Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Ys Jagan Slams On Chandrababu Govt Over Kuppam Woman Incident1
కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై వైఎస్‌ జగన్‌ ఫైర్‌

సాక్షి,తాడేపల్లి : చంద్రబాబు సొంత నియోజకవర్గంలో మహిళపై పచ్చ సైకోల అరాచకంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు.. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? అంటూ ప్రశ్నించారు. కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై వైఎస్ జగన్ ఎక్స్‌ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఇది నిదర్శనం అంటూ ధ్వజమెత్తారు.. ‘మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా?. సాక్షాత్తూ మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసిస్తున్న ఘటన, మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే.తిమ్మరాయప్ప అనే కూలీ అప్పు చెల్లించలేదనే కారణంతో అతని భార్య శిరీషను మీ పార్టీ కార్యకర్త చెట్టుకు కట్టేసి, హింసించాడు. ఆమె బిడ్డలు రోదిస్తున్నా సరే కనికరం చూపలేదు, విడిచిపెట్టలేదు. చంద్రబాబు.., మీ హయాంలో జరిగిన అనేక క్రూరమైన ఘటనల్లో ఇదొకటి. పొలిటికల్‌ గవర్నెన్స్‌, రెడ్‌బుక్‌ పేరిట మీరు నెలకొల్పిన దుష్ట సంప్రదాయంలో భాగంగా మీరు, మీ పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా చెలరేగిపోయి చేస్తున్న దుర్మార్గాలకు మహిళలు, యువతులు, బాలికలు ఇలా ఎందరో బలైపోతున్నారు. ఈ ఘటనతోపాటు, ఏడాదికాలంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరిగిన అన్యాయాలు, అఘాయిత్యాలను సీరియస్‌గా తీసుకోవాలని, చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టాలి’ అని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు..@ncbn గారూ.. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా? సాక్షాత్తూ మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసిస్తున్న ఘటన, మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే. తిమ్మరాయప్ప… pic.twitter.com/GDVWPB65AZ— YS Jagan Mohan Reddy (@ysjagan) June 17, 2025

Sakshi Guest Column On Child Labor system2
ఇంకా బాల కార్మికులా?

ఇప్పటికీ వెట్టి చాకిరీ వలలో చిక్కుకు పోయిన బాల కార్మికులు లక్షలాది మంది ఉన్నారు. పొలాల్లో, ఫ్యాక్టరీల్లో, ఇళ్ళలో పని చేస్తున్న నిస్సహాయ బాలల ఆర్తనాదాలు నా చెవుల్లో గింగురుమంటున్నాయి. అటువంటి పరిస్థితుల నుంచి రక్షించిన వందలాది మంది బాలలు 1998లో నా చుట్టూ అల్లు కున్న సంగతి గుర్తుకొస్తోంది. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా 103 దేశాలను చుట్టి వచ్చిన గ్లోబల్‌ మార్చ్‌లో నా వెంట వచ్చిన బాలలు నిర్భయంగా చేసిన నినాదాలు కూడా గుర్తున్నాయి. యాత్ర ముగింపులో జెనీవా లోని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) ప్రధాన కార్యాలయంలో ప్రసంగించవలసిందిగా మమ్మల్ని కోరారు. అక్కడ మేం తక్షణం అమలుపరచవలసిన సరళమైన డిమాండును వినిపించాం: ‘‘చిట్టి చేతుల్లో ఇక ఎంతమాత్రం పనిముట్లు ఉండకూడదు. మాకు పుస్త కాలు, బొమ్మలు కావాలి!’’ నెరవేరని లక్ష్యంఆ యాత్ర చరిత్ర సృష్టించింది. ఫలితంగా, ఐఎల్‌ఓ 1999లో (182వ) తీర్మానాన్ని ఆమోదించింది. అది బానిసత్వం, మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా వచ్చిన మొదటి అంతర్జా తీయ చట్టం. ఆ తీర్మానాన్ని ఆమోదించిన మొదటి 16 ఏళ్ళలో గణనీయమైన ప్రగతి కనిపించడంతో ఎన్నో ఆశలు చిగురించాయి. బాల కార్మికుల సంఖ్య 2000–2016 సంవత్సరాల మధ్యలో గణనీయంగా 25 కోట్ల నుంచి 15 కోట్ల 20 లక్షలకు తగ్గింది. దాంతో మార్పు తేగలం అనిపించింది. కానీ, అది సరిపోదు. బాలల విష యంలో ప్రతి క్షణమూ విలువైనదే. స్కూలుకు వెళ్ళలేకపోయిన ప్రతి రోజూ ఒక అవకాశాన్ని కోల్పోయినట్లే లెక్క. ఒక్క నిమిషం బాని సత్వంలో మగ్గినా బాల్యాన్ని కోల్పోయినట్లే లెక్క.ఐరాస 2016లో సతత వికాస లక్ష్యా (ఎస్‌.డి.జి.)లను నిర్దేశించుకున్నపుడు ఉద్యమాన్ని పునర్జీవింపజేసే అవకాశం వచ్చింది. బాల కార్మికుల నిర్మూలనను ఒక ఎస్‌.డి.జి.గా చేర్చేట్లు చూసేందుకు మేం ఉద్యమాన్ని చేపట్టాం. అంతర్జాతీయ అభివృద్ధి అజెండాలో ఈ అంశాన్ని కూడా చేర్చితే ఎంతో ఊతం లభిస్తుందని భావించాం. మా కృషి ఫలించింది. ప్రపంచం 2025 కల్లా బాల కార్మిక వ్యవస్థ ఏ రూపంలోనూ లేకుండా చూస్తామని వాగ్దానం చేసింది.గ్లోబల్‌ మార్చ్‌లో పాల్గొన్నవారిలో పిన్న వయస్కుడు బసు రాయ్‌. ఆ ఎనిమిదేళ్ళ పిల్లాడిని నా భుజాల మీదకు ఎక్కించుకుని నడిచాను. వాడిది కంచు కంఠం. ‘‘బాల కార్మికులను ఎవరు నిరో ధిస్తారు? మేమే’’ అని నినదించేవాడు. మనం పెట్టుకున్న 2025 గడువు ఇంక కొద్ది నెలల్లో ముగుస్తుందనగా, బసు లాంటి లక్షలాది మంది నుంచి అదే రకమైన గొంతు ఇప్పటికీ వినిపిస్తోందని బరువెక్కిన హృదయంతో చెప్పాల్సి వస్తోంది.ఎస్‌.డి.జి.లు చేపట్టిన మొదటి నాలుగేళ్ళలో, 2020 వరకు బాల కార్మికుల సంఖ్య 16 కోట్లకు పెరిగింది. అప్పటికి 20 ఏళ్ళలో బాల కార్మికుల సంఖ్య పెరగడం అదే మొదటిసారి. ఒక్క ఆఫ్రికాలోనే రోజూ 10,000 మంది బాలలు బలవంతపు చాకిరీలోకి దిగు తున్నారు. అదే కాలంలో, ప్రపంచం 10 ట్రిలియన్‌ డాలర్లకు సంప దను పెంచుకుంది. మరో రకంగా చెప్పాలంటే, కనీసం వారానికొక కోటీశ్వరుడు తయారయ్యాడు. ఇది దయారాహిత్యానికి సంకేతం. దీన్ని నిజంగా మనం అభివృద్ధి అనగలమా? కొన్నేళ్ళ క్రితం నేను ఐరాసలో మాట్లాడుతూ, 2025 నాటికి ప్రపంచంలో బాల కార్మికులు లేకుండా చూడగలమని చెప్పాను. కానీ, ‘‘అయ్యా! బాల కార్మిక వ్యవస్థకు అంతం ఎన్నడు?’’ అని ఈ మధ్య ఎవరో నన్ను అడిగి నపుడు నాకు ఏం జవాబు చెప్పాలో తోచలేదు. అది హక్కుల సమస్యబాల కార్మికులు లేకుండా చేసే ఉద్యమాన్ని ప్రభావవంతంగా ఎలా మలచాలనే విషయంలో 2016కు ముందు మనం కొన్ని విలు వైన పాఠాలు నేర్చుకున్నాం. ప్రజా ఉద్యమ స్ఫూర్తి, రాజకీయ సంకల్ప బలంతో కూడిన నైతిక నాయకత్వం ప్రగతిని సాధించేందుకు తోడ్పడ్డాయి. చాలా దేశాలు విద్యా రంగంపై భారీగా పెట్టుబ డులు పెట్టాయి. నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించిన బ్రెజిల్, భారత్, కెన్యా, దక్షిణాఫ్రికా సత్ఫలితాలు చూశాయి. ఎక్కడి నుంచి కూడా బాల కార్మికులు వ్యవస్థలోకి రాకుండా చూడాలని రాజ కీయంగా బలమైన వాణి (ముఖ్యంగా యూరప్, అమెరికా నుంచి) వినిపించడంతో పరిశ్రమలు కూడా తలొగ్గక తప్పలేదు.నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆ రకమైన ఉద్యమ స్ఫూర్తి కొరవడింది. మనం కూడా బాల కార్మికులను ఒక ఉప అంశంగా చూడటం మొదలెట్టాం. దాన్నొక కార్మిక సమస్యగా పరిగణిస్తున్నాం తప్పించి న్యాయాన్ని, మానవ హక్కులను కాలరాస్తున్న సంక్షోభంగా చూడటం లేదు. లోతైన సమస్యలు మరికొన్ని ఉన్నాయి. అనేక పేద దేశాలు (ముఖ్యంగా ఆఫ్రికాలోనివి) అసమంజస పన్నుల వ్యవస్థల్లో, కునారి ల్లజేస్తున్న అప్పుల ఊబిలో, అవినీతి, అవకతవకల పాలనలో, వివిధ వర్గాల మధ్య ఘర్షణల్లో చిక్కుకుపోయాయి. దాంతో ఈ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. మరో ప్రమాదకరమైన ధోరణిని గమనించాను. అమెరికాలో 30కి పైగా రాష్ట్రాలు బాల కార్మికుల సంరక్షణ చట్టాలను నిర్వీర్యం చేస్తూ కొత్త సవరణలు తీసుకొచ్చాయి. సభ్యులుగా ఉన్న దేశాల నుంచి నిరసన ఎదురవడంతో, బాల కార్మి కులకు కంపెనీలను బాధ్యులను చేసే చట్టాన్ని యూరోపియన్‌ యూనియన్‌ సడలింపజేసింది. బ్రెజిల్‌లోనూ ఆ దిశగా చర్చలు సాగుతున్నాయి. మన పిల్లలు అనుకుంటేనే!అయితే, చిన్నవే అయినా, కొన్ని అర్థవంతమైన చర్యలూ కని పించకపోలేదు. ‘యునిసెఫ్‌’ ఇటీవల ప్రపంచ బాలల సంరక్షక నిధిని ఏర్పాటు చేసింది. కానీ, ఆ సాయం సరిపోదు. లక్ష్యంలో సుమారు 30 శాతాన్నే ఆ నిధి అందుకోగలిగింది. ప్రపంచ దేశాలు కూడా మునుపెన్నడూ లేనంత ఘర్షణలను చూస్తున్నాయి. యుద్ధ మండలాల్లో జీవిస్తున్న బాలల శాతం 1990ల నుంచి రెండింతలైంది. నేనిది రాస్తున్న సమయానికి 47 కోట్ల 30 లక్షల మంది బాలలు ఘర్షణలు సాగుతున్న చోట్ల నలిగిపోతున్నారు. వాతావరణ సంక్షోభం బడుగు వర్గాలపై ప్రభావం చూపుతోంది. ఇది బాల కార్మి కుల సంఖ్యను పెంచుతూ, పేదరిక, అన్యాయాల వలయాన్ని కొనసాగిస్తోంది. చాలా దేశాలు బాల కార్మికుల సంఖ్యను తగ్గించు కోగలగడం ఒక్కటే ఆశలు మోడువారకుండా చూస్తోంది. బాల కార్మి కులకు వ్యతిరేకంగా ప్రజా గొంతుకలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించగల సత్తా భారత్‌కు ఉంది. మనకు పటిష్ఠమైన చట్టాలు, చక్కని సంక్షేమ పథకాలు, రాజ కీయంగా ఏకాభిప్రాయం ఉన్నాయి. పరిశ్రమల నుంచి కూడా ప్రతి ఘటన నామమాత్రంగానే ఉంది. అన్నీ అనువైన పరిస్థితులున్నాయి. కనుక, సత్వర కార్యాచరణకు నడుం బిగించాలి. మొదట చట్టాలను అమలుపరచాలి. కాగితాలకు మాత్రమే పరిమితమైన చట్టాల వల్ల ఉపయోగం లేదు. బాల కార్మికులను వివిధ (విద్య, ఆరోగ్యం, పేదరికం) రంగాలతో ముడిపడిన సమస్యగా చూడాలి. అలాగే, విద్యా రంగంలో పెట్టుబడులు కీలకం. ప్రమాణాలతో కూడిన పాఠ శాల విద్య బాల కార్మికులను చాకిరీ నుంచి విముక్తులను చేయ గలదు. అన్నింటికన్నా ముఖ్యంగా బాల కార్మికులుగా పని చేస్తున్న వారందరూ మన పిల్లలేననే భావన అంకురించాలి. అప్పుడే సమస్య పరిష్కారానికి త్వరపడగలుగుతాం. బాలలకు మెరుగైన ప్రపంచాన్ని అందించాల్సిన బాధ్యత మనపై ఉంది.కైలాశ్‌ సత్యార్థి వ్యాసకర్త నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, సామాజిక కార్యకర్త (‘హిందుస్థాన్‌ టైమ్స్‌ సౌజన్యంతో)

Interesting comments by Justice Vijaysen Reddy in the siblings property dispute case3
తల్లిదండ్రులు ఉన్నంత వరకు వాటాలు కోరకుండా చేయాలి

సాక్షి, హైదరాబాద్‌: నిత్యం పెరిగిపోతున్న తోబుట్టువుల ఆస్తి తగాదాలు, వివాహ వివాదాలపై ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉన్నత చదువులు చదువుకుని.. మంచి ఉద్యోగం చేస్తూ.. ఆర్థికంగా బాగానే ఉన్నా.. స్వల్ప ఆస్తి కోసం కొందరు సోదరులు, సోదరీమణులతో కొట్లాడుతుంటారన్నారు. ఒకరిపై ఒకరు కేసులు, పిటిషన్లు వేసుకుంటూ న్యాయస్థానాలను పెద్ద ఎత్తున ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేటలోని అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని గతంలో ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాలను మునిసిపల్‌ అధికారులు అమలు చేయడం లేదంటూ హైదరాబాద్‌ నివాసి చార్టర్డ్‌ అకౌంటెంట్‌ రాహుల్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కూల్చిన తర్వాత స్థలాన్ని సమానంగా పంచేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. 2024, ఫిబ్రవరిలో జారీ చేసిన స్పీకింగ్‌ ఆర్డర్‌ ప్రకారం చర్యలు చేపట్టి.. స్టేటస్‌ రిపోర్టును తమకు తెలియజేయాలని సూర్యాపేట మునిసిపాలిటీని ఆదేశించారు. తదుపరి విచారణ జూలై 28కి వాయిదా వేశారు. కేసు విచారణ సందర్భంగా పిటిషన్‌ వేసిన వ్యక్తి ఆ భవనంలో ఉంటున్న వారికి సోదరుడు అని.. నలుగురి మధ్య ఆస్తి వివాదం ఉందని తెలుసుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య ఇలాంటి పిటిషన్లు న్యాయస్థానాల్లో పెరిగిపోతున్నాయని, కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అహంకారంతోనే కేసులు..: ‘హైకోర్టుకు అధికారం ఉండి ఉంటే ఆస్తి తగదాలు, వివాహ వివాదాల్లో ఆస్తులన్నింటినీ న్యాయస్థానం కస్టడీలోకి తీసుకునేవాళ్లం. అప్పుడు అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తి కోసం కొట్లాటలు పెట్టుకుని ఏం సాధిస్తారు? కోర్టు చుట్టూ తిరిగి చివరికి ఆ ఆస్తి పొందిన వాళ్లు కూడా సంతోషంగా ఉండలేరు. ఇక్కడ 264 గజాలు ఆరుగురు (తల్లిదండ్రులతో కలిపి) పంచుకోవాలి. దాదాపు 44 గజాల స్థలం కోసం కొట్లాడుతున్నారు. అందులో ఇళ్లు కట్టుకునేందుకు అధికారులు అనుమతి కూడా ఇవ్వరు. దాంతో ధనవంతులూ కాలేరు. చివరకు ఏం సాధించినట్లు.. అతి పెద్ద సమస్య ఏంటంటే అహంకారం. కంపెనీ లా ట్రిబ్యునల్‌లో దివాలా పరిష్కార నిపుణుడిని పెట్టినట్లు ఇక్కడ కూడా అలాంటి వ్యక్తిని ఏర్పాటుచేసి ఆస్తులను కస్టడీలోకి తీసుకుని.. పార్టి షన్‌ సూట్‌లో ఆస్తుల పరిష్కార ప్రక్రియ చేపడితే సరిపోతుంది. అసలు.. తల్లిదండ్రులు బతికి ఉన్నంత వరకు కుమారుడు, కుమార్తె ఆస్తుల్లో వాటాను కోరకుండా చర్యలు తీసుకుంటే తెలిసొస్తుంది. ఉన్నత చదువులు చదువుకుంటారు.. మంచి ఉద్యో గం చేస్తుంటారు.. ఆర్థికంగా బాగానే ఉంటారు.. అయినా స్వల్ప ఆస్తి కోసం కూడా కొట్లాడుతుంటారు. కుటుంబ సభ్యులతో కొట్లాడి వెయ్యి గజాలు సాధించుకున్నా అది భవిష్యత్‌లో సంతృప్తినివ్వదు. అహంకారం వీడితే సమస్యలకు కుటుంబ స్థాయిలోనే పరిష్కారం దొరుకుతుంది’అని పేర్కొన్నారు.

Sakshi Editorial On Migrations4
వలసలే వర్తమాన వాస్తవం

ఆకలి నుంచి, అగడ్తల నుంచి, వేధింపుల నుంచి, ఘర్షణల నుంచి, మృత్యువు నుంచి సుదూరంగా వెళ్లిపోవడానికీ, సురక్షితంగా బతకడానికీ సాధారణ ప్రజానీకం చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచంలో అంతకంతకూ ఎక్కువవుతున్నాయి. ప్రతి దేశంలోనూ జాతీయవాద ధోరణులు పెరిగి, మెజారిటీ వాదం ముదిరి సరిహద్దులు మూసుకుపోతున్నా బతుకుపోరులో పరాజితులవుతున్న సాధారణ జనం ఎప్పటిలా ‘వలస గీతం’ పాడుతూనే ఉన్నారు. నిరుడంతా ఒక దేశం నుంచి మరో దేశానికి కోట్లాదిమంది ప్రజానీకం వలసపోయారని లాన్సెట్‌ నివేదిక ప్రకటించింది. ఒక్క మాటలో– ప్రతి ఎనిమిది మందిలో ఒకరు స్వస్థలాలను వదిలిపోతున్నారు. ఒక్కో దేశంలో ఒక్కో సమస్య.నియంత పోకడలతో ఉండే పాలకులు కావొచ్చు... సాయుధ ముఠాల బెదిరింపుల వల్ల కావొచ్చు, కళ్లముందు జరుగుతున్న ఘర్షణలు ముదిరి తమను కూడా కబళిస్తాయన్న భయం కావొచ్చు–ఎందరెందరో సురక్షిత ప్రదేశాలను అన్వేషిస్తూ తెలియని తీరాలకు పయనమవుతున్నారు. వీటికి తోడు ఈ 21వ శతాబ్దంలో వాతావరణ మార్పుల కారణంగా వచ్చిపడుతున్న సమస్యలు కూడా వలసలను పెంచుతున్నాయని లాన్సెట్‌ నివేదిక సూచిస్తోంది. భారీ ఆనకట్టల నిర్మాణం, మైనింగ్, పరిశ్రమల స్థాపన వంటì వాటికి అభివృద్ధి పేరిట అనుమతులిస్తున్నారు. ప్రభుత్వాలు నామమాత్రంగా ఇచ్చే పరిహారం ఏ మూలకూ చాలక, చేసేందుకు పనులేమీ లేక వలసలు తప్పటం లేదు.ఇలాంటి ‘అభివృద్ధి’ పర్యవసానంగా కరువు, వరదలు, ఇతరేతర ప్రకృతి వైపరీత్యాలు కాటేస్తు న్నాయి. ఆహారం, మంచినీరు సంగతలా ఉంచి కనీసం తలదాచుకోవటానికి కూడా ఏమీ మిగలక పోవటం సమస్యాత్మకం అవుతోంది. ఇలాంటివారిని స్వదేశంలోనే సంశయంతో చూస్తారు. తమ వనరులు కాజేస్తారని, జీవికకు ముప్పు తెస్తారని ఆందోళన పడతారు. పరాయి దేశాలకు పోతే చెప్పేదేముంది? మన దేశం వరకూ చూస్తే వలసల్లో దాదాపు 99 శాతం అంతర్గతమైనవేనన్నది నిపుణుల మాట. ఉత్తరప్రదేశ్, బిహార్‌ల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వలసలు అధికంగా ఉంటుండగా, వారికి ఆశ్రయమిచ్చే రాష్ట్రాల్లో ఢిల్లీ, మహారాష్ట్రలది అగ్రస్థానం. వలసపోయే వారిలో ఇతరేతర సమస్యలకు తోడు ఆరోగ్య సమస్యలు కూడా తక్కువేమీ కాదు. ఎండనక, వాననక, తిండితిప్పలు లేక గత్యంతరం లేక కాలినడకన వెళ్లేవారుంటారు. ఎగిసిపడు తున్న అలలు కలవరపరుస్తున్నా, ఏ క్షణమైనా మింగేస్తాయన్న భయాందోళనలున్నా నాటుపడవ లపై సముద్రాలను దాటాలని చూసేవారూ ఉంటున్నారు. ఇలాంటివారంతా వ్యాధుల బారినపడి ఆదరించేవారు లేక, వైద్యసాయం అందక మృత్యుముఖంలోకి పోతున్నారు. తొలుత 2008లో, ఆ తర్వాత 2017లో ఐక్యరాజ్యసమితి ఈ సమస్యపై తీర్మానాలు చేసింది. ప్రత్యేకించి వలసదారుల ఆరోగ్యావసరాలను చూసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సభ్యదేశాలకు సూచించింది. అయిదేళ్ల క్రితం ప్రపంచ ఆరోగ్యసంస్థ ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. కానీ ఆ సంస్థలో దీనిపై శ్రద్ధపెట్టి పనిచేసే విభాగాలు ఆర్థిక సమస్యలతో మూతబడ్డాయి. వలసదారుల్ని చూసి భయపడే సాధారణ ప్రజానీకం, దీన్ని తమకనుకూలంగా మార్చుకుని అధికారం అందుకోవాలనుకునే రాజకీయ పక్షాల నాయకులు సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో వలసదారుల ఆరోగ్యానికి తీసుకోవాల్సిన చర్యలు కూడా ఉన్నాయి. కానీ పట్టించుకునే వారేరి? సక్రమంగా ఆలోచించి వినియోగించుకుంటే వలసదారులు ఏ సమాజాభివృద్ధికైనా తోడ్పడతారు. చాలా రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, బిహార్‌ తదితర రాష్ట్రాల నుంచి వచ్చే నిర్మాణరంగ, వ్యవసాయరంగ కార్మికులకు పనులు లభిస్తున్నాయి. కానీ వారి యోగక్షేమాలు పట్టక పోవటం, వారి నైపుణ్యాభివృద్ధికి అవసరమైన పథకాలు లేకపోవటం సమస్యలకు దారి తీస్తోంది.దురదృష్టవశాత్తూ హింసనుంచీ, వేధింపులనుంచీ తప్పించుకుని వస్తున్న వలసదారుల్ని అనుమాన దృక్కులతో చూసే వైఖరి పెరుగుతోంది. ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించిన మొదట్లోనే ప్రపంచ మానవ హక్కుల డిక్లరేషన్‌ వెలువరించింది. దానికి అనుగుణంగా 1951లో శరణార్థుల ఒడంబడిక అమల్లోకొచ్చింది. మన దేశంతోపాటు ఇండొనేసియా, క్యూబా, ఎరిత్రియా, లిబియా వంటి దేశాలు దానిపై సంతకం చేయలేదు. అలా సంతకం చేయకపోయినా శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్‌ వంటి దేశాలనుంచి వచ్చిన శరణార్థులను భారత్‌ ఆదుకుంది. టిబెట్‌ నుంచి వచ్చిన 80,000 మంది గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఆ్రÔ¶ యం పొందుతున్నారు. కానీ ఆ ఒడంబడికను గుర్తించి సంతకం చేస్తే దానికింద శరణార్థులకు కల్పించాల్సిన తప్పనిసరి సదుపాయాలు వగైరా వుంటాయి. ఇక్కడికొచ్చినవారు వాటిని కోల్పోవాల్సి వస్తోంది. ఎంతో సంపన్నవంతమైన అమెరికాయే వలసలను అడ్డుకోవటానికి వేలాది మందిని జైళ్లపాలు చేస్తోంది. వెనక్కి పంపుతోంది. చాలా యూరప్‌ దేశాలు ఆ మార్గాన్నే అనుసరిస్తున్నాయి. ఇక అంతంత మాత్రం ఆర్థిక వ్యవస్థలతో సతమతమయ్యే దేశాల్లో శరణార్థులను, వలసదారులను ఆదరిస్తారని ఆశించటం దురాశే. ఎవరెంత వ్యతిరేకిస్తున్నా, ద్వేషిస్తున్నా వలసలు మున్ముందు మరింత పెరుగుతాయని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. ఎందుకంటే వారు తమ ఇష్టానుసారం రావటం లేదు. తప్పనిసరై, గత్యంతరం లేక స్వస్థలాలను వదల వలసి వస్తోంది. వలసలను వ్యతిరేకించటం కాక, వాటిని అనుకూలంగా మలుచుకోవటం ఎలాగో నేర్చుకోవటం అన్ని దేశాలకూ తప్పనిసరి.

Delimitation process begins as soon as new census results are available5
రంగారెడ్డిలో ఎక్కువ.. నిజామాబాద్‌లో తక్కువ

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ శాసనసభ వచ్చే ఎన్నికల అనంతరం 153 మందితో కొలువు దీరనుంది. అందులో ఏకంగా 50 మంది మహిళా సభ్యులు ఉండనున్నారు. కొత్తగా రాష్ట్రంలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. 2027 మార్చికి జనాభా లెక్కలు పూర్తి కాగానే, నియోజకవర్గాల పునర్విభజన కమిషన్‌ (డీలిమిటేషన్‌) పని ప్రారంభించి 6 నెలల్లో పూర్తి చేయనుంది. తెలంగాణ శాసనసభకు 2028 నవంబర్‌–డిసెంబర్‌లో జరిగే ఎన్నికలు కొత్త నియోజకవర్గాలతో నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల నుంచే మహిళలకు 33% రిజర్వేషన్‌ కూడా వర్తించనుంది. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతోపాటు ప్రస్తుతం ఉన్న కొన్ని నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దుల్లోనూ మార్పులు జరుగుతాయి. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. సగటు జనాభా ప్రామాణికంగా...ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 2,30,064 జనాభా ఉండనుంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014లో పేర్కొన్న విధంగా తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాల్సి ఉంది. కానీ వివిధ రాజకీయ కారణాలతో దానిని వాయిదా వేస్తూ వచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాల పునర్విభజనను జాప్యం చేస్తున్నారంటూ ప్రొఫెసర్‌ పురుషోత్తంరెడ్డి సుప్రీంకోర్టులో వేసిన రిట్‌ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సమాధానమిస్తూ.. కొత్త జనాభా లెక్కలు రాగానే ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపింది. కోర్టు కేసుతో సంబంధం లేకుండానే 2027 తర్వాత దేశమంతా పునర్విభజన చేస్తుండటంతో రాష్ట్రంలో నియోజకవర్గాల్లో చేర్పులు, మార్పులు, కొత్త నియోజకవర్గాల ఏర్పాటు అనివార్యం కానున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యధిక స్థానాలు 2011 జనాభా లెక్కలతోపాటు, నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ తాజా అంచనాల మేరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏకంగా 9 శాసనసభ స్థానాలు పెరగనున్నాయి. అవన్నీ ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉన్న శివారు ప్రాంతాల్లోనే కావటం విశేషం. జాతీయ సగటును మించి, విద్య, ఉపాధి, ఐటీ, ఫార్మా, సినిమా, ఇతర అవకాశాల కోసం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు పెరిగిన వలసల తాకిడి కారణంగా నగరంలో అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. పునర్విభజనలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో కనీసం పది అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్‌ కోర్‌సిటీ (హైదరాబాద్‌ జిల్లా)లో రెండు, గ్రేటర్‌ హైదరాబాద్‌లో భాగమైన శివార్లలోని కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, మేడ్చల్, ఉప్పల్, మల్కాజిగిరి, రాజేంద్రనగర్, మహేశ్వరం తదితర నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాలన్నీ విడిపోయి కొత్తగా 9 కొత్త నియోకజవర్గాలు ఏర్పాటు కానున్నాయి.ఖమ్మం జిల్లాలో ప్రత్యేక పరిస్ధితిడీలిమిటేషన్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రత్యేక పరిస్థితి ఏర్పడనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లా జనాభా 27,97,370. అయితే, ఆ జిల్లా నుంచి 5 మండలాలు ఏపీలో విలీనం కావటం, కొన్ని మండలాలు ములుగు జిల్లాల్లోకి వెళ్లటంతో జిల్లా జనాభా గణనీయంగా తగ్గిపోయింది. అయినా, ఆదివాసీ ప్రాంతాలు, భౌగోళిక పరిస్థితుల కారణంగా ఆ జిల్లాలో శాసనసభ స్థానాలు తగ్గించకుండా అదనంగా రెండుస్థానాలు పెంచే అవకాశం ఉంది.డీలిమిటేషన్‌ ఇలా..– దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు పూర్తి కాగానే నియోజకవర్గాల పునర్విభజన కోసం ఏర్పాటయ్యే కమిషన్‌ రాజకీయ పక్షాలు, ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తుంది. కొత్త జిల్లాల మేరకు ఒక మండలం ఒకే నియోజకవర్గం, ఒకే జిల్లాలో ఉండే విధంగా భౌగోళిక మార్పులు చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో పలు నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో కూడా ఉండగా, వాటిని ఒకే జిల్లా పరిధిలోకి తీసుకొస్తారు.– రాష్ట్ర మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గంలో ఉండాల్సిన సగటు జనాభాను నిర్ణయిస్తారు. 2001 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకున్న గత కమిషన్‌ తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి 2,30,064 సగటు జనాభాగా నిర్దారించింది. అయితే ఈ సగటుకు 10 శాతం జనాభా తక్కువ లేదా ఎక్కువైనా ఉండొచ్చు.– 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న జనాభాను సగటుగా తీసుకుని డీలిమిటేషన్‌ చేయటంతో తెలంగాణలో అంతకు ముందు 107 ఉన్న అంసెబ్లీ స్థానాలు 119కి పెరిగాయి. 12 స్థానాలు ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిపోయాయి.– డీలిమిటేషన్‌లో కొండప్రాంతాలు, గిరిజనులు, ఇతర ప్రత్యేక కారణాలను కూడా పరిగణనలోకి తీసుకుని నియోకజవర్గాలు ఏర్పాటు చేస్తారు. కొండలతో, విసిరేసినట్లు ఉండే హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహోల్‌ – స్పితి అసెంబ్లీ నియోజకవర్గం 25 వేల జనాభాతోనే ఏర్పాటైంది. సిక్కింలోని సాంగ్మో అసెంబ్లీ స్థానం సైతం తక్కువ జనాభాతో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 6,98,000 మందితో అత్యధిక జనాభా కలిగిన శాసనసభ నియోజకవర్గంగా శేరిలింగంపల్లి రికార్డుకెక్కింది. ఢిల్లీలోని చాందినీచౌక్, యూపీలోని ఘజియాబాద్‌లు సైతం జనాభా పరంగా అదిపెద్ద నియోజకవర్గాలే.

Pak Army Chief Asim Munir Faces Protests In America6
అసిమ్‌ మునీర్.. యూఎస్‌ పర్యటనకు వస్తావా?, నీకు సిగ్గుందా?

వాషింగ్టన్‌ డీసీ: పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌.. జనరల్‌ సయ్యద్‌ అసిమ్‌ మునీర్‌. నియంతగా, అత్యంత కఠినాత్ముడిగా పేరుంది. పాకిస్తాన్‌లో ప్రధాని పేరు కంటే కూడా అసిమ్‌ మునీర్‌ పేరే ఎక్కువగా వినిపిస్తుందనేది కాదనలేని సత్యం. ఇదంతా ఒకటైతే, ఇప్పుడు మునిర్‌ అమెరికా పర్యటనలో ఉన్నారు. అధికారిక అమెరికా పర్యటన ఖరారు కావడంతో ఇప్పుడు ఆ దేశంలో ఉన్నారు మునీర్‌. అయితే మునీర్‌కు అమెరికాలో నిరసన సెగ మామూలుగా లేదు. పెద్ద ఎత్తును మునీర్‌ అమెరికా పర్యటనపై వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నాయి. భారీగా హోర్డింగ్‌లు వెలవడంతో పాటు నిరసనకారులు కూడా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. అసలు అమెరికా పర్యటనకు రావడానికి నీకు సిగ్గుందా..? అని మనీర్‌ బస చేస్తున్న చోట నిరసనకారులు ఆందోళన చేపట్టారు.ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘పాకిస్తాన్‌ ప్రజలు ప్రాణాలు తీసే నీవు ఇక్కడ ఏం మాట్లాడాతావ్‌, ఇక తుపాకీలు మాట్లాడితే ప్రజాస్వామ్యం చచ్చిపోయినట్లే’ అని వెలసిన హోర్డింగ్‌లు మునీర్‌పై తీవ్ర వ్యతిరేకతను తెలియజేస్తున్నాయి. WATCH: Failed Asim Munir gets humiliated by the Pakistani Diaspora during his trip to USA.He was called 'Murderer of Pakistanis'. pic.twitter.com/NSRKywNuh3— Sensei Kraken Zero (@YearOfTheKraken) June 17, 2025 pic.twitter.com/poIqJuGdnv Asim Munir has fallen into the hands of Pakistanis in America—exposed as the dictator, traitor, and butcher of his own people that he truly is!" From Pakistan #11YearsofInjustice Trump and Israel— ⁱᴵⁿˢᵃᶠ فکر (@shaoooohoor) June 17, 2025 ఐదు రోజుల అమెరికా పర్యటనపాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌ ఐదు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ఆదివారం ఇక్కడకు వచ్చారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా అమెరికాతో సైనిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో అధికారిక పర్యటన కోసం మునీర్ వాషింగ్టన్ చేరుకున్నారు.

Does Rat Hold Key In Plane Incident At Ahmedabad7
Air India Incident: దర్యాప్తులో RAT కీలక పాత్ర పోషించనుందా?

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో జూన్‌ 12వ తేదీన జరిగిన విమాన ప్రమాదం అతి పెద్ద విషాదంగా మారిపోయింది. ఆ విమానంలో ఉన్న 241 మందితో పాటు బయట ఉన్న మరో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో అహ్మదాబాద్‌ విమాన ప్రమాద మృతుల సంఖ్య 274కు చేరింది. అయితే ఈ దుర్ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో విమానంలో ఒకేసారి రెండు ఇంజన్‌లు పనిచేయకపోవడం ఆసక్తికరంగా మారింది. అసలు డ్యుయల్‌ ఇంజన్‌తో నడిచే విమానాల్లో ఒక ఇంజన్‌ పని చేయని పక్షంలో మరో ఇంజన్‌ పునరుద్ధరించబడుతోంది. ఇది సెకన్లలో జరిగే ప్రక్రియ. ఇందుకు RAT(Ram Air Turbine) దోహదం చేస్తుంది. ఇప్పుడు దీనిపైనే సర్వత్రా చర్చ నెలకొంది. రెండు ఇంజన్లలో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగానే ఇది జరిగి ఉండవచ్చని అధిక శాతం మంది విమాన రంగ నిపుణులు చెబుతున్నప్పటికీ, ఇలా జరిగినప్పుడు RAT ఎంతవరకూ పని చేసిందనేది మరో కోణంలో చర్చకు తెరలేపింది. ఎయిర్‌లైన్స్‌లో RAT అంటే ర్యామ్‌ ఎయిర్ టర్బైన్ (Ram Air Turbine). ఇది విమానంలో ఒక చిన్న టర్బైన్, ఇది విమానం యొక్క ప్రాథమిక శక్తి వనరులు విఫలమైనప్పుడు ఉపయోగించబడుతుంది. ఇది విమాన నియంత్రణ వ్యవస్థలతో పాట ఇతర ముఖ్యమైన భాగాలకు శక్తిని అందించి తిరిగి గాడిలో పడేందుకు ఉపకరిస్తుంది. విమానంలో ఆటోమేటిక్‌గా పని చేసే RAT.. డ్యూయల్ ఇంజిన్ వైఫల్యం, విద్యుత్ వైఫల్యం లేదా హైడ్రాలిక్ వైఫల్యం సంభవించినప్పుడు అది యాక్టివేట్‌ అవుతుంది. ఇక్కడ RAT ఎంతవరకూ పని చేసిందనేది ప్రధాన ప్రశ్న. గేర్‌లను విస్తరించడానికి లేదా ఉపసంహరించుకోవడంతో పాటు విద్యుత్ శక్తిని పునరుద్ధరిస్తుంది. కీలకమైన విద్యుత్ వ్యవస్థలను నిర్వహించడంలో సహాయపడటానికి తగినంత శక్తిని ఉత్పత్తి చేయడానికి రూపొందించబడిన RAT.. ఇప్పుడు దర్యాప్తులో కీలకం కానుంది. విమాన ప్రమాదం జరిగే సమయంలో RAT యాక్టివేట్‌ అయ్యిందనే చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు ప్రమాద ఘటన వీడియోల్లో కూడా కనిపించింది. అయితే విమానం గాల్లోకి టేకాఫ్‌ తీసుకున్న సెకన్ల వ్యవధిలోనే కూలిపోవడంతో RAT యాక్టివేట్‌ అయినా అది విఫలంగానే మిగిలిపోయిందనేది మరో వాదన. టెన్షన్‌.. టెన్షన్‌.. మరో ఎయిర్‌ ఇండియా విమానం రద్దు

2 Machetes, A Signal: Crime Scene Recreation Reveals Shocking Details In Raja Raghuvanshi Case8
మేఘాలయ హనీమూన్‌ హత్య కేసులో మరో ట్విస్ట్‌

షిల్లాంగ్ : సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్‌ హత్య కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. పథకం ప్రకారం భర్త రాజా రఘు వంశీని చంపించిన భార్య సోనమ్‌ రఘువంశీని ఓ పదునైన ఆయుధం పోలీసులకు పట్టించింది. అయితే, ఈ హత్య చేసేందుకు ఒక్క ఆయుధం కాదని, మరో ఆయుధాన్ని వినియోగించినట్లు పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో గుర్తించారు.ఇక ఈ కేసు విచారించేందుకు ఏర్పాటైన సిట్‌ బృందం సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసేందుకు నిందితుల్ని ఇవాళ (జూన్‌ 17) ఘటన జరిగిన సోహ్రాలోని వీ సావ్‌డాంగ్ జలపాత ప్రాంతానికి తీసుకెళ్లింది. ఈ సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో నిందితులు రాజా రఘువంశీని హతమార్చేందుకు రెండు మారణాయుధాల్ని వినియోగించినట్లు గుర్తించామని ఈస్ట్ కాశీ హిల్స్‌ సూపరిటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ వివేక్‌ వివేక్‌ సియాం వెల్లడించారు.#WATCH राजा रघुवंशी हत्याकांड में क्राइम सीन रिक्रिएशन पर एसपी ईस्ट खासी हिल्स विवेक सियेम ने कहा, "हमने क्राइम सीन रिक्रिट किया कि आरोपियों ने यह कैसे किया होगा। हमने पार्किंग स्थल से शुरुआत की, जहां उन्होंने अपने स्कूटी वाहन रखी थी..हम व्यूपॉइंट पर गए और पता लगाया कि हत्या से… pic.twitter.com/U6xg1KOIIa— ANI_HindiNews (@AHindinews) June 17, 2025మరి మరో ఆయుధం ఎక్కడ?సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో హత్య జరిగిన రోజు నిందితులు ఎక్కడ ఏం చేశారు? ఏ ప్రాంతంలో ఉన్నారు? ఏం చేశారు? వంటి వివరాల్ని సేకరించాం. వాళ్లు చెప్పిన వివరాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే హత్య కోసం రెండు ఆయుధాల్ని వినియోగించినట్లు తేలింది. ఇప్పటికే ఒక ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నాం. మరో ఆయుధం గురించి అన్వేషణ కొనసాగుతోందన్నారు. సోనమ్‌ సైగ.. రాజాపై విశాల్‌ కత్తితో దాడినిందితుల్ని మేం హత్య జరిగిన వ్యూపాయింట్‌కు తీసుకెళ్లాము. అక్కడ ఎవరి పొజిషన్ ఎలా ఉందో? ఎలా దాడి చేశారో? నిర్ధారించాం. నిజానికి, ఇద్దరు నిందితులు వేర్వేరు ఆయుధాల్ని ఉపయోగించారు. రెండో ఆయుధం కోసం వెతుకుతున్నాం. హత్య అనంతరం రాజా రఘువంశీని ఏ లోయలో పడేశారో అక్కడే ఆకాష్‌ తన చొక్కాను పడేశాడు. తన భర్త రాజా రఘువంశీని హత్య చేయమని సోనమ్‌ నిందితులకు సైగ చేసింది. ఆ సైగతో రాజా రఘువంశీనీ విశాల్‌ చౌహాన్‌ కత్తితో పొడిచాడు. ఆ తర్వాత రాజా నేలకొరిగాడు. రాజా హత్యను సోనమ్‌ కళ్లారా చూసింది‘సోనమ్ నేరాన్ని అంగీకరించింది. నేడు మేము క్రైం సీన్‌ను రిక్రియేట్ చేశాము. ఆమె ఎక్కడ నిల్చుంది? హత్యకేసులో ఆమె పాత్ర ఏమిటో గుర్తించాం. రాజాను ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. హత్యను అక్కడే నిల్చొని సోనమ్ కళ్లారా చూశారు. ఆమె తన ఫోన్‌ను ధ్వంసం చేసింది. ఇది ముందే ప్లాన్ ప్రకారం చేసిన హత్యే. హత్య అనంతరం ఆ ముగ్గురు రాజా శరీరాన్ని లోయలో పడేశారు’. వీరు హత్యకు వెయ్ సవ్‌దాంగ్‌ను ఎంచుకున్న కారణం అక్కడ ఎవ్వరూ ఉండరని. వీరందరు మేఘాలయకు రావడం ఇదే తొలిసారిమా టీమ్ ఇప్పటికే ఇండోర్‌లో ఉంది. కేసు నిమిత్తం మరికొందరిని విచారిస్తున్నారు’ అని చెప్పారు.పెళ్లైన 12రోజులకే భర్తను హత మార్చిన భార్యఏప్రిల్‌ 23న రాజా రఘువంశీ,సోనమ్‌ రఘువంశీల వివాహం జరిగింది.పెళ్లైన 12 రోజులకే ప్రియుడుతో కలిసి జీవించేందుకు సోనమ్ కుట్ర చేసింది. తన భర్త రాజ రఘవంశీ హత్య చేయాలనుకుంది. ఇందుకోసం సోనమ్‌ తన ప్రియుడు సాయంతో విశాల్‌ చౌహాన్‌,ఆనంద్‌ కుమార్‌,కాష్‌ రాజ్‌పుత్‌లకు సుపారీ ఇచ్చింది. ఒప్పందం ప్రకారం.. రాజా రఘువంశీని హతమార్చి తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని వీ సావ్‌డాంగ్ హిల్స్‌లో పడేశారు. జూన్‌ 2న దే జలపాతం వద్ద గుర్తు పట్టలేని విధంగా ఉన్న రాజ రఘువంశీ మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

BJP MLA Raja Singh Says Stand For Unity Of Work In Party9
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన

హైదరాబాద్‌: గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన ఆ పార్టీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌.. తాజాగా సంచలన ప్రకటనతో మరొకసారి వార్తల్లోకి వచ్చారు. ఇక ఐక్యంగా కలిసి పని చేద్దామంటూ రాజాసింగ్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం(జూన్‌ 17) రాజాసింగ్‌ ఓ స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేశారు. ‘పార్టీలో ఐక్యత, పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తున్నాను. కానీ నన్ను టార్గెట్‌ చేసి అడ్డంకులు సృష్టించాలని చూసినా నిస్వార్థంగా పార్టీ కోసమే పని చేశా. ఒక పార్టీ కార్యకర్తనైన నన్ను ఇబ్బంది పెడితే ఏం లాభం?. కిషన్‌రెడ్డి వ్యక్తిగత సమయం ఇస్తే వచ్చి కలుస్తాను. సమస్యలు, పార్టీలో మా స్పష్టతను వివరిస్తాను. సమయం నిర్ణయించే చెబితే వచ్చి కలిసేందుకు సిద్ధంగా ఉన్నా. విభజించడానికి కాదు.. ఐక్యత కోసం ఇక్కడ ఉన్నా. వ్యక్తిగత విభేధాలను విడిచిపెట్టి ఐక్యంగా పని చేద్దాం’ అని రాజాసింగ్‌ తన ప్రకటన ద్వారా స్పష్టం చేశారు.

Suryakumar Yadav travels to England for surgery: Reports10
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియా కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్‌?

భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. అయితే ఈ పర్యటనకు టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దూరమయ్యే అవకాశముంది.సూర్యకుమార్ యాదద్ మ‌రో శస్త్రచికిత్స లండ‌న్‌కు వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. న్యూస్24 రిపోర్టర్ వైభవ్ భోలా ప్రకారం.. సూర్య‌కుమార్ కుడివైపున స్పోర్ట్స్ హెర్నియా సమస్యతో బాధపడుతున్నట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో సూర్య‌ త‌న గాయానికి శ‌స్త్ర‌చికిత్స చేసుకోవ‌డానికి ఇప్ప‌టికే లండ‌న్‌కు వెళ్లిన‌ట్లు వైభ‌వ్ భోలా ఎక్స్‌లో రాసుకొచ్చాడు.కాగా ఈ ముంబై ఆట‌గాడు స్పోర్ట్స్ హెర్నియా బారిన ప‌డ‌డం ఇది రెండో సారి. గతేడాది జ‌న‌వరిలో ఎడమ వైపున నొప్పి రావ‌డంతో జ‌ర్మ‌నీలో స‌ర్జ‌రీ చేయించుకున్నాడు. ఈ క్ర‌మంలోనే స్వ‌దేశంలో అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌కు దూర‌మ‌య్యాడు. కానీ ఫిట్‌నెస్ సాధించి ఐపీఎల్‌తో పాటు, టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2024లో భాగ‌మ‌య్యాడు.ఇప్పుడు కుడివైపు నొప్పి రావ‌డంతో మ‌ళ్లీ శ‌స్త్ర‌చికిత్స చేయించుకోనున్నాడు. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే మిస్ట‌ర్ 360 దాదాపు రెండు నెల‌ల పాటు ఆట‌కు దూరంగా ఉండ‌నున్నాడు. బంగ్లా టూర్‌కు సూర్య సూర్య‌దూర‌మైతే భార‌త జ‌ట్టు కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్ వ్య‌వ‌హ‌రించే అవ‌కాశ‌ముంది. ఐపీఎల్‌-2025లో అద్బుత ప్ర‌ద‌ర్శ‌న‌తో సెల‌క్ట‌ర్ల దృష్టిని ఆకర్షించిన అయ్యర్‌.. తిరిగి టీ20 జట్టులోకి రీఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు.చదవండి: ICC Odi Rankings: వ‌ర‌ల్డ్ నెం1 బ్యాట‌ర్‌గా టీమిండియా స్టార్ ఓపెన‌ర్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement