
ఇస్లామాబాద్: అల్ ఖదీర్ ట్రస్ట్ భూ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు శుక్రవారం 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆయన భార్య బుష్రా బీబీకి కూడా ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. ఇటీవలే బెయిల్పై విడుదలైన బుష్రాను తీర్పు రాగానే కోర్టు ఆవరణలోనే అరెస్టు చేశారు. ఇక ఇమ్రాన్ కొన్నేళ్లుగా జైల్లోనే ఉండటం తెలిసిందే.
అల్ ఖదీర్ ఉదంతంలో ప్రభుత్వ ఖజానాకు ఇమ్రాన్ దంపతులు కోట్లలో నష్టం కలిగించారంటూ పాక్ ఎన్ఏబీ 2023 డిసెంబర్లో కేసు నమోదు చేసింది. ఇమ్రాన్ ప్రధానిగా ఉండగా మాలిక్ రియాజ్ హుసేన్ అనే లండన్కు చెందిన పాక్ రియల్టీ వ్యాపారి నుంచి వసూలు చేసిన 19 కోట్ల పౌండ్లలో కొంత మొత్తాన్ని ఖజానాకు జమ చేయలేదన్నది, బదులుగా తమ అల్ ఖదీర్ వర్సిటీ ట్రస్ట్కు హుసేన్ నుంచి 57 ఎకరాల భూమి తీసుకున్నారని ఎన్ఏబీ ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment