శనివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2025
హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు ఆర్టీసీ ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుంటోంది. ప్రయాణికులకు సౌకర్యవంతంగా టికెట్ జారీకి ఇ–టిమ్స్ను ప్రవేశ పెట్టింది. దీనిలో భాగంగా ఆర్టీసీ వరంగల్ రీజియన్లోని ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈమేరకు కండకర్లు, డ్రైవర్లకు శిక్షణ ఇస్తూ క్రమంగా ఇ–టిమ్స్ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటివరకు ఉపయోగించిన టిమ్స్తో చూసుకుంటే మరిన్ని ఫీచర్లతో వీటిని రూపొందించారు.
వరంగల్ రీజియన్లో ప్రతిరోజూ 936 బస్సులు వివిధ రూట్లలో తిరుగుతుంటాయి. 3.76 లక్షల కిలోమీటర్లు తిరిగి సగటున రోజుకు రూ.2.20 కోట్ల ఆదాయాన్ని సంస్థ రాబట్టుకుంటుంది. 936 బస్సులకుగాను ప్రస్తుతం 750 ఇ–టిమ్స్ మాత్రమే చేరుకున్నాయి. అన్ని బస్సుల్లో అమలుచేయాలంటే మరో 186 అవసరం. ఎప్పుడైనా టిమ్ మొరాయిస్తే బాగు చేసే వరకు వినియోగించుకునేలా అదనంగా మరికొన్ని అవసరం.
ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులతో టికెట్ల జారీ
ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న సంస్థ
వరంగల్ రీజియన్కు చేరుకున్న 750 ఇ–టిమ్స్
టికెట్ జారీపై మరింత స్పష్టత
ప్రతి స్టేజీ వారీగా వివరాలు తెలుసుకునే సౌకర్యం
శనివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2025
శనివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment