స్టాక్హోమ్: 2024 సంవత్సరానికి నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించారు. జపాన్కు చెందిన నిహన్ హిడంక్యో సంస్థ ఈసారి అవార్డును అందుకుంది. ప్రపంచాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు కృషి చేసినందుకు గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ఈ మేరకు స్టాక్హోంలో ఉన్న కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ కమిటీ ఈ పురస్కారాన్ని ప్రకటించింది.
కాగా హిరోషిమా, నాగసాకిపై జరిగిన అణుబాంబు దాడిలో దెబ్బతిన్న బాధితుల కోసం నిహన్ హిడంక్యో సంస్థ పనిచేస్తుంది. నిహన్ హిడంక్యోకు హిబకుషా అనే మరో పేరు ఉంది. అణు రహిత ప్రపంచం కోసం ఈ సంస్థ కృషి చేస్తోంది. అణుబాంబు దాడుల నుంచి ప్రాణాలతో బయటపడిన వారికి ఈ సంస్థ సేవలు అందిస్తోంది. న్యూక్లియర్ ఆయుధాలను మళ్లీ వాడరాదని ఆ సంస్థ ప్రత్యక్ష బాధితులతో ప్రదర్శనలు ఇచ్చింది
BREAKING NEWS
The Norwegian Nobel Committee has decided to award the 2024 #NobelPeacePrize to the Japanese organisation Nihon Hidankyo. This grassroots movement of atomic bomb survivors from Hiroshima and Nagasaki, also known as Hibakusha, is receiving the peace prize for its… pic.twitter.com/YVXwnwVBQO— The Nobel Prize (@NobelPrize) October 11, 2024
Comments
Please login to add a commentAdd a comment