nobel peace prize
-
ఎలాన్ మస్క్ కు నోబెల్
-
నోబెల్ శాంతి బహుమతికి ఎలాన్ మస్క్ నామినేట్
లండన్: నోబెల్ శాంతి బహుమతి–2025కి ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ నామినేట్ అయ్యారు ఈ మేరకు నార్వేజియన్ నోబెల్ కమిటీకి ఒక పిటిషన్ సమర్పించినట్లు యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు బ్రాంకో గ్రిమ్స్ ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత బహుమతికి ఎలాన్ మస్క్ నామినేట్ కావడం ప్రపంచవ్యాప్తంగా భావ ప్రకటనా స్వేచ్ఛను, మానవ హక్కులను కాపాడటానికి ఆయన చేసిన కృషికి ఒక గుర్తింపు అని వెల్లడించారు. గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. -
ఆస్పత్రిలో చేరిన నోబెల్ గ్రహీత నర్గీస్ మొహమ్మదీ
దుబాయ్: జైలు శిక్ష అనుభవిస్తున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్ మహమ్మదీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేందుకు ఇరాన్ అధికారులు అనుమతించారు. మొహమ్మదీ తొమ్మిది వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒక సంస్థ ఈ సమాచారాన్ని మీడియాకు అందించింది. మొహమ్మదీకి చికిత్స కోసం మెడికల్ లీవ్ మంజూరు చేయాలని ఫ్రీ నార్వే కూటమి ఒక ప్రకటనలో కోరింది. ఇరాన్లోని ఎవిన్ జైలులో మొహమ్మదీ ఇప్పటికే 30 నెలలుగా శిక్ష అనుభవిస్తున్నారు. గత జనవరిలో ఆమె శిక్ష కాలాన్ని మరో 15 నెలలు పొడిగించారు. ఆగస్టు 6న ఎవిన్ జైలులోని మహిళా వార్డులో మరో రాజకీయ ఖైదీకి ఉరిశిక్ష విధించడాన్ని నిరసించినందుకు ఇరాన్ అధికారులు ఆమెకు అదనంగా ఆరు నెలలపాటు శిక్షను విధించారు.నర్గీస్ మొహమ్మది గుండె జబ్బుతో బాధపడుతున్నారు. ఇరాన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్గీస్ మహమ్మదీని 2021లో అరెస్టు చేశారు. మహిళలపై ఇరాన్ ప్రభుత్వం విధించిన అనేక ఆంక్షల గురించి మొహమ్మదీ గళం విప్పారు. హిజాబ్కు వ్యతిరేకంగా ఆమె ఉద్యమించారు. నర్గీస్ మొహమ్మదీకి 2023లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఈ అవార్డును అందుకున్న 19వ మహిళగా ఆమె పేరొందారు. 2003లో మానవ హక్కుల కార్యకర్త షిరిన్ ఎబాడి తర్వాత ఈ అవార్డును అందుకున్న రెండవ ఇరాన్ మహిళగా గుర్తింపు పొందారు. ఇది కూడా చదవండి: స్పెయిన్ ప్రధానితో పీఎం మోదీ మెగా రోడ్ షో -
అణ్వాయుధ వ్యతిరేక పోరాటానికి నోబెల్ శాంతి బహుమతి
ఒస్లో: అణ్వాయుధాలకు తావులేని శాంతియుత ప్రపంచమే లక్ష్యంగా అవిశ్రాంత పోరాటం కొనసాగిస్తున్న జపాన్ సంస్థ ‘నిహాన్ హిడాన్క్యో’కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించింది. నార్వే నోబెల్ కమిటీ చైర్మన్ వాట్నే ఫ్రైడ్నెస్ శుక్రవారం ఈ విషయం ప్రకటించారు. అణ్వాయుధాల ప్రయోగాన్ని నిషేధించాలన్న నినాదం ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని చెప్పారు. మానవాళి సంక్షేమం కోసం అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం గళం విప్పాలని సూచించారు. 1945లో జపాన్లోని హిరోషిమా, నాగసాకిపై అమెరికా చేపట్టిన అణుబాంబు దాడిలో ప్రాణాలతో బయటపడిన పౌరులు ‘నిహాన్ హిడాన్క్యో’ను స్థాపించారు. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అమెరికా దాడిలో క్షతగాత్రులు మారిపోయి, బాధాకరమైన జ్ఞాపకాలతో జీవిస్తున్నప్పటికీ శాంతి కోసం కృషి చేస్తున్నారని నిహాన్ హిడాన్క్యో సభ్యులను వాట్నే ఫ్రైడ్నెస్ ప్రశంసించారు. తమ సంస్థకు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించడం పట్ల నిహాన్ హిడాన్క్యో హిరోíÙమా శాఖ చైర్పర్సన్ తొమొయుకి మిమాకీ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ‘‘ఇది నిజమేనా? నమ్మలేకపోతున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఏమిటీ నిహాన్ హిడాన్క్యో? రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా సైన్యం 1945 ఆగస్టు 9న జపాన్లోని నాగసాకి పట్టణంపై అణుబాంబు ప్రయోగించింది. ఈ దాడిలో ఏకంగా 70 వేల మంది మరణించారు. మూడు రోజుల తర్వాత హిరోషిమా పట్టణంపై మరో బాంబును అమెరికా ప్రయోగించింది. ఈ ఘటనలో 1.40 లక్షల మంది ప్రజలు బలయ్యారు. దాంతో 1945 ఆగస్టు 15న పశి్చమ దేశాల సైన్యం ఎదుట జపాన్ లొంగిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. నాగసాకి, హిరోíÙమాపై జరిగిన అణుబాంబు దాడుల్లో వేలాది మంది క్షతగాత్రులయ్యారు. అవయవాలు కోల్పోయి దివ్యాంగులుగా మారారు. బాధితులంతా(హిబకుషా) తమకు ఎదురైన అనుభవాలతో అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, తమ భవిష్యత్తు తరాలను కూడా ఆదుకోవాలని, అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలించాలని డిమాండ్ చేస్తూ 1956లో నిహాన్ హిడాన్క్యో సంస్థను స్థాపించారు. పసిఫిక్ ప్రాంతంలో అణ్వాయుధ ప్రయోగాలతో బాధితులుగా మారినవారు సైతం ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఈ ఉద్యమం క్రమంగా ప్రపంచమంతటా వ్యాప్తిచెందింది. BREAKING NEWSThe Norwegian Nobel Committee has decided to award the 2024 #NobelPeacePrize to the Japanese organisation Nihon Hidankyo. This grassroots movement of atomic bomb survivors from Hiroshima and Nagasaki, also known as Hibakusha, is receiving the peace prize for its… pic.twitter.com/YVXwnwVBQO— The Nobel Prize (@NobelPrize) October 11, 2024 -
తల్లి తరఫున నోబెల్ శాంతి బహుమతి స్వీకరణ
హెల్సింకీ: ఇరాన్ మానవ హక్కుల మహిళా కార్యకర్త నర్గీస్ మొహమ్మదీకి నోబెల్ కమిటీ ప్రకటించిన శాంతి బహుమతిని ఆమె తరఫున ఆమె కుమారుడు, కుమార్తె అందుకున్నారు. ఇరాన్లో మహిళల అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా పోరాడుతున్న 51 ఏళ్ల నర్గీస్ను ఇరాన్ ప్రభుత్వం అక్రమ కేసులు మోపి టెహ్రాన్ జైలులో పడేసిన విషయం విదితమే. శనివారం నార్వేలోని ఓస్లోలో నర్గీస్ కవల పిల్లలు అలీ, కియానా రహా్మనీ పురస్కారాన్ని స్వీకరించారు. ‘‘ఇరాన్ సమాజానికి అంతర్జాతీయ మద్దతు అవసరం. ప్రభుత్వ అరాచక పాలనకు వ్యతిరేకంగా గళమెత్తిన మానవహక్కుల కార్యకర్తలు, నిరసనకారులు, పాత్రికేయుల గొంతుకను సభావేదికగా గట్టిగా వినిపించండి’’ అంటూ నర్గీస్ ఇచి్చన సందేశాన్ని వేదికపై వారు చదివారు. -
మలాలా యూసఫ్జాయ్ రూ.2.5 కోట్ల విరాళం
లండన్: గాజా ఆసుపత్రిలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో ఏకంగా 500 మందికిపైగా జనం మృతిచెందడం పట్ల ప్రపంచవ్యాప్తంగా సానుభూతి వెల్లువెత్తుతోంది. ఈ మారణకాండను ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో చిన్నారులు బలి కావడం పట్ల పాకిస్తాన్ సాహస బాలిక, నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్జాయ్ చలించిపోయారు. ఈ మేరకు బుధవారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. గాజాలోని అల్–అహ్లీ ఆసుపత్రిలో బాంబు పేలుడు ఘటనను మీడియాలో చూసి భయాందోళనకు గురయ్యానని చెప్పారు. ఈ ఘాతుకాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. వెంటనే కాల్పుల విరమణ పాటించాలని, గాజాకు నిత్యావసరాలు, ఆహారం, నీరు సరఫరా చేయాలని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని మలాలా కోరారు. ఈ విపత్కర సమయంలో గాజాలో పాలస్తీనియన్ల సంక్షేమం కోసం కృషి మూడు స్వచ్ఛంద సంస్థలకు 3 లక్షల డాలర్ల (రూ.2.5 కోట్లు) విరాళం ఇవ్వబోతున్నానని మలాలా ప్రకటించారు. ఇజ్రాయెల్, పాలస్తీనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం పోరాడుతున్నవారితో తాను కూడా గొంతు కలుపుతున్నానని వ్యాఖ్యానించారు. గాజా జనాభాలో సగం మంది 18 ఏళ్లలోపు వారేనని అన్నారు. -
ఇరాన్ హక్కుల యోధురాలికి నోబెల్ శాంతి
స్టాక్హోమ్: అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం ఇరాన్కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గిస్ మొహమ్మదికి లభించింది. ఇరాన్లో మహిళల అణచివేత, మానవ హక్కులపై అవగాహన, అందరికీ స్వేచ్ఛ, మరణ శిక్ష రద్దు కోసం అలుపెరగకుండా ఆమె చేస్తున్న పోరాటానికి అత్యున్నత పురస్కారం దక్కింది. మహిళల కోసం జీవితాన్ని ధారపోసినందుకు నర్గిస్ను శాంతి పురస్కారానికి ఎంపిక చేసినట్టుగా నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. ప్రస్తుతం ఆమె టెహ్రాన్లోని ఎవిన్ జైల్లో ఉన్నారు. ‘‘నర్గిస్ చేసిన పోరాటం అత్యంత సాహసోపేతమైనది. మహిళా హక్కుల కోసం ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టారు. ఇరాన్లో ఏడాదిగా సాగుతున్న మహిళా హక్కుల పోరాటానికి నోబెల్ శాంతి తొలి గుర్తింపు. జైలు నుంచే ఈ ఉద్యమానికి ఊపిరిలా మారిన వివాదరహితురాలైన నర్గిస్ మొహమ్మదికి నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తున్నాం’’అని కమిటీ చైర్ పర్సన్ బెరిట్ రెసి అండర్సన్ వెల్లడించారు. నోబెల్ శాంతి పురస్కారం కింద ఆమెకు 1.1 కోట్ల స్వీడిష్ క్రోనర్లు (దాదాపుగా 10 లక్షల డాలర్లు) నగదు బహుమానం, 18 కేరట్ గోల్డ్ మెడల్, డిప్లొమా లభిస్తుంది,. డిసెంబర్లో జరిగే అవార్డు ప్రదానోత్సవం సమయానికి నర్గిస్ జైలు నుంచి విడుదల కావాలని, స్వయంగా పురస్కారాన్ని అందుకోవాలని నోబెల్ కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇరాన్లో మహిళా హక్కుల ఉద్యమానికి అంతర్జాతీయ గుర్తింపు రావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని నర్గిస్ జైలు నుంచే న్యూయార్క్ టైమ్స్కి ఒక ప్రకటన పంపారు. ‘‘నోబెల్ శాంతి పుర స్కారం నాలో మరింత స్ఫూర్తిని నింపింది. మహిళల సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశ పెరిగింది. ఇరాన్లో మార్పు కోసం పోరాడుతున్న వారి లో మరింత బలం పెరుగుతుంది. ఇక విజయం సమీపంలో ఉంది’’అని ఆ ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు. 13 సార్లు అరెస్ట్..31 ఏళ్ల జైలు శిక్ష హక్కుల పోరాటంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా నర్గిస్ వెనుకంజ వేయలేదు. ఇరాన్ ప్రభుత్వం ఆమెను ఇప్పటికి 13 సార్లు అరెస్ట్ చేసింది. అయిదు సార్లు దోషిగా నిర్ధారించింది. 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 154 సార్లు కొరడా దెబ్బల శిక్ష విధించింది. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. 1998లో ఇరాన్ ప్రభుత్వాన్ని విమర్శించి తొలిసారి అరెస్టయి ఏడాది జైల్లో ఉన్నారు. హ్యూమన్ రైట్స్ సంస్థలో చేరి మళ్లీ అరెస్టయ్యారు. 2011లో జాతి విద్రోహ కార్యకలాపాలు సాగిస్తున్నారంటూ మరోసారి అరెస్ట్ చేశారు. ఇరాన్లో మరణశిక్షలకు వ్యతిరేకంగా గళమెత్తినందుకు 2015లో జైలుకు పంపారు. ఇలా తన జీవితంలో సగభాగం ఆమె జైల్లోనే గడుపుతున్నారు. అన్నీ కోల్పోయినా.... సంప్రదాయం పేరుతో మహిళలపై ఆంక్షలు విధిస్తూ హిజాబ్ కాస్త పక్కకి జరిగినా జైలు పాల్జేయడమో, కొట్టి చంపేయడమో చేసే దేశంలో పుట్టి మహిళా హక్కుల కోసం జీవితాన్ని ధారపోస్తున్న నర్గిస్ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించిన సమయంలో నాలుగ్గోడల మధ్య బందీగా ఉన్నారు. వ్యక్తి గత జీవితాన్ని, ఆరోగ్యాన్ని, స్వేచ్ఛని పణంగా పెట్టి 51 ఏళ్ల వయసున్న నర్గిస్ ఇంకా మార్పు కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ‘‘ప్రభుత్వం నన్ను ఎంత అణగదొక్కాలని చూస్తే, ఎంతగా శిక్షిస్తే నాలో పోరాట స్ఫూర్తి అంతకంతకూ పెరుగుతుంది. దేశంలో మహిళలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే వరకు ఈ పోరాటం ఆగదు’’అని నర్గిస్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇరాన్లోని జంజన్ పట్టణంలో 1972, ఏప్రిల్ 21న ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఒక రైతు. తల్లి ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. 1979లో ఇరాన్ విప్లవం సమయంలో రాచరికం రద్దయిందో అప్పుడే నర్గిస్ తల్లి సోదరుడు, మరో ఇద్దరు కుటుంబసభ్యులు జైలు పాలయ్యారు. వారిని ప్రతీ వారం కలుసుకోవడానికి తల్లితో పాటు జైలుకు వెళ్లే చిన్నారి నర్గిస్కు తమ బతుకులు ఎందుకంత అణచివేతకు గురవుతున్నాయో అర్థం కాక తీవ్ర సంఘర్షణకు లోనయ్యేది. అది చూసి ఆమె తల్లి తనకున్న అనుభవంతో రాజకీయాలు, వ్యవస్థల జోలికి వెళ్లొద్దని హితవు చెప్పింది. అయినప్పటికీ నర్గిస్లో చిన్నప్పట్నుంచి ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి ఆమెను హక్కుల పోరాటంలో ముందుకు నడిపించాయి. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన తర్వాత ఆమె కొన్నాళ్లు వార్తాపత్రికలకు కాలమిస్ట్గా చేశారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిరిన్ ఎబది స్థాపించిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్లో 2003లో చేరిన ఆమె ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. కాలేజీలో సహచర విద్యారి్థగా పరిచయమైన ప్రఖ్యాత సామాజిక కార్యకర్త తాఘి రెహమనీను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం రెహమనీ తన పిల్లలతో కలిసి పారిస్కు ప్రవాసం వెళ్లిపోయారు. తన భర్త, పిల్లలతో మాట్లాడి, ప్రేమతో వారిని అక్కున చేర్చుకొని ఆమెకు ఏళ్లు గడిచిపోయాయి. జైలు నుంచే పోరాటం జైలు నుంచి ఆమె ఎందరిలోనో ఉద్యమ స్ఫూర్తి రగిలిస్తున్నారు. రాజకీయ ఖైదీలు, మహిళా ఖైదీలపై జరుగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా జైల్లోనే ఆమె ఉద్యమం ప్రారంభించారు. జైల్లో కూడా ఆమెకు మద్దతుదారులు పెరగడంతో అధికారులు ఆమెపై పలు ఆంక్షలు విధించారు. అయినా ఆమె బెదరలేదు. జైలు నుంచే పలు వ్యాసాలు న్యూయార్క్ టైమ్స్, బీబీసీ వంటి వాటికి పంపించారు. 2022 సెపె్టంబర్లో హిజాబ్ ధరించనందుకు మాసా అమిని అనే యువతిని ఇరాన్ పోలీసులు అరెస్ట్ చేయగా కస్టడీలో తీవ్ర గాయాలపాలై ఆమె మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్లో భారీగా యువతీ యువకులు ఆందోళనలు చేపట్టి రోడ్లపైకి వచి్చనప్పుడు జైలు నుంచే ఆమె తన గళాన్ని వినిపించారు. పోరాడే వారిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తోటి మహిళా ఖైదీల అనుభవాలతో వైట్ టార్చర్ అనే పుస్తకాన్ని రాశారు. ప్రపంచంలో అత్యధికంగా ఉరిశిక్షలు విధించే ఇరాన్లో అత్యంత క్రూరమైన ఆ శిక్షను రద్దు చేసే వరకు తన పోరాటం ఆగదని నర్గిస్ ఎలుగెత్తి చాటుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నర్గేస్ మొహమ్మదికి నోబెల్ శాంతి అవార్డు.. ఆమె ఏ దేశమంటే?
స్టాక్హోమ్: ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. 2023 సంవత్సరానికి గానూ నోబెల్ శాంతి బహుమతిని ఇరాన్కు చెందిన మహిళా సామాజిక కార్యకర్త నర్గేస్ మొహమ్మదిని వరించింది. వివరాల ప్రకారం.. ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని ఇరాన్కు చెందిన మహిళ నర్గేస్ మొహమ్మది గెలుచుకున్నారు. కాగా, నర్గేస్ మొహమ్మది.. ఇరాన్లో మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. మహిళల హక్కులు, స్వేచ్చపై పోరాటం చేసినందుకు గాను ఆమెకు శాంతి బహుమతి లభించింది. BREAKING NEWS The Norwegian Nobel Committee has decided to award the 2023 #NobelPeacePrize to Narges Mohammadi for her fight against the oppression of women in Iran and her fight to promote human rights and freedom for all.#NobelPrize pic.twitter.com/2fyzoYkHyf — The Nobel Prize (@NobelPrize) October 6, 2023 ఇక, ఇరాన్ మహిళల కోసం నర్గేస్ మొహమ్మది వీరోచిత పోరాటం చేశారు. ఈ క్రమంలో ఇరాన్ ప్రభుత్వం ఆమెను 13 సార్లు అరెస్టు చేసింది. ఐదుసార్లు ఆమెను దోషిగా నిర్ధారించింది. అంతేకాకుండా ఆమెకు మొత్తం 31 సంవత్సరాల జైలు శిక్ష మరియు 154 కొరడా దెబ్బలు విధించింది. మహ్మదీ ఇంకా జైలులోనే ఉన్నారు. 2023 #NobelPeacePrize laureate Narges Mohammadi’s brave struggle has come with tremendous personal costs. The Iranian regime has arrested her 13 times, convicted her five times, and sentenced her to a total of 31 years in prison and 154 lashes. Mohammadi is still in prison. pic.twitter.com/ooDEZAVX01 — The Nobel Prize (@NobelPrize) October 6, 2023 ఇది కూడా చదవండి: జాన్ ఫోసేకు సాహిత్య నోబెల్ -
మానవ హక్కుల పోరాటాలకు నోబెల్ శాంతి బహుమతి
ఓస్లో: మానవ హక్కుల పరిరక్షణ కోసం కొనసాగుతున్న ఉద్యమాలకు నోబెల్ కమిటీ అత్యున్నత గౌరవాన్ని కల్పించింది. బెలారస్ మానవ హక్కుల ఉద్యమకారుడు అలెస్ బియాల్యాస్కీ(60), రష్యా మానవ హక్కుల సంస్థ ‘మెమోరియల్’, ఉక్రెయిన్ సంస్థ ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’కు సంయుక్తంగా 2022 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతిని శుక్రవారం ప్రకటించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రెండు దేశాల్లోని సంస్థలు ప్రపంచ ప్రతిష్టాత్మక బహుమానానికి ఎంపిక కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్పై దండెత్తుతున్న రష్యా అధినేత పుతిన్ ఏకపక్ష వైఖరిపై ఇదొక నిరసన అని నిపుణులు అంచనా వేస్తున్నారు. బెలారస్, రష్యా, ఉక్రెయిన్లో మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, శాంతియుత సహజీవనం వంటి అంశాల్లో గొప్ప చాంపియన్లు అయిన ముగ్గురిని (ఒక వ్యక్తి, రెండు సంస్థలు) శాంతి బహుమతితో గౌరవిస్తుండడం ఆనందంగా ఉందని నార్వే నోబెల్ కమిటీ చైర్మన్ బెరిట్ రీస్–ఆండర్సన్ చెప్పారు. ఆమె మీడియాతో మాట్లాడారు. వారంతా సైనిక చర్యలను వ్యతిరేకిస్తూ మానవీయ విలువలు, న్యాయ సూత్రాల రక్షణ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశాల మధ్య శాంతి, సౌభ్రాతృత్వం వర్థిల్లాలని ఆల్ఫెడ్ నోబెల్ ఆకాంక్షించారని గుర్తుచేశారు. బియాల్యాస్కీని విడుదల చేయండి జైలులో ఉన్న అలెస్ బియాల్యాస్కీని విడుదల చేయాలని బెలారస్ పాలకులకు బెరిట్ రీస్–ఆండర్సన్ విజ్ఞప్తి చేశారు. బహుమతి బియాల్యాస్కీలో నైతిక స్థైర్యాన్ని పెంచుతుందని, ఆయనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించబోదని భావిస్తున్నట్లు తెలిపారు. రష్యా మానవ హక్కుల సంస్థకు శాంతి బహుమతి ప్రకటించడం ద్వారా.. శుక్రవారం 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న పుతిన్కు ఉద్దేశపూర్వకంగా ఏదైనా సంకేతం పంపదలిచారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ప్రజలకు మంచి చేసేవారికి బహుమతి ఇస్తుంటామని, అంతేతప్ప తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, వ్యక్తుల పుట్టినరోజులతో తమకు సంబంధం లేదని బెరిట్ రీస్–ఆండర్సన్ బదులిచ్చారు. ఈ ప్రైజ్ పొందడం ద్వారా ఆయా సంస్థల వెనుక ఉన్న వ్యక్తులు వారు నమ్మినదాని కోసం మరింత ఉత్సాహంతో కృషి సాగిస్తారన్న నమ్మకం తమకు ఉందన్నారు. గత ఏడాది(2021) నోబెల్ శాంతి బహుమతిని సంయుక్తంగా అందుకున్న రష్యా జర్నలిస్టు దిమిత్రీ మురతోవ్, ఫిలిప్పైన్స్ జర్నలిస్టు మారియా రెస్సా అక్కడి ప్రభుత్వాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము పనిచేస్తున్న మీడియా సంస్థల్లో ఉద్యోగాలను కాపాడుకోవడానికి పెద్ద పోరాటమే చేయాల్సి వస్తోంది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం సాగించిన పోరాటానికి వీరిద్దరికి నోబెల్ లభించింది. యుద్ధంపై ఎక్కుపెట్టిన ఆయుధం ఉక్రెయిన్లోని కొందరు శాంతి కాముకులు 2007లో ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’ను ఏర్పాటు చేశారు. అప్పట్లో దేశంలో అశాంతి రగులుతున్న తరుణంలో మానవ హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య ఉద్యమాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సంస్థకు శ్రీకారం చుట్టారు. ఉక్రెయిన్ పౌర సమాజాన్ని బలోపేతం తదితరాలు సంస్థ ముఖ్య లక్ష్యాలు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత ఈ సంస్థ మరింత క్రియాశీలకంగా పనిచేస్తోంది. సాధారణ ప్రజలపై రష్యా యుద్ధ నేరాలను రికార్డు చేసి, ప్రపంచానికి తెలియజేస్తోంది. ఈ యుద్ధ నేరాలకు రష్యాను జవాబుదారీగా మార్చేందుకు కృషి చేస్తోంది. యుద్ధానికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన అసలైన ఆయుధం మానవ హక్కుల పోరాటమేనని ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’ చెబుతోంది. అంకితభావం గల ఉద్యమకారుడు అలెస్ బియాల్యాస్కీ నేటి రష్యాలోని వైర్టిసిల్లాలో 1962 సెప్టెంబర్ 25వ తేదీన జన్మించారు. ఆ తర్వాత వారి కుటుంబం బెలారస్కు వలస వెళ్లింది. విద్యాభ్యాసం అనంతరం బియాల్యాస్కీ కొంతకాలంపాటు పాఠశాల ఉపాధ్యాయుడిగా, తర్వాత సైన్యంలో డ్రైవర్గా పనిచేశారు. 1980వ దశకం నుంచి బెలారస్లో ఆయన మానవ హక్కుల ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 1996లో ‘వియాస్నా హ్యూమన్ రైట్స్ సెంటర్’ అనే ప్రభుత్వేతర సంస్థను స్థాపించారు. అంకితభావం కలిగిన మానవ హక్కుల, పౌరస్వేచ్ఛ, ప్రజాస్వామ్య ఉద్యమకారుడిగా ప్రజల్లో గుర్తింపు పొందారు. ఎన్నో పోరాటాలను ముందుండి నడిపించారు. హవెల్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ అవార్డును 2013లో, నోబెల్కు ప్రత్యామ్నాయంగా భావించే రైట్ లైవ్లీçహుడ్ అవార్డును 2020లో గెలుచుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు సారథ్యం వహిస్తున్న బియాల్యాస్కీని పన్నులు ఎగవేశారన్న కారణంతో బెలారస్ పాలకులు 2021 జూలై 14న నిర్బంధించారు. ఆయన ప్రస్తుతం ఎలాంటి విచారణ లేకుండా జైలులో మగ్గుతున్నారు. ఆయనను విడుదల చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నా పాలకులు లెక్కచేయడం లేదు. ఎన్నో అవరోధాలు, బెదిరింపులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా నమ్మిన సిద్ధాంతానికి బియాల్యాస్కీ కట్టుబడి ఉండడం విశేషం. సైనిక చర్యలకు వ్యతిరేకంగా పోరాటం ‘మెమోరియల్’ సంస్థ 1989 జనవరి 28న అప్పటి సోవియట్ యూనియన్ చివరిదశలో ఉన్న సమయంలో ఏర్పాటైంది. ప్రధానంగా ఇది న్యాయ సేవా సంస్థ. కమ్యూనిస్టు పాలకుల అణచివేత చర్యల వల్ల ఇబ్బందులు పడుతున్నవారికి అండగా నిలిచింది. రష్యాలో మానవ హక్కుల విధ్వంసంపై, రాజకీయ ఖైదీల స్థితిగతులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోంది. సైనిక చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ‘మెమోరియల్’ ప్రధాన కార్యాలయం రష్యా రాజధాని మాస్కోలో ఉంది. సంస్థ బోర్డు చైర్మన్గా యాన్ రచిన్స్కీ వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో ఈ సంస్థను ఈ ఏడాది ఏప్రిల్ 5న రష్యా ప్రభుత్వం మూసివేసింది. అయినప్పటికీ ‘మెమోరియల్’ కార్యకలాపాలు అనధికారికంగా కొనసాగుతూనే ఉండటం విశేషం. -
రష్యా, ఉక్రెయిన్ ‘హక్కుల’ గ్రూప్లకు నోబెల్ శాంతి బహుమతి
స్టాక్హోం : మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఉక్రెయిన్, రష్యాలకు చెందిన రెండు మానవ హక్కుల గ్రూప్లతో పాటు బెలారస్ మానవ హక్కుల కార్యకర్త అలెస్ బైలియాత్స్కీలకు సంయుక్తంగా ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించింది. రష్యన్ మానవ హక్కుల సంస్థ మెమోరియల్, ఉక్రేనియన్ మానవ హక్కుల సంస్థ సెంటర్ ఫర్ లిబర్టీస్, బెలారస్ హక్కుల కార్యకర్త అలెస్ బైలియాత్స్కీల పేర్లను నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. మానవ హక్కుల కోసం వారి విశేష కృషికి గానూ ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేసినట్లు కమిటీ పేర్కొంది. నోబెల్ శాంతి పురస్కారం లభించిన వారు తమ స్వదేశాల్లో ప్రజల కోసం పోరాటం చేసినట్లు నోబెల్ కమిటీ పేర్కొంది. అధికార దుర్వినియోగాన్ని నిరంతరం ప్రశ్నిస్తూ.. పౌరుల ప్రాథమిక హక్కులను రక్షించినట్లు తెలిపింది. ‘యుద్ధ నేరాలను డాక్యుమెంట్ చేయడంలో వాళ్లు అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించారు. మానవ హక్కుల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగాన్ని వాళ్లు వేలెత్తి చూపారు. శాంతి, ప్రజాస్వామ్యం కోసం ఎంతో కృషి చేశారు.’ అని పేర్కొంది కమిటీ. ఇప్పటికే ఈ ఏడాదికి గాను వైద్య, భౌతిక, రసాయన శాస్త్రం, సాహిత్య రంగంలో నోబెల్ పురస్కార విజేతల పేర్లను ప్రకటించింది కమిటీ. ఇదీ చదవండి: ఫ్రెంచ్ కవయిత్రికి సాహిత్యంలో నోబెల్ -
నోబెల్ శాంతి బహుమతి రేసులో భారతీయులు!?
న్యూయార్క్: నోబెల్ బహుమతుల ప్రకటనల నడుమ.. ఆసక్తికరమైన అంశం తెర మీదకు వచ్చింది. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో శాంతి బహుమతి ఎవరికి వెళ్లబోతోందా? అనే చర్చ గత కొంతకాలంగా నడుస్తోంది. ఈ క్రమంలో.. నోబెల్ శాంతి బహుమతి పరిశీలనలో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు ప్రముఖ మ్యాగజైన్ టైమ్ ఒక కథనం ప్రచురించింది. భారత్కు చెందిన ఫ్యాక్ట్ చెకర్స్ మొహమ్మద్ జుబేర్, ప్రతీక్ సిన్హాలు నోబెల్ శాంతి బహుమతి కమిటీ పరిశీలనలో ఫేవరెట్గా ఉన్నట్లు టైమ్ మ్యాగజీన్ కథనం ప్రచురించడం గమనార్హం. ఆల్ట్ న్యూస్ సైట్ తరపున ఫ్యాక్ట్ చెకర్స్గా ఈ ఇద్దరూ పని చేస్తున్నారు. ప్రజాభిప్రాయం ప్రకారం.. నార్వేజియన్ చట్టసభ సభ్యులు, బుక్మేకర్ల నుండి వచ్చిన అంచనాలు, పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఓస్లో (PRIO) ద్వారా ఆధారంగా రేసులో సిన్హా, జుబేర్ ప్రముఖంగా నిలిచినట్లు తెలుస్తోంది. అంతేకాదు శాంతి బహుమతి కమిటీ ఫేవరెట్గానూ ఈ ఇద్దరూ ఉన్నట్లు టైమ్ కథనంలో పేర్కొంది. ఇదిలా ఉంటే.. జూన్ నెలలో 2018కి సంబంధించిన ట్వీట్ విషయంలో అరెస్టైన జుబేర్.. నోబెల్ శాంతి బహుమతి పరిశీలనలో ఉండడం గమనార్హం. నెల తర్వాత అతను జైలు నుంచి సుప్రీం కోర్టు బెయిల్ ద్వారా విడుదల అయ్యాడు. ఇక.. జుబేర్ అరెస్ట్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది కూడా. ‘‘భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ అధ్వాన్నంగా ఉంది, జర్నలిస్ట్లకు ఇక్కడి ప్రభుత్వం ప్రతికూల, అసురక్షిత వాతావరణాన్ని సృష్టించింది’’ అంటూ అమెరికాలోని జర్నలిస్ట్ హక్కుల పరిరక్షణ కమిటీ ప్రకటించడం గమనార్హం. నోబెల్ శాంతి బహుమతి 2022 కోసం.. 341 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 251 మంది, 92 సంస్థలు ఉన్నాయి. సాధారణంగా నోబెల్ కమిటీ నామినీల పేర్లను మీడియాకుగానీ, అభ్యర్థులకుగానీ అసలు తెలియజేయదు. అయితే.. కొన్ని మీడియా హౌజ్లు మాత్రం సర్వేల ద్వారా అభ్యర్థులను, అర్హత ఉన్నవాళ్లను పేర్లు.. వివరాలతో సహా అంచనా వేస్తుంటాయి. ఇక ఈ ఇద్దరు ఫ్యాక్ట్ చెకర్స్తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, ఐరాస శరణార్థ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, పుతిన్ విమర్శకుడు అలెక్సీ నవెల్నీ, బెలారస్ ప్రతిపక్ష నేత స్వియాత్లానా, ప్రముఖ బ్రాడ్కాస్టర్ డేవిడ్ అటన్బోరఫ్ తదితరులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నోబెల్ శాంతి బహుమతి విజేతను అక్టోబర్ 7వ తేదీన ప్రకటిస్తారు. ఇదీ చదవండి: ఈసారి టార్గెట్ జపాన్? -
పుతిన్ లక్ష్యంగా.. నోబెల్ శాంతి బహుమతి!
నోబెల్ అవార్డుల సీజన్ మొదలుకాబోతోంది. నామినేషన్లను ఇప్పటికే జల్లెడ పట్టగా.. వచ్చేవారంలో ఒక్కో విభాగంలో విజేతలను ప్రకటించబోతున్నాయి కమిటీలు. అయితే ఈసారి నోబెల్ పురస్కారాలు.. చాలా ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. అందుకు కారణం ఉక్రెయిన్ యుద్ధం!. 1901 నుంచి వైద్య, భౌతిక, రసాయన, సాహిత్య, శాంతి.. 1969 నుంచి ఆర్థిక శాస్త్రంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. అయితే.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నోబెల్ ప్రకటనలు వెలువడే స్టాక్హోమ్(స్వీడన్), ఓస్లో(నార్వే)లకు దగ్గరగా యుద్ధవాతావరణం కనిపించింది లేదు. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల నడుమ అవార్డుల ప్రకటన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రత్యేకించి.. ► అక్టోబర్ 7వ తేదీన వెలువడబోయే నోబెల్ శాంతి బహుమతి ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి బహుమతిని యుద్ధ నేరాల సమాచారాన్ని సేకరించే సంస్థలకు ఇవ్వబోతున్నట్లు సంకేతాలు దక్కుతున్నాయి. ఇది రష్యాను.. ముఖ్యంగా పుతిన్ను దృష్టిలో పెట్టుకునే ఉండనుందని స్వీడన్ ప్రొఫెసర్ పీటర్ వాలెన్స్టీన్ అభిప్రాయపడుతున్నారు. ► రేసులో ప్రముఖంగా.. ది హేగ్లోని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు లేదంటే నెదర్లాండ్స్కు చెందిన ఇన్వెస్టిగేషన్ జర్నలిజం గ్రూప్ బెల్లింగ్క్యాట్కుగానూ దక్కవచ్చంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ► సాధారణంగా జనవరి 31వ తేదీ వరకే.. శాంతి బహుమతి నామినేషన్ల డెడ్లైన్ ముగుస్తుంది. కానీ, ఐదుగురు సభ్యులున్న నార్వేగియన్ కమిటీ మాత్రం ఫిబ్రవరి చివరి వారంలో ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణంగా నామినేషన్లు చాలా గోప్యంగా ఉంటాయి. కానీ, ఈ ఏడాది మొత్తంగా 343 నామినేషన్లు వచ్చాయని సమాచారం అందుతోంది. పుతిన్ టార్గెట్గా.. నార్వేగియన్ నోబెల్ కమిటీ ఈసారి శాంతి బహుమతిని కీలకంగా భావిస్తోంది. అందుకు కారణం.. ఉక్రెయిన్ యుద్ధం, తదనంతర రష్యా వ్యతిరేక పరిణామాలు. ► ఇప్పటిదాకా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వనిది యాభై ఏళ్ల కిందట మాత్రమే!. అర్హులు లేరనే కారణంతో ఆ సమయంలో అవార్డు ప్రకటించలేదు. ► ఉక్రెయిన్ దురాక్రమణ.. నరమేధం, రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షల్ని నార్వేగియన్ నోబెల్ కమిటీ పరిగణనలోకి తీసుకుందని, అందుకే ఫిబ్రవరి చివరి వారంలో (ఆక్రమణ మొదలైన తర్వాత..) ప్రత్యేకంగా భేటీ అయ్యిందనే ప్రచారం నడుస్తోంది ఇప్పుడు. ► పుతిన్కు మంట పుట్టేలా.. ఆయన వ్యతిరేకుల పేర్లను సైతం కమిటీ పరిశీలిస్తోంది. అందులో.. క్రెమ్లిన్ విమర్శకుడు అలెక్సీ నావల్నీ(జైల్లో ఉన్నారు). బెలారస్ ప్రతిపక్ష నేత స్వెత్లానా టిఖానోవ్స్కావా కమిటీ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ► వీళ్లుగాక.. అవినీతి వ్యతిరేక గ్రూప్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్, స్వీడన్కు చెందిన ఉద్యమకారిణి గ్రేటా తున్బర్గ్, పర్యావరణ ఉద్యమకారులు నిస్రీన్ ఎల్సాయిమ్(సుడాన్), చిబెజె ఎజెకిల్(ఘనా), బ్రిటిష్ దిగ్గజం డేవిడ్ అట్టెన్బోరఫ్ కూడా ఉండొచ్చని చెప్తున్నారు. ► అయితే ఉక్రెయిన్ యుద్ధం దరిమిలా.. ప్రపంచమంతా భద్రతా సంక్షోభంలో ఉండగా.. పర్యావరణం వైపు కమిటీ ఆలోచన ఉండకపోవచ్చనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తం అవుతోంది. ► కిందటి ఏడాది.. ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సభ్యులైన దిమిత్రి మురాతోవ్(రష్యా), మరియా రెస్సా(పిలిప్పైన్స్)కు సంయుక్తంగా దక్కింది నోబెల్ శాంతి అవార్డు. మురాతోవ్ పుతిన్ వ్యతిరేక కథనాలతో విరుచుకుపడతాడనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రష్యాలో పత్రికా స్వేచ్ఛ కోసం పాటుపడినందుకే ఆయనకు అవార్డు దక్కింది. అంతేకాదు.. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆయన నోబెల్ ప్రైజ్ను అమ్మేసి విరాళంగా ఇవ్వడం వార్తల్లో పతాక శీర్షికన నిలిచింది కూడా. చివరగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2014 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యాడు. సిరియాపై అమెరికా క్షిపణి దాడిని నివారించడంలో కీలక పాత్ర పోషించినందుకు.. రసాయనిక ఆయుధాలను సిరియా ధ్వంసం చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నందుకు పుతిన్ నోబెల్ పీస్ ప్రైజ్కు నామినేటయ్యారు. -
ఉక్రెయిన్ చిన్నారుల కోసం.. నోబెల్ బహుమతిని వేలానికి పెట్టిన రష్యాన్ జర్నలిస్ట్
ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా నిరాశ్రయులైన చిన్నారుల సహాయార్థం రష్యాన్ జర్నలిస్ట్ డిమిత్రి మురాటోవ్ తనకు లభించిన నోబెల్ బహుమతిని విక్రయించారు. ఆయన 1999లో స్థాపించబడిన నోవాయా వార్తాపత్రిక సంపాదకుడు. ఈ మేరకు డిమిత్రి మురాటోవ్ తన నోబెల్ శాంతి బహుమతిని ప్రపంచ శరణార్థుల దినోత్సవం రోజున వేలం నిర్వహించారు. ఐతే ఊహించని రీతిలో మురాటోవో నోబెల్ బహుమతి మరే ఏ ఇతర నోబెల్ బహుమతులు సాధించిన విధంగా వేలంలో రికార్డు స్థాయిలో అత్యధిక ధర పలికింది. హెరిటేజ్ వేలం కంపెనీ ఈ నోబెల్ ప్రైజ్ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని నిరాశ్రయులైన పిల్లల కోసం కృషి చేస్తున్న యూనిసెఫ్ అందజేస్తామని స్పష్టం చేసింది. ఐతే మురాటోవ్ 2021లో ఫిలిఫ్పీన్స్కు చెందిన మరియా రెస్సాతో కలసి ఈ నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. రష్యా అధ్యక్షుడి పుతిన్ 1999 నుంచి మీడియా సంస్థలపై ఉక్కుపాదం మోపి కట్టడి చేస్తూ వస్తున్నాడు. ఎప్పుడైతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఉక్రెయిన్పై దురాక్రమణ యుద్ధానికి దిగాడో అప్పటి నుంచి రష్యాలోని మీడియా సంస్థలపై మరింత ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో మురాటోవో గెజిటా వార్తాపత్రిక ఉక్రెయిన్లో యుద్ధం విషయమై రష్యా దుశ్చర్యను ఎండగడుతూ రాసింది. అంతే పుతిన్ ప్రభుత్వం వరుస హెచ్చరికలను జారీ చేసి తదనంతరం పూర్తిగా ఆ పత్రిక కార్యకలాపాలను నిలిపేసింది. అంతేకాదు మురాటోవా పై ఎరుపురంగుతో దాడి చేశారు. కానీ మాస్కో మాత్రం ఈ యుద్ధాన్ని భద్రతా దృష్ట్యా సాగిస్తున్న ప్రత్యేక సైనిక చర్యగా చెప్పుకుంటూ రష్యా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించింది. ఐతే పాశ్చాత్య దేశాలు దీన్ని దురాక్రమణ యుద్ధంగా గొంతెత్తి చెప్పాయి. ఈ మేరకు మురాటోవో మాట్లాడుతూ...తన సిబ్బంది మద్దతుతో ఈ వేలం నిర్వహించినట్ల తెలిపారు. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం ఉక్రెయిన్ శరణార్థుల జీవితాలకు ప్రయోజనకరంగా ఉండాలని ఆశిస్తున్నానని చెప్పారు. (చదవండి: ఎలన్ మస్క్పై కోర్టుకెక్కిన కన్నకొడుకు.. సారీ ‘కూతురు’!!) -
నోబెల్ శాంతి బహుమతికి ఉక్రెయిన్ అధ్యక్షుడు!
రష్యా డిమాండ్కు తలొగ్గకుండా ఉన్న సైన్యం, సాధారణ పౌరులు, బయటి దేశాల నుంచి అందుతున్న అరకోర సాయంతో పోరాడుతున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ. ఆయన ఉద్దేశం ఏదైనా, విమర్శలు ఉన్నా.. త్వరగా దేశాన్ని రష్యా గప్పిట్లోకి వెళ్లనీయకుండా చేస్తున్న తీరుపై అభినందనలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ఓ అరుదైన ఘనత దక్కాలని కోరుకుంటున్నారు కొందరు. యూరోపియన్ రాజకీయవేత్తలు కొందరు వ్లాదిమిర్ జెలెన్స్కీ పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తున్నారు. ఈ మేరకు నార్వేకు చెందిన నోబెల్ శాంతి కమిటీకి విజ్ఞప్తులు పంపిస్తున్నారు. అధికారంలో ఉన్న నేతలతో పాటు మాజీలు కొందరు ఈ రిక్వెస్ట్ చేసిన వాళ్లలో ఉన్నారు. శాంతి బహుమతి కమిటీకి మేం వినమ్రంగా మా విజ్ఞప్తిని పరిశీలనలోకి తీసుకోమని కోరుతున్నాం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోపాటు ఉక్రెయిన్ ప్రజలనూ శాంతి బహుమతికి మేం నామినేట్ చేస్తున్నాం. ఈ కారణం వల్లనే నామినేషన్ల స్వీకరణను తిరిగి తెరవాలని, మార్చి 31వ తేదీ వరకు స్వీకరణ తేదీని పొడిగించాలని కోరుతున్నాం అని ఆ ప్రకటనలో ఉంది. మార్చి 11వ తేదీనే ఈ ప్రకటనను రిలీజ్ చేశారు ఐరోపా దేశాల నేతలు. ఇదిలా ఉండగా.. కమిటీ నుంచి ఈ ప్రకటనపై స్పందన రాలేదు. నోబెల్ శాంతి బహుమతికి సంబంధించిన ప్రకటన.. అక్టోబర్ 3-10 తేదీల మధ్య జరగనుంది. 2022 నోబెల్ శాంతి బహుమతి కోసం 92 సంస్థలు, 251 మంది వ్యక్తిగతంగా దరఖాస్తులు చేసుకున్నారు. చదవండి: జెలెన్ స్కీ ఆవేదనలో అర్థం ఉందా? -
జాతి వివక్ష పోరాట యోధుడు అస్తమయం
జొహన్నెస్బర్గ్/న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై అవిశ్రాంత పోరాటం సాగించిన హక్కుల నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్ టుటు(90) అస్తమించారు. ఆర్చ్బిషప్ డెస్మండ్ టుటు ఆదివారం వేకువజామున కేప్టౌన్లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ప్రకటించారు. గతంలో క్షయవ్యాధికి గురైన డెస్మండ్ టుటు, ప్రొస్టేట్ కేన్సర్ బారినపడి 1997లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం పలు అనారోగ్య సమస్యలు ఆయన్ను చుట్టుముట్టాయి. బ్రిటిషర్ల హయాంలో నల్లజాతి ప్రజల హక్కుల కోసం, అన్యాయాలకు గురైన వారి తరఫున డెస్మండ్ టుటు తీవ్రంగా పోరాడారు. నల్ల జాతీయుల పాలన మొదలైన తర్వాత కూడా అన్యాయాలను, అక్రమాలను ఖండించడంలో ఆయన వెనుకాడలేదు. అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్లో కొనసాగుతూనే పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ సంస్థలను కొల్లగొడుతున్న తీరుపై గళమెత్తారు. ఆర్చ్బిషప్ టుటు మృతిపై భారత ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆర్చి బిషప్ టుటును ‘ఆఫ్రికా పీస్ బిషప్’గా నోబెల్ ఇన్స్టిట్యూట్ అభివర్ణించింది. దక్షిణాఫ్రికా నల్లజాతి ప్రజలపై బ్రిటిషర్లు దారుణాలకు పాల్పడినప్పటికీ బిషప్ టుటు మాత్రం అహింసాయుత విధానాలకే కట్టుబడి ఉన్నారని కొనియాడింది. మండేలాతో విడదీయరాని మైత్రి మొదట జొహన్నెస్బర్గ్ ఆర్చ్బిషప్గా ఉన్న టుటు తర్వాత కేప్టౌన్ బిషప్గా బాధ్యతలు నిర్వహించారు. ఆ పదవులు నిర్వహిస్తూనే స్థానిక నల్లజాతి వారిపై శ్వేత జాతీయుల దురాగతాలను ఖండించడంలో వెనుకాడలేదు. జొహన్నెస్బర్గ్ ఆర్చ్బిషప్గా కొనసాగుతున్న సమయంలోనే 1984లో ఆయన్ను నోబెల్ శాంతి బహుమతి వరించింది. బ్రిటిషర్ల హయాంలో జాతి వివక్షకు గురైన వారికి న్యాయం చేసే లక్ష్యంతో 1995లో టుటు నేతృత్వంలో ‘ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్’ను మండేలా నియమించారు. టుటు, మండేలా మధ్య అనుబంధాన్ని వివరిస్తూ మండేలా ఫౌండేషన్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘1950లలో పాఠశాలలో చదువుకునే రోజుల్లో జరిగిన వక్తృత్వ పోటీల సమయంలో మండేలా, టుటు తొలిసారి కలుసుకున్నారు. ఇద్దరూ జాతి వివక్షపై ప్రజల తరఫున పోరాటం సాగించారు. ఇది నచ్చని బ్రిటిషర్లు వారిద్దరూ కలుసుకోకుండా దాదాపు 4 దశాబ్దాలపాటు పలు అవాంతరాలు కల్పించారు. చివరికి మండేలా 27 ఏళ్లపాటు జైలు జీవితం గడిపి విడుదలయ్యాకే టుటుతో నేరుగా మాట్లాడగలిగారు. చెరసాల నుంచి విడుదలైన మండేలా మొదటగా వెళ్లి ఆ రోజు గడిపింది టుటు నివాసంలోనే’అని తెలిపింది. మండేలా 2013లో తుదిశ్వాస విడిచే వరకు టుటుతో అనునిత్యం మాట్లాడుకుంటూనే ఉన్నారంటూ వారి మధ్య ఉన్న గాఢమైత్రిని గుర్తు చేసింది. -
2021 Nobel Peace Prize: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వీరికే..
ఓస్లో: ఏటా ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు వ్యక్తులు, సంస్ధలు చేసిన కృషికి ప్రతిఫలంగా ప్రకటించే నోబెల్ శాంతి పురస్కారానికి ఈ ఏడాది(2021) మరియా రెస్సా, దిమిత్రి మరటోవ్ కు ఎంపికయ్యారు. నార్వేజియన్ నోబెల్ కమిటీ నేడు శాంతి పురస్కారం విజేతను ప్రకటించింది. ప్రజాస్వామ్యానికి మూలమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిరక్షణ కోసం చేసిన కృషికి గానూ వీరిని ఈ విశిష్ట పురస్కారానికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ పరంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం వీరు ధైర్యంగా పోరాడుతున్నారని నోబెల్ కమిటీ కమిటీ ఈ సందర్భంగా ప్రశంసించింది. (చదవండి: రసాయన శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి విజేతలు వీరే..!) దిమిత్రి మరటోవ్ ఒక రష్యన్ జర్నలిస్ట్, నోవాయా గజెటా వార్తాపత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్. 24 ఏళ్ల పాటు ఆ పత్రిక ఎడిటర్గా చేశారు. ఈ పత్రికను ప్రారంభించిప్పటి నుంచి రష్యా దేశంలో పేరుకుపోయిన అవినీతి, విధానపరమైన హింస, చట్ట వ్యతిరేక అరెస్టులు, ఎన్నికల్లో మోసాలు వంటి ఎన్నో సంచలనాత్మక కథనాలు ప్రచురించారు. దీంతో అతని మీద అనేక దాడులు చేయడమే బెదిరింపులు కూడా వచ్చాయి. పత్రికా స్వేచ్ఛను రక్షించడంలో చూపించిన ధైర్యసాహసాలకు మురాటోవ్ కు 2007లో సీపీజె అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ అవార్డును గెలుచుకున్నాడు. BREAKING NEWS: The Norwegian Nobel Committee has decided to award the 2021 Nobel Peace Prize to Maria Ressa and Dmitry Muratov for their efforts to safeguard freedom of expression, which is a precondition for democracy and lasting peace.#NobelPrize #NobelPeacePrize pic.twitter.com/KHeGG9YOTT — The Nobel Prize (@NobelPrize) October 8, 2021 మరియా రెస్సా ఫిలిప్పినో-అమెరికన్ జర్నలిస్ట్. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కోసం 2012లో ఆమె ‘రాప్లర్’ పేరుతో ఓ డిజిటల్ మీడియా కంపెనీని స్థాపించారు. ఓ జర్నలిస్టుగా, రాప్లర్ సీఈవోగా రెసా.. ఎన్నో సంచలనాత్మక కథనాలను ధైర్యంగా ప్రచురించారు. అధికార పరంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటూనే.. భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాడుతూ వస్తున్నారు. ఆగ్నేయ ఆసియాలో సీఎన్ఎన్ పరిశోధనాత్మక రిపోర్టర్ గా దాదాపు రెండు దశాబ్దాలు పనిచేశారు. -
ఆకలి తీర్చే కార్యక్రమానికి శాంతి బహుమతి!
రోమ్: ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న ప్రపంచ ఆహార కార్యక్రమానికి ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఉన్నచోట సాయమందించే ఈ కార్యక్రమం రోమ్ కేంద్రంగా పనిచేస్తోంది. గత ఏడాది ప్రపంచ ఆహార కార్యక్రమం దాదాపు 88 దేశాల్లోని పది కోట్ల మందికి ఆసరా కల్పించింది. ‘ఆకలి బాధలు ఎదుర్కొంటున్న కోటానుకోట్ల మంది కష్టాలపై ప్రపంచం దృష్టి పడేందుకు ఈ అవార్డు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం’ అని అవార్డు కమిటీ అధ్యక్షులు బెరిట్ రీస్ ఆండర్సన్ వ్యాఖ్యానించారు. శాంతి స్థాపనకు కీలకమైన ఆహార భద్రత కల్పించేందుకు ప్రపంచ ఆహార కార్యక్రమం కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆకలన్నది మరోసారి ప్రపంచం మొత్తమ్మీద సమస్యగా మారుతోందని, కరోనా వైరస్ పరిస్థితులు దీన్ని మరింత ఎక్కువ చేసిందని కమిటీ తెలిపింది. 2019లో సుమారు 13.5 కోట్ల మంది ఆకలితో అలమటించారని, ఇటీవలి కాలంలో సమస్య ఇంత తీవ్రరూపం దాల్చడం ఇదే మొదటిసారని వివరించింది. యెమెన్, కాంగో, నైజీరియా, సౌత్ సూడాన్ వంటి దేశాల్లో కోట్లాది మందికి ఆహారం అందించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది. హర్షాతిరేకాలు... నోబెల్ కమిటీ శాంతి బహుమతిని ప్రకటించిన వెంటనే నైజర్లోని ప్రపంచ ఆహార కార్యక్రమ కార్యాలయంలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా బీస్లీ అక్కడి ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ... ‘‘రెండు విషయాలు. మనకు అవార్డు వచ్చినప్పుడు నైజర్లో ఉన్న విషయాన్ని నమ్మలేకపోతున్నా. రెండో విషయం. నేను గెలవలేదు. మీరు గెలుచుకున్నారు’’అని అన్నారు. ప్రపంచ ఆహార కార్యక్రమానికి చాలాకాలంపాటు అమెరికన్లే అధ్యక్షత వహిస్తూ వచ్చారు. ఈ సంప్రదాయంలో భాగంగా 2017లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌత్ కారొలీనా రాష్ట్ర గవర్నర్ డేవిడ్ బీస్లీని అధ్యక్షుడిగా నియమించారు. ఆహార కార్యక్రమానికి నోబెల్ అవార్డు ప్రకటించిన విషయాన్ని తెలుసుకున్న బీస్లీ మాట్లాడుతూ ‘‘మాటల్లేని క్షణమంటూ నా జీవితంలో ఒకటి చోటు చేసుకోవడం ఇదే తొలిసారి’’అని, ఆవార్డు దక్కడం తనకు షాక్ కలిగించిందన్నారు. ప్రపంచ ఆహార కార్యక్రమమనే తన కుటుంబం అవార్డుకు అర్హురాలని అన్నారు. ప్రపంచ ఆహార కార్యక్రమంలో పనిచేస్తున్న యుద్ధం, ఘర్షణ, వాతావరణ వైపరీత్యాల వంటి దుర్భర పరిస్థితుల్లో పనిచేస్తున్నారని అటువంటి వారు ఈ అవార్డుకు ఎంతైనా అర్హులని ఆయన నైజర్ నుంచి అసోసియేటెడ్ ప్రెస్తో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆహార కార్యక్రమం ఇదీ... 2030 నాటికల్లా భూమ్మీద ఆకలిబాధలను సమూలంగా తొలగించే లక్ష్యంతో పనిచేస్తున ఐక్యరాజ్య సమితి సంస్థ ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ లేదా ప్రపంచ ఆహార కార్యక్రమం. కరువు కాటకాలొచ్చినా.. దేశాల మధ్య, ప్రాంతాల మధ్య ఘర్షణలు, యుద్ధాలు చెలరేగినా నిరాశ్రయులకు, బాధితులకు ఆహారం అందివ్వడం ఈ సంస్థ ప్రథమ కర్తవ్యం. దీనికి మాత్రమే పరిమితం కాకుండా.. సుస్థిర అభివృద్ధికి వివిధ దేశాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది. సిరియా, యెమెన్ వంటి దేశాల్లో లక్షల మంది కడుపు నింపే ప్రయత్నం చేస్తున్న ఈ సంస్థకు ఇటీవలి కాలంలో ఎదురవుతున్న మరో సవాలు వాతావరణ వైపరీత్యాలు. గత ఏడాది ఇడాయి తుపాను కారణంగా ముజాంబీక్లో సుమారు నాలుగు లక్షల హెక్టార్లలో పంట నీటమునిగిపోయింది. తిండిగింజల్లేని పరిస్థితుల్లో అల్లాడుతున్న ప్రజలను ఆదుకునేందుకు తక్షణం రంగలోకి దిగింది ఈ సంస్థ. ఆహారంతోపాటు నిరాశ్రయులకు మళ్లీ ఇళ్లు కట్టించడం వరకూ అనేక కార్యక్రమాలను చేపట్టింది. భూసార పరిరక్షణ, పెంపు, సాగునీటి కల్పన, విద్య, ఆరోగ్య సేవల మెరుగుదల వంటి అంశాల్లోనూ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ తనవంతు సాయం అందిస్తుంది. -
ప్రపంచ ఆహార కార్యక్రమానికి నోబెల్ శాంతి బహుమతి
స్టాక్హోం : ఆకలిపై పోరాడుతున్న ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమానికి (డబ్ల్యూఎఫ్పీ)కి ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఆకలిపై ఊపిరిసలపని పోరు సాగించేందుకు డబ్ల్యూఎఫ్పీ చేపట్టిన సేవలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి దక్కిందని నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. 2020 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతిని డబ్ల్యూఎఫ్పీకి అందించాలని తమ కమిటీ నిర్ణయించిందని నోబెల్ కమిటీ పేర్కొంది. యుద్ధ వివాదాలు, ఘర్షణలు తలెత్తిన ప్రాంతాల్లో శాంతి కోసం మెరుగైన వాతావరణం ఏర్పడేందుకు డబ్ల్యూఎఫ్పీ కృషి సాగించిందని తెలిపింది. దీంతో పాటు ఆకలిని యుద్ధ ఆయుధంగా మలుచుకునే చర్యలను నిరోధించేందుకు చేసిన ప్రయత్నాలకు గాను డబ్ల్యూఎఫ్పీకి ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించామని నోబెల్ కమిటీ ట్వీట్ చేసింది. డబ్ల్యూఎఫ్పీ ఏటా 88 దేశాల్లోని 9.7 కోట్ల మంది ప్రజలకు సాయపడుతోందని తెలిపింది. ఇక ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి తొమ్మిది మందిలో ఒకరు తినడానికి సరిపడినంత ఆహారం లేక బాధపడుతున్నారని పేర్కొంది. డిసెంబర్ 10న ఓస్లోలో జరిగే కార్యక్రమంలో 11 లక్షల డాలర్ల ప్రైజ్ మనీతో పాటు శాంతి బహుమతిని ప్రదానం చేస్తారు. కరోనా వైరస్తో ఆకలితో అలమటించే బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఈ నేపథ్యంలో డబ్ల్యూఎఫ్పీ సేవలు కొనియాడదగినవని నోబెల్ కమిటీ చీఫ్ బెరిట్ రీస్-అండర్సన్ ప్రశంసించారు. చదవండి : బలహీనతను బలంగా వినిపించే కవిత్వం -
ఆ ఏడాది గాంధీకే నోబెల్ పీస్ ప్రైజ్.. కానీ
(వెబ్ స్పెషల్): నోబెల్ శాంతి బహుమతి.. ప్రపంచ శాంతికి కృషి చేసిన ఎందరికో ఈ బహుమతిని ప్రదానం చేశారు. మరి భారత్, ఆఫ్రికా దేశాల్లో శాంతియుత పోరాటాలు చేసిన జాతిపిత, మహాత్మగాంధీని ఈ బహుమతిని ఎందుకు వరించలేదు. ఈ ప్రశ్నే గాంధీ జయంతి(అక్టోబర్ 2న) సందర్భంగా కోట్లాది మంది భారతీయులను తొలుస్తోంది. అందుకు గల కారణాలు తెలుసుకుందాం. నోబెల్ శాంతి పురస్కారంతో గౌరవించడం రెడ్ క్రాస్ స్థాపకులు జీన్ హెన్రీ డ్యూనెంట్ నుంచి ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకు 19 సార్లు ఈ పురస్కారాన్ని ప్రకటించలేదు. ఇక 27 సార్లు ఈ పురస్కారాన్ని వ్యక్తుల కంటే సంస్థలకు ఇవ్వడమే సబబని భావించారు. ఒక్కసారి నోబెల్ బహుమతిని ప్రదానం చేసిన తర్వాత తిరిగి వెనక్కు తీసుకోరు. అందుకే బహుమతికి ఎంపిక చేసే ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఇక జాతిపితకు ఈ పురస్కారం దక్కకపోవడం పట్ల పలు వివరణలు వినిపిస్తాయి. ముఖ్యంగా గాంధీజీకి ఈ పురస్కారం ఇచ్చి ఆంగ్లేయ పాలకుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోకూడదని నోబెల్ కమిటీ భావించిందనే వాదన ఎక్కువగా ప్రచారంలో ఉంది.(చదవండి: నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ నామినేట్) నాలుగు సార్లు నామినేట్ అయిన గాంధీ నోబెల్ శాంతి పురస్కారానికి గాంధీ నాలుగు సార్లు నామినేట్ అయ్యారు. ఆయనను వరసగా 1937, 1939లో నామినేట్ చేశారు. 1947లో కూడా ఆయన నామినేట్ అయ్యారు. చివరగా 1948లో గాంధీని నామినేట్ చేశారు. కానీ తర్వాత రెండు రోజులకే ఆయన హత్యకు గురయ్యారు. మొదటిసారి ఒక నార్వే ఎంపీ గాంధీ పేరును సూచించారు. పురస్కారం ఇచ్చే సమయంలో కమిటీ ఆయనను పట్టించుకోలేదు. దీని గురించి నోబెల్ కమిటీలోని జాకబ్ వార్మూలర్ అనే సలహాదారు గాంధీకి నోబెల్ పురస్కారం ఇవ్వకపోవడం గురించి తన అభిప్రాయం రాశారు. ‘గాంధీ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తను చేస్తున్న అహింసా ఉద్యమం ఎప్పుడో ఒకప్పుడు హింసాత్మకంగా మారొచ్చని తెలిసినా దానిని వీడలేదు’ అని పేర్కొన్నారు. అంతేకాక ‘దక్షిణాఫ్రికాలో, భారత్లో ఆయన కేవలం తన దేశస్తుల కోసమే పోరాడారు. నల్లజాతి వారికోసం ఆయన ఏం చేయలేదు’ అని రాసుకొచ్చారు. (చదవండి: సరైన నేతకు ‘నోబెల్ శాంతి’) 1947లో మరోసారి.. 1947 లో నోబెల్ కోసం గాంధీని బీజీ ఖేర్, జీవీ మౌలాంకర్, జీపీ పంత్ నామినేట్ చేశారు. ఆ సమయంలో కమిటీ ఛైర్మన్ గున్నార్ జాన్ ఇద్దరు సభ్యులు, క్రిస్టియన్ కన్జర్వేటివ్ హర్మన్ స్మిట్ ఇంజిబ్రేట్సెన్, క్రిస్టియన్ లిబరల్ క్రిస్టియన్ ఒఫ్టెడల్ గాంధీ వైపు మొగ్గు చూపారు, కాని మిగతా ముగ్గురు - లేబర్ రాజకీయ నాయకుడు మార్టిన్ ట్రాన్మాల్, మాజీ విదేశాంగ మంత్రి బిర్గర్ బ్రాడ్ల్యాండ్లు వ్యతిరేకించారు. దేశ విభజన సమయంలో చెలరేగిన అల్లర్లు.. గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల ఆయనకు ఆ ఏడాది పురస్కరం లభించలేదు. దేశ విభజన వల్ల భారత్-పాక్ల మధ్య యుద్ధం తప్పక వస్తుందని కమిటీ భావించింది. దాంతో గాంధీకి పురస్కారం దక్కలేదు. దాంతో అది మానవ హక్కుల ఉద్యమం ‘క్వేకర్’కు లభించింది. 1948లో మరోసారి.. ఒట్టిదే నోబెల్ శాంతి బహుమతి నామినేషన్ చివరి తేదీకి రెండు రోజుల ముందు గాంధీ హత్య జరిగింది. ఆ సమయానికే నోబెల్ కమిటీకి గాంధీ తరఫున ఆరు సిఫార్సులు అందాయి. వాటిలో 1946, 47 అవార్డు గ్రహీతలు ది క్వేకర్స్, ఎమిలీ గ్రీన్ బాల్చ్ ఉన్నారు. కానీ అదే ఏడాది గాంధీ మరణించారు. దాంతో కొత్త సమస్య తెరమీదకు వచ్చింది. అప్పటి వరకు మరణానంతరం ఎవరికీ నోబెల్ పురస్కారం ఇవ్వలేదు. దాంతో మరో సారి నోబెల్ ఆశ నిరాశ అయ్యింది. అయితే ప్రస్తుతం మరణించిన తర్వాత కూడా ఇస్తున్నారు. దీంతో పాటు మరో ప్రశ్న కూడా ఎదురయ్యింది. శాంతి పురస్కారం నగదు ఎవరికి చెల్లించాలి అని. ఎందుకంటే అప్పటికి గాంధీ పేరు మీద ట్రస్టుగానీ, సంఘం గానీ లేదు. ఆయనకంటూ ఎలాంటి ఆస్తులు కూడా లేవు. దీనికి సంబంధించి ఆయన ఎలాంటి వీలునామా కూడా రాయలేదు. దాంతో మరోసారి నోబెల్ చేజారింది. (చదవండి: గాంధీజీ కళ్లజోడు.. జీవితాన్నే మార్చేసింది!) ఇక ఆ ఏడాది ఎవరికి నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వలేదు. దీని గురించి కమిటీ ‘జీవించి ఉన్న ఏ అభ్యర్థినీ శాంతి పురస్కారానికి తగిన వారుగా భావించలేదు’ ప్రకటించింది. ఇక్కడ 'జీవించి ఉన్న' అనే మాట చాలా ముఖ్యమైనది. దానిని బట్టి, మరణానంతరం ఎవరికైనా పురస్కారం ఇచ్చే అవకాశం ఉండుంటే, అది కచ్చితంగా గాంధీకి తప్ప వేరే వారికి దక్కేది కాదనేది స్పష్టమవుతోంది. -
నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ నామినేట్
న్యూయార్క్ : 2021 సంవత్సరానికి ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను నార్వే ఎంపీ టిబ్రింగ్ జడ్డే నామినేట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా పలు వివాదాల పరిష్కారానికి ట్రంప్ చొరవ చూపారని జడ్డే ప్రశంసించారు. ఇజ్రాయల్-యూఏఈ మధ్య ట్రంప్ కుదిర్చిన శాంతి ఒప్పందం చారిత్రాత్మకమైనదని కొనియాడారు. మధ్యప్రాచ్యంలో సైనిక దళాల తగ్గింపుతో పాటు శాంతి సాధనకు ట్రంప్ విశేషంగా కృషిచేశారని అన్నారు. యూఏఈ-ఇజ్రాయల్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ట్రంప్ యంత్రాంగం కీలక పాత్ర పోషించిందని జడ్డే అన్నారు. ఇక ఆగస్ట్ 13న స్వయంగా అధ్యక్షుడు ప్రకటించిన ఈ ఒప్పందం ట్రంప్ విదేశాంగ విధానం సాధించిన కీలక విజయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా సెప్టెంబర్ 15న వైట్హౌస్లో యూఏఈ-ఇజ్రాయల్ ఒప్పందంపై ఇజ్రాయల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఎమిరేట్స విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జయేద్ అల్ నహ్యాన్ల సమక్షంలో సంతకాలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. నలుగురు అమెరికా అధ్యక్షులు ఇప్పటివరకూ నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. అమెరికా అధ్యక్షులు రూజ్వెల్ట్, వుడ్రూ విల్సన్, జిమ్మీ కార్టర్, బరాక్ ఒబామాలకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 2021 విజేత ఎవరనేది వచ్చే ఏడాది అక్టోబర్ తర్వాత ప్రకటిస్తారు. చదవండి : హారిస్ ప్రెసిడెంట్ అయితే.. అమెరికాకే అవమానం -
మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాం: చైనా
చైనా కాన్ఫిడెన్స్ చూస్తే శత్రువుకి కూడా ముచ్చటేస్తుంది. ట్రంప్ ఎన్నికల మూడ్లో లేకుంటే ఆయనా ముచ్చట పడేవారు. చైనా శుక్రవారం నాడు ఇంటి మీదకు వెళ్లి మరీ నార్వేని హెచ్చరించింది! మావాళ్లకు కనుక నోబెల్ శాంతిబహుమతి ఇచ్చి మాలో మాకు పెట్టారో మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాం అని చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ ఇ నార్వేను గట్టిగా బెదిరించారు. ‘మాలో మాకు’ అంటే.. చైనాకు, హాంకాంగ్కి. హాంకాంగ్ ఒక ప్రత్యేక దేశంలా అనిపిస్తుంది కానీ అది చైనా పాలనాధికారాల కింద ఉన్న ప్రత్యేక ప్రాంతం మాత్రమే. ఈమధ్య చైనా ఒక కొత్త భద్రత చట్టం తెచ్చింది. దానిని హాంకాంగ్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. నిరసన ప్రదర్శనలు జరుపుతూనే ఉన్నారు. ఆ నిరసనకారులకు నార్వే నోబెల్ కమిటీ ‘అండ్.. ఈ ఏడాది శాంతి బహుమతి గోస్ టు..’ అంటూ అవార్డును ప్రకటించే ప్రమాదం ఉందని చైనా స్మెల్ చేసినట్లుంది. (66 రోజుల్లో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్?) అందుకే ఈ ముందు జాగ్రత్త బెదిరింపులు. ఈ మధ్య బ్రిటన్కి కూడా చైనా ఇలాగే వార్నింగ్ ఇచ్చింది. ‘మీ మంచితనం చేత మా మంచివాళ్లని మీ మంచి దేశంలో ఉండటానికి రప్పించుకుంటే మామూలుగా ఉండదు చూడండీ..’ అని టెస్ట్ ఫైర్ లేవో చేసింది. ఇప్పుడు నార్వేకు తాజాగా ‘శాంతి సందేశం’ ఇచ్చింది. అయినా నోబెల్ ఇచ్చేది స్వీడన్ కదా. మధ్యలోకి నార్వే ఎందుకొచ్చింది? పెద్దాయన ఆల్ఫెడ్ర్ నోబెల్ అలా వీలునామా రాసి వెళ్లారు. నోబెల్ శాంతి బహుమతిని మాత్రం నార్వేనే ఇవ్వాలని. కరోనాకు కారణం అయి, ఏమాత్రం గిల్టీ ఫీలింగ్ లేకుండా చైనానే తిరిగి అందరి పైనా కయ్యి కయ్యి మంటోందంటే.. ఆ కాన్ఫిడెన్స్ను చూసి నెక్స్ట్ ముచ్చట పడవలసిన వాళ్లం మనమే. ప్రస్తుతం చైనా చైనా లో లేదు. ఇండియా బోర్డర్ లో ఉంది. -
సరైన నేతకు ‘నోబెల్ శాంతి’
శాంతి అంటే యుద్ధం లేకపోవడం ఒక్కటే కాదు... సమాజంలో అందరూ గౌరవంగా బతికే స్థితి కల్పించడం, సమానత్వం సాధించడం. ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ను ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపిక చేస్తూ... పొరుగు దేశమైన ఎరిట్రియాతో రెండు దశాబ్దాలుగా సాగుతున్న యుద్ధానికి స్వస్తి పలికి, ఆ దేశంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని నోబెల్ ఎంపిక కమిటీ శుక్రవారం ప్రకటించింది. అబీ సాధించిన ఇతరేతర విజ యాలు ఆ కమిటీ పరిశీలనలోకి రాకపోయి ఉండొచ్చు. లేదా వారు నిర్దేశించుకున్న నిబంధనల చట్రంలో అవి ఒదిగి ఉండకపోవచ్చు. కానీ ఆ విజయాల్లో అనేకం అత్యుత్తమమైనవి. చాలా దేశాల్లో పాలకులు అమలు మాట అటుంచి... కనీసం ఆలోచించడానికి కూడా సాహసించనివి. ఇథియో పియాలో అబీ అహ్మద్ అధికార పగ్గాలు చేపట్టి ఏడాదైంది. ఇంత తక్కువ వ్యవధిలోనే ఆయన అనూ హ్యమైన విజయాలు సాధించారు. ఆయన అనుసరించిన విధానాలు ఇథియోపియా సమాజంలో అన్ని వర్గాలు గౌరవంగా బతికే స్థితిని కల్పించాయి. దశాబ్దాలుగా ఇథియోపియాలో తెగల మధ్య సాగుతున్న ఘర్షణలను ఆయన చాలావరకూ నియంత్రించగలిగారు. లింగ వివక్షను అంతమొం దించే దిశగా అవసరమైన చర్యలు తీసుకున్నారు. తమ పొరుగున ఉన్న సుడాన్లో సైనిక పాలకు లకూ, నిరసనోద్యమ నేతలకూ మధ్య ఎడతెగకుండా సాగుతున్న పోరును ఆపి వారి మధ్య సామర స్యాన్ని నెలకొల్పారు. దేశంలో గత పాలకులు జైళ్లల్లో కుక్కిన వేలాదిమంది రాజకీయ ఖైదీలకు విముక్తి కల్పించారు. వారిని చిత్రహింసలపాలు చేసిన గత ప్రభుత్వ తీరుకు క్షమాపణ చెప్పి వారం దరికీ సాంత్వన చేకూర్చారు. ఉగ్రవాదులుగా ముద్రపడి వేరే దేశాలకు వలసపోయిన వేలాదిమంది తిరిగొచ్చేందుకు దోహదపడ్డారు. పౌరుల ప్రాథమిక హక్కులను పునరుద్ధరించారు. గత ఏడాది నుంచి ఇంతవరకూ పాత్రికేయులను కటకటాల్లోకి నెట్టని ఏకైక దేశం ప్రపంచంలో ఇథియోపియా ఒక్కటే అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించిందంటే అబీ గొప్పతనమేమిటో తెలుసుకోవచ్చు. అంతక్రితం వరకూ మీడియాపై అమల్లో ఉన్న ఆంక్షలన్నిటినీ తొలగించారు. భావప్రకటనా స్వేచ్ఛకు వీలు కల్పించారు. దేశంలోని అమ్హారా ప్రాంతంలో మొన్న జూన్లో సైనిక తిరుగుబాటు తలెత్తిన ప్పుడు మాత్రం కొన్ని రోజులపాటు తాత్కాలికంగా ఇంటర్నెట్ను నిలిపివేశారు. ఆ తర్వాత క్షమా పణ చెప్పి పునరుద్ధరించారు. అధికారంలోకొచ్చి అయిదారు నెలలు గడవకముందే జనాభాలో సగ భాగంగా ఉన్న మహిళలకు అన్ని స్థాయిల్లోనూ సమానావకాశాలు దక్కేందుకు అబీ చర్యలు ప్రారం భించారు. తన కేబినెట్లో 50 శాతం స్థానాలను వారికి కేటాయించారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో మాట్లాడి ఏకాభిప్రాయం సాధించి దేశాధ్యక్ష పదవికి తొలిసారి మహిళ ఎన్నికయ్యేలా చూశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళను ఎంపిక చేశారు. దేశంలో ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసి, అవినీతికి ఆస్కారం లేకుండా చేయడం అబీ సాధించిన విజయాల్లో ప్రధా నమైనది. వచ్చే ఏడాది దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన వాగ్దానం చేశారు. ఆఫ్రికా అంటే ప్రపంచంలోని ఇతరచోట్ల చిన్న చూపు ఉంటుంది. మీడియాలో ఆ ప్రపంచం గురించిన వార్తలు పెద్దగా ఉండవు. ఆఫ్రికా దేశాల మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడో, ఉగ్రవాద దాడుల్లో భారీ సంఖ్యలో జనం మరణించినప్పుడో ఆ దేశాల ప్రస్తావన కనబడుతుంది. ఆ సమయాల్లో మాత్రమే ఆఫ్రికా ఖండం గుర్తొస్తుంది. కనుక అక్కడి నేతల గురించి, వారు సాధిస్తున్న విజయాల గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. అబీ కూడా తన సంస్కరణ విష యంలో హంగూ ఆర్భాటం ప్రదర్శించలేదు. తాను అమలు చేస్తున్న నిర్ణయాల వల్ల కలిగే ఫలితా లేమిటన్న అంశంపైనే అధికంగా దృష్టి సారించారు. అవన్నీ ఇప్పుడు కళ్లముందు కనబడుతు న్నాయి. వీటిల్లో పాశ్చాత్య ప్రపంచాన్ని అబీ అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలు, పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించడం వగైరాలు ఆకర్షించి ఉండొచ్చు. ఎర్ర సముద్రానికి ఆవల ఉన్న ఇథియో పియాలో జరుగుతున్నదేమిటో... వాటివల్ల ఎలాంటి సత్ఫలితాలు వస్తున్నాయో యెమెన్, ఇతర గల్ఫ్ దేశాలు గుర్తించాయి. పొరుగునున్న ఉన్న సోమాలియా, జిబౌతి, సుడాన్, దక్షిణ సుడాన్ దేశాలు సైతం అబీని స్ఫూర్తిగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. పదికోట్లమంది జనాభా ఉన్న ఇథియోపియాలో ప్రధానంగా ఉన్న నాలుగైదు తెగల మధ్య నిత్యం సాగే ఘర్షణలు, పొరుగునున్న ఎరిట్రియాతో యుద్ధం ఆ దేశాన్ని కుంగదీశాయి. ఆ యుద్ధం వల్ల 80,000మంది మరణించడం మాత్రమే కాదు...లక్షలమంది వలసలు పోయారు. ఈ నిరర్ధక యుద్ధంవల్ల అసలే పేద దేశాలుగా ఉన్న ఎరిట్రియా, ఇథియోపియా ఆర్థికంగా మరింత కుంగి పోయాయి. దీన్నంతటినీ అబీ చాలావరకూ చక్కదిద్దగలిగారు. ఈసారి ఆయనతో నోబెల్ శాంతి బహుమతికి పోటీపడినవారిలో స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి పదహారేళ్ల గ్రేటా థన్బర్గ్ ఉంది. సాధారణంగా నోబెల్ శాంతి బహుమతి చుట్టూ ఎప్పుడూ వివాదాలు అల్లుకుంటాయి. రేసులో చాలా ముందున్నారని భావించినవారి పేరు ఒక్కోసారి పరిశీలనకే రాదు. అలాగే శాంతి బహుమతి ప్రకటించిన వెంటనే ఎంపికైనవారి అనర్హతలపై ఎక్కువ చర్చ ఉంటుంది. కానీ ఈ ఏడాది అబీ విష యంలో దాదాపుగా అలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదంటే అందుకు ఆయన వ్యక్తిత్వం, ఆయన వరసపెట్టి తీసుకుంటున్న చర్యలు కారణం. ప్రపంచంలో నాగరిక దేశాలుగా చలామణి అవుతు న్నవి, అలా చలామణి అయ్యేందుకు ప్రయత్నిస్తున్నవి అబీ తీసుకుంటున్న చర్యలనూ, ఇథియోపి యాను ప్రజాస్వామిక దేశంగా, శాంతికాముక దేశంగా తీర్చిదిద్దడానికి ఆయన చేస్తున్న ప్రయత్నా లనూ గమనించాల్సి ఉంది. ఇప్పుడు ప్రకటించిన నోబెల్ శాంతి అందుకు దోహదపడితే మంచిదే. -
ఇథియోపియా ప్రధానికి శాంతి నోబెల్
స్టాక్హోమ్: ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం ఈ ఏడాది ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీని వరించింది. ఆఫ్రికా దేశంలో శాంతి స్థాపన, అంతర్జాతీయ సహకారంలో ఆయన చేసిన కృషికిగాను ఈ అవార్డు దక్కింది. ప్రధానంగా ఇ«థియోపియాకు సరిహద్దుల్లో ఉన్న ఎరిట్రియా దేశంతో దశాబ్దాల తరబడి నెలకొని ఉన్న సరిహద్దు ఉద్రిక్తతల్ని నివారించడానికి శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంలో అబీ అహ్మద్ చూపించిన చొరవకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రకటిస్తున్నట్టుగా ఓస్లోలో నార్వే నోబెల్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తికి అత్యున్నత పురస్కారం రావడం ఇదే మొదటిసారి. 43 ఏళ్ల అబీ నోబెల్ పురస్కారం పొందిన 100వ విజేత. ఈ పురస్కారం కింద 90 లక్షల స్వీడిష్ క్రౌన్స్ (దాదాపు రూ.9.40 కోట్లు) అబీ అహ్మద్కు అందజేస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతిని పురస్కరించుకొని డిసెంబర్ 10న నార్వేలోని ఓస్లోలో శాంతి పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి, 16 ఏళ్ల వయసున్న గ్రేటా థెన్బర్గ్ రేసులో ముందున్నారు. ఆమెకే అవార్డు వరిస్తుందని అందరూ భావించారు. కానీ చివరి నిమిషంలో అబీ అవార్డును గెల్చుకున్నారు. 20 ఏళ్ల సంక్షోభానికి తెర ఒకప్పుడు ఇథియోపియాలో భాగమైన ఎరిట్రియా సుదీర్ఘ పోరాటం చేసి 1993లో స్వతంత్ర దేశంగా అవతరించింది. అప్పట్నుంచి ఆ రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యలు ఉన్నాయి. అంతర్జాతీయ ఒప్పందాలను బేఖాతరు చేస్తూ ఎరిట్రియా 1998లో ఇథియోపియాపై సమరభేరి మోగించింది. 1998–2000 మధ్య భీకర పోరులో చివరికి ఎరిట్రియా వెనక్కి తగ్గింది. అప్పట్నుంచి ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉన్నాయి. 2018లో అబీ అహ్మద్ ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టాక ఎరిట్రియా అధ్యక్షుడు ఇసాయిస్ అఫ్వెర్కికు స్నేహహస్తం అందించారు. మూడు నెలల్లోనే ఉద్రిక్తతల్ని చల్లార్చడానికి శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దేశంలో ప్రభుత్వ నిబంధనలన్నింటినీ అబీ అహ్మద్ సరళీకరించారు. కేబినెట్లో అత్యధికంగా మహిళల్ని అబీ అహ్మద్ తీసుకున్నారు. పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నవారినీ అక్కున చేర్చుకున్నారు. దేశ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టారు. పొరుగు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఏళ్ల తరబడి అభద్రతలో ఉన్న ప్రజల్లో భవిష్యత్ పట్ల భరోసాను నింపారు. ఒక ప్రధానిగా అబీ అహ్మద్ సయోధ్య, సంఘీభావం, సామాజిక న్యాయం అనే అంశాలను బాగా ప్రచారంలోకి తీసుకువచ్చారు. అతడే ఒక సైన్యం ఒక సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించి సైబర్ ఇంటెలిజెన్స్ విభాగంలో సాహసోపేతంగా వ్యవహరించి, ప్రధానిగా శాంతి స్థాపనకు పలు సంస్కరణలు తీసుకువచ్చిన అబీ అహ్మద్ ప్రస్థానం ఎంతో ఆసక్తికరం. దక్షిణ ఇథియోపియాలో జిమా జోన్లో 1976లో అబీ జన్మించారు. ఆయన తండ్రి ముస్లిం. తల్లి క్రిస్టియన్. చదువుల్లో ఎప్పుడూ ముందుండేవారు. చదువుపై ఆసక్తితో ఎన్నో డిగ్రీలు సొంతం చేసుకున్నారు. శాంతిభద్రతల అంశంలో అడ్డీస్ అబాబా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. లండన్లో గ్రీన్ విచ్ యూనివర్సిటీ నుంచి నాయకత్వ మార్పిడి అనే అంశంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. టీనేజ్లో ఉండగానే సైన్యంలో చేరారు. లెఫ్ట్నెంట్ కల్నల్ పదవి వరకు ఎదిగారు ప్రమాదాలు ఎదుర్కొని వాటిని పరిష్కరించడం అయనకు ఎంతో ఇష్టమైన విషయం. 1998–2000 మధ్య ఎరిట్రియాతో యుద్ధ సమయంలో నిఘా విభాగంలో పనిచేశారు. గూఢచారిగా మారి ఎరిట్రియా నుంచి రక్షణకు సంబంధించి పలు రహస్యాలను రాబట్టారు. 1995లో ర్వాండాలో ఐక్యరాజ్యసమితి శాంతి కార్యకర్తగా సేవలు అందించారు. 2010లో రాజకీయాల్లో చేరారు. ఒరోమో పీపుల్స్ డెమోక్రటిక్ ఆర్గనైజేషన్ సభ్యుడిగా చేరి పార్లమెంటుకి ఎన్నికయ్యారు. 2018 ఏప్రిల్లో ప్రధాని పగ్గాలు చేపట్టి దేశం దశ దిశ మార్చడానికి కృషి చేస్తున్నారు. థ్రిల్లింగ్గా ఉంది: అబీ అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం ఇథియోపియా ప్రధాని అబీని వరించడంతో ఆ దేశ ప్రజలు ఆనందోత్సాహాల్లో ఉన్నారు. ఈ పురస్కారం దేశానికే గర్వకారణమని ప్రధాని కార్యాలయం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. తనకి ఎంతో థ్రిల్లింగ్గా ఉందని అబీ అన్నారు. ఈ పురస్కారం ఆఫ్రికాకే చెందుతుందని చెప్పారు. ఈ అవార్డుతో స్ఫూర్తి పొంది ఆఫ్రికా ఖండంలో ఇతర దేశాల నాయకులు శాంతి స్థాపనకు కృషి చేస్తారని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఇథియోపియా ప్రధానికి నోబెల్ శాంతి పురస్కారం
ఓస్లో(నార్వే) : ఇథియోపియా ప్రధాన మంత్రి అబీ అహ్మద్ అలీకు(43) అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది గానూ నోబెల్ శాంతి పురస్కారం ఆయనను వరించింది. ఆయనకు నోబెల్ శాంతి పురస్కారం అందజేయనున్నట్టు నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ముఖ్యంగా తమ పక్క దేశమైన ఎరిట్రియాతో ఉన్న శత్రుత్వాన్ని పరిష్కరించడానికి అలీ చేసిన కృషికి గానూ ఆయనను నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపిక చేసినట్టు జ్యూరీ సభ్యులు తెలిపారు. డిసెంబర్ 10న జరిగే కార్యక్రమంలో అలీ శాంతి పురస్కారాన్ని అందుకోనున్నారు. 2018 ఏప్రిల్లో ఇథియోపియా ప్రధానిగా భాద్యతలు చేపట్టిన అహ్మద్.. సరిహద్దు దేశాలతో ఉన్న సమస్యలను పరిష్కరించడమే.. కాకుండా తన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే విధానాలను అవలంభించారు. కేవలం ఆరు నెలల్లోనే చాలా ఏళ్ల పాటు ఇథియోపియాకు శత్రు దేశంగా ఉన్న ఎరిట్రియాతో శాంతి కుదిరేలా చేశారు. -
‘ఒబామాకు కాదు నాకు ఇవ్వాలి నోబెల్’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శాంతి స్థాపన కోసం తాను ఎంతో కృషి చేశానని.. కానీ నోబెల్ కమిటీ తన కృషిని గుర్తించలేదని ఆరోపించారు. 2009లో ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘అధ్యక్షుడు అయిన వెంటనే ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. అసలు ఆ అవార్డు ఎందుకు ఇచ్చారో ఒబామాకు కూడా తెలియదు’ అంటూ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2009లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఒబామాకు... అంతర్జాతీయ స్థాయిలో చూపించిన దౌత్యం, వివిధ దేశాల మధ్య నెలకొల్పిన సహకారం, ప్రజలతో కలిసి పనిచేసే మనస్తత్వం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. అప్పట్లో ఒబామాకు ఈ బహుమతి ఇవ్వడం పట్ల విమర్శలు కూడా తలెత్తాయి. దాదాపు పదేళ్ల తర్వాత తాజాగా ట్రంప్ మరోసారి ఆ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఐక్యరాజ్యసమితికి వెళ్లిన ట్రంప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... తనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వకపోవడం సరికాదన్నారు. చాలా అంశాల్లో తాను చేసిన కృషికిగాను నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వివక్ష లేకుండా ఇచ్చివుంటే... తనకు ఎప్పుడో నోబెల్ వచ్చేదన్నారు. 2009లో ఒబామాకు ఇచ్చినప్పుడు... తనకెందుకు ఇవ్వరన్నది ట్రంప్ అభ్యంతరం. -
నీకు నోబెల్ వచ్చిందా? గొప్ప విషయమే!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కోసారి ఎలా ప్రవర్తిస్తారో ఆయనకే తెలియదు. పాలనా విధానాలతోనే కాదు తన వింత చేష్టలు, ప్రశ్నలతో ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తారు. తాజాగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నదియా మురాద్ను అవమానపరిచే రీతిలో ట్రంప్ మాట్లాడారు. ఇరాక్లో ఐసిస్ ఉగ్రమూకల చేతుల్లో లైంగిక హింసకు గురవుతున్న ఎంతో మంది యాజాది యువతులకు నదియా విముక్తి కల్పించారు. ఒకప్పుడు లైంగిక బానిసగా ఉన్న ఆమె చేసిన ఈ కృషికి గానూ గతేడాది నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నారు. కాగా బుధవారం ఆమె శ్వేతసౌధంలో ట్రంప్ను కలిశారు. ఇరాక్లోని యాజాదీలు అనుభవిస్తున్న నరకం, వారి దీనస్థితి గురించి ఆయనకు వివరించారు. ఐసిస్, కుర్దిష్ వర్గాల చేతుల్లో బలైపోతున్న యాజాదీలకు విముక్తి కల్పించాల్సిందిగా విఙ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో నదియా మాట్లాడుతున్న సమయంలో ట్రంప్ ఆమె మాటలకు అడ్డు తగిలారు. ‘నీకు నోబెల్ బహుమతి వచ్చిందా? గొప్ప విషయం. అవును అసలు వాళ్లు నీకెందుకు అవార్డు ఇచ్చారు’ అంటూ నదియాను ప్రశ్నించారు. ఊహించని పరిణామానికి కంగుతిన్న నదియా వెంటనే తేరుకుని...ఐసిస్ లైంగిక బానిసలకు విముక్తి కలిగించినందుకు గానూ ఆఫ్రికా గైనకాలజిస్ట్ డెనిస్ ముక్వేజ్తో సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి పొందినట్లు తెలిపారు. ఈ క్రమంలో బాధితురాలిగా ఉన్న తాను నాయకురాలిగా ఎదిగన తీరును ట్రంప్నకు వివరించారు. ‘ మా అమ్మ, సోదరులను ఉగ్రవాదులు చంపేశారు. నన్ను బానిసను చేసి చిత్రహింసలు పెట్టారు. అయినప్పటికీ నా పోరాటం ఆపలేదు. యాజాది మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఐసిస్ వాళ్ల లైంగిక దాడులకు అదుపులేకుండా పోయింది. దయచేసి మీరు కలుగుజేసుకుని అందరికీ న్యాయం చేయాలి. ఇరాక్, కుర్దిష్ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి’ అని నదియా విఙ్ఞప్తి చేశారు. చదవండి : ‘హింసించడంలోనే ఆనందమని వెకిలిగా నవ్వాడు’ ఇందుకు బదులుగా ట్రంప్ మాట్లాడుతూ... ‘ఐసిస్ను నామ రూపాల్లేకుండా చేశాం కదా. ఇక మీరంటున్నది కుర్దిష్ వర్గాల గురించి. వాళ్లెవరో నాకు పూర్తిగా తెలియదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో నిరాశగా ఆమె వెనుదిరగాల్సి వచ్చింది. కాగా సిరియా, ఇరాక్లో నరమేధం సృష్టిస్తున్న ఐసిస్ ఉగ్రమూకలను పూర్తిగా ఏరివేసిన క్రమంలో అమెరికా సైన్యాలను వెనక్కి పిలుస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం సిరియాలోని కుర్దిష్ వర్గాలు ఉగ్రవాదులతో పాటు శరణార్థులను క్యాంపులకు తరలిస్తూ వారిని తిరిగి స్వదేశాలకు పంపాలని యోచిస్తున్నాయి. కానీ యూకే, అమెరికా వంటి దేశాలు ఇందుకు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇరాక్, సిరియాలో అంతర్యుద్ధానికి ఆజ్యం పోసింది అగ్రదేశమే అంటూ విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. -
‘నోబెల్’పై స్పందించిన ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్ : నోబెల్ శాంతి బహుమతి అందుకునే సామర్ధ్యం తనకు లేదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.ఇమ్రాన్ ప్రతిష్టాత్మక శాంతి బహుమతి స్వీకరించేందుకు అర్హుడని పాక్ పార్లమెంట్ తీర్మానించిన నేపథ్యంలో ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ వివాదాన్ని కశ్మీరీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిష్కరించి ఉపఖండంలో శాంతి, మానవవికాసానికి బాటలుపరిచే వ్యక్తే ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు అర్హుడని సోమవారం ఉదయం ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు సమసిపోయేలా ఇమ్రాన్ నిర్మాణాత్మక చర్యలు చేపట్టారని పాక్ పార్లమెంట్లో సమాచార మంత్రి ఫవాద్ చౌధురి ఇటీవల తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా తమ చెరలో ఉన్న భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ను జెనీవా తీర్మానాలకు అనుగుణంగా శాంతి సందేశం పంపే క్రమంలో భారత్కు సురక్షితంగా అప్పగించామని ఇమ్రాన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. (అభినందన్ విడుదల.. ఇమ్రాన్ ఎక్కడ?) పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ గత వారం పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించడం, పాక్ ప్రతిదాడులతో చెలరేగడంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో దిగివచ్చిన పాక్ తమ నిర్బంధంలో ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్ను అప్పగించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. -
నోబెల్ శాంతి పురస్కారానికి ట్రంప్ నామినేట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. జపాన్ ప్రధాని షింజో అబే ఆయన పేరును నోబెల్ కమిటీకి సిఫారసు చేసినట్లు ట్రంప్ శుక్రవారం వెల్లడించారు. ఉత్తర కొరియాతో శాంతి చర్చలు జరిపినందుకు షింజో అబే తనను ఈ పురస్కారానికి నామినేట్ చేసినట్టు ట్రంప్ తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ షింజో అబే తనకు ఐదే పేజీల ఉత్తరాన్ని కూడా రాసినట్లు చెప్పారు. జపాన్ ప్రజల తరఫున తనను ఈ పురస్కారానికి నామినేట్ చేశారని, తనకు నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వాల్సిందిగా నోబెల్ కమిటీని కోరుతున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారని ట్రంప్ తెలిపారు. ఈ విషయమై షింజో అబేకి ధన్యవాదాలు తెలిపినట్టు ట్రంప్ ప్రకటించారు. జపాన్ ప్రధాని సిపారసుపై అమెరికా అధ్యక్షుడు స్పందిస్తూ.. ‘‘గతంలో ఈ పురస్కారాన్ని బరాక్ ఒబామాకు ఇచ్చారు. ఆయనకు పురస్కారాన్ని ఎందుకు ఇచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ప్రపంచ శాంతి కోసం నేను ఎంతో కృషి చేశాను. వేలాది మంది ప్రాణాలను కాపాడాను. సిరియాలో 30 లక్షల మంది ప్రజల ఊచకోతను ఆపాను. దీని గురించి ఎవరూ మాట్లాడటంలేదు.’’ అని అభిప్రాయపడ్డారు. -
స్త్రీలోక సంచారం
బర్మా రాజకీయ నాయకురాలు, తిరుగుబాటు యోధురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్సాన్ సూచీకి 2009లో ఇచ్చిన ‘ది అంబాసిడర్ ఆఫ్ కన్సైన్స్ అవార్డు’ను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఉపసంహరించుకుంది. మానవహక్కుల కోసం ఒకప్పుడు బర్మా నియంత ప్రభుత్వంతో అలుపెరగక పోరాడిన సూచీ.. బర్మాలో రొహింగ్యా ముస్లింల ఊచకోత జరుగుతుంటే.. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా చూస్తూ మిన్నకుండి పోయారనీ, ఆ ధోరణి.. ఒకప్పుడు ఆమె పాటించిన విలువలకు వెన్నుపోటు పొడవడమేనని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వ్యాఖ్యానించింది. అయితే అవార్డును వెనక్కు తీసుకోవడం వల్ల తనకు వచ్చిన నష్టమేమీ లేదని సూచీ తిరుగు సమాధానం ఇచ్చారు. భారత ఎన్నికల సంఘం తొలిసారిగా.. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్గఢ్లో అందరూ మహిళలే ఉండే ఐదు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసింది. స్థానిక భాషలో ‘స్నేహితురాలు’ అనే అర్థం వచ్చే ‘సంఘ్వారీ’ అనే పేరును ఈ ప్రత్యేక మహిళా పోలింగ్ బూత్లకు పెట్టింది. మహిళలు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకునే ఈ బూత్లలో ప్రిసైడింగ్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, భద్రతా సిబ్బంది.. అంతా మహిళలే కావడంతో.. మావోయిస్టు ప్రభావం ఉన్న ప్రాంతాలైనప్పటికీ మహిళలు ధైర్యంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇలాంటి బూత్లనే మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరాం, తెలంగాణల ఎన్నికల్లో కూడా ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. హవాయి రాష్ట్రం నుంచి అమెరికన్ ‘కాంగ్రెస్’కు నాలుగుసార్లు ఎన్నికైన తులసీ గబ్బార్డ్ (37) వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో (2020) పోటీ చేయబోతున్నట్లు లాస్ ఏంజెలిస్లో జరిగిన ఒక సదస్సులో ఇండియన్ అమెరికన్ సంపత్ శివాంగి ప్రకటించారు. తులసి తల్లిదండ్రులకు భారతదేశంతో ఏవిధమైన అనువంశిక సంబంధాలూ లేనప్పటికీ ఆమె తల్లి.. హైందవ ధర్మాలను, ఆచారాలను పాటించడంతో తులసి కూడా తన పద్దెనిమిదవ ఏట నుంచీ హిందుత్వానికి ఆకర్షితురాలై, భారతీయురాలిగా పరిగణన పొందుతున్నారు. కాగా, తను అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడనున్నట్లు డాక్టర్ సంపత్ చేసిన ప్రకటనను తులసి ఖండించడం గానీ, నిర్ధారించడం గానీ చేయలేదు. -
శాంతి యోధులు
-
లైంగికహింసపై పోరాటానికి నోబెల్
ఓస్లో: ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అంతర్యుద్ధాలు జరుగుతున్న కల్లోలిత ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న లైంగిక హింసపై అలుపెరుగని పోరు జరుపుతున్న ఇద్దరికి ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. కాంగోకు చెందిన వైద్యుడు డెనిస్ మక్వీజ్(63), ఇరాక్లోని యాజిది తెగకు చెందిన యువతి నదియా మురాద్(25)లు ఈ ప్రతిష్టాత్మక గౌరవం పొందారు. యుద్ధాల్లో లైంగిక హింసను ఒక ఆయుధంగా వాడుకోకుండా నిరోధించేందుకు ఈ ఇద్దరు ఎంతో పోరాడారని నోబెల్ ఎంపిక కమిటీ ప్రశంసించింది. ఈ అవార్డుల ప్రకటనను అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్య సమితి స్వాగతించాయి. ‘యుద్ధ సమయాల్లోనూ మహిళల హక్కులు, భద్రతను గుర్తించి కాపాడితేనే శాంతియుత ప్రపంచం సాకారమవుతుంది’ అని కమిటీ చైర్మన్ బెరిట్ రీస్ అండర్సన్ వ్యాఖ్యానించారు. యుద్ధాలు, సాయుధ దళాల సంఘర్షణల్లో లైంగిక హింస కట్టడికి పోరాడిన మక్వీజ్ జాతీయంగా, అంతర్జాతీయంగా పేరు గడించారని పేర్కొన్నారు. మక్వీజ్, మురాద్ తమ వ్యక్తిగత జీవితాలను పణంగా పెట్టి లైంగిక నేరాలపై పోరాడారని కొనియాడారు. కాంగోలో యుద్ధ సమయాల్లో లైంగిక హింసకు గురైన మహిళలు శారీరక, మానసిక క్షోభ నుంచి కోలుకునేలా మక్వీజ్ గత రెండు దశాబ్దాలుగా సేవ చేస్తున్నారు. 1999లో తాను స్థాపించిన ఆసుపత్రిలో వేలాది మంది బాధితులకు చికిత్స అందించారు. ‘డాక్టర్ మిరాకిల్’గా పిలిచే మక్వీజ్..యుద్ధ సమయాల్లో మహిళలపై దాష్టీకాలను నిర్మొహమాటంగా ఖండించారు. 2014లో ఐఎస్ ఉగ్రవాదుల చేతిలో అపహరణకు గురైన మురాద్..మూడు నెలల తరువాత వారి చెర నుంచి తప్పించుకుంది. ఉగ్రవాదులు లైంగిక బానిసలుగా చేసుకున్న వేలాది మంది యాజిది మహిళలు, చిన్నారుల్లో మురాద్ కూడా ఒకరు. హాలీవుడ్ను కుదిపేసిన ‘మీటూ’ ఉదంతం వెలుగు చూసి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా లైంగిక నేరాలపై పోరాడి న వారికి నోబెల్ శాంతి బహుమతి దక్కడం విశేషం. వెల్లువెత్తిన అభినందనలు.. మక్వీజ్, మురాద్ల ధైర్య సాహసాలను యూరోపియన్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్, జర్మనీ చాన్స్లర్ ఎంజెలా మెర్కెల్ కొనియాడారు. మక్వీజ్కు నోబెల్ దక్కిన వార్త వెలువడిన వెంటనే ఆయన ఆసుపత్రి ప్రాంగణంలో సంబరాలు మిన్నంటాయి. మురాద్కు నోబెల్ బహుమతి రావడం.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడిన ఇరాక్ పౌరులందరికీ గర్వకారణమని ఆ దేశ అధ్యక్షుడు బర్హాం సలేహ్ అన్నారు. ఉగ్రవాదులకు ఇది చెంపపెట్టు అని, లైంగిక హింసకు గురైన బాధితుల పట్ల ఇరాక్ ప్రభుత్వం మరింత దృష్టిసారిస్తుందని ఆశిస్తున్నట్లు యాజిది ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. మురాద్, మక్వీజ్లు కాకుండా ఈ అవార్డుకు అర్హులు మరొకరు లేరని ఐరాస మానవహక్కుల హైకమిషనర్ మిచెల్ బ్యాచ్లెట్ కితాబిచ్చారు. మరోవైపు, కాంగో ప్రభుత్వం మక్వీజ్ను అభినందిస్తూనే, ఆయన తన సేవలను రాజకీయం చేశారని విమర్శించింది. బాధితురాలే నాయకురాలై.. నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న ఇరాక్కు చెందిన యాజిదీ యువతి మురాద్ నదియా (25)ది పోరాట గాథ. 2014లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఉత్తర ఇరాక్లోని ఓ గ్రామంపై తెగబడ్డారు. మైనారిటీలైన కుర్దులుండే ఈ గ్రామంపై దాడిచేసి.. కనబడ్డ మగవారిని చంపేశారు. మహిళలు, చిన్నారులను ఎత్తుకెళ్లారు. వారిలో మురాద్ నదియా (25) ఒకరు. వీరిని తీసుకెళ్లిన ఐఎస్ ఉగ్రవాదులు మహిళలు, చిన్నారులని తేడా లేకుండా అందరిపై దారుణంగా, కిరాతకంగా వ్యవహరించారు. లైంగిక బానిసలుగా తమ వద్ద పెట్టుకుని దారుణమైన అకృత్యాలకు పాల్పడ్డారు. మూడు నెలలపాటు వీరి అరాచకాలను భరించిన నదియా.. అతికష్టం మీద తప్పించుకున్నారు. ఐసిస్ నుంచి తప్పించుకుని శరణార్థుల శిబిరానికి చేరుకున్న తర్వాత.. ఆమె జీవితంలో రెండో ఇన్నింగ్స్ మొదలైంది. తన లాగా మరెవరూ ఈ కిరాతక కూపంలో ఉండకూడదని నిశ్చయించుకున్నారామె. శిబిరంలో బ్రిటీష్ లాయర్, హక్కుల కార్యకర్త అమల్ క్లూనీ పరిచయం ఆమె ఆశయానికి మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. అదే.. యాజిదీలకు జరుగుతున్న అన్యాయం ప్రపంచానికి వివరించేలా చేసింది. ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై నదియా.. తన గళం విప్పే అవకాశాన్ని కల్పించింది. దీని ఫలితంగానే.. దాదాపు నాలుగున్నర లక్షల మంది బాధితులకు ఐసిస్ నరకకూపం నుంచి విముక్తి లభించింది. ‘ద లాస్ట్ గర్ల్’ తన తోటి యాజిదీలు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితుల గురించి ‘ద లాస్ట్ గర్ల్’ పేరుతో నదియా ఒక పుస్తకాన్ని రాశారు. 2017లో ఈ పుస్తకం ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి అమల్ క్లూనీ ముందుమాట రాసి మరోసారి నదియాకు మద్దతుగా నిలిచారు. ఇరాక్లో ఐసిస్ దురాగతాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకటించడం నదియా పోరాట ఫలితమే. ‘నాకు అప్పుడు 21 ఏళ్లు. 2014, జూలైలో నన్ను ఐసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అడ్డొచ్చినందుకు అమ్మ, ఆరుగురు సోదరులను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత నాతో పాటు మేనకోడళ్లను కూడా లైంగిక బానిసలుగా మోసూల్ పట్టణంలో మాలాగే.. ఓ 30 మంది బాధితులు ఉన్న శిబిరంలో పడేశారు. రోజూ ఓ వంద మంది ఉగ్రవాదులు వచ్చేవారు. వారికి నచ్చిన వారిని ఎంపిక చేసుకుని రాక్షసానందం పొందేవారు. చిన్న పిల్లలైన నా మేనకోడళ్లపైనా ఆ దుర్మార్గులు కనికరం చూపలేదు. ఈ అకృత్యాలను తట్టుకోలేక ఓ రోజు వారికి ఎదురు తిరిగాను. దీంతో కోపోద్రిక్తుడైన ఐసిస్ నాయకుడొకడు నన్ను తీవ్రంగా హింసించాడు. మమ్మల్ని చంపేయని అడిగాను. కానీ వాడలా చేయలేదు. ఇలా హింసించడంలోనే ఆనందం ఉందన్నాడు. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను’ అని ఐఎస్లో లైంగిక బందీగా ఉన్నప్పటి దారుణాలను నదియా వివరించారు. డాక్టర్ ‘మిరాకిల్’ మక్వీజ్ డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో.. రాజకీయ హింస, అధికార, ప్రభుత్వ వ్యతిరేక దళాల మధ్య అంతర్యుద్ధంతో రావణకాష్టంలా మారింది. దశాబ్దాలుగా ఇది కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం కారణంగా లెక్కలేనన్ని కుటుంబాలు అస్తిత్వాన్ని కోల్పోయాయి. ఇది చాలదన్నట్లు రెండు వర్గాలు మహిళలను తమ ఆయుధాలుగా వాడుకుంటున్నాయి. ఈ సంఘర్షణలో లెక్కలేనంత మంది మహిళలు లైంగిక హింసకు గురయ్యారు. అయితే.. లైంగిక హింస బాధితులను ఆదుకునేందుకు డాక్టర్ డెనిస్ మక్వీజ్ రెండు దశాబ్దాలుగా అలుపెరగని ప్రయత్నం చేస్తున్నారు. 1999లో దక్షిణ కివూలో పంజీ హాస్పిటల్ను స్థాపించి.. అత్యాచార బాధితులకు అండగా నిలిచారు. తన వద్దకు వచ్చే బాధితులను ఆదుకునేందుకు ఈ డాక్టర్ రోజుకు 18 గంటల పాటు పనిచేసిన సందర్భాలు లెక్కలేనన్ని. తిరుగుబాటుదారులు ఎంత క్రూరంగా అత్యాచారాలు చేసే వారంటే కొందరు మహిళలకు ఒకటి కంటే ఎక్కువసార్లు శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి వచ్చేది. కాంగో మహిళలకు మక్వీజ్ అందిస్తున్న సేవల గురించి ‘ద గ్లోబ్ అండ్ మెయిల్’ పత్రిక ద్వారా ప్రపంచానికి తెలిసింది. అయితే.. తమ చేతుల్లో అత్యాచారానికి గురైన మహిళలకు డాక్టర్ అండగా నిలుస్తున్నాడనే కక్షతో ఉగ్రవాదులు ఆయన్ను హతమార్చడానికి ప్రయత్నించారు. 2012లో తన ఇంటిపై దాడి చేసినపుడు అక్కడి నుంచి తప్పించుకుని యూరోప్ వెళ్లారు. ఆయన లేని సమయంలో పంజీ ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలు జరగక బాధిత మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆరునెలల తర్వాత తిరిగి వచ్చిన మక్వీజ్కు బుకావ్ విమానాశ్రయం 21 మైళ్ల దూరమున్న పంజీ ఆసుపత్రి వరకు ప్రజలు.. ముఖ్యంగా మహిళలు స్వాగతం పలికారు. యూరప్లో ఉన్న సమయంలోనే మక్వీజ్.. ఐరాస వేదికగా కాంగో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ప్రపంచానికి వెల్లడించారు. ‘డాక్టర్ మిరాకిల్’గా సుపరిచితుడైన ఆయన.. మహిళలపై లైంగిక దాడిని ‘భారీ విధ్వంసక ఆయుధం’గా అభివర్ణించారు. శాంతి బహుమతి ప్రకటన జరిగినపుడు కూడా ఆయన తన విధుల్లోనే (శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారు) ఉన్నారు. అయితే నోబెల్ శాంతి బహుమతికి డాక్టర్ మక్వీజ్ ఆరుసార్లు నామినేట్ కావడం విశేషం. -
‘హింసించడంలోనే ఆనందమని వెకిలిగా నవ్వాడు’
ఒకప్పుడు ఐసిస్ బానిసగా మృగాళ్ల కబంధ హస్తాల్లో చిత్రవధ అనుభవించింది... కుటుంబాన్ని కోల్పోయింది.. మూడు నెలల పాటు తనపై కొనసాగిన అత్యాచారాలను తట్టుకోలేక ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించింది.. కానీ నాడు అలా చేసి ఉంటే ఆమె పేరు ప్రపంచానికి తెలిసేదే కాదు.. ఆమె లాంటి ఎందరో లైంగిక బానిసలకు విముక్తి లభించేదీ కాదు.. కష్టాల కడలిని దాటి లైంగిక బానిస నుంచి నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా గుర్తింపు పొందిన నదియా మురాద్ వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం. లైంగిక హింసకు వ్యతిరేకంగా.. సాక్షి వెబ్డెస్క్ ప్రత్యేకం : లైంగిక హింసను అరికట్టేందుకు కృషి చేసినందుకు, అత్యాచార బాధితులకు అండగా నిలిచినందుకు ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతికి నదియా మురాద్ ఎంపికయ్యారు. ఆఫ్రికాకు చెందిన గైనకాలజిస్ట్ డెనిస్ ముక్వేజ్తో సంయుక్తంగా ఓస్లోలో డిసెంబరు 10న ఆమె శాంతి పురస్కారం అందుకోనున్నారు. అధికార దాహంతో వివిధ దేశాల్లో అంతర్యుద్ధానికి తెగబడుతున్న ఐసిస్ వంటి ఉగ్రమూకల రాక్షసక్రీడ(లైంగిక హింస)కు వ్యతిరేకంగా చేసిన పోరాట ఫలితంగానే వీరిద్దరిని అవార్డు వరించింది. డెనిస్ బాధితులకు అండగా నిలిస్తే నదియా స్వయంగా ఆ బాధలన్నీ అనుభవించారు. ఇరాక్కు చెందిన యాజాదీ యువతిగా తాను ఎదుర్కొన్న పరిస్థితులను ప్రపంచానికి తెలియజేసి తన లాంటి ఎంతో మందిని ఆ నరకం నుంచి విముక్తులను చేసేందుకు తన వంతు కృషి చేశారు... చేస్తూనే ఉన్నారు. ఆ మూడు నెలలు నరకం.. ‘ నాకు అప్పుడు 21 ఏళ్లు. 2014, జూలైలో లో నన్ను కిడ్నాప్ చేశారు. ఆ సమయంలో అడ్డొచ్చినందుకు మా అమ్మతో పాటు నా ఆరుగురు సోదరులను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత నాతో పాటు, నా మేనకోడళ్లను కూడా లైంగిక బానిసలుగా మెసూల్ పట్టణానికి తీసుకువెళ్లి ఇస్లాం మతంలోకి మార్చారు. మాలాంటి ఓ ముప్పై మంది బాధితులు ఉన్న శిబిరంలో మమ్మల్ని పడేశారు. రోజూ సుమారు అక్కడికి ఓ వంద మంది ఉగ్రవాదులు వచ్చేవారు. వారికి నచ్చిన వారిని ఎంపిక చేసుకుని రాక్షసానందం పొందేవారు. చిన్న పిల్లలైన నా మేనకోడళ్లపై కూడా వాళ్లు కనికరం చూపలేదు. ఈ అకృత్యాలను తట్టుకోలేక ఓ రోజు వారికి ఎదురు తిరిగాను. దీంతో కోపోద్రిక్తుడైన ఐసిస్ నాయకుడొకడు నన్ను తీవ్రంగా కొట్టాడు. చిత్రవధ చేశాడు. ఇలా హింసించే బదులు మమ్మల్ని చంపేయని అడిగాను. కానీ వాడలా చేయలేదు సరికదా ఇలా హింసించడంలోనే ఆనందం ఉందంటూ వెకిలిగా నవ్వాడు. ఇదంతా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ నా లాంటి ఎంతో మంది యువతుల జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి కదా. ఇంత పిరికిగా ఆలోచిస్తే లాభం లేదనుకుని తప్పించుకునే మార్గం కోసం అన్వేషించాను. ఆ సమయంలో మెసూల్లోని ఓ ముస్లిం కుటుంబం నాకు సహాయం చేసింది. అలా మూడు నెలల తర్వాత ఆ నరక కూపం నుంచి ఎలాగోలా బయటపడి శరణార్థుల శిబిరానికి చేరుకున్నాను. అయినా సిరియా- ఇరాక్ వంటి దేశాల్లో అంతర్యుద్ధం కొనసాగుత్నుంత కాలం యాజాదీల పరిస్థితి ఇంతకంటే మెరుగ్గా ఉంటుందా అని నాకు నేనే సమాధానం చెప్పుకొన్నాను’ అంటూ యాజాదీగా పుట్టినందుకు ఐసిస్ ఉగ్రమూకల అకృత్యాలకు బలౌతున్న కుర్దిషియన్ వర్గానికి చెందిన యాజాదీ యువతుల దీన పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు నదియా. ఆమె పరిచయంతో.. పోరాటం ఉధృతం శరణార్థుల శిబిరానికి చేరిన తర్వాత నదియా తమ బాధలను బాహ్య ప్రపంచానికి చెప్పే అవకాశం లభించింది. బ్రిటీష్ లాయర్, హక్కుల కార్యకర్త అమల్ క్లూనీ పరిచయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అమల్ ఇచ్చిన ప్రోత్సాహమే... తమకు జరుగుతున్న అన్యాయాన్ని నదియా ప్రపంచానికి చాటిచెప్పేలా చేసింది. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై తన గళం విప్పే అవకాశాన్ని కల్పించింది. అలా చేయడం ద్వారా సుమారు నాలుగున్నర లక్షల మంది బాధితులకు విముక్తి లభించింది. ‘ద లాస్ట్ గర్ల్’ ..బై నదియా మురాద్ తాను, తన వంటి యాజాదీలు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితుల గురించి ద లాస్ట్ గర్ల్ పేరిట నదియా ఒక పుస్తకాన్ని రాశారు. 2017లో ఆవిష్కరించిన ఈ పుస్తకానికి అమల్ క్లూనీ ముందుమాట రాసి మరోసారి నదియాకు మద్దతుగా నిలిచారు. అదే ఏడాది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇరాక్లో ఐసిస్ దురాగతాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించడంతో నదియా పోరాటానికి ఫలితం దక్కినట్లైంది. కన్నీళ్లే కాదు.. ఆనంద భాష్పాలు ఉంటాయని చెప్పిన ప్రియనేస్తం చిన్న వయస్సులోనే లైంగిక బానిసగా మారిన నదియా బహుశా తన జీవితంలో పెళ్లి అనే వేడుక ఉంటుందని అస్సలు ఊహించలేదేమో. ఎందుకంటే అప్పటి వరకు మృగాళ్లనే చూసిన నదియాకు అబిద్ షముదీన్ పరిచయం కాలేదు. అతడు కూడా యాజాదీ హక్కుల కార్యకర్త. ఎంతోమంది బాధితుల కష్టాలను కళ్లారా చూసిన వ్యక్తి. నదియా వ్యక్తిత్వానికి ముగ్ధుడైన అబిద్ ఆమెను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే తన ఆలోచనను ఆమెతో పంచుకున్నాడు. అబిద్పై ఉన్న అభిమానం ఆమె చేత సరేనని చెప్పించింది. ఈ క్రమంలోనే ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట త్వరలోనే వివాహబంధంతో ఒక్కటయ్యేందుకు సిద్ధమయ్యారు. ‘మా యాజాదీలు అనుభవిస్తున్న కష్టాలే మమ్మల్ని దగ్గర చేశాయి. వారికోసం ఇప్పటి నుంచి ఒక్కటిగా కలిసి పోరాడతాం అంటూ తనకు కాబోయే భర్త గురించి తన సోషల్ మీడియా పేజీలో రాసుకొచ్చారు 25 ఏళ్ల నదియా మురాద్. జీవితంలో కన్నీళ్లే కాదు ఆనంద భాష్పాలు కూడా ఉంటాయని చాటి చెప్పిన తన ప్రియనేస్తం అబిద్తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. -
డెనిస్, నదియాలకు నోబెల్ శాంతి బహుమతి
ఓస్లో : ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతికి డెనిస్ ముక్వేజ్, నదియా మురాద్లు ఎంపికయ్యారు. లైంగిక హింసను అరికట్టేందుకు చేసిన కృషికి, లైంగిక దాడి బాధితులకు చేసిన సహాయానికి గాను నోబెల్ శాంతి బహుమతి లభించింది. అంతర్యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న సెక్సువల్ వాయిలెన్స్కు వ్యతిరేకంగా ఈ ఇద్దరూ పోరాటం చేశారు. డెనిస్ ముక్వేజ్ ఆఫ్రికా ఖండంలోని డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు చెందిన గైనకాలజిస్ట్. ఆయన లైంగిక వేధింపుల బాధితులకు అండగా ఉంటూ వారికి వైద్యసహాయం అందించారు. ఇరాన్లోని యాజిది (నాన్ ముస్లిం) వర్గానికి చెందిన నదియా మానవ హక్కుల కోసం పోరాడారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కారణంగా తనపై జరిగిన లైంగిక హింసను, ఇతర యాజిది యువతులు అనుభవిస్తున్న నరకం గురించి ప్రపంచానికి తెలియజేశారు. యాజిది యువతులపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు పాటుపడ్డారు. యుద్ధాల్లో లైంగిక హింసను ఆయుధంగా ఉపయోగించడాన్ని నిర్మూలించేందుకు డెనిస్, నదియా మురాద్లు చేసిన కృషిని నోబెల్ కమిటీ ప్రశంసిస్తూ పురస్కారాన్ని ప్రకటించారు. గతేడాది నోబెల్ శాంతి బహుమతి 2017కు అంతర్జాతీయ అణు నిరాయుధీకరణ సంస్థ (ఐసీఏఎన్) ఎంపికయిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా అణ్వాయుధాల నిర్మూలనకు ఈ సంస్థ చేస్తున్న కృషిని నోబెల్ కమిటీ ప్రశంసిస్తూ పురస్కారాన్ని ప్రకటించింది. -
అవార్డు విషయంలో అంగ్సాన్ సూకీకి ఊరట
యంగూన్ : నోబెల్ శాంతి పురస్కారాన్ని వెనక్కి తీసుకునే విషయంలో అంగ్ సాన్ సూకీకి ఊరట లభించింది. సూకీకి ప్రదానం చేసిన నోబెల్ శాంతి బహుమతిని వెనక్కి తీసుకోబోవడం లేదంటూ నోబెల్ ప్రైజ్ కమిటీ ప్రకటించింది. ఈ విషయం గురించి నార్వే నోబెల్ కమిటీ కార్యదర్శి ఓలావ్ నోజెలాడ్స్.. ఒక్కసారి ఎవరికైనా నోబెల్ పురస్కారాన్ని ప్రదానం చేస్తే దాన్ని రద్దు చేయడం.. వెనక్కి తీసుకోవడం వంటివి కుదరవని తెలిపారు.అలా చేయడం నోబెల్ అవార్డుల నియమ నిబంధనలకు వ్యతిరేకమని వివరించారు. అంతేకాక స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకోసం అంగ్ సాన్ సూకీ చేసిన కృషికిగాను 1991లో ఆమెకి నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. కాబట్టి ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకోవడం కుదరదని ఓలావ్ నోజెలాడ్స్ తెల్చి చెప్పారు. రోహింగ్యా ముస్లిం పట్ల మయన్మార్ అవలంబిస్తోన్న విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో మయన్మార్ ప్రభుత్వ కౌన్సిలర్గా ఉన్న అంగ్ సాన్ సూకీ తీరు పట్ల ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి కూడా అంగ్ సాన్ సూకీ తీరును తప్పుపట్టింది. ఈ సందర్భంగా పలు ప్రపంచ దేశాలు గతంలో సూకీకి ప్రదానం చేసిన గౌరవ పురస్కారాలని వెనక్కి తీసుకుంటున్నాయి. ఫలితంగా 1997లో అందుకున్న ‘ఫ్రీడమ్ ఆఫ్ ఆక్సఫర్డ్’ గౌరవ పురస్కారాన్ని సూకీ కోల్పోయారు. ఈ క్రమంలోనే 1991లో అంగ్సాన్ సూకీకి ప్రదానం చేసిన ‘నోబెల్ శాంతి పురస్కారా’న్ని కూడా వెనక్కి తీసుకోవాలనే ప్రతిపాదనలు వచ్చాయి. -
మలాలా బయోపిక్.. ఫస్ట్లుక్ ఇదే!
పాకిస్తాన్ సాహస బాలిక, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్జాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘గుల్ మకాయ్’ చిత్రం ఫస్ట్లుక్ విడుదలైంది. ప్రముఖ దర్శకుడు అంజద్ ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మలాలా పాత్రలో బాలీవుడ్ నటి రీమ్ షేక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సినిమా థీమ్ను తెలియజేసేలా ఈ ఫస్ట్లుక్ను రూపొందించారు. మలాల చేతిలో పుస్తకం పట్టుకొని ఉండగా.. పుస్తకాన్ని ఉగ్రవాదులు తగలబెట్టినట్లుగా పోస్టర్లో చూపించారు. తాలిబన్ల అరాచకాలకు ముస్లీం బాలికలు ఎలా చదువుకు దూరమయ్యారనే విషయాన్ని ఫస్ట్ లుక్లో చూపించారు. ఈ సినిమాలో మలాలా తల్లి పాత్రను దివ్య దత్తా పోషిస్తున్నారు. అలాగే ఇందులో ఓం పురి, రాగిణి ఖన్నాలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలాల తన చిన్ననాటి అనుభవాలను ‘గుల్ మకాయ్’ అనే పేరుతో డైరీ రూపంలో రాసుకున్నారు. ఉర్దూలో రాసుకున్న ఈ పుస్తకానికి సంబంధించిన కథనం బీబీసీలో ప్రసారం చేశారు. ఇప్పుడు అదే పేరుతో మలాల బయోపిక్ తెరకెక్కనుంది. గతంలో మలాల, తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలను ‘ఐయామ్ మలాలా’ అన్న పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. పాకిస్తాన్, స్వాత్లోయలో బాలికల చదువుకోవడాన్ని తాలిబన్లు నిషేదించినా, 11 ఏళ్ల వయస్సులోనే మలాలా విద్యా హక్కు కోసం పోరాటం చేశారు. 2012 లో ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తినందకు ఆమెపై తీవ్రవాదులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చిన్నారుల విద్యకోసం మలాలా కృషిచేస్తున్నారు. -
ప్రపంచాన్ని జయించాలని ఉంది: ట్రంప్
వాషింగ్టన్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నోబెల్ శాంతి బహుమతిపై తనకు పెద్దగా ఆసక్తి లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రపంచాన్ని జయించాలనే కోరిక ఉందని, అదే నాకు గొప్ప బహుమతి అవుతుందని మనసులోని మాటను వెల్లడించారు. మీరు నోబెల్ శాంతి బహుమతికి అర్హులేనని భావిస్తున్నారా అని ఓ విలేకరి అడిగి ప్రశ్నకు ట్రంప్ సమాధానమిస్తూ.. ‘ప్రతి ఒక్కరికి బహుమతి పొందాలని ఉంటుంది. ఎవరూ కూడా మాకు వద్దు అని చెప్పరు. నాకు మాత్రం ఆసక్తి లేదు. నా కోరిక ఏంటంటే.. ప్రపంచాన్ని జయించాలి. అదే నాకు పెద్ద బహుమతి. మనం ప్రపంచం గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటాం. అందుకే నాకు ప్రపంచ విజయాన్ని బహుమతిగా తీసుకోవాలని ఉంద’ని పేర్కొన్నారు. ఇప్పటికే నోబెల్ శాంతి బహుమతికి ట్రంపే అర్హుడని దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ వ్యాఖ్యానించారు. ఉత్తరకొరియాతో నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించడంలో ట్రంప్ దౌత్యం ఫలించటంతో ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో సమావేశం కావాలనుకోవడం ప్రపంచానికి మంచి పరిణామం అని అభిప్రాయ పడ్డారు. ఇలాంటి ఆలోచన గత కొన్నేళ్లుగా ఎవరూ చేయలేదు. ఈ సమావేశంతో ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు మంచి జరుగుతుందని భావిస్తున్నానన్నారు. ‘ఈ చర్చలు సఫలం కావడానికి సహాయం అందిస్తోన్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు ధన్యవాదాలు తెలిజేస్తున్నాను. మేము చైనాతో వర్తకాన్ని కొనసాగిస్తున్నాం. ఇరు దేశాలు స్నేహభావంతో ఒకరికొకరు సాయం అందించుకుంటామ’అని ట్రంప్ పేర్కొన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడితో మాట్లాడిన విషయంపై స్పందిస్తూ.. మూడు దేశాల అగ్రనేతలు ఎక్కడ కలుద్దాం అనే విషయంపై మాత్రమే చర్చించామని తెలిపారు. జపాన్ ప్రధాని షిజో అబే, జిన్పింగ్, మూన్లతో చర్చించి సమావేశమయ్యే ప్రాంతం పేరు వెల్లడిస్తామని ట్రంప్ తెలిపారు. -
ట్రంప్నకు నోబెల్ శాంతి బహుమతి..??
వాషింగ్టన్ : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నోబెల్ శాంతి బహుమతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(71)ను వరించనుందా?. ఉత్తరకొరియాతో నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించడంలో ట్రంప్ దౌత్యానికి ఆయన్ను రిపబ్లికన్ నాయకులు నోబెల్ శాంతి బహుమతికి బుధవారం నామినేట్ చేశారు. శాంతి బహుమతికి ట్రంప్ పేరు నామినేట్ కావడంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ తెరపైకి లేచింది. గత శనివారం మిచిగాన్లో ఓ ర్యాలీకి హాజరైన ట్రంప్ను ఉద్దేశించి ఆయన అభిమానులు నోబెల్..!! నోబెల్..!! అంటూ నినాదాలు చేశారు. వారిని ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్(నవ్వుతూ) ‘ నా కర్తవ్యం నేను నిర్వహించాను’ అన్నారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంపే అర్హుడని దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ చేసిన వ్యాఖ్యలను మంగళవారం ట్రంప్ సమర్థించారు. ఉత్తరకొరియాతో నేను శాంతినే కోరుకున్నానని అన్నారు. కాగా, అణ్వాయుధాగారాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ శాంతి గ్రామం పాన్ మున్ జోమ్లో దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్తో చరిత్రాత్మక చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ అమెరికా అధ్యక్షులుగా పని చేసిన నలుగురికి నోబెల్ శాంతి పురస్కారాలు లభించాయి. వీరిలో థియోడర్ రూజ్వెల్ట్, ఉడ్రో విల్సన్, జిమ్మి కార్టర్, బరాక్ ఒబామాలను శాంతికాముకులుగా గుర్తించి అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. -
నేను కాదు.. ట్రంప్ అర్హుడు
సియోల్/వాషింగ్టన్: ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ను శాంతి చర్చలకు ఒప్పించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడని దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ వ్యాఖ్యానించారు. తనకు నోబెల్ శాంతి బహుమతి అక్కర్లేదనీ, శాంతి చాలని వ్యాఖ్యానించారు. కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొల్పే దిశగా ఉభయకొరియాల అధ్యక్షులు కిమ్, మూన్ల మధ్య శుక్రవారం చరిత్రాత్మక శిఖరాగ్ర సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ద.కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే జుంగ్ భార్య మూన్కు అభినందనలు తెలుపుతూ లేఖరాశారు. ఇరుదేశాల మధ్య శాంతిస్థాపనకు చేసిన కృషికి ఈ ఏడాది అక్టోబర్లో ప్రకటించే నోబెల్ బహుమతిని మూన్ అందుకునే అవకాశముందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో నోబెల్ శాంతి బహుమతికి తనకన్నా ట్రంపే అర్హుడని మూన్ సమాధానమిచ్చారు. టైమ్ జోన్ మార్చుకోనున్న ఉ.కొరియా ద.కొరియాకు సమానంగా తమ టైమ్జోన్ను 30 నిమిషాలు ముందుకు జరపనున్నట్లు ఉ.కొరియా అధికారిక వార్తాసంస్థ కేసీఎన్ఏ తెలిపింది. ఉభయకొరియాల మధ్య ఇటీవల స్నేహపూర్వక సంబంధాలు నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 2015లో ఉ.కొరియా తమ టైమ్జోన్ను అరగంట వెనక్కు జరిపింది. -
శాంతికాముకులకు... నోబెల్ ‘సలామ్’
సాక్షి నాలెడ్జ్ సెంటర్: మానవాళి మంచి కోరుతూ, మనిషి మనుగడకు భరోసాను అడుగుతూ, అణ్వస్త్రమనేది లేని రేపటి ప్రపంచాన్ని కాంక్షిస్తున్న లక్షలాది మంది శాంతి కాముకులకు దక్కిన గౌరవమే ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి. అణ్వాయుధాల మూలంగా మానవాళికి పొంచి ఉన్న పెనుముప్పుపై ప్రపంచవ్యాప్తంగా నిరంతరం ప్రచారం చేస్తూ, వివిధ దేశాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతూ... స్థాపించిన పదేళ్లకే నోబెల్ శాంతి బహుమతి సాధించింది ఐ కెన్. ఇది ఒక వ్యక్తి కృషికో, సంస్థకో లభించిన గుర్తింపు కాదు. మనుషులంతా బాగుండాలని కోరుకోవడమే కాకుండా ఆ దిశగా తమకు తోచిన రీతిలో ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ దక్కిన గౌరవం. భారత్ నుంచి మూడు సంస్థల భాగస్వామ్యం మందుపాతరలపై నిషేధం కోరుతూ వచ్చిన స్వచ్ఛంద ఉద్యమం మూలంగా 1997లో వాటిని నిషేధిస్తూ అంతర్జాతీయ ఒడంబడిక జరిగింది. దీని నుంచి స్ఫూర్తి పొందిన అణుయుద్ధ నివారణకు పనిచేసే అంతర్జాతీయ డాక్టర్ల సంఘం... అణ్వాయుధ నిర్మూలనను కోరుతూ ఉద్యమాన్ని నిర్మించాలని తీర్మానించింది. ఫలితంగా 2007 ఏప్రిల్ 30న ఆస్ట్రియాలోని వియన్నాలో జరిగిన సమావేశాలతో ఐకన్ పురుడు పోసుకుంది.. ఐ కెన్లో 101 దేశాల నుంచి 468 సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థల నుంచి అంతర్జాతీయ సంస్థల దాకా వీటిలో ఉన్నాయి. ఇండియన్ డాక్టర్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఫర్ పీస్, డిసార్మమెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్... భారత్ నుంచి ఐకన్లో భాగస్వాములుగా ఉన్న మూడు సంస్థలివి. అంతర్జాతీయ స్టీరింగ్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ఐకన్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. బీట్రిస్ ఫిన్ 2014 జూలై నుంచి కార్యనిర్వాహక డైరెక్టర్గా ఉన్నారు. స్వచ్ఛంద సంస్థలు ఏవైనా ఐ కెన్లో భాగస్వాములు కావొచ్చు. ప్రవేశ, వార్షిక రుసుములు ఏవీ ఉండవు. లక్ష్యం... పెద్ద ఎత్తున ప్రాణనష్టం కలిగించే రసాయన, జీవ ఆయుధాలు, మందుపాతరల వాడకాన్ని నిషేధిస్తూ స్పష్టమైన అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి. కానీ మానవ మనుగడకే తీవ్ర ముప్పు అని నిరూపించే సాక్ష్యాలు ఉన్నా, హిరోషిమా, నాగసాకిలో జరిగిన అణు విధ్వంసాన్ని ప్రపంచం కళ్లారా చూసినా, అణ్వస్త్ర నిర్మూలన దిశగా పెద్దగా ముందడుగు పడలేదు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం (ఎన్పీటీ) 1970లో కుదిరినా... అది సమూల నిర్మూలకు ఉద్దేశించింది కాదు. 1967 ముందు అణ్వాయుధాలు అభివృద్ధి చేసుకున్న అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలను ఎన్పీటీ అణ్వస్త్ర దేశాలుగా గుర్తించింది. తర్వాత భారత్, పాకిస్తాన్, ఉత్తరకొరియాలు అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించి తాము అణ్యాయుధాలను అభివృద్ధి చేసుకున్నామని బాహటంగా ప్రకటించుకున్నాయి. ఇజ్రాయెల్ ఇలా బాహటంగా చెప్పకున్నా... అణ్వాయుధాలను కలిగి ఉంది. పైన చెప్పిన ఎనిమిది దేశాల ఉమ్మడిగా దాదాపు 15,000 వేల అణ్వస్త్ర వార్హెడ్లను కలిగి ఉన్నాయని అమెరికా సైంటిస్టులను ఉటంకిస్తూ ఐ కెన్ చెబుతోంది. ఓ వంద అణు బాంబులు వేస్తే లక్షల కొద్దీ జనం మృత్యువాతపడటమే కాకుండా... రేడియేషన్ ప్రభావం, పర్యావరణ మార్పుల కారణంగా 100 కోట్ల మంది జనం కరువుబారిన పడతారని ఐకన్ చెబుతోంది. అలాంటి దాదాపు 15,000 అణుకుంపట్లతో మనం కలిసి జీవిస్తున్నామని గుర్తుచేస్తోంది. అణ్వస్త్రాలను సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా ఐ కెన్ పనిచేస్తోంది. నోబెల్ విజేతలు డెస్మండ్ టుటు, దలైలామా, ఐరాస మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ తదితరులు ఐకన్కు మద్దతు పలికారు. ఫలించిన కృషి... ఐ కెన్, రెడ్క్రాస్ లాంటి అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న సంస్థలు దశాబ్దకాలంగా చేసిన కృషి ఈ ఏడాది ఫలించింది. 2017లో అణ్వస్త్ర నిరోధక ఒప్పందంపై చర్చలు ప్రారంభించాలని 2016 అక్టోబర్ 27న ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. 2017లో చర్చలు మొదలై జూలె ఏడో తేదీన ‘అణ్వాయుధ నిషేధ ఒప్పందం (టీపీఎన్డబ్ల్యూ)’ ఐరాస సాధారణ సభ ఆమోదం పొందింది. కనీసం 50 దేశాలు తమ చట్టసభల్లో దీనికి ఆమోదముద్ర వేసిన వెంటనే ఒప్పందం అమలులోకి వస్తుంది. అణ్వస్త్రాలను అభివృద్ధి చేయడం, పరీక్షించడం, తయారుచేయడం, కలిగి ఉండటం, సాంకేతికతను బదలాయించడం, నిల్వచేయడాన్ని టీపీఎన్డబ్ల్యూ నిషేధిస్తుంది. అయితే అణ్వస్త్ర దేశాలైన అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, భారత్, పాకిస్తాన్, ఉత్తరకొరియాలు టీపీఎన్డబ్ల్యూపై ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. ప్రధాన దేశాలు దూరంగా ఉన్నందువల్ల... రేప్పొద్దున్న ఈ అంతర్జాతీయ ఒప్పందం అమలులోకి వస్తే... అణ్వస్త్రదేశాలు ఎంతవరకు కట్టుబడి ఉంటాయనేది చెప్పలేం. మొత్తం మీద ఓ ప్రజా ఉద్య మాన్ని నిర్మించి, ఐరాసలో 122 దేశాలతో అనుకూల ఓటు వేయించిన ఐ కెన్ కృషికి ‘నోబెల్ బహుమతి’ రూపంలో తగిన గుర్తింపు లభించింది. ► ‘ఐ కెన్’కు నోబెల్ శాంతి పురస్కారం, అణ్వస్త్ర నిరాయుధీకరణ ఉద్యమానికి దక్కిన గుర్తింపు ఓస్లో: అణ్వాయుధాలను నిర్మూలించేందుకు విశేష కృషిచేస్తున్న ‘ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్–ఐ కెన్’ (అణ్వాస్త్రాల నిర్మూలనకు అంతర్జాతీయ ఉద్యమం) అనే సంస్థను 1.1 మిలియన్ డాలర్ల విలువైన నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఐ కెన్ అనేది ఒక ఉద్యమ సంస్థ. అంతర్జాతీయంగా అణ్వస్త్ర నిరాయుధీకరణను కోరుకుంటున్న వివిధ దేశాల్లోని వందలాది సంస్థల సమాహారం. స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా పనిచేసే ఐ కెన్...అణ్వాయుధాల నివారణకు ప్రపంచ దేశాలు సహకరించుకోవడంలో చోదక శక్తిగా పనిచేస్తోందని నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్వుమన్ బెరిట్ రీస్–అండర్సన్ శుక్రవారం పేర్కొన్నారు. నోబెల్ ప్రకటన అనంతరం ఐ కెన్ కార్యనిర్వాహక డైరెక్టర్ బీట్రిస్ ఫిన్ మాట్లాడుతూ ‘మా సంస్థకు లభించిన ఈ పురస్కారం అణ్వాయుధాలు కలిగిన, వాటిపై ఆధారపడే దేశాలకు ఓ సందేశం పంపుతుంది. అదేంటంటే ఆ దేశాల విధానం ఆమోదనీయం కాదు అని. భద్రత పేరుతో లక్షలాది మంది ప్రజల ప్రాణాలను అవి ప్రమాదంలో పెట్టలేవు’ అని పేర్కొన్నారు. నోబెల్ ప్రైజ్ లభించినట్లు అధికారిక ప్రకటనకంటే కొన్ని నిమిషాల ముందే తనకు ఫోన్కాల్ వచ్చిందనీ, అప్పుడు నమ్మలేదని ఫిన్ తెలిపారు. ఇటీవల ఉత్తర కొరియా వరుసగా అణ్వస్త్ర, క్షిపణి పరీక్షలు జరుపుతుండటం, ఇరాన్తో అణు ఒప్పందాన్ని రద్దుచేసుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో నోబెల్ శాంతి బహుమతి ఐ కెన్కు లభించడం గమనార్హం. -
చైనా నోటి దురుసు.. నోబెల్ ఇవ్వడం తప్పట
బీజింగ్: చైనా మరోసారి తన దుష్ప్రవర్తనను బయటపెట్టుకుంది. ఏకంగా అంతర్జాతీయ సంస్థ తమ దేశ పౌరుడికి ఇచ్చిన సత్కారాన్ని తప్పుబట్టింది. ఆ వ్యక్తికి అవార్డు ఇవ్వడం అంటే దైవ దూషణ చేసినట్లేనంటూ తనకి ఇష్టం వచ్చినట్లు ప్రకటన చేసింది. చైనాలో ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం పోరాడి జైలు శిక్షకు గురైన ప్రముఖ పోరాటయోధుడు లియు జియాబో గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయనకు జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. అయితే, క్యాన్సర్ బారిన పడిన ఆయనకు మెరుగైన వైద్యం ఇచ్చేందుకు చైనా నిరాకరించడంతోపాటు విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకునేందుకు అంగీకరించలేదు. దీంతో అంతర్జాతీయ సమాజం నుంచి చైనా ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయనకు అప్పుడప్పుడు అమెరికా, జర్మనీ నుంచి వైద్యులకు ప్రత్యేక అనుమతి ఇప్పించి వైద్యం చేయించారు. అయినప్పటికీ, ఆయన కన్నుమూశారు. దీంతో చైనా తీరు వల్లే నోబెల్ పురస్కార గ్రహీత కన్నుమూశాడంటూ తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో తన తప్పును కప్పి ఉంచుకునేందుకు అసలు ఆయనకు నోబెల్ అవార్డు ఇవ్వడమంటేనే దైవ దూషణ చేసినంత పని అంటూ అడ్డగోలు వ్యాఖ్యలు చేసింది. -
నోబెల్ శాంతి అవార్డు గ్రహీత కన్నుమూత
కమ్యునిస్టు గడ్డపై ప్రజాస్వామ్యం కోసం శాంతియుతంగా పోరాడిన కిరణం నేలరాలింది. ప్రజలకు ప్రజాస్వామ్య ఫలాలు అందాలని చైనా కమ్యునిస్టు ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలిచిన ధీశాలి ఇకలేరు. ప్రపంచం ఆయన్ను నోబెల్ శాంతి పురస్కారంతో సత్కరించినా, చైనా ప్రభుత్వం మాత్రం కారాగారంలో పెట్టింది. అయినా వెనక్కు తగ్గకుండా ప్రజల ఆకాంక్ష కోసం కరుడుగట్టిన కమ్యునిస్టు భావాలకు వ్యతిరేకంగా పోరాడుతూ అస్తమించారు. బీజింగ్ : చైనాకు చెందిన ప్రముఖ నోబెల్ శాంతి పురస్కార గ్రహీత లియూ జియాబావో(61) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన అసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. జైలు శిక్ష అనుభవిస్తున్న లియూ జియాబావోను ఈ మధ్యకాలంలోనే పెరోల్పై చైనా ప్రభుత్వం విడుదల చేసింది. ప్రజాస్వామ్య సంస్కరణల పేరిట ప్రభుత్వ కూల్చివేతకు కుట్రపన్నారన్న కారణంతో ఆయనకు 2009లో జైలుశిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించి అనూహ్యంగా 11 ఏళ్ల జైలు శిక్ష విధించారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే ఆయన నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. అయితే లియూ జైలులో ఉండటంతో అవార్డు ప్రదాన కార్యక్రమంలో ఖాళీ కుర్చీని ఏర్పాటు చేసి నోబెల్ అందజేశారు. జైలులో ఉండగానే జియాబావో లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు గుర్తించారు. అయితే ఇతర మెరుగైన చికిత్సకోసం విదేశాలకు పంపించేందుకు చైనా ప్రభుత్వం నిరాకరిస్తూ కఠినంగా వ్యవహరించింది. దీంతో అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి రావడంతో అప్పుడప్పుడు జర్మనీ, అమెరికా దేశాల నుంచి ప్రత్యేక అనుమతితో వైద్యులను రప్పించి చికిత్స చేయించారు. అయినప్పటికీ క్యాన్సర్ తీవ్రత అధికమై అవయవాలు పనిచేయకపోవడంతో శరీరం చికిత్సకు సహకరించక అయన కన్నుమూశారు. ఈ మేరకు చైనా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. -
శాంతి నోబెల్ నాకెందుకు ఇచ్చారో తెలీదు: ఒబామా
వాషింగ్టన్: నోబెల్ శాంతి బహుమతిని తనకు ఎందుకిచ్చారో ఇప్పటికీ తెలీదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పారు. ఒబామా 2008లో అధ్యక్షుడయ్యాక 2009లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. 55ఏళ్ల ఒబామా, 2017 జనవరిలో శ్వేత సౌధాన్ని వీడనుండడం తెలిసిందే. ఈ నే పథ్యంలో ‘ద లేట్ షో’ అనే టీవీ షోలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వచ్చిన అభ్యర్థిలా ఒబామా నటించగా, ఇంటర్వ్యూ చేసే వ్యక్తిగా వ్యాఖ్యాత పలు ప్రశ్నలు అడిగారు. వీటికి ఒబామా ఆసక్తికర సమాధానాలిచ్చారు. ఇక్కడే నోబెల్ గురించి ప్రస్తావించగా ఒబామా పై వ్యాఖ్యలు చేశారు. -
గాంధీజీకి ఎందుకు రాలేదు?
స్టాక్ హోమ్: నోబెల్ శాంతి బహుమతి. ప్రపంచశాంతికి కృషి చేసిన ఎందరికో ఈ బహుమతిని ప్రదానం చేశారు. మరి భారత్, ఆఫ్రికా దేశాల్లో శాంతియుత పోరాటాలు చేసిన జాతిపిత, మహాత్మగాంధీని ఈ బహుమతిని ఎందుకు వరించలేదు?. ఈ ప్రశ్నే గాంధీ జయంతి(అక్టోబర్ 2న) సందర్భంగా కోట్లాది మంది భారతీయులను తొలుస్తోంది. నార్వే దేశస్తుడైన ఆల్ఫ్రెడ్ నోబెల్ 1901లో ఈ బహుమతుల ప్రధానాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రపంచశాంతి కోసం ఎనలేని కృషి చేసిన వ్యక్తులకు, వివిధ రంగాల్లో మానవవాళి అభివృద్ధికి కొత్త ఆవిష్కరణలు చేసిన వారికి ఈ బహుమతిని ప్రదానం చేస్తున్నారు. ఒక్కసారి నోబెల్ బహుమతిని ప్రదానం చేసిన తర్వాత తిరిగి వెనక్కు తీసుకోరు. అందుకే బహుమతికి ఎంపిక చేసే ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. మహాత్మగాంధీకి ఎందుకు రాలేదు మహాత్మగాంధీ. శాంతి యుతంగా పోరాటాలను జరిపిన ప్రజానాయకుడు. ఐదు కంటే ఎక్కువసార్లు మహాత్మాగాంధీ పేరు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయింది. అయినా ఆయన గెలవలేదు. భారత్, ఆఫ్రికా దేశాల్లో శాంతియుత పోరాటాలు చేసి తెల్లవారి మెడలు వంచిన శాంతి మూర్తికి గౌరవం దక్కలేదు. అయితే, చాలా అరుదుగా తమ తప్పును గుర్తించే నోబెల్ కమిటీ గాంధీజికి శాంతి బహుమతిని ప్రదానం చేయకపోవడం తాము చేసిన పొరపాటుని ఒప్పుకుంది. 1989లో నోబెల్ కమిటీ చైర్మన్ గాంధీజికి నివాళులు అర్పించి దలైలామాను నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. మరో రెండు వారాల్లో నోబెల్ శాంతి బహుమతులను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా నోబెల్ కమిటీ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను ఒకసారి పరిశీలిద్దాం. 1. యుద్ధంలో సహకరించిన వ్యక్తికి శాంతి పురస్కారం జర్మన్ రసాయన శాస్త్రవేత్త ఫ్రిట్జ్ హాబర్ 1918లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. నత్రజని(నైట్రోజన్), ఉదజని(హైడ్రోజన్) వాయువుల నుంచి మూత్రలవణము(అమ్మోనియా)ను తయారుచేసినందుకు గాను నోబెల్ కమిటీ ఆయన్ను బహుమతికి ఎంపిక చేసింది. ఫ్రిట్జ్ చేసిన ఆవిష్కరణ వల్ల పురుమందుల తయారీకి మార్గం సులభం అయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయరంగంలో విప్లవాత్మకమార్పులు వచ్చాయి. అయితే, మొదటి ప్రపంచయుద్ధంలో జర్మనీకి ఫ్రిట్జ్ అందించిన సాయాన్ని ఎంపిక కమిటీ పట్టించుకోలేదు. 1915లో బెల్జియంపై జర్మనీ చేసిన క్లోరిన్ దాడికి ఫ్రిట్జ్ సాయం చేశారు. ఈ దాడిలో వేల మంది బెల్జియం జాతీయులు ప్రాణాలు కోల్పోయారు. 2. క్యాన్సర్ ను కనుగొన్నాడని బహుమతి ప్రధానం చేస్తే.. డానిష్ శాస్త్రవేత్త జోహన్నెస్ ఫిబిజెర్ 1926లో వైద్యరంగంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఎలుకల్లో క్యాన్సర్ కు కారణం అవి బొద్దింకలను తినడమేనని ఫిబిజెర్ పేర్కొన్నారు. దీన్ని సరియైన ఆవిష్కరణగా భావించిన ఎంపిక కమిటీ సభ్యులు ఆయనకు వైద్యరంగంలో నోబెల్ బహుమతిని అందజేశారు. కానీ ఆ తర్వాతి పరిశోధనల్లో విటమిన్-ఏ లోపం కారణంగా ఎలుకలకు క్యాన్సర్ వ్యాధి వస్తోందని తెలిసింది. 3. మంచి, చెడు రెండు చేసినా.. స్విస్ రసాయన శాస్త్రవేత్త పాల్ ముల్లెర్ వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన డైక్లోరోడైఫినైల్ ట్రైక్లోరోఈథేన్(డీడీటీ)ను కనుగొన్నందుకు 1949లో నోబెల్ బహుమతి వరించింది. డీడీటీ ఆవిష్కరణ వల్ల పంటను నాశనం చేసే కీటకాలు, దోమలను తక్కువ సమయంలో హతమర్చాడం వీలైంది. దక్షిణ యూరప్ లో డీడీటీ వల్ల మలేరియా మరణాలు గణనీయంగా తగ్గాయి. దీంతో నోబెల్ కమిటీ ఆయన్ను నోబెల్ బహుమతితో సత్కరించింది. అయితే, 1960లో వాతావరణనిపుణులు డీడీటీ కారణంగా పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతున్నట్లు గుర్తించారు. 1972లో అమెరికా డీడీటీపై నిషేధం విధించింది. 2001లో అంతర్జాతీయంగా డీడీటీపై నిషేధాన్ని విధించారు. మలేరియా ప్రాబల్యం ఎక్కువగా ఉన్న దేశాల్లో దీని వినియోగంపై నిషేధం విధించలేదు. 4. విపరిణామాలకు కారణమైంది పోర్చుగీసుకు చెందిన శాస్త్రవేత్త ఆంటియో ఈగాస్ మోనిజ్ 1949లో మానసిక వ్యాధికి చికిత్సను కనిపెట్టారు. ఆ తర్వాత ఈ చికిత్స ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని కూడా గడించింది. దీంతో ఎంపిక కమిటీ ఆంటియో చేసిన ఆవిష్కరణ సైకియాట్రిక్ చికిత్సలోనే విలువైనదిగా కీర్తించి, నోబెల్ బహుమతిని ప్రదానం చేసింది. 1950ల్లో మానసిక చికిత్స కోసం పలు వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఆంటియో కనిపెట్టిన చికిత్సా విధానం కారణంగా రోగులు మరణించడం, మెదడు దెబ్బతినడం, ఎలాంటి ఎమోషన్స్ లేకుండా ఉండిపోవడం లాంటి విపరిణామాలు పెద్ద సంఖ్యలో సంభవించాయి. -
నోబెల్ అవార్డు తిరస్కరించా!
న్యూఢిల్లీ: నోబెల్ అవార్డు వచ్చిందంటే ఎగిరి గంతేసే వారెవరుండరు? కానీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు పండిట్ శ్రీశ్రీ రవిశంకర్ మాత్రం తనకు ఈ అవకాశం వస్తే తిరస్కరించినట్లు వెల్లడించారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు వెల్లడించిన రవిశంకర్.. పాకిస్తాన్ బాలిక మలాలాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వటం అర్థరహితమన్నారు. ‘మీకు నోబెల్ అవార్డు ఇస్తే స్వీకరిస్తారా?’ అని జర్నలిస్టు వేసిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘నాకెప్పుడో ఆ అవకాశం వచ్చింది. కానీ నేనే సున్నితంగా తిరస్కరించాను. నాకు పనిచేయటంలోనే సంతృప్తి ఉంటుంది. నేను చేసిన పనికి అవార్డులు రావాలని ఎప్పుడూ కోరుకోలేదు’ అని చెప్పారు.2006లో న్యూయార్క్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఓ సభ్యుడు రవిశంకర్ను నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేయాలని కోరారు. అయితే దీనికి నోబెల్ కమిటీ ఒప్పుకుందా? లేక రవిశంకర్ను అడిగితే ఆయన తిరస్కరించారా అనే దానిపై స్పష్టత లేదు. -
నోబెల్ బహుమతి ఇస్తానంటే.. వద్దన్నాను!
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ ఓ చిత్రమైన విషయం చెప్పారు. తనకు గతంలో నోబెల్ శాంతి బహుమతి ఇస్తామంటే.. వద్దని తిరస్కరించానన్నారు. ఇటీవల పాకిస్థానీ అమ్మాయి మలాలా యూసుఫ్జాయ్కి ఈ అవార్డు ఇవ్వడం కూడా సరికాదని, ఆమెకు ఆ అర్హత లేదని చెప్పారు. నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సినంతగా ఆమె ఏమీ చేయలేదని ఆయన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. తాను కేవలం పని చేయడాన్నే నమ్ముతాను తప్ప.. తనకు అవార్డులతో పనిలేదని చెప్పారు. అవార్డులు ఇచ్చేటప్పుడు దానికి తగిన అర్హత ఉందో లేదో చూసుకోవాలని, మలాలాకు ఆ అవార్డు ఇవ్వడం శుద్ధ దండగని అన్నారు. మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి వెళ్లినప్పుడు ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవలే భారత ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన ఆ అవార్డు స్వీకరించారు. -
యుద్ద భూమిలో శాంతి పుష్పాలు
మీరు కాబూల్ డౌన్ టౌన్ కి వెళితే.. యుద్దంతో శిధిలమైన నగరంలో.. నెత్తి మీద హెల్మెట్లు.. అత్యాధునిక గేర్ సైకిళ్లపై సగర్వంగా తిరిగే అమ్మాయిలని తప్పకుండా గమనిస్తారు. వీరంతా అలాంటి.. ఇలాంటి యువతులు కాదు.. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి పోటీ పడుతున్న యువతులు.. తమపై అమలు అవుతున్న కట్టుబాట్లపై నిశ్శబ్ద యుద్ధం చేస్తున్న వారు.. తాలిబాన్ రాజ్యం కూలిపోయినా.. ఇంకా పాత వాసనలు పోని దేశంలో మహిళలు సైక్లింగ్ వంటి క్రీడను కెరీర్ గా ఎంచుకోవడం మామూలు విషయం కాదు. అయితే చాలా మంది ఆఫ్ఘన్ యువతులు తమ కట్టుబాట్లను దాటి వస్తున్నారు. ఇలా చేసేందుకు ఎంతో ధైర్యం కావాలి అంటారు ఆప్ఘనిస్తాన్ సైక్లింగ్ ఫెడరేషన్ సారథి జహ్రా. తమ జట్టులో యువతులంతా ఎంతో ధైర్యవంతులని ప్రశంసలు కురిపించారు. బామియాన్ కి చెందిన జహ్రా తో సహా ప్రస్తుతం జాతీయ సైక్లింగ్ జట్టులో 40 మంది యువతులున్నారు. వీరంతా నోబెల్ శాంతి బహుమానానికి నామినేట్ అయ్యారు. తమను అత్యున్నత పురస్కారానికి నామినేట్ చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు జహ్రా. జహ్రా అండ్ టీమ్ ను.. ఇటలీకి చెందిన ఎంపీలు నామినేట్ చేశారు. పార్టీలకు అతీతంగా.. ఏకంగా 118 మంది పిటిషన్ పై సంతకం చేశారు. యుద్ధంతో ధ్వంసమైన ఆప్ఘన్ రోడ్లపై సైకిళ్లు తొక్కుతున్న మహిళలు తమ దేశంలో స్వేచ్చ కోసం, హక్కుల కోసం, శాంతి కోసం సున్నితమైన యుద్ధం చేస్తున్నట్లు అనిపిస్తోంది అని ఈ సందర్భంగా డెమొక్రటిక్ పార్టీ నేత ఎర్మెట్ రియాల్సీ మీడియాకు తెలిపారు. అయితే ఈ యుద్ధాన్ని ప్రారంభించింది జహ్రా. బామియాన్ బయట. కాబూల్ లో సైకిళ్లు తొక్కేందుకు యువతను ప్రోత్సహించింది. అదేమంత సులువుగా జరగలేదు. తాలిబన్ సంస్కృతి ఇంకిపోయిన సమాజంలో మహిళలు సైకిళ్లపై ప్రయాణించడం అంటే సవాలే. ఇక యువకులతో కలిసి సైకిల్ రైడ్ అంటే మరో రకం సమస్య. జాతీయ సైక్లింగ్ జట్టు సభ్యురాలు హాలిమా హబీబీ మాటల్లో చెప్పాలంటే.. 'నేను రోడ్లమీద ఎదుర్కోని సమస్య లేదు. వివక్ష, వేధింపులు సర్వ సాధారణ విషయాలు' అంటారు. దూషణలకు దిగే పోకిరీలకు సున్నితంగా సమాధానం చెప్పి దూసుకు పోవడం మాత్రమే చేయగలం అంటారామె. అయితే.. ఇది చిన్న అంశం మాత్రమే. మహిళా సైక్లిస్టుల గురించి చులకనగా మాట్లాడటం తో పాటు. కుటుంబ సభ్యులపై భారీ ఒత్తిడి ఉంటుంది. ఇక వీళ్లకు వచ్చే పెళ్లి సంబంధాలకు లెక్కేలేదు. సంబంధాల కంటే.. ఎక్కువ తీవ్రవాదుల నుంచి హెచ్చరికలు వస్తాయి. అయితే.. వీళ్ల తొలి ప్రయారిటీ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొనటమే అని చెబుతారు జహ్రా. అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా పోటీ పడేందుకు.. వారంలో మూడు నాలుగు రోజులు, కఠినమైన ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అయితే... పోటీలో వీళ్ల తొలి ప్రత్యర్థి మాత్రం సంప్రదాయ వాదులే. తాలిబన్ ప్రభుత్వం కూలిపోయినా.. ఇప్పటికీ బెదిరింపులు సర్వసాధారణమే. ఒక్కొక్క సారి సైక్లిస్టులపై చేతికి దొరికిన వస్తువులను విసురుతుంటారు. కానీ.. వీటన్నింటినీ తట్టుకుని సైక్లింగ్ చేస్తున్నామని వివరించారు. సైకిల్ పై దూసుకు పోతుంటే.. స్వేచ్చగా ఆలోచించుకునే ధైర్యం వస్తుందని చెబుతారు. ' నా చిన్నప్పుడే తల్లి దండ్రులు చనిపోయారు. మా అక్క నన్ను మగపిల్లాడిలానే పెంచింది. సమాజంలో మగపిల్లలు అనుభవించే స్వేచ్చ నాకు దొరికింది. అదే నన్ను నా సహచర ఆఫ్ఘన్ మహిళల కంటే భిన్నంగా నిలిపిందని' వివరించారు జహ్రా. హాలియా మాటల్లో చెప్పాలంటే.. 'మీరు మమ్మల్ని చంపాలని ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తే.. మేం అంతగా.. ప్రతిఘటిస్తాం' అని చెప్పే వీళ్లు.. నోబెల్ బహుమతి గెలవక పోయినా, ఆ బహుమతి రాక పోయినా పెద్ద తేడా ఏమీ ఉండదు. ఇప్పటికే ఈ యువతులంతా విజేతలు. సంప్రదాయవాద సమాజంలో కూరుకు పోయిన సాటి మహిళలకు స్వేచ్చ పై ఆశ కలిగిస్తున్నారు. తాలిబన్ ఏలుబడి తమపై రుద్దిన సంప్రదాయాలను బద్దలు కొడుతూ.. నిశ్శబ్ద విప్లవాన్ని తెస్తున్నారు. -
సూకీభవ
ఆంగ్ సాన్ సూకీ, బర్మా ఉద్యమ నేత తల్లిదండ్రులు ►ఆంగ్సాన్ (దేశభక్త విప్లవకారుడు), ఖిన్ కీ (దౌత్యవేత్త) కుటుంబ స్థానం ►ముగ్గురు పిల్లల్లో ఒకే ఒక్క అమ్మాయి భర్త ►డాక్టర్ మైఖేల్ ఏరిస్ (వివాహం: 1972) సంతానం ►అలెగ్జాండర్, కిమ్ పార్టీ ►ఎన్.ఎల్.డి. (నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ) వ్యవస్థాపన ►27 సెప్టెంబర్ 1988 (8888 తిరుగుబాటు తర్వాత) తిరుగుబాటు ►8 ఆగస్టు 1988 - 18 సెప్టెంబర్ 1988 అవార్డులు ► నోబెల్ శాంతి బహుమతి (1991)జవహర్లాల్ నెహ్రూ అవార్డ్ (1992) రాఫ్టో, సఖరోవ్ ప్రైైజులు (1990) అన్నం పెట్టేవాళ్లు, పెట్టించేవాళ్లు, పండించేవాళ్లు.. ఎప్పుడూ చల్లగా ఉండాలి. అన్నదాతా.. సుఖీభవ!పిడికిలి బిగించినవారు, పోరు సాగించేవారు.. ఎప్పుడూ శాంతంగా ఉండాలి. పౌరులారా.. సూకీభవ! ఆంగ్ సాన్ సూకీలా ఉండండీ అని!!ఎప్పుడైనా సరే, అమెరికా ఎన్నికలు నవంబరులోనే జరుగుతాయి. అదీ మంగళవారమే జరుగుతాయి. అది కూడా నవంబరు నెలలో మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం మాత్రమే జరుగుతాయి. అంటే.. నవంబరు 2కి ముందు గానీ, నవంబరు 8కి తర్వాత గానీ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగవు. రాజ్యాంగంలో అలా రాసుకున్నారు వాళ్లు! ఈ ఏడాది నవంబర్ 8న అమెరికా ఎన్నికలు జరుగుతున్నాయి. గత ఏడాది మయన్మార్ ఎన్నికలు కూడా నవంబర్ 8నే జరిగాయి. అంత మాత్రాన అమెరికా, మయన్మార్ రాజ్యాంగాలకు సంబంధం ఉందని చెప్పలేం. అలాగని ఏ సంబంధమూ ఉండబోదనీ చెప్పలేం. ఒక అందమైన ఊహ ఏమిటంటే.. అమెరికా, మయన్మార్లకు అధ్యక్షులుగా ఇద్దరూ మహిళలే అయితే ఎంత బాగుంటుందీ అని! ఊహ మాత్రమే కాదు.. అయ్యే అవకాశాలూ కనిపిస్తున్నాయి. అమెరికాలో హిల్లరీ, మయన్మార్లో ఆంగ్సాన్ సూకీ అధ్యక్ష పీఠం మీద కూర్చుంటే మానవాళి మునుపెన్నడూ వీక్షించని ఒక అందమైన ప్రపంచం ఆవిష్కృతమౌతుంది. అమెరికా చరిత్రలో ఇంతవరకు మహిళా అధ్యక్షులు లేరు. మయన్మార్ చరిత్రలో అయితే అసలు ప్రజాస్వామ్యమే లేదు. మయన్మార్ ఇప్పటికీ మిలటరీ పాలనలోనే ఉంది! మరి నవంబర్ 8న అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి కదా! వాటి ఫలితాలు ఏమైనట్లు? నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్.ఎల్.డి.) భారీ మెజార్టీతో గెలిచింది కదా! ఆ పార్టీ లీడర్ ఆంగ్సాన్ సూకీ ఎందుకు ఆ దేశానికి అధ్యక్షురాలు కాలేకపోయినట్లు? అందుకు చట్టాన్ని సవరించాలి. సవరించాలంటే పార్లమెంటులో 25 శాతం సీట్లు ఉన్న రిజర్వుడు (ఎన్నిక కాని వారు) అభ్యర్థుల ఆమోదం ఉండాలి. వాళ్లను మిలటరీ నియంత్రిస్తుంటుంది. సవరణకు మిలటరీ ఒప్పుకుంటే వాళ్లూ ఒప్పుకుంటారు. ఆంగ్సాన్ సూకీ ఎప్పటికీ అధ్యక్షురాలు కాకుండా ఉండడం కోసం 2008లో మయన్మార్ మిలటరీ ప్రభుత్వం ఒక రాజ్యాంగ సవరణ చేసింది. దాని ప్రకారం.. జీవిత భాగస్వామికి గానీ, పిల్లలకు గానీ విదేశీ పౌరసత్వం ఉంటే ఆ వ్యక్తి మయన్మార్ అధ్యక్షులు అయ్యేందుకు లేదు. సూకీ ఇప్పుడు అధ్యక్షురాలు అవాలంటే ఆ క్లాజును రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ తేవాలి. అందుకోసం ప్రస్తుతం మిలటరీకి, సూకీ పార్టీకి మధ్య చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయి. అవి ఫలిస్తే.. మార్చిలో సూకీ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ నెల మొదట్లో సూకీకి ఫేస్బుక్లో ఒక బెదిరింపు పోస్ట్ వచ్చింది. ‘నిన్ను చంపేస్తాం’ అని! మామూలుగా అయితే అక్కడి పాలకులకు అదొక చిన్న విషయం. కానీ ఇప్పుడది పెద్ద సంగతి! సూకీకి తరగని ప్రజాదరణ అందుకు కారణం కావచ్చు. బెదిరింపు వచ్చిన వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. సూకీకి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సూకీ పట్ల మిలటరీ కనబరుస్తున్న సానుకూల ధోరణికి దీనినొక నిదర్శనంగా భావించవచ్చు. మయన్మార్ ఎదురు చూపులు సూకీని తమ అధ్యక్షురాలిగా చూడడం కోసం మయన్మార్లో ఇప్పుడు ప్రతి ఇల్లూ ఎదురుచూస్తోంది. చదువుల కోసం, ఉద్యోగాల నిర్వహణ కోసం దాదాపు నలభై ఏళ్ల పాటు విదేశాల్లో గడిపి, 1988లో మయన్మార్ వచ్చి, వచ్చిన ఏడాదే ఉద్యమ నేతగా అవతరించడానికి సూకీకి అంత శక్తి ఎక్కడిది? ‘అది నాకు నా తండ్రి, బర్మా ప్రజలు ఇచ్చిన శక్తి’ అని చెప్తారు సూకీ. అసలు ఆంగ్ సాన్ సూ కీ అన్న పేరులోనే మూడు తరాల శక్తి ఉంది. ‘ఆంగ్ సాన్’ అన్నది తండ్రి పేరు. ‘సూ’ అన్నది నానమ్మ పేరు. ‘కీ’ అన్నది అమ్మ పేరు. సూకీ రంగూన్లో జన్మించారు. పాలిటిక్స్, ఫిలాసఫీ చదివారు. బ్రిటిష్ పౌరుడు మైఖేల్ ఆరిస్ను వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లయ్యారు. ఉద్యమబాట పట్టారు. ఫలితంగా గృహ నిర్బంధానికి గురయ్యారు. సొంత రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లారు. గత ఏడాది పార్లమెంటు ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీతో నెగ్గి.. ప్రజాస్వామ్యానికి పురుడు పోశారు. ఇది ఆమె సాధించిన నోబెల్ శాంతి బహుమతి కంటే గొప్ప విజయం. బందీ అయిన యోధురాలు సూకీ గత ఐదేళ్లుగా స్వేచ్ఛా విహంగం అయితే కావచ్చు. అప్పటి వరకు ఆమె బర్మా స్వేచ్ఛకోసం బందీ అయిన యోధురాలు. 1989 జూలై 20 నుంచి 2010 నవంబర్ 13 వరకు ఇరవయ్యొక్కేళ్ల కాలంలో మధ్య మధ్య స్వల్ప విరామాలతో దాదాపు 15 ఏళ్ల పాటు బర్మా సైనిక పాలకులు విధించిన గృహ నిర్బంధంలో గడిపారు. నిర్భందం నుంచి బయటపడిన ఏడాదిన్నర తర్వాత - బ్యాంకాక్లో ఏర్పాటైన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనడం కోసం సూకీ చేసిన తొలి విమాన ప్రయాణంలో ఆమెను చూడగానే కెప్టెన్ ఆనందాన్ని పట్టలేకపోయాడు. అంతేనా! కాక్పిట్కి ఆహ్వానించి, అక్కడ కొంతసేపు కూర్చోబెట్టి మర్యాదలు చేశాడు. ఆ హైటెక్ కంట్రోల్ ప్యానెల్ నుంచి భూమి మీద మినుకు మినుకుమని వెలుగుతున్న నగరాలను చూడగానే సూకీకి మయన్మార్ నిరుద్యోగ యువకులు, వారి కలలు, ఆశలు గుర్తొచ్చాయి. తర్వాత.. బ్యాంకాక్లో జరిగిన ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’లో ప్రసంగిస్తూ.. ఆమె అన్న మాట ఫోరమ్ సభ్యుల మనసు గెలుచుకుంది. ‘‘కొంచెం ఇవ్వండి చాలు. అవినీతికి అవకాశం కల్పించేంత భారీ స్థాయి పెట్టుబడులు అక్కర్లేదు’’ అన్నారు సూకీ. లేత నీలి రంగు దుస్తులలో, తలలో తెల్లటి పూలతో సూకీ మాట్లాడుతున్నప్పుడు ఆవిడొక స్వేచ్ఛా విహంగంలా కనిపించారంటూ అంతర్జాతీయ న్యూస్ చానళ్లు ఆహ్లాదకరమైన పోలికను తేవడం విశేషం. తొలి ఎన్నికలు.. తుది ఫలితాలు నిర్బంధం నుంచి సూకీ విడుదలయ్యాక మయన్మార్లో జరిగిన ఒక కీలక పరిణామం... ఉప ఎన్నికలు. ఆ ఎన్నికల్లో సూకీ ఘన విజయం సాధించారు. ఫలితాలు వెల్లడవగానే ఐరోపా, ఆస్ట్రేలియా, ఉత్తరమెరికా, దక్షిణమెరికా, ఇజ్రాయిల్, జపాన్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియాల నుంచి సూకీకి అభినందలు వెల్లువెత్తాయి. ‘‘మయన్మార్కి మంచి భవిష్యత్తు ఉంది. అది మీ వల్లే సాధ్యమౌతుంది’’ అని కొందరు దేశాధినేతలు సూకీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సీన్ మొన్న 2015 ఎన్నికల్లోనూ రిపీట్ అయింది. నాన్న.. నా హీరో: సూకీ నాన్న! నా హీరో. నా జీవితానికి స్ఫూర్తి. ఉద్యమ రాజకీయాల్లో నా దిక్సూచి. బర్మా యువశక్తిని నడిపిన నాన్న... నా రెండేళ్లప్పుడు యువకుడిగానే చనిపోయారు. ఆయన నన్నెత్తుకుని ఆడించిన గుర్తు... ఉండీలేనట్లుంది. ‘‘నిన్ను ఇలా ఎత్తుకునేవారు, చేతులపై ఇలా ఊపేవారు. గాలిలో పైకి లేపి ఒక్క విసురుతో భద్రంగా నిన్ను కిందికి దింపేవారు. నువ్వు కిలకిలమని నవ్వేదానివి’’ అని అమ్మ చెబుతుంటే నాన్నని ఊహించుకునేదాన్ని. అమ్మ ఒక్కటేనా నాన్న గురించి చెప్పేది! బర్మాలోని ప్రతి ఉద్యమ గ్రామం ఆయన్ని గుర్తుంచుకుంది. ఆంగ్ సాన్ సూకీ ఒక తిరుగుబాటు నాయకురాలంటే వాళ్లకేం గొప్ప కాదు. ఆ తండ్రి కూతురేనని చెప్పుకోవడం గొప్ప! నిర్బంధానికి నిర్బంధానికి మధ్య లభించిన షరతుల స్వేచ్ఛలో పశ్చిమ బర్మాలోని రఖైన్, చిన్ రాష్ట్రాల పర్యటనకు వెళ్లినప్పుడు ‘‘అదిగో.. ఆంగ్సాన్ తాతయ్య కూతురొచ్చింది చూడు’’ అని వారు అంటున్నప్పుడు నా కళ్లు చెమర్చాయి. నాన్న వారితో నిజాయితీగా ఉన్నారు. వారు నన్ను విశ్వసిస్తున్నారు. అంతే. ప్రజాస్వామ్యాన్ని తప్ప వారు ఇంకేమీ ఆశించడం లేదు. ఆచరణసాధ్యం కాని హామీలేమీ నేనివ్వడం లేదు. మా పార్టీ ప్రతి గూడెం గుండెకు హత్తుకుంది. అప్పుడు మాకు వినిపించినవి హృదయ స్పందనలు కాదు. ఆగస్టు తిరుగుబాటులో అమరవీరులైన వారి నినాదాలు! భయానికి బందీ అయ్యామా అంతకన్నా శిక్ష లేదు. భయాన్ని వదిలించుకున్నామా అంతకన్నా స్వేచ్ఛలేదు. - ఆంగ్ సాన్ సూకీ, మయన్మార్ పోరాట యోధురాలు -
మదర్ థెరిసా దైవదూత
ధ్రువీకరించిన వాటికన్ సిటీ వచ్చే ఏడాది సెయింట్హుడ్ కోల్కతా: భారత రత్న, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసాను దైవదూత(సెయింట్)గా వాటికన్ సిటీ ధ్రువీకరించినట్లు మిషనరీస్ ఆఫ్ చారిటీ అధికార ప్రతినిధి సునీతా కుమార్ తెలిపారు. వైద్య రంగంలో అద్భుతాలు సృ ష్టించిన మదర్కు ఈ హోదా దక్కినట్లు వెల్లడించారు. మదర్లోని అతీత శక్తిని పోప్ గుర్తించినట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 4న రోమ్లో ఆమెకు అధికారికంగా ఈ హోదా ఇవ్వనున్నట్లు క్యాథలిక్ పత్రిక అవెనైర్ ప్రకటించింది. మదర్కు సెయింట్హుడ్ దక్కడం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. మిషనరీస్ ఆఫ్ చారిటీకి అభినందనలు తెలిపారు. మాసిడోనియాలో 1910లో జన్మించిన మదర్ కోల్కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించి 45 ఏళ్లపాటు పేదలు, రోగులకు విశిష్టమైన సేవలందించారు. 1951లో భారత పౌరసత్వం స్వీకరించారు. 1979లో నోబెల్ శాంతి బహుమతి పొందారు. 1997లో కోల్కతాలో తుదశ్వాస విడిచారు. -
బ్లాటర్కు నోబెల్
• శాంతి బహుమతి ఇవ్వాలి • రష్యా అధ్యక్షుడు పుతిన్ మాస్కో: ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్ అత్యంత గౌరవనీయ వ్యక్తి అని, ఆయనకు నోబెల్ శాంతి బహుమతి అందజేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచ ఫుట్బాల్ అభివృద్ధికి బ్లాటర్ ఎంతగానో కృషి చేశారు. కేవలం దీన్ని క్రీడగానే భావించకుండా వివిధ దేశాల, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు ఓ అవకాశంగా మలుచుకున్నారు. అందుకే నోబెల్ శాంతి బహుమతి అందుకునే అర్హత బ్లాటర్కు ఉంది. ఆయనపై ప్రస్తుతం కొనసాగుతున్న అవినీతి విచారణ వెనుక పాశ్యాత్య దేశాల కుట్ర దాగి ఉంది’ అని పుతిన్ అన్నారు. 2 మిలియన్ డాలర్ల అవకతవకలపై బ్లాటర్పై 90 రోజుల సస్పెన్షన్తో పాటు క్రిమినల్ విచారణ సాగుతున్న విషయం తెలిసిందే. -
‘నోబెల్ శాంతి’ రేసులో మెర్కెల్
ఓస్లో: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి రేసులో జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్, అమెరికా విదేశాంగమంత్రి జాన్ కెర్రీ ముందంజలో ఉన్నారు. నోబెల్ అవార్డులన్నింటిలోనూ ఓస్లోలో ప్రదానం చేసే ఏకైక అవార్డైన శాంతి బహుమతి ఎవరిని వరిస్తుందనేది ఉత్కంఠగా మారనుంది. శుక్రవారం ప్రకటించనున్న ఈ అవార్డుకు నామినీల పేర్లను ఎప్పటిలాగే రహస్యంగా ఉంచారు. శాంతి బహుమతి కోసం ఈ ఏడాది 273 మంది పేర్లను పరిశీలించినట్లు సమాచారం. ఈ ఏడాది ప్రపంచాన్ని తీవ్రంగా కుదిపేసిన వలసల సంక్షోభాన్ని నివారించేందుకు కృషి చేసిన వారికి అవార్డు దక్కుతుందని పరిశీలకుల అంచనా. పశ్చిమాసియా, ఆఫ్రికాల నుంచి ఐరోపాకు 6 లక్షల 30 వేల మంది వలస వెళ్లారు. వీరిని ఆదుకోవటానికి నైతిక నాయకత్వం వహించిన మెర్కెల్కు శాంతి బహుమతి దక్కే అవకాశాలున్నాయని ఓస్లో శాంతి పరిశోధన సంస్థ చీఫ్ హార్ప్వికెన్ అన్నారు. ఇరాన్తో అణు ఒప్పందం ఖరారులో విజయం సాధించిన జాన్ కెర్రీ, ఇరాన్ విదేశాంగ మంత్రి జావద్ జరీఫ్లకు కూడా అవకాశాలున్నాయి. -
సత్యార్థి నోబెల్ జాతికి అంకితం
రాష్ట్రపతికి అందజేసిన అవార్డు గ్రహీత సందర్శకులకు అందుబాటులో మెడల్ న్యూఢిల్లీ: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి తన అవార్డును జాతికి అంకితం చేశారు. బుధవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో సత్యార్థి తన మెడల్ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు. సత్యార్థి నోబెల్ బహుమతి అందుకోవడంపై రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. సత్యార్థి తన సేవలను మరింతగా కొనసాగించాలని కోరారు. గతంలో బహుమతి పొందిన భారతీయులు మెడల్ను తమ వద్దే ఉంచుకున్నారని, సత్యార్థి తన మెడల్ను రాష్ట్రపతి భవన్ మ్యూజియమ్లో అందుబాటులో ఉంచడం మంచి నిర్ణయమని ప్రశంసించారు. డా.సి.వి. రామన్ తన నోబెల్ బహుమతిని జాతికి అంకితం చేస్తూ చేసిన ప్రసంగాన్ని రాష్ట్రపతి గుర్తుచేశారు. కైలాష్ మాట్లాడుతూ దేశానికి తన మెడల్ను అంకితం చేస్తున్నానన్నారు. ప్రపంచం భారత్వైపు చూస్తోందని, బాలల హక్కులను రక్షించడం అందరి సమష్టి బాధ్యత అని చెప్పారు. నోబెల్ ద్వారా గెలుచుకున్న నగదును బాలల సంక్షేమానికే వినియోగిస్తానని ఆయన తెలిపారు. సత్యార్థి బహూకరించిన నోబెల్ అవార్డు రాష్ట్రపతి భవన్లోని మ్యూజియమ్లో సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. సత్యార్థి గత డిసెంబర్ 10న పాకిస్తాన్ బాలిక మలాలాతో కలిసి నోబెల్ బహుమతి అందుకున్నారు. -
బాల కార్మిక వ్యవస్థ చరిత్రలో కలవాలి
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సత్యార్థి న్యూఢిల్లీ: బాల కార్మిక వ్యవస్థ చరిత్ర పుటల్లో కలసిపోవాలని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి ఆకాంక్షించారు. దీని కోసం విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని విన్నవించారు. నోబెల్ బహుమతి అందుకుని ఆదివారం భారత్కు తిరిగి వచ్చిన ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించేందుకు రూపొందించిన ‘బాల కార్మిక వ్యవస్థ(నిషేధం, నియంత్రణ) సవరణ బిల్లు’ను వెంటనే ఆమోదించి చట్టం చేయాలని కోరారు. బిల్లు ఆమోదం పొందకపోతే ఈ శాసనకర్తలను చరిత్ర క్షమించబోదన్నారు. ‘‘కీలకమైన ఆ బిల్లు ఆమోదం పొందేందుకు సహకరించాల్సిందిగా పార్లమెంటేరియన్లందరికీ, ఇతర నాయకులందరికీ నేను విన్నవించుకుంటున్నాను. మహాత్మాగాంధీ సత్యాన్ని, అహింసను, శాంతిని ఓ ప్రజా ఉద్యమంగా మలిచారు. నేను మీ దయాగుణాన్ని ఓ ప్రజా ఉద్యమంగా మార్చాలని కోరుతున్నాను’ అని ఆయన పిలుపునిచ్చారు. ఓస్లోలో నోబెల్ ప్రదాన కార్యక్రమంలో పోడియంలో కూర్చొని ఉన్నప్పుడు తనకు నిరంతరం మహాత్ముడే గుర్తొస్తూ ఉన్నాడని, ఆయనే నేరుగా వెళ్లి తన అవార్డు అందుకున్నట్లుగా భావించానన్నారు. నోబెల్ బహుమతి సొమ్ములో ప్రతి పైసా పేద పిల్లల కోసమే వెచ్చిస్తానని చెప్పారు. ఆయన భారత్లో దిగీ దిగగానే ట్వీటర్లో ‘జై హింద్’ అంటూ ట్వీట్ చేశారు. -
'ఐపాడ్లు కాదు పుస్తకం అడుగుతున్నారు'
న్యూఢిల్లీ: పిల్లలు ఐపాడ్లు కోరుకోవడం లేదని, పుస్తకం అడుగుతున్నారని పాకిస్థాన్ ధీర బాలిక, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూసఫ్జాయ్ మలాలా అన్నారు. కైలాష్ సత్యార్థి, మాలాలా నార్వేలోని ఓస్లోలో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత సామాజిక కార్యకర్త కైలాష్ సత్యార్థితో కలసి మాలాలా నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన సంగతి తెలిసిందే. తాము పెన్ను, పుస్తకం అడుగుతున్నామని మలాలా అన్నారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య శాంతి కోరుకుంటున్నాని చెప్పారు. కైలాస్ సత్యార్థి మాట్లాడుతూ.. మలాలా పోరాట స్ఫూర్థి అందరికీ గర్వకారణమని ప్రశంసించారు. బాలల హక్కుల కోసం పోరాటంలో యువతను చైతన్య పరచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. వీరిద్దరూ బుధవారం నోబెల్ పురస్కారాన్ని అందుకోనున్నారు. -
సఖరోవ్ ప్రైజ్
సఖరోవ్ ప్రైజ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుమతుల్లో ఒకటి. మానవ హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తులకు లేదా సంస్థలకు దీన్ని ఇస్తారు. దీన్ని యూరోపియన్ పార్లమెంట్ డిసెంబర్ 1988లో ఏర్పాటు చేసింది. ఈ బహుమతి కింద 50,000 యూరోలను అందజేస్తారు. రష్యాకు చెందిన ప్రముఖ అణు భౌతిక శాస్త్రవేత్త, మానవ హక్కుల కార్యకర్త అయిన ఆండ్రీ సఖరోవ్ పేరు మీద దీన్ని నెలకొల్పారు. ఆయన 1975లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. 1988లో తొలి సఖరోవ్ ప్రైజ్ను దక్షిణాఫ్రికాకు చెందిన నెల్సన్ మండేలా, సోవియట్ యూనియన్కు చెందిన అనతోలి మార్షెంకోకు సంయుక్తంగా ప్రదానం చేశారు. ఆంగ్సాన్ సూచీ (1990), తస్లీమా నస్రీన్ (1994), కోఫీ అన్నన్ (2003), రిపోర్టర్స వితౌట్ బోర్డర్స అనే సంస్థ (2005), మలాలా యూ సఫ్ జాయ్ (2013)కు ఈ బహుమతి లభించింది. సఖరోవ్ ప్రైజ్-2014 డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డెనిస్ ముక్వెగె 2014 సఖరోవ్ ప్రైజ్కు ఎంపికయ్యారు. ఈ అవార్డును యూరోపియన్ పార్లమెంట్ నవంబర్లో జరిగే ఒక కార్యక్రమంలో ఆయనకు స్ట్రాస్ బర్గలో ప్రదానం చేస్తుంది. -
మలాలాకు ప్రపంచ బాలల అవార్డు
స్టాక్హోమ్: నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న పాక్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్జాయ్ మరో ప్రతిష్టాత్మక బహుమతి దక్కించుకున్నారు. బాలల నోబెల్ బహుమతిగా పేర్కొనే ప్రపంచ బాలల అవార్డు(వరల్డ్ చిల్ట్రన్స్ ప్రైజ్)కు ఆమె ఎంపికయ్యారు. లక్షలాది మంది బాలలు ఓటింగ్లో పాల్గొని ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. బహుమతి కింది అందే మొత్తాన్ని ఆమె బాలల సంక్షేమం కోసం వినియోగించాల్సి ఉంటుంది. -
అమృతమూర్తి
ఎనిమిది మంది పిల్లలున్న ఒక హైందవ కుటుంబం ఆకలితో నకనకలాడుతోందని ఒక వ్యక్తి వచ్చి మదర్ థెరిస్సాకు చెప్పాడు. కొన్ని రోజులుగా వాళ్లు పస్తులుంటున్నారని ఆవేదన చెందాడు. మదర్ వెంటనే బియ్యం మూటతో అక్కడకు వెళ్లారు. పిల్లల కళ్లు ఆకలిని ప్రతిఫలిస్తున్నాయి. ఇంటావిడ ఎంతో కృతజ్ఞతతో బియ్యం తీసుకుని, రెండు సమభాగాలు చేసింది! ఒక భాగాన్ని సంచిలో వేసుకుని బయటికి వెళ్లి వచ్చింది. ‘‘అంత హడావుడిగా ఎక్కడికి వెళ్లావు’’ అని అడిగారు మదర్. ‘‘వాళ్లు కూడా ఆకలితో ఉన్నారు’’ అని సమాధానం! వెంటనే మదర్కు అర్థం కాలేదు. ఆమె చెప్తోంది పొరుగున్న ఉన్న ముస్లిం కుటుంబం గురించి. మదర్ తెచ్చిన బియ్యంలో సగం... వాళ్లకు ఇచ్చి వచ్చింది! ఆ సాయంత్రం మదర్ మళ్లీ బియ్యం తీసుకెళ్లలేదు. పంచుకోవడంలోని ఆనందాన్ని వాళ్లకు మిగలనివ్వడం న్యాయమనిపించింది మదర్కు. తల్లి నుంచి ఆహారం రూపంలో లభించిన ప్రేమతో పిల్లలూ గెంతులేస్తున్నారు. ‘‘ప్రేమ అలా ఇంటి నుంచే మొదలౌతుంది. ఇంటి నుంచి ఇంటికి, మనిషి నుంచి మనిషికి విశ్వవ్యాప్తం అవుతుంది’’ అంటారు మదర్ థెరిస్సా. ఇండియా వచ్చి ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ (కోల్కతా) స్థాపించి మదర్ థెరిస్సాగా భారతీయ సంస్కృతిలో మమేకం అయిన అల్బేనియా సంతతి అమ్మాయి.. యాగ్నెస్ గాంగ్జే బోయాజూ (మదర్ అసలు పేరు). మదర్ సాధించిన నోబెల్ శాంతి బహుమతి, భారతరత్న అవార్డులు రెండూ కూడా ‘మానవతావాది’గా ఆమెకున్న ప్రఖ్యాతికి ఇంచుమించు మాత్రమే సరిసాటి అనాలి. మదర్ ఏనాడూ తనకొక ప్రత్యేకమైన గుర్తింపును కోరుకోలేదు. ప్రేమ కోసం తపిస్తున్న వారికి తన ఆప్యాయమైన అమృత హస్తాన్ని అందించడమూ మానలేదు. అన్నం లేకపోవడం కన్నా ఆప్యాయత కరవవడం అసలైన పేదరికమని మదర్ నమ్మారు. ప్రేమకు, పలకరింపులకు నోచుకోని నిర్భాగ్యులకు తన జీవితాన్ని అంకితం చేశారు. మనుషుల్లో మంచితనం ఉందనీ, పంచుకుంటే అది విశ్వవ్యాప్తం అవుతుందనీ ప్రబోధించారు. ఓసారి కొందరు అమెరికన్ ప్రొఫెసర్లు కోల్కతాలో మదర్ థెరిస్సా నడుపుతున్న మిషనరీ హోమ్లను సందర్శించడానికి వచ్చారు. అక్కడ.. మరణావస్థలో ప్రశాంతంగా కన్నుమూసినవారిని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ‘‘ఎలా సాధ్యం?’ అని అడిగారు. వాళ్లంతా అమెరికాలోని వేర్వేరు యూనివర్శిటీల నుంచి వచ్చినవారు. తిరిగి వెళ్లే ముందు - ‘‘మదర్... గుర్తుంచుకునే ఒక మాట చెప్పండి’’ అని అడిగారు. ‘‘ఒకరికొకరు ఎదురుపడినప్పుడు నవ్వుతూ పలకరించుకోండి. కనీసం చిరునవ్వుతో చూసుకోండి. ఇందులో సాధ్యం కానిదేమీ లేదు. మొదట కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడండి. బయట కూడా అదే అలవాటవుతుంది. అప్పుడు ప్రపంచమే ఒక కుటుంబమౌతుంది’’ అని చెప్పారు మదర్. విస్మయంగా చూశారు వాళ్లు. ‘‘దేవుడి మహిమను కూడా తరచు మనం అలాగే నమ్మలేనట్లు చూస్తుంటాం. దేవుడి గొప్పతనం, ప్రేమ గొప్పతనం, పలకరింపు గొప్పతనం, ప్రశాంతత గొప్పతనం, చిరునవ్వు గొప్పతనం తెలుసుకోవాలంటే ఎవరికైనా సేవ చేసి చూడండి. గొప్ప గొప్ప పనులు చేయనవసరం లేదు. చిన్న పనులనే గొప్ప ప్రేమతో చెయ్యండి చాలు’’ అంటారు మదర్. విశ్వమాతగా అవతరించిన ఈ క్యాథలిక్కు మతస్థురాలు 1910 ఆగస్టు 26న మేసిడోనియాలో జన్మించారు. 87 ఏళ్ల వయసులో 1997 సెప్టెంబర్ 5న కోల్కతాలో కన్నుమూశారు. -
రెక్కలు తొడిగిన బాల్యానికి నోబెల్ శాంతి బహుమతి
భారత్, పాకిస్థాన్ దేశాల్లో బాలల హక్కులు, బాలికల విద్య కోసం అలుపెరుగని ఉద్యమం సాగిస్తున్న సామాజిక కార్యకర్తలు కైలాష్ సత్యార్థి (60), మలాలా యూసఫ్జాయ్ (17)లు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. అతిపిన్న వయస్సులోనే: పాక్లో బాలికల విద్యాహక్కుల కోసం ఉద్యమం సాగిస్తూ.. రెండేళ్ల కిందట తాలిబాన్ ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడి.. మరణాన్ని జయించి.. లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్న పాక్ బాలిక మలాలా.. నోబెల్ బహుమతికి ఎంపికైన అతి పిన్నవయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. ఆమె వయసు కేవలం 17ఏళ్లు. గతంలో ఈ రికార్డు సర్ విలియమ్ లారెన్స్ బ్రాగ్ పేరిట ఉంది. ఆయనకు 1915లో 25 ఏళ్ల వయసులో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. విలియమ్ ఆస్ట్రేలియాలో జన్మించిన బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త. మలాలా నోబెల్ గెలుచుకున్న రెండో పాకిస్థాని. ఇంతకు ముందు 1979లో మహ్మద్ అబ్దుస్ సలామ్ అనే భౌతిక శాస్త్రవేత్తకు నోబెల్ పురస్కారం లభించింది. మలాలా యూసఫ్జాయ్ 1997 జూలై 12న వాయవ్య పాకిస్థాన్లోని ఉగ్రవాదుల ప్రాబల్యమున్న స్వాత్ జిల్లాలో జన్మించింది. అక్కడి తాలిబన్లు బాలికల విద్యపై నిషేధం విధించారు. అయితే దీన్ని వ్యతిరేకించి బాలికల విద్య కోసం ఉద్యమం ప్రారంభించింది. దీన్ని సహించని తాలిబన్లు 2012, అక్టోబర్ 9న మలాలాపై తూటాలు పేల్చారు. అప్పుడు ఒక బుల్లెట్ ఆమె తలలోకి దూసుకుపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను మెరుగైన చికిత్స కోసం బ్రిటన్కు తరలించారు. చికిత్స అనంతరం మలాలా 2013 మార్చిలో బర్మింగ్హామ్లోని ఒక స్కూల్లో చేరి ఇంగ్లండ్లోనే చదువుకుంటోంది. ఈ ఘటనతో మలాలా ప్రపంచం మొత్తానికి తెలిసింది. 2013 అక్టోబర్లో మలాలా ‘‘ఐ యామ్ మలాలా- ద గర్ల్ హూ స్టుడ్ అప్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ వాజ్ షాట్ బై ద తాలిబన్’’ అనే పేరుతో తన ఆత్మకథను ప్రచురించింది. దీన్ని ఆమె క్రిస్టినా ల్యాంబ్ అనే బ్రిటిష్ జర్నలిస్టుతో క లిసి రచించింది. అవార్డులు: మలాలా స్ఫూర్తిని గుర్తిస్తూ ఎన్నో అవార్డులు ఆమెకు లభించాయి. 2013లో కిడ్స్రైట్స్ ఫౌండేషన్ వారి అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి, క్లింటన్ ఫౌండేషన్ వారి క్లింటన్ గ్లోబల్ సిటిజన్ అవార్డు, అన్నా పొలిటికొవ్స్కయా అవార్డు, యూరోపియన్ పార్లమెంట్ ఇచ్చే సఖరోవ్ పురస్కారం, అంతర్జాతీయ సమానత్వ బహుమతి, 2014లో లిబర్టీ మెడల్ను గెలుచుకుంది. బచ్పన్ బచావో ఆందోళన్: బాలల హక్కుల అణచివేతపై మూడు దశాబ్దాలుగా కైలాష్ సత్యార్థి పోరు సాగిస్తున్నారు. 80 వేల మంది బాలలను వెట్టి చాకిరీ, అక్రమ రవాణా నుంచి విముక్తి కల్పించేందుకు విశేష కృషి చేశారు. భారత్కు నోబెల్ శాంతి బహుమతి లభించటం ఇది రెండోసారి. మథర్ థెరిస్సా 1979లో మొదటి సారి భారత్ తరఫున నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు (ఆమె తన జీవితాన్ని భారత్లోనే గడిపినా జన్మించింది మాత్రం ఒకప్పటి యుగోస్లోవియాలో). జన్మతః భారతీయుడికి నోబెల్ శాంతి బహుమతి లభించడం ఇదే ప్రథమం. మధ్యప్రదేశ్కు చెందిన కైలాష్ సత్యార్థి ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి మూడు దశాబ్దాల కిందట ‘బచ్పన్ బచావో ఆందోళన్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. -
కైలాశ్ సత్యార్థి, మలాలాకు నోబెల్ శాంతి బహుమతి
అంతర్జాతీయం యాంగ్ చాంగ్లో జీవ వైవిధ్య సదస్సు దక్షిణ కొరియాలోని యాంగ్ చాంగ్ నగరంలో జీవ వైవిధ్య సదస్సు (కాప్ 12)ను అక్టోబర్ 12 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించారు. అతిపెద్ద టెలిస్కోప్ నిర్మాణంలో భారత్ హవాయ్ దీవిలో నిర్మిస్తున్న ప్రపంచ అతిపెద్ద థర్టీ మీటర్ టెలిస్కోప్ (టీఎంటీ) నిర్మాణంలో జపాన్, అమెరికా, చైనా, కెనడాలతోపాటు భారత్ కూడా భాగం పంచుకుంటోంది. దీని నిర్మాణ ప్రారంభ కార్యక్రమం అక్టోబర్ 7న జరిగింది. హవాయి దీవిలో 4,012 మీటర్ల ఎత్తై మౌనా కీ అగ్ని పర్వతంపై 1.4 బిలియన్ డాలర్ల (రూ. 8,618 కోట్లు) వ్యయంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ టెలిస్కోపు ద్వారా 500 కి.మీ దూరంలో ఉన్న నాణెం పరిమాణాన్ని స్పష్టంగా చూడొచ్చు. ఈ టీఎంటీ నిర్మాణం 2022 నాటికి పూర్తవుతుంది. బెల్జియం ప్రధానిగా చార్లెస్ మైఖేల్ బెల్జియమ్లో కొత్త సెంటర్- రైట్ గవర్నమెంట్ అక్టోబరు 11న బాధ్యతలు చేపట్టింది. ప్రధానమంత్రిగా చార్లెస్ మైఖేల్ (38) ప్రమాణ స్వీకారం చేశారు. 1841 నుంచి ప్రధాని పదవి చేపట్టిన వారిలో అతి పిన్న వయస్కుడు చార్లెస్. ఆకలి సూచీలో భారత్కు 55వ స్థానం ప్రపంచ ఆకలి సూచీ(జీహెచ్ఐ)లో భారత్కు ఈ ఏడాది 55వ స్థానం దక్కింది. ఈ జాబితాలో గతేడాది 63వ స్థానంలో నిలిచిన భారత్.. ఏడాది కాలంలో 17.8 పాయింట్లు తగ్గించుకుని 55వ స్థానంలో నిలిచింది. జాతీయం మెట్రో పొలిస్ ప్రపంచ కాంగ్రెస్-2014 హైదరాబాద్లో 11వ మెట్రో పొలిస్ ప్రపంచ కాంగ్రెస్ అక్టోబర్ 6 నుంచి 10 వరకు జరిగింది. సదస్సును అక్టోబర్ 7న గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ అధికారికంగా ప్రారంభించారు. ఆసియా ఖండంలో ఈ సదస్సు జరగడ ం ఇదే తొలిసారి. ‘అందరి కోసం నగరాలు’ అనే ఇతి వృత్తం తో యువత, అందరికీ నివాసం, నగరాల్లో జీవనం అనే అంశాలపై సదస్సు సాగింది. తర్వాత సదస్సు అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ వేదికగా 2017లో జరగనుంది. అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అక్టోబర్ 9న అంతర్జాతీయ పెట్టుబడిదారుల శిఖరాగ్ర సదస్సును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. భారత నిర్మాణంలో రాష్ట్రాలు కేంద్రంతో కలిసి పనిచేయాలని ఆయన కోరారు. జాతీయ మానసిక ఆరోగ్య విధానం మొట్టమొదటి జాతీయ మానసిక ఆరోగ్య విధానా(నేషనల్ మెంటల్ హెల్త్ పాలసీ ఆఫ్ ఇండియా)న్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అక్టోబర్ 10న ప్రారంభించారు. మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, మానసిక అనారోగ్యం నుంచి కోలుకొనేలా చేయడం, ప్రతి వ్యక్తి తన పూర్తి జీవిత కాలం అనుభవించడం ఈ పాలసీ ఉద్దేశం. ఎంపీ ఆదర్శ గ్రామ పథకం ప్రారంభం లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ జయంతిని పురస్కరించుకొని ఎంపీ ఆదర్శగ్రామ పథకం (సాంసద్ ఆదర్శ గ్రామ్ యోజన-ఎస్ఏజీవై)ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్టోబర్ 11న న్యూఢిల్లీలో ప్రారంభించారు. పథకం కింద ప్రతీ ఎంపీ 2019 నాటికి తన నియోజకవర్గంలోని ఏవైనా మూడు గ్రామాల్లో సదుపాయాలను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది. పని చేయడానికి ప్రాధాన్యతనిచ్చే దేశాల్లో భారత్కు 18వ స్థానం పని చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే దేశాల్లో భారత్ 18వ స్థానంలో నిలిచింది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు అక్టోబరు 6న విడుదల చేసిన నివేదికలో అమెరికా మొదటి స్థానంలో, రెండు మూడు స్థానాల్లో బ్రిటన్, కెనడా ఉన్నాయి. వార్తల్లో వ్యక్తులు భారత్లో పర్యటించిన ఫేస్బుక్ సీఈఓ ఫేస్బుక్ సీఈఓ, సహ వ్యవస్థా పకుడు మార్క్ జుకర్బెర్గ్ తొలిసారి భారత్లో పర్యటించారు. అక్టోబర్ 9న ఢిల్లీలో జరిగిన ఇంటర్నెట్ ఆర్గ్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీని కలిసి డిజిటల్ ఇండియా కార్యక్రమానికి సాయం అందిస్తామని తెలిపారు. యునిసెఫ్ రాయబారిగా అమీర్ఖాన్ బాలీవుడ్ నటుడు అమీర్ఖాన్ అక్టోబర్ 9న ఐక్యరాజ్యసమితి బాలల అత్యవసర నిధి (యునిసెఫ్) దక్షిణ ఆసియా రాయబారిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పిల్లల పోషకాహారంపై విస్తృత అవగాహన కల్పించేందుకు కృషి చేస్తారు. హెచ్యూఎల్ డెరైక్టర్గా కల్పనా హిందూస్థాన్ యునీ లీవర్ (హెచ్యూఎల్) డెరైక్టర్గా కల్పనా మోర్పారియా అక్టోబర్ 9న బాధ్యతలు స్వీకరించారు. హెచ్యూఎల్కు డెరైక్టర్గా పగ్గాలు చేపట్టిన తొలి మహిళ ఈమె. ప్రస్తుతం జేపీ మోర్గాన్ ఇండియాలో ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అంతేకాకుండా రెడ్డీస్ ల్యాబొరేటరీస్, బెన్నెట్ కోల్ మేన్ అండ్ కో తదితర సంస్థలలో ఆమె కీలక బాధ్యతలు నిర్విహిస్తున్నారు. క్రీడలు ఫోర్బ్స్ విలువైన క్రీడాకారుల్లో ధోనీ ఫోర్బ్స్ అక్టోబరు 8న విడుదల చేసిన ప్రపంచ విలువైన క్రీడాకారుల జాబితాలో భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని ఐదో స్థానంలో నిలిచాడు. ధోనీ బ్రాండ్ విలువ 20 మిలియన్ డాలర్లు (రూ. 122 కోట్లు). అమెరికా బాస్కెట్ బాల్ ప్లేయర్ లీ బ్రాన్ జేమ్స్ 37 మిలియన్ డాలర్లతో ఒకటో స్థానంలో ఉన్నాడు. టైగర్ ఉడ్స్ (గోల్ఫ్), రోజర్ ఫెదరర్ (టెన్నిస్) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఫెదరర్కు షాంఘై మాస్టర్స్ టోర్నీ చైనాలో జరిగిన షాంఘై మాస్టర్స్ టోర్నీ విజేతగా రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) నిలిచాడు. అక్టోబర్ 12న జరిగిన ఫైనల్లో గైల్స్ సైమన్పై గెలిచాడు. జయరామ్కు డచ్ ఓపెన్ టైటిల్ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అజయ్ జయరామ్ డ చ్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఇది అతనికి తొలి గ్రాండ్ ప్రి టైటిల్. గతంలో చేతన్ ఆనంద్ (2009), ప్రకాశ్ పదుకొనె(1982)లు ఈ టైటిల్ను గెలుచుకున్నారు. అవార్డులుకైలాశ్ సత్యార్థి, మలాలాకు నోబెల్ శాంతి బహుమతిభారత్కు చెందిన కైలాశ్ సత్యార్థి, పాకిస్థాన్ బాలికమలాలా యూసుఫ్ జాయ్లు నోబెల్ శాంతి బహుమతికి సంయుక్తంగా ఎంపికయ్యారు. కైలాశ్ సత్యార్థి: వెట్టి చాకిరి నుంచి బాలల విముక్తికి 1980లో బచ్పన్ బచావో ఆందోళన్ సంస్థను స్థాపించి మూడు దశాబ్దాలుగా పిల్లల హక్కుల కోసం కైలాశ్ సత్యార్థి పోరాడుతున్నారు. ఇప్పటి వరకూ 80 వేల మంది పిల్లల్ని వెట్టి చాకిరి, అక్రమ రవాణా నుంచి విముక్తి కల్పించారు. ఆయన చేపట్టిన ‘గ్లోబల్ మార్చ్ అగెనైస్ట్ చైల్డ్ లేబర్’ ఉద్యమం పలు దేశాల్లో కొనసాగుతోంది. కైలాశ్ సత్యార్థి నోబెల్ పురస్కారాన్ని అందుకున్న ఐదో భారతీయుడిగా నిలిచారు. భారత్లో జన్మించి, నోబెల్ శాంతి బహుమతి అందుకున్న తొలి వ్యక్తిగా చరిత్రకెక్కారు. నోబెల్ అవార్డు పొందిన మిగతా నలుగురు భారతీయులు, రవీంద్రనాథ్ ఠాగూర్(1913, సాహిత్యం), సీవీ రామన్(1930, భౌతికశాస్త్రం), మదర్ థెరిసా (1978, శాంతి), అమర్త్యసేన్ (1998, ఆర్థికశాస్త్రం). ఠాగూర్ సాహిత్యంలో నోబెల్ గెల్చుకున్న తొలి భారతీయుడు. మలాలా యూసుఫ్ జాయ్: పాకిస్థాన్కు చెందిన పదిహేడేళ్ల మలాలా యూసుఫ్ జాయ్ బాలికల విద్యకోసం ప్రాణాలకు తెగించి పోరాడింది. బాలికలు చదువుకోరాదంటూ తాలిబన్లు పాఠశాలల్ని పేల్చేశారు. తాలిబన్ల చర్యలకు ఎదురు తిరగడంతో 2012లో పాఠశాలకు వెళ్తున్న ఆమెపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన మలాలా లండన్లో చికిత్సపొందింది. ప్రస్తుతం ఆమె బర్మింగ్హమ్ స్కూల్లో చదువుకుంటోంది. ఐక్యరాజ్యసమితితో కలిసి విద్యా హక్కుల కోసం కృషి చేస్తోంది. అతి చిన్న వయసులోనే నోబెల్ శాంతి బహుమతి పొందిన వ్యక్తిగా మలాలా రికార్డులకెక్కింది. రసాయన శాస్త్రం ఆప్టికల్ మైక్రోస్కోపును నానో స్కోపుగా మార్చే పరిజ్ఞానాన్ని ఆవిష్కరించిన అమెరికా, జర్మనీ శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్రంలో నోబెల్ లభించింది. అమెరికా శాస్త్రవేత్తలు ఎరిక్ బెట్జిగ్(54), విలియం మోర్నర్ (61), జర్మన్కు చెందిన స్టీఫెన్ హెల్ (51)్తలకు రసాయన శాస్త్రంలో నోబెల్ వరించింది. అర్థశాస్త్రం ఫ్రాన్స్ ఆర్థిక వేత్త జీన్ టిరోల్ (61) కు నోబెల్ బహుమతి దక్కింది. మార్కెట్ శక్తి సామర్థ్యాలు, నియంత్రణ గురించి ఆయన చేసిన పరిశోధనను గుర్తిస్తూ అకాడ మీ ఎంపిక చేసింది. సాహిత్యం నాజీ మూకల దురాగతాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఫ్రెంచ్ సాహితీవేత్త పాట్రిక్ మోడియానో (69)కు సాహిత్యంలో నోబెల్ పురస్కారం దక్కింది. మానవ జీవితాలను, నాజీల చేతుల్లో మారణ కాండకు గురైన యూదుల మనో భావాలు, వారు ఎదుర్కొన్న అవమానాలు, అస్థిత్వాన్ని కోల్పోవడం వంటివి ఆయన నవలల్లో ప్రధాన అంశాలు. మోడియానో ఫ్రెంచిలో 40కు పైగా నవలలు రాశారు. వాటిలో మిస్సింగ్ పర్సన్ నవలకు 1978లో ప్రతిష్ఠాత్మక ప్రిక్స్గాన్ కోర్టు అవార్డు లభించింది. ఆయన నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీతల్లో 11వ ఫ్రెంచ్ రచయిత. మైఖేల్ బ్లూమ్ బర్గ్కు బ్రిటన్ గౌరవ నైట్హుడ్ న్యూయార్క్ మాజీ మేయర్, సంఘ సేవకుడు మైఖేల్ బ్లూమ్బర్గ్కు అక్టోబర్ 6న బ్రిటన్ గౌరవ నైట్హుడ్ను అందించింది. శివథాను పిళ్లైకి లాల్ బహ దూర్ శాస్త్రి అవార్డు బ్రహ్మోస్ క్షిపణి పితామహుడు ఎ.శివథాను పిళ్లైకి 15వ లాల్బహదూర్ శాస్త్రి అవార్డును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీలో అక్టోబర్ 7న అందజేశారు. అగ్ని, పృథ్వి, నాగ్, ఆకాశ్ క్షిపణుల రూపకల్పనలో పిళ్లై పాత్ర ఎంతో ఉంది. అనూప్ జైన్కు ‘వెయిస్లిట్జ్ గ్లోబల్ సిటిజన్’ అవార్డు ప్రతిష్టాత్మక ‘వెయిస్లిట్జ్ గ్లోబల్ సిటి జన్ అవార్డుకు అనూప్ జైన్ ఎంపిక య్యాడు. పారిశుధ్య వసతులు కల్పనలో కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. అవార్డుతోపాటు లక్ష డాలర్ల నగదును ఆయన అందుకున్నాడు. 2011 లో అనూప్ జైన్ బీహార్లో హుమనుర్ పవర్(హెచ్పీ) అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నాడు. రాష్ట్రీయం ఆర్థిక పరిస్థితిలో హైదరాబాద్కు ఏఏ రేటింగ్ దేశంలో ఆరో పెద్ద నగరంగా పేరొందిన హైదరాబాద్ ఆర్థిక పరిస్థితిలోనూ బలమైందిగా రేటింగ్ సాధించింది. దేశ వ్యాప్తం గా పది నగరాలు ఏఏ (అఅ) రేటింగ్లో ఉండగా దక్షిణ భారతం నుంచి ఒక్క హైదరాబాద్ మాత్రమే ఉండటం విశేషం. జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆయా నగరాల ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఒక్కో నగరానికి ఏఏఏ (అఅఅ) నుంచి సీ(ఇ) వరకు రేటింగ్ ఇస్తుంది. ఏఏఏ రేటింగ్ ఏ నగరానికీ దక్కలేదు. ఏఏ రేటింగ్లో హైదరాబాద్తోపాటు గ్రేటర్ ముంబై, నవీ ముంబై, నాసిక్, సూరత్, పుణే, న్యూఢిల్లీ, ఢిల్లీ, పింప్రి-చించ్వాడ్, థానే ఉన్నాయి. హుదూద్ పెను తుపాను హుదూద్ పెను తుపాను ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసింది. అక్టోబర్ 12న విశాఖపట్నం సమీపంలో తీరం దాటిన హుదూద్ పెను తుపాను.. గంటకు 195 కిలోమీటర్ల వేగంతో కూడిన పెనుగాలులతో ఈ సముద్ర తీర నగరంలో కనీవినీ ఎరుగని విధ్వంసం సృష్టించింది. రవాణా, సమాచార వ్యవస్థలు దెబ్బతిన్నాయి. విశాఖపట్నంతోపాటు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి తుపాను తాకిడికి గురయ్యాయి. ఈ తుపాన్కు హుదూద్ అనే పేరును ఒమన్ సూచించింది. హుదూద్ అనేది ఇజ్రాయిల్ జాతీయ పక్షి. ఈ పేరును ఒమన్ దేశం సూచించింది. ఇది ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఖండాల్లో కనిపిస్తుంది. సుద్దాలకు ‘కొమురం భీం’ జాతీయ పురస్కారం 2014 కొమురం భీం జాతీయ పురస్కారానికి ప్రముఖ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్తేజ ఎంపికయ్యారు. కొమురం భీం స్మారక ఉత్సవ పరిషత్, ఆదివాసీ సంస్కృతి పరిరక్షణ సమితి, భారత్ కల్చరల్ అకాడమీ, ఓం సాయి తేజ ఆర్ట్స్ సంయుక్తంగా ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నాయి. దీనికింద రూ.50,116 నగదుతోపాటు, ప్రశంసాపత్రం అందజేస్తారు. -
'40 ఏళ్లుగా గుడికెళ్లడం లేదు'
తాను దేవుళ్లను పూజించనని బాలబంధు, నోబెల్ శాంతి పురస్కార విజేత కైలాష్ సత్యార్థి తెలిపారు. పిల్లలు దేవుళ్లకు ప్రతిరూపాలని చెప్పారు. వారి స్వేచ్ఛా, బాల్యాన్ని కాపాడడమే తన భక్తి మార్గమని వెల్లడించారు. తాను గత 40 ఏళ్లుగా ఆలయాలకు లేదా మసీదులకు వెళ్లలేదని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బాలలే తన బలమని అన్నారు. ఇంజినీరింగ్ కెరీర్ ను వదులుకున్నప్పుడు తన తల్లి కన్నీళ్లు పెట్టుకుందని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.... 'నా చిన్నతనంలోనే మా నాన్న చనిపోయారు. మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను చదివించింది. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. నేను ఉద్యోగాన్ని వదులుకున్నప్పుడు ఆమె చాలా బాధపడింది. ఏదో ఒక రోజు నన్ను చూసి గర్వపడతావని అప్పుడు మా అమ్మతో చెప్పా. వ్యక్తిగతంగా ఆడంబరాలు, అవార్డులు, పురస్కారాలు నాకు ఇష్టం ఉండవు. ఐక్యరాజ్యసమితి కంటే ముందుగా 1981లో బాలల హక్కుల కోసం గళం విప్పాను. 1989 నుంచి బాలల హక్కులపై ఐక్యరాజ్యసమితి దృష్టి సారించింది. ఈ విషయాలన్ని నోబెల్ కమిటీ పరిశీలించింది. నోబెల్ శాంతి పురస్కారంతో పాటు వచ్చే నగదు ఏవిధంగా ఖర్చు చేయాలనే ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 400 మంది బాలలతో కూడిన బాల మహాపంచాయతీ నిర్ణయం మేరకు నిధులు ఖర్చుచేస్తాం. ప్రతిపైసా చిన్నారుల సంక్షేమం కోసం ఉపయోగపడాలన్నదే నా ఆకాంక్ష. మేము కొత్తగా చేపట్టిన 'పీస్ ఫర్ చిల్డ్రన్' కార్యక్రమంలో చేరాలని నాతో కలిసి నోబెల్ శాంతి పురస్కారం గెల్చుకున్న పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ ను ఆహ్వానించాను. భారత్, పాకిస్థాన్ లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా చిన్నారులు శాంతియుత వాతావరణంలోనే పెరగాలి. మాలాలా అంటే నాకెంతో గౌరవం. పాకిస్థాన్ లో బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక పోరాటాలకు నేను మద్దతుపలికే నాటికి ఆమె ఇంకా పుట్టనేలేదు. 1987లో పాకిస్థాన్ సైన్యం నన్ను లాహోర్ వెలుపల మట్టుబెట్టాలని చూసింది. ఇటుక తయారీ కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా పాకిస్థాన్ సైనికులు వచ్చి నా తలపై తుపాకులు ఎక్కుపెట్టారు. నేను చిరునవ్వు నవ్వాను. కొన్ని నిమిషాలు ఆగితే నా ప్రసంగం పూర్తవుతుంది తర్వాత నన్ను చంపండి అని సమాధానమిచ్చాను. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని భావిస్తున్నాం. టీ అమ్మే స్థాయిని నుంచి దేశానికి ప్రధాని అయ్యే స్థాయికి ఎదిగానని మోడీ చెబుతున్నారు. ఇక ఏ చిన్నారి బాలకార్మికుడిగా మారకుండా చూడాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ప్రతి కుర్రాడు దేశ ప్రధాని కాలేడు. కానీ ప్రతి పిల్లాడు స్కూల్ కు వెళ్లగలడు. మంచి విద్య పొందగలడు' అని కైలాష్ సత్యార్థి అన్నారు. -
పరీక్షలపై మలాలా బెంగ!
లండన్: ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన పాకిస్థాన్ బాలిక మలాలా యూసఫ్జాయ్కు ఇప్పుడు కొత్త బెంగ పట్టుకుంది. రాబోయే పాఠశాల పరీక్షల గురించే ఆమె బెంగంతా. నోబెల్ అవార్డు గెలుచుకున్న ఆనందంలో ఉన్నా.. త్వరలో జరగనున్న స్కూలు పరీక్షల గురించే ఆమె ఆందోళన చెందుతోంది. నోబెల్ అవార్డు తీసుకునే సమయం.. పరీక్షల సమయం ఒకేసారి రావడంతో కలత చెందుతున్నట్టు ఆమె పేర్కొంది. రెండేళ్లక్రితం తాలిబాన్ ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఈ పాకిస్థాన్ బాలిక మరణాన్ని జయించి ఉద్యమబాటలో కొనసాగుతూ.. బాలికల విద్యాహక్కు కోసం కృషి చేస్తున్న విషయం తెలిసిందే. నోబెల్ బహుమతి వచ్చిన రోజు సాయంత్రం 17 ఏళ్ల మలాలా బర్మింగ్హామ్లో తన కుటుంబంతో కలసి పాకిస్థానీ టెలివిజన్ చూస్తూ గడిపింది. తనకు జలుబు చేసిందని, ఆరోగ్యం ఏమంత బాగాలేదని ఆమె ‘ది సండే టైమ్స్’తో పేర్కొంది. ‘‘నోబెల్ అవార్డు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నా. నిజంగా ఇది గొప్ప గౌరవం. ప్రజలు చూపించిన ఆప్యాయతే కాల్పుల నుంచి కోలుకోవడానికి, మరింత దృఢంగా తయారు కావడానికి తోడ్పడింది. అందుకే సమాజానికి నా వంతు సేవ చేయాలని భావిస్తున్నా’’ అని ఆమె పేర్కొంది. తనకు నోబెల్ బహుమతి రాబోతున్న విషయంపై మలాలాకు అవగాహ నుంది. అయితే ఈ విషయాన్ని తన టీచర్ ద్వారానే ఆమె తెలుసుకుంది. అవార్డు వచ్చినరోజు ఉదయం పదిగంటలకు మలాలాకు కెమిస్ట్రీ క్లాస్ ఉంది. ‘‘నా వద్ద మొబైల్ లేదు. దీంతో నోబెల్కు సంబంధించిన వార్త రాగానే.. తాను వస్తానని టీచర్ తెలిపారు. పదింబావు అయింది. అయినా టీచర్ రాలేదు. దీంతో నాకు నోబెల్ రాలేదని భావించా. అయితే కొద్దినిమిషాల తర్వాత టీచర్ వచ్చి విషయం చెప్పారు’’ అని ఆమె తెలిపింది. తనకు అవార్డు వచ్చే విషయంలో తన టీచర్లే ఎక్కువ ఆసక్తి చూపారని, అవార్డు వచ్చినట్టు ప్రకటించాక తనకంటే వారే ఎక్కువ ఆనందపడ్డారని వివరించింది. -
‘నోబెల్’ సందేశం గ్రహించారా?
తొమ్మిది రోజులుగా గర్జించిన పాక్ శతఘు్నలు ఇప్పుడు మూగపోయాయి. అది ఆశావహమైన నోబెల్ కమిటీ సదుద్దేశాల ఫలితమేనని దానికి ధన్యవాదాలు తెలపాల్సిన పనేమీ లేదు. పాక్కు తగ్గట్టుగానే ఇంతకింత అన్న తీరుగా భారత్ బదులు చెప్పడమే కాదు, ఇంకాస్త ఎక్కువగానే ముట్టజెప్పింది. పాక్ ప్రభుత్వం మరింతగా ఈ ఘర్షణలను తీవ్రతరం చేస్తుందని ఊహాగానాలు సాగాయి. పాక్ సైనికాధికారుల సరికొత్త వ్యూహాత్మక లక్ష్యం దీర్ఘకాలిక శతృత్వ స్థితి అయితే తప్ప అలా జరిగే సూచనలేవీ లేవు. వారు అటల్ బిహారీ వాజ్పేయిని పరీక్షించి చూసినట్టుగా మోదీని కూడా పరీక్షించాలనుకుంటున్నారా? అలా చేస్తే అంతకు మించిన మూర్ఖత్వం ఉండదు. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఢిల్లీకి చెందిన గాంధేయవాది కైలాష్ సత్యార్థిని, ప్రవాసంలో గడుపుతున్న అసాధారణ పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్లను ఎంపిక చేశారు. వారి ఎంపిక ద్వారా నార్వే నోబెల్ కమిటీ... ప్రపంచం మెచ్చేది సంక్షేమ మంత్రాన్నే గానీ యుద్ధ తంత్రాన్ని కాదనే శక్తివంతమైన సందేశాన్ని పంపింది. పాకిస్థాన్ యుద్ధ సైనిక వ్యవస్థలో ఉన్నవారెవరైనాగానీ కాస్త చెవులకు పట్టిన తుప్పును వదలించుకుని ఆ సందేశాన్ని వినడం మొదలెట్టాలి. అదేదో నిరాకారమైన మానవాళి ఉద్ధరణ కోసమనో లేక సంఘర్షణలో చిక్కుపడి ఉన్న ఉపఖండం మంచి కోసమనో గాక పాకిస్థాన్ బాగు కోసమేనని భావించి మరీ వినాలి. ఇంతవరకు ఇద్దరు పాకిస్థానీలకు నోబెల్ బహుమతి లభించింది. 1979లో భౌతిక శాస్త్రవేత్త అబ్దుస్ సలామ్కు, ఇప్పుడు మలాలాకు. సలామ్ దైవ భక్తి గలిగిన ధర్మ నిష్టాపరుడే. అయినాగానీ ఆయన హత్యకు గురవుతానే మోనన్న భయంతో పాక్లో అడుగు పెట్టలేరు. కారణం ఆయన ఖాదీయానీ (అహ్మదీ ముస్లిం) శాఖకు, మత భ్రష్టమైనదిగా ముద్రవేసిన శాఖకు చెందినవాడు. ఉగ్రవాదాన్ని దుందుడుకు తిరోగమనవాద సామాజిక అజెండాతో కలగలిపిన ఆటవిక ఉగ్రవాదులకు బాలికల విద్యలో విశ్వాసంలేదు. కాబట్టి మలాలా వారికి లక్ష్యంగా మారింది. భారత్, అఫ్ఘానిస్థాన్లకు వ్యతిరేకంగా సాగు తున్న ముసుగు యుద్ధంలో అగ్రశ్రేణిలో నిలవడానికి ఆత్మాహత్యా సదృశమైన ఉత్సాహాన్ని ప్రదర్శించే పాక్ ‘రాజ్యంలోని రాజ్యం’ ఆ ఉగ్రవాద ముఠాలకు రక్షణను కల్పిస్తోంది. తొమ్మిది రోజులుగా వైషమ్యంతో గర్జించిన పాక్ శతఘు్నలు ఇప్పుడు మూగపోయాయి. అది ఆశావహ మైన నోబెల్ కమిటీ సదుద్దేశాల ఫలితమేనని దానికి ధన్య వాదాలు తెలపాల్సిన పనేమీ లేదు. పాక్కు తగినట్టుగానే ఇంత కింత అన్న తీరుగా భారత్ బదులు చెప్పడమే కాదు, ఇంకాస్త ఎక్కువగానే ముట్టజెప్పింది. పాక్ ప్రభుత్వం మరింత ప్రమాదకరంగా ఈ ఘర్షణలను తీవ్రతరం చేస్తుందని ఊహాగానాలు సాగాయి. పాక్ సైనికాధికారుల సరికొత్త వ్యూహాత్మక లక్ష్యం దీర్ఘకాలిక శతృత్వ స్థితి అయితే తప్ప అలా జరిగే సూచనలేవీ లేవు. వారు అటల్ బిహారీ వాజ్పేయిని పరీక్షించి చూసినట్టుగా నరేంద్ర మోదీని కూడా పరీక్షించాలనుకుంటున్నారా? అలా చేస్తే అంతకు మించిన మూర్ఖత్వం ఉందడు. ఒత్తిడికి లొంగి పోవడానికి ఆయనేమీ బలహీనుైడైన నేత కారు. రాహుల్ గాంధీ తిరిగి తనకే బెడిసి కొట్టగుండా తుపాకీని పేల్చడం అతి అరుదు. పాక్ ఒత్తిడికి మోదీ, రక్షణ మంత్రి అరుణ్ై జెట్లీలు లొంగిపోతున్నారని ఆయన శాసన సభ ఎన్నికల ప్రచారంలో అన్నారు. అలా అని ఆయన కాంగ్రెస్ ఓట్లు మరింత క్షీణించి పోయేలా చేశారు. క్విక్జోట్లాగా రాహుల్ ఇలా గాలి మరలపైకి తిరిగారో లేదో, 48 గంటలు గడిచేలోగానే పాక్ వెనక్కు తగ్గింది. పాక్ దౌత్య, సైనిక అధికారులు టీవీల్లో లేదా సమా వేశాల్లో కనిపించినప్పుడల్లా ఇదంతా ముందుగా ప్రారంభించినది భారత దేశమేనంటూ ఒకే ఒక్క సుపరిచితమైన ఆధారాన్ని చూపుతుంటారు. ఇతర రంగాల్లో, ప్రత్యేకించి దేశంలోపలే పలు అంతర్గత యుద్ధాల్లో పాక్ సైన్యం పెద్ద ఎత్తున మునిగి ఉండగా భారత్తో ఘర్షణకు దిగడానికి తగు కారణమేదీ లేదని వివరణ ఇస్తుంది. ఇదో కుత్సితం. హేతుబద్ధత మాటున పాక్ హేతువిరుద్ధమైనదాన్ని దాచి పెట్టే ప్రయత్నం చేస్తోంది. భారత్పై యుద్ధానికి దిగడానికి హేతుబద్ధమైన కార ణం ఏదైనాగానీ ఉండాల్సిన అవసరం ఉన్నదని పాక్కు ఎప్పుడూ అనిపించలేదు. శాంతియుతంగా చర్చలతో సాధించుకోగల దాన్ని యుద్ధంతో చేజిక్కిం చుకోవాలనే దే స్వాతంత్య్రం తర్వాత అది తీసుకున్న మొట్టమొదటి ముఖ్య నిర్ణయం. అటు పాక్లోగానీ, ఇటు భారత్లో గానీ విలీనం కాకుండా ఉన్న కాశ్మీర్ కోసం అది అక్టోబర్ 1947లోనే తిరుగు బాటు దార్లను, ఉగ్రవాదులను ప్రయోగించి దురాక్రమణను ప్రారం భించింది. ఏ మాత్రం సాధారణ ఇంగితం మార్గ దర్శకత్వంలోనైనా పాక్ విధానం సాగి ఉంటే 1948 వసంతం లేదా వేసవి నాటికే (అప్పటికి మనకు లభిం చినది అధినివేశ ప్రతిపత్తి మాత్రమే) బ్రిటిష్వారి అజమాయిిషీ కిందనే కాశ్మీర్ సమస్య శాంతి యుతంగా పరిష్కారమై ఉండేది. పాక్ ప్రభుత్వం ఉగ్రవాదం, ముసుగు యుద్ధం, సాధారణ సంఘర్షణలను కలగలిపి 1965లో భారత్పై యుద్ధానికి దిగింది. సాధారణ యుద్ధం ద్వారా కాశ్మీర్ను జయించడం ఎన్నటికీ సాధ్యంకాదని అది 1965, 1971 యుద్ధాల తదుపరి గ్రహించింది. దీంతో అది ఉగ్రవాదం, మంద్ర స్థాయి రెచ్చగొట్టే చర్యలు, సరిహద్దు ఉద్రిక్తతల ఎత్తుగడలను కలగలిపి కాశ్మీర్ సమస్యను సజీవంగా ఉంచగలిగే ఏకైక ఆధరువుగా మార్చింది. తద్విరుద్ధంగా, 1949 జనవరిలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన ప్పటి నుండి భారత్ ఎన్నడూ కాశ్మీర్లో తన భూభాగాన్ని విస్తరింపజేసుకోవాలని కోరుకోలేదు. 1971 యుద్ధంలో ఢాకాలో దాని 90 వేల బలగాలు మనకు లొంగిపోయిన దుస్థితిలో పాక్ ఉన్నప్పుడు కూడా మన దేశం ఆ ప్రయత్నం చేయలేదు. అలా అని దాడికి గురైనప్పుడు భారత్ బల గాలు చేతులు ముడుచుకు కూచుంటాయని కాదు. దశాబ్దిగా ఎన్నడూ ఎరుగని స్థాయి లలో పాక్ గత వారంలో హింసను రేకెత్తించగా మన బలగాలు మోదీ నాయకత్వంలో గట్టిగా బదులు చెప్పాయి. అసలు ఇప్పడు ఎందుకీ సరిహద్దు కాల్పులు? అనే ప్రశ్న మనకింకా మిగిలే ఉంటుంది. సమాధానంలోని కొంత భాగం ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు బరాక్ ఒబామాలు వాషింగ్టన్లో విడుదల చేసిన కీలకమైన సంయుక్త ప్రకటనలో ఉన్నదేమోనని ఆశ్చర్యం కలుగుతోంది. అమెరికా మొట్టమొదటిసారిగా పాక్ అభ్యం తరాలను పక్కన పెట్టి పాక్ భూభాగంపై ఉన్న ఉగ్రవాద స్థావరాలకు వ్యతిరేకంగా సాగే యుద్ధంలో భారత్ నిర్వహించాల్సిన సమంజసమైన పాత్ర ఉన్నదని అంగీకరించింది. తప్పుడు వ్యాఖ్యానాలకు గురికాకుం డటం కోసం నిర్దిష్టంగా ఆ ప్రకటన లష్కరే తోయిబా, జైషే మొహ్మద్, అల్కాయిదా, హక్కానీ నెట్ వర్క్ (అఫ్ఘానిస్థాన్లో పనిచేసేది), దావూద్ ఇబ్రహీం ‘డి’ కంపెనీ, ఇరాక్ ఇస్లామిక్ రాజ్యం వంటి సంస్థల పేర్లను పేర్కొనలేదు. ఇది భారత్, అమెరికా వ్యూహాత్మక సంబంధాన్ని అత్యంత ప్రమాదకరమైన యుద్ధ ప్రాంతంలోకి విస్తరింపజేసి, ఈ యుద్ధంలో భారత్ను అమెరికాకు ముఖ్య మిత్రునిగా మారుస్తుంది. అమెరికా రక్షణశాఖ పెంటగాన్తో వ్యవహరించేట్పపుడు అమెరికా రక్షణ దుర్గంగానూ, జిహాదిస్టులతో వ్యవహరించేటప్పుడు ఉగ్రవాద స్థావరంగాగానూ పాక్ ద్విపాత్రాభి నయం చేస్తోంది. ఆ ద్విపాత్రాభినయం ఇప్పడు పూర్తిగా బహిర్గతం కాకపోయినా మునుపెన్నడూ ఎరుగని విధంగా ఇబ్బందుల్లో పడింది.పాక్ సైన్యాధికారులు తమ సాయుధ శక్తిని తూర్పు రంగానికి మరలుస్తున్నామని భారత్, అమెరికా లకు సంకేతం పంపుతున్నారా? (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) - ఎం.జె. అక్బర్ -
అభినందన వెనుక అభిశంసన
త్రికాలమ్ భారతీయులకో, భారతదేశానికో అంతర్జాతీయ ఖ్యాతి లభించినప్పుడు ఆనం దించని దేశవాసులు ఉండరు. కొన్ని సందర్భాలు మాత్రం సందిగ్ధంలో పడవే స్తాయి. గుండెనిండా దేశభక్తి నింపుకున్నవారికి సైతం సంకటావస్థలు ఎదురవు తాయి. ఏ విధంగా స్పందించాలో తెలియని అయోమయం ఆవహిస్తుంది. బాల బంధు కైలాష్ సత్యార్థికీ, సాహస బాలిక మలాలా యూసఫ్జాయికీ ఉమ్మడిగా ఈ యేడాది నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న నిర్ణయాన్ని ప్రకటించిన సన్నివేశం ఇటువంటిదే. తనపైనా, తన సహచరులపైనా ఎన్ని దాడులు జరిగినా బాలకార్మికుల విముక్తికోసం మొక్కవోని ధైర్యంతో, అకుంఠిత దీక్షతో మూడు దశాబ్దాలు అహరహం శ్రమించినందుకు సత్యార్థికి అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుమతి దక్కింది. పాకిస్థాన్లో నెలకొన్న హింసాయుత వాతావరణంలో తాలిబాన్ను ఎదిరించి, ప్రాణాలకు తెగించి బాలికలకు చదువుకునే హక్కు సాధించడం కోసం పోరాడుతున్న మలాలాను అతి పిన్నవయస్సులోనే అత్యున్నత పురస్కారం వరించింది. వారిని సహస్రాభినందనలతో ముంచెత్తడం సముచితం. ఇది వారి వ్యక్తిగత విజయం. ఇందులో భారతదేశం కానీ పాకిస్థాన్ కానీ గర్వించవలసింది ఏమైనా ఉన్నదా? రెండు దేశాల అగ్ర నాయకులూ, వివిధ రంగాల ప్రముఖులూ సంతోషం వెలిబుచ్చడంలో అర్థం ఉందా? నోబెల్ కమిటీ చేసిన ప్రకటనలో అభినందన వెనుక దాగున్న అభిశంసనను రెండు దేశాల ప్రజలూ, పాలకులూ గమనించాలి. దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. మలాలా పాకిస్థాన్లో పుట్టకపోయినా, సత్యార్థి భారత దేశంలో పుట్టి పెరగక పోయినా నోబెల్ శాంతి బహుమతి వచ్చేది కాదు. సత్యార్థి సత్య నాదెళ్ళలాగానే ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తికాగానే అమెరికా వెళ్ళి ఉంటే ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీకి అధిపతి అయ్యేవాడేమో కానీ ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో)ను నెలకొల్పి బాలకార్మికుల విముక్తికోసం బచ్పన్ బచావ్ ఆందోళన్ నిర్వహించవలసిన అవసరం ఉండేది కాదు. అమెరికాలో తివాచీ కార్ఖానాలలో కానీ ఇటుక బట్టీలలో కానీ బాలకార్మికులను నియమించిన దాఖలా లేదు. ఇప్పుడు చదువుకుంటున్న ఇంగ్లండ్లోనే మలాలా పుట్టి ఉంటే బాలికల విద్యాహక్కు కోసం అక్కడ పోరాటం చేయవలసిన అవసరం ఉండేది కాదు. అక్కడ తాలిబాన్లు లేరు. బాలికల చదువుపైనా, టీకాలు వేయడంపైనా నిషేధం లేదు. బడికి వెళ్ళే బాలికలను చంపివేసే రాక్షసత్వం లేదు. పాకిస్థాన్లో పుట్టింది కనుకనే మలాలా తాలిబాన్ తూటాలకు గాయపడవలసి వచ్చింది. అక్కడ పెరిగింది కనుకనే బడికి వెళ్ళడం పెద్ద సాహస కార్యం అయింది. తనబోటి బాలికలకు చదువుకునే హక్కు ఉండాలంటూ పోరాటం చేసే స్ఫూర్తి లభించింది. మలాలాకు పాశ్చాత్య దేశాలలోని ప్రభుత్వాల, రాజకీయ వ్యవస్థల, మీడియా వ్యవస్థల సహకారం సంపూర్ణంగా లభించింది. ఇంట్లో తుపాకీ మోత బయట పల్లకీ మోత చందం ఆమె పరిస్థితి. సత్యార్థి 49 దేశాలలో బాలకార్మికుల విమోచన కోసం కృషి చేసినప్పటికీ మొన్నటి వరకూ మీడియా సంస్థలు పట్టించుకోలేదు. నోబెల్ శాంతి బహుమతి ప్రకటన జరిగినప్పుడు దాయాది దేశాలు ఏ స్థితిలో ఉన్నాయి? సరిహద్దులో కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. కాల్పులు జరుపుకుం టున్నాయి. పరస్పరం దూషించుకుంటూ మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఇండియాలో ఇప్పుడు ఉన్నది మన్మోహన్ ప్రభుత్వం కాదనీ నరేంద్ర భాయ్ మోదీ సర్కార్ ఉన్నదని గమనించాలనీ పాకిస్థాన్ను హెచ్చరిస్తూ దేశీయాంగ మంత్రి రాజ్నాథ్ సింగ్ బడాయి పోతున్నారు. మన సైనికులు పాకిస్థాన్ సైనికులకు తగిన శాస్తి చేశారనీ (ముహ్తోడ్ జవాబ్ దియే), శత్రు సైనికులు తోకముడిచారనీ ప్రధాని మోదీ సగర్వంగా చాటుతూ ఎన్నికల ప్రచారాన్ని రక్తికట్టిస్తున్నారు. కాంగ్రెస్ ఉపా ధ్యక్షుడు రాహుల్ గాంధీ సరిహద్దు ప్రహసనాన్ని ప్రచారాస్త్రంగా సంధించారు. పాకిస్థాన్ శాంతిని కోరుకుంటున్నదనీ, ప్రజలూ, సైనికులూ ప్రశాంతంగా బక్రీద్ వేడుకలు జరుపుకుంటున్నారనీ, కాల్పులు విరమించాలనీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ విజ్ఞప్తి చేశారు. రెండు ముఖ్యమైన రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో సరిహద్దులో నిజంగా ఏమి జరిగిందో సైన్యాధికారు లకూ, ప్రభుత్వాధినేతలకూ, ఇంగ్లిష్ టీవీ చానళ్ళకు మాత్రమే తెలుసు. యుద్ధ సన్నాహాలలో ఉన్న రెండు దేశాలకు చెందిన ఇద్దరు సాహసులకూ శాంతి బహుమతి ప్రకటించడం ద్వారా నోబెల్ కమిటీ ఒక సందేశం ఇచ్చింది. ఒక హెచ్చరిక చేసింది. రెండు దేశాలలో శాంతి కాముకులు ఉన్నారు. జనాభాలలో అత్యధికులు శాంతిప్రియులే. బహుమతి ప్రకటన తర్వాత మలాలా, సత్యార్థి చెప్పినట్టు రెండు దేశాల అధినేతలూ రెండు దేశాలలోనూ, రెండు దేశాల మధ్యా శాంతి సుస్థిరత లు నెలకొల్పే మహోద్యమానికి నాయకత్వం వహించాలన్నది సందేశం. రెండు దేశాలలోనూ అమానవీయమైన, అవమానకరమైన పరిస్థితులు నెలకొ న్నాయనీ, వాటిని సరిదిద్దుకోవాలనీ హెచ్చరిక. అమెరికా అగ్రవాదానికి ఒకవైపు అండగా ఉంటూనే దాన్ని ధిక్కరించే ఉగ్రవాదానికి ఊతం ఇవ్వడం అనే ఒకానొక ప్రమాదకరమైన, వంచనాత్మకమైన, ఆత్మహత్యాసదృశమైన విధానంవల్ల పాకిస్థాన్ అశాంతితో, అరాచకత్వంతో అట్టుడికి పోతోంది. ఎప్పుడు ఎక్కడ ఏ మానవ బాంబు పేలుతుందో, ఎంతమందిని పొట్టనపెట్టుకుంటుందో తెలియని అనిశ్చితి. ప్రజాస్వామ్య పాలనకోసం అర్రులుచాస్తున్న ప్రజలు ఒక వైపు. ఎప్పుడు పడి పోతుందో తెలియని ప్రభుత్వం మరో వైపు. అధికారం కబళించేందుకు అదను కోసం కాచుకొని కూర్చున్న సైన్యాధిపతులు ఇంకోవైపు. ఈ పరిస్థితిని సకాలంలో సరిచేసుకోవాలన్న హెచ్చరిక నోబెల్ ప్రకటనలో అప్రకటితంగా ఉంది. భారత్కు స్వాతంత్య్రం 1947లో వచ్చినప్పటికీ ఆర్థిక, సామాజిక పరిస్థితులు 2014లో కూడా అంతే అథమస్థాయిలో ఉన్నాయన్న అభిశంసన కూడా నోబెల్ నిర్ణయం వెనుక ఉన్నది. పేదరికం, దురాశ, అసమానతలు, పీడన వంటి దుర్భర మైన పరిస్థితుల నుంచి సమాజానికి విముక్తి కలిగించేందుకు కృషి చేయాలన్న సందేశం, లేకపోతే అశాంతి అనివార్యమన్న హెచ్చరిక గమనించకపోతే మన ఉపఖండానికి నిష్కృతి ఉండదు. ఇండియాలో పుట్టి అమెరికాలోనో, బ్రిటన్లోనో పరిశోధన చేసి నోబెల్ బహు మతి గెలుచుకున్న భారత సంతతి శాస్త్రవేత్తలను కూడా మన ఖాతాలో వేసుకొని సంబరం చేసుకుంటాం. వారు విదేశాలకు వెళ్ళకుండా స్వదేశంలోనే ఉంటే నోబెల్ బహుమతి కాదు కదా భట్నాగర్ అవార్డుకు కూడా నోచుకునేవాళ్ళు కాదు. 2009లో రసాయనశాస్త్రంలో నోబెల్ గెలుచుకున్న వెంకట్రామన్ రామకృష్ణన్ చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం చెప్పులరిగే దాకా తిరిగి చివరికి అమెరికా వెళ్ళిపోయాడు. ఇండియాలో కనుక ఉద్యోగం దొరికి ఉంటే నోబెల్ వచ్చేది కాదని ఆయనే వ్యాఖ్యానించాడు. దేశంలో ఉండి పరిశోధన చేస్తున్న శాస్త్రజ్ఞులకు అత్యున్నత పురస్కారం లభించకపోవడానికి లేనిపోని కారణాలు చెప్పుకొని సమాధానపడతాం. మన ప్రతిభను గుర్తించడం లేదని ఫిర్యాదు చేస్తాం. ఇందులోనూ రాజకీయాలేనని ఈసడించుకుంటాం. అసలు సమస్య మన వ్యవస్థలోనూ, మన దృక్పథంలోనూ ఉన్నదని గుర్తించడానికి నిరాకరిస్తాం. ఈ రోజుకూ మరుగుదొడ్లు సవ్యంగా లేని పాఠశాలలూ, కళాశాలలూ ఉన్న దేశంలో ప్రయోగశాలలు ఉంటాయని ఎట్లా ఊహించగలం. కనీస సౌకర్యాలు లేని విద్యాసంస్థల నుంచి నోబెల్ వంటి సర్వోన్నత బహుమతిని గెలుచుకోగల ప్రతిభావంతులు ఎట్లా తయారవుతారు? ప్రపంచం మొత్తం మీద అగ్రశ్రేణికి చెందిన రెండు వందల విశ్వవిద్యాలయాల జాబితాలో మన దేశానికి చెందిన విశ్వవిద్యాలయం ఒక్కటి కూడా లేదంటే మనం ఎక్కడ ఉన్నామో గ్రహించాలి. విశ్వవిద్యాలయాల కులపతులు విద్యామంత్రుల దగ్గరా, విద్యాశాఖ కార్యదర్శుల దగ్గరా పడిగాపులు కాయాలి. అనేక విశ్వవిద్యాలయాలకు కులపతుల నియామకమే జరగదు. ఇన్ని భయంకరమైన లోపాలు విద్యారంగాన్ని పట్టిపల్లార్చుతున్నా పట్టించుకోకుండా, ప్రమాణాలు పెంచుకునే ప్రయత్నమే చేయకుండా మనకు ఎవరో పనికట్టుకొని అన్యాయం చేస్తున్నారంటూ బాధపడటం ఆత్మవంచన. ’స్వచ్ఛ్ భారత్ అభియాన్’ను ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించినందుకు ఆయనను అందరూ అభినందిస్తున్నారు. ఆయన ప్రశంసార్హుడే. సందేహం లేదు. ఇన్నేళ్ళ స్వాతంత్య్రం తర్వాత కూడా ఇటువంటి దుస్థితిలో ఎందుకున్నామో ప్రశ్నిం చుకోవాలి. ప్రపంచంలోని బాలకార్మికులలో అత్యధికులు మన దేశంలో ఉన్నం దుకూ, సత్యార్థి వంటి సంఘ సేవకులు ఎంతోమంది పోరాటం చేస్తున్నా బాల కార్మికుల సంఖ్య తగ్గక పోగా ఏటేటా పెరుగుతున్నందుకూ సమష్టిగా సిగ్గుపడాలి. సర్వశిక్షాఅభియాన్ అమలు జరుగుతున్నప్పటికీ, విద్యను సార్వజనీనం చేయాలనీ, అందరికి చదువుకునే హక్కు కల్పించాలనీ చట్టాలు చేసుకున్నప్పటికీ చట్టాలను సవ్యంగా అమలు చేయలేకపోతున్నందుకు మనలను మనమే నిందించుకోవాలి. దాదాపు ఇటువంటి సిగ్గుమాలిన పరిస్థితులే పాకిస్థాన్లోనూ ఉన్నాయి. మతోన్మాదం, ఉగ్రవాదుల బెడద, సైన్యం పెత్తనం వారికి అదనం. నోబెల్ గెలుచుకొని చరితార్థులైనందుకు సత్యార్థినీ, మలాలానూ మనసారా అభినందిస్తూ, మన దేశాలు ఇంకా సామాజికంగా, ఆర్థికంగా, నైతికంగా వెనకబడి ఉన్నందుకు మనమూ, మన పొరుగువారూ మనస్తాపం చెందాలి. ఈ పరిస్థితులను మార్చ డానికి కృతనిశ్చయంతో కార్యోన్ముఖులం కావాలి. ఇదీ ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి నీతి. ప్రపంచంలోని బాలకార్మికులలో అత్యధికులు మన దేశంలో ఉన్నందుకూ, సత్యార్థి వంటి సంఘ సేవకులు ఎంతోమంది పోరాటం చేస్తున్నా బాలకార్మికుల సంఖ్య తగ్గక పోగా ఏటేటా పెరుగుతున్నందుకూ సమష్టిగా సిగ్గుపడాలి. కె. రామచంద్రమూర్తి -
మన సత్యార్థికి శాంతి నోబెల్
పాక్ బాలిక మలాలాతో కలిపి ఉమ్మడిగా శాంతి పురస్కారం ఓస్లో: ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం ఈసారి భారత్, పాకిస్థాన్ పౌరులను సంయుక్తంగా వరించింది. భారత ఉపఖండంలోని భారత్, పాకిస్థాన్ దేశాల్లో బాలల హక్కులు, బాలికల విద్య కోసం అలుపెరుగని ఉద్యమం సాగిస్తున్న సామాజిక కార్యకర్తలు కైలాష్ సత్యార్థి (60), మలాలా యూసఫ్జాయ్ (17)లను నోబెల్ కమిటీ ఈ ఏడాది శాంతి బహుమతికి ఎంపిక చేసింది. ‘‘బాలల అణచివేతకు వ్యతిరేకంగా, బాలలందరి విద్యా హక్కు కోసం పోరాడుతున్న కైలాష్ సత్యార్థి, మలాలా యూసఫ్జాయ్లకు 2014 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని అందించాలని నోబెల్ కమిటీ నిర్ణయించింది’’ అని జ్యూరీ శుక్రవారం ప్రకటించింది. నార్వేకు చెందిన నోబెల్ కమిటీ 11 లక్షల డాలర్ల నగదు బహుమతిని కూడా అందించే ఈ అవార్డును డిసెంబర్లో ఓస్లోలో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తారు. బాలల హక్కుల కోసం 3 దశాబ్దాలుగా పోరాటం భారత్కు నోబెల్ శాంతి బహుమతి లభించటం ఇది రెండోసారి. మానవ సేవయే మాధవ సేవ అంటూ అభాగ్యులు, అన్నార్తుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మథర్ థెరిస్సా 1979లో భారత్ తరఫున నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. అయితే.. ఆమె తన జీవితాన్ని భారత్లోనే గడిపినా జన్మించింది మాత్రం ఒకప్పటి యుగోస్లోవియాలో కావడం గమనార్హం. ఆమె భారత్కు వచ్చి స్థిరపడి ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ భారతీయ పౌరసత్వం పొందారు. అయితే.. జన్మతః భారతీయుడైన వ్యక్తి నోబెల్ శాంతి బహుమతి పొందడం ఇదే తొలిసారి. మధ్యప్రదేశ్కు చెందిన కైలాష్ సత్యార్థి ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి మూడు దశాబ్దాల కిందట ‘బచ్పన్ బచావో ఆందోళన్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. బలవంతపు చాకిరి, అక్రమ రవాణా నుంచి బాలలను రక్షించేందుకు ఈ సంస్థ ద్వారా కృషి చేస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు 80,000 మందికి పైగా బాలబాలికలను రక్షించారు. బాలల హక్కుల కోసం కైలాష్ సత్యార్థి ఎంతగానో కృషి చేశారని, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఎన్నో ఉద్యమాలు నడిపారని నోబెల్ కమిటీ కొనియాడింది. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో శాంతియుత ఆందోళనలకు నేతృత్వం వహించారని పేర్కొంది. నోబెల్ శాంతి బహుమతి లభించటంపై సత్యార్థి స్పందిస్తూ.. ఈ అవార్డు తనలో నూతనోత్తేజాన్ని నింపుతోందని, భారత్లో బాలల బానిసత్వాన్ని నిర్మూలించేందుకు మరింతగా కృషి చేస్తానని సత్యార్థి పేర్కొన్నారు. తనతో సంయుక్తంగా అవార్డుకు ఎంపికైన పాక్ బాలిక మలాలాకు ఆయన అభినందనలు తెలిపారు. తాము మరింత ముందుకెళ్లి భారత్ - పాక్ల మధ్య శాంతి కోసం కృషి చేయాల్సి ఉందన్నారు. బాలికల విద్యా హక్కుల ప్రతినిధిగా మలాలా రెండేళ్ల కిందట తాలిబాన్ ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడి.. మరణాన్ని జయించి ఉద్యమ బాటలో కొనసాగుతున్న పాక్ బాలిక మలాలా.. నోబెల్ బహుమతికి ఎంపికైన అతి పిన్నవయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. పాక్లో తాలిబాన్ల ప్రాబల్యమున్న ప్రాంతంలో బాలల హక్కుల కోసం, బాలికల విద్యా హక్కు కోసం ఉద్యమం కొనసాగిస్తోంది. గత ఏడాది కూడా నోబెల్ శాంతి బహుమతికి ఆమె పేరును నామినేట్ చేశారు. ‘‘మలాలా పిన్నవయస్కురాలే అయినప్పటికీ.. బాలికల విద్యా హక్కు కోసం కొన్నేళ్లుగా పోరాడుతోంది. బాలలు, చిన్నారులు కూడా స్వీయ పరిస్థితులను మెరుగుపరుచుకునేందుకు ఉద్యమించగలరని ఆమె నిరూపించింది. అదికూడా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఆమె చేసి చూపింది. ఆమె వీరోచిత పోరాటం ద్వారా బాలికల విద్యా హక్కుల కోసం గళమెత్తే ప్రధాన ప్రతినిధిగా నిలిచారు’’ అని నోబెల్ కమిటీ ప్రశంసించింది. నోబెల్ శాంతి బహుమతి విజేతలిద్దరికీ భారత రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తదితర నేతలు, ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఉద్రిక్తతలను చల్లార్చాలి భారత్ - పాక్ దేశాల మధ్య ఆధీనరేఖ, అంతర్జాతీయ సరిహుద్దు వెంట భారీగా కాల్పులు, మోర్టారు షెల్లింగ్లు చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో రెండు దేశాల పౌరులకూ సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించటం.. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చాల్సిన ఆవశ్యకతను బలంగా చెప్పినట్లయిందని పరిశీల కులు అభివర్ణిస్తున్నారు. ‘‘బాలల హక్కుల కోసం, బాలల విద్య కోసం, అతివాదానికి వ్యతిరేకంగా పోరాడటమనే ఉమ్మడి లక్ష్యం కోసం ఒక హిందువు, ఒక ముస్లిం - ఒక భారతపౌరుడు, ఒక పాకిస్థాన్ పౌరురాలు పనిచేయటం ముఖ్యమైన అంశంగా మేం పరిగణిస్తున్నాం’’ అని నోబెల్ కమిటీ అవార్డు ప్రకటనలో పేర్కొంది. నోబెల్ కమిటీ గతంలో కూడా.. ప్రపంచంలో ఏవైనా రెండు దేశాలు లేదా వర్గాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలను పరిష్కరించి శాంతి నెలకొల్పడం కోసం కృషి చేసిన రెండు వైపుల వారికీ సంయుక్తంగా శాంతి బహుమతిని ప్రకటించింది. 1993: దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష పాలనకు ముగింపు పలికేందుకు చేసిన కృషికి గాను.. నాటి వివక్షాపూరిత ప్రభుత్వానికి చివరి అధ్యక్షుడు ఎఫ్.డబ్ల్యు. డిక్లెర్క్, నల్ల సూరీడు నెల్సన్ మండేలాకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. 1994: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేసిన కృషికి గాను.. ఇజ్రాయెల్ నాయకులు షిమన్ పెరెస్, యిత్జాక్ రాబిన్లకు, పాలస్తీనా నేత యాసర్ అరాఫత్కు సంయుక్తంగా శాంతి బహుమతి ఇచ్చారు. 1997: నార్తర్న్ ఐర్లాండ్లో సంఘర్షణకు శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు చేసిన కృషికి గాను.. నార్తర్న్ ఐర్లాండ్కు చెందిన జాన్హ్యూమ్, బ్రిటన్కు చెందిన డేవిడ్ ట్రింబుల్లకు సంయుక్తంగా శాంతి బహుమతిని ప్రదానం చేశారు. -
భారత్లోనే అత్యధికంగా బాల కార్మికులు
న్యూఢిల్లీ: బాలల హక్కుల ఉద్యమ కారుడు కైలాశ్ సత్యార్థికి నోబెల్ పురస్కారం లభించడంతో భారత్లోని బాల కార్మిక వ్యవస్థపై ఒక్కసారిగా ప్రపంచం దృష్టి పడింది. పిల్లలను పనిలో పెట్టుకోవడంపై నిషేధం ఉన్నప్పటికీ.. లక్షలాదిగా పేద పిల్లలు భారత్లో బాల కార్మికులుగా జీవితం వెల్లదీస్తున్నారు. కార్ఖానాల్లో, వస్త్ర పరిశ్రమల్లో, ఇటుక బట్టీల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో, ఇళ్లల్లో, షాపుల్లో, హోటళ్లలో, రోడ్డు పక్క తినుబండారాల బండ్ల వద్ద.. ప్రమాదకర పరిస్థితుల్లో నిరుపేద పిల్లలు వయసుకు మించిన పనులు చేస్తూ కనిపిస్తుంటారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో బాల కార్మికులున్న దేశం భారతే కావడం అత్యంత దురదృష్టకర విషయం. కార్మిక శాఖ లెక్కల ప్రకారం దేశలో 50 లక్షల మంది బాల కార్మికులున్నారు. వాస్తవానికి ఆ సంఖ్య 5 కోట్ల కన్నా ఎక్కువని బచ్పన్ బచావో ఆందోళన్ సహా పలు ఎన్జీవోలు స్పష్టం చేస్తున్నాయి. -
నోబెల్ విజేతలకు సెల్యూట్..
న్యూఢిల్లీ/లండన్/ఐక్యరాజ్యసమితి: ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం సాధించిన కైలాష్ సత్యార్థి, మలాలా యూసుఫ్ జాయ్లను రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సహా పలువురు ప్రముఖులు అభినందించారు. ‘‘దేశంలో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కైలాష్ సత్యార్థి చేసిన కృషి ఎనలేనిది. శక్తివంతమైన భారత పౌర సమాజం బాలకార్మిక వ్యవస్థ వంటి సామాజిక సమస్యలపై చేస్తున్న పోరాటానికి దక్కిన గుర్తింపు ఇది’’ అని ప్రణబ్ముఖర్జీ శుక్రవారం తన సందేశంలో పేర్కొన్నారు. ‘‘శ్రమ, భయం అనేది లేకుండా పోరాడిన ఇద్దరు అద్భుతమైన వ్యక్తులకు దక్కిన అరుదైన గౌరవం ఇది.’’ అని అన్సారీ చెప్పారు. ‘‘నోబెల్ శాంతి పురస్కారం సాధించిన కైలాష్ సత్యార్థికి అభినందనలు. ఆయన అందించిన సేవలకు నా సెల్యూట్’’ అని మోదీ సామాజిక వెబ్సైట్ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పాక్ బాలిక మలాలా నోబెల్ సాధించినందుకు ఆమెకు నా అభినందనలు’’ అని మోదీ పేర్కొన్నారు. సత్యార్థి నోబెల్ రావడం దేశానికే గర్వకారణమని, వారు దక్షిణాసియాకే తలమానికమని సోనియాగాంధీ అభివర్ణించారు. బాలల హక్కుల కోసం సత్యార్థి చేసిన పోరాటానికి ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ పేర్కొన్నారు. బాలల హక్కుల కోసం పోరాడిన సత్యార్థి, మలాలాకు నోబెల్ శాంతి బహుమతి వరించడాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్వాగతించింది. సత్యార్థి, మలాలా చిన్నారులకు సంబంధించి గొప్ప చాంపియన్లని ఐక్యరాజ్యసమితి చీఫ్ బాన్ కీ మూన్ ఓ ప్రకటనలో కొనియాడారు. నోబెల్ గ్రహీతకు జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు సాక్షి, హైదరాబాద్: నోబెల్ బహుమతి గెలుచుకున్న బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రకాలుగా క్షోభ అనుభవిస్తున్న 80 వేల మంది బాలలకు తోడ్పాటునివ్వడంలో ఆయన సేవలను కొనియాడారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నోబెల్ గ్రహీతలను అభినందించారు. మలాలా పాకిస్థాన్కు గర్వకారణం: నవాజ్ షరీఫ్ ఇస్లామాబాద్: మలాలా పాకిస్థాన్కు గర్వకారణమని, ఆమె తన దేశ ప్రజలు తల ఎత్తుకునేలా చేసిందని పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కొనియాడారు. -
నెటిజన్ల జపం..!
న్యూఢిల్లీ/విదిశ: నోబెల్ పురస్కారం ప్రకటించడానికి ముందు కైలాష్ సత్యార్థికి ట్విట్టర్లో ఉన్న ఫాలోవర్లు 200 మంది కన్నా తక్కువే. కానీ ప్రకటన వెలువడ్డ గంటన్నరలోనే ఆ సంఖ్య 4,500, శుక్రవారం సాయంత్రానికి 6,820కి చేరింది. ఇంకా పెరుగుతూనే ఉంది. ఆయన వెబ్సైట్ www.kailashsatyarthi.net సందర్శకుల డిమాండ్ను తట్టుకోలేక స్పందించడమే మానేసింది. ‘బచ్పన్ బచావో ఆందోళన్(బీబీఏ)’ సంస్థ వెబ్సైట్ కూడా క్రాష్ అయింది. కాగా, కైలాష్ సత్యార్థికి నోబెల్ పురస్కారం వార్త తెలియగానే ఆయన సొంత పట్టణం విదిశలో సంబరాలు ప్రారంభమయ్యాయి. స్వీట్లు పంచుకుంటూ, బాణాసంచా కాలుస్తూ ప్రజలు పండుగ చేసుకున్నారు. ముఖ్యంగా సత్యార్థి నివాసం ‘చోటీ హవేలీ’లో ఉత్సవ వాతావరణం నెలకొంది. సత్యార్థి కుటుంబసభ్యులంతా విదిశలోనే నివసిస్తున్నారు. -
‘బాల్య’ మిత్రుడు..!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని విదిశలో 1954 జనవరి 11న కైలాష్ సత్యార్థి జన్మించారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్గా తన కెరీర్ను వదిలి.. 26 ఏళ్ల వయసులోనే బాలల హక్కుల ఉద్యమ బాట పట్టారు. ‘బచ్పన్ బచావో ఆందోళన్(బాలల హక్కుల రక్షణ ఉద్యమం)’ను ప్రారంభించారు. చిన్నారుల అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థల్లో ఇదే ప్రముఖమైనది. సత్యార్థి ప్రారంభించిన ‘గ్లోబల్ మార్చ్ అగెనైస్ట్ చైల్డ్ లేబర్’ ఉద్యమం చాలా దేశాల్లో క్రియాశీలంగా ఉంది. కైలాష్ సత్యార్థిగతంలోనూ పలుమార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. 1994లో బాల కార్మికులు లేని సంస్థలు తయారు చేస్తున్న రగ్గులు, కార్పెట్ల కోసం ‘రగ్మార్క్’ అనే ముద్రను సృష్టించారు. ఈ రగ్గులు, కార్పెట్లు విదేశాల్లో చాలా ఫేమస్. ప్రస్తుతం ఈ రగ్మార్క్ను ‘గుడ్వేవ్స్’గా మార్చారు. భారత్లో 50లక్షల బాల కార్మికులున్నారన్నది అంచనా. కానీ సత్యార్థి,ఇతర ఎన్జీవోల లెక్కల ప్రకారం అది 5 కోట్లు. బాల కార్మిక వ్యవస్థ వల్ల పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, జనాభా పెరుగుదల లాంటి సమస్యలు ఉత్పన్నవవుతాయని సత్యార్థి వివరిస్తారు. బాలలపై పాల్పడే నేరాలకు మరింత కఠినమైన శిక్షలు ఉండాలని, బాలలకు సంబంధించి సమగ్ర చట్టాలను రూపొందించాల్సి ఉందని ఆయన వాదిస్తారు. బాలల హక్కుల కోసం పోరాడుతున్న ‘ద ఇంటర్నేషనల్ సెంటర్ ఆన్ చైల్డ్ లేబర్ అండ్ ఎడ్యుకేషన్’, ‘ద గ్లోబల్ క్యాంపెయిన్ ఫర్ ఎడ్యుకేషన్’ సహా పలు అంతర్జాతీయ సంస్థలతో కలసి పనిచేస్తున్నారు. సత్యార్థి అందుకున్న అంతర్జాతీయ అవార్డులు డిఫెండర్స్ ఆఫ్ డెమొక్రసీ అవార్డ్ ( 2009- అమెరికా) మెడల్ ఆఫ్ ఇటాలియన్ సెనేట్ ( 2007 - ఇటలీ) రాబర్ట్ ఎఫ్ కెనెడీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అవార్డ్ ( అమెరికా) ఫ్రెడెరిక్ ఎబర్ట్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అవార్డ్ (జర్మనీ) అల్ఫాన్సో కొమిన్ ఇంటర్నేషనల్ అవార్డ్ (2008 - స్పెయిన్) సత్యార్థి చేసిన ప్రముఖ వ్యాఖ్యలు ‘ఇప్పుడు కాకపోతే మరెప్పుడు?, నువ్వు కాకపోతే మరెవ్వరు? ఈ మౌలిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగితే.. బానిసత్వాన్ని సంపూర్ణంగా నిర్మూలించగలం’ ‘ఇదొక పరీక్ష అని నేననుకుంటున్నా. ఈ నైతిక పరీక్షను అంతా కచ్చితంగా పాస్ కావాలి(బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటంపై)’ ‘బాలలను బానిసలు గా చేయ డం నేరం. మానవత్వమే ఇక్కడ పణంగా ఉంది. ఇం కా చేయాల్సిన పని చాలా ఉంది. అయితే, నేను చనిపోయేలోపు బాలకార్మిక వ్యవస్థ అంతాన్ని చూస్తాను’ -
అక్షరాల కోసం తుపాకీపై పోరాటం!
లండన్: ఆంక్షల రాజ్యంలో హక్కుల కోసం ఎలుగెత్తి నినదించడం అంత సులభం కాదు. ఇక చిన్నపిల్లల పరిస్థితి చెప్పనక్కర్లేదు. కానీ మలాలా అధైర్యపడలేదు. అన్నపానీయాలెంత అవసరమో, జ్ఞానం కూడా అంతే అవసరమనుకుంది ఆ చిన్నారి. తాలిబన్ల రాజ్యంలో బాలికల హక్కుల అణచివేతపై గొంతు విప్పింది. తుపాకులు, బాంబులతో విరుచుకుపడే శత్రువులను కేవలం కలంతో, మాటలతో ప్రాణాలకు తెగించి ప్రతిఘటించింది. మతోన్మాదుల పాలనలో అక్షరాలకు దూరమైన బాలికల వెతలను ఆవేదనతో ఆర్తిగా ప్రపంచం కళ్లకు కట్టింది. ఆ అకుంఠిత పోరాటంలో శత్రువు తూటాల దాడికి గురై మృత్యువుకు చేరువదాకా వెళ్లింది. తర్వాత కూడా ఆమె వీరోచిత పోరాటం ఆగలేదు. తమ దేశంలోనే కాకుండా అణగారిన దేశాలన్నింటిలోని బాలికల హక్కుల రక్షణకు నడుం బిగించింది. ఈ కృషికి గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి ఆమె ఒడిలో వచ్చి వాలింది. ప్రపంచంలో అందరికీ తెలిసిన టీనేజర్గా గుర్తింపు పొందిన మలాలా యూసఫ్ జాయ్ 1997 జూలై 12నలో పాకిస్థాన్లోని ఖైబర్-పక్తూన్క్వా రాష్ట్రం స్వాత్లోయలోని మింగోరా పట్టణంలో సున్నీ ముస్లింల కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి జియావుద్దీన్ స్కూలు యజమాని. విద్యాహక్కు కార్యకర్త. మలాలా ఆయన స్కూల్లోనే చదువుకుంది. 2007 నుంచి 2012 వరకు స్వాత్ లోయలోని పలు ప్రాంతాల్లో తాలిబన్ల నిరంకుశ పాలన సాగింది. ఉగ్రవాదులు టీవీలు, సినిమాలు, పుస్తకాలపై నిషేధం విధించారు. బాలికలు చదువుకోకూడదంటూ వారి పాఠశాలలను పేల్చేశారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితిలో మలాలా గొంతువిప్పింది. 2008లో పెషావర్ సభలో ‘విద్య నా ప్రాథమిక హక్కు. దాన్ని లాగేసుకోవడానికి తాలిబన్లకు ఎంత ధైర్యం?’ అని మండిపడింది. 2009లో 12 ఏళ్ల వయసులో బీబీసీ బ్లాగులో గుల్ మకాల్ అనే పేరుతో స్వాత్ బాలికల దయనీయ స్థితిని వివరించింది. మీడియాఇంటర్వ్యూల్లో తాలిబన్లపై నిప్పులు చెరిగింది. తలలోకూ తూటా.. :మలాలా పోరాటాన్ని తాలిబన్లు సహించలేకపోయారు. 2012 అక్టోబర్ 9న స్కూలుకు వెళ్తుండగా ఓ మిలిటెంట్ ఆమెపై మూడు తూటాలు పేల్చాడు. ఒకటి ఆమె తలలోకి దూసుకెళ్లి భుజం దాకా వెళ్లింది. ఆ ప్రాణాంతక గాయానికి మెరుగైన చికిత్స కోసం ఆమెను బ్రిటన్కు తరలించారు. చికిత్సతో కోలుకున్న మలాలా ప్రస్తుతం బర్మింగ్హామ్ స్కూల్లో చదువుకుంటోంది. పాక్కు వస్తే చంపుతామని తాలిబన్లు బెదిరించడంలో మలాలా కుటుంబం బ్రిటన్లోనే ఉంటోంది. ఐక్యరాజ్య సమితితో కలిసి విద్యా హక్కుకోసం పోరాడుతోంది. యూరోపియన్ యూనియన్ మానవ హక్కుల అవార్డు, పాకిస్థాన్ యువ శాంతి పురుస్కారం వంటి ఎన్నో అవార్డులు అందుకుంది. ‘ఐయామ్ మలాలా’ పేరుతో గత ఏడాది ఆత్మకథను వెలువరించింది. ‘‘ఉగ్రవాదులు నేను మారతాననుకున్నారు. వారి దాడితో నాలో బలహీనత, భయం పోవడం తప్ప నా జీవితంలో ఎలాంటి మార్పూ రాలేదు. నేను తాలిబ్(తాలిబన్ మిలిటెంట్)ను ద్వేషించడం లేదు. అతడు ఎదురుగా నిలబడితే నా చేతిలో తుపాకీ ఉన్నా కాల్చను’’ అని ఐరాసలో గత ఏడాది ఉద్వేగంగా చెప్పిన మలాలా నిజంగా శాంతదూతే. -
భారత్-పాక్ శాంతి కోసం కృషి చేస్తాం
మలాలా, సత్యార్థి వెల్లడి లండన్: నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన కైలాశ్ సత్యార్థి, మలాలా యూసఫ్జాయ్లు తమ దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు కృషి చేస్తామని చెప్పారు. ‘మేం కలిసి పనిచేస్తాం. భారత్, పాక్ మధ్య బలమైన సంబంధాల నిర్మాణానికి కృషి చేస్తాం. నేను శాంతిని విశ్వసిస్తున్నాను’ అని మలాలా విలేకర్లతో చెప్పింది. ఘర్షణకంటే అభివృద్ధి ముఖ్యమని పేర్కొంటూ, శాంతి నెలకొనేలా చూడాలని భారత్, పాక్ల ప్రధానులు మోదీ, షరీఫ్లకు విజ్ఞప్తి చేసింది. డిసెంబర్లో ఓస్లోలో జరిగే ఈ అవార్డు ప్రదాన కార్యక్రమానికి రావాలని వారిని తాను, సత్యార్థి కోరతామంది. నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన తొలి పాకిస్థానీని తానేనని, ఈ అవార్డును తమ గొంతును బలంగా వినిపించలేని బాలలకు అంకితం చేస్తున్నానని పేర్కొంది. కాగా, తనకు మలాలా వ్యక్తిగతంగా తెలుసని, అవార్డుకు ఎంపికైనందుకు ఆమెకు ఫోన్చేసి అభినందిస్తానని సత్యార్థి చెప్పారు. బాలల హక్కుల పరిరక్షణతో పాటు భారత ఉపఖండంలో శాంతి నెలకొనేందుకు కలిసి పనిచేద్దామని ఆమెను కోరతానన్నారు. శాంతియుతంగా జీవించడం భారత్, పాక్ బాలల హక్కు అని పేర్కొన్నారు. -
గాంధీజీకి వస్తే బావుండేది!
నోబెల్ పురస్కారంపై సత్యార్థి స్పందన న్యూఢిల్లీ: నోబెల్ శాంతి బహుమతికి తనను ఎంపిక చేయడంపై కైలాశ్ సత్యార్థి సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకో గొప్ప గౌరవమని, అయితే, తనకన్నాముందు గాంధీజీకి ఈ అవార్డ్ వచ్చి ఉంటే మరింత గౌరవంగా భావించేవాడినన్నారు. సత్యార్థి స్పందన ఆయన మాటల్లోనే.. ‘నోబెల్ కమిటీకి కృతజ్ఞతలు. ఇదో గొప్ప గౌరవం నాకు. అయితే, ఈ అవార్డ్ జాతిపిత మహాత్మాగాంధీకి వచ్చి ఉంటే నేను మరింత సంతోషించేవాడిని. గాంధీజీ తరువాత నాకు లభించి ఉంటే మరింత గౌరవంగా భావించేవాడిని. ఈ అవార్డ్ భారతీయులకే అంకితం. ఇది నా బాధ్యతను మరింత పెంచింది. బాలల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం ఇకపై రెట్టించిన ఉత్సాహంతో కృషి చేస్తాను. ప్రస్తుత ఆధునిక సమాజంలోని లక్షలాది చిన్నారుల దుస్థితిని గుర్తించిన నోబెల్ కమిటీకి కృతజ్ఞతలు. ఈ పురస్కారంతో చిన్నారుల సమస్యలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుంది. ఈ సమస్య కేవలం పేదరికానికో, బాలల హక్కులకో సంబంధించినది కాదు. అంతకన్నా లోతైనది. భారత్ సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో బాలల పరిస్థితి దయనీయంగా ఉంది. బానిసత్వంలో మగ్గుతున్న, హక్కులకు దూరంగా ఉన్న ప్రతీ బాలుడికీ స్వేచ్ఛ లభించేంతవరకు మా పోరాటం కొనసాగుతుంది. అప్పటివరకు నాకు విశ్రాంతి లేదు’ అన్నారు. బాలల హక్కు లు బాల్యం నుంచి తనకు ఇష్టమైన అంశమని సత్యార్థి తెలిపారు. ‘సహజమైన హక్కులకు దూరమైన పిల్లల కోసం ఏదైనా చేయాలని నాకప్పటినుంచే అనిపించేది’ అన్నారు. బచ్పన్ బచావో ఆందోళన్! ‘బచ్పన్ బచావో ఆందోళన్’ను సత్యార్థి 1980లో ప్రారంభించారు. ఆ సంస్థ దేశవ్యాప్తంగా 80 వేలకు పైగా బాల కార్మికులకు.. వెట్టి చాకిరీ నుంచి విముక్తి కలిగించింది. ముఖ్యంగా ఢిల్లీలో బాల కార్మికులను రక్షించేందుకు దాడులు నిర్వహిస్తున్న అధికారులకు అన్నివిధాలుగా సహకరించింది. బాలల హక్కుల కోసం ఈ సంస్థ శాంతియుత ఆందోళనలు నిర్వహిస్తుంటుంది. ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, జార్ఖండ్లలో ఈ సంస్థ చాలా క్రియాశీలంగా ఉంది. ఈ సంస్థకు 70 వేలమంది వ్యక్తిగతంగా సహకరిస్తుంటారు. 750 పౌరసంస్థలు దీని కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నాయి. ప్రజాఉద్యమంలాంటి ఈ సంస్థ ప్రధాన కార్యకలాపాలను ముఖ్యంగా.. ‘ది అసోసియేషన్ ఆఫ్వాలంటరీ యాక్షన్’, ‘ద బాల్ ఆశ్రమ్ ట్రస్ట్’, ‘సేవ్ ది చైల్డ్హుడ్ ఫౌండేషన్’ అనే మూడు స్వచ్ఛంద సంస్థలు నిర్వర్తిస్తుంటాయి. మోదీజీ.. మీదే బాధ్యత! ఇటీవలి లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం నరేంద్రమోదీ గురించి సత్యార్థి ట్విటర్లో ఇలా స్పందించారు. ‘టీ అమ్మే ఒక బాలుడు ప్రతికూలతలను జయించి భారత ప్రధాని అవుతున్నారు. ఇక ఏ చిన్నారీ బాల కార్మికుడిగా మారకుండా చూడాల్సిన బాధ్యత ఆయనదే’ అని ట్వీట్ చేశారు. -
'గాంధీజీకి వచ్చి ఉంటే సంతోషించేవాడిని'
న్యూఢిల్లీ: తనకన్నా ముందు గాంధీజీకి ఈ అవార్డ్ వచ్చి ఉంటే మరింత గౌరవంగా భావించేవాడినని నోబెల్ శాంతి అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి తెలిపారు. నోబెల్ శాంతి బహుమతికి తనను ఎంపిక చేయడంపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన ముందుగా గాంధీజీకి వచ్చే ఉంటే మరింత సంతోషించేవాడినని అన్నారు. ‘నోబెల్ కమిటీకి కృతజ్ఞతలు. ఇదో గొప్ప గౌరవం నాకు. అయితే, ఈ అవార్డ్ జాతిపిత మహాత్మాగాంధీకి వచ్చి ఉంటే నేను మరింత సంతోషించేవాడిని. గాంధీజీ తరువాత నాకు లభించి ఉంటే మరింత గౌరవంగా భావించేవాడిని. ఈ అవార్డ్ దేశానికి అంకితం. ఇది నా బాధ్యతను మరింత పెంచింది. బాలల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం ఇకపై రెట్టించిన ఉత్సాహంతో కృషి చేస్తాను'అని తెలిపారు. -
శాంతి దూతలు
-
'నోబెల్' విజేతలకు వైఎస్ జగన్ అభినందన
హైదరాబాద్: నోబెల్ శాంతి బహుమతి విజేతలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. వెట్టిచాకిరి నుంచి చిన్నారులకు విముక్తి కల్పించి.. విద్య, ఆశ్రయం కల్పించిన కైలాశ్ సత్యార్థి కృషి మరువలేనిదని కొనియాడారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత బాలల హక్కుల కార్యకర్త కైలాశ్ సత్యార్థి, పాకిస్థాన్ లో బాలికల విద్యాహక్కు కోసం పోరాడాడిన మలాలా యూసఫ్జాయ్ లకు 2014 సంవత్సరాలనికి నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. -
భారతీయుడికి నోబెల్ శాంతి బహుమతి
-
ఎవరీ కైలాశ్ సత్యార్థి?
భారతీయుడు కైలాశ్ సత్యార్థికి ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించడంతో ఆయన పేరు మీడియాలో మార్మోగుతోంది. బాలల హక్కుల కార్యకర్త అయిన ఇప్పటివరకు 80 వేల మంది పిల్లలకు వెట్టిచారికి నుంచి విముక్తి లభించారు. బచ్పన్ బాచావో ఆందోళన్ సంస్థను స్థాపించి అనాథ బాలలకు పునరావాసం, విద్య అందిస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని విదిశ ప్రాంతానికి చెందిన ఆయన బాలల హక్కుల కోసం అవిరాళ పోరాటం చేశారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, మానవ హక్కులు, అనాథ చిన్నారుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. కైలాశ్ సత్యార్థి న్యూఢిల్లీలో నివసిస్తూ తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఆయన కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన పోరాటాలకు గుర్తింపుగా పలు అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. -
పోరాటానికి లభించిన గుర్తింపు: కైలాశ్ సత్యార్ధి
న్యూఢిల్లీ: బాలల హక్కుల కోసం చేసిన పోరాటానికి లభించిన గుర్తింపు అని నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్థి వ్యాఖ్యానించారు. నోబెల్ బహుమతికి లభించడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. నార్వేయిన్ నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించిన నోబెల్ పురస్కారాన్ని మలాలా యూసఫ్ జాయ్ తో కలిసి కైలాశ్ సత్యార్ధి అందుకున్న సంగతి తెలిసిందే. 1990 నుంచి బాల కార్మికుల నిర్మూలన కోసం పాటు పడుతున్నారు. ఇప్పటి వరకు 80 వేల మంది బాలలకు వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించి విద్య, పునరావాసాన్ని కల్పించారు. -
భారతీయుడికి నోబెల్ శాంతి బహుమతి
స్టాక్హోం: ఈ సంవత్సరం నోబెల్ శాంతి పురస్కారం భారత్, పాకిస్థాన్ లకు సంయుక్తంగా దక్కింది. భారతీయుడు కైలాశ్ సత్యార్థి, పాకిస్థాన్ హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్జాయ్ లను సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి వరించింది. వీరిద్దరూ బాలల హక్కుల కార్యకర్తలు కావడం విశేషం. బాలలు, యువత హక్కుల కోసం పోరాడినందుకు వీరికి నోబెల్ పురస్కార కమిటీ ఈ అవార్డు ప్రకటించింది. చిన్నారుల చదువు కోసం వీరు రాజీలేని పోరాటం చేశారని కమిటీ ప్రశసించింది. పాకిస్థాన్ బాలికల విద్యాహక్కు కోసం మలాలా తీవ్రవాదులకు తూటాలకు ఎదురునిలిచింది. -
నోబెల్ శాంతి బహుమతికి 278 నామినేషన్లు
నోబెల్ శాంతి బహుమతికి ఎప్పుడూ మహా అయితే పది మందో, పాతిక మందో పోటీ పడతారు. కానీ ఈసారి మాత్రం ఎప్పుడూ లేనంతగా 278 మంది ఈ బహుమతికి నామినేట్ అయ్యారు. నోబెల్ బహుమతుల విజేలత పేర్లను అక్టోబర్ నెలలో ప్రకటిస్తారు. సాధారణంగా ప్రతిఏటా ఈ నామినేషన్లు పెరుగుతూనే ఉంటాయని, దీన్ని బట్టే ఈ అవార్డుకు ఉన్న ప్రాధాన్యం తెలుస్తోందని సంస్థ అధినేత గైర్ లండెస్టాడ్ తెలిపారు. ప్రపంచం నలుమూలల నుంచి తమకు నామినేషన్లు అందుతున్నాయన్నారు. ఈసారి వచ్చిన నామినేషన్లను సమీక్షించేందుకు నోబెల్ కమిటీ సమావేశమైంది. నామినేషన్లు పంపేందుకు చివరి గడువు ఫిబ్రవరి 1. తొలిసమావేశంలో ఈ కమిటీలో ఉండే ఐదుగురు సభ్యులు మరిన్ని పేర్లను తమకు తాముగా జాబితాకు జత చేయచ్చు. గత సంవత్సరం ఈ అవార్డుకు 259 నామినేషన్లు వచ్చాయి. -
‘నోబెల్’కు నామినేట్ అయిన స్నోడెన్
అమెరికా నిఘా వ్యవహారాలను ప్రపంచానికి చాటిన ధీరుడు ఓస్లో (నార్వే): దేశ భద్రత ముసుగులో దేశాలు, సంస్థలు, వ్యక్తుల ఆంతరంగిక వ్యవహారాలపై విస్తృత స్థాయిలో నిఘా పెట్టిన అమెరికా దుశ్చర్యను బట్టబయలు చేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. స్నోడెన్ సహకారంతో వికీలీక్స్ వెబ్సైట్ వెల్లడించిన అమెరికా నిఘా వ్యవహారం గత సంవత్సరం సంచలనం సృష్టించింది. అమెరికాపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు కూడా వ్యక్తమయ్యాయి. నార్వేలో ఇంతకుముందు అధికారంలో ఉన్న వామపక్ష సోషలిస్ట్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన బార్డ్ వెగర్ సోజెల్, సొంత పార్టీకి చెందిన మరో నేత స్నోరీ వాలెన్తో కలిసి స్నోడెన్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తూ నార్వేలోని నోబెల్ కమిటీకి లేఖ రాశారు. స్నోడెన్ చర్య ప్రభుత్వాల విశ్వసనీయతపై చర్చను లేవనెత్తిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. -
పురస్కారం: మదర్ థెరిసా.. ప్రపంచ శాంతిదూత
నోబెల్ ఇండియా: అత్యంత ప్రతిష్టాకరమైన నోబెల్ పురస్కార గ్రహీతలలో భారతదేశానికే కీర్తి తెచ్చిన స్త్రీ మదర్ థెరిసా. ఈమెకు 1979వ సంవత్సరంలో నోబెల్ శాంతి పురస్కారం లభించింది. మానవాళికి దారిద్య్రం నుంచి, బాధల నుంచి విముక్తి కల్పించటానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆమెకు ఈ బహుమతి అందజేశారు. మదర్ థెరిసా బాల్యం: మదర్ థెరిసా ఆల్బేనియా దేశంలోని ‘స్కోయె’ పట్టణంలో 1910వ సంవత్సరం ఆగస్టు నెల 26వ తేదీన జన్మించారు. ఆగస్టు 27వ తేదీన ఆమెను రోమన్ క్యాథలిక్ చర్చిలో బాప్టైజ్ చేసి, యాగ్నిస్ గోన్జా బొయాహు అని పేరు పెట్టారు. ఆల్బేనియన్ భాషలో గొన్జా అంటే గులాబీ మొగ్గ అని అర్థం. ఆమె తండ్రి నైకోల్ డ్రానాషిల్ బొయాహు. ఆయనకు నలుగురు సంతానం. వారిలో యాగ్నిస్ కడపటిది. చిన్నతనం నుంచి యాగ్నిస్కు రోమన్ క్యాథలిక్ మిషనరీల సేవలకు సంబంధించిన కథలంటే చాలా ఇష్టం. యాగ్నిస్ తండ్రి రాజకీయాలలో ఉంటూ, 1919వ సంవత్సరంలో మరణించారు. యాగ్నిస్ 12 సంవత్సరాల వయసులోనే దైవచింతనతో రోమన్ క్యాథలిక్ చర్చి వైపు ఆకర్షితమయ్యారు. 18 సంవత్సరాల వయసులో ఆమె లొరీటో ఐరిష్ నన్ల వ్యవస్థలో చేరి, ఆంగ్లంలో ప్రావీణ్యత పొంది, 1931 మే నెల 24వ తేదీన ‘నన్’గా ప్రమాణ స్వీకారం చేశారు. వెంటనే ఆమె భారతదేశంలోని కలకత్తా నగరానికి చేరుకుని, 1931 నుంచి 1948 వరకు కలకత్తాలోని సెయింట్ మేరీస్ హైస్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేశారు. భారత్లో సేవలు: రోమన్ క్యాథలిక్ మిషనరీల ఆచారం ప్రకారం, యాగ్నిస్ తొలి నామాన్ని థెరిసాగా మార్చుకుని, అందమైన హిమాలయాలలోని డార్జిలింగ్ నగరంలో రోమన్ క్యాథలిక్గా సేవలు ప్రారంభించారు. అనంతరం ఆమె కలకత్తా శివార్లలోని ‘ఎంటాలీ’ అనే చోట లొరీటో కాన్వెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ, అదే స్కూల్లో 1944వ సంవత్సరంలో ప్రధానోపాధ్యాయిని అయ్యారు. ఆ ఏడాది బెంగాల్ రాష్ట్రంలో కరువు వచ్చి, కలకత్తా నగరంలో ఆకలి వల్ల రోగాల వల్ల ఎందరో చనిపోయారు. దానికి తోడు, 1946లో హిందు, ముస్లిం మత వైషమ్యాలు, విధ్వంసకర సంఘటనలు కలకత్తా నగరాన్ని అల్లకల్లోలం చేసి, భయంకరంగా తయారుచేశాయి. మదర్ థెరిసా 1946 సెప్టెంబర్లో అంతఃకరణ ప్రబోధంతో సంఘసేవకు శ్రీకారం చుట్టారు. ఆమె కలకత్తా నగరంలోని పేదలు నివసించే పేటలలో తన సహాయ కార్యక్రమాలు ప్రారంభించి, మోతీజిల్ అనే మురికివాడలోని పిల్లలకు ఒక స్కూల్ ప్రారంభించి, అక్కడి పేదలకు సేవ చేయటం ప్రారంభించారు. రోగులకు సేవ చేయటం కోసం ఆమె బీహార్లోని పాట్నా నగరంలోని ఒక హాస్పిటల్లో కొద్ది నెలల మెడికల్ ట్రైనింగ్ పొందారు. బెంగాల్ కరువు రోజుల్లో ఆమె సేవను గుర్తించి, అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఎంతగానో ప్రశంసించారు. మదర్ థెరిసా రోమన్ క్యాథలిక్ కేంద్రమైన ‘వాటికన్’ నుంచి ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ స్థాపనకు అనుమతి పొందారు. సాధారణంగా మిషనరీ నన్లు ధరించే దుస్తులకు బదులు నీలి అంచు తెల్ల చీరను తమ సంస్థకు గుర్తింపుగా నిర్ణయించారు. ఈ విధంగా థెరిసా రోమన్ క్యాథలిక్ వ్యవస్థకు అనుబంధంగా ఉంటూ, స్వతంత్ర ప్రతిపత్తి గల ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ అనే సేవాసంస్థను నిర్వహించారు. మదర్కు నోబెల్: మదర్ థెరిసా సేవలను గుర్తించి, 1979వ సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేశారు. దారిద్య్రంలో బాధపడేవారికి, రోగులకు, అనాథలకు, ఆదరణకు నోచుకోని వృద్ధులకు అందించిన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా ఆమెకు నోబెల్ పురస్కారం ఇవ్వటం జరిగింది. ‘ఆమె ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ పురస్కారం అందుకుంటుంద’నే ప్రశ్నకు ‘‘నా రక్తం ఆల్బేనియాది. నా పౌరసత్వం భారత్ది. నా విశ్వాసం క్యాథలిక్ మతానిది. నా వ్యక్తిత్వం ప్రపంచానిది. నా హృదయం జీసస్కు చెందినది’’ అని ఉన్నతమైన సమాధానమిచ్చారు థెరిసా. ‘నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా ప్రపంచశాంతిని నెలకొల్పేందుకు మీరిచ్చే సందేశం ఏమిట’ని ప్రశ్నించినప్పుడు ‘‘ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలను ప్రేమిస్తే చాలు, ప్రపంచశాంతి దానంతటదే నెలకొంటుంది’’ అన్నారు మదర్ థెరిసా. నోబెల్ పురస్కార స్వీకరణ ప్రసంగంలో ఆమె‘‘నేటి ప్రపంచంలో ‘దారిద్య్రం’ అనేది కేవలం వెనుకబడిన, ఆర్థికంగా పేద అయిన దేశాలకే పరిమితం కాదు. ఎన్నో విధాలుగాను పురోగమించిన దేశాలలో కూడా ఉందనటానికి చింతిస్తున్నాను. ఆకలితో ఉన్నవారికి ఆహారం సమకూర్చటం ద్వారా పేదరికం తొలగించవచ్చు కాని, సమాజంలో అణగదొక్కబడి, ఆదరణకు నోచుకోనివారికి, ఉగ్రవాదానికి భయపడి బతికేవారికి ఎదురవుతున్న ఆయా దారిద్య్రాలను తొలగించినప్పుడే నిజమైన శాంతి. అబార్షన్లతోపాటు విడాకుల నిర్మూలన కూడా జరిగినప్పుడే మానవులంతా శాంతితో జీవించగలరు’’ అన్నారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ కార్యక్రమాలు: వృద్ధాప్యంలో ఉన్న, మరణానికి చేరువలో ఉన్న అభాగ్యుల కోసం ఆశ్రమం నడపడం. ఈ ఆశ్రమంలో మరణించినవారికి వారి మత కట్టుబాట్లకు అనుగుణంగా ఉత్తర క్రియలు జరపటం(ఆశ్రమంలో మహమ్మదీయులు మరణిస్తే ఖొరాన్ పఠనం, హిందువులు మరణిస్తే వారికి గంగాజలంతో అంత్యక్రియలు, క్రైస్తవులకు చర్చి నిబంధనలకనుగుణంగా నిర్వహించటం) వంటి జనామోదకర విధానాల అమలు. కుష్ఠు రోగులకు ఆశ్రమం నిర్మించి, నగరంలో వివిధ ప్రాంతాలలో వారికి వైద్య సౌకర్యాలు కల్పించటం. 1955లో నిర్మలా శిశుభవనం స్థాపించటం. ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’లో బ్రదర్స్ విభాగం, సిస్టర్స్ విభాగం, ఫాదర్స్ విభాగం ఏర్పాటు చేసి నిష్ణాతులైన సేవకులను తయారుచేయటం. ఇదే క్రమంలో మత ప్రవక్తలను కూడా తయారుచేయడం. దేశదేశాల్లో ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ సంస్థలను ప్రారంభించటం. మదర్ థెరిసా అకుంఠిత దీక్ష, కృషి, పరిశ్రమల ఫలితంగా 1996వ సంవత్సరం నాటికి 100కి పైగా దేశాలలో 517 మిషనరీస్ ఆఫ్ చారిటీ శాఖలు ప్రారంభమ య్యాయి. ఇవి ప్రపంచమంతటా మానవ సేవను కొనసాగిస్తూ ఉన్నాయి. మదర్ థెరిసా అవార్డులు... బహుమతులు: 1962 - పద్మశ్రీ బిరుదు; రామన్ మెగసెసే బహుమతి. 1971 - పోప్ జాన్ 23 శాంతి బహుమతి 1979 - నోబెల్ ‘శాంతి’ బహుమతి 1979 - బాల్జాన్ బహుమతి 1980 - {పపంచంలో అత్యధిక జనాదరణ కలిగిన పదిమందిలో ఒకరిగా గుర్తింపు 2010 - థెరిసా శతజయంతి సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ఐదు రూపాయల నాణెం విడుదల 1983వ సంవత్సరంలో పోప్ జాన్పాల్-2ను దర్శించే నిమిత్తం రోమ్ వెళ్లిన మదర్ థెరిసాకు గుండె జబ్బు వచ్చింది. తరువాత 1991లో మెక్సికో నగరానికి వెళ్లినప్పుడు ఆమెకు న్యుమోనియా వచ్చింది. 1996లో ఆమెకు మలేరియా వచ్చి గుండెలో ఎడమ కవాటం పనిచేయటం మానేసింది. దాంతో థెరిసా ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ సంస్థ అధ్యక్ష పదవిని పరిత్యజించారు. చివరకు 1997వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన కలకత్తా నగరంలో కన్నుమూశారు. నవీన్ చావ్లా అనే విశ్రాంత ఐసీఎస్ అధికారి, మదర్ జీవిత చరిత్రను పుస్తకంగా రాసి ప్రచురించారు. మదర్ థెరిసాకు ఎంతోమంది అభిమానులతో పాటు విమర్శకులు కూడా ఉన్నారు. ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ని తన సామ్రాజ్యంగా భావించేవారని, ఆమె అబార్షన్, విడాకులను ప్రోత్సహించకపోవటం యువత స్వేచ్ఛకు ఆటంకమనీ విమర్శల అభిప్రాయం. ఇలాంటి ఎన్ని విమర్శలున్నా మదర్ థెరిసా పేరును ప్రపంచంలో అత్యధిక జనాదరణ గల మొదటి పదిమందిలో ఒకరుగా వరుసగా 18 సార్లు ప్రకటించడం ఆమె విశిష్ట వ్యక్తిత్వాన్ని, సేవా నిరతిని చాటుతున్నాయి. డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు విశ్రాంత రసాయనాచార్యులు