అలవాట్లలో మార్పులు చేసుకోవాలి
తరచుగా త్రేన్పులు, ఛాతిలో మంట వచ్చే వారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులను సంప్రదించాలి. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల్లో భాగంగా ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు జెనెటిక్ టెస్ట్, ఎండ్కోపీ పరీక్షలు చేయించుకోవాలి. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు. నిర్ణీత వేళల్లో ఆహారం తీసుకోవాలి. రాత్రి వేళల్లో 8 గంటల కల్లా భోజనం చేయాలి. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. స్మోక్డ్, ఫాస్ట్ఫుడ్ను తీసుకోకూడదు. కుటుంబంలో ఎవరికై నా ఒకరికి అన్నవాహిక క్యాన్సర్ ఉంటే ఇతర కుటుంబ సభ్యులు జీర్ణకోశ వ్యాధి నిపుణులను తరచుగా సంప్రదించి జాగ్రత్తలు తీసుకోవాలి.
– డాక్టర్ షేక్ నాగూర్బాషా, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, గుంటూరు.


