అనుమతించారు. రాజ్శ్రీ దేశ్పాండే, కన్నణ్ నాయర్ లీడ్ పాత్రల్లో మతాంతర వివాహంనేపథ్యంతో సనల్ కుమార్ శశిథరన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.సత్యప్రేమ్ కీ కథసమీర్ విద్వాన్స్ డైరెక్షన్లో .. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా 2023లో రిలీజ్ అయిన చిత్రమిది. తొలుత ఈ రొమాంటిక్ లవ్ డ్రామాకు సత్యనారాయణ కీ కథ అనుకున్నారు.అయితే దేవుడి పేరుపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివాదం ముదరముందే పేరును మార్చేసి రిలీజ్ చేశారు.జానకీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళఇది తాజా కాంట్రవర్సీ. మలయాళ సీనియర్ హీరో సురేష్ గోపి ముఖ్యపాత్రలో అనుపమ పరమేశ్వరన్ లీడ్ క్యారెక్టర్లో తెరకెక్కిన చిత్రం ఇది. కోర్టు రూమ్ డ్రామాగా ప్రవీన్ నారాయణన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో లీడ్ పాత్ర దాడికి గురయ్యే బాధితురాలు. జానకీ అంటే సీతాదేవి(శ్రీరాముడి భార్య)కి మరో పేరు అని, భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో పాటు హిందూ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశం ఉందని, కాబట్టి పేరు మారిస్తేనే రిలీజ్ సర్టిఫికెట్ ఇస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) స్పష్టం చేసింది. పైపెచ్చు ఈసినిమాకు ఇదివరకే 13+ సర్టిఫికెట్ను బోర్డు ఇష్యూ చేయడం గమనార్హం. ఇంతేకాదు..రీసెంట్గా ఇలాగే ఓ మలయాళ సినిమాలో హీరోయిన్ పేరును జానకీ నుంచి జయంతిగా మార్చిన తర్వాతే రిలీజ్కు లైన్ క్లియర్ అయ్యిందని కేరళ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జనరల సెక్రటరీ బీ ఉన్నికృష్ణన్ చెబుతున్నారు. అయితే అదేం చిత్రమో పేరును చెప్పేందుకు ఆయన నిరాకరించారు. పై చిత్రాలే కాదు.. ఈ తరహా అభ్యంతరాల వివాదాలతో ార్పులుసంతరించుకున్న చిత్రాలు ఇంకా చాలానే ఉన్నాయి.అక్షయ్కుమార్ లీడ్ రోల్లో లారెన్స్ కాంచన రీమేక్గా 2020లో రిలీజ్ అయిన సినిమా. లక్ష్మీబాంబ్గా తొలుత టైటిల్ ఫిక్స్ చేయగా.. హిందూ సంఘాల అభ్యంతరాలతో లక్ష్మీగా మార్చేశారు. 2013లో సంజయ్లీలా భన్సాలీ డైరెక్షన్లో వచ్చిన రామ్-లీలా.. అభ్యంతరాల తర్వాత గోలియోన్ కీ రాస్లీలా రామ్-లీలాగా టైటిల్ మార్చుకుంది. కిందటి ఏడాది మలయాళంలో రాహుల్ సదాశివన్ డైరెక్షన్లో వచ్చిన భ్రమయుగంలో లీడ్ రోల్ చేసిన సీనియర్ హీరో మమ్ముట్టి పేరు(కుంజామోన్ పోట్టి)పై బ్రహ్మణ సంఘాల(కుంజామోన్ ఇళ్లం అనే వర్గం) నుంచి అభ్యంతరాలు వచ్చాయి. విషయం ఆ రాష్ట్ర హైకోర్టుకు చేరింది. దీంతో విడుదలకు ముందే కొడుమోన్ పోట్టిగా పేరును మార్చేశారు.ఇవేకాదు.. కంగనా రనౌత్ తలైవి, అనుష్క రుద్రమదేవి, రిషబ్ శెట్టి కాంతార, సుదీప్తో తీసిన ది కేరళ స్టోరీ చిత్రాల విషయంలోనూ విడుదలకు ముందే పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే మేకర్ల క్లారిఫికేషన్ కారణంగా ఈ చిత్రాల విడుదలకు పెద్దగా ఆటంకాలు ఎదురు కాలేదు. సెన్సార్ బోర్డు తన కత్తెరకూ పదును పెట్టలేదు. 🎬 సెన్సార్ బోర్డు (CBFC)కు ఏం హక్కు ఉంది?సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) భారత ప్రభుత్వంలోని సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ (Ministry of Information and Broadcasting) పరిధిలో పనిచేస్తుంది. సినిమాటోగ్రాఫ్ చట్టం, 1952 ప్రకారం ఈ బోర్డు ఏర్పాటు చేయబడింది. సినిమా విడుదలకు ముందు CBFC నుండి సర్టిఫికేషన్ పొందడం తప్పనిసరి. ఈ బోర్డు సినిమాలకు U, UA, A, S వంటి సర్టిఫికేట్లను జారీ చేస్తారు.సాధారణంగా.. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కు ఓ సినిమాగానీ, అందులోని పాత్ర పేరు మార్చించేసే చట్టపరమైన అధికారం నేరుగా లేదు. కానీ, తాము సూచించిన మార్పులకు గనుక దర్శన నిర్మాతలు అంగీకరించకపోతే సదరు చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆపే అధికారం మాత్రం ఉంటుంది.🧾 CBFC అధికారాలుపేరు, సన్నివేశాలు, సంభాషణలు ద్వారా జాతిపరమైన లేదంటే మతపరమైన భావోద్వేగాలు దెబ్బతినే అవకాశం ఉందనుకుంటే, వారు సర్టిఫికేట్ ఇవ్వకుండా నిలిపివేయవచ్చు.పై విషయంలో మార్పులకు సిఫార్సు చేయవచ్చు (ఇందులో పాత్ర పేరు, శీర్షిక, సంభాషణలవంటి అంశాలుంటాయి)సర్టిఫికేట్ లేకుండా సినిమా విడుదల చేయటం చట్టవిరుద్ధం, కాబట్టి చాలా సందర్భాల్లో దర్శకులు సూచించిన మార్పులను అంగీకరిస్తారు.🚫 CBFC చేతిలో లేనిది..నేరుగా సినిమాగానీ, క్యారెక్టర్గానీ పేరు మార్చమని ఆదేశించడం. ఎందుకుంటే.. తుది నిర్ణయం ఆ సినిమా దర్శకనిర్మాతలదే.CBFC యొక్క నిర్ణయాన్ని Film Certification Appellate Tribunal (FCAT) లేదంటే కోర్టుల్లో ఆ చిత్ర దర్శకనిర్మాతలు సవాల్ చేయొచ్చు.
ఎన్ఆర్ఐ

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మృతుల కుటుంబాలకు నైటా సంతాపం
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) తీవ్ర సంతాపం ప్రకటించింది. న్యూయార్క్ లో జరిగిన ఓ కార్యక్రమంలో నైటా అధ్యక్షురాలు వాణి అనుగు, కార్యవర్గం, సభ్యులు మృతులకు నివాళులు అర్పించి, మౌనం పాటించారు.ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎన్ఆర్ఐలుగా తమను తీవ్రంగా కలిచివేసిందని వారు అభిప్రాయపడ్డారు. విదేశాల్లో ఉంటున్న భారతీయుల సంఖ్య భారీగా పెరిగిందని, వారంతా భారతదేశం రాకపోకలకు తరచుగా ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించేందుకు ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ఎన్ఆర్ఐల్లో ఆత్మవిశ్వాసం నింపాలంటే భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని నైటా కార్యవర్గం భారత ప్రభుత్వాన్ని కోరింది.

AMA తొలి భారతీయ ప్రెసిడెంట్గా శ్రీనివాస్ ముక్కామల రికార్డ్, ఎవరీ ‘బాబీ’
భారత సంతతికి చెందిన డాక్టర్ ముక్కామల శ్రీనివాస్ (Srinivas Mukkamala) అమెరికా వైద్యసంఘం ( AMA-American Medical Association) తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 179 సంవత్సరాల చరిత్రలో తొలిసారి ఎన్నికైన భారతీయ అధ్యక్షుడిగా శ్రీనివాస్ “బాబీ” ముక్కామల రికార్డు సృష్టించారు. ఇటీవలి AMA వార్షిక సమావేశంలో ఆయన180వ అధ్యక్షుడిగా అధికారికంగా ఎన్నికయ్యారు. ఇది అమెరికా వైద్య చరిత్రలో ఒక మైలురాయి అని అందరూ ప్రశంసిస్తున్నారు.ముక్కామల మిచిగాన్లోని ఫ్లింట్లో అనుభవజ్ఞుడైన ENT స్పెషలిస్ట్. రెండు దశాబ్దాలకు పైగా క్లినికల్ అనుభవం ఉన్న నిపుణుడు. ఆంధ్రప్రదేశ్ నుండి వలస వచ్చిన తల్లిదండ్రులకు 1972లో జన్మించారు. మెక్లారెన్ ఫ్లింట్ , హర్లీ మెడికల్ సెంటర్ వంటి అనేక ప్రముఖ ఆసుపత్రులతో ఆయనకు సంబంధం ఉంది. ఆయన మిచిగాన్ విశ్వవిద్యాలయ మెడిసిన్లో పట్టభద్రుడు. ఓటోలారిన్జాలజీ రంగంలో ఆయనకు మంచి పేరు ఉంది.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!స్వయంగా కేన్సర్ సర్వైవర్గత సంవత్సరం, ముక్కామలకు మెదడులోని టెంపోరల్ లోబ్లో 8-సెంటీమీటర్ల కణితి కనిపించింది. రోగ నిర్ధారణ జరిగిన మూడు వారాల తర్వాత హై-రిస్క్ సర్జరీ చేయించుకున్నారు. ఈ ఆపరేషన్లో 90 శాతం కణితిని విజయవంతంగా తొలగించారు.ఆరోగ్య సంరక్షణ పట్ల అతని నిబద్ధతను బలోపేతం చేసేలా తాజా నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనకు ప్రపంచ స్థాయి చికిత్స అందినప్పటీ లక్షలాది మందికి ఇలాంటి చికిత్సలో ఆలస్యం జరుగుతోందనీ, ఆర్థిక పరిమితులు, అనిశ్చితులను ఎదుర్కొంటున్నారని ముక్కామలకు హైలైట్ చేశారు. అలాగే చాలా మంది రోగులు తమ బీమా కవరేజీ వస్తుందా, లేదా మందులకు ఎంత ఖర్చవుతుంది, ఔషధానికి ,నిపుణుడిని చూడటానికి ఎంతకాలం వేచి ఉండాలో అనే భయాలు వెంటాడుతున్నాయని అన్నారు. ఈ అనుభవం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తన దృష్టికోణాన్ని పూర్తిగా మార్చిందని శ్రీనివాస్ వెల్లడించారు. వైద్యుల హక్కులు, వనరుల కోసం పోరాడే వేదికగాఆధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా ఆరోగ్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు మార్గం వేయనుందనీ, సమగ్ర ఆరోగ్య సంరక్షణకు, సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తూ AMA ప్రాధాన్యతను పెంచుతుందని హామీ ఇచ్చారు. అలాగే AMA ప్రజారోగ్యంలో విస్తృతమైన సంస్కరణల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ముక్కామల అధ్యక్ష పదవిని చేపట్టడం విశేషం. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాల ప్రమాదాలు, సరైన పోషకాహారం ప్రాముఖ్యత గురించిఅవగాహన పెంచడానికి అసోసియేషన్ ఇటీవల ఒక విధానాన్ని స్వీకరించింది.ఇదీ చదవండి: అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్గతంలో ఏఎంఏ ఫౌండేషన్ నుంచి ఎక్సలెన్స్ ఇన్ మెడిసిన్ లీడర్షిప్ అవార్డు (Excellence in Medicine Leadership Award )ను ఆయన అందుకున్నారు. 2009లో ఏఎంఏ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ పబ్లిక్ హెల్త్కు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2017 నుంచి 2021 వరకు ఏఎంఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడిగా వ్యవహరించారు. డాక్టర్ బాబీ తల్లిదండ్రులు 1970ల్లో ఇండియా నుంచి అమెరికాకు వలస వెళ్లారు.

డెట్రాయిట్లో 'తెలుగు పల్లెవంట'
అమెరికాలోని డెట్రాయిట్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 350కి పైగా కుటుంబాలు ఫార్మింగ్టన్ హిల్స్లోని శియావాసీ పార్క్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) డెట్రాయిట్ ఛాప్టర్ ఆధ్వర్యంలో పల్లెవంట కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, గేమ్స్, సామూహిక చర్చలు వంటి ఎన్నో ఆసక్తికర కార్యకలాపాల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకూ పాల్గొని ఉల్లాసంగా గడిపారు. పల్లెవంటలో వడ్డించిన తెలంగాణ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బగారా అన్నం, చికెన్, పాలకూర, మామిడికాయ పప్పు, పచ్చిపులుసు, మటన్, రోకటి పచ్చళ్లు, పెరుగన్నం, బీట్రూట్ రైతా, వెరైటీ స్నాక్స్, మిఠాయిలు భోజన ప్రియులకు రుచికరమైన విందును అందించాయి. రంగురంగుల వేసవి దుస్తుల్లో వచ్చిన మహిళలు, పిల్లలు పార్క్ను పూలతోటలా మార్చారు. యువతులు, మహిళల కోసం అందమైన బ్యూటీ, ఫ్యాషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రవాసుల్లో ఐక్యతా భావనను, ఆనందాన్ని పెంపొందించేలా వేడుక నిర్వహించినట్లు జీటీఏ యూఎస్ఏ అధ్యక్షుడు ప్రవీణ్ కేసిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం కేవలం ఉత్సవంగా మాత్రమే కాదు, విలువలు, పరస్పర గౌరవం, ఐక్యతను కలిగిస్తాయన్నారు. (చదవండి: పెళ్లి బరాత్తో దద్దరిల్లిన వాల్స్ట్రీట్..! వీడియో వైరల్)

అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.అమెరికాలోని వాల్మార్ట్లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్ ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.
క్రైమ్

జీడిమెట్ల: తల్లిని కడతేర్చిన కూతురు.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, మేడ్చల్: నవమాసాలు మోసి కనిపెంచిన తల్లినే కడతేర్చింది ఓ బాలిక.. కన్న పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ.. తల్లి ప్రేమను మరిచిది. 18 ఏళ్లు నిండక ముందే ప్రియుడితో కలిసి తల్లి పాలిట యమపాశం గా మారింది. జీడిమెట్ల పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రియుడితో కలిసి కన్నతల్లిని కూతురు హత్య చేసింది. ప్రేమ వ్యవహారంలో మందలించిందన్న కోపంతో తన ప్రియుడు శివ(19), అతని తమ్ముడు యశ్వంత్(18)తో కలిసి కూతురు తేజశ్రీ(16) కన్నతల్లిపై కిరాతకానికి పాల్పడింది.కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలు అంజలి చాకలి ఐలమ్మ ముని మనవరాలు. మహబూబాబాద్ చెందిన అంజలి 20 ఏళ్లుగా జిడీమెట్లలో నివాసం ఉంటున్నారు. ఆమె మహిళా మండలిలో కూడా పనిచేస్తోంది. కాగా, ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని నెలల క్రితమే బాలికకు ఇన్స్టాలో శివ పరిచయమయ్యాడు. పదో తరగతికే ప్రేమ ఏంటని తల్లి అంజలి మందలించింది. వారం క్రితం శివతో ఆ బాలిక వెళ్లిపోయింది. దీంతో పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం బాలిక ఇంటికి తిరిగి వచ్చింది.తల్లి అడ్డు తొలగించునేందుకు ప్రియడితో కలిసి స్కెచ్ వేసింది. నిన్న(సోమవారం) సాయంత్రం నల్లగొండ నుంచి ప్రియుడు శివను రప్పించింది. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేశాడు. బెడ్షీట్తో అంజలి ముఖాన్ని శివ కప్పగా.. సుత్తితో తల్లి అంజలిపై కూతురు దాడి చేసింది. శివ తమ్ముడు యశ్వంత్ కూడా కత్తితో పీక కోశాడు. తల్లి హత్య తర్వాత కుర్చీలో నుంచి పడిపోయిందని అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ బాలిక.. తన పెద్దమ్మకు ఫోన్ చేసి అమ్మ కుర్చీ నుంచి పడిపోయిందని.. గాయాలయ్యాయంటూ చెప్పుకొచ్చింది. తన తల్లి మృతిపై బాలిక తేజశ్రీ చెల్లెలు కన్నీరుమున్నీరైంది. బయటకెళ్లి వచ్చేసరికి అమ్మ రక్తపు మడుగుల్లో ఉందని పేర్కొంది. పోలీసులకు ఫోన్ చేసి.. అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్దామని చెప్పినా కూడా అక్క వినలేదని పేర్కొంది.

కుటుంబం ఆత్మాహుతికి యత్నం
హుస్నాబాద్ రూరల్: తండ్రి పెడుతున్న మానసిక క్షోభతో ఓ కుటుంబం ఆత్మాహుతికి యత్నించింది. ఈ సంఘటన హుస్నాబాద్ మండలం కిషన్నగర్లో సోమవారం చోటు చేసుకుంది. జాగిరి సాయి దంపతులు కిషన్నగర్లో హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అతని తల్లి, సోదరుడు కూడా సాయి దగ్గరే ఉంటున్నారు. అయితే తండ్రి రెండో పెళ్లి చేసుకొని హనుమకొండలో నివాసం ఉంటున్నాడు. అప్పటి నుంచి కుటుంబంలో తగాదాలు ఎక్కువయ్యాయి. తమ తండ్రి తమకు తెలియకుండానే ఇంటి స్థలం మరొకరికి విక్రయించారని, దీంతో తమకు దారి లేకుండా పోయిందని సాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నాడు. తండ్రి మానసిక క్షోభకు గురి చేస్తుండటంతో జీవితంపై విరక్తి చెందారు. హోటల్పై పెట్రోల్ పోసి నలుగురు కుటుంబ సభ్యులు అందులోనే ఉండి నిప్పు పెట్టుకున్నారు. చుట్టుపక్కలవారు మంటలను గమనించి వారిని కాపాడారు. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. సమాచారం అందుకున్న అగి్నమాపక సిబ్బంది మంటలు ఆర్పి ప్రమాదాన్ని నివారించారు. దీనిపై ఎస్సై మహేశ్ను వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు. ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.

ఒకే వ్యక్తితో తల్లీ, కూతురు వివాహేతర సంబంధం..!
గద్వాల క్రైం: మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహాలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహం జరిగినప్పటి నుంచి భర్త తేజేశ్వర్ రాకపోకలపై నిఘా పెట్టి దారుణహత్యకు భార్య సహస్రనే పూర్తి పథకం రచించినట్టు తెలుస్తోంది. కర్నూలుకు చెందిన ఓ బ్యాంకు అధికారితో ఉన్న సన్నిహిత సంబంధం పెళ్లయిన రెండురోజులకే తెలియగా, సహస్రను తేజేశ్వర్ మందలించినట్టు తెలిసింది. దీంతో తమ బాగోతం ఎక్కడ బయట పడుతుందోనని బ్యాంకు ఉద్యోగికి జరిగిన విషయం చేరవేసింది. ఆయన సూచన మేరకు భర్త బైక్కు జీపీఎస్ ట్రాకర్ను తన దూరపు బంధువుతో అమర్చేలా చేసింది. సుపారీ తీసుకున్న ముఠా సభ్యులు గద్వాలలో ఉన్న ఇన్ఫార్మర్ ద్వారా తేజేశ్వర్పై నిఘా పెట్టారు. జీపీఎస్ ద్వారా ఎక్కడ ఉంటున్నాడో గుర్తించి మూడు దఫాలుగా గద్వాల శివారులో హత్య చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో సహస్ర, ఆ బ్యాంకు ఉద్యోగి ముఠా సభ్యులను ఎగతాళి చేసి, హేళనగా మాట్లాడారు. దీంతో ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్న సుపారీ గ్యాంగ్ ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఈ నెల 17వ తేదీన ఉదయం వారి కారులో తేజేశ్వర్ను ఎక్కించుకొని జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వ్యవసాయేతర భూములు చూసేందుకు వెళ్లారు. ఆ కారులోనే కత్తితో పొడిచి హత్య చేసి నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం శివారులో మృతదేహాన్ని పడేశారు. కేసు విచారణ వేగవంతంతేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హత్యకు సుపారీ ఇచ్చిందెవరు..ఎంతమంది వచ్చారు.. వారు వెళ్లేందుకు వినియోగించిన వాహనం.. అసలు తేజేశ్వర్ను వారికి పరిచయం చేసిందెవరు.. ఇలా అనేక అంశాలపై విచారణ అధికారులు పలు బృందాలుగా విడిపోయి అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సీన్ రీ కన్స్ట్రక్షన్తేజేశ్వర్ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లిన ఘటన, ప్రయాణించిన ప్రదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తుల సమాచారం మేరకు సీన్ రీ కన్స్ట్రక్షన్ ప్రక్రియను సోమవారం సీఐ శ్రీను, ఎస్ఐలు కల్యాణ్కుమార్, మల్లేశ్, శ్రీకాంత్ పరిశీలించారు. గద్వాల నుంచి సంగాల ఔటర్ రింగ్ రోడ్డు అక్కడి నుంచి పూడూరు, ఇటిక్యాల, మొగిల్రావుల చెరువు శివారు, పెబ్బేర్, బీచుపల్లి ఫ్లై ఓవర్, తుంగభద్ర ఫ్లైఓవర్ బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో పరిశీలించారు. గద్వాల మండలం పూడూరు శివారులోనే తేజేశ్వర్ను హత్య చేసినట్టు తెలుస్తోంది. అయితే మృతదేహాన్ని ఓ గోనెసంచిలో చుట్టి కారు డిక్కీలో పెట్టి ఎవరూ లేనిచోట పడేయాలని భావించినట్టు తెలిసింది. అయితే అలా సాధ్యం కాకపోవడంతో నంద్యాల జిల్లాలోని పాణ్యం మండలం పిన్నాపురం శివారులో అర్ధరాత్రి పడేసి కారులోంచి తప్పించుకున్నట్టు అనుమానిస్తున్నారు. హత్యకు ముందే పరిచయం.. తేజేశ్వర్ భార్య సహస్ర తల్లి సుజాత పుట్టినిల్లు గద్వాలలోని జమిచేడ్ కాగా, కర్నూలుకు చెందిన రామకృష్ణతో వివాహం అనంతరం కల్లూరుకు వెళ్లారు. సుజాత భర్త రామకృష్ణ చనిపోవడంతో కర్నూలు జిల్లా కేంద్రంలో ఓ బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తోంది. అక్కడే బ్యాంకు ఉద్యోగితో పరిచయం పెరిగి, చనువుగా ఉండేది. కూతురు సహస్ర సైతం సదరు ఉద్యోగితో చనువుగా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ సందర్భాల్లో సహస్ర తన తల్లితో కలిసి జమిచేడ్కు వచి్చన క్రమంలో దూరపు బంధువు ద్వారా తేజేశ్వర్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబ సభ్యులతో వివాహానికి సిద్ధమయ్యారు. అయితే బ్యాంకు ఉద్యోగికి ఈ విషయం తెలిసి వ్యతిరేకించడంతో తేజేశ్వర్తో నిశ్చితార్థం రద్దు చేసుకుంది. మరోవైపు బ్యాంకు ఉద్యోగికి ముందే మరో మహిళతో వివాహం కావడం, బ్యాంకు ఉద్యోగి భార్య కట్టడి చేయడంతో సమస్య అక్కడితో ఆగిపోయిందని తెలిసింది. ఆ తర్వాత సహస్ర.. తేజేశ్వర్ను మళ్లీ కలిసి పెళ్లికి డబ్బులు లేకపోవడంతో నిరాకరించినట్టు నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో గత నెల 18న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరిగినట్టు పోలీసులు గుర్తించారు.పోలీసుల అదుపులో అనుమానితులు?పోలీసులు ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇందులో సహస్ర, సుజాత, బ్యాంకు ఉద్యోగి, హత్యకు పాల్పడిన ముగ్గురు, ఒక ఇన్ఫార్మర్ ఉన్నారు. ఈ ఘటనపై గద్వాల సీఐ శ్రీనుతో మాట్లాడగా.. కేసుకు సంబంధించిన అన్ని విషయాలను ఇప్పటికే గుర్తించామన్నారు. హత్యకు పాల్పడిన నిందితుల వివరాలు తెలియాల్సి ఉందని.. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించామని వివరించారు. తాజాగా రీ కన్స్ట్రక్షన్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో పరిశీలించి గద్వాల మండల శివారులోనే తేజేశ్వర్ను హత్య చేసినట్టు గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుల కోసం ఓ బృందం కర్నూలు జిల్లాలో గాలిస్తున్నట్టు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న వెంటనే పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.

బాలికపై వేధింపులు.. ఎనిమిది మందిపై పోక్సో కేసు
గుడిహత్నూర్: సోషల్ మీడియాలో స్నేహం పేరుతో ఓ బాలికను వేధింపులకు గురిచేసిన కేసులో ఎనిమిది మందిని శనివారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికతో మండల కేంద్రానికి చెందిన ఓ బాలుడు పరిచయం పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఫోన్లో చాటింగ్ చేస్తున్నాడు. ఒకరోజు తనకు న్యూడ్ వీడియో కాల్ చేయాలని, లేదంటే చాటింగ్ అందరికీ తెలిసేలా చేస్తానని బెదిరించాడు. ఆ బాలిక ఒకరోజు న్యూడ్ కాల్చేసి మాట్లాడుతుండగా వీడియోను స్క్రీన్ రికార్డు చేసి తన ఏడుగురు స్నేహితులకు పంపించాడు. వారు వీడియోను అడ్డం పెట్టుకుని బాలికను మానసికంగా వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. ఓ యువకుడు ఏకంగా ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో బాలిక తన కుటుంబ సభ్యులకు విషయం తెలిపింది. బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో షీటీం పోలీసులు ఎనిమిది మందిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారని తెలిపారు. ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ వివరించారు.