సక్సెస్‌ ఊరికే రాదు : వేలకోట్లతో నెక్ట్స్‌ లెవల్‌ అంతే! ఎవరీ బిలియనీర్‌ మహిళ | Metro CMD Farah Malik Bhanji, India's wealthiest Muslim woman success story | Sakshi
Sakshi News home page

సక్సెస్‌ ఊరికే రాదు : వేలకోట్లతో నెక్ట్స్‌ లెవల్‌ అంతే! ఎవరీ బిలియనీర్‌ మహిళ

Published Thu, May 23 2024 5:17 PM | Last Updated on Thu, May 23 2024 9:04 PM

Metro CMD Farah Malik Bhanji, India's wealthiest Muslim woman success story

దేశంలోనే సంపన్న ముస్లిం మహిళగా రికార్డు, వేలకోట్ల సంపద

మెట్రో బ్రాండ్‌   సీఎండీ  ఫరా మాలిక్ భాంజీ 

విజయవంతమైన వ్యాపార కుటుంబం నుంచి వారసులు చాలామంది వస్తారు. కానీ ఆ విజయాన్ని అంది పుచ్చుకుని అసాధారణ వృద్ధితో ఎదిగిన వ్యాపార దిగ్గజాలు కొంతమందే ఉంటారు.  ప్రముఖ ఫుట్‌వేర్ కంపెనీ  'మెట్రో బ్రాండ్స్' మేనేజింగ్ డైరెక్టర్ ఫరా మాలిక్ భాంజీ కథ అలాంటిదే. బిలియనీర్ ఫరా మాలిక్ భాంజీ గురించి ఇంట్రస్టింగ్‌ సంగతులు ఈ కథనంలో తెలుసుకుందాం.

దేశంలోనే సంపన్న ముస్లిం మహిళగా  గుర్తింపు పొందారు.  కంపెనీ సీఎండీగా ఫరా మాలిక్‌ భాంజీ రూ. 28,773 కోట్ల కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. మెట్రో బ్రాండ్స్ ఛైర్మన్ రఫీక్ మాలిక్ రెండో కుమార్తె. తన నలుగురు సోదరీమణుల మాదిరిగానే, లంచ్ టేబుల్ వద్ద షాప్ టాక్ వింటూ పెరిగింది. కానీ కంపెనీ పగ్గాలు చేపట్టిన తరువాత  ఫరా మార్గదర్శకత్వంలో, గతంలో 'మెట్రో షూస్'గా పిలువబడే  మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. డిసెంబర్ 8 నాటికి 35,117 కోట్ల చేరడం విశేషం.

ముంబై కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తోంది ఈ కంపెనీ.  ఫరా తాత మాలిక్ తేజాని 1955లో తిరిగి స్థాపించారు. మోచి, మెట్రో , వాక్‌వే వంటి విజయవంతమైన బ్రాండ్‌ల రాకకు పునాది. పాదరక్షల పరిశ్రమలో 20 ఏళ్ల చరిత్రను తిరగరాసి ఆధునిక యుగంలో గేమ్ ఛేంజర్‌గా నిలిచింది ఫరా.   ఆమె వినూత్న విధానం , ఫార్వర్డ్-థింకింగ్ స్ట్రాటజీలు కంపెనీని  నెక్ట్స్‌ లెవల్‌కి  చేర్చాయి.  

ఆస్టిన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఉ‍న్నత  చదువు చదివి  కంపెనీలో మార్కెటింగ్ రంగంలో తన వృత్తిని ప్రారంభించింది. ఇదే  ఆ తర్వాత మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ సరఫరా గొలుసును పునరుద్ధరించడానికి తోడ్పడింది.2010లో వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసి, ఆన్‌లైన్‌ అమ్మకాలు ప్రారంభించారు. దేశీ సంస్థల ఉత్పత్తులను రిటైలింగ్‌ చేసిన మెట్రో  విదేశీ పాదరక్షల జోడింపుతో ‘మెట్రో బ్రాండ్స్‌’గా అవతరించింది.

మెట్రో బ్రాండ్స్ పాదరక్షల దిగ్గజం క్రాక్స్ ఇండియా లిమిటెడ్ (CIL)తో ఒప్పందం నిబంధనలు, మార్పులతో తన భాగస్వామ్యాన్ని కూడా విస్తరించింది.  దీని ప్రకారం  భారతదేశంలోని పశ్చిమ , దక్షిణ రాష్ట్రాలలో Crocs "ఫుల్‌  కాస్ట్‌ " దుకాణాలనిర్వహణకు మెట్రో బ్రాండ్‌లకు ప్రత్యేక హక్కులను మంజూరు చేస్తుంది. కంపెనీ భారతదేశం అంతటా 200కి పైగా ప్రత్యేకమైన క్రోక్స్ స్టోర్‌లను నిర్వహిస్తోంది.స్కేచర్స్, క్లార్క్స్ వంటి ఇతర గ్లోబల్ టైటాన్స్‌తో వ్యూహాత్మక  ఒప్పందాలున్నాయి. 2021లో మెట్రోని ఐపీవోకు వచ్చింది. రూ.28 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తూ  ఫోర్బ్స్‌ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. వ్యాపార రంగంలో ఫరా మాలిక్ భాంజీ  చెరగని ముద్ర వేసుకున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతోపాటు, పరిశ్రమ దిగ్గజాలకు సైతం స్ఫూర్తిగా ఉన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement