
బాలాత్రిపుర సుందరీదేవిగా బాల చాముండేశ్వరి దేవి దర్శనం
అమరావతి: ప్రముఖ శైవ క్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీబాల చాముండిక సమేత అమరేశ్వరాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మంగళవారం బాలాత్రిపురసుందరీదేవి అలంకారంలో బాల చాముండేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమాలలో భాగంగా చండీ, రుద్రహోమాలు, శ్రీచక్రార్చన నిర్వహించారు. ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖర శర్మ బాల త్రిపురసుందరి దేవి అలంకార విశిష్టతను వివరించారు. ఆలయంలోని జ్వాలాముఖి, మహిషాసుర మర్ధని అమ్మవార్లకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో రెండో రోజు అమ్మవారికి వారాహిదేవి అలంకారం చేసి, ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలలో పాల్గొన్నారు.
తాడికొండ: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 25వ తేదీన వెలగపూడిలో రాష్ట్ర సచివాలయం సమీపంలో డీఎస్సీ అభ్యర్థులకు ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను మంగళవారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ , విద్యాశాఖ కమిషనర్ విజయ రామరాజు, జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్లు పరిశీలించారు. ఐఎస్డబ్ల్యూ ఎస్పీ ఆరిఫ్ ఆఫీజ్, సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవలు వారి వెంట ఉన్నారు. జిల్లాల నుంచి వచ్చే అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా తగు సూచన బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాగునీరు, మరుగుదొడ్లు తదితర వసతుల కల్పనకు సంబంధించి అధికారులకు సూచనలు ఇచ్చారు.

బాలాత్రిపుర సుందరీదేవిగా బాల చాముండేశ్వరి దేవి దర్శనం

బాలాత్రిపుర సుందరీదేవిగా బాల చాముండేశ్వరి దేవి దర్శనం