ప్రధాన వార్తలు

సుందర్ పిచాయ్ ఇక బిలియనీర్..
ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ బిలియనీర్స్ క్లబ్లోకి చేరారు. 1 బిలియన్ డాలర్ల నికర సంపద పరిమితిని అధిగమించి బిలియనీర్గా అవతరించారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఆల్ఫాబెట్ షేర్లు ఆల్టైమ్ గరిష్టానికి చేరుకోవడంతో, భారత్కు చెందిన 53 ఏళ్ల పిచాయ్ నెట్వర్త్ 1.1 బిలియన్ డాలర్లకు పెరిగింది.2023 ప్రారంభం నుంచి ఆల్ఫాబెట్ స్టాక్ 120 శాతానికి పైగా పెరగడం, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 ట్రిలియన్ డాలర్లకు పైగా పెరగడం ఈ ఆర్థిక పురోగతికి ప్రధాన కారణమని బ్లూమ్బర్గ్ పేర్కొంది. ముఖ్యంగా టెక్ రంగంలో ఒక వ్యవస్థాపకేతర సీఈఓకు ఇది అరుదైన ఘనత. మెటాకు చెందిన మార్క్ జుకర్ బర్గ్, ఎన్విడియాకు చెందిన జెన్సెన్ హువాంగ్ వంటి ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ లు బిలియనీర్స్గా ముందు వరసలో ఉన్నప్పటికీ వారు తమ కంపెనీల్లో ఈక్విటీ వాటాలను కలిగి ఉన్నారు.సీఈవోగా పదేళ్లుఆల్ఫాబెట్ సీఈవోగా సుందర్ పిచాయ్ ఇటీవలే పదేళ్లు పూర్తి చేసుకుని కంపెనీలో ఎక్కువ కాలం చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. పిచాయ్ 2004లో ఆల్ఫాబెట్ ప్రధాన అనుబంధ సంస్థ గూగుల్ లో చేరారు. క్రోమ్, ఆండ్రాయిడ్ లకు ఆయన తొలినాళ్లలో చేసిన సేవలు 2015లో సీఈఓగా ఎదగడానికి పునాది వేశాయి. తర్వాత 2019లో ఆల్ఫాబెట్ సీఈఓగా సుందర్ పిచాయ్ నియమితులయ్యారు.నిరాడంబర నేపథ్యం..సుందర్ పిచాయ్ తమిళనాడులోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి రెండు గదుల అపార్ట్ మెంట్ లో పెరిగారు. వారి కుటుంబానికి కారు ఉండేది కాదు. ఆయనకు 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తొలిసారిగా ఇంటికి టెలిఫోన్ వచ్చింది. 1993 లో సుందర్ పిచాయ్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి స్కాలర్షిప్ సాధించగా ఆయన్ను కాలిఫోర్నియా పంపించడానికి విమాన టికెట్ కోసం ఆయన తండ్రి ఏడాది మొత్తం జీతం కంటే కూడా పైగానే ఆ కుటుంబం ఖర్చుపెట్టాల్సి వచ్చింది.

రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్.. ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి సాయం!
బాలీవుడ్ నటుడు సోను సూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా నిలిచారు. ఈ విషాద సమయంలో వారికి ఆర్థికసాయం అందించారు. తనవంతు సాయంగా లక్షన్నర రూపాయలు ఫిష్ వెంకట్ కుటుంబానికి అందించారు. అంతే కాకుండా సోనూ సూద్ కూడా వ్యక్తిగతంగా ఫిష్ వెంకట్ భార్య, కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడినట్లు తెలుస్తోంది.కాగా.. ఇటీవల కిడ్నీల సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఫిష్ వెంకట్ కోలుకోలేక మృతి చెందారు. ఫిష్ వెంకట్ పరిస్థితి గురించి తెలుసుకున్న కొందరు ఆయన వైద్యం కోసం ఆర్థికసాయం అందించారు. అయినప్పటికీ సరైన సమయంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగకపోవడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.కాగా.. జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ సినిమాతో ఫేమస్ అయిన ఫిష్ వెంకట్ పలు టాలీవుడ్ చిత్రాల్లో మెప్పించారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్, ఖైదీ నంబర్ 150, శివం లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించారు. కమెడియన్గా మాత్రమే కాదు విలన్ పాత్రల్లోనూ అభిమానులను మెప్పించారు. ఫిష్ వెంకట్ చివరిసారిగా కాఫీ విత్ ఎ కిల్లర్లో కనిపించాడు.

రూట్ రికార్డు శతకం.. భారీ ఆధిక్యంలో ఇంగ్లండ్
Update: టీమిండియా-ఇంగ్లండ్ మధ్య నాలుగవ టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. మాంచెస్టర్ వేదికగా శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 544 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ 77, లియాం డాసన్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కంటే ఇంగ్లండ్ ప్రస్తుతం 186 పరుగుల ఆధిక్యంలో ఉంది.రూట్ రికార్డు శతకం: మాంచెస్టర్ టెస్ట్లో ఇంగ్లండ్ భారీ ఆధిక్యం సాధించింది. 127 ఓవర్ల తర్వాత ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 523 పరుగులు చేసి, 165 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. రూట్ రికార్డు శతకం (150) సాధించి ఇంగ్లండ్ను పటిష్ట స్థితికి చేర్చాడు. అతనికి స్టోక్స్ (66 రిటైర్డ్ హర్ట్) అండగా నిలిచాడు. క్రిస్ వోక్స్ (2), లియామ్ డాసన్ (7) క్రీజ్లో ఉన్నారు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు జాక్ క్రాలే (84), బెన్ డకెట్ (94), ఓలీ పోప్ (71) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. హ్యారీ బ్రూక్ (3) ఒక్కడే నిరాశపరిచాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా.. 2, అన్షుల్ కంబోజ్ ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

హెచ్సీఏలో మరో భారీ స్కాం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)లో మరో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. సీఐడీ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. సమ్మర్ క్యాంప్ల పేరుతో హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అండ్ కో.. రూ.4 కోట్ల రూపాయలు కాజేసినట్లు సీఐడీ గుర్తించింది. గతేడాది మే 20 నుంచి మే 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 28 కేంద్రాల్లో సమ్మర్ క్యాంప్లు నిర్వహించిన హెచ్సీఏ.. ప్రతీ క్యాంప్లో 100 మందికి చొప్పున దాదాపు 2500 మందికి పైగా క్రికెట్ కోచింగ్ ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చెప్పింది.ఒక్కో క్యాంప్పై రూ.15 లక్షలు ఖర్చు చేసినట్లు చూపి.. రూ.4 కోట్ల రూపాయలు జగన్మోహన్రావు కాజేశారు. క్యాంప్కి హాజరైన విద్యార్థులకు క్రికెట్ కిట్స్ ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చూపించారు. క్యాంప్లు నిర్వహించిన కేంద్రాల్లో సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఒక్కో క్యాంప్లో లక్ష కూడా ఖర్చు చేయలేదని సీఐడీ ఆధారాలు సేకరించింది.కాగా, హెచ్సీఏ కేసులో ముగ్గురికి బెయిల్ మంజూరైంది. హచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాస్రావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత, సెక్రటరీ రాజేందర్ యాదవ్కు బెయిల్ మంజూరైంది. మరో వైపు జగన్మోహన్రావును కస్టడీ పొడిగించాలని సీఐడీ వేసిన పిటిషన్ కోర్టు కొట్టివేసింది. మల్కాజిగిరి కోర్టులో జగన్మోహన్రావుతో పాటు సీఈవో సునీల్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. సోమవారం బెయిల్ పిటిషన్లపై వాదనలు జరగనున్నాయి.

మోజు తగ్గుతోంది.. మొగ్గు మారుతోంది..!
విదేశాల్లో చదువు కోవడం అంటే భారత విద్యార్థులకు మోజు.. అందులోనూ అమెరికా, కెనడా, యూకే వంటి దేశాల్లో చదవడం అంటే అది మరింత క్రేజు. మరి ఇప్పుడు భారత విద్యార్థుల అభిరుచి మారిందా? అంటే అవుననక తప్పదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విదేశాల్లో చదవడం కష్టతరంగా మారింది. ప్రధానంగా వీసా నిబంధనలు కఠినతరం కావడం, ఖర్చులు పెరగడం వంటి తదితర కారణాలతో భారత విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆసక్తి తగ్గిపోతోంది. అదే సమయంలో భారతదేశంలోనే మెరుగైన అవకాశాలు లభించడం వంటి కారణాలతో విదేశాల్లో చదువుకు వెనకడుగు వేస్తున్నారు. విదేశాల్లో భారత విద్యార్థుల చదువుల అంశానికి సంబంధించి పలు నివేదికలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. యూఎస్, యూకేను వదిలేద్దాం..!గత కొన్నేళ్లుగా విదేశాల్లో చదివే భారత విద్యార్థుల సంఖ్య గణనీయకంగా తగ్గింది. 2023 నాటికి విదేశాల్లో చదివే భారత విద్యార్థుల సంఖ్య 8.92 లక్షలు ఉండగా, అది 2024 నాటికి 7.59 లక్షలకు తగ్గింది. దీనికి కారణాలు మాత్రం ప్రధానంగా అగ్రదేశాలైన యూఎస్ఏ, యూకే, కెనడాల్లో చదవాలనే కోరిక ఒకటి. అయితే ఈ దేశాల్లో వీసాల నిబంధనలు కఠినతరంగా మారాయి. దాంతో అమెరికా, యూకే, కెనడాలపై దృష్టి పెట్టడం లేదు. దాంతో విదేశాల్లో చదవాలనుకునే భారత్ విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఇదొక కారణంగా మారింది. ప్రస్తుతం పలువురు విద్యార్థుల మాత్రమే యూఎస్, యూకేలపై దృష్టి సారిస్తుండగా, అధిక శాతం మంది మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో కొంతమంది భారత్లోనే ఉన్నత చదువులకు ఆసక్తి చూపిస్తుండగా, మరి కొంతమంది మాత్రం వీసా నిబంధనలు సులభతరంగా ఉండి ఫీజులు తక్కువగా ఉండే దేశాల వైపు మొగ్గు చూపిస్తున్నారు.కెనడా అసలే వద్దు..!గతంలో అమెరికాలో చదువు కోవడానికి వీలు లేకపోతే, కెనడా వైపు దృష్టి సారించే వారు అధిక శాతం మంది భారత విద్యార్థులు. అయితే జస్టిన్ ట్రూడో హయాంలో భారత్-కెనడా దౌత్స సంబంధాలు దెబ్బ తినడంతో పాటు అక్కడ వీసా నిబంధనలు కూడా కఠినతరంగా మారాయి.ట్రూడో హయాంలో వీసా పరిమితులు, ఎస్డీఎస్ (Student Direct Stream ప్రోగ్రాం రద్దు, వర్క్ పరిమితులు వంటి మార్పులు భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఒక విషయాన్ని గమనిస్తే 2023లో 2.33 లక్షల మంది విద్యార్థులు కెనడా వెళ్లగా, 2024లో అది కాస్తా1.37 లక్షలకు పడిపోయింది. అంటే కెనడా అసలే వద్దు అనే నిర్ణయానికి అధిక శాతం భారత విద్యార్థులు వచ్చారనేది ఈ గణాంకాల్ని బట్టి అర్ధమవుతోంది.బంగ్లా, ఉజ్బెకిస్థాన్లో ఉన్నత చదువులు..విదేశాల్లో చదువాలనుకునే భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గడం ఒకటైతే, అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లడానికి వీసా తదితర ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో బంగ్లదేశ్, ఉజ్భెకిస్తాన్, సింగపూర్, రష్యా వైపు మొగ్గు చూపిస్తున్నారు. 2023లో 20,368 మంది భారత విద్యార్థులు బంగ్లాదేశ్ వైపు మొగ్గు చూపగా, మరుసటి ఏడాదికి అది కాస్త పెరిగి 29,232కు చేరింది. 2023 నాటికి ఉజ్బెకిస్థాన్లో చదువుకునే భారత విద్యార్థుల సంఖ్య 6, 601 ఉంగా, అది 2024 నాటికి 9,915 చేరింది. ఇక 2023లో రష్యా వైపు 25,503లో భారత విద్యార్థులు ఆసక్తి చూపగా, 2024 నాటికి 31,444 విద్యార్థులకు చేరింది. ఇక సింగపూర్ విషయానికొస్తే ఏడాదిలో 12,000 నుంచి 14,000 మంది విద్యార్థులకు చేరింది. ఎందుకీ మార్పు..?అసలు విదేశాల్లో చదువు అనేది భారీ ఖర్చుతో కూడుకున్నదైతే, అందులో వీసా తదితర నిబంధనల్లో భారీగా మార్పులు చేయడం మరొకటి. ఇది ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపిస్తోంది. యూఎస్, యూకే, కెనడాల్లోనే వీసా నిబంధనల్లో కఠినమైన మార్పులు వచ్చాయి. దాంతో ‘ ఎందుకీ తలనొప్పి’ అని భావించే చిన్న దేశాల వైపు చూస్తున్నారు. తక్కువ ఖర్చుతో మెడికల్, టెక్నికల్ విద్య పూర్తి చేసే అవకాశాలు అధికంగా ఉండటంతో పాటు వీసా ప్రక్రియ సులభతరంగా ఉండటం మరొక కారణం. భారతీయ విద్యార్థులకు అనుకూలమైన కోర్సులు కూడా ఆయా దేశాల్లో ఉండటం కూడా ప్రత్యామ్నాయంగా వాటివైపు చూడటానికి ప్రధానమైన అంశంగా మారింది ఇక భద్రత పరంగా కూడా అక్కడ పెద్దగా ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉండవని భావించే బంగ్లాదేశ్, సింగపూర్, రష్యా, ఉజ్బెకిస్థాన్ తదితర దేశాల వైపు చూడటానికి మరొక కారణంగా చెప్పవచ్చు.

పాంటింగ్నూ దాటేసిన రూట్.. మిగిలింది సచిన్ ఒక్కడే
మాంచెస్టర్ టెస్ట్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ వరుస పెట్టి రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇప్పటికే చాలా రికార్డులు తన ఖాతాలో వేసుకున్న రూట్.. 120 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మరో దిగ్గజ ఆటగాడి రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ స్కోర్ వద్ద రూట్ సచిన్ తర్వాత టెస్ట్ల్లో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ను అధిగమించాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ ఈ ఒక్క ఇన్నింగ్స్తోనే రాహుల్ ద్రవిడ్, జాక్ కల్లిస్, రికీ పాంటింగ్ను దాటేయడం విశేషం. ఇక రూట్ ముందున్న ఏకైక లక్ష్యం సచిన్ ఆల్టైమ్ రికార్డు ఒక్కటే. ఈ రికార్డును చేరుకోవాలంటే రూట్ మరో 2500 పైచిలుకు పరుగులు చేయాలి. ఇది ఈజీ కాదు. అలాగని అసాధ్యం కూడా కాదు.టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు..సచిన్ టెండూల్కర్- 15921జో రూట్- 13380*రికీ పాంటింగ్- 13378జాక్ కల్లిస్- 13289రాహుల్ ద్రవిడ్- 13288మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు టీ విరామం సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 433/4గా ఉంది. రూట్ 121, స్టోక్స్ 36 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 75 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు జాక్ క్రాలే (84), బెన్ డకెట్ (94), ఓలీ పోప్ (71) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. హ్యారీ బ్రూక్ (3) ఒక్కడే నిరాశపరిచాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2, అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

హైవేపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్
ఉత్తర ఇటలీలోని బ్రెస్సియాలో ఘోర ప్రమాదం జరిగింది. చిన్నపాటి విమానం హైవేపై కూలిపోవడంతో ఇద్దరు మరణించారు. మృతులను మిలన్కు న్యాయవాది సెర్గియో రావాగ్లియా(75), ఆయన భార్య ఆన్ మారియా డి స్టెఫానో (60)గా గుర్తించారు. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.రావాగ్లియా హైవేపై అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నం విఫలం కావడంతో.. వేగంగా దూసుకొచ్చిన విమానం ముందు భాగం రోడ్డును ఢీకొట్టింది. దీంతో భారీ మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా ఇద్దరు వాహనదారులు కూడా గాయపడ్డారు.. కానీ ప్రాణాలతో బయటపడ్డారు. మంటలు అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకోగా అప్పటికే ఆ విమానం మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై ఇటలీ నేషనల్ ఏజెన్సీ ఫర్ ఫ్లైట్ సేఫ్టీ దర్యాప్తు చేపట్టింది.🚨 PLANE CRASHED in the middle of the Highway - HORRIFIC VISUALS Brescia, Italy - A small private plane tragically crashed onto a highway The 75 year old Pilot and his partner BOTH DEADToo many Plane Crashes in the last few weeks :'( pic.twitter.com/iRewT9Zz5r— Gautam Seth (@GautamS15540834) July 25, 2025కాగా, ప్రపంచవ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు ప్రయాణీకులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో విమానం ఎక్కాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ప్రమాదాలకు పైలట్స్, విమానంలో సాంకేతిక లోపాలే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

తిరుమల తొక్కిసలాట ఘటన.. అసలు దోషులెక్కడా చంద్రబాబు
సాక్షి,తిరుపతి: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కంటి తుడుపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం జ్యుడిషియల్ కమీషన్ ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై విశ్రాంత న్యాయమూర్తి ఎం.సత్యనారాయణ మూర్తి కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన విచారణపై భూమన మీడియాతో మాట్లాడారు.ఆయన ఏమన్నారంటే.. ‘‘ శ్రీరంగ పట్టణం ఆదర్శంగా తీసుకుని ఆ వైష్ణవ సంప్రదాయం తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనం అవకాశం కల్పించాము. 23 మంది పీఠాధిపతులు హర్షించారు. జనవరి 8 న జరిగిన జరిగిన తొక్కిసలాట పై కంటి తుడుపు చర్యలు కు జ్యుడిషియల్ కమీషన్ ఏర్పాటు చేసింది.సంఘటన జరిగిన తర్వత రోజు కలెక్టర్, ఎస్పీ, ఈవోలుపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన పై ఈవో ఛైర్మన్ల మధ్య అవగాహన లేదు, క్షమాపణ చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ సూచించారు. ఆరోజు గోశాల డైరెక్టర్ హరినాధ రెడ్డి, డీఎస్పీ రమణ సస్పెండ్ చేశారు.చంద్రబాబు ముందే నిర్ణయించుకుని ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. తమకు కావాల్సిన వారితో సాక్షులు ఇప్పించారు హరినాథ్ రెడ్డి, రమణ కుమార్లను బలి ఇచ్చారు. అసలు నిందితులను వదిలి వేశారు. ఆరు మంది చనిపోయి, 50 మందికి పైగా తీవ్ర గాయాలు ఐతే పాక్షికంగా నివేదిక ఇచ్చారుఆ నివేదికను దురుద్దేశ పూర్వకంగా ఇచ్చిన నివేదికగా వైఎస్సార్సీపీ భావిస్తోంది. విజిలెన్స్ నివేదికలు బట్టి చూస్తే.. చంద్రబాబు నియమించిన ఏ విచారణ అయిన ఒక కేస్ స్టడీగా చేశారు. ఆయన కోరుకున్నట్లుగానే విచారణ కమిషన్ ఫలితం వస్తుంది అనడానికి ఇది ఒక కేస్ స్టడీ.హరినాధ రెడ్డికు 21.12.24 నా జరిగిన సమావేశంలో సూర్య ప్రకాష్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు సమాన బాధ్యత ఇచ్చారులా అండ్ ఆర్డర్, విజిలెన్స్ వాళ్లకు క్యూ లైన్ బాధ్యతలు ఇచ్చారు. అండ్ ఆర్డర్ బాధ్యత ఎస్పీ, సీవీ అండ్ ఎస్వో ది కూడా బాధ్యత. వైఎస్సార్సీపీ పాలనలో ఏ ఒక్క చిన్న సంఘటన జరగలేదు.జనవరి 10, 11, 12 తేదీలు మాత్రమే ఎస్ఎస్డీ టోకెన్లు ఇస్తామని చెప్పారు. అధికార యంత్రాంగం ఈ ఘటనకు కారణం, దీనికి సమాధానం లేదు. చంద్రబాబు పాలనలో తొక్కిసలాట ఘటన జరిగితే ఈవోనే బాధ్యత వహించాలని గతంలో చందన ఖాన్ ఒక నివేదిక ఇచ్చారు. కౌంటర్ల వద్ద విధుల్లో ఉన్న వారిని ఎలా చర్యలు తీసుకుంటారు? క్యూ లైన్లో హోల్డింగ్ పాయింట్ అనేది ఎందుకు పెట్టారు.తొక్కిసలాట జరిగిన సమయంలో పోలీసులు చోద్యం చూశారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. మీ బాధ్యత నిర్లక్ష్యం వల్ల తొక్కిసలాట ఘటన జరిగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన జ్యుడిషియల్ కమీషన్ నివేదిక సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాము. మా పాలనలో వైకుంఠ ఏకాదశికు పదిలక్షలు మందికి దర్శనం చేయించాము. 23 మంది పీఠాధిపతులు స్వహస్తాలతో ఇచ్చిన సూచన ప్రకారం పదిరోజుల దర్శనం జరిగింది.పీఠాధిపతులు ఆలోచనలను పక్కన పడేస్తారా.. కేసులు పెట్టాలనే , జైలుకు తరలించాలని చూస్తున్నారు.నా గొంతు కోస్తే తప్ప నేను పోరాటం ఆగదు’’ అని స్పష్టం చేశారు.

ఆపరేషన్ సిందూర్ ఆన్లోనే ఉంది: సీడీఎస్
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిలో తర్వాత పాకిస్తాన్లో ఉగ్రస్ధావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనేది ఇంకా ఆన్లోనే ఉందని సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్) జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. ఈరోజు(శుక్రవారం జూలై 25) ఢిల్లీలో జరిగిన డిఫెన్స్ సెమినార్కు హాజరైన అనిల్ చౌహాన్ మాట్లాడుతూ..ఆపరేషన్ సిందూర్ అనేది అవసరమైన సందర్భంలో మళ్లీ జూలు విదల్చడానికి ఇంకా సిద్ధంగానే ఉందన్నారు.అది నిరంతరం నేర్చుకునే ప్రక్రియఇక భారతదేశ యుద్ధ సామర్థ్యం గురించి ఆయన పలు కీలక విషయాలను చెప్పుకొచ్చారు. యుద్ధ సంసిద్ధత అనేది చాలా హైలెవెల్లో ఉండాలన్నారు. యుద్ధ సామర్థ్యాన్ని పెంపుదించుకోవడానికి ప్రతి గడియా, ప్రతి నిమిషం కూడా చాలా అవసరమన్నారు. అటు సస్త్ర(యుద్ధం) ఇటు శాస్త్రం(జ్ఞానం) అనేవి మిలటరీకి 24x7, 365 రోజులు చాలా కీలకమన్నారు.మూడు స్థాయిల్లో మాస్టర్ కావాలి..యుద్ధ రంగంలోకి దిగే సైనికుడు న్రధానంగా మూడు స్థాయిల్లో మాస్టర్ కావాల్సిన అసవరం ఉందన్నారు. అందులో , నిర్ధిషమైన ప్రణాళిక, వ్యూహాత్మకత, కార్యాచరణ, అనేవి యుద్ధ రంగంలో ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. వీటిలో ప్రతీ సైనికులు ఆరితేరి ఉండాలన్నారు. ఇది ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ముందకు సాగడమే తప్ప ఇందులో షార్ట్ కట్స్ అంటూ ఏమీ ఉండవన్నారు. ప్రస్తుత రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం యొక్క నిరంతర పురోగతి ద్వారా మనం అపూర్వమైన వేగాన్ని చూస్తున్నామని, దాన్ని అందిపుచ్చకుంటూ ముందుకు సాగితేనే యుద్ధంలో పైచేయి సాధిస్తామన్నారు. కాగా, ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అసువులు బాసారు. కశ్మీర్ పర్యాటక ప్రాంతాల్నిచూడటానికి వెళ్లిన పర్యాటకులు ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్సోయారు. ఈ క్రమంలోనేఆపరేషన్ సిందూర్ను భారత్ చేపట్టింది.మే 7వ తేదీన భారత్ చేపట్టిన ఈఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ ఉనికిలో లేకుండా పోయే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాక్ అతాలకుతలమైంది. భారత్ దాడుల్ని తిప్పి కొట్టలేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కాస్త దారికొచ్చింది.ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోకి చొచ్చుకుపోయిని భారత ఆర్మీ బలగాలు అక్కడ కీలక ఉగ్రస్థావరాలను చిన్నాభిన్నం చేశారు. సుమారు వందమందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం ఒకటైతే, ఉగ్రస్థావరాలు ఉన్న చోటల్లా భారత్ చేసిన దాడులకు పాకిస్తాన్ ఊపిరి తీసుకోలేకపోయింది. అలాగే పాక్ ఆర్మీ క్యాంపుల్ని కూడా భారత్ టార్గెట్ చేసి పైచేయి సాధించింది. భారత్ దాడులకు గుక్క తిప్పులేకపోయిన పాకిస్తాన్.. మే 10వ తేదీన కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చింది. పాకిస్తాన్ మిలటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్.. భారత్ ఆర్మీకి ఫోన్ చేసి కాల్పుల విరమణ ఒప్పందానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు.. అదే సమయంలో పాకిస్తాన్ మళ్లీ ఎటువంటి దుస్సాహసానికి పాల్పడ్డాఆపరేషన్ సిందూర్ ఆన్లోనే ఉందని గట్టి హెచ్చరికల నడుమ కాల్పుల విరమణకు అంగీకరించింది భారత్.

ఉల్లూ, ఏఎల్టీటీ సహా 25 యాప్లపై బ్యాన్
అశ్లీల కంటెంట్ను కట్టడి చేసే క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యంతర కంటెంట్ను ప్రొత్సహిస్తున్న ఉల్లూ, ఏఎల్టీటీ సహా 25 వీడియో యాప్లు, వెబ్సైట్ల మీద నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.పోర్నోగ్రఫిక్ సహా అభ్యంతకర కంటెంట్ను ప్రదర్శిస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే.. ఆయా యాప్ల, వెబ్సైట్ల లింకులను ప్రజలకు అందుబాటులో ఉంచకుండా బ్యాన్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్(ISPs)కు ఆదేశాలు జారీ చేసింది.భారత్లో పోర్న్సైట్లపై నిషేధం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యామ్నాయ మార్గాల్లో కోట్ల మంది ఆ సైట్లను వీక్షిస్తున్నారు. అయితే.. కఠిన చట్టాలు లేకపోవడంతో కొన్ని యాప్లు అధికారికంగానే పోర్న్, సాఫ్ట్ పోర్న్ను ప్రొత్సహిస్తూ వస్తున్నాయి. ఇందులో ఉల్లూ, ఏల్టీటీ(ఏక్తాకపూర్కు చెందిన బాలాజీ టెలిఫిలింస్కు చెందిన యాప్, అశ్లీలంతో పాటు సాదారణ సినిమాలూ అందిస్తోంది) తదితరాలు ప్రముఖంగా ఉన్నాయి. ఈ ప్లాట్ఫారమ్లు డబ్బులు తీసుకుని ఇంతకాలం యూజర్లకు అశ్లీల కంటెంట్ విచ్చలవిడిగా అందిస్తూ వచ్చాయి.అయితే రాను రాను.. ఈ వ్యవహారం మరింత ముదిరిపోయింది. ఏకంగా పోర్న్ కంటెంట్ ఇదే తరహా యాప్ల ద్వారా ప్రమోట్ అయ్యింది. ఇది హద్దులు దాటి ‘ఎక్స్’(ట్విటర్) లాంటి పాపులర్ ఓపెన్ మాధ్యమానికి కూడా చేరడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో కేంద్రం నిషేధం విధించడం గమనార్హం. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.తాజా నిషేధిత జాబితాలో.. ఉల్లూ, ఏఎల్టీటీ, బిగ్ షాట్స్ యాప్, దేశీఫ్లెక్స్, బూమెక్స్, నవరసా లైట్, గులాబ్ యాప్, కంగన్ యాప్, బుల్ యాప్, జల్వా యాప్, వావ్ ఎంటర్టైన్మెంట్, లుక్ ఎంటర్టైన్మెంట్, హిట్ప్రైమ్, ఫెనియో, షో ఎక్స్, సోల్ టాకీస్, అడ్డా టీవీ, హాట్ఎక్స్ వీఐపీ, హల్చల్ యాప్, మూడ్ఎక్స్, నియోన్ ఎక్స్ వీఐపీ, ఫూగీ, మోజ్ఫ్లిక్స్, ట్రిఫ్లిక్స్ తదితరాలు ఉన్నాయి.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సెక్షన్ 67, 67 ఏ.. లాగే భారత న్యాయ సంహిత సెక్షన్ 294, మహిళలను అభ్యంతరకరంగా చూపించడం(The Indecent Representation of Women (Prohibition) Act, 1986 సెక్షన్ 4).. ఉల్లంఘనల కింద ఈ యాప్లను నిషేధిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.
టెస్టు చేజారిపోతోంది!
అదో పనికిరాని సర్వే
ఆగస్టులో సుందరకాండ
విశ్వంభరకు బై బై
సెప్టెంబరులో సెట్స్కి...
రూట్ రికార్డు శతకం.. భారీ ఆధిక్యంలో ఇంగ్లండ్
వరల్డ్ ఫ్రెండ్షిప్ డే.. రష్మికతో ప్రముఖ సంస్థ ఒప్పందం..!
వేలాది లేఆఫ్లు.. ఎమోషనల్ అయిన మైక్రోసాఫ్ట్ ఈసీవో
Fact Check: కరుణ్ నాయర్ నిజంగానే ఏడ్చాడా..?
హైవేపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్
బగారా రైస్. చికెన్ కర్రీతో టీచర్ల విందు..కట్ చేస్తే కలెక్టర్..!
'హరి హర వీరమల్లు' మొదటిరోజు కలెక్షన్స్.. గట్టిగానే బాయ్కాట్ దెబ్బ
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు
HHVM Review: ‘హరి హర వీరమల్లు’ మూవీ రివ్యూ
హరి హర వీరమల్లు.. హిట్టా..! ఫట్టా..!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
హైదరాబాద్లో రూ.25 లక్షలకే 2 BHK ఫ్లాట్
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ శుక్రవారం 14 చిత్రాలు స్ట్రీమింగ్!
భారతీయులను నియమించకుండా కాపలాగా నాడ్యూటీ తనే చేస్తున్నారు!
రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్.. ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి సాయం!
హరిహర వీరమల్లు పార్ట్-2.. నిర్మాత రత్నం షాకింగ్ సమాధానం!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
మీరు నటనకు ఎప్పుడూ దూరంగా లేర్సార్! నటిస్తూనే ఉన్నారు!
రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్డేట్
ఊపిరి పీల్చుకున్న పసిడి ప్రియులు.. తులం ఎంతంటే..
ఓటీటీలోకి 'టామ్ క్రూజ్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
అన్ని సార్లు అన్నా కూడా పాపం ‘నోబెల్’వాళ్లు గుర్తించలేద్సార్
సినీ నటుడు రాజీవ్ కనకాలకు నోటీసులు
‘హరి హర వీరమల్లు’ ట్విటర్ రివ్యూ
‘పది కుట్లు పడ్డాయి.. టీమిండియాలోకి వచ్చే ఛాన్స్ లేదు’
టెస్టు చేజారిపోతోంది!
అదో పనికిరాని సర్వే
ఆగస్టులో సుందరకాండ
విశ్వంభరకు బై బై
సెప్టెంబరులో సెట్స్కి...
రూట్ రికార్డు శతకం.. భారీ ఆధిక్యంలో ఇంగ్లండ్
వరల్డ్ ఫ్రెండ్షిప్ డే.. రష్మికతో ప్రముఖ సంస్థ ఒప్పందం..!
వేలాది లేఆఫ్లు.. ఎమోషనల్ అయిన మైక్రోసాఫ్ట్ ఈసీవో
Fact Check: కరుణ్ నాయర్ నిజంగానే ఏడ్చాడా..?
హైవేపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్
బగారా రైస్. చికెన్ కర్రీతో టీచర్ల విందు..కట్ చేస్తే కలెక్టర్..!
'హరి హర వీరమల్లు' మొదటిరోజు కలెక్షన్స్.. గట్టిగానే బాయ్కాట్ దెబ్బ
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు
HHVM Review: ‘హరి హర వీరమల్లు’ మూవీ రివ్యూ
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
హైదరాబాద్లో రూ.25 లక్షలకే 2 BHK ఫ్లాట్
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ శుక్రవారం 14 చిత్రాలు స్ట్రీమింగ్!
భారతీయులను నియమించకుండా కాపలాగా నాడ్యూటీ తనే చేస్తున్నారు!
రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్.. ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి సాయం!
హరిహర వీరమల్లు పార్ట్-2.. నిర్మాత రత్నం షాకింగ్ సమాధానం!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
మీరు నటనకు ఎప్పుడూ దూరంగా లేర్సార్! నటిస్తూనే ఉన్నారు!
రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్డేట్
ఊపిరి పీల్చుకున్న పసిడి ప్రియులు.. తులం ఎంతంటే..
ఓటీటీలోకి 'టామ్ క్రూజ్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
అన్ని సార్లు అన్నా కూడా పాపం ‘నోబెల్’వాళ్లు గుర్తించలేద్సార్
సినీ నటుడు రాజీవ్ కనకాలకు నోటీసులు
‘హరి హర వీరమల్లు’ ట్విటర్ రివ్యూ
‘పది కుట్లు పడ్డాయి.. టీమిండియాలోకి వచ్చే ఛాన్స్ లేదు’
40 ఏళ్ల అంకుల్తో 10వ తరగతి విద్యార్థిని ప్రేమ..!
సినిమా

'మళ్లీ ఇలాంటి అద్భుతమైన అవకాశం దొరికింది': అనసూయ
టాలీవుడ్ నటి అనసూయ రెండు నెలల క్రితమే నూతన గృహ ప్రవేశం చేసింది. తమ జీవితంలో మరో అధ్యాయం మొదలైందంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను షేర్ చేసింది. అంతేకాకుండా తమ కలల సౌధానికి శ్రీరామసంజీవని అని పేరు కూడా పెట్టుకుంది. కొత్తింట్లో సంప్రదాయ పద్ధతిలో హోమాలు, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం, మరకత లింగ రుద్రాభిషేకం నిర్వహించింది.అయితే గృహ ప్రవేశం మరో సంప్రదాయ శుభకార్యం నిర్వహించింది. తన పెద్ద కుమారుడికి ఉపనయనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మన ఆధ్యాత్మిక, వైదిక సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుక ఫోటోలను కూడా షేర్ చేసింది. తాజాగా అనసూయ మరో సంప్రదాయం ఉట్టిపడేలా కుమారులిద్దరికీ స్నానాలు చేయించింది. మన సంస్కృతి ప్రతిబింబించేలా ప్రకృతి ఒడిలో కూర్చోబెట్టి నలుగు పెట్టి మరి స్నానం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.మన పూర్వీకులు/పెద్దలు మనల్ని అనుసరించమని చెప్పినా సంస్కృతి, సంప్రదాయం, ఆచారాలు పాటించాలని తెలిపింది. మన ఆచారాలను అనుసరించడంలో వచ్చే అపరిమితమైన విలువ, సారాంశం, అర్థం చేసుకుంటే అద్భుతంగా ఉంటుందని పోస్ట్ చేసింది. పిల్లలు పుట్టిన తొలినాళ్లలో ఈ ఆచారాలు పాటించానని తెలిపింది. మరోసారి ఇలాంటి అద్భుతమైన అవకాశం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తోంది అనసూయ. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

పెళ్లి చేసుకోలేదు.. తీవ్ర అనారోగ్యం.. ఆస్పత్రి బిల్లులు చెల్లించడానికైనా..
ఆనందం సినిమా హీరోయిన్ గుర్తుందా? రేఖ వేదవ్యాస్ (Rekha Vedavyas).. 2001లో వెండితెరకు పరిచయమైంది. తొలి సినిమా ఆనందంతోనే సెన్సేషన్ అయింది. ఒకటో నెంబర్ కుర్రాడు, దొంగోడు, జానకి వెడ్స్ శ్రీరామ్, ప్రేమించుకున్నాం.. పెళ్లికి రండి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే కన్నడలోనే ఎక్కువ సినిమాలు చేసి అక్కడ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. 2014 తర్వాత వెండితెరకు గుడ్బై చెప్పిన ఈ బ్యూటీ రెండేళ్లక్రితం ఓ షోలో ప్రత్యక్షమైంది.రీఎంట్రీకి రెడీ..పూర్తిగా బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితిలో కనిపించింది. అనారోగ్యంతోనే సన్నబడినట్లు ఆ షోలో వెల్లడించింది. తాజాగా ఆమె రీఎంట్రీకి రెడీగా ఉన్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేఖ వేదవ్యాస్ మాట్లాడుతూ.. చిన్నవయసులోనే కెరీర్ ప్రారంభించాను. నేను కన్నడ అమ్మాయి కావడంతో సాండల్వుడ్కు షిఫ్ట్ అయిపోయి అక్కడే ఎక్కువ సినిమాలు చేశాను. అప్పుడు నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్లు లేకపోవడంతో తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను. తీవ్ర అనారోగ్యంతో సమస్యలు2014 తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యాను. ఒకానొక సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. శారీరకంగా, మానసికంగా కుంగిపోయాను. చాలా నరకం అనుభవించాను. చాలాకాలం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఈ రోజుల్లో వైద్య ఖర్చులు భరించడం అంత ఈజీ కాదు. ఆ బిల్లులు చెల్లిండానికైనా మళ్లీ సినిమాలు చేయాల్సిందే! సినిమాలే కాదు.. యాక్టింగ్ పరంగా ఏ ప్రాజెక్టుల్లోనైనా నటిస్తాను.పెళ్లి చేసుకోలేదుఇప్పటివరకు నేను పెళ్లి చేసుకోలేదు. ఈ మధ్యకాలంలో విడాకులు పెరిగిపోతున్నాయి. అందుకే సరైన వ్యక్తి దొరికాకే వైవాహిక బంధంలో అడుగుపెట్టాలనుకుంటున్నాను. లేటుగా పెళ్లి చేసుకున్నా సరే ఆ బంధం జీవితాంతం కొనసాగేలా చూసుకుంటాను అని రేఖ వేదవ్యాస్ చెప్పుకొచ్చింది. ఇన్ని చెప్పింది కానీ, తనకు వచ్చిన వ్యాధి ఏంటన్నది మాత్రం బయటపెట్టలేదు. బాధల్ని చెప్పకపోవడమే మంచిదంటూ తన అనారోగ్యానికి గల కారణాన్ని సస్పెన్స్గానే ఉంచింది.చదవండి: అప్పుడంత డబ్బు లేదు.. చెట్టు వెనకాలే చీర మార్చుకున్న హీరోయిన్

'మహావతార్: నరసింహ' మూవీ రివ్యూ
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ కొన్నాళ్ల క్రితం మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ) అనే ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ మహావిష్ణువు దశావతారాలపై ఏడాదికో యానిమేటెడ్ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇందులో భాగంగా తొలి సినిమా 'మహావతార్: నరసింహ' నేడు(జులై 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ యూనిమేటెడ్ ఫిల్మ్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.'మహావతార్: నరసింహ' కథేంటంటే..పురాణాల్లో ఉన్న భక్త ప్రహ్లాద, నరసింహ స్వామి కథ గురించి తెలిసిందే. విష్ణువు మూర్తి నరసింహ అవతారం(సగం మనిషి, సగం సింహం) ఎత్తి, భక్తుడైన ప్రహ్లాదుడిని హింసించిన హిరణ్యకశిపుడిని సంహరిస్తారు. ఇదే కథను యానిమేషన్లో చూస్తే.. అదే మహావతార్: నరసింహ సినిమా.విశ్లేషణభక్త ప్రహ్లాద కథతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అందులో ఎస్వీ రంగారావు, అంజలీదేవి, రోజా రమణి ప్రధాన పాత్రలు పోషించిన 'భక్త ప్రహ్లాద' బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాతో ప్రహ్లాద కథ దాదాపు తెలుగు ప్రేక్షకులందరికి తెలిసింది. ఇలాంటి కథలు నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో తీసిన సినిమా'మహావతార్: నరసింహ'. కథనం మొత్తం యానిమేషన్తో నడుస్తుంది. విజువల్ వండర్గా ఈ సినిమాను తీర్చిదిద్దారు.కశ్యప మహాముని భార్య కడుపున హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు పుట్టడానికి గల కారణాలను వివరిస్తూ ఈ సినిమా కథ ప్రారంభం అవుతుంది. మహా విష్ణువుపై ద్వేషం పెంచుకున్న ఈ ఇద్దరు అన్నదమ్ములు..తమకున్న శక్తులతో దేవతలను సైతం భయబ్రాంతులకు గురిచేస్తారు. ఒకానొక సమయంలో హిరణ్యాక్షుడు భూదేవికి అపహరించి సముద్ర గర్భంలో బంధిస్తాడు. దీంతో విష్ణు మూర్తి వరాహావతారంలో వచ్చి హిరణ్యాక్షుడు సంహరించి భూదేవిని తీసుకొస్తాడు. సోదరుడి మరణంతో విష్ణుపై హిరణ్యకశిపుడు మరింత పగను పెంచుకుంటాడు. తీవ్రమైన తప్పస్సు చేసి బ్రహ్మాదేవుడి నుంచి తనకు భూమి, అకాశం పైన,దేవతలతో గాని, పశువులతోగానీ, పగలు గానీ రాత్రి గానీ మరణం లేకుండా వరం పొందుతాడు. ఆ శక్తులతో ఇంద్రలోకాన్ని సైతం తన ఆధీనంలోకి తెచ్చకుంటాడు. అతని కొడుకే ప్రహ్లాదుడు. పుట్టుకతోనే విష్ణుమూర్తి భక్తుడిగా మారతాడు. తండ్రికేమో విష్ణువు అంటే పడదు.. కొడుకుకేమో విష్ణుమూర్తే సర్వస్వం అన్నట్లుగా బతుకుతాడు. ఎంత నచ్చజెప్పిన విష్ణుమూర్తి పేరు తలచకుండా ఉండడు. చివరకు కొడుకునే సంహరించాలని చూస్తాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి నరసింహా అవతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఒక కమర్షియల్ సినిమాకు కావాల్సిన అంశాలన్నీ ఈ కథలో ఉన్నాయి. దాన్ని దర్శకుడు అశ్విన్ కుమార్ చక్కగా వాడుకున్నాడు. భారీ ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్తో అద్భుతంగా తీర్చిదిద్దాడు. క్లైమాక్స్లో నరసింహ స్వామి ఎంట్రీ ఇచ్చే సీన్ అదిరిపోతుంది.హిరణ్యకశిపుడితో నరసింహాస్వామి చేసే యాక్షన్ తెరపై చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. యానిమేటెడ్ సినిమా అయినా సరే కొన్ని యాక్షన్ సీన్లకు థియేటర్స్లో విజిల్స్ పడతాయి. యానిమేషన్ పర్ఫెక్ట్గా కుదిరింది. తెరపై చూస్తుంటే కమర్షియల్ సినిమా చూస్తున్నట్లే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ చక్కగా కుదిరింది. సామ్ సీ.ఎస్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. బీజీఎం అదిరిపోయింది. చిన్నపిల్లలు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు.

చిన్నపిల్లలు.. వాళ్లకేమైందని? మీ పిచ్చి సలహాలు..: నటి ఆగ్రహం
పిల్లల్ని ప్రేమతో చూడాలి కానీ, ఒకరు నల్లగా ఉన్నారు, ఒకరు తెల్లగా ఉన్నారు అంటూ కలర్ గురించి మాట్లాడటమేంటి? అని అసహనానికి లోనైంది బుల్లితెర నటి రుబీనా దిలైక్ (Rubina Dilaik). తనకు ఏడాదిన్నర వయసున్న కవల పిల్లలున్నారు. తమ ఇంటికి వచ్చినవారు పిల్లల రంగు గురించి మాట్లాడటం నటికి ఏమాత్రం నచ్చలేదు. నా కూతుర్లకేమైందని..దీని గురించి రుబీనా మాట్లాడుతూ.. నాకు పుట్టిన అమ్మాయిల్లో ఒకరు ఫెయిర్గా ఉంటే మరొకరు కాస్త డస్కీగా ఉంటారు. మా ఇంటికి వచ్చినవాళ్లు అదే విషయం పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఒకరితో మరొకర్ని కంపేర్ చేస్తున్నారు. అది నాకస్సలు నచ్చలేదు. రంగు గురించి మాట్లాడొద్దు, నా కూతుర్లిద్దరూ అందంగా ఉన్నారని వాళ్లకు గట్టిగా ఆన్సరిచ్చేదాన్ని. ఇంకోసారి నా ఇంట్లో.. పిల్లల మధ్య పోలిక తేవొద్దని వార్నింగ్ ఇచ్చాను. మా బంధువులైతే.. పాపకు మంచి రంగు రావడం కోసం శనగపిండితో స్నానం చేయించమనేవారు. అసలు ఆ విషయం గురించి మీరు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని బదులిచ్చాను. చిన్నప్పటినుంచే నేర్పిస్తున్నా..నా పిల్లలకేమైందని.. వారెంతో అందంగా ఉన్నారు. అలాగే ఇద్దరికీ ఆత్మస్థైర్యంతో ఉండాలని చిన్నప్పటినుంచే నేర్పిస్తున్నాను. అర్థం చేసుకోవడానికి వారిది చాలా చిన్నవయసు కానీ, ఇప్పటినుంచి నేర్పిస్తేనే విశ్వాసంతో ముందుకు వెళ్తారు అని చెప్పుకొచ్చింది. రుబీనా- అభినవ్ 2018లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హిందీ బిగ్బాస్ 14వ సీజన్లో పాల్గొన్నారు. రుబీనా ఈ సీజన్ ట్రోఫీ గెలిచింది. ఇకపోతే పెళ్లయిన ఐదేళ్లకు రుబీనా గర్భం దాల్చింది. 2023లో కవల కూతుర్లు ఏధ, జీవాకు జన్మనిచ్చింది.చదవండి: గుండెలు పిండేసే చిత్రం.. హిట్టయితే బాగుండు: శృతి హాసన్
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

38వ సెంచరీ పూర్తి చేసిన రూట్.. రికార్డుల జాతర
మాంచెస్టర్ టెస్ట్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇప్పటికే రెండు భారీ రికార్డులు సాధించిన రూట్.. తాజాగా సెంచరీ పూర్తి చేసి మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. 178 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన రూట్.. టెస్ట్ల్లో 38వ శతకాన్ని, ఓవరాల్గా (మూడు ఫార్మాట్లలో కలిపి) 56 శతకాన్ని నమోదు చేశాడు. ఈ సెంచరీతో రూట్ టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర్తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. సంగక్కర్ కూడా టెస్ట్ల్లో 38 సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (51), జాక్ కల్లిస్ (45), రికీ పాంటింగ్ (41) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.ఈ ఇన్నింగ్స్లో రూట్ తొలుత టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్ (13288), జాక్ కల్లిస్ను (13289) అధిగమించి మూడో స్థానానికి ఎగబాకాడు. ఆతర్వాత హాఫ్ సెంచరీ పూర్తి చేసి టెస్ట్ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్, జాక్ కల్లిస్ను దాటేసి రెండో స్థానానికి చేరాడు. తాజాగా సెంచరీ పూర్తి చేసి టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంగక్కరతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో, అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సింగిల్గా ఆరో స్థానంలో నిలిచాడు. ఈ సెంచరీకి ముందు రూట్, హాషిమ్ అమ్లా తలో 55 సెంచరీలతో సంయుక్తంగా ఆరో స్థానంలో ఉండేవారు. 56వ సెంచరీతో రూట్ సింగిల్గా ఆరో స్థానానికి చేరాడు.టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు..సచిన్ టెండూల్కర్- 15921రికీ పాంటింగ్- 13378జో రూట్- 13358*జాక్ కల్లిస్- 13289రాహుల్ ద్రవిడ్- 13288టెస్ట్ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన టాప్-5 ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్- 119జో రూట్- 104రికీ పాంటింగ్- 103జాక్ కల్లిస్- 103రాహుల్ ద్రవిడ్- 99టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్-5 ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్- 51జాక్ కల్లిస్- 45రికీ పాంటింగ్- 41జో రూట్- 38కుమార సంగక్కర- 38అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్-6 బ్యాటర్లు..సచిన్ టెండూల్కర్- 100విరాట్ కోహ్లి- 82రికీ పాంటింగ్- 71కుమార సంగక్కర- 63జాక్ కల్లిస్- 62జో రూట్- 56ఈ సెంచరీతో రూట్ సాధించిన మరిన్ని ఘనతలు..టెస్ట్ల్లో ఫాబ్-4 ఆటగాళ్లు చేసిన సెంచరీలురూట్-38 స్టీవ్ స్మిత్- 36కేన్ విలియమ్సన్- 33విరాట్ కోహ్లి- 30అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం యాక్టివ్ ఉండి అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్లువిరాట్ కోహ్లి- 82జో రూట్- 56రోహిత్ శర్మ- 49కేన్ విలియమ్సన్- 48స్టీవ్ స్మిత్- 48టెస్ట్ల్లో భారత్పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లురూట్- 12స్టీవ్ స్మిత్- 11గత ఐదేళ్లలో 21 సెంచరీలు చేసిన రూట్2021లో 62022లో 52023లో 22024లో 62025లో 2మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు ఆటలో రూట్ సెంచరీ పూర్తి చేసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 407/4గా ఉంది. రూట్ 104, స్టోక్స్ 27 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 49 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు జాక్ క్రాలే (84), బెన్ డకెట్ (94), ఓలీ పోప్ (71) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. హ్యారీ బ్రూక్ (3) ఒక్కడే నిరాశపరిచాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2, అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

32 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ప్లేయర్
భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి 32 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించింది. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వేద ఇవాళ (జులై 25) సోషల్మీడియా వేదికగా పంచుకుంది. రైట్ హ్యాండ్ బ్యాటర్, అకేషనల్ లెగ్ స్పిన్ బౌలర్ అయిన వేద 2011లో టీమిండియా అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి తొమ్మిదేళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినథ్యం వహించి 48 వన్డేలు, 76 టీ20లు ఆడింది. ఇందులో 10 హాఫ్ సెంచరీల సాయంతో 1704 పరుగులు చేసి 3 వికెట్లు తీసింది. వేద భారత మహిళా జట్టు రన్నరప్గా నిలిచిన 2017 వన్డే వరల్డ్కప్, 2020 టీ20 వరల్డ్కప్ జట్లలో సభ్యురాలిగా ఉంది.కర్ణాటకలోని కడూర్ అనే చిన్న పట్టణం నుంచి వచ్చిన వేద టీమిండియా సాధించిన అనేక విజయాల్లో కీలక సభ్యురాలిగా ఉంది. వేద తన రిటైర్మెంట్ సందేశంలో తనకు సహకరించిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కోచ్లు, మెంటర్లు, సహచర క్రికెటర్లు, కెప్టెన్లకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపింది. అలాగే తనకు అవకాశమిచ్చిన బీసీసీఐ, కర్ణాటక క్రికెట్ బోర్డు, రైల్వేస్ క్రికెట్ బోర్డుకు కూడా ధన్యవాదాలు తెలిపింది.వేద దేశవాలీ క్రికెట్లో కర్ణాటక, రైల్వేస్ జట్లకు నాయకత్వం వహించింది. వేద చివరిగా 2020 టీ20 వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించింది. అంతకు రెండేళ్ల ముందు (ఏప్రిల్, 2018) భారత్ తరఫున తన చివరి వన్డే ఆడింది. వేదకు అత్యంత చురుకైన ఫీల్డర్గా పేరుంది. మహిళల టీ20ల్లో ఆమె సంయుక్తంగా అత్యధిక క్యాచ్లు పట్టుకున్న నాన్ వికెట్కీపర్గా కొనసాగుతుంది.గత కొంతకాలంగా జాతీయ జట్టు అవకాశాలు రాకపోవడంతో వేద వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. వేద మహిళల ఐపీఎల్ రెండో సీజన్లో (2024) గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడింది. ఆ సీజన్లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు (4 ఇన్నింగ్స్ల్లో కేవలం 22 పరుగులు) చేయకపోవడంతో ఆమెను తదుపరి సీజన్లో ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. వేద మహిళల బిగ్బాష్ లీగ్లో కూడా ఆడింది. 2017-18 సీజన్లో ఆమె హోబర్ట్ హరికేన్స్కు ప్రాతినిథ్యం వహించింది.

భారత్తో నాలుగో టెస్ట్.. రికార్డులు బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్న జో రూట్
మాంచెస్టర్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ రికార్డులు బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. తొలుత టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్ (13288), జాక్ కల్లిస్ను (13289) అధిగమించి మూడో స్థానానికి ఎగబాకిన రూట్.. హాఫ్ సెంచరీ పూర్తి చేశాక టెస్ట్ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్, జాక్ కల్లిస్ను దాటేసి రెండో స్థానానికి చేరాడు.టెస్ట్ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన టాప్-5 ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్- 119జో రూట్- 104రికీ పాంటింగ్- 103జాక్ కల్లిస్- 103రాహుల్ ద్రవిడ్- 99టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు..సచిన్ టెండూల్కర్- 15921రికీ పాంటింగ్- 13378జో రూట్- 13319*జాక్ కల్లిస్- 13289రాహుల్ ద్రవిడ్- 13288మ్యాచ్ విషయానికొస్తే.. 225/2 స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి సెషన్లో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా మరో 107 పరుగులు జోడించింది. లంచ్ విరామం సమయానికి ఆ జట్టు స్కోర్ 332/2గా ఉంది. పోప్ 70, రూట్ 63 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంగ్లండ్ ఇంకా 26 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. పోప్, రూట్కు ముందు ఓపెనర్లు జాక్ క్రాలే (84), బెన్ డకెట్ (94) కూడా అర్ద సెంచరీలు సాధించారు. క్రాలే వికెట్ జడేజాకు.. డకెట్ వికెట్ అన్షుల్ కంబోజ్కు దక్కింది.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా టాప్ క్రికెటర్లు వీరే!
ఇది టీ20ల జమానా.. కో...డితే బంతి బౌండరీ దాటాల్సిందే.. పొట్టి ఫార్మాట్లో ఫోర్లు, సిక్సర్లు సులువుగానే కొట్టేయవచ్చు. కానీ టెస్టుల్లో సిక్స్ బాదడం అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. సంప్రదాయ ఫార్మాట్లో ఆచితూచి ఆడకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది.మంచి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు కూడా మాత్రమే సరిగ్గా షాట్ను కనెక్ట్ చేసి టెస్టుల్లో సిక్స్లు బాదగలరు. అప్పట్లో ఆడం గిల్క్రిస్ట్, వీరేందర్ సెహ్వాగ్, బ్రెండన్ మెకల్లమ్, క్రిస్ గేల్ (Chris Gayle) అలవోకగా సిక్సర్లు కొడితే.. తర్వాత రోహిత్ శర్మ (Rohit Sharma), మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) కూడా తమదైన షాట్లతో అలరించారు.కాలానికి అనుగుణంగా పిచ్లు ఫ్లాట్గా మారుతున్న వేళ ప్రస్తుతం డిఫెన్స్ షాట్లకు బదులు దూకుడుగా బౌలర్లపై విరుచుకుపడే బ్యాటర్ల సంఖ్య పెరుగుతోంది. టెస్టు క్రికెట్లో ప్రస్తుతం టీమిండియా యువ తరంగాలు రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్ విధ్వంసకర షాట్లతో వీరూ, రోహిత్, ధోనిల సిక్సర్ల వారసత్వాన్ని కొనసాగిస్తుండగా.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా వీరికి పోటీనిస్తున్నాడు.సెహ్వాగ్ రికార్డు సమం చేసిన పంత్అయితే, ఇంగ్లండ్తో నాలుగో టెస్టు సందర్భంగా సిక్సర్ల రికార్డులో పంత్ సెహ్వాగ్ను సమం చేశాడు. టెస్టుల్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా చరిత్రకెక్కాడు. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా భారత్- ఇంగ్లండ్ ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్లో తలపడుతున్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో ఇంగ్లండ్.. రెండో టెస్టులో భారత్ గెలిచాయి.ఇక కీలకమైన మూడో టెస్టులో ఆఖరి వరకు పోరాడినా టీమిండియాకు ఓటమే ఎదురైంది. దీంతో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో మాంచెస్టర్ వేదికగా బుధవారం మొదలైన నాలుగో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులు చేసింది. గాయం వేధిస్తున్నాఅయితే, తొలి రోజు ఆటలో గాయపడిన పంత్ 37 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగి.. రెండో రోజైన గురువారం తిరిగి వచ్చి మరో 17 పరుగులు సాధించాడు. టీమిండియా మెరుగైన స్కోరు చేయడంలో పంత్ అర్ధ శతకం కూడా కీలకం.మొత్తంగా 75 బంతులు ఎదుర్కొన్న పంత్.. 54 పరుగులు సాధించాడు. ఇందులో మూడు ఫోర్లు, రెండు సిక్స్లు ఉన్నాయి. జోఫ్రా ఆర్చర్లో బాదిన సిక్సర్తో పంత్ సెహ్వాగ్ రికార్డును సమం చేయడం విశేషం. అయితే మ్యాచ్ల పరంగా చూస్తే సెహ్వాగ్ కంటే పంత్ ముందే ఈ మైలురాయిని చేరుకున్నాడు.Rishabh-Panti Max! 🔥😎They tried to hit him where it hurts... Pant responds by hitting it out of the park! Toughness has a new name @RishabhPant17 🙌🏻#ENGvIND 👉 4th TEST, DAY 2 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/Y3btplYguV pic.twitter.com/6a2zPCQsr5— Star Sports (@StarSportsIndia) July 24, 2025 టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా టాప్-10 క్రికెటర్లు వీరే🏏1.రిషభ్ పంత్- 47 మ్యాచ్లలో కలిపి 90 సిక్సర్లు*🏏2. వీరేందర్ సెహ్వాగ్- 103 మ్యాచ్లలో కలిపి 90 సిక్సర్లు🏏3.రోహిత్ శర్మ- 67 మ్యాచ్లలో కలిపి 88 సిక్సర్లు🏏4. మహేంద్ర సింగ్ ధోని- 90 మ్యాచ్లలో కలిపి 78 సిక్సర్లు🏏5. రవీంద్ర జడేజా- 84 మ్యాచ్లలో కలిపి 74 సిక్సర్లు🏏6. సచిన్ టెండుల్కర్- 200 మ్యాచ్లలో కలిపి 69 సిక్సర్లు🏏7. కపిల్ దేవ్- 131 మ్యాచ్లలో కలిపి 61 సిక్సర్లు🏏8. సౌరవ్ గంగూలీ- 113 మ్యాచ్లలో కలిపి 57 సిక్సర్లు🏏9. శుబ్మన్ గిల్- 36 మ్యాచ్లలో కలిపి 43 సిక్సర్లు🏏10. హర్భజన్ సింగ్- 103 మ్యాచ్లలో కలిపి 42 సిక్సర్లు.👉కాగా టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 23 టెస్టుల్లోనే ఇప్పటికే 41 సిక్సర్లు బాదాడు. అతడు ఈ రికార్డు జాబితాలో టాప్-10లోకి చేరుకోవడానికి మరీ ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.చదవండి: ఏడ్చేసిన కరుణ్ నాయర్.. ఓదార్చిన కేఎల్ రాహుల్.. ఇక గుడ్బై!?
బిజినెస్

వేగంగా 1 లక్ష కార్లు ఎగుమతి చేసి రికార్డు
భారత ఆటోమొబైల్ తయారీలో మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ తన కాంపాక్ట్ ఎస్యూవీ ఫ్రాంక్స్ ఎగుమతుల్లో రికార్డు నెలకొల్పింది. భారతదేశం నుంచి వేగంగా 1 లక్ష ఎగుమతులను అధిగమించిన ఎస్యూవీగా నిలిచిందని కంపెనీ ప్రకటించింది. 2023 జూన్లో ప్రపంచ ఎగుమతి కార్యకలాపాలు ప్రారంభమైన కేవలం 25 నెలల్లోనే ఈ మైలురాయిని చేరుకుందని చెప్పింది.గుజరాత్లోని మారుతీ సుజుకీ ప్లాంట్లో ప్రత్యేకంగా తయారు చేసిన ఫ్రాంక్స్ లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాతో సహా విదేశీ మార్కెట్లలో బలమైన పనితీరును కనబరుస్తోందని కంపెనీ తెలిపింది. జపాన్లో దీనికి పెరుగుతున్న ప్రజాదరణ ఎగుమతి వృద్ధికి దోహదం చేసిందని చెప్పింది. మారుకీ సుజుకీ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టేకుచి మాట్లాడుతూ.. ‘ప్రపంచ మార్కెట్ల కోసం ప్రపంచ స్థాయి వాహనాలను తయారు చేయగల సామర్థ్యం కంపెనీకి ఉంది. మేక్ ఇన్ ఇండియా చొరవకు కంపెనీ సాధించిన విజయమే నిదర్శనం. ప్యాసింజర్ వాహన ఎగుమతులు, అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టి సారిస్తున్నాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఇండియా-యూకే ట్రేడ్ డీల్ వ్యవసాయానికి జాక్పాట్2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే మారుతీ సుజుకీ 96,000 వాహనాలను ఎగుమతి చేయడం విశేషం. భారతదేశ ప్యాసింజర్ వాహన ఎగుమతుల్లో రికార్డు స్థాయిలో 47 శాతం వాటాను ఆక్రమించింది. వరుసగా నాలుగో ఏడాది భారతదేశపు టాప్ ప్యాసింజర్ వాహన ఎగుమతిదారుగా కంపెనీ తన స్థానాన్ని నిలుపుకుంది.

ఇండియా-యూకే ట్రేడ్ డీల్ వ్యవసాయానికి జాక్పాట్
భారత వ్యవసాయ రంగానికి ఇండియా-యూకే ఇటీవల సంతకం చేసిన కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (సీఈటీఏ) ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతీయ వ్యవసాయ, ప్రాసెస్ చేసిన ఆహార ఎగుమతుల్లో 95% యూకే మార్కెట్లో సుంకం లేకుండా అనుమతించే వీలుంది. ఇది భారతీయ రైతులు, వ్యవసాయ ఎగుమతిదారులకు మార్కెట్ అవకాశాలను గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు. ఇటీవల కుదిరిన ఒప్పందం ప్రకారం వ్యవసాయానికి సంబంధించి కొన్ని ప్రధాన అంశాలు కింది విధంగా ఉన్నాయి.జీరో-డ్యూటీ యాక్సెస్బాస్మతి, బాస్మతియేతర బియ్యంపండ్లు మరియు కూరగాయలుమసాలా దినుసులు (పసుపు, మిరియాలు, యాలకులు)ప్రాసెస్ చేసిన ఆహారాలు (ఊరగాయలు, మసాలా మిశ్రమాలు, పండ్ల గుజ్జులు, రెడీ టు ఈట్ భోజనం)సముద్ర ఉత్పత్తులు (రొయ్యలు, ట్యూనా, ఫిష్ మీల్, ఫిష్ ఫీడ్)పాడి, వంట నూనెలు, యాపిల్స్ సుంకం రాయితీ పరిధిలోకి రావు. ఇది కీలకమైన దేశీయ పరిశ్రమలను కాపాడుతుంది.గతంలో 70 శాతం వరకు దిగుమతి సుంకాలను ఎదుర్కొన్న ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఇప్పుడు జీరో డ్యూటీ పరిధిలోకి రానున్నాయి.ఇదీ చదవండి: విస్కీ ధరలు తగ్గింపు..?వచ్చే మూడేళ్లలో యూకేకు భారత వ్యవసాయ ఎగుమతుల్లో 20% వృద్ధి నమోదవుతుందని అంచనా. ఇది భారతదేశం తన 100 బిలియన్ డాలర్ల వ్యవసాయ ఎగుమతి లక్ష్యానికి చేరువ కావడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం 2.25 శాతం మాత్రమే ఉన్న బ్రిటన్ 5.4 బిలియన్ డాలర్ల సముద్ర దిగుమతుల్లో భారత్ వాటాను ఈ వాణిజ్య ఒప్పందం పెంచుతుందని భావిస్తున్నారు.

విస్కీ ధరలు తగ్గింపు..?
భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ)పై ఇరు ప్రాంతాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ డీల్ కుదరడంతో స్పిరిట్లపై దిగుమతి సుంకాలు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రీమియం అంతర్జాతీయ మద్యం బ్రాండ్లను భారతీయ వినియోగదారులకు మరింత చౌకగా అందించే వీలుందని భావిస్తున్నారు. ఒక్కో బాటిల్పై సరాసరిగా రూ.300 వరకు ధరల తగ్గింపు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.ఈ ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దీర్ఘకాలంలో ఇరుదేశాల వాణిజ్యాన్ని 35 బిలియన్ డాలర్లకు పెంచుతుంది. ఈ డీల్ కోసం మూడేళ్లకు పైగా సాగుతున్న చర్చల ఫలితంగా మే నెలలో ఎఫ్టీఏను ఖరారు చేయగా, ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ పర్యటన సందర్భంగా వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, యూకే ప్రధాని జోనాథన్ రేనాల్డ్స్ ఒప్పందంపై తాజాగా సంతకాలు చేశారు. రెండు ప్రభుత్వాల మధ్య లండన్లో కుదిరిన ఎఫ్టీఏ ప్రకారం యూకే విస్కీ, జిన్లపై సుంకాన్ని భారత్ 150 శాతం నుంచి 75 శాతానికి తగ్గించనుంది. ఈ ఒప్పందం కుదిరిన పదేళ్లలో మరో 40 శాతం సుంకాలు తగ్గించేలా నియమాలున్నాయి.విస్కీ ధరలపై నిపుణుల అంచనాలుభారతదేశంలో ప్రీమియం ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎస్డబ్ల్యూఏఐ) ఈ వాణిజ్య ఒప్పందాన్ని ఆల్కహాలిక్ బేవరేజ్ రంగానికి చారిత్రాత్మక క్షణంగా అభివర్ణించింది. ఈ ఒప్పందం వల్ల ప్రీమియం అంతర్జాతీయ స్పిరిట్స్ మరింత అందుబాటులోకి వస్తాయని, ఈ డీల్ భారతీయ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఐఎస్డబ్ల్యూఏఐ సీఈఓ సంజిత్ పాధి తెలిపారు. ఇది హాస్పిటాలిటీ, టూరిజం, రిటైల్ వంటి అనుబంధ రంగాల్లో వృద్ధికి ఊతమిస్తుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇండియన్స్ను వద్దంటే యూఎస్కే నష్టంపెద్దగా మార్పు ఉండదు..దిగుమతి చేసుకున్న స్కాచ్ (విస్కీ) వినియోగదారుల ధరల్లో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదని మద్యం పరిశ్రమ నిపుణుడు వినోద్ గిరి తెలిపారు. మద్యంపై పన్నులు చాలా వరకు రాష్ట్రాల్లోనే ఉన్నాయని, కస్టమ్స్ సుంకం తగ్గింపు జరిగినా దిగుమతి చేసుకునే స్కాచ్ విస్కీల వినియోగదారుల ధరలపై ప్రభావం ఒక్కో బాటిల్పై సరాసరి రూ.100-300 మధ్య ఉంటుందని తెలిపారు.

వెజ్ ప్రోటీన్ స్లైస్ను విడుదల చేసిన మెక్డొనాల్డ్స్
ఆహార ప్రియులకు ఆరోగ్యకరమైన, మరింత స్థిరమైన ఫాస్ట్ ఫుడ్ను అందించాలనే లక్ష్యంతో మెక్డొనాల్డ్ ఇండియా (వెస్ట్ & సౌత్) ‘ప్రోటీన్ ప్లస్ స్లైస్’ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ వెజిటేరియన్ ఆధారిత ఆవిష్కరణ కోసం మెక్డొనాల్డ్ సీఎస్ఐఆర్-సీఎఫ్టీఆర్ఐ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ - సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)తో జత కట్టినట్లు పేర్కొంది.ప్రోటీన్ ప్లస్ స్లైస్ప్రోటీన్ ప్లస్ స్లైస్ అనేది మొక్కల ఆధారిత ప్రోటీన్ స్లైస్. ఇది అధిక పోషకాలు కలిగి మాంసాహార ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ముఖ్యంగా భారతీయ అభిరుచులు, ఆహార ప్రాధాన్యతలకు అనుగుణంగా దీన్ని తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్లైస్ 100% శాఖాహారంతో తయారు చేసినట్లు చెప్పింది. ఇందులో మొక్కల ఆధారిత ప్రోటీన్ అధికంగా ఉంటుంది. భారతీయ ఆహార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్థానికంగా అభివృద్ధి చేశారు.సీఎస్ఐఆర్-సీఎఫ్టీఆర్ఐ సహకారంఈ స్లైస్ ఆవిష్కరణకు మైసూరు కేంద్రంగా పనిచేస్తున్న సీఎస్ఐఆర్-సీఎఫ్టీఆర్ఐతో ఒప్పందం కుదుర్చుకోవడం మరింత విశ్వసనీయతను చేకూరుస్తుందని కంపెనీ నమ్ముతుంది. పప్పులు, తృణధాన్యాల నుంచి సేకరించిన మొక్కల ఆధారిత ప్రోటీన్లను ఉపయోగించి పోషకాల సమతుల్యానికి సీఎఫ్టీఆర్ఐ పరిశోధనలు ఎంతో తోడ్పడ్డాయని మెక్డొనాల్డ్ తెలిపింది. స్థిరమైన, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారానికి భారత్లో డిమాండ్ పెరుగుతుందని చెప్పింది. ఈ అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ఇలాంటి ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఇండియన్స్ను వద్దంటే యూఎస్కే నష్టంవెస్ట్లైఫ్ ఫుడ్వరల్డ్ నిర్వహిస్తున్న మెక్డొనాల్డ్స్ ఇండియా (వెస్ట్ & సౌత్) మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళలోని అవుట్లెట్ల మెనూలో ఈ ప్రోటీన్ ప్లస్ స్లైస్ను ఉంచబోతున్నట్లు తెలుస్తుంది. కస్టమర్ల నుంచి ఫీడ్బ్యాంక్ తీసుకొని, దాన్ని విశ్లేషించిన తర్వాత ఇతర ప్రాంతాలకు దీన్ని విస్తరిస్తామని కంపెనీ తెలిపింది.
ఫ్యామిలీ

శ్రావణం : రోజూ పండుగే.. ప్రతీ తిథి దివ్యముహూర్తమే
చిన్నకోడూరు(సిద్దిపేట): శ్రావణ మాసంతోనే హిందూ సాంప్రదాయాల ప్రకారం పండుగలు ప్రారంభమవుతాయి. శ్రావణం శుభకరం అని కూడా అంటారు. ఈ మాసంలో రోజూ పండుగేనని ప్రతీ ఘడియ లక్ష్మి కటాక్షమే అని విశ్వసిస్తారు. ఈ మాసంలో చేసే అన్ని పూజల్లోకెల్లా వరలక్ష్మి వ్రతాన్ని ఉత్తమమైనదిగా పేర్కొంటారు. శుక్రవారం నుంచి శ్రావణమాసం ప్రారంభం కాగా, ఈ నెల 29న నాగుల పంచమి, వచ్చే నెల 8న వరలక్ష్మివ్రతం, 9న శ్రావణ పౌర్ణమి(రాఖీ పండుగ), 16న శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తారు. మంగళ, శుక్ర, శనివారాలకు ప్రాధాన్యత శ్రావణమాసంలోని మంగళ, శుక్ర, శనివారాలు అత్యంత పుణ్యప్రదమైనవి భక్తులు నమ్ముతారు. మంగళవారాలు శ్రీగౌరీ, శుక్రవారాలు శ్రీలక్ష్మీ, శనివారాలు శ్రీమహావిష్ణువు పూజలకు ముఖ్యమైన రోజులు. వీటికి తోడు శ్రావణంలోని శుక్ల పక్షంలోని 15 రోజులు ఎంతో విశేషమైనవి. సకల ఉపచారాలతో నిష్ఠగా మహలక్షి్మవ్రతం నిర్వహిస్తారు. తొమ్మిది సంఖ్యకు ఈ వ్రతంలో ప్రాధాన్యత. అందుకే తొమ్మిది పోగులతో కూడిన తోరం ధరించి తొమ్మిద రకాల పిండి వంటలు లక్ష్మీదేవికి నివేదన చేసి ముత్తైదువులకు వాయినమిస్తారు. మహిమాన్వితం శ్రావణ పున్నమి శ్రావణ మాసం పౌర్ణమి ఎంతో మహిమ కలిగినదని చెబుతారు. గాయత్రీ ఉపాసన చేసే వారు నూతన యజ్ఞోపవీతాలను ఇదే రోజున ధరిస్తారు. సర్వ విద్యా స్వరూపుడైన హయగ్రీవుని జయంతి కూడా ఇదే రోజు. రక్షా బంధనం, రుషి తర్పణం వంటి వైదిక కర్మలు ఇదే రోజున ఆచరిస్తారు. ఎంతో మహిమాన్విమైన ఈ తిథినాడు పూజిస్తే సత్ఫలితాలుంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఇదీ చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పడుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవంపరమపవిత్రం శ్రావణం హిందువుల పరమ పవిత్రం శ్రావణ మాసం. ఈ మాసం పండుగలకు ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ప్రతీ హైందవ ఇంట్లో ఈ నెలంతా పూజలు, వ్రతాలు నిర్వహిస్తుంటారు. దేవాలయాల్లో సామూహిక కుంకుమార్చనలు, తులసి అర్చనలు, పుష్పార్చనలు, రుద్రాభిషేకాలు వంటి పూజలు చేస్తారు. –సదాశివ శర్మ, పురోహితులు, చిన్నకోడూరుచదవండి: జిమ్కెళ్లకుండానే 26 కిలోలు కరిగించాడట : బోనీ కపూర్లుక్ వైరల్

గిరాయిపల్లి అమరుల స్ఫూర్తి
గిరాయిపల్లి ఎన్కౌంటర్ జరిగి ఏభై ఏళ్లు. ఈ సంఘటనతో వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ (ఆర్ఈసీ) విద్యార్థుల విప్లవ పోరాటం ముగిసిపోలేదు. కామ్రేడ్స్ సూరపనేని జనార్దనరావు, లంకా మురళీమోహన్ రెడ్డి, కొలిశెట్టి ఆనందరావు, వనపర్తి సుధాకర్... ఈ నలుగురి అమరత్వం సజీవమైనది. 1974లో ప్రారంభమైన రాడికల్ విద్యార్థి యూనియన్ ప్రభావానికి గురయ్యారు గిరాయిపల్లి అమరులు. నక్సల్బరీ సైద్ధాంతిక అవగాహనతో పనిచేశారు. జనార్దనరావు కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు దగ్గర గరికపర్రు గ్రామంలో జన్మించాడు. వ్యవసాయ కుటుంబం. ఇంజినీరింగ్ విద్య కోసం వచ్చిన విద్యార్థి వరంగల్ పట్టణంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో విస్తరిస్తున్న విప్లవోద్యమంలోనూ ప్రధాన శక్తి అయ్యాడు. ఇంజనీరింగ్ విద్యను ఆఖరి సంవత్సరం వదిలి ప్రజా పోరాటాలలో భాగమయ్యాడు. విప్లవోద్యమ కర్తవ్యాన్ని దాని ప్రాసంగికతను విడవకుండా ఆనాటి యువతరంలో విప్లవ మార్గం పట్ల, అనురక్తి కలిగించగలిగాడు. 1975 జూన్ 25న తన సహచరులతో పాటు ఎన్కౌంటర్ అయిన సమయానికి అతడి వయసు ఇరవై అయిదేళ్లు. ఎమర్జన్సీ తొలి నాళ్ళ కాలం అది.గిరాయిపల్లి అమరులు తమ అమరత్వంతో పోరు విత్తనాలు చల్లారు. వీరి జ్ఞాపకార్థం గిరాయిపల్లిలో స్ఫూర్తి స్థూపం వెలిసింది. ప్రభుత్వం 1985లో ఈ స్థూపాన్ని కూల్చివేసింది. 1990లో తిరిగి నిర్మాణం జరిగింది. గిరాయిపల్లి అమరత్వాన్ని తలుచుకున్నప్పుడు మధ్య భారతంలో జరుగుతున్న ఆదివాసీ హననం గురించి మాట్లాడుకోవడం సముచితం. అరవై ఏళ్ళ విప్లవోద్యమ చరిత్రలో అణ చివేత, రక్తపాతం సాధారణమైన అంశమైంది. విప్లవకారులకు, ఆదివాసులకు భారత రాజ్యాంగ పరిధిలోని ఏ హక్కులూ వర్తించడం లేదు. జీవించే హక్కు అనుమతించడం లేదు. గిరాయిపల్లి అమరుల అమరత్వాన్ని వర్తమానం వెలుగులో చూసినప్పుడే దాని విలువ మరింత అర్థమవుతుంది.– అరసవిల్లి కృష్ణ ‘ విరసం అధ్యక్షుడు(గిరాయిపల్లి ఎన్కౌంటర్ జరిగి నేటికి 50 ఏళ్లు)

సానబెట్టే సామర్థ్యం, సమరోత్సాహం
రామాయణ, మహాభారత కాలాల నుంచి నేటి దాకా చూస్తున్నాం, తలపెట్టిన పని విజయవంతం కావాలంటే, అర్థ బలం, అంగ బలం, బుద్ధి బలం, సామర్థ్యం మాత్రమే సరిపోవు. వాటికి తోడుగా ఉత్సాహం కావాలి. ఆత్మవిశ్వాసం, సకారాత్మకత, పట్టుదల, బలమైన విజయకాంక్ష– వీటిని కలబోస్తే అది ఉత్సాహం రూపంలో ప్రకటితమౌతుంది.రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సాటి అన్నట్టు సమరం సాగింది. ప్రత్యర్థులిద్దరూ అన్ని విధాలా సమరంలో సమవుజ్జీలే. ఇద్దరివీ లోకోత్తరమైన బల పరాక్రమాలు. అందుకే యుద్ధం సుదీర్ఘంగా సాగినా, ఎంతకీ ఎటూ తెగలేదు. ప్రత్యర్థులిద్దరూ అలసిపోయారు. చింతాక్రాంతులు కూడా అయ్యారు. ఆ దశలో, యుద్ధం చూసేందుకు దేవతలతో కలిసి వచ్చిన అగస్త్య మహర్షి, యుద్ధ పరిశ్రాంతుడై కూర్చొన్న దాశరథి దగ్గరకు వచ్చాడు. సకల కార్య సిద్ధిప్రదమూ, సర్వశత్రు వినాశకమూ అయిన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశించాడు. అవని జనులకు ప్రత్యక్ష దైవమయిన ఆదిత్యుడిని ఈ స్తోత్రంతో ముమ్మారు స్తుతించి, అందరు దేవతల అనుగ్రహాన్ని పొంది, దైవబలం సమకూర్చుకొమ్మన్నాడు. జయావహమైన ఈ మంత్రం జపించి, స్థైర్య సాహసాలను సంతరించుకొమ్మన్నాడు. ‘ఇప్పుడిక నువ్వు రావణుడిని వధించటం తథ్యం!’ అని తన ఆశీర్వాద బలం కూడా జోడించి, శ్రీరాముడిని ఉత్సాహపరిచి వెళ్ళాడు. ఈ ఘటన యుద్ధాన్ని కీలకమైన మలుపు తిప్పింది. ఇనుమడించిన ఉత్సాహంతో ఈసారి రణరంగంలో ప్రవేశించిన దాశరథి ధాటిని దశకంఠుడు తట్టుకోలేకపోయాడు. వీగిపోయి, విగత జీవుడయ్యాడు. వైదేహీ వల్లభుడినే విజయలక్ష్మి కూడా వరించింది. నిరుత్సాహం సమర్థతను నీరు గారుస్తుంది. ఉత్సాహ శక్తి సామర్థ్యాన్ని సాన బట్టి, పదును పెంచుతుంది. అగ్నికి వాయువులా తోడై, ప్రజ్వలింపజేస్తుంది. దైవబలమూ, మహా పురుషుల ఆశీర్వాద బలమూ, శంకలను శమింపజేయటం వల్ల కలిగే మనోబలమూ, ధర్మ పక్షానికి సర్వదా కవచంగా నిలిచే ధర్మబలమూ, ఉత్సాహాన్ని వృద్ధి చేసే ఉత్ప్రేరకాలు.– ఎం. మారుతిశాస్త్రి

‘ఇక్సీ’తో.. ఇన్ఫెర్టిలిటీ ఫిక్స్..!
ఫెర్టిలిటీ సమస్యలకు ప్రత్యామ్నాయం టెక్నాలజీ రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది.. ఇది మానవ జీవితాన్ని గట్టిగానే ప్రభావితం చేస్తోంది. మానవ మనుగడకు తోడ్పాటునందిస్తోంది.. కాలుష్యం, రసాయనాల ప్రభావంతో పాటు తీవ్ర ఒత్తిడి అనేక రుగ్మతలకు దారితీస్తోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సంతానోత్పత్తిపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తోంది.. దీనికి పరిష్కారంగా అనేక పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిల్లో చెప్పుకోదగినది ఐవీఎఫ్ పద్ధతి. చదువులు, ఉద్యోగాలు, భారీ జీతాల కోసం భారీ లక్ష్యాలతో వివాహ వయసు దాటిపోతోంది. దీంతో గతంలో మహిళలనే ఇబ్బంది పెట్టిన ఇన్ఫెర్టిలిటీ సమస్య మగవారిలోనూ కనిపిస్తోంది. నగరాలు, పట్టణాలు, పల్లెలు తేడాలేకుండా సగటున 50 శాతం మందిలో ఈ సమస్య తలెత్తుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా యుక్త వయసులోనే పురుషులు శుక్ర కణాలను, మహిళలు అండాలను భద్రపరుచుకునే వెసులుబాటు వచ్చేసింది. మారుతున్న కాలంలో పాటే అధునాతన చికిత్సలు అందుబాలోకి వచ్చేశాయి. ఆలస్యంగా వివాహాలు చేసుకునే వారి వేధించే ఇన్ఫెర్టిలిటీ సమస్యకు పరిష్కారంగా ఎంబ్రియో ఫ్రీజింగ్ కేంద్రాలు వెలుస్తున్నాయి. మెట్రోనగరాల్లో ఒకటైన మన నగరంలోనూ ఈ వెసులుబాటు వచ్చేసింది. శుక్ర కణాలు, ఎగ్ (జీవ కణం) క్వాలిటీలో ఎలాంటి ఇబ్బందులూ లేనివారు యుక్త వయసులో ఆరోగ్యంగా ఉన్నప్పుడే వీటిని ఫ్రీజ్ చేసుకుంటున్నారు. ఇలా ఫ్రీజ్ చేసిన వాటిని ఐదు నుంచి పదేళ్లలో ఎప్పుడైనా గర్భాశయంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనివ్వవచ్చు. దీంతో విద్య, ఉద్యోగం వంటి కారణాలతో అనేక మంది వివాహాన్ని ఆలస్యం చేస్తున్నారు. ఇది సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో నగర ప్రజలు ఐవీఎఫ్ కేంద్రాలకు క్యూ కట్టేవారు.. దీనికి పరిష్కారంగా అధునాతన చికిత్సలు అందుబాటులోకి రావడంతో ఫ్రీజింగ్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. 40 శాతం దంపతుల్లో సంతాన సమస్యలు..ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ఉద్యోగం, వ్యాపారం, ఒత్తిడి, సంపాదన, లైఫ్స్టైల్, కుటుంబ పరిస్థితులు, కాలుష్యం, ఆహారం, మైక్రో ప్లాస్టిక్, హార్మోన్ల సమతుల్యత, ఆలస్యంగా వివాహం చేసుకోవడం, మద్యం సేవించడం, పొగ తాగడం, రక్త సంబందీకులను పెళ్లి చేసుకోవడం, జన్యుపరమైన, ఇతర సమస్యలతో సుమారు 40 శాతం కొత్తగా పెళ్లైన జంటల్లో సంతానోత్పత్తి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇందులో పురుషుల్లో 50 శాతం మందిలో, 45 శాతం మంది స్త్రీలల్లో పునరుత్పత్తి సమస్యలు గుర్తిస్తున్నారు. ఇద్దరిలోనూ సమస్యలు ఉన్న జంటలు సుమారు 15 శాతం నుంచి 20 శాతం ఉంటున్నాయి. ఈ సమయంలో కొంత మంది మానసికంగా కుంగిపోవడం కనిపిస్తోంది. ఐవీఎఫ్ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. 30 ఏళ్లు వయసుగల వారిలో ఐవీఎఫ్ పద్దతులు సుమారు 60 శాతం నుంచి 70 శాతం సక్సస్ రేటు ఉండగా, ఆపై వయసున్న వారిలో సుమారు 40 శాతం నుంచి 50 శాతం ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. జీవ కణం పదేళ్లు..ఆరోగ్య రంగంలో ప్రపంచానికే మార్గదర్శిగా వెలుగొందుతున్న హైదరాబాద్ సంతాన సమస్యలకు చెక్ పెట్టే అధునాతన పద్ధతులను ఆవిష్కరిస్తోంది. ఈ క్రమంలోనే ఐవీఎఫ్ కంటే అధునాతన చికిత్సా విధానాలను అందుబాటులోకి తెచి్చంది. దంపతుల నుంచి సేకరించిన ఎగ్స్, శుక్రకణాలను ఎంబ్రియాలజీ ల్యాబ్లో మైక్రోస్కోప్ కింద పిండాన్ని (జీవ కణం) తయారు చేస్తారు. ఐదు నుంచి ఆరు రోజుల్లో పిండం సిద్ధమైపోతుంది. ఇలా తయారు చేసిన పిండాన్ని పదేళ్లలోపు ఎప్పుడైనా మహిళ గర్భాశయంలోకి ట్రాన్స్ఫర్ చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. వైరల్ మార్కర్ టెస్టులు.. పెళ్లికి ముందు, లేదా వివాహం నిశ్చయించుకున్న జంటలు ముందుగా వైరల్ మార్కర్, ఏఎంహెచ్ వంటి టెస్టులు చేయించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఒక వేళ ఇద్దరిలో ఎవరికైనా సమస్యలు ఉంటే ముందుగానే వాటికి చికిత్సలు తీసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతల్లో పనిచేసే వారిలో శుక్రకణాల సంఖ్య తగ్గిపోతుందట. మహిళల్లో 25 ఏళ్ల లోపు ఎగ్ రిలీజ్ బాగుంటుందని, తరువాత తగ్గిపోతుందని చెబుతున్నారు. ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ వివాహానికి ముందే చేసుకుంటే మంచిది. ఏడాది వరకూ సహజంగానే ట్రై చేసుకోవచ్చు. ఇది డే కేర్ ప్రొసీజర్..పట్టణ ప్రాంతాల్లో జీవన శైలి, ఇతర అలవాట్లతో సంతాన సమ్యలు సర్వసాధారణం అయిపోయాయి. దీంతో కొందరు ఐవీఎఫ్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అందులోనూ అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. శుక్రకణాలు, అండం, పిండాన్ని ఫ్రీజ్ చేయడం, ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసే ప్రొసీజర్లు కొనసాగుతున్నాయి. శుక్ర కణాలు, ఎగ్స్ ఎంబ్రియాలజీ ల్యాబ్లో మైక్రో స్కోప్ కింద కలిపి పిండం (జీవకణం) తయారు చేస్తాం. దీన్ని ఇక్సీ పద్ధతి అంటారు. మహిళకు నొప్పి లేకుండా డే కేర్ ప్రొసీజర్లో పూర్తయిపోతుంది. మరుసటి రోజు నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు. – పీ.స్వాతి, రీప్రొడక్టివ్ మెడిసిన్, కన్సల్టెంట్ రైన్బో హాస్పటల్స్ (చదవండి: సైక్లింగ్ పర్యావరణ హితం.. ఆరోగ్యం కూడా..!)
ఫొటోలు
అంతర్జాతీయం

ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు.. ఊహించిందేనన్న వైట్హౌజ్!
జెఫ్రీ ఎప్స్టీన్ పాపాల్లో ట్రంప్కు వాటా ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్స్టీన్ ఓ మానవ మృగం అని, అతనితో చాలా ఏళ్లపాటు ఎలాంటి సంబంధాలు కొనసాగలేదని ట్రంప్ చెబుతూ వస్తున్నారు. ఈ తరుణంలో కీలకమైన ఎప్స్టీన్ పైల్స్లో ట్రంప్ పేరు నిజంగా ఉందా? లేదా? అనే చర్చ అమెరికాలో విస్తృతంగా నడుస్తోంది. తాజాగా.. ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు పలుమార్లు ప్రస్తావన ఉందని, ఆ విషయాన్ని యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీ(Palm Bondi) అధ్యక్షుడు ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారని వాల్ స్ట్రీట్ జర్నల్ బుధవారం ఓ సంచలనాత్మక కథనం ప్రచురించింది. మే నెలలోనే ఇది జరిగిందని, అయితే ఆ ఫైల్స్లో ట్రంప్ ప్రస్తావన ఏయే సందర్భాల్లో వచ్చిందనేది మాత్రం సదరు కథనం వివరించలేదు. ఎప్స్టీన్తో దగ్గరి సంబంధాలే ట్రంప్కు ఉన్నాయంటూ మొన్నీమధ్య wsj ఓ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. 2003లో ఎప్స్టీన్ పుట్టినరోజు కానుకగా ట్రంప్ ఓ లేఖ రాశారన్నది ఆ వార్త సారాంశం. అయితే ఆ కథనాన్ని తోసిపుచ్చిన ట్రంప్ సదరు మీడియా సంస్థపై భారీ పరువు నష్టం దావా వేశారు. ఈలోపు కనీసం వారం కూడా తిరగకుండానే మరో కథనంతో అదే మీడియా సంస్థ వచ్చింది. అయితే..ఇది ఊహించిందేనని వైట్హౌజ్ అంటోంది. ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు.. ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేసింది అమెరికా అధ్యక్ష భవనం. సదరు మీడియా సంస్థ నుంచి ఇలాంటి కథనాలు ఊహించినవేనని, డెమోక్రాట్లు, లిబరల్ మీడియా ట్రంప్పై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది. మాజీ అధ్యక్షుడు ఒబామాపై విచారణ నేపథ్యంలోనే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారంటూ వైట్హౌజ్ వర్గాలు అంటున్నాయి. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై అమెరికాలో రాజకీయ దుమారం రేగింది. రష్యాతో చేతులు కలిపి హిల్లరీ క్లింటన్ ప్రచారాన్ని ట్రంప్ దెబ్బ తీయాలని చూశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేవు. అయితే.. తాజాగా ఈ అంశంలో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా పాత్రపై పెను దుమారం రేగింది. ట్రంప్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తుల్సీ గబ్బార్డ్ ఆరోపణలు ప్రకారం.. ఒబామా తన ప్రభుత్వంలో ఉన్న అధికారులతో కలిసి రష్యా జోక్యంపై తప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికలు తయారు చేశారని, తద్వారా ట్రంప్ ప్రచారాన్ని అడ్డుకోవాలని చూశారన్నది ఆ కథనాల సారాంశం. ఈ ఆరోపణలకు సంబంధించి డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ను గబ్బార్డ్ విడుదల చేశారు కూడా. అయితే.. ఒబామా మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్లో.. అమెరికన్ ఫైనాన్షియర్, ప్రముఖ ఇన్వెస్టర్ అయిన జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఇదే కేసులో అరెస్టైన ఎప్స్టీన్ సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్.. ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అమెరికాలో సంచలనం సృష్టించింది జెఫ్రీ ఎప్స్టీన్ హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం. చాలా ఏళ్లపాటు మైనర్ బాలికలపై ఎప్స్టీన్ లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. 90వ దశకం నుంచి అమెరికాలో ప్రముఖ ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఎప్స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడని, ఈ వ్యవహారంలో అతని సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్ సహకరించారన్న అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో.. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది ప్రధానంగా తెర మీదకు వచ్చింది. ఇది ఈ స్కామ్కు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్లో ఎప్స్టీన్ టోటల్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయని గతంలో దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. వీటిని బయటపెట్టాలని చాలా ఏళ్లుగా డిమాండ్ నడుస్తోంది అక్కడ. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్స్ వివరాలు బహిర్గతం అవుతాయని అంతా భావించారు. అందుకు తగ్గట్లే.. ఎఫ్బీఐ, అమెరికా న్యాయవిభాగం ఆ బాధ్యతలు సంయుక్తంగా చేపట్టాయి. అయితే జులై మొదటి వారంలో యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీ అనూహ్యమైన ప్రకటన చేశారు. అందులో సంచలనాత్మక వివరాలేవీ లేవని అన్నారామె. ఎప్స్టీన్ వద్ద ‘క్లయింట్ లిస్ట్’ లేదు. ఆయన బ్లాక్మెయిల్ చేయలేదని, ప్రాముఖ్యమైన వ్యక్తులపై నేరపూరిత ఆధారాలు లేవని” పేర్కొన్నారు. అయితే.. ఎప్స్టీన్తో ట్రంప్కు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ఆ వివరాలను బయటపెట్టనివ్వడం లేదన్న విమర్శలు ఇప్పుడు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు(పాతవి) నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ట్రంప్ వివాహ వేడుకలోనూ ఎప్స్టీన్ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం గమనార్హం. ఈ క్రమంలో.. ఈ సెక్స్ స్కాండల్ను కదిలించిన అమెరికన్ విజువల్ ఆర్టిస్ట్ మరియా ఫార్మర్(ఎప్స్టీన్పై ఫిర్యాదు చేసిన తొలి వ్యక్తి.. ఈమె కేసులోనే ఎప్స్టీన్ అరెస్టయ్యాడు).. ట్రంప్ను కూడా ఎఫ్బీఐ సంస్థ విచారించాలని డిమాండ్ చేస్తున్నారు.

Australia: హిందూ ఆలయ గోడలపై జాత్యహంకార వ్యాఖ్యలు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లోగల ఒక హిందూ దేవాలయం గోడలపై ద్వేషపూరిత జాత్యహంకార రాతలు కనిపించడంతో కలకలం చెలరేగింది. ఆస్ట్రేలియా హిందూ కౌన్సిల్ అధ్యక్షుడు, విక్టోరియా చాప్టర్, మకరంద్ భగవత్ ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ ఆలయం శాంతి, భక్తి, ఐక్యతకు నిలయమని ఆయన పునరుద్ధాటించారు.ఆస్ట్రేలియాలోని వాధర్స్ట్ డ్రైవ్లో గల స్వామినారాయణ ఆలయం గోడపై దుండగులు ఎర్రటి పెయింట్ చల్లి, జాత్యహంకార దుర్భాషపూరిత వ్యాఖ్యలు రాశారు. స్థానిక దినపత్రిక తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆలయానికి సమీపంలోని రెండు ఆసియా రెస్టారెంట్లలో కూడా ఇదే సందేశం కనిపించింది. హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు, విక్టోరియా చాప్టర్, మకరంద్ భగవత్ ఈ సంఘటనపై స్పందిస్తూ, స్వామి నారాయణ ఆలయం రోజువారీ ప్రార్థనలు, సామూహిక భోజనాలు, సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తుందని భగవత్ తెలిపారు.అయినప్పటికీ ఇటువంటి ఘటనలు ఎదురవడం శోచనీయమన్నారు. హిందువులు ఇతర వర్గాలవారిపై ప్రేమను చూపించాలని, ద్వేషంపై ప్రేమ విజయం సాధిస్తుందని భగవత్ అన్నారు. ఆలయంలో జరిగిన ఘటన తీవ్రంగా కలత పెట్టే అంశమని, భయాన్ని వ్యాప్తి చేయడానికే విద్రోహులు ఇటువంటి చర్యకు పాల్పడ్దారని భగవత్ పేర్కొన్నారు.

థాయ్, కంబోడియా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత
బ్యాంకాక్: థాయ్లాండ్- కంబోడియా మధ్య సరిహద్దు వివాదాల కారణంగా ఇరు దేశల సంబంధాలు క్షీణిస్తున్నాయి. తాజాగా సరిహద్దుల్లో భద్రతా దళాల ఘర్షణలు జరిగినట్లు ఇరు దేశాలు మీడియాకు తెలిపాయి. థాయ్ సైన్యం, కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ప్రసాత్ తా ముయెన్ థామ్ సమీపంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. థాయ్లాండ్ పరిధిలోని సురిన్ ప్రావిన్స్లో ప్రసాత్ తా ముయెన్ ఉంది. అయితే కంబోడియా ఇది తమదేనని చెబుతోంది.ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన దరిమిలా థాయ్- కంబోడియా సైనికుల పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. గురువారం ఉదయం పేలుళ్ల శబ్ధాలు వినిపిస్తుండటంతో, తాము పారిపోయి కాంక్రీట్ బంకర్లో దాక్కుంటున్నట్లు థాయ్లాండ్ ప్రజలు తెలిపారు. థాయ్లాండ్ , కంబోడియాలు ఎవరు తొలుత కాల్పులు జరిపారనే దానిపై వాదనలు చేసుకున్నాయి. ఈ ఆగ్నేయాసియా పొరుగు దేశాల మధ్య సంబంధాలు మే నెల నుండి క్షీణిస్తూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో చోటుచేసుకున్న సాయుధ ఘర్షణలో కంబోడియా సైనికుడొకరు మృతిచెందారు.థాయ్లాండ్ ముందుగా ఈ సాయుధ ఘర్షణను ప్రారంభించిందని, కంబోడియా స్వయం రక్షణ పరిధిలోనే వ్యవహరించిందని, అయితే థాయ్ దళాల నిర్ద్వంద్వ చొరబాటుకు ప్రతిస్పందించామని కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. బుధవారం సరిహద్దు సమీపంలో జరిగిన ఒక ల్యాండ్ మైన్ పేలుడులో ఐదుగురు థాయ్ సైనికులు గాయపడ్డారు. దీనికి ముందు కూడా ఒక ల్యాండ్ మైన్ పేలి, ముగ్గురు థాయ్ సైనికులు గాయపడ్డారు. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ప్రాంతంపై కంబోడియాకు సార్వభౌమాధికారాన్ని ఇచ్చింది. అప్పటి నుంచి ఇరు రెండు దేశాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి.

‘ఎల్ఏసీ’లో ఏం చేద్దాం?.. భారత్-చైనా సమీక్ష
న్యూఢిల్లీ: భారత్- చైనా దేశాలు తూర్పు లడఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని సమీక్షించాయి. సరిహద్దు వివాదాలపై ఇరు దేశాలకు చెందిన ప్రత్యేక ప్రతినిధులు తదుపరి చేపట్టాల్సిన చర్యలకు ఏర్పాట్లు చేశాయి. ఢిల్లీలో జరిగిన వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (డబ్ల్యూఎంసీసీ)సమావేశంలో ఇరుపక్షాలు ఈ అంశాలపై చర్చలు జరిపాయి.సరిహద్దుల్లో ప్రశాంతత, సాధారణ పరిస్థితి నెలకొనడం, ద్వైపాక్షిక సంబంధాలను క్రమంగా సాధారణీకరించేందుకు ఈ చర్చలు దోహదపడతాయని ఇరు దేశాల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ)తెలిపింది. ఈ ఏడాది చివర్లో భారత్లో జరగనున్న ప్రత్యేక ప్రతినిధుల (ఎస్ఆర్) తదుపరి దశ చర్చలకు భారత్- చైనా సిద్ధమయ్యాయని ఎంఈఏ పేర్కొంది. ఈ చర్చలకు భారత ప్రత్యేక ప్రతినిధిగా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ)అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి నేతృత్వం వహించనున్నారు.ఈ చర్చలకు ముందు వాంగ్ భారతదేశాన్ని సందర్శించే అవకాశం ఉంది. గడచిన తొమ్మిది నెలలుగా భారత్- చైనాలు ఇరు దేశాల సంబంధాలను సాధారణీకరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రెండు వైపులా ఘర్షణ పాయింట్ల నుండి దళాలను విరమించుకున్నప్పటికీ, తూర్పు లడఖ్ ప్రాంతంలో ఎల్ఏసీ వెంబడి 60 వేల మంది సైనికులున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్న అనంతరం డబ్ల్యూఎంసీసీ చర్చలు జరిగాయి.2020 జూన్లో తూర్పు లడఖ్లోని గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణ ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గత ఏడాది అక్టోబర్ 21న ఖరారైన ఒప్పందం ప్రకారం డెమ్చోక్, డెప్సాంగ్ పాయింట్ల నుండి సైనిక దళాలను వెనక్కు మళ్లించారు. గత ఏడాది అక్టోబర్లో రష్యాలోని కజాన్లో ప్రధాని నరేంద్ర మోదీ- చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశంలో ఇరుదేశాల దౌత్య సంబంధాలను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు.
జాతీయం

గదగ్లో లవ్ జిహాద్
రాయచూరు రూరల్(కర్ణాటక): గదగ్లో విడ్డూరమైన లవ్ జిహాద్ కేసులో కట్టుకున్న భర్తపైనే భార్య పోక్సో కేసు పెట్టించిన ఉదంతం వెలుగు చూసింది. వివరాలు.. గదగ్లోని బెటగేరి ప్రాంతంలో విశాల్ కుమార్ అనే వ్యక్తి మైనార్టీ సముదాయానికి చెందిన యువతి మూడేళ్ల నుంచి ప్రేమించుకున్నారు. వీరిద్దరూ గత ఏడాది నవంబర్లో వివాహం చేసుకున్నారు. అయితే వివాహ నిఖా సమయంలో తనను మతమార్పిడి చేయడమే కాకుండా మసీదులో విరాజ్ సాబ్గా తన పేరును మార్చారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ తాజాగా వారం రోజుల క్రితం పోలీసు స్టేషన్ను ఆశ్రయించాడు. దీనిని గమనించిన యువతి మైనార్టీ తీరని 17 ఏళ్ల అమ్మాయిని వివాహం చేసుకొన్నట్లు భర్తపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సౌమ్య కేసు: దుస్తులే తాడుగా.. జైలు గోడ దూకి పరార్.. కేరళలో హైఅలర్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సౌమ్య(23) హత్యాచార కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న గోవిందచామీ అలియాస్ ఛార్లీ థామస్ జైలు నుంచి పరారయ్యాడు. దీంతో పోలీస్ శాఖ కేరళవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించి అప్రమత్తమైంది. అయితే గంటల వ్యవధిలో.. ఓ స్థానికుడి సహాయంతో పోలీసులు ఆ మానవ మృగాన్ని పట్టుకోగలిగారు.2011లో సౌమ్య అనే యువతిని రైలు నుంచి బయటకు నెట్టేసి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు చార్లీ థామస్. ఈ కేసులో బాధితురాలు చికిత్స పొందుతూ నాలుగు రోజులకే కన్నుమూసింది. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ కేసులో ఘటన జరిగిన మరుసటిరోజే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కన్నూరు జైలులో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్న చార్లీ.. గత అర్ధరాత్రి సమయంలో జైలు నుంచి పరారయ్యాడు. తాను ఉంటున్న సెల్ ఊచలను తొలగించి బయటకు వచ్చిన చార్లీ.. ఆపై తోటి ఖైదీల దుస్తులను తాడుగా మార్చేసి కరెంట్ ఫెన్సింగ్ను దాటేసి మరీ పరారయ్యాడు. గోడ దూకాక.. రోడ్డు మీద తాపీగా నడుచుకుంటున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. దీంతో పోలీసు శాఖ స్టేట్ వైడ్ అలర్ట్ ప్రకటించింది. బస్టాండులు, రైల్వే స్టేషన్లు, ఆలయాలు.. ఇలా అన్నిచోట్ల చార్లీ ఫొటోలతో గాలింపు ముమ్మరం చేసింది. చార్లీని గుర్తిస్తే 9446899506 నెంబర్కు సమాచారం ఇవ్వాలని కోరింది.ఈలోపు.. కన్నూరు తలప్పు ఏరియాలో ఓ పాడుబడ్డ ఇంటి ఆవరణలో చార్లీని చూసినట్లు స్థానికుడు ఒకరు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లగా.. అక్కడ బావిలో దాక్కుని కనిపించాడు. దీంతో తాడు సాయంతో అతన్ని బయటకు తీశారు. ఉదయం. 11గం. ప్రాంతంలో చార్లీని పోలీసులు అదుపులోకి తీసుకుని మళ్లీ జైలుకు తరలించారు. 2011, ఫిబ్రవరి 1వ తేదీన కొచ్చి నుంచి షోరణూర్ వెళ్తున్న రైలులో సౌమ్య(23) ఒంటరిగా ప్రయాణిస్తోంది. అది గమనించిన గోవిందచామీ.. ఆమెను రైలు నుంచి తోసి, ట్రాక్ పక్కన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి బలాత్కారం చేశాడు. అటుపై ఆమె ఫోన్తో ఉడాయించాడు. ఆ ఫోన్ ఆధారంగానే పోలీసులు ఆ మరుసటిరోజే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఇటు త్రిసూర్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ సౌమ్య ఫిబ్రవరి 6వ తేదీన కన్నుమూసింది.ఈ ఘటన కేరళతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదే ఏడాది నవంబర్ 11న ఫాస్ట్ట్రాక్ కోర్టు గోవిందచామీకి మరణశిక్ష విధించింది. కోర్టు నుంచి బయటకు వస్తున్న టైంలో చార్లీ నవ్వుతూ కనిపించాడు. పైగా శిక్ష ప్రకటించే సమయంలోనూ అతనిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని న్యాయమూర్తి అన్నారు. అయితే.. 2013లో కేరళ హైకోర్టు ఆ శిక్షను నిలుపుదల చేయగా, 2014లో సుప్రీం కోర్టు సైతం స్టే ఇచ్చింది. 2016లో గోవిందచామీపై మర్డర్ అభియోగాన్ని తొలగించి.. కేవలం రేప్కేసు కింద జీవిత ఖైదును సుప్రీం కోర్టు విధించింది. అంత కట్టుదిట్టమైన భద్రత నుంచి ఎలా?కన్నూరు సెంట్రల్ జైలు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంటుందని, అలాంటి జైలు నుంచి చార్లీ తప్పించుకోవడం ఏంటి? అని బాధిత కుటుంబం ప్రశ్నిస్తోంది. ఎవరో అతనికి సాయం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తోంది. మరోవైపు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘చార్లీ కరడుగట్టిన నేరస్తుడు. అర్ధరాత్రి 1గం. సమయంలో తప్పించుకున్నాడు. అధికారులేమో ఉదయం 5గం. గుర్తించారు. ఏడుగంటలకు పోలీసులు అప్రమత్తం అయ్యారు. సరిగ్గా అతను తప్పించుకునే టైంలోనే జైల్లో కరెంట్ పోయింది. ఇది పక్కా స్కెచ్తోనే జరిగి ఉంటుంది’’ అనే అనుమానాలు వ్యక్తం చేశారాయన. అయితే కేరళ పోలీస్ శాఖ మాత్రం అతని కోసం వేట కొనసాగుతోందని తెలిపింది. ఈలోపు అతను దొరకడం విశేషం.

చచ్చేంత వరకు జైల్లోనే ఉండండి
సాక్షి, చెన్నై: తన సుఖం కోసం కన్నబిడ్డల్ని కడతేర్చిన కసాయి తల్లి, ఆమె ప్రియుడికి మరణించే వరకు జైలు శిక్ష విధిస్తూ కాంచీపురం కోర్టు న్యాయమూర్తి బిజూ చెమ్మల్ గురువారం తీర్పు వెలువరించారు. వివరాలు.. కాంచీపురం సమీపంలో 2018లో ఇద్దరు పిల్లల హత్య స్థానికంగా కలకలం రేపింది. విజయ్, అభిరామి దంపతుల పిల్లలైన అజయ్(6), కరి్ణక(4) ఈ హత్యకు గురైనట్టు గుర్తించారు. ఈ పిల్లలను వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న నెపంతో తల్లే కడతేర్చినట్టు విచారణలో తేలింది. ప్రియుడు మీనాక్షి సుందరం మోజులో పడ్డ అభిరామి భర్త విజయ్, పిల్లలను హతమార్చేందుకు పథకం వేసింది. అయితే, ఘటన జరిగిన రోజున భర్త విజయ్ ఇంటికి రావడంలో ఆలస్యం జరగడంతో పిల్లలు హతమైనట్టు విచారణలో తేలింది. భర్తను హతమార్చ లేక పిల్లల్ని చంపేసి ప్రియుడితో ఉడాయించిన అభిరామిని పోలీసులు అరెస్టు చేశారు. ఈకేసు విచారణ కాంచీపురం కోర్టు న్యాయమూర్తి బిజు చెమ్మల్ ముందు విచారణ జరిగింది. వానదనలు, సాక్షుల విచారణలన్నీ ముగిసి గురువారం న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించారు. ఈ కసాయి తల్లి, ఆమె ప్రియుడికి మరణించే వరకు జైలు శిక్ష విధించారు. ఈ సమయంలో కోర్టుకు వచ్చిన అభిరామి తీర్పు తదుపరి మహిళా కానిస్టేబుల్ కాళ్లను పట్టుకుని కన్నీటి పర్యంతమైంది. అభిరామి, మీనాక్షి సుందరంకు మరణించే వరకు జైలు శిక్షతోపాటూ తలా రూ. 15 వేలు జరిమానా విధించారు.

బస్సులో అసభ్య ప్రవర్తన
తమిళనాడు: మద్యం మత్తులో ఓ యువతి ఎదుట నగ్నంగా నిలబడి అసభ్యకరంగా ప్రవర్తించిన ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ను బస్సులోని ప్రయాణికులు చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన బుధవారం రాత్రి కలకలం రేపింది. తిరువళ్లూరు బస్టాండు నుంచి శ్రీపెరంబదూరుకు బుధవారం రాత్రి పది గంటలకు ప్రభుత్వ బస్సు సుమారు 25 మంది ప్రయాణికులతో బయలుదేరింది. బస్సు కామరాజర్ విగ్రహం వద్ద వచ్చిన క్రమంలో అప్పటికే మద్యం మత్తులో వున్న వ్యక్తి నగ్నంగా మారి యువతి ఎదుట అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో యువతి గట్టిగా కేకలు వేయడంతో బస్సులోని ప్రయాణికులు నగ్నంగా ఉన్న వ్యక్తిని చూసి షాక్కు గురి కావడంతో పాటూ అతడ్ని చితకబాది దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు చేపట్టిన విచారణలో మద్యం మత్తులో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి శ్రీపెరంబదూరుకు చెందిన మదియగళన్గా గుర్తించారు. ఇతను అరక్కోణంలోని ఆయుర్వేద వైద్యశాలలో డాక్టర్గా పని చేస్తున్నట్టు నిర్ధారించారు. కాగా బస్సులో నగ్నంగా మారి యువత ఎదుట అసభ్యకరంగా ప్రవర్తించిన ఆయుర్వేద వైద్యుడి వ్యవహార శైలి స్థానికంగా కలకలం రేపింది. కాగా నిందితుడిని పోలీసు స్టేషన్కు తరలించి పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఎన్ఆర్ఐ

అమెరికా నాసా ఎన్ఎస్ఎస్ ఐఎస్డీసిలో సత్తా చాటిన విద్యార్థులు
బంజారాహిల్స్: అంతర్జాతీయ స్థాయిలో అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన ఐఎస్డీఎస్ కాన్ఫరెన్స్లో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు సత్తా చాటారని శ్రీ చైతన్య స్కూల్ అకడమిక్ డైరెక్టర్ సీమ తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్లోని దసపల్లా హోటల్లో నాసా ఏర్పాటు చేసిన ఐఎస్డీఎస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల నుంచి 475 మంది విద్యార్థులు హాజరైతే అందులో 67 మంది భారత దేశం నుంచి పాల్గొనగా 45 మంది శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులే ఉండటం తమకు గర్వకారణంగా ఉందని అన్నారు. అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్లో అంతర్జాతీయ స్థాయిలో 60 విన్నింగ్ ప్రాజెక్టులు గెలుచుకొని తాము వరల్డ్ నెం1.గా నిలిచామని తెలిపారు. వీటిలో వరల్డ్ ఫస్ట్ ప్రైజ్ 3 ప్రాజెక్టులు, వరల్డ్ సెకండ్ ప్రైజ్ 4 ప్రాజెక్టులు, వరల్డ్లో మూడో ప్రైజ్ కింద 10 ప్రాజెక్టులు గెలుచు కోవడంతో పాటు 43 ప్రాజెక్టులకు హానరబుల్ మెన్షన్స్ సాధించాయని తెలిపారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల నుంచి మరే ఏ ఇతర పాఠశాల నుంచి విద్యార్థులు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొనలేదన్నారు.ఈ కాన్ఫరెన్స్లో ఆర్టిస్టిక్ కేటగరిలో 500 డాలర్ల బహుమతి అందుకున్న ఏకైక టీం తమదేనని ఆమె వెల్లడించారు.

అడాప్ట్ ఏ స్ట్రీట్ పేరుతో నాట్స్ సేవా కార్యక్రమాలు
డాలస్, టెక్సాస్ : భాషే రమ్యం .. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేలా అడాప్ట్ ఏ స్ట్రీట్ పేరుతో కార్యక్రమాన్నిచేపట్టి వీధులను శుభ్రం చేసింది. ఫ్రిస్కో నగరంలో ఫీల్డ్స్ పార్క్వేలో చెత్తను తీసేసి.. అక్కడ వీధిని శుభ్ర పరిచింది. దాదాపు 20 మందికి పైగా తెలుగు వారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరిలో అవగాహన పెంచే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 25 పౌండ్లకు పైగా చెత్తను సేకరించి ఆ వీధిని బాగుచేసింది. ఈ కార్యక్రమం ద్వారా యువతలో పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతను, ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించే లక్ష్యాలు నెరవేరుతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్ధులకు సామాజిక బాధ్యతను నేర్పిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకీ , పెద్దలకీ మరియు మద్దతు అందించిన దాతలకు నాట్స్ డాలస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ. శ్రావణ్ నిడిగంటిలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి సహ కోశాధికారి రవి తాండ్ర , మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె,డల్లాస్ చాప్టర్ జట్టు నుండి పావని నున్న, వంశీ వేనాటి, కిరణ్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. మానవతా విలువలకు ప్రాధాన్యతనిస్తూ ఈ తరహా సేవా కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తున్న డాలస్ చాప్టర్ బృందానికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి అభినందనలు తెలిపారు.

పేద పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు నాట్స్ ముందడుగు
డాలస్, టెక్సాస్: అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. ఆకలితో ఆలమటిస్తున్న పేద పిల్లలకు పోషకాహారం అందించేందుకు రంగంలోకి దిగింది. తాజాగా నాట్స్ డాలస్ విభాగం, ఫీడ్ మై స్ట్రావింగ్ చిల్డ్రన్లు కలిసి పేద పిల్లలకు ఆహారం అందించేందుకు కావాల్సిన ఆహారాన్ని సిద్ధం చేశాయి. రిచర్డ్సన్ నగరంలో దాదాపు 20 మంది తెలుగు యువతీ, యువకులు, పెద్దలు.. 133 బాక్సుల పౌష్టికాహారాన్ని ప్యాక్ చేశారు. ఇందులో 28,728 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 78 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించేలా ఫుడ్ ప్యాకింగ్ చేశారు. నాట్స్ పూర్వ అధ్యక్షులు, ప్రస్తుత నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్ బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదల మార్గదర్శకత్వంలో పలువురు నాట్స్ యువ వాలంటీర్లు కుటుంబ సమేతంగా పాల్గొని వేల సంఖ్యలో ఆహార కిట్లను సిద్ధం చేశారు నాట్స్ డాలస్ చాప్టర్ యువతను ప్రోత్సహిస్తూ, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలా పేద పిల్లలకు పౌష్టికాహారం సిద్ధం చేసే కార్యక్రమాన్ని చేపట్టిందని బాపు నూతి అన్నారు. సేవా కార్యక్రమాల్లో విద్యార్ధులను భాగస్వామ్యులను చేయటం చాలా సంతోషంగా ఉందని, ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అని రాజేంద్ర మాదల అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన పావని నున్న, సౌజన్య రావెళ్ల డాలస్ టీం సభ్యులకు డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ కుమార్ నిడిగంటిలు కృతజ్ఞతలు తెలిపారు.. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి సహకోశాధికారి రవి తాండ్ర, మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె, డల్లాస్ చాప్టర్ జట్టు నుండి పావని నున్న తదితరులు పాల్గొన్నారు. డాలస్ చాప్టర్ టీం, నాట్స్ సలహాదారు బృందం సభ్యుల సహకారంతో ఇంత మంచి సేవా కార్యక్రమం చేపట్టినందుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి నాట్స్ డాలస్ విభాగానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపై నాట్స్ సంతాపం
ప్రముఖ నటుడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మరణ వార్త పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. 750 సినిమాల్లో ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించిన కోట తెలుగు వారి మనస్సుల్లో చెరిగి పోని ముద్ర వేశారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. తండ్రిగా, తాతగా, కామెడీ విలన్గా, పోలీసుగా, మాంత్రికుడిగా ఎన్నో పాత్రలను పోషించిన కోటను తెలుగు వారు ఎన్నటికి మరిచిపోలేరని ఓ ప్రకటనలో తెలిపారు. కోట మృతి పట్ల నాట్స్ ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చింది. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నామని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి తెలిపారు.కాగా ‘కోట’గా పాపులర్ అయిన నటుడు కోట శ్రీనివాసరావు (83) జూలై 13 తెల్లవారుజామున హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని ఫిల్మ్ నగర్లోని తన నివాసంలో కన్నుమూసారు. 83వ పుట్టినరోజు జరుపుకున్న కేవలం మూడు రోజులకే ఆయన మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక శకం ముగిసింది అంటూ పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
క్రైమ్

గర్భిణీ భార్య హత్య.. ఇంట్లో మృతదేహం.. బయట భర్త నాటకం
సాక్షి,బెంగళూరు: ప్రేమన్నాడు. పెళ్లన్నాడు. నువ్వులేకపోతే నేను లేనన్నాడు. కాదూ కూడదు అంటే చచ్చిపోతున్నాడు. చివరికి ఆమెను లేకుండా చేశాడు. గర్భవతిగా ఉన్న భార్యను కడతేర్చాడు. ఆపై పరారయ్యాడు.బెంగళూరు పోలీసుల వివరాల మేరకు.. బెంగళూరులో జరిగిన విషాద ఘటనలో ఉత్తరప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల యువకుడు శివం తన 22 ఏళ్ల గర్భవతి భార్య సుమనను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.శివం, సుమన ఐదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో మందలించారు. దీంతో ఇంట్లో నుంచి పారిపోయి ఐదు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. అనంతరం, బెంగళూరుకు పారిపోయి వచ్చారు. బెంగళూరులో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న శివమ్ పెయింటర్గా పనిచేస్తుండగా.. సుమన ఇంట్లోనే ఉంటుంది. ఆమె మూడు నెలల గర్భిణీ.ఐదేళ్ల పాటు ప్రేమ,దోమ అంటూ సుమన వెంటబడ్డ శివమ్ పెళ్లి తర్వాత తన రాక్షస బుద్ధిని బయటపెట్టాడు. అనుమానం పేరుతో సుమనను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇదే విషయమై సుమనపై శివమ్ చేయిచేసుకున్నాడు. ఇరువురి మధ్య గొడవ జరగడంతో ఎవరికి వారు వేర్వేరు రూముల్లోకి వెళ్లి నిద్రించాడు. మరునాడు అంటే మంగళవారం ఆమెను నిద్ర లేపేందుకు ప్రయత్నించాడు. ఆమె స్పందించకపోవడంతో ఎప్పటిలాగే పనికెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చాడు. పూటగా మద్యం సేవించాడు. బుధవారం సైతం ఆమెను లేపేందుకు ప్రయత్నించగా అచేతనంగా పడి ఉండి.సుమన మరణించిందని నిర్ధారించుకొని ఇంటినుంచి పారిపోయాడు. అయితే,ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సుమన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. వివాహం జరిగిన నాటి నుంచి సుమనపై అనుమానం పెంచుకున్న భర్త శివమ్ ఆమెను హత్య చేసినట్లు నిర్ధారించారు.

చచ్చేంత వరకు జైల్లోనే ఉండండి
సాక్షి, చెన్నై: తన సుఖం కోసం కన్నబిడ్డల్ని కడతేర్చిన కసాయి తల్లి, ఆమె ప్రియుడికి మరణించే వరకు జైలు శిక్ష విధిస్తూ కాంచీపురం కోర్టు న్యాయమూర్తి బిజూ చెమ్మల్ గురువారం తీర్పు వెలువరించారు. వివరాలు.. కాంచీపురం సమీపంలో 2018లో ఇద్దరు పిల్లల హత్య స్థానికంగా కలకలం రేపింది. విజయ్, అభిరామి దంపతుల పిల్లలైన అజయ్(6), కరి్ణక(4) ఈ హత్యకు గురైనట్టు గుర్తించారు. ఈ పిల్లలను వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న నెపంతో తల్లే కడతేర్చినట్టు విచారణలో తేలింది. ప్రియుడు మీనాక్షి సుందరం మోజులో పడ్డ అభిరామి భర్త విజయ్, పిల్లలను హతమార్చేందుకు పథకం వేసింది. అయితే, ఘటన జరిగిన రోజున భర్త విజయ్ ఇంటికి రావడంలో ఆలస్యం జరగడంతో పిల్లలు హతమైనట్టు విచారణలో తేలింది. భర్తను హతమార్చ లేక పిల్లల్ని చంపేసి ప్రియుడితో ఉడాయించిన అభిరామిని పోలీసులు అరెస్టు చేశారు. ఈకేసు విచారణ కాంచీపురం కోర్టు న్యాయమూర్తి బిజు చెమ్మల్ ముందు విచారణ జరిగింది. వానదనలు, సాక్షుల విచారణలన్నీ ముగిసి గురువారం న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించారు. ఈ కసాయి తల్లి, ఆమె ప్రియుడికి మరణించే వరకు జైలు శిక్ష విధించారు. ఈ సమయంలో కోర్టుకు వచ్చిన అభిరామి తీర్పు తదుపరి మహిళా కానిస్టేబుల్ కాళ్లను పట్టుకుని కన్నీటి పర్యంతమైంది. అభిరామి, మీనాక్షి సుందరంకు మరణించే వరకు జైలు శిక్షతోపాటూ తలా రూ. 15 వేలు జరిమానా విధించారు.

రాజస్తాన్: కుప్పకూలిన స్కూల్ పైకప్పు.. ఏడుగురు విద్యార్థుల దుర్మరణం
రాజస్తాన్ ఝలవార్ జిల్లా ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకి చేరింది. మరో 15 మందికి గాయాలైనట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. వీళ్లలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 8.30గం.ప్రాంతంలో మనోహర్ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల భవనంలోని ఓ తరగతి పైకప్పు కుప్పకూలింది. ఆ సమయంలో విద్యార్థులు క్లాస్లో కూర్చుని ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సాయంతో టీచర్లు శిథిలాలను తొలగించే ప్రయత్నం మొదలుపెట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆస్పత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు, విద్యాశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 20 ఏళ్ల కిందటి నాటి ఈ స్కూల్ భవనానికి మరమ్మత్తులు అవసరమని గతంలో పలు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ క్రమంలో.. గత కొంతకాలంగా ఇక్కడ వర్షాలు పడుతుండడంతో ఈ ఘోరం జరిగింది. పైకప్పు రాళ్లతో కట్టి ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తోంది.ప్రమాదంపై ప్రధాని మోదీ, రాజస్తాన్ సీఎం భజనాన్ లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ జిల్లా కలెక్టర్, అధికారులతో మాట్లాడి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. सुबह-सुबह झालावाड़ से दुखद खबरझालावाड़ में एक सरकारी स्कूल की बिल्डिंग गिरने से 5 बच्चों की मौत हो गई. वहीं हादसे में 30 से ज्यादा बच्चे गंभीर घायल हैं.हादसा शुक्रवार सुबह प्रार्थना के दौरान मनोहरथाना ब्लॉक के पीपलोदी सरकारी स्कूल में हुआ.#Rajasthan #Jhalawar pic.twitter.com/DgtbbO8k3q— Avdhesh Pareek (@Zinda_Avdhesh) July 25, 2025

మా బిడ్డను చంపేశాడు
విశాఖపట్నం: వివాహం చేసుకుంటానని తమ కుమార్తెను వంచించి వేరే వ్యక్తితో సంబంధం ఉందంటూ యశ్వంత్ అనే యువకుడు చంపేశాడని ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి ప్రాంతానికి చెందిన కార్తీక రామారావు, కార్తీక రామలక్ష్మి కన్నీరు మున్నీరయ్యారు. కార్తీక నవ్యశ్రీ (25)ని ప్రేమికుడు యశ్వంత్ తామెవరం ఇంట్లో లేని సమయంలో ఈ నెల 2వ తేదీన చంపేశాడని తెలిపారు. వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలు కార్తీక నవ్యశ్రీ తల్లిదండ్రులు రామారావు, రామలక్ష్మి తెలిపిన వివరాలివి. 35 ఏళ్ల కిందట బతుకు తెరువు కోసం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు నుంచి ఇక్కడికి వచ్చి కూలి పనులు చేసుకుంటున్నామని వారు చెప్పారు. తమ కుమార్తె కార్తీక నవ్యశ్రీ, యశ్వంత్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారని తెలిపారు. వారి పెళ్లికి రెండు కుటుంబాలు సమ్మతించాయన్నారు. ఈ నేపథ్యంలో కావ్యశ్రీకి హైదరాబద్లో ఉద్యోగం దొరకడంతో వెళ్లి ఉద్యోగం చేసుకోమని యశ్వంత్ ఆమెతో చెప్పాడని పేర్కొన్నారు. అక్కడి నుంచే వేధింపులు ప్రారంభం.. కావ్యశ్రీ హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటుండగా అనుమానం పెంచుకున్న యశ్వంత్ నీవు ఎవరితోనో తిరుగుతున్నావని తరచూ వేధించేవాడని, కావ్యశ్రీని వైజాగ్ వచ్చేయమని చెప్పడంతో ఆమె మూడు నెలల కిందట వచ్చి వర్క్ ఫ్రం హోం చేస్తుందని తెలిపారు. మేము లేనప్పుడు.. గత నెల 29న ఇంటి పని కోసం కొత్తూరు వెళ్లామని, కావ్యశ్రీ నుంచి ఫోన్ వచ్చిందని, యశ్వంత్ తనను వేధిస్తున్నాడని చెప్పిందన్నారు. మూడు రోజుల పాటు యశ్వంత్ కావ్యశ్రీతోనే ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలుసుకున్నట్టు చెప్పారు. ఈ నెల 1వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత (2వ తేదీ వేకువ జాము) యశ్వంత్ నుంచి తమకు ఫోన్ వచ్చిందని, కావ్యశ్రీ ఉరి పోసుకున్నట్టు తెలిపాడన్నారు. ఉదయం వచ్చి చూసే సరికి తమ కుమార్తె చనిపోయి ఉందన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఇంట్లో ఉన్న హుక్ కూడా ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకునేంతగా ఉండదని, యశ్వంతే తమ కుమార్తెను చంపేసి ఉండాడని అనుమానం వ్యక్తం చేశారు. స్థానికులు, కావ్యశ్రీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి యశ్వంత్ను అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను రిమాండ్లో ఉన్నాడు.