జగన్‌కు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలం | - | Sakshi
Sakshi News home page

జగన్‌కు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలం

Apr 10 2025 12:25 AM | Updated on Apr 10 2025 12:25 AM

జగన్‌కు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలం

జగన్‌కు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలం

రాజమహేంద్రవరం రూరల్‌: అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి భద్రత కల్పించడంలో పోలీసుశాఖ పూర్తి వైఫల్యం కనపడిందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాజమహేంద్రవరం రూరల్‌ మండలం బొమ్మూరులోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. రాప్తాడులో వైఎస్‌ జగన్‌ను చూసేందుకు వచ్చిన జనాన్ని నియంత్రించడానికే పోలీసులు ఎక్కువగా ప్రయత్నించారన్నారు. ఆయన హెలికాప్టర్‌ దిగే సమయానికి అక్కడ ఇవ్వాల్సిన భద్రతాలోపం వల్లే ప్రజలు గుమిగూడారన్నారు. అధికారం అనేది ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలి, రాష్ట్రంలో ప్రజలకు చట్టాలపై గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలన్నారు. అధికారం మాకు అహంకారం అన్నేటట్టుగా ఈనాడు పత్రికల్లో మంత్రులు ప్రకటనలు చేస్తున్నారన్నారు. జడ్‌ ప్లస్‌ కేటగిరి నాయకుడికి మీరు ఇచ్చే భద్రత ఇదేనా అన్ని వేణు ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రజాదరణ గల నాయకుడిగా వైఎస్‌ జగన్‌ వస్తుంటే ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుంటారన్నారు. ప్రభుత్వానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. పోలీసుశాఖ సరైన భద్రత కల్పించకపోవడం వల్లనే రోడ్డు మార్గాన వైఎస్‌ జగన్‌ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. జగన్‌కు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని వైఎస్సార్‌ సీపీ డిమాండ్‌ చేస్తున్నామని అన్నారు.

ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం దారుణం

కూటమి ప్రభుత్వంలో పేదలకు అందించే ఆరోగ్యశ్రీసేవలు నిలిచిపోవడం దారుణమని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించిందని, ఆరోగ్యశ్రీ తో పాటు ఆరోగ్య ఆసరా, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌, నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ ద్వారా వైద్యం వంటి ఎన్నో సేవలను అందించిందన్నారు. గత ప్రభుత్వం వైద్యంపై శ్రద్ధ తీసుకుని అనేక సౌకర్యాలు కల్పించిందన్నారు. కరోనా సమయంలో సైతం మెరుగైన వైద్య సదుపాయాలను ప్రజలకు అందించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో రూ.3,500 కోట్ల బకాయిలను ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు చెల్లించి ఆరోగ్యశ్రీని కొనసాగించాలని వేణు డిమాండ్‌ చేశారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు,

మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement