జిల్లా ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా జయలక్ష్మి | - | Sakshi

జిల్లా ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా జయలక్ష్మి

Mar 30 2025 12:45 PM | Updated on Mar 30 2025 2:42 PM

జిల్ల

జిల్లా ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా జయలక్ష్మి

కాకినాడ లీగల్‌: స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ కాకినాడ జిల్లా ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా తూర్పుగోదావరి జిల్లా మార్కెట్‌ అండ్‌ ఆడిట్‌ జిల్లా రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న జె.జయలక్ష్మి నియమితులయ్యారు. ప్రస్తుత రిజిస్ట్రార్‌ కె.ఆనందరావు ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ మేరకు జయలక్ష్మి శనివారం బాధ్యతలు స్వీకరించారు.

ఇద్దరిపై హత్యాయత్నం

ముగ్గురి అరెస్టు

తాళ్లరేవు: పి.మల్లవరం గ్రామ పంచాయతీ పత్తిగొందిలో ఇద్దరు యువకులపై హత్యాయత్నం జరిగింది. కోరంగి పోలీసులు తెలిపిన వివరాల మేరకు శనివారం రాత్రి గ్రామంలో జరుగుతున్న జాతరలో యువకుల మధ్య కొట్లాట జరిగింది. ఈ నేపథ్యంలో కె.నాగబాబు, ఎం.వీరకుమార్‌ అనే యువకులపై పలువురు కత్తులతో దాడిచేశారు. ఈ దాడిని స్థానికులు అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. గాయపడిన యువకులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా వారు చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలుసుకున్న కాకినాడ రూరల్‌ సీఐ చైతన్య కృష్ణ, కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనకు సంబంధించి ఈ.ఈశ్వరచందు, ఈ.రాజేష్‌, ఈ.సాయిచంద్ర అనేక యువకులను అరెస్టు చేశారు. పాత గొడవల నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.

రైలు నుంచి జారిపడి వృద్ధురాలి మృతి

తుని: తుని నుంచి అన్నవరం వైపు వెళ్తున్న రైలు నుంచి జారిపడి వృద్ధురాలు మృతి చెందినట్టు జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. శనివారం అందిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి సోషల్‌ మీడియా ద్వారా అన్ని పోలీసు స్టేషన్లలో విచారణ చేయగా పలాసకు సమీపంలోని సైలాడ గ్రామానికి చెందిన అట్టాడ సరస్వతమ్మ (70)గా గుర్తించామన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.

జిల్లా ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా జయలక్ష్మి 1
1/1

జిల్లా ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా జయలక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement