ఆదికవి ఖ్యాతిని ఇనుమడింపజేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆదికవి ఖ్యాతిని ఇనుమడింపజేయాలి

Apr 23 2025 7:50 AM | Updated on Apr 23 2025 7:50 AM

ఆదికవ

ఆదికవి ఖ్యాతిని ఇనుమడింపజేయాలి

ఇన్‌కంట్యాక్స్‌ అదనపు కమిషనర్‌ మోహన్‌బాబు

వేడుకగా నన్నయ వర్సిటీ

ఆవిర్భావ దినోత్సవం

రాజానగరం: ఆదికవి నన్నయ భట్టారకుని పేరిట ఏర్పడిన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఇన్‌కంట్యాక్స్‌ అదనపు కమిషనర్‌ ఎం.మోహన్‌బాబు అన్నారు. వర్సిటీ 19వ ఆవిర్భావ వేడుకలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పరిశోధన, ఆవిష్కరణలపై దృష్టి సారించి, భారతీయ సంస్కృతి, విభిన్న ఆలోచనలను గౌరవిస్తూ విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తయారు చేయాలని సూచించారు. విద్యార్థులకు, అధ్యాపకులకు ధరిత్రీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మానవాళి మనుగడకు ప్రకృతి అందిస్తున్న వనరులను కాపాడుకుంటూ పర్యావరణ హితంగా ముందుకు సాగాలని అన్నారు. ఏటా 2.01 బిలియన్‌ టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే, 13 మిలియన్‌ హెక్టార్లలో అటవీ ప్రాంతం పోతుందని చెప్పారు. మనిషి సృష్టిస్తున్న విధ్వంసంతో ఒక మిలియన్‌ జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందన్నారు.

ఆదికవి ఖ్యాతిని ఇనుమడింపజేయాలి 1
1/1

ఆదికవి ఖ్యాతిని ఇనుమడింపజేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement