నేర్చుకుంటేనే విజయం...
విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయసాధించాలంటే ఎంతో సాధన అవసరం. అందుకు దినపత్రికలు, కొంతమేర సెల్ఫోన్ ఉపయోగపడుతాయి. ఇటీవల ఉమ్మడి జిల్లానుంచి అనేకమంది గ్రూప్–1, 2లో ఉద్యోగాలు సాధించారు. గ్రూప్–1లో శాయంపేట మండలం తహరాపూర్కు చెందిన తేజస్వినీరెడ్డి రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ముల్కలపల్లికి చెందిన మేకల ఉపేందర్ రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించాడు. ‘ఏకాగ్రతతో చదువుతూ విజయం సాధించాలి.’అని సదరు ర్యాంకర్లు చెబుతున్న మాట. వ్యాపారాల్లోనూ సమయాన్ని వృథా చేయకుండా సరైన ఆలోచనలు చేస్తూ కొనసాగించాలి అప్పుడే లాభాలు గడిస్తూ విజయాన్ని సాధించవచ్చు.


