రూ.30 లక్షల ఉపకార వేతనాలు పంపిణీ | - | Sakshi
Sakshi News home page

రూ.30 లక్షల ఉపకార వేతనాలు పంపిణీ

Mar 31 2025 8:24 AM | Updated on Mar 31 2025 8:24 AM

కొరిటెపాడు(గుంటూరు): కృష్ణదేవరాయ ఎయిడ్‌ ఫర్‌ పూర్‌ అండ్‌ అండర్‌ ప్రివిలేజ్డ్‌ ఆధ్వర్యంలో తులసి సీడ్స్‌ సహకారంతో 570 మంది పేద విద్యార్థులకు ఆదివారం రూ.30 లక్షల ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. స్థానికంగా ఉన్న ఓ కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ తాను పదో తరగతిలో ఉండగా కేవలం రూ.16 ఫీజు కట్టలేని గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నానని గుర్తుచేసుకున్నారు. బీటెక్‌ ఇంటర్‌ చదివే రోజుల్లో ప్రభుత్వ ఉపకార వేతనం రూ.450 అందేదని చెప్పారు. జీవితంలో స్థిపడ్డాక 1995–96లో ఇద్దరు విద్యార్థులకు ఉపకార వేతనం ఇవ్వడం మొదలు పెట్టానని, ఇప్పుడు 36వేల మందికి రూ.22 కోట్లు ఉపకారవేతనంగా అందిస్తున్నానని వివరించారు. కృష్ణదేవరాయ ఎయిడ్‌ ఫర్‌ పూర్‌ అండ్‌ అండర్‌ ప్రివిలెజ్డ్‌ ట్రస్టు ద్వారా వీటిని పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఈ వితరణలో సింహభాగం తులసి సీడ్స్‌ సమకూరుస్తుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement