ఇంటర్ ఫలితాల్లో ‘షైన్’ ప్రభంజనం
హన్మకొండ : ఇంటర్ ఫలితాల్లో హనుమకొండలోని షైన్ జూని య ర్ కళాశాలల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. తమ కళాశాలకు చెందిన విద్యార్థులు ఎంపీసీ, బీపీసీలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి కార్పొరేట్ విద్యాసంస్థలకు సమానంగా ఫలితాలను సాదించారని షైన్ విద్యాసంస్థల ఛైర్మన్ మూగుల కుమార్ యాదవ్, డైరెక్టర్లు మూగల రమ, పి.రాజేంద్రకుమార్, షైన్ రెసిడెన్షియల్ స్కూల్ క్యాంపస్ డైరెక్టర్ జె.శ్రీనివాస్, ఐఐటీ కో–ఆర్డినేటర్ మూగల రమేష్ యాదవ్ తెలిపారు. షైన్ విద్యాసంస్థలు మొదటి నుంచి ఇంటర్మీడియట్ విద్యలో అ త్యుత్తమమైనటువంటి శిక్షణను వరంగల్ కేంద్రంగా అందిస్తున్నామన్నారు. ఎంపీసీ ఫస్టియర్లో ఎం.దీక్షిత 468 మార్కులు, కె.యశస్విని కుమారి 467, కె.నిశాంత్ 467 మార్కులు, 11 మంది విద్యార్థులకు 466 మార్కులు, 23 మంది విద్యార్థులకు 465 మార్కులు సాధించారని వివరించారు. బీపీసీ ఫస్టియర్లో అకిబ్ అలీ– 437, సి.హెచ్.కీర్తన, సి.హెచ్.అజిత్ రెడ్డి 435, ఎండీ.సాదుద్దిన్ 435, ఎంపీసీ సెకండియర్లో డి.అనువర్షిణి 992, జి.వికాస్ 991, భార్గవి వీరారెడ్డి 991, ఎం.వరుణ్ సందేశ్ 991, ఎం.రక్షిత 990 మార్కులు సాధించారు. బీపీసీ డి.ఇందు 991, కె.సహస్ర 991, వెంకట శివాణి 989, ఎం.రమ్య 989, టి. హాసిని 987 మార్కులు సాధించారని వివరించారు. వీరితో పాటు ఎంపీసీలో 970 మార్కులకు పైగా 66 మంది విద్యార్థులు, బీపీసీలో 960 కి పైగా 31 మంది విద్యార్థులు, అలాగే ఫస్టియర్ ఎంపీసీలో 460కి పైగా మార్కులు 67 మంది, బీపీసీలో 430కి పైగా 10 మంది విద్యార్థులు మార్కులు సాధించారని వివరించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను షైన్ కళాశాల చైర్మన్, డైరెక్టర్లు, అధ్యాపకులు అభినందించారు. కళాశాలల ప్రిన్సిపాల్స్ మారబోయిన రాజు గౌడ్, కె.శ్రీనివాసన్, సంధ్య, ప్రశాంత్ పాల్గొన్నారు.
ఇంటర్ ఫలితాల్లో ‘షైన్’ ప్రభంజనం
ఇంటర్ ఫలితాల్లో ‘షైన్’ ప్రభంజనం
ఇంటర్ ఫలితాల్లో ‘షైన్’ ప్రభంజనం
ఇంటర్ ఫలితాల్లో ‘షైన్’ ప్రభంజనం
ఇంటర్ ఫలితాల్లో ‘షైన్’ ప్రభంజనం


