వ్యవసాయ అధికారులను అడ్డుకున్న రైతులు | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ అధికారులను అడ్డుకున్న రైతులు

Apr 5 2025 1:27 AM | Updated on Apr 5 2025 1:27 AM

వ్యవసాయ అధికారులను అడ్డుకున్న రైతులు

వ్యవసాయ అధికారులను అడ్డుకున్న రైతులు

టి.నరసాపురం: వ్యవసాయశాఖకు చెందిన విత్తనాభివృద్ధి క్షేత్రానికి కేటాయించిన భూమికి హద్దులు నిర్ణయించేందుకు వెళ్లిన అధికారులను అల్లంచర్ల రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. 2006లో అప్పటి ప్రభుత్వం అల్లంచర్లలో విత్తనాభివృద్ధి క్షేత్రానికి 40 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే ఆ భూ మిలో కొంత భాగాన్ని రైతులు ఆక్రమించుకున్నా రు. భూమికి హద్దులు నిర్ణయించి వ్యవసాయ శాఖ కు చూపించేందుకు వ్యవసాయశాఖ జేడీఏ హబీబ్‌ బాషా, తహసీల్దార్‌ టి.సాయిబాబా, సర్వేయర్‌ అ క్కడికి వెళ్లారు. హద్దులు నిర్ణయించి కందకం తవ్వే ప్రయత్నం చేయడంతో ఆక్రమణలో ఉన్న రైతులు అడ్డుకున్నారు. విత్తనాభివృద్ధి క్షేత్రానికి భూమిని కేటాయించిన సమయంలోనే 82 మంది రైతులకు 50 సెంట్ల చొప్పున ప్రభుత్వం ప ట్టాలు ఇచ్చింది. అయితే వారికి భూమిని చూపించలేదు. తమకు భూములను చూపించాలని రైతులు పట్టుబట్టారు. తహసీల్దార్‌ నచ్చజెప్పే ప్రయత్నం చే సినా అంగీకరించలేదు. దీంతో అధికారులు వెనుదిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement