Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today

ప్రధాన వార్తలు

Iran breaks ceasefire with missile attack on Israel1
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. కొన‌సాగుతున్న యుద్ధం?

జెరూసలేం: ప‌శ్చిమాశియాలో యుద్ధం పున‌ప్రారంభమైన‌ట్లు తెలుస్తోంది. కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి ఇరాన్ తూట్లు పొడిచింది. ఇజ్రాయెల్‌పై దాడుల‌కు తెగ‌బ‌డింది. దీంతో ఇజ్రాయెల్ కాల్పుల్ని తిప్పికొట్టింది. ఇరాన్‌పై ప్ర‌తిదాడుల‌కు దిగింది. దీంతో గంట‌ల వ్య‌వ‌ధిలో ఇరు దేశాల మ‌ధ్య యుద్ధం పున‌ప్రారంభమైంది.ఈ క్ర‌మంలో ఇరాన్‌కు ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ప్ర‌తి దాడుల‌కు దిగింద‌ని హెచ్చ‌రించింది. అయితే, తాము ఎలాంటి కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం చేయలేద‌ని ఇరాన్ చెప్పింది. అయిన‌ప్ప‌టికీ ఇరుదేశాల మ‌ధ్య కాల్పుల మోత మోగూతూనే ఉంది.

Sensational Facts Come To Light In The Jeedimetla Case2
జీడిమెట్ల కేసులో విస్తుపోయే నిజాలు

సాక్షి, హైదరాబాద్‌: జీడిమెట్ల హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘‘మా అక్కే మా అమ్మను చంపింది’’ అని తేజశ్రీ చెల్లి తెలిపింది. ‘‘ట్యూషన్‌ నుంచి వస్తుంటే నన్ను మా అక్క గల్లీలోనే ఆపింది. అమ్మ ఒక ఆంటీని తీసుకుని రమ్మంది.. పదా వెళ్దామంటూ నన్ను తీసుకెళ్లింది. 20 నిమిషాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాం. అప్పటికే కిచెన్‌లో అమ్మ స్పృహ లేకుండా పడి ఉంది. అమ్మను లేపే ప్రయత్నం చేశా....అమ్మను నేను చూసుకుంటా నువ్వు బయటకు వెళ్లు అంటూ అక్క చెప్పింది. చుట్టూ పక్కల ఎవరికీ చెప్పవద్దని చెప్పింది.. కానీ అక్క మాత్రం అమ్మ దగ్గరికి కూడా రాలేదు. అమ్మ చనిపోయింది లేపి వేస్ట్‌ అని అక్క చెప్పింది. మా అమ్మ ఇంకా చనిపోలేదని తెలుసుకుని.. శివకు ఫోన్‌ చేసింది. మళ్లీ శివ, యశ్వంత్‌ వచ్చి సుత్తితో అమ్మ తలపై కొట్టాడు’’ అని తేజశ్రీ చెల్లి తెలిపింది.ప్రేమకు అడ్డు చెప్పిందనే కారణంతో కన్నతల్లిని పదో తరగతి చదువుతున్న కుమార్తె తేజశ్రీ.. ప్రియుడితో కలిసి హతమార్చిన సంగతి తెలిసిందే. బాలికకు కొన్ని నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడు పరిచయం కాగా.. అతడితో ప్రేమ వ్యవహారం నడిచింది. దీంతో ఆ బాలిక ఇంటి నుంచి వెళ్లి పోవడంతో తన కుమార్తె కనిపించడం లేదని తల్లి జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ బాలిక మూడు రోజుల క్రితం తిరిగి ఇంటికి వచ్చింది.ఇదిలా ఉండగా.. తల్లి అడ్డు తొలగించునేందుకు ప్రియడితో కలిసి స్కెచ్‌ వేసింది. నిన్న(సోమవారం) సాయంత్రం నల్లగొండ నుంచి ప్రియుడు శివను రప్పించింది. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేశాడు. బెడ్‌షీట్‌తో అంజలి ముఖాన్ని శివ కప్పగా.. సుత్తితో తల్లి అంజలిపై కూతురు దాడి చేసింది. శివ తమ్ముడు యశ్వంత్‌ కూడా కత్తితో పీక కోశాడు.

Rishab Pant handed demerit point for showing dissent to umpire, admits to offence3
రిషబ్‌ పంత్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ..

టీమిండియా స్టార్‌ వికెట్‌ ​కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) ఊహించని షాకిచ్చింది. లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అంపైర్‌తో వాగ్వదం దిగినందుకు గానూ పంత్‌కు ఓ డిమెరిట్‌ పాయింట్‌ ఐసీసీ విధించింది.ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8ని ఉల్లంఘించనందుకు ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. గత 24 నెలలలో ఇదే తొలి తప్పిదం అయినందున కేవలం ఒక డీమెరిట్‌ పాయింట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ సరిపెట్టింది.అసలేమి జరిగిందంటే?ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 61 ఓవర్‌లో బంతిని మార్చమని ఫీల్డ్‌ అంపైర్‌ పాల్ రీఫెల్‌పై పంత్‌ ఒత్తిడి తీసుకొచ్చాడు. బంతి కండీషన్‌ బాగోలేదని కొత్త బంతిని తీసుకురావాలని పంత్‌ సూచించాడు. కానీ ఫీల్డ్‌ అంపైర్‌లు బంతిని పరిశీలించి, మార్చాల్సిన అవసరంలేదంటూ అదే బాల్‌ను తిరిగి పంత్‌కు ఇచ్చాడు.ఈ క్రమంలో సహనం కోల్పోయిన పంత్‌.. బంతిని నేలకేసి బలంగా కొట్టాడు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్‌కు ఫిర్యాదు చేశారు. పంత్‌ కూడా తన తప్పును అంగీకరించాడు. ఈ నేపథ్యంలోనే పంత్‌పై ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ ఈ చర్యలు తీసుకున్నారు.శతక్కొట్టిన పంత్‌..కాగా ఈ మ్యాచ్‌లో పంత్‌ సెంచరీలు మోత మోగించాడు. రెండో ఇన్నింగ్స్‌లలోనూ శతకాలు బాది సంచలనం సృష్టించాడు. ఓ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన తొలి భారత వికెట్‌ కీపర్‌గా రికార్డులకెక్కాడు. తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేసిన పంత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు. కాగా తొలి టెస్టులో విజయంపై భారత్‌ కన్నేసింది.ఇంగ్లండ్‌ ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని గిల్‌ సేన ఉంచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఆఖరి రోజు ఆటలో ఎవరు మెరుగ్గా రాణిస్తే వారిదే విజయం.చదవండి: రింకూ సింగ్‌- ఎంపీ ప్రియా సరోజ్‌ పెళ్లి వాయిదా!.. కారణం ఇదే!

Congress MP Shashi Tharoor on BJP Join Reports4
‘ఇక బీజేపీలో చేరికా?’.. కుండబద్ధలు కొట్టేసిన శశిథరూర్‌

న్యూఢిల్లీ: పీయూష్ గోయల్‌తో సెల్ఫీ దిగడం, ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ను ఆకాశానికి ఎత్తడం, భారత ప్రధాని నరేంద్ర మోదీని పొగడడం, అదే తరుణంలో కాంగ్రెస్‌తో విభేదాలున్నాయని అంగీకరించడం.. ఇవన్నీ వేటికి సంకేతాలుగా భావించొచ్చు!. ఇదే విషయాన్ని తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ వద్ద ప్రస్తావించగా.. ఆయన చిరునవ్వుతో అదేం లేదంటున్నారు. తాజాగా .. సోమవారం(జూన్‌ 23న) The Hindu పత్రికలో శశిథరూర్‌ రాసిన ఓ వ్యాసం పబ్లిష్‌ అయ్యింది. ఆపరేషన్ సిందూర్‌.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విదేశాంగ ప్రచారం భారతదేశ ఐక్యతను, సంకల్పాన్ని సూచించిందని ఆ కథనంలో థరూర్‌ రాశారు. ఈ వ్యాసాన్ని ప్రధానమంత్రి కార్యాలయం కూడా షేర్ చేయగా.. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ స్పందిస్తూ ‘‘శశిథరూర్ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లోని లోపాలను.. ఆ పార్టీలోని విభేదాలను బహిర్గతం చేశాయి’’ అని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ బీజేపీలో చేరికకు సంకేతాలుగా భావించొచ్చా? అని మంగళవారం ఎదురైన ప్రశ్నకు కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ స్పందించారు. ఇవేవీ నేను బీజేపీలో చేరతానన్న సంకేతం కాదని స్పష్టత ఇచ్చారాయన. ‘‘విదేశాంగ మిషన్‌ విజయాన్ని మాత్రమే నేను ఆ వ్యాసంలో ప్రస్తావించా. ఇది అన్ని పార్టీల ఐక్యతను ప్రతిబింబించే విషయం మాత్రమే’’ అని అన్నారాయన. "ప్రధాని మోదీ చొరవతో.. ఇతర దేశాలతో భారత్‌ సంబంధాలు మెరుగుపడ్డాయి. అయితే ఇది బీజేపీనో, కాంగ్రెస్‌ తీసుకొచ్చిన విదేశాంగ విధానం కాదు. ఇది భారతదేశ విదేశాంగ విధానం. సుమారు 11 ఏళ్ల కిందట పార్లమెంట్‌లో విదేశాంగ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా ఉన్నప్పుడు కూడా ఇదే విషయం చెప్పాను. అంత మాత్రాన నేను ప్రధాని మోదీ పార్టీలో చేరతానని కాదు. ఇది జాతీయ సమైక్యతకు సంబంధించిన ప్రకటన మాత్రమే’’ అని కుండబద్ధలు కొట్టారాయన. అంతకుముందు.. కాంగ్రెస్‌ అధిష్టానంతో తనకు కొన్ని విషయాల్లో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని, అయితే అవి నాలుగు గోడల మధ్య చర్చించుకుంటే పరిష్కారం అయ్యే విషయాలేనని, వాటి గురించి సమయం వచ్చినప్పుడు చెబుతానని థరూర్‌ మీడియా ముఖంగా ప్రకటన చేశారు.‘‘ గత నాలుగేళ్లుగా కాంగ్రెస్‌ కార్యకర్తలు నా విజయంలో కీలక పాత్ర పోషించారు. నేను ఇప్పటికీ కాంగ్రెస్‌కు విదేయుడినే. పార్టీకి అవసరమైతే పెద్ద పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇతర పార్టీలో చేరే ఆలోచన ఏమాత్రం లేదు’’ అని ఆ సమయంలో అన్నారయన. అలాగే, తాను ప్రజాస్వామ్యవాదిగా, మతతత్వానికి వ్యతిరేకంగా, సామాజిక న్యాయాన్ని నమ్మే వ్యక్తినంటూ గతంలోనూ ఆయన చాలాసార్లు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుబడుతోంది. అయితే ఆ పార్టీ సీనియర్‌ సభ్యులు థరూర్‌ మాత్రం అందుకు భిన్నంగా ఆకాశానికి ఎత్తుతున్నారు. అలాగే.. ట్రంప్‌ మధ్యవర్తిత్వం ప్రకటన విషయంలో కాంగ్రెస్‌ లైన్‌కు భిన్నంగా థరూర్‌ వ్యవహరించడమూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే థరూర్‌ తాజా వ్యాఖ్యలతో ఆయన బీజేపీలో చేరతారన్న ఊహాగానాలకు తాత్కాలికంగా తెరపడినట్లయ్యింది.

Rinku Singh Wedding With Priya Saroj Postponed Reason Is: Report5
రింకూ సింగ్‌- ఎంపీ ప్రియా సరోజ్‌ పెళ్లి వాయిదా!.. కారణం?

భారత స్టార్‌ క్రికెటర్‌ రింకూ సింగ్‌ (Rinku Singh)- లోక్‌సభ ఎంపీ ప్రియా సరోజ్‌ (Priya Saroj)ల పెళ్లి వాయిదా పడినట్లు సమాచారం. ఈ ఏడాది జరగాల్సిన వీరి వివాహం (Wedding Postoponed) వచ్చే సంవత్సరంలో జరుగనున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR)కు ప్రాతినిథ్యం వహిస్తూ వెలుగులోకి వచ్చాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకూ సింగ్‌.గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదిన అతడు.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో 2023లో ఐర్లాండ్‌తో టీ20 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. నయా ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. అదే ఏడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు.ఇప్పటి వరకు భారత్‌ తరఫున 33 టీ20లు, 2 వన్డే మ్యాచ్‌లు ఆడిన రింకూ సింగ్‌.. ఆయా ఫార్మాట్లలో 339, 41 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్‌ ఇప్పటికి 58 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ కేకేఆర్‌ స్టార్‌.. 1099 రన్స్‌ చేశాడు. ఇందులో నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి.ఎంపీతో ప్రేమలో రింకూనిరుపేద కుటుంబం నుంచి వచ్చి స్టార్‌ క్రికెటర్‌గా ఎదిగిన రింకూ.. కెరీర్‌ పరంగా నిలదొక్కుకున్నాడు. ఇటీవలే వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు కూడా సిద్ధపడ్డాడు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారగా.. ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ ఏడాది జూన్‌ 8న వీరి నిశ్చితార్థం జరిగింది. మూడేళ్లుగా ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నామంటూ రింకూ- ప్రియా తమ ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.జూన్‌ 8న నిశ్చితార్థంఇక లక్నోలోని ఓ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో రింకూ- ప్రియా ఉంగరాలు మార్చుకున్నారు. సమాజ్‌వాదీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌తో పాటు జయా బచ్చన్‌, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా, టీమిండియా వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తదితరులు వీరి ఎంగేజ్‌మెంట్‌కు హాజరయ్యారు.ఈ క్రమంలో నవంబరు 18న తాజ్‌ హోటల్లో పెళ్లి వేడుకను జరిపేందుకు పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు. అయితే, అమర్‌ ఉజాలా న్యూస్‌పేపర్‌ కథనం ప్రకారం.. రింకూ- ప్రియాల వివాహం వాయిదా పడినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరుగనుందని సమాచారం. కారణం ఇదే?టీమిండియా క్రికెటర్‌గా రింకూ బిజీ షెడ్యూల్‌ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ ఏడాది నవంబరులో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. నవంబరు 14- డిసెంబరు 19 వరకు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.చదవండి: పంత్ సెంచరీలపై అలా.. కేఎల్‌ రాహుల్‌ శతకంపై ఇలా! గోయెంకా పోస్ట్‌ వైరల్‌

LPU Student Secures Record Breaking Rs 2 5 Crore Placement Offer6
ఐఐటీలకు ధీటుగా ఎల్‌పీయూ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

భారతదేశంలో ఇంజినీరింగ్ ప్లేస్‌మెంట్ల విషయానికి వస్తే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎప్పటి నుంచో బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. అందుకు ఏమాత్రం తీసిపోకుండా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)లో ఇటీవలి ఫ్లేస్‌మెంట్‌ ఫలితాలు కీలకంగా మారుతున్నాయి. ఎల్‌పీయూ విద్యార్థులు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల కంటే ప్రత్యర్థి సంస్థలు, కొన్ని సందర్భాల్లో వారి కంటే అధిక ఆఫర్లతో ఉద్యోగం సాధిస్తున్నారు.ఎల్‌పీయూలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీ నుంచి ఏడాదికి రూ.2.5 కోట్ల డొమెస్టిక్ ప్యాకేజీని పొందారు. ఈ ఏడాది భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇంజినీరింగ్ విద్యార్థికి అందించే అత్యధిక ప్యాకేజీల్లో ఇది ఒకటి.ఎల్‌పీయూ ప్లేస్‌మెంట్‌ జోరు అక్కడితో ఆగిపోలేదు. ఈసీఈ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డికి ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థ నుంచి రూ.1.03 కోట్ల అంతర్జాతీయ ఆఫర్ లభించింది. ఈ విజయాలు అధిక నైపుణ్యం కలిగిన ఇంజినీరింగ్ ప్రతిభను కోరుకునే టాప్ రిక్రూటర్లకు గమ్యస్థానంగా నిలుస్తున్నాయి. ఇవి ఎల్‌పీయూకు పెరుగుతున్న ఖ్యాతిని నొక్కిచెబుతున్నాయి.‘ఈ విజయాలు అత్యున్నత స్థాయిలో పరిశ్రమ పోటీని తట్టుకొని సిద్ధంగా ఉండే గ్రాడ్యుయేట్లను అందించడంలో ఎల్‌పీయూ కట్టబడి ఉంది’ అని ఎల్‌పీయూ కెరీర్ సర్వీసెస్ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.ఆకట్టుకునే ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌తో ఆకర్షణీయ వేతనాలుఆకట్టుకునే పేస్కేల్‌తో భారీ ఎల్‌పీయూ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్ ఆకర్షిస్తోంది. ఎల్‌పీయూ గ్రాడ్యుయేట్లకు పరిశ్రమలో ఉన్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో విద్యార్థులకు మొత్తం 7,204 జాబ్ ఆఫర్లు అందాయి. 1,602 మంది విద్యార్థులకు బహుళ ఉద్యోగ ఆఫర్లు లభించడం వారి ఉద్యోగ సామర్థ్యాన్ని మరింత పెంచింది. టాప్ 25% విద్యార్థుల సగటు వేతన ప్యాకేజీ ఏడాదికి రూ.10.23 లక్షలుగా ఉంది. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సర్వీస్ నౌ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు క్యాంపస్‌ను సందర్శించిన టాప్ రిక్రూటర్లలో ఉన్నాయి. బీటెక్ ఈసీఈ విద్యార్థి ఆదిరెడ్డి వాసు ఏడు ఉద్యోగావకాశాలు సాధించి సంస్థాగత రికార్డు నెలకొల్పాడు.గ్లోబల్‌గా అధిక ప్యాకేజీ ఆకర్షిస్తున్న నైపుణ్యాలుసైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌ వంటి అత్యాధునిక రంగాల్లో అసాధారణ సాంకేతిక, విశ్లేషణాత్మక నైపుణ్యం అవసరమయ్యే డొమైన్లలో విద్యార్థులు అత్యంత డిమాండ్ ఉన్న ఉద్యోగాలు పొందుతున్నారని ఎల్‌పీయూ తాజా ప్లేస్‌మెంట్‌ డేటా పేర్కొంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు అద్భుతమైన ఆఫర్లు ఇచ్చాయి. మైక్రోసాఫ్ట్ అత్యధిక ప్యాకేజీ ఏటా రూ.52.20 లక్షలు, అమెజాన్ రూ.46.94 లక్షలు అందించాయి. ఇది విశ్వవిద్యాలయంలోని ప్రతిభను ప్రతిబింబిస్తుంది.పరిశ్రమ దిగ్గజాల నుంచి భారీగా నియామకాలుఎల్‌పీయూ పరిశ్రమ భాగస్వామ్యాలు గ్లోబల్‌గా విస్తరించాయి. అన్ని విభాగాల్లో విద్యార్థుల ఉపాధి పట్ల లోతైన నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయి. క్యాప్ జెమినీ, మైండ్ ట్రీ, కాగ్నిజెంట్, యాక్సెంచర్, టీసీఎస్ వంటి టాప్ టైర్ రిక్రూటర్లు ఎల్‌పీయూ విద్యార్థులకు వందలాది ఉద్యోగాలను ఆఫర్ చేయగా, క్యాప్ జెమినీ 700 మందికి పైగా, మైండ్ ట్రీ 420+, కాగ్నిజెంట్ 400+, యాక్సెంచర్, టీసీఎస్ రెండూ 250+ విద్యార్థులను చేర్చుకున్నాయి. ఈ ఆకట్టుకునే ప్లేస్‌మెంట్‌ పనితీరు వ్యక్తిగత విజయగాథల కంటే కూడా పరిశ్రమ నిమగ్నతకు, విద్యార్థుల సంసిద్ధతకు ఎల్‌పీయూ క్రమబద్ధమైన విధానాన్ని హైలైట్ చేస్తుంది.టెక్ టాలెంట్‌కు ప్రపంచ ఖ్యాతిఎల్‌పీయూ క్రమంగా ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకుంది. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఇప్పుడు యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఏడాదికి రూ.1 కోటికి మించిన ప్యాకేజీలతో పని చేస్తున్నారు. రోబోటిక్స్, ఆటోమేషన్, ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ స్ట్రీమ్స్ దేశీయ, అంతర్జాతీయ ప్లేస్‌మెంట్‌ రోస్టర్లలో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి.ఐఐటీలు మాత్రమే కాదు.. ఎల్‌పీయూ ఎందుకంటే?ఎల్‌పీయూ అనుసరిస్తున్న స్కిల్-ఫస్ట్ విధానంలో ప్లేస్‌మెంట్‌ రహస్యం దాగి ఉంది. దీనికి యూనివర్సిటీ అమలు చేస్తోన్న ఎడ్యుకేషన్‌ రివల్యూషన్ ఫ్రేమ్ వర్క్ ఉదాహరణ. విద్యార్థులు రెండో సంవత్సరం నుంచి రియల్-వరల్డ్ ఎక్స్పోజర్, ఇండస్ట్రీ సర్టిఫికేషన్లు, డెడికేటెడ్‌ ప్లేస్‌మెంట్‌ ట్రెయినింగ్‌ పొందుతారు.‘ఎల్‌పీయూలో మేము విద్యార్థులను ఉద్యోగాల కోసం సిద్ధం చేయడమే కాదు.. నాయకత్వం వహించడానికి, సృజనాత్మకతకు అద్దపట్టేలా, పరిశ్రమలో ముందువరుసలో ఉండేలా సిద్ధం చేస్తాం’ అని ఎల్‌పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ తెలిపారు. యూనివర్సిటీ పనితీరు దేశ ఇంజినీరింగ్ విద్య, ప్లేస్‌మెంట్‌ ల్యాండ్ స్కేప్‌లో బలమైన పోటీదారుగా ఉంచుతుంది.త్వరలో ముగియనున్న ప్రవేశాలుఎల్‌పీయూలో 2025 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు త్వరలో ముగియనున్నాయి. దరఖాస్తుదారులు గ్లోబల్ కెరీర్ను ప్రారంభించడానికి, భారతదేశం అత్యంత డైనమిక్, పరిశ్రమ ఆధారిత విశ్వవిద్యాలయంలో భాగం కావడానికి సిద్ధంగా ఉంటే ఇదే మంచి సమయం. సీట్లు పరిమితంగా ఉండడంతో డెడ్ లైన్లు దగ్గరపడుతున్నాయి. దరఖాస్తుదారులు వెంటనే https://bit.ly/43340ai సందర్శించండి.

how many SIM cards registered on your name check step by step7
మీపేరుపై ఇంకేమైనా సిమ్‌కార్డులున్నాయా?

ప్రస్తుతకాలంలో చాలామంది ఒకటికంటే ఎక్కువ ఫోన్లు వాడుతున్నారు. వాటిలో రెండు కంటే ఎక్కువ సిమ్‌కార్డులు వినియోగిస్తున్నారు. అయితే గతంలో మీపేరుతో ఎప్పుడో ఒకపుడు తాత్కాలికంగా సిమ్‌కార్డులు తీసుకునే ఉంటారు. కేంద్రం నిబంధనల ప్రకారం ఒకరి పేరుమీద గరిష్ఠంగా 9 సిమ్‌కార్డులే ఉండాలి. కాబట్టి అనవసరమైన సిమ్‌కార్డులను నిలిపేయాలంటే మార్గం ఉంది. దాంతోపాటు అసలు మీ పేరుపై ఎన్ని సిమ్‌ కార్డులు రిజిస్ట్రర్‌ అయ్యాయో తెలుసుకువాలంటే కింది సమాచారం తెలుసుకోవాల్సిందే.ప్రభుత్వ వెబ్‌సైట్‌ సంచార్‌సాతి వెబ్‌సైట్‌ ద్వారా మీరు గతంలో తీసుకున్న నంబర్లు, ప్రస్తుతం వాడుతున్న సిమ్‌కార్డుల వివరాలు తెలుసుకోవచ్చు. దీనిద్వారా గతంలో తీసుకుని వినియోగంలోలేని సిమ్‌కార్డులను నేరుగా ఆన్‌లైన్‌లో ద్వారా నిలిపేసే సౌకర్యం ఉంది. అది ఎలాగో చూద్దాం.ఇదీ చదవండి: యుద్ధంపై అనుమానాలు.. బంగారం ధరల్లో క్షీణతముందుగా ఆన్‌లైన్‌లో బ్రౌజర్‌ ద్వారా https://sancharsaathi.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.కింద సిటిజన్‌ సెంట్రిక్‌ సర్వీసెస్‌ కేటగిరీలో ‘Know Your Mobile Connections’పై క్లిక్‌ చేయాలి. ఈ సర్వీస్‌ను టెలికాం అనలిటిక్స్‌ ఫర్‌ ఫ్రాడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కన్జూమర్‌ ప్రొటెక్షన్‌(టీఏఎఫ్‌సీఓపీ) అందిస్తోంది.‘Know Your Mobile Connections’పై క్లిక్‌ చేసిన వెంటనే కొత్త విండో ఓపెనె అవుతుంది. అందులో ప్రస్తుతం వాడుతున్న మొబైల్‌నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. కింద క్యాప్చా కోడ్‌ను ఇవ్వాలి. ‘వాలిడేట్‌ క్యాప్చా’ బటన్‌ ప్రెస్‌ చేయాలి.పైన ఇచ్చిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని కింద తెలిపిన బ్లాక్‌లో ఎంటర్‌చేసి లాగిన్‌ అవ్వాలి. మీ పేరుతో ఏ నంబర్లు రిజిస్ట్రర్‌ అయ్యాయో వాటి వివరాలతో లిస్ట్‌ వస్తుంది.ఒకవేళ ఏదేని నంబర్‌ను నిలిపేయాలంటే పక్కనే ఆప్షన్లు ఉంటాయి. వాటిపై క్లిక్‌ చేసి సబ్మిట్‌ చేయాలి. చివరగా లాగ్‌అవుట్‌ చేయడం మరిచిపోకూడదు.

Kalyandurg TDP MLA Surendra Babu Huge Stamp Duty Scam8
టీడీపీ ఎమ్మెల్యే భారీ స్కాం.. బాగోతం బట్టబయలు

సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అవినీతి బాగోతం బట్టబయలైంది. భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. ఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్ సంస్థలో ఎమ్మెల్యే సురేంద్ర బాబు భాగస్వామిగా ఉన్నారు.. ఆ సంస్థ అక్రమ మార్గాల్లో రూ.920 కోట్ల రుణాలు పొందింది. స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టి భారీగా రుణాలు పొందిన ఎస్‌ఆర్‌సీ సంస్థ. నకిలీ పత్రాల ద్వారా యూనియన్ బ్యాంక్ నుంచి 900 కోట్లు, టాటా క్యాపిటల్స్ నుంచి 20 కోట్ల రుణాలు పొందింది. బ్యాంకులను మోసగించిన వైనంపై ఆర్బీఐ, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విచారణ చేపట్టాయి.కళ్యాణదుర్గం టీడీపీ నేత ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబు ద్వారా వ్యవహారాన్ని నడిపిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు.. విషయం బయటపడటంతో తామే మోసపోయామంటూ ఎమ్మెల్యేకు చెందిన కాంట్రాక్టు సంస్థ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే సురేంద్ర బాబు అనుచరుడు ఎర్రన్న అలియాస్ మీసేవ బాబు సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర బాబు స్టాంప్ డ్యూటీ స్కాంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.తెల్గీ కుంభకోణం తరహాలో భారీ కుంభకోణానికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో వెలుగు చూసిన స్టాంప్ డ్యూటీ స్కాంపై ఈడీ, సీబీఐ, ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖలకు ఫిర్యాదు చేస్తానని ఆయన పేర్కొన్నారు. సురేంద్ర బాబుకు చెందిన ఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్ సంస్థ వందల కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టిందని.. విషయం బయటపడేసరికి ఓ కార్యకర్త పై కేసు నమోదు చేయించి చేతులు దులుపుకునే కుట్రలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు.

Operation Sindhu: No Help From Kutami Prabhutvam Says Iran AP Students9
Operation Sindhu: ఏపీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు

సాక్షి, న్యూఢిల్లీ: ఆపరేషన్‌ సిందులో భాగంగా.. ఇరాన్‌ నుంచి స్వస్థలానికి భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీ చేరుకున్న విమానంలో ఐదుగురు ఏపీ విద్యార్థులు కూడా ఉన్నారు. వీళ్లంతా కెర్మన్‌ మెడికల్‌ యూనివర్సిటీలో చదువుతున్నారు. అయితే.. ఏపీ ప్రభుత్వం తమను ఏమాత్రం పట్టించుకోలేదని చెబుతున్నారు వాళ్లు. ‘‘నాలుగు రోజుల నుంచి ఇరాన్‌ నుంచి భారతీయుల తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది. మమ్మల్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా ఢిల్లీకి తీసుకువచ్చింది. ఢిల్లీ నుంచి స్వయంగా మేమే మా ఖర్చులతో నంద్యాలకు వెళ్తున్నాం. మిగతా వాళ్లకు వాళ్ల వాళ్ల రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. కానీ, ఏపీ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సాయం అందలేదు. మాకు ఫ్లైట్ టికెట్స్ ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం చేసినట్టుగా, ఏపీ ప్రభుత్వం కూడా చేస్తే బాగుండేది.. .. మేము ఉన్న ప్రాంతంలో యుద్ధం ప్రభావం లేదు. అయినా ముందు జాగ్రత్త చర్యగా కాలేజీ యాజమాన్యం సెలవులు ఇచ్చింది. ప్రస్తుతం ఎంబీబీఎస్‌ సెకండ్ ఇయర్ చదువుతున్నాం. యుద్ధం రావడం వల్ల సెమిస్టర్ పరీక్షలు ఆగిపోయాయి. కాలేజీ యాజమాన్యం పిలిస్తే మళ్లీ వెంటనే ఇరాన్ వెళతాం అని నంద్యాలకు చెందిన నరేందర్‌, నారాయణలు తెలిపారు. ఆపరేషన్‌ సిందు గురించి.. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్‌ ఇది. మొదటి దశలో.. జూన్ 19న 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరింది. వీరిలో 90 మంది జమ్మూ కశ్మీర్‌కు చెందినవారు. రెండో దశలో జూన్ 21న మరో 310 మంది భారతీయులు ఇరాన్ నుంచి తరలించబడ్డారు. ఈ విమానం ఢిల్లీలో సాయంత్రం 4:30కి ల్యాండ్ అయింది. మొత్తం ఇప్పటివరకు: 827 మందిని భారత్‌కు సురక్షితంగా తీసుకువచ్చినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.ఆపరేషన్‌ సిందు కోసం.. ఇరాన్ ప్రభుత్వం భారత పౌర విమానాల రాకపోకల కోసం తమ గగనతలాన్ని ప్రత్యేకంగా తెరిచింది. ఈ ఆపరేషన్‌లో రోడ్డుమార్గం ద్వారా అర్మేనియాకు తరలించి, అక్కడి నుంచి విమానాల ద్వారా భారత్‌కు తీసుకురావడం వంటి వ్యూహాత్మక చర్యలు కూడా తీసుకున్నారు.యుద్ధం ఇలా.. జూన్‌ 13వ తేదీన ఇరాన్‌ నుంచి ప్రపంచానికి అణు ముప్పు ఉందని చెబుతూ ఇజ్రాయెల్‌ ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ పేరిట దాడులకు దిగింది ఇజ్రాయెల్‌. ప్రతిగా ఇరాన్‌ సైతం మిస్సైల్స్‌తో ఇజ్రాయెల్‌పై దాడులు జరిపింది. చివరకు.. ట్రంప్‌ మధ్యవర్తిత్వంలో ఇరుదేశాలు మంగళవారం (జూన్‌24న) కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో పశ్చిమాసియా యుద్ధం ముగిసింది.

Days After Ahmedabad Plane Incident Air India Staff Dances In Office, Netizens Anger10
అంత విషాదంలో డీజే పార్టీ?ఎయిరిండియాపై తీవ్ర ఆగ్రహం, వీడియో వైరల్‌

భారతదేశం తన చరిత్రలోనే అత్యంత దారుణమైన విమానయాన ప్రమాదాల్లో ఒకటి అహ్మదాబాద్‌లో జరిగిన AI171 విమాన ప్రమాదం. అయితే ఘోర విపత్తులో దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయిన కొద్ది రోజులకే ఎయిర్ ఇండియా SATS (AISATS) ఉన్నతాధికారులు గురుగ్రామ్ కార్యాలయంలో డీజే పార్టీలో నృత్యం చేస్తూ ఎంజాయ్‌ చేయడం విమర్శలకు తావిచ్చింది.AISATS అనేది విమానాశ్రయ గ్రౌండ్ సేవలను అందించే సంస్థ. టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా విమానాశ్రయ సేవలు , ఫుడ్‌ అందించే SATS అనే రెండు కంపెనీల (50-50) సమ భాగస్వామ్యంలో ఉన్న జాయింట్ వెంచర్‌ ఇది.ఎయిర్ ఇండియా SATS (AISATS) సీనియర్ అధికారులు గురుగ్రామ్ లో ఒక DJ పార్టీలో డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూన్ 20న జరిగిన ఈ పార్టీకి AISATS చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అబ్రహం జకారియా, ఎయిర్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, GM, సంప్రీత్ కోటియన్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ GM హాజరయ్యారు. విమాన ప్రమాదంలో 270 మందికి పైగా మరణించిన కొద్ది రోజులకే ఇలాంటి పార్టీ చేసుకోవడం దుమారాన్ని రాజేసింది. వందలాది మంది బాధితులు హృదయవిదారకమైన శోకం ఉంటే, ఆప్తులను కోల్పోయి కంటిమింటికి ధారగా రోదిస్తోంటే... కనీస మానవత్వం లేకుండా ఇలా కుప్పిగంతులు వేస్తున్నారంటూ దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలింది. ఈ విషాదంలో కేవలం బాధితులు మాత్రమే కాదు, యావద్దేశం దుఃఖిస్తోంది.కానీ కనీస ఇంగితలం లేకుండా అధికారులు ఇలాంటి వేడుకలు జరుపుకోవడం సరికాదని మండిపడ్డారు. దీనిపై సంబంధింత అధికారులు క్షమాపణలు చెప్పినప్పటికీ, ఇది క్షమించరానిది అంటూ ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతూనే ఉండటం గమనార్హం. It has only been a few days since the tragic Ahmedabad plane crash. Many families have not yet been able to see their loved ones for the last time; several bodies have still not been handed over. Grief hangs heavy in households, funeral pyres are yet to cool. And at such a… pic.twitter.com/rrlekBNAeD— Squint Neon (@TheSquind) June 22, 2025 "మానవత్వం చచ్చిపోయింది.. నమ్మబుద్ధి కావడం లేదు’’ అని ఒకరు, "సంతోషంగా ఉండండి,కానీ ముందుగా మృతులకు గౌరవ సంతాపం తెలియజేయడం మర్చిపోతే ఎలా? ఇంత మంది చనిపోయిన నెలరోజులలోపే, మీరు ఇలా డాన్స్‌ చేసి ఎయిరిండియా ఇమేజ్‌ను నాశనం చేస్తున్నారు. సిగ్గుచేటు ఇప్పటికే సంస్థ సేవల విషయంలో దిగజారిపోయింది, ఇప్పుడు భద్రతలో కూడా’’ మరొకరు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement